ready
-
బాలయ్య, మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ కు హనుమాన్ డైరెక్టర్ రెడీ..
-
నవంబరు నాటికి రామ్లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్ను నిర్మించారు. -
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ.. ఇండోర్లో కోటి దీపాలు!
యూపీలోని అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సరిగ్గా అదే సమయానికి మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్లో స్థానికులు 1.11 కోట్ల దీపాలను వెలిగించనున్నారు. రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా స్థానికంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ విలేకరులకు తెలియజేశారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న ఇండోర్లో 1.11 కోట్ల దీపాలు వెలిగించనున్నామన్నారు. ప్రజాప్రతినిధులతోపాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. అయోధ్యలో ఉత్సవాల సందర్భంగా ఇండోర్ నగరంలోని 31 వేల మంది పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ ఘనత నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రామునితో పాటు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ఇతివృత్తం ఆధారంగా ఈ పెయింటింగ్ పోటీ ఉంటుందని తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రాంగణాన్ని అలంకరించేందుకు భోపాల్ నుంచి ప్రత్యేక రకాల పూలను తరలిస్తున్నారు. -
ఎన్నికలకు పోలీసులు సిద్ధం
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రాత్రి కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన విదేశీ, దేశీయ మద్యం, బెల్లం, గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిషేధితాలను, అనుమానం ఉన్న అన్నింటినీ సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి వెంట ఉంచుకోరాదని, నగదును దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగి ఉండాలని లేదంటే డబ్బులను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తారని తెలిపారు. 10 డైనమిక్ చెక్పోస్ట్లు.. ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో 10 డైనమిక్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చెక్పోస్ట్లు ప్రతిరోజూ ఒక చోటి నుంచి మరో చోటికి మారుతాయని, దీని వల్ల మద్యం డబ్బులతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేసే వ్యక్తులను సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా వివిధ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు ప్రత్యేకంగా 6 పారామిలటరీ కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. వాహనాలకు జీపీఎస్, కెమెరాలు డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడానికి ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈబృందాల్లో పోలీస్ అధికారి నోడల్ ఆఫీసర్గా ఉంటారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు కెమెరాలు కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని 1950 నంబర్ ద్వారా తెలియజేయాలని కోరారు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తులు వాటిని పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులపై నిఘా.. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ నిఘా మాత్రం కొనసాగుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాయని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
సీక్వెల్కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్లో ‘జైలర్ 2’, కమల్హాసన్తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్చరణ్ హీరోగా నటించారు) బ్లాక్బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
వందేభారత్ స్లీపర్ కోచ్లు వస్తున్నాయోచ్..!
ఢిల్లీ: స్వదేశీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టి దేశరవాణాలో అరుదైన మైలురాయిని చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేస్తోంది భారత రైల్వేశాఖ. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్లను ప్రవేశపెట్టనుంది. 2024 నుంచి ఆ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. స్లీపర్ కోచ్ల ఫొటోలు షేర్ చేశారు. Concept train - Vande Bharat (sleeper version) Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023 వందేభారత్ స్లీపర్ కోచ్లు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన పడకలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, విశాలమైన టాయిలెట్స్, ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కోచ్లలో ఉన్నాయి. ఈ స్లీపర్ కోచ్ వందేభారత్ మరింత శక్తివంతమైన, పర్యావరణ అనుకూలంగా ఉండనుంది. 'మేక్ అన్ ఇండియా' ప్రోగ్రామ్లో భాగంగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. మొదటి రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ-వారణాసి రైలు ప్రారంభం అయింది. దేశంలో ఎంత దూరంలో ఉన్న ప్రాంతాన్నైనా వందేభారత్ రైళ్ల రాకతో గంటల వ్యవధిలోనే సౌకర్యవంతంగా ప్రయాణికులు చేరుతున్నారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్క్లిక్ ఫౌండర్కు రిమాండ్ -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
'చర్చకు సిద్ధమే..' మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అమిత్ షా కౌంటర్..
ఢిల్లీ: మణిపూర్లో అమానవీయ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సరైన చర్చ జరిగింది లేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమమని చెప్పారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు సహకరించాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్ అంశంపై నిజం తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ అంశంపై మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు సమావేశం ప్రారంభం కాగానే హోం మంత్రి చర్చకు సిద్ధమని తెలిపారు. అయినప్పటికీ అమిత్ షా ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. దీంతో స్పీకర్ హోం బిర్లా మరోసారి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. కొన్నిరోజులుగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అల్లర్లలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే.. రూల్ నెంబర్ 267 ప్రకారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం 176 కింద చర్చిద్దామని స్పష్టం చేసింది. దీని ప్రకారం 267 కింద ప్రత్యేకంగా సుధీర్ఘమైన చర్చలు జరగాల్సి ఉంటుంది. 176 కింద అయితే.. తక్కువ కాల వ్యవధిలో చర్చను ముగిస్తారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు: కూతురి ఆచూకీ కోసం ఎదురుచూపులు.. ఆసుపత్రికి ఫోన్ చేస్తే.. -
ప్రపంచం లోనే అతి చిన్న మిర్రర్ లెస్ కెమెరా..!
-
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
నేవి డే వేడుకులకు విశాఖ సర్వం సిద్ధం
-
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
పట్టా పండగ.. ఇళ్ల పట్టాలు రెడీ
పేదల దశాబ్దాల కల నెరవేరనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున అక్క చెల్లెమ్మలకు నివాసయోగ్యమైన ప్లాట్లు ఇచ్చేందుకు ఇళ్ల పట్టాలు సిద్ధమయ్యాయి. సువిశాలమైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థతో ప్రైవేట్ లేఅవుట్లను తలపించే ప్లాట్లను సిద్ధం చేశారు. జిల్లాలో ఒకే రోజు 1.32 లక్షల మంది లబ్ధిదారులకు ఏకకాలంలో పట్టాలు అందించడానికి అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రెవెన్యూ యంత్రాంగమంతా ప్లాట్లను సిద్ధం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత రూ.లక్షల విలువైన స్థలాలను, ఇంత ఉదారంగా ప్రతి లబ్ధిదారు కుటుంబంలోని మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేయనుండడంతో పల్లె నుంచి పట్టణాల వరకు పండగ వాతావరణం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఈ నెల 8న ఇళ్ల పట్టాల పంపిణీ పండగ జరగనుంది. ఒకే రోజు పల్లె నుంచి పట్టణాల వరకు 1.32 లక్షల మందికి నివాస స్థలాల పట్టాలు అందజేయనున్నారు. ఇప్పటికే ప్లాట్లు, పట్టాలు సిద్ధం చేశారు. పది నియోజకవర్గాల్లో ఉన్న లబి్ధదారులు వారు నివసిస్తున్న ప్రాంతాల సమీపంలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ►ప్రభుత్వ భూమి లేని పక్షాన మార్కెట్ ధర చెల్లించి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అనేక చోట్ల విలువైన ప్రైవేట్ భూములను కూడా కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చారు. ►ఆ స్థలంలో వెనువెంటనే ఇల్లు కట్టుకునేందుకు వీలుగా రోడ్లు, కాలువలు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ►లే అవుట్లలో 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ►జిల్లా వ్యాప్తంగా 3493.8 ఎకరాల భూమి అవసరం ఉండగా ఆ మేరకు భూమిని పూర్తిగా సిద్ధం చేశారు. ►సేకరించిన భూముల్లో 2,450 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 950 ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారు. ►3,493 ఎకరాల భూముల్లో 1,407 లేఅవుట్లు వేయడంతో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఓ లేఅవుట్ ఏర్పాటు అయింది. ►దరఖాస్తులను బట్టి సగటున 3 ఎకరాల విస్తీర్ణం నుంచి 100 ఎకరాల విస్తీర్ణం వరకు వెంచర్లు నిర్మించారు. ►లే అవుట్ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గ్రావెల్తో చదును చేసి సంబంధిత తహసీల్దార్లు సిబ్బందితో కలిసి మార్కింగ్ నిర్వహించి ప్లాట్లుగా విభజించారు. ►రహదారుల నిర్మాణంతో సహా అన్ని పనులు పూర్తి చేశారు. ►జిల్లాలో ఇప్పటి వరకు ఉదయగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తవడంతో పాటు వెంచర్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరిగింది. ►మిగిలిన నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తయి రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ►ఈ నెల 7వ తేదీకల్లా నూరు శాతం పూర్తిగా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ►ఈ క్రమంలో జాతీయ రహదారి సమీపంలోనూ, రాష్ట్ర రహదారికి సమీపంలోని ఇతర విలువైన భూముల్లో వెంచర్లు నిర్మించారు. అక్కచెరువుపాడులో భారీ లేఅవుట్ ప్రధానంగా జిల్లాలో భారీ లే అవుట్ నెల్లూరు నగర శివారులో రూపు దిద్దుకుంటుంది. మంత్రి అనిల్ కుమార్యాదవ్, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరురూరల్ మండలంలోని అక్కచెరువుపాడులో వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ను సిద్ధం చేశారు. 4,500 ప్లాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే ప్లాట్ల మార్కింగ్ పూర్తి చేసి రహదారి నిర్మాణ పనులను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.32 లక్షల మంది లబి్ధదారుల్లో అత్యధిక శాతం మంది నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. నెల్లూరు నగరంలో 14,703 మంది, నెల్లూరు రూరల్లో 16,319 (నగర పాలక సంస్థ పరిధి వరకు) మంది లబ్ధిదారులు ఉన్నారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేటల్లో భారీ లేఅవుట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధిక శాతం లేఅవుట్లు సగటున 20 ఎకరాల పైబడిన విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల జాబితా పెరుగుతుంది జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గడిచిన 15 రోజుల వ్యవధిలో 25,536 కొత్త దరఖాస్తులు అందాయని, వాటితో కలిపి కేవలం ఇళ్ల పట్టాల వరకే 1.32 లక్షల వరకు ఉందని మరికొంత మంది లబి్ధదారులు పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా ముందస్తుగా స్థలాలు అవసరమైన చోట గుర్తించి రిజర్వులో పెడతామని చెప్పారు. 8వ తేదీన నూరు శాతం పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. – వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ -
కరోనాపై పోరుకు రైల్వే రెడీ!
సాక్షి, హైదరాబాద్: వచ్చే మరికొద్ది రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం సగటున 3 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వస్తుండటం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు సరిపోని పరి స్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే కోచ్లను వాడకానికి వీలుగా సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా వినియోగించాల్సిన రైళ్లతో కూడిన తొలి విడత జాబితాను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 215 రైల్వే స్టేషన్లలో.. దేశవ్యాప్తంగా తొలి విడతగా 215 రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రైల్వే శాఖను అప్రమత్తం చేసి, కరోనా రైళ్లను ఉంచాల్సిన స్టేషన్ల వివరాలను అందజేసింది. ఇం దులో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్, కాచి గూడ, ఆదిలాబాద్ స్టేషన్లలో ఒక్కో కరోనా రైలు చొప్పున ఉంచాల్సిందిగా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 9 స్టేషన్లలో రైళ్లను సిద్ధం చేయాలని సూచించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాస, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్డు, కొండాపురం, దిగువమెట్ట స్టేషన్లలో ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతోంది. వైద్యులు.. ఆక్సిజన్.. ఇతర పరికరాలు.. పాజిటివ్ కేసు రాగానే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వేగంగా తరలించాలి. ఆసుపత్రి అందుబాటులో లేకుంటే ఈ రైల్వే కోచ్లను వాడుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఒక రైలులో 22 కోచ్లుంటాయి. ప్రతి కోచ్లో 9 కూపేలుంటాయి. ఒక కూపేను సిబ్బంది కోసం వదిలేసి మిగతా 8 కూపేలను కరోనా బాధితుల చికిత్సకు కేటాయించారు. ప్రతి కూపేలో రెండు చొప్పున బెడ్లుంటాయి. కోచ్లో రెండు టాయిలెట్లు, ఒక స్నానాల గది ఉంటుంది. ప్రతి కోచ్లో ఆక్సిజన్ సిలిండర్, విద్యుత్తు వసతి, ఇతర వైద్య పరికరాలు ఉంచాలని రైల్వేను కేంద్ర వైద్య శాఖ కోరింది. ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రత్యేక రైలు ఉన్న స్టేషన్లో ఆక్సిజన్ వసతి ఉన్న అంబులెన్స్ను సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరింది. అందుబాటులో రైల్వే వైద్యులు, సిబ్బంది ఉంటే ఏర్పాటు చేయాలని, లేని చోట రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలని కోరింది. తెలంగాణలో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన రైలులో రైల్వే వైద్యులున్నారు. కాచి గూడ, ఆదిలాబా ద్లలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో విశాఖ, విజయవాడల్లో మాత్రం రైల్వే వైద్యులుండగా, మిగతా ఏడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక నిరంతరం ఆ రైళ్లలో నీళ్లు అందుబాటులో ఉంచాలి. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించాలి అని పేర్కొంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే మరిన్ని స్టేషన్లలో ఇలాంటి రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే 486 కోచ్లను సిద్ధం చేసి ఉంచింది. -
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లోనే కొంటాం
సాక్షి, హైదరాబాద్: గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లకే నగరవాసులు జై కొడుతున్నారు. 44 శాతం కస్టమర్లు రెడీ టు హోమ్స్లో కొనేందుకు లేదా 24 శాతం మంది కనీసం 6 నెలల్లోపు పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే తెలిపింది. నిర్మాణం పూర్తయిన గృహాలకు జీఎస్టీ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2013, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు సుమారు 5.76 లక్షల వరకుంటాయని అనరాక్ డేటా తెలిపింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, ఆఫీసు విభాగాల్లో పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. -
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
-
సర్వం సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెంచీలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల కల్పించిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు పోలీసుస్టేషన్లలో ప్రశ్నపత్రాలు ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలీసుస్టేషన్లకు చేరాయి. ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను ఉదయం కేంద్రాలకు తీసుకువెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ను కట్టడి చేసేందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులను సిట్టింగ్ స్వా్కడ్గా నియమిస్తున్నారు. గతంలో వీరిని సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే నియమించేవారు. కానీ ఈసారి అన్ని కేంద్రాల్లో నియమించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్లు గత విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట పాఠశాలతో పాటు జిల్లాలోని పలు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే కాపీయింగ్ ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలా జరగకుండా మాస్కాపీయింగ్ను పకడ్బందీగా నిర్మూలించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 1,200 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేయగా, 94 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 94 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు నియమించారు. అలాగే, 94 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులను నియమించిన అధికారులు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటుచేశా రు. ఐదుగురు విద్యాశాఖ అధికారులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఐదుగురు మం ది పోలీస్శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన స్క్వాడ్లు ముగ్గురు చొప్పున విడిపోయి తనిఖీ చేపడుతారు. కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత ఏదైనా పరీక్ష కేంద్రంలోని గదిలో మాస్ కాపీయింగ్ జరిగితే ఆ గది ఇన్విజిలేటర్లనే బాధ్యులను చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రంలో పరీక్ష ప్రారంభం కాగానే కాపీయింగ్ జరిగితే తమదే బాధ్యత అంటూ ఇన్విజిలేటర్ లేఖను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తప్పుపడుతున్నారు. విద్యార్థులు తెలిసీ తెలియక చేసే తప్పుకు తమను బాధ్యతలను సరైన పద్ధతి కాదని, ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు విద్యార్థులకు ఎలాంటి మానసికమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. నిమిషం నిబంధన, సీసీ కెమెరాలు ఇతర ఏ విధ మైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూ స్తున్నాం. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్రంలో అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేసే లా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఒక్కో గదికి కేటాయించే 25 మంది విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా, మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లపై ఉంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎవరి గుర్తింపు లేకుండా హాల్టికెట్లు.... కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజు చెల్లించలేదనే కారణంగా హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తెలిసిం దే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసు కున్న ప్రభుత్వం నేరుగా ఆన్లైన్ పద్ధతి లో హాల్టికెట్లు అందించే పద్ధతికి శ్రీకా రం చుట్టింది. హెచ్ఎం, ఇతర అధికారుల సంతకం లేకుండానే విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా తీసుకున్న హాల్టికెట్తో పరీక్షకు హాజరయ్యే వెసలుబాటు కల్పించారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. హాల్టికెట్ చూపించి బస్సులో ప్రయాణించొచ్చు. కాగా, జి ల్లాలో కేవలం ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు తప్పనిసరికాకున్నా.. కెమెరా లు ఉన్న కేంద్రాల్లో విద్యార్థులు ఒత్తిడికి లోననవుతారని చెబుతున్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 94 పరీక్ష రాయనున్న విద్యార్థులు 21,189 రెగ్యులర్ కేంద్రాలు 90 విద్యార్థులు 20,087 ప్రైవేట్ కేంద్రాలు 04 విద్యార్థులు 1,102 -
ఏపీసెట్కు ఏర్పాట్లు పూర్తి
ఎస్కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ల రిక్రూట్మెంట్ పరీక్షల్లో రాయడానికి గల అర్హత పరీక్ష అయిన ఏపీ సెట్ (ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ )– 2017ను ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్నాట్లు పూర్తి చేసినట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ. మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో 13 సెంటర్లలో నిర్వహించే పరీక్షకు 7,934 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అన్ని సెంటర్లకు అబ్జర్వర్లు, ముగ్గురు ప్రత్యేక అబ్జర్వర్లను నియమించామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 31 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాల్లోపు వరకు అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
తొలకరి ప్రారంభమైంది. సార్వా వరి నారుమళ్ల తయారీకి రైతులు సన్నద్ధమవుతున్నారు. సార్వా పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక, నారుమడి తయారీ, ఎరువులు, సస్యరక్షణ చర్యలు మొదలగు విషయాలలో రైతులు ఈ దిగువ మెళకువలు పాటించాలి. విత్తన రకాల ఎంపిక దీర్ఘ, మధ్యస్థ కాలిక రకాలైన స్వర్ణ (ఎంటీయూ-7092), సాంబమసూరి (బీపీటీ-5204), విజేత (ఎంటీయూ-1001), ఇంద్ర (ఎంటీయూ-1061), అమర (ఎంటీయూ-1064), ప్రభాత్ (ఎంటీయూ-3626), పార్థీవ (ఎన్ఎల్ఆర్-33892), సోనామసూరి (బీపీటీ-3291), శ్రీకాకుళం సన్నాలు (ఆర్బీఎల్-2537), వసుంధర (ఆర్జీఎల్-2538), నెల్లూరు సోనా (ఎన్ఎల్ఆర్-3041), స్వర్ణముఖి (ఎన్ఎల్ఆర్-145), పుష్యమి (ఎంటీయూ-1075) సార్వాకు అనువైన రకాలు. విత్తన శుద్ధి విత్తనం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా కాపాడుకునేందుకు విధిగా విత్తన శుద్ధి చేయాలి. ఒక కిలో పొడి విత్తనానికి 3 గ్రాములు లేదా లీటరు నీటికి 1 గ్రాము కార్బెండిజమ్ కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టాలి. తరువాత 24 గంటలు మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ లేదా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ను సంప్రదించగలరు. రైతులు మరిన్ని సలహాల కోసం టోల్ఫ్రీ నంబర్ 1800-425-430కు ఫోన్ చేయవచ్చు. డాక్టర్. కె.రాజారెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -522 509 -
4.01 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయింపు
క్వింటాల్ రూ.7,700! అనంతపురం అగ్రికల్చర్ : త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేసే రైతులకు రాయితీపై పంపిణీ చేయడానికి వీలుగా జిల్లాకు 4,01,881 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. మొదట 3.50 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఒక్కో రైతుకు మూడు బస్తాలకు బదులు నాలుగు బస్తాలు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదనంగా 51,881 క్వింటాళ్లు కేటాయించారు. దీంతో సేకరణ ఏజెన్సీలు, మండలాల వారీగా కేటాయింపుల్లోనూ మార్పులు చేశారు. ఏపీ సీడ్స్కు 1.72 లక్షల క్వింటాళ్లు, మార్క్ఫెడ్కు 60 వేలు, ఆయిల్ఫెడ్కు 69 వేలు, వాసన్ ఎన్జీవోకు 80 వేలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ)కు 20 వేల క్వింటాళ్ల విత్తనకాయలను సేకరించి, నిల్వ చేసే బాధ్యత అప్పగించారు. ఇందులో ఇప్పటికే 3.50 లక్షల క్వింటాళ్ల వరకు సేకరించి గోదాముల్లో నిల్వ చేసినట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాకుల (జేడీఏ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొత్తగా వచ్చిన ఎన్ఎస్సీ సంస్థకు శెట్టూరు, కుందుర్పి, పుట్టపర్తి మండలాలకు వేరుశనగ సరఫరా బాధ్యతలు అప్పగించారు. వాసన్ సంస్థకు తనకల్లు మండలం ఇచ్చారు. మిగతా 59 మండలాలకు ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ సరఫరా చేస్తాయి. అలాగే విత్తన పంపిణీ ఏజెన్సీలను 45 మండలాల్లో గుర్తించగా, మిగిలిన వాటిలోనూ రెండు,మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. క్వింటాల్ రూ.7,700 ! విత్తన వేరుశనగ ధరలు, రాయితీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. క్వింటాల్ వేరుశనగ పూర్తి ధర రూ.7,700గా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో 33.3 శాతం రాయితీ రైతులకు వర్తింపజేసే అవకాశం ఉంది. అంటే రైతు వాటాగా క్వింటాల్కు రూ.5,135 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రభుత్వం రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించవచ్చని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపట్టడానికి వీలుగా తేదీలను ఖరారు చేయనున్నారు. -
సీనియర్ టెకీలపై వేటుకు భారీ కసరత్తు
బెంగళూరు: ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం మరింత వేగంగా దూసుకొస్తోంది. ఇండియాలో ఈ పరిస్థితి మరికాస్త తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం అటు ఉన్నతస్థానాల్లో, ఇటు దిగువస్థాయిలో ఉన్న వారందరినీ వెన్నాడుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్1 బి వీసా సంస్కరణల నేపథ్యంలో టాప్ ఐటీ సేవల సంస్థలు భారత్ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మరికొందరిని స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపిస్తోంది. ఊహించిన దానికంటేఎక్కువగా సుమారు 150 బిలియన్ డాలర్ల వృద్ధి మందగమనం తోపాటు, ట్రంప్ హైర్ అమెరికన్, బై అమెరికన్ నినాదం ఐటీ సంస్థలను ఈ వైపుగా కదిలిస్తున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కాగ్నిజెంట్ ఇటీవల ఆరువేల మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అగ్రశ్రేణి ఉద్యోగుల్లో 6వేలమంది ఉద్యోగాలను + లేదా దాని మొత్తం శ్రామిక శక్తిలో 2.3శాతం తగ్గించాలని భావిస్తోంది. ఇదే బాటలో మరో అతిపెద్ద సేవల సంస్థ ఇన్ఫోసిస్ కూడా కదులుతోంది. దాదాపు వెయ్యిమంది సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరనుందని మార్కెట్ వర్గాల అంచనా. వీరిలో గ్రూపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు , సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ స్థాయిల్లో డైరెక్టర్లు, మేనేజర్ల పనితీరు రిపోర్టును ఇన్ఫీ సమీక్షిస్తోంది. మూడు వారాల క్రితం విప్రో సీఈఓ అబిద్ ఆలీ నీమచ్వాల ఇంటర్నెల్ సమావేశాల్లో మాట్లాడుతూ ఆదాయాల వృద్ధి జరగకపోతే, సుమారు 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ సంస్థలోని ఇంజనీరింగ్ టీం పెద్ద ప్రమాదంలో పడినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో 1.81 లక్షల ఉద్యోగులను కలిగి ఉంది. ఫ్రెంచ్ ఐటీ సేవల సంస్థ కాప్ జెమిని కూడా సుమారు 9,000 మందిని, లేదా దాదాపు 5శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. వీటిలో ఎక్కువ భాగం 2015లో కాప్ జెమిని కొనుగోలు చేసిన ఐ గేట్ ఉద్యోగులు. అలాగే ముంబైలోని 35మంది వైస్ ప్రెసిడెంట్లు, ఇతర సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు మరియు సీనియర్ డైరెక్టర్లను దాదాపు 200 మంది రాజీనామా చేయాలని కాప్ జెమిని ఫిబ్రవరిలో కోరింది. మార్చి 31 నాటికి దీని మొత్తం ఉద్యోగులు 195,800 మంది. ప్రతి సంవత్సరం చేసే సమీక్షలో భాగంగా ఈ తొలగింపులనీ, 2017లో తమ ఉద్యోగుల్లోచాలామందికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణనిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నతీరుపై ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేశారు. అంతకంతకూ తీవ్రమవుతున్న ధోరణిపై వివిధ కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఐటి సేవలలో మందగమనం కారణంగా వివిధ ఐటి సంస్థలు ఆదాయాలను నష్టపోతున్నది వాస్తవం. ముఖ్యంగా కాగ్నిజెంట్ 20శాతం గ్రోత్లో ఈ సంవత్సరం 8-10శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. 2015-16లో 13.3 శాతంగా ఉన్న ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరగాలని ఆశిస్తోంది. టీసీఎస్ గత సంవత్సరం కేవలం 8.3శాతం మాత్రమే సాధించడం గమనార్హం. -
మళ్లీ భూ దోపిడీకి సిద్దమవుతున్న ఏపీ సర్కార్
-
వన్ టైం సెటిల్మెంట్ చర్చలకు సిద్ధం..!
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసిన విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఎట్టకేలకు దిగి వస్తున్నట్టే కనిపిస్తోంది. మాల్యాను విదేశాలనుంచి వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, తాజాగా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా స్పందించడంతో బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్కు తాను సిద్ధంగా ఉన్నానని శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. పబ్లిక్ రంగ బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ విధానాన్ని పాటిస్తూ ఉంటాయని, ఇలా వందల మంది రుణగ్రహీతలు తమ లోన్లను సెటిల్ చేసుకున్నారన్నారు. మరి తనకు ఎందుకు నిరాకరిస్తున్న మాల్యా ప్రశ్నించారు. గౌరవనీయ సుప్రీంకోర్టులో గణనీయమైన తమ ఆఫర్ను పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు తిరస్కరించాయని ఆరోపించారు. స్వచ్ఛందంగా ఈ వివాద పరిష్కారంపై మాట్లాడటానికి, న్యాయబద్ధంగా సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్వీట్ లో చెప్పారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎలాంటి విచారణ లేకుండా ప్రభుత్వం తనపై ఆరోపణలుగుప్పించినప్పటికీ, ప్రతీ ఒక్క కోర్టు ఆర్డర్ ను ఎలాంటి మినహాయింపు లేకుండా అంగీకరించానంటూ పాత పల్లవే మళ్ల అందుకున్నారు. సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ తనపై చేసిన ఆరోపణల్నీ తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వైఖరికి నిదర్శన మన్నారు. కాగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు రిజర్వ్ చేసంది. వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల రుణాల బకాయిల కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది. గురువారం జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆస్తుల గురించి సరైన వివరాలనే అందించారా అంటూ జస్టిస్ ఆదర్స్ కుమార్ గోయెల్, యూకే లలిత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మాల్యాను ప్రశ్నించింది. అటు బ్యాంకులపైనా కీలక ప్రశ్నల్ని సంధించిన సుప్రీం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. -
కోళ్లు - కోట్లు
-
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం
-
పశువుల హాస్టల్ సిద్ధం
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే మోడల్గా ఏర్పటు చేస్తున్న పశువుల హాస్టల్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. వచ్చే నెల 2 నిర్వహించనున్న నాలుగో విడత జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. కల్లూరు మండలం తడకనపల్లిలో 10 ఎకరాల్లో హాస్టల్ను అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు దీని కోసం దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. చిన్నటేకూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరగుతున్నాయి. -
డిసెంబర్లో ఏఎన్యూకు ‘నాక్’
సిద్ధంగా ఉండాలని వీసీ రాజేంద్రప్రసాద్ ఆదేశం ఏఎన్యూ: వర్సిటీకి నాక్(నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ లక్ష్యంగా అందరూ పని చేయాలని వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ కోరారు. నాక్ ఏర్పాట్లపై సోమవారం వీసీ విభాగాధిపతులు, ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ తొమ్మిది మందితో కూడిన నాక్ బృందం డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఏఎన్యూ సందర్శించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరిగిన, చేపట్టాల్సిన పనులను వీసీ అడిగి తెలుసుకున్నారు. నాక్కు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. వీసీలు, ఉన్నతాధికారులు మారుతుంటారని కానీ యూనివర్సిటీ ఖ్యాతి మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు. అంతర్గత లోపాలను సరిదిద్దుకునేందుకు యూనివర్సిటీ ఎంచుకున్న నిపుణులతో నిర్వహించే నాక్ పీర్టీం సందర్శనలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. నాక్ Sపీర్టీం అన్ని విభాగాల్లోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇస్తుందని చెప్పారు. నాక్ ఏర్పాట్ల కమిటీ సభ్యుడు డాక్టర్ ఆర్వీఎస్ఎస్ఎన్ రవికుమార్ వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్పాల్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
హంసకు హంగులు
-
హంసకు హంగులు
ఇంద్రకీలాద్రి: విజయదశమి రోజున శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు కృష్ణానదిలో విహరించేందుకు హంస వాహనం సిద్ధమవుతోంది. దశమికి ఇక మూడు రోజులే గడువు మిగిలి ఉండటంతో హంస వాహన నిర్మాణం వేగంగా సాగుతోంది. రంగులు, ఇతర హంగులతో ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం నాటికి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. -
అధికారులంతా సిద్ధంగా ఉండాలి
ఖమ్మం సహకారనగర్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా పునర్విభజనపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ లోకేష్కుమార్ మాట్లాడుతూ కొత్తగూడెంలో జిల్లా కార్యాలయాలకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాలను శనివారంలోగా సిద్ధం చేయాలన్నారు. కార్యాలయాల బోర్డులపై భద్రాద్రి జిల్లా హెడ్క్వార్టర్ కొత్తగూడెంగా రాయించాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి వర్క్ టూ çసర్వ్ ఆర్డర్లను అందచేయాలన్నారు. వర్క్ టూ సర్వ్ ఆర్డర్లు ఇచ్చే అధికారులు కూడా హెడ్క్వార్టర్కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. కొన్ని శాఖల విషయానికొస్తే.. జిల్లా బాధ్యులకు వర్క్ టూ సర్వ్ ఆర్డర్ జారీ చేసే అవకాశముందని, వీరంతా ఎక్కడకి వెళ్లకుండా అందుబాటులోనే ఉండాలన్నారు. మరికొన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్రస్థాయిలో పనిచేసే అధికారులకు కూడా వర్క్ టూ సర్వ్ ఆర్డర్ ఇవ్వొచ్చన్నారు. వర్క్ టూ సర్వ్ తీసుకున్న అధికారులంతా అక్కడికి వెళ్లి ఈ–మెయిల్, వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. వర్క్ టూ సర్వ్కు హాజరైన అధికారులు, సిబ్బంది తమ వివరాలతో సంబంధిత రాష్ట్ర శాఖాధికారికి నివేదించాలన్నారు. కార్యాలయ స్టాంపులు, అధికారి స్టాంపులు తయారు చేసుకోవాలన్నారు. వర్క్ టూ సర్వ్ జారీ చేసినా హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఫైళ్లు, సామగ్రికి కొత్తగూడెంకు పంపించాలన్నారు. జేసీ దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు అద్దె భవనాల్లో ఉంటే... ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధికంగా ఉంటే ఆ భవన వివరాలు అందించి జిల్లా కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. తాను చైర్పర్స¯ŒSగా, ఆర్అండ్బీ ఈఈ మెంబర్గా, సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్ కన్వీనర్గా ఉంటారన్నారు. అద్దె భవనాల «ధర నిర్ణయం కాని వారు ఈ నెల 10వ తేదీలోగా ఆమోదం పొందాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ నగేష్, సీపీఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
-
జిల్లా అండర్-14, 17 క్రీడా జట్లు సిద్ధం
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్-17 క్రీడా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి ఎం.చెన్నారెడ్డి తెలిపారు. బాస్కెట్బాల్, క్రికెట్, హ్యాండ్బాల్, త్రోబాల్ క్రీడల్లో ఎంపికలు జరిగాయని, ఈ ఎంపికల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అండర్-14 బాస్కెట్బాల్ బాలుర జట్టు : పి.జయప్రకాష్, వివేక్, ఎ.విక్యాత్, సాయిరోషన్రాజ్, ఆర్.నరేందర్, లోహిత్వెంకట్, శ్రీరాంనీరజ్, కుల్దీప్ నాయర్, వి.గోపి, ఆర్.ప్రణీత్, వి.రేవంత్, రాఘవ, ఎ.ప్రవీణ్. బాలికల బాస్కెట్బాల్ జట్టు: ఎన్.శ్రీజ, రిషిత, ఐశ్వర్య, గౌతమి, సాహితి, అక్షిత, జి.శ్రీనిజ, ఉమామహేశ్వరీ, టి.రవళి, బి.సునీత, బి.నవ్యశ్రీ, బి.దివ్యశ్రీ. అండర్-17 బాస్కెట్బాల్ బాలుర జట్టు: వై.నవీన్, సాయిసరూజ్రాజ్, వి.రాజేష్, జగదీష్కుమార్, పృథ్వీనాయక్, టి.కల్యాణితేజ, చరణ్సాయి, రవీంద్రనాథ్, ఎన్.అఖిల్, సీహెచ్ జీవన్, ధీరజ్ఆకాష్, కె.అనిల్కుమార్. బాలికల బాస్కెట్బాల్ జట్టు : ఎం.మౌనిక, పి.సంధ్య, కె.ప్రియదర్శిని, ఎన్.అఖిల్, దీప్తిరెడ్డి, నవ్య, సమిత, జ్యోతి, ఉదయలక్ష్మి, రీతుకుమారి, కె.అశ, కె.స్వప్న. అండర్-17 హ్యాండ్బాల్ బాలుర జట్టు: వి.వంశీ, ఎస్.కె.రియాజ్, రామాంజనేయులు, అన్వేష్, లక్ష్మణ్రావు, పి.వేణు, డి.తిరుపతిరావు, కె.సుధీర్, గోపిచంద్, ఎల్.నరేష్, ఎ.గణేష్, ఎ.విజయ్, వీరబాబు, గోపిచంద్, టి.శ్రావణ్, కె.ప్రవీణ్. హ్యాండ్బాల్ బాలికల జట్టు: కె.పావని, వి.సింధు, కె.లావణ్య, జి.రమాదేవి, గంగోత్రి, సుభద్ర, టి.మల్లేశ్వరి, ఎ.ఝాన్సీ, ఎ.అఖిల, టి.స్నేహా, కె.రమ్య, బి.అనూష, డి.కావ్య, శ్వేతలక్ష్మి, టి.వినోదిని, ఆర్.త్రివేణి. అండర్-14 జూడో బాలుర జట్టు : బి.మహేందర్, ఎ.ఈశ్వర్, నాగసైదా, రాజాశేఖర్, కె.రాకేష్, డి.వినోద్, బాలికల జట్టు : లక్ష్మీదేవి, ఎం.సింధు, బి.మౌనిక, కె.ఉషారాణి, కె.రమాదేవి. అండర్-17 బాలుర జూడో జట్టు : బి.సునీల్కుమార్, చంద్రశేఖర్, బి.సంతోష్కుమార్, బి.సురేష్, బి.నవీన్, కె.దుర్గారావు. బాలికల జూడో జట్టు : బి.మౌనిక, ఎం.భవాని, ఎం.సుప్రియ, డి.విజయలక్ష్మి, బి.మౌనిక, డి.వెంకటరత్నం. అండర్-17 త్రోబాల్ బాలుర జట్టు : ఎస్.కె.సలీం, బి.సాయికృష్ణ, బి.నాగరాజు, డి.ప్రీతం, డి.వెంకటేష్, ఎస్.ఉదయ్, టి.శ్రీరాం, జి.కృష్టతేజ, ఎస్.కె.సలీంపాషా, రవితేజ, ఎల్.ప్రవీణ్కుమార్. త్రోబాల్ బాలికల జట్టు : సీహెచ్. శ్రావణి, సీహెచ్ అనూష, వాణిశ్రీ, దివ్య, వి.శీరీష, కె.దివ్య, కె.స్వాతి, పి.శ్రీలక్ష్మి. అండర్-14 యోగా బాలుర జట్టు : సీహెచ్ సందీప్, రవీందర్, నవీన్కుమార్, ఎం.శ్రీవర్దన్, కె.జశ్వంత్. బాలికల జట్టు : బి.స్వాతి, బి.త్రివేణి, బి.యశ్వంతి, బి.తులసి, ఎం.స్పందన, అండర్-17 బాలుర యోగా జట్టు : ఎ.వెంకటేష్, టి.మహేష్, సీహెచ్, వెంకటేష్, వంశీ, కృష్ణ, లక్ష్మణ్రావు. అండర్-17 బాలికల జట్టు : బి.ప్రశాంతి, డి.త్రివేణి, వై.శ్రావణి, ఎస్.రజిత, ఎం.నిరంజని. -
వరద సహాయ చర్యలకు పోలీస్శాఖ సిద్ధం
ఎస్పీ జోయల్ డేవిస్ కరీంనగర్ క్రైం : వరద సహాయ చర్యలు చేపట్టేందుకు పోలీస్శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ జోయల్డేవిస్ అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెరువులు కుంటలకు గండ్లు పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాలు, పురాతన భవనాల్లో నివాసం ఉండొద్దని, ముంపు ప్రాంతాలను వదలి ఎత్తయిన ప్రాంతాల్లో, ప్రభుత్వ పునరావాస ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. సమాచార, ప్రసారమాద్యమాలు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైన ప్రమాదం జరిగినా జరిగే అవకాశం ఉన్నా వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. జాగ్రత్తలు.. మెరుపులతో కూడి ఉరుముల శబ్దం వినిపిస్తే వెంటనే ఇళ్లలోకి వెళ్లాలి. ఈ సమయంలో అత్యవసరమైతే తప్పా సెల్ఫోన్ మాట్లాడొద్దు. పోడవైన లోహపు స్తంభాలు, ఒంటరి చెట్ల కింద ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు నీటి నిల్వ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ట్రాక్టర్, మోటారు సైకిళ్లు, స్కూటర్లు తదితర వాహనాలకు ఫెన్సింగ్ వైర్లు, బట్టల ఆరేసే వైర్లకు దూరంగా ఉండాలి. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, షెడ్లలో నివాసం ఉండొద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు ఉరుములు, మెరుపులు సంకేతాలు ఏర్పడినప్పుడు మెకాళ్లపై కూర్చుని తలను మెకాళ్లకు అన్చాలి. నేలపై పడుకోకూడదు. రేడియోలు, టీవీలకు ఉన్న కనెక్షన్లు తొలగించాలి. వర్షం లేకున్నా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. వర్షం పడుతున్న ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. పిడుగుపాటు గురైన వ్యక్తిని రక్షించే సమయంలో సదరు వ్యక్తి నుంచి విద్యుత్ సరఫరా అవుతుందనే అపవాదు నమ్మెుద్దు. -
ఎయిర్పోర్టు భూసేకరణ ప్రక్రియ షురూ!
గన్నవరం: విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్లో అంగీకరించని రైతుల నుంచి భూసేకరణ చట్ట ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా భూసేకరణ గ్రామాల్లో సామాజిక ప్రభావ మదింపు కోసం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు ఎం. మాధురి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయా గ్రామాల్లోని పంచాయితీ కార్యాలయాల్లో జరిగే ఈ సభలకు నిర్వాసిత రైతులందరూ హాజరుకావాలని ఆమె కోరారు. ఎక్కడెక్కడ.. ఎప్పుడెప్పడు – సోమవారం ఉదయం 11 గంటలకు కేసరపల్లిలో, 27న ఉదయం 10కు జక్కులనెక్కలం, 12 గంటలకు పురుషోత్తపట్నంలో గ్రామసభలు జరుగుతాయి. –28న ఉదయం 10కు గన్నవరంలో, 12 గంటలకు చిన్నఆవుటపల్లిలో. – 29న ఉదయం 10కు అల్లాపురంలో, 12 గంటలకు అజ్జంపూడి. – 30వ తేది ఉదయం 10 గంటలకు బుద్దవరంలో ఈ గ్రామసభలు జరుగుతాయని తెలిపారు. -
దసరాకు స్పోర్ట్స్ అకాడమీలు సిద్ధం
రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో దసరాకు స్పోర్ట్స్ అకాడమీలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, కడప స్పోర్ట్స్ స్కూళ్లలో సింథటిక్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో రాయపాటి లీలా కూమారి స్మారక 3వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం అథ్లెట్లను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు పోటీతత్వం అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ప్రతిభ ఉంటేనే చాలదని ప్రదర్శించే నైపుణ్యతను అలవరుచుకోవాలని సూచించారు. క్రీడాకారులు ఏకాగ్రత కోసం చేయాల్సిన అభ్యాసాన్ని సాధన చేయాలన్నారు. రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని సిద్ధం చేస్తున్నామని, ఇది క్రీడాకారులకు మంచి ట్రాక్లా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక స్టయిఫండ్ అందజేయనున్న ఆర్ఆర్ స్పోర్ట్స్ అధినేత జి.ప్రసన్న కుమార్ను, అథ్లెటిక్స్ను ముందుకు తీసుకెళుతున్న అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆర్ఆర్ స్పోర్ట్స్, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ చేసుకున్న ఒడంబడిక పత్రాలను ఎల్వీ ప్రసాద్ సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. పోటీలను ముఖ్యఅతిథి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, జిల్లా అథ్లెట్ జ్యోతికాశ్రీ క్రీడా ప్రతిజ్ఞ చేసింది. ఎంకే బేగ్ మునిసిపల్ స్కూల్, వీఎం రంగా మునిసిపల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. వీటితో పాటు గన్నవరం సెయింట్ జాన్స్ స్కూల్ బ్యాండ్ ట్రూపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథుల మన్ననలు పొందింది. ప్రారంభోత్సవం కార్యక్రమంలో శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ గౌరవ అతిథిగా పాల్గొనగా, శాప్ ఓఎస్డీ పి.రామకష్ణ, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.రాఘవేంద్రరావు, జిల్లా అధ్యక్షుడు రమేష్జైన్, కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, మాజీ డీఎస్డీవో బి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖుర్బానీకి తయార్
-
పోలీస్శాఖ విభజన కొలిక్కి
కరీంనగర్ క్రైం : జిల్లాల పునర్విభజనలో కరీంనగర్ మూడు జిల్లాలుగా విడిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ శాఖ విభజన కూడా పూర్తయింది. ఈమేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జోయల్డేవిస్ విభజన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కరీంనగర్ 40, జగిత్యాల 30, పెద్దపల్లి 30 శాతం కేటాయించినట్లు తెలిపారు. విభజన నాటికి ప్రస్తుతం ఏ ఠాణాలో పని చేస్తున్న ఎస్సైలు అక్కడే కొనసాగుతారని పేర్కొన్నారు. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం సీఐ, ఎస్సైలను విభజించామని ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకే కేటాయించే అవకాశం ఉందని వివరించారు. ఒక వేళ తక్కువ సంఖ్యలో ఉంటే పనితీరు ఆధారంగా ఆయా జిల్లాలకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే హోంగార్డ్ల విభజన పూర్తయిందన్నారు. వారిని తక్కువగా ఉన్న యూనిట్లలో సమీపంలోని మండలాల నుంచి తీసుకుని భర్తీ చేశామని తెలిపారు. డీపీవో సిబ్బందిలో పనితీరు ఆధారంగా మూడు జిల్లాలకు సమానంగా వచ్చేలా మారుస్తామని, తక్కువగా ఉంటే వివిధ కేటగిరీలుగా మార్చి ఆయా జిల్లాకు కేటాయిస్తామన్నారు. ఏఆర్ సిబ్బందిని ఆయా జిల్లాలో అవసరం, జైళ్లు, కోర్టులు, కార్యాలయాలు, బందోబస్తులు, వీఐపీ మూమెంట్, ఆలయాలు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని వారిని కేటాయిస్తామని తెలిపారు. కొత్త జిల్లాకు పంపాల్సిన రికార్డులు, ఫర్నిచర్, ఇతర పరికరాలు, అయుధాలు, వాటిని పరికరాలు ఆయుధగారాల పంపకాలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఏఆర్తోపాటు డీసీఆర్బీ, ఎస్బీ, మినిస్టీరియల్ సిబ్బంది విభజన దాదాపు పూర్తి కావచ్చిందని, వారికి నంబరింగ్ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. నివేదికలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. తదుపరి ఉత్తర్వుల ప్రకారం మిగిలి వ్యవహరాలు, కార్యాలయాలు, ఆయా ఠాణాల సిబ్బందిని పరిశీలించి పంపకాలు చేస్తామని చెప్పారు. తర్వాత ఆయా జిల్లాలో తక్కువగా ఉన్న సిబ్బంది ఆయా జిల్లాల పరిపాలన విభాగం చూసుకుంటుదని తెలిపారు. -
ప్రాజెక్ట్లపై చర్చకు సిద్ధం
నీటి విడుదల షెడ్యూల్ తప్పితే సీఈ ఆఫీస్పై దాడి టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్సర్కిల్ : ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు టీఆర్ఎస్ నాయకుల సవాల్కు ప్రతిసవాల్ విసిరారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఇచ్చిన ప్రాజెక్ట్లపై చర్చకు సవాల్కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ఏయే గ్రామాలకు సాగునీరందించారో నిరూపించాలన్నారు. తనకు మతిభ్రమించిందనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీలో 25 టీఎంసీల నీరున్నప్పుడే ఆయకట్టు చివర భూములకు ఐదు దఫాలుగా నీరందింపజేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా సాగునీరందించలేని అసమర్థులు అధికార పక్షం నాయకులు అని విమర్శించారు. ఈద, దాసరిలకు చేతనైతే చివరి భూములకు నీరందించాలని సవాలు విసిరారు. తనపై ఇప్పటి వరకు 26 కేసులున్నాయని, ఎస్సారెస్పీకి సంబంధించినవే 12 కేసులు అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయకపోతే సీఈ కార్యాలయంపై దాడి చేయకతప్పదని హెచ్చరించారు. ఎల్లంపల్లి నీటి తరలింపును అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, సదానందం, పుట్ట నరేందర్, గట్టు యాదవ్, బాలాగౌడ్, జగన్గౌడ్, గాజె రమేశ్, తీట్ల ఈశ్వరి, కమలాకర్, సలీం, రమేశ్, రాజమల్లయ్య, అజయ్రెడ్డి పాల్గొన్నారు. -
26 నుంచి ఐసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు ఆప్షన్ల ఎంపిక 26 నుంచి 31 వరకు సెప్టెంబర్ 3న సీట్ల కేటాయింపు కమాన్చౌరస్తా : టీఎస్ ఐసెట్–2016 విద్యార్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది. జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్కు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఎస్సారార్ కళాశాలలో ఇందు కోసం రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీరోజు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో నిర్ణీత ర్యాంకుల విద్యార్థుల సర్టిపికెట్లు పరిశీలించనున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల సమన్వయ అధికారి బి.రాజ్గోపాల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు , మధ్యాహ్నం 1:30 గంటలకు విద్యార్థులు ర్యాంకులవారీగా హాజరవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు –టీఎస్ ఐసెట్–2016 ర్యాంకు కార్డు –టీఎస్ ఐసెట్–2016 హాల్టికెట్ –ఆధార్కార్డు –డిగ్రీ మార్కుల పత్రం –ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల పత్రం –ఎస్ఎస్సీ లేదా తత్సమాన అర్హత మార్కుల పత్రం –స్టడీ సర్టిపికెట్ 9 వతరగతి నుంచి డిగ్రీ వరకు –ట్రాన్స్ఫర్ సర్టిపికెట్ –ఆదాయ ధ్రువీకరణ పత్రం(01.01.2016 తర్వాత జారీచేసిన) –కుల ధ్రువీకరణ పత్రం –నివాస ధ్రువీకరణపత్రం –పైన తెలిపినవన్నీ రెండు సెట్ల జిరాక్స్ ఎస్టీలు పాలిటెక్నిక్లోనే.... జిల్లాలోని అన్ని ర్యాంకులకు చెందిన ఎస్టీ విద్యార్థులు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోనే విధిగా హాజరుకావాలి. ఇతర సహాయ కేంద్రంలో అనుమతించరు. వికలాంగులు, ఆర్మీ విద్యార్థులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా విద్యార్థులు హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్ వద్ద సాంకేతిక విద్యాభవన్లో హాజరుకావాలి. ఫీజు వివరాలు.... సర్టిపికెట్ల పరిశీలన సమయంలో ఓసీ, బీసీలకు చెందిన విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ వారు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీలో ఓసీ, బీసీ విద్యార్థులు 50 శాతం మార్కులు, ఎస్సీఎస్టీ విద్యార్థులు 45 శాతం కలిగి ఉండాలి. ఎంట్రన్స్ సమయంలో బయోమెట్రిక్ హాజరువిధానం అములు చేసినందున పరీక్ష రాసిన విద్యార్థి తప్పనిసరిగా సర్టిపికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలి. ఇక్కడ కూడా వేలిముద్రలు సేకరించి సరిపోలుస్తారు. గోరింటాకు పెట్టకుని వస్తే వేలిముద్రల సమయంలో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ర్యాంకువారీగా తేదీలు.. తేదీ సమయం మహిళా పాలిటెక్నిక్ ఎస్సారార్ కళాశాల (హాజరవ్వాల్సిన ర్యాంకు) (హాజరవ్వాల్సిన ర్యాంకు) 26 ఉదయం 1–3000 3001–6000 మధ్యాహ్నం 6001–9000 9001–12000 27 ఉదయం 12001–15000 15001–18000 మధ్యాహ్నం 18001–21000 21001–24000 28 ఉదయం 24001–27000 27001–30000 మధ్యాహ్నం 30001–33000 33001–36000 29 ఉదయం 36001–39500 39501–43000 మధ్యాహ్నం 43001–46500 46501–50000 30 ఉదయం 50001–53500 53501–57000 మధ్యాహ్నం 57001–60500 60501–చివరిర్యాంకు వెబ్ ఆప్షన్ల తేదీలు ర్యాంకు వారీగా తేదీ ర్యాంకులు 26, 27 1–12000 27, 28 12001–24000 28, 29 24001–36000 29, 30 36001–50000 30, 31 50001–చివరిర్యాకు సెప్టెంబర్ 3న సీట్ల కేటాయింపు టీఎస్ ఐసెట్–2016 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై ఆప్షన్లను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అన్ని ర్యాంకుల వారికి సెప్టెంబర్ 1 తేదీన అప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. మొబైల్ నంబర్ సరిచూసుకోవాలి –బి.రాజ్గోపాల్, మహిళా పాలిటెక్నిక్ కళాశాల క్యాంప్ ఆఫీసర్ (21కెఎన్టీ126) ఐసెట్–2016 సర్టిపికెట్ల పరిశీలన సమయంలో విద్యార్థులు వారి మొబైల్ నంబరు నమోదు చేసే ప్రక్రియలో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఐసెట్కు సంబంధించిన పాస్వర్డ్, సీట్ల కేటాయింపు వివరాలన్నీ మొబైల్ నంబర్కే వస్తాయి. మొబైల్ నంబర్ కీలకంగా ఉంటుంది. దానిని స్విచ్ఆఫ్ చేయడం, సిమ్కార్డు తీసివేయడం వంటివి చేసి ఇబ్బందులకు గురికావద్దు. నంబర్ మార్చుకోవాలంటే హైదరాబాద్కు సమాచారం ఇవ్వాలి. -
హోదా కోసం అవసరమైతే కేంద్రంతో తెగతెంపులు
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు అమలాపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేకుంటే కేంద్రంతో తెగతెంపులకు కూడా సిద్ధమేనని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు. అమలాపురంలోని జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో జీఎస్టీ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఈ బిల్లుకు ఏపీ ఎంపీలమందరం మద్దతు ఇస్తాం... మీరు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ ఇదే సహకారం అందించాలని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కోరానని తెలిపారు. వచ్చే నెలలో కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు తెరుస్తారని ఎంపీ చెప్పారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై కసరత్తులు జరుగుతున్నాయన్నారు. చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహార నిధులు దాదాపు రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవల దళితులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
హోదా కోసం అవసరమైతే కేంద్రంతో తెగతెంపులు
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు అమలాపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేకుంటే కేంద్రంతో తెగతెంపులకు కూడా సిద్ధమేనని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు. అమలాపురంలోని జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో జీఎస్టీ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఈ బిల్లుకు ఏపీ ఎంపీలమందరం మద్దతు ఇస్తాం... మీరు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ ఇదే సహకారం అందించాలని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కోరానని తెలిపారు. వచ్చే నెలలో కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు తెరుస్తారని ఎంపీ చెప్పారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై కసరత్తులు జరుగుతున్నాయన్నారు. చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహార నిధులు దాదాపు రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవల దళితులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు బీమా కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలోని 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకంలో బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని లా హాæస్పిన్ హోటల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలోనే బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా ద్వారా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల నగదు చెల్లిస్తారన్నారు. సాధారణ మరణానికి రూ. 30 వేలు ఇస్తారన్నారు. ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందితే రూ. 3.62 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఆ కార్మికుల పిల్లలకు 9, 10, ఇంటర్, ఐఐటి చదివే వారికి సంవత్సరానికి రూ. 1,200 చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తారన్నారు. చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నవారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వివాహ కానుక, ప్రసూతి సహాయం, తాత్కాలిక ప్రమాద భృతి, వృత్తి నైపుణ్య శిక్షణ, అంత్య క్రియల సహాయం వంటి సదుపాయాలు కూడా లభిస్తాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో కూడా 50 రోజులు పని చేసిన కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఈ పథకం కింద కార్మికులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం రూ. 134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు. సర్వీసు ఛార్జీ కింద బీమాదారు కేవలం రూ. 15 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పుష్కర అమరావతి
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో పుష్కర మహోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అమరావతిలో ఉన్న రెండు భారీ ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఊహించి అన్ని ఏర్పాట్లు చేశారు. అమరావతి : స్థానిక ధ్యానబుద్ధ ఘాట్, అమరేశ్వరఘాట్లలో భక్తులకు క్యూలైన్లు, హైమాస్ట్ లైట్లు, కష్ణవేణి మాత విగ్రహం ఏర్పాటు చేశారు. ఘాట్లన్నీ అగ్నిమాపక సిబ్బంది శుభ్రంగా కడిగివేశారు. ఈఘాట్లో మూడు వైద్యశిబిరాలను, సంచార వైద్యశాలలను, అంబులెన్స్ సౌకర్యం ఆరోగ్యశాఖ ర్పాటు చేసింది. అతిథి గృహంలో పోలీస్ కంట్రోల్రూం.. ధ్యానబుద్ధ విగ్రహం పక్కను ఉన్న పర్యాటక శాఖ అతిథిగహంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఊర్పాటు చేశారు. ఇక్కడ అన్ని శాఖల ఉన్నదాధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కసి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మూడు పిండ ప్రధాన షెడ్లు.. మూడు పిండ ప్రధాన షెడ్లు వేయటం ద్వారా భక్తులు ప్రత్యేకంగా పిండ ప్రధానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. దేవాలయంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు వేసి స్వామివారి అంత్రాలయ ద్వారానికి బంగారు రేకులతో తాపడం చేయించారు. ప్రతిరోజూ హారతికి ఏర్పాట్లు.. ప్రతిరోజు కృష్ణానదికి హారతులు ఇచ్చేందుకు దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. ఇంకా చిన్న చిన్న లోపాలను అన్ని శాఖల ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించి ఈరోజు రాత్రికి సరిచేస్తారని అధికారులు తెలిపారు. వైకుంఠపురంలో.. వైష్ణవ క్షేత్రంలో పుష్కరాల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక్కడ ఉత్తరవాహని ఘాట్లో సుమారు వందమీటర్ల సిమెంటు రోడ్డుతో పాటుగా 50 మీటర్ల ఘాట్ నిర్మాణం చేశారు. ఇక్కడ గురువారం నాడుకూడా పనులు చేయటం విశేషం. ఘాట్ వద్ద రోడ్డుపై మట్టి, బురద గురువారం సాయంత్రం వరకు శుభ్రం చేయలేదు. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో జరుగలేదు. కొండకిద ఆలయానికి రంగులు వేసి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. -
జల విహారానికి బోటు సిద్ధం
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): కృష్ణానదిలో ప్రజలు జలవిహారం చేసేందుకు ‘తన్వి క్రూజ్’ బోటును గురువారం ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన ఛాంపియన్ సంస్థ ఈ బోటును ఏర్పాటు చేసింది. పుష్కరాలకు రానున్న భక్తులకు సేవలు అందించేందుకు శుక్రవారం నుంచే దీన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ బోటు కృష్ణానది అందాలను చూపిస్తూ విహార యాత్ర కొనసాగుతుందని, ఒకేసారి 300 మంది ప్రయాణించవచ్చని వివరించారు. టిక్కెట్టు ధర రూ.500 అని తెలిపారు. -
విత్తన గిడ్డంగి సిద్ధం
దీని నిల్వ సామర్థ్యం 28వేల క్వింటాళ్లు నిర్మాణ వ్యయం రూ.3.08 కోట్లు నిర్మాణం తుది దశలో విత్తన శుద్ధి కర్మాగారం ఈ రెండింటిని 17న ప్రారంభించనున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఖమ్మం వ్యవసాయం: అధునాతన సాంకేతిక పరిఙ్ఞానంతో ఖమ్మం నగరానికి సమీపంలోగల రఘునాథపాలెం వద్ద 2.24 ఎకరాల స్థలంలో రూ.3.05 కోట్ల వ్యయంతో విత్తన గిడ్డంగిని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించింది. దీని నిల్వ సామర్థ్యం 28వేల క్వింటాళ్లు. ఈ స్థలంలోనే కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన విత్తన శుద్ధి కర్మాగార నిర్మాణం కూడా తుది దశకు చేరింది. పత్తి, మిర్చి, కూరగాయలు మినహా జిల్లాలో పండించే అన్ని రకాల పంట ఉత్పత్తులను విత్తనాల కోసం కొనుగోలు చేసి (విత్తన) ఇక్కడే శుద్ధి చేసి, నిల్వ ఉంచుతారు. జిల్లాకు అవసరమైన విత్తనాలను ఇప్పటివరకూ పొరుగు జిల్లాలైన వరంగల్, కరీంనగర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపై విత్తనాలను ఇక్కడి నుంచే పొందవచ్చు. విత్తన శుద్ధి కేంద్రంలో ‘పోలార్ వెస్ట్రబ్’ అనే అధునాతనమైన విత్తన శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం ఆరు టన్నులు. రైతులకు ఫౌండేషన్ సీడ్ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ అందిస్తుంది. ఆ రైతులు పండించిన పంటను కార్పొరేషన్ పరిశీలించి, ప్రమాణాల ప్రకారం ఉన్నవాటిని కొనుగోలు చేసి విత్తనాలుగా మారుస్తుంది. వీటిని ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ధరకు తిరిగి రైతులకు అందిస్తుంది. గిడ్డంగిని, కర్మాగారాన్ని ఈ నెల 17న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కె.కోటిలింగం ‘సాక్షి’తో చెప్పారు. -
పుష్కర వేడుకలకు సంసిద్ధం
-
పుష్కరాలకు సర్వం సిద్ధం
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలకు సర్వం సిద్ధం చేశామని, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం అహర్నిశలూ కష్టపడుతోందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ పార్కును పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు కిలోమీటర్ల పొడవునా 72 ఘాట్ల నిర్మాణం పూర్తయిందని, వీటిని ఏ, బీ, సీ, డీ ఘాట్లుగా గుర్తించామన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అమరావతి, ధరణికోట, తాళ్లాయపాలెం, సీతానగరం, పెనుమూడి ఘాట్లకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా అని, గుంటూరు నగర శివారులో లక్ష మంది భక్తులకు వసతి కోసం గోరంట్ల రోడ్డులో ఒకటి, విజయవాడ రోడ్డులో మరొకటి పుష్కర నగర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిలో భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. దీనికి అనుసంధానంగా ప్రతి పుష్కరఘాట్కు సమీపంలో ఐదారు పుష్కర నగర్లు ఏర్పాటు చేసి 25 వేల మందికి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు పుష్కర నగర్ నుంచి ఘాట్లకు వచ్చే భక్తులకు ఎటువంటి రుసుం వసూలు చేయకుండా ప్రయాణం చేసే విధంగా వసతులు కల్పించినట్టు వివరించారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
– కలెక్టర్ సత్యనారాయణరెడ్డి –ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేవు వాడపల్లి(దామరచర్ల) కష్ణా పుష్కరాకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం దామరచర్ల మండలం వాడపల్లి స్నానఘాట్లను, ఇతర పుష్కర పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు 3కోట్ల మంది భక్తులు వచ్చారని, రెండు జిల్లాలో జరుగుతున్న కష్ణా పుష్కరాలకు అదే సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నామన్నారు.ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 2650 మీటర్ల 28 స్నానఘాట్లను అందంగా ముస్తాబు చేస్తున్నామన్నారు.11శాఖల సిబ్బంది మూడు షిఫ్టులలో ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తారన్నారు. 2500 తాగునీటి ఆర్వో ప్లాంట్లు,2300 టాయ్లెట్లు నిర్మించినట్లు తెలిపారు. భక్తుల సమూహం అ«ధికంగా ఉంటే 40 నిమిషాల నుంచి 1గంట పాటు వేచి ఉండేందుకు వీలుగా 1657 ఎకరాల్లో పార్కింగ్.హోల్డింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఘాట్ల వద్ద మెడికల్,కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎగువ ప్రాంతంలో వస్తున్న వర్షాలతో ఇప్పటికే శ్రీశైలంకు నీళ్లు వస్తున్నాయన్నారు. దీంతో పుష్కరాలకు నీటి విడుదల ఉంటుందని, భక్తులు ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఆయన వెంట ఏజేసీ వెంకట్రావ్,ఆర్డీఓ కిషన్రావు,తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి,ఐబీ ఎస్.ఈ ధర్మానాయక్, డీఈ మురళి, పీఆర్ ఈఈ హన్మంతరావు, డీఎస్పీ మరాంగోపాల్రావు, సీఐలు రవీందర్, భిక్షపతి,ఎస్.ఐ చరమంద రాజు పాల్గొన్నారు. -
పుష్కరాలకు సన్నద్ధంకండి!
అధికారులకు కలెక్టర్ ఆదేశం పనుల పెండింగ్పై ఆగ్రహం సాక్షి, అమరావతి: పుష్కర పనుల తీరుపై కలెక్టర్ కాంతిలాల దండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి అధికారులతో గుంటూరులో ఆయన సమీక్ష నిర్వహించారు. పుష్కర విధుల్లో పాల్గొనే ఉద్యోగుల గుర్తింపు కార్డులు వెంటనే తయారు చేయాలన్నారు. ఘాట్ల లేటెస్టు ఫొటోలను వెబ్సైట్లో పొందు పరచాలని ఆదేశించారు. పుష్కరాల కరదీపక కోసం అన్ని శాఖలు సమాచారం ఇవ్వాలన్నారు. ఫుష్కర నగర్ల నుంచి ఘాట్ల వద్దకు భక్తులను చేర వేసేందుకు వీలుగా జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పుష్కర పూజా సామగ్రి కిట్ల విషయమై చర్చించారు. సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, పెదకూరపాడు, రైల్వే స్టేషన్ల నుంచి బస్సులను ఘాట్ల వద్దకు ఎక్కువ సంఖ్యలో నడపాలని చెప్పారు. మెడికల్, శానిటేషన్, తాగునీరు ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రేపల్లె ఘాట్లో జల్లు స్నానాలు ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఘాట్లకు వెళే మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
బీజేపీ మహాసమ్మేళన్కు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన బీజేపీ మహాసమ్మేళన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లు, వేదికపై ఎంతమంది ఉండాలి, సభాధ్యక్షత, పార్టీలో అంతర్గతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శనివారం సమీక్షించారు. పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్న ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాకు వివరించారు. ఆదివారం ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.20కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలుకుతాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనంతకుమార్, ఎం.వెంకయ్యనాయుడు, హన్సరాజ్ గంగారాం అహిర్, బండారు దత్తాత్రేయ ఉంటారు. తొలుత గజ్వేల్లో కార్యక్రమాలు ముగిశాక మోదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ మహాసమ్మేళన్లో ప్రధానమంత్రి 40 నిమిషాలపాటు ప్రసంగిస్తారు. వేదికపైకి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు జి.కిషన్రెడ్డి ప్రసంగిస్తారు. సభాధ్యక్షతపై సందిగ్ధం.. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న బీజేపీ మహాసమ్మేళన్కు ఎవరు అధ్యక్షత వహించాలనేదానిపై పార్టీలో సందిగ్ధం నెలకొంది. పార్టీ కార్యక్రమం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలోనే సభ నిర్వహించడం సంప్రదాయం అని కొందరు నాయకులు వాదించారు. అయితే వివిధ కారణాల వల్ల పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్షనేత జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని బీజేపీ వర్గాలు ముందుగా వెల్లడించాయి. అంతర్గతంగా జరిగిన పరిణామాలేమిటో వెల్లడి కాకున్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సభకు అధ్యక్షత వహిస్తారని శనివారం సాయంత్రానికి పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంలో సందిగ్ధం ఎందుకు ఏర్పడిందో తెలియాల్సి ఉందని అంటున్నారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
యాత్రికులు, భక్తులకు సకల సౌకర్యాలు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తుళ్లూరు: కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం ఆయన తుళ్లూరు మండలంలోని పుష్కర ఘాట్లు, పుష్కర నగర్లు, పిండ ప్రదాన షెడ్లను జేసీ వెంకటేశ్వరరావుతో కలసి సందర్శించారు. యాత్రికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చివరి దశ పనులు మాత్రమే ఉన్నాయని, వాటిని కూడా నిర్వాహకులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా భక్తులు పుష్కర స్నానాలకు రావాలని కోరారు. చాలామంది దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు,ధార్మిక సంస్థలు యాత్రికులకు, భక్తులకు భోజన వసతులు కల్పించనున్నాయని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ సిబ్బంది అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టలెక్కనున్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్
-
10వ తేదీ కల్లా భవనాలు సిద్ధం:నారాయణ
►ఏపీ మంత్రి నారాయణ వెల్లడి ►తాత్కాలిక సచివాలయంలో పలు కార్యాలయాలు ప్రారంభం అమరావతి : ఏపీలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ సముదాయ భవనాలన్నీ 10వ తేదీ నాటికి పూర్తవుతాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గురువారం ఉదయం 9.45 గంటల కు పురపాలక శాఖ కార్యాలయాన్ని నారాయణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇకపై తాత్కాలిక సచివాలయం నుంచే పాలన కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హోంశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. కృష్ణా పుష్కరాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు ఐదో భవనంలోని రవాణాశాఖ కార్యాలయంలో తన చాంబర్ను ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల్లో రూ.400 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని శిద్దా తెలిపారు. ప్రతి బస్టాండ్లో పుష్కర కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల, సీడీఎంఏ డెరైక్టర్ కె.కన్నబాబు, పల్లోంజి షాపోర్జి సంస్థ ప్రతినిధులుపాల్గొన్నారు. పూర్తి కాకున్నా ప్రారంభం... గురువారం ప్రారంభించిన రెండో భవనం ముఖద్వారం పూర్తి కాలేదు. నారాయణ ఉదయమే పురపాలక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో ద్వారం ముందు హడావుడిగా ఇసుక నింపి దానిపై గ్రీన్ కార్పెట్ను పరిచారు. రెండో భవనం ముందు భాగంలో ఓ వైపు టైల్స్ వేస్తుంటే.. మరోవైపు కార్యాలయాల ప్రారంభాల కోసం మంత్రులు, అధికారులు వెళ్లడం కనిపించింది. -
పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం
విజయవాడ : కృష్ణా పుష్కరాల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. కలెక్టర్ బాబు.ఎ బుధవారం ఇరిగేషన్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల విధులకు సంబంధించిన ప్రణాళికపై కసరత్తు చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా సీఎం సమక్షంలో ఈ నెల 6వ తేదీన ఏ–కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహిస్తారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందు కు శిక్షణ ఇస్తారు. పుష్కర విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు బస చేసే ప్రాంతంలోనే ఆహారం తదితర ఏర్పాట్లు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,095 విడిది ప్రాంతాలను గుర్తించారు. సిబ్బందికి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు షిఫ్టులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పుష్కరాల్లో సదస్సులు : కలెక్టర్ పుష్కరాల సందర్భంగా పలు అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జల సంరక్షణ, అమరావతి, వనం–మనం, వ్యవసాయం, విద్య, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం తదితర అంశాలపై సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరనగర్లు, ఘాట్లు, పుష్కర విడిది కేంద్రాల సమీపంలో, రహదారులపై మద్యం విక్రయాలపై నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వస్తాయన్నారు. ‘స్వచ్ఛపుష్కరాలు’ అనే విధానంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో పారిశుద్ధ్య, మున్సిపల్, పంచాయతీ అధికారులు, సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను అతిథులుగా ఆదరించాలని, వసతి, భోజన , సదుపాయాలపై వ్యక్తిగత పర్యవేక్షణ అవసరమన్నారు. అధికారులు, సిబ్బందిని సమన్వం చేసుకుంటూ యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు 400 వైర్లెస్ సెట్లను ముఖ్య అధికారులకు అందిస్తామని తెలిపారు. ఘాట్ల వద్ద 30 లైఫ్బోట్ సర్వీసులు అందుబాటులో ఉంచుతామన్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆధార్ ఆధారంగా ఐడీ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో రైల్వే డీజీఎం అశోక్కుమార్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృ జన, ఎన్డీఆర్ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంత్యపుష్కరాలకు ఆర్టీసీ, రైల్వే సిద్ధం
జిల్లా వ్యాప్తంగా వంద బస్పులు ప్రతి 15 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు కాంప్లెక్స్లో ప్రత్యేక షెల్టర్లు ఆర్టీసీ ఆర్ఎం రవికుమార్ రాజమహేంద్రవరం సిటీ : దూర ప్రాంతాల నుంచి అంత్య పుష్కర స్నానమాచరించేందుకు జిల్లాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ, రైల్వేశాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లాలోని 9 డిపోల నుంచి వంద ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి మరో రెండు వందల బస్పులు ప్రయాణికులను తీసుకుని రానున్నాయన్నారు. ప్రతి 15 నిమిషాలకు రాజమహేంద్రవరం నుంచి ప్రయాణికులను తీసుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. నగరంలో షెల్టన్, తాడితోట, కంబాలచెరువు, గోకవరం బస్టాండ్, ఆర్యాపురం మీదుగా కోటిలింగాలఘాట్కు వెళ్లే వారి కోసం బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ఈ బస్సులు ఇదే దారిలో తిరిగి కాంప్లెక్స్కు చేరుకుంటాయన్నారు. నగరానికి వచ్చే భక్తుల కోసం కాంప్లెక్స్లో ఉన్న ఐదెకరాల స్థలంలో షెల్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. 24 గంటలు తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తుల కోసం 50 మరుగుదొడ్లు సిద్ధం చేశామన్నారు. అంత్య పుష్కరాలకు తిరిగే బస్సుల్లో సాధారణ ధరలు మాత్రమే వసూలు చేస్తున్నామని రవికుమార్ స్పష్టంచేశారు. రైల్వేస్టేషన్లో అదనంగా మూడు టికెట్ కౌంటర్లు అంత్యపుష్కర భక్తులకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లో రెండు, తూర్పు రైల్వేస్టేషన్లో ఒకటి ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. -
మూతపడనున్న వసతిగృహం
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకు ప్రవేశాలపై ప్రచారం కరువు ఏడాదిగా ఇన్చార్జీలతోనే నిర్వహణ ఆందోళనలో విద్యార్థులు మర్రిగూడ: అధికారుల నిర్లక్ష్యంతో మర్రిగూడలో దళిత సంక్షేమ బాలుర వసతిగృహం (ఎస్సీ) మూతపడనుంది. మండల కేంద్రంలో మూఫ్పై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో మూసివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇన్చార్జీ పాలనలో ఇబ్బందులు ఈ హాస్టల్లో పని చేసే వార్డన్ గత ఏడాది మార్చిలో పదవీ విరమణ పొందాడు. అప్పటి నుంచి దేవరకొండ వసతిగృహం వార్డెన్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను వారంలో ఒకటి, రెండు రోజుల మాత్రమే ఇలా వచ్చి అలా పోవడంతో విద్యార్థులకు మౌలిక వసతులు అందడం లేదు. మోను ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు. గత వారం రోజుల నుంచిlఉదయం అల్పహారంగా ఇచ్చే జావా కూడ ఇవ్వడం లేదు. అరటిపండ్లు అందడం లేదు. గతంలో వందల మంది ఉన్న ఈ హాస్టల్లో వసతులు లోపించడం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా మారింది. దీనికితోడు ఈయేడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను వసతిగృహంలో చేర్పించడంతో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో విద్యార్థులు lచింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల నుంచిl30 మంది విద్యార్థులు ఈ వసతిగృహంలో ఉంటు విద్యనభ్యాసిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్థాంతరంగా హాస్టల్ మూసివేస్తామని అధికారులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ వార్డెన్ కూడా సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు మూసివేయాలని నివేధిక అందించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎటూకానీ సమసయంలో తాము వసతి కోసం ఎక్కడికి వెళ్లాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ను మూసేస్తే ఊరుకోం –సిలివేరు విష్ణు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను చేర్చుకోకుండా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని హాస్టల్ను మూసివేస్తామనడం అధికారులకు సబబు కాదు. హాస్టల్ను తొలగిస్తే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు. అధికారులు మెండిగా వ్యవహరిస్తే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకోని ఆందోళనలు చేస్తాం. విచారణ చేస్తాం బాలసింగ్, ఏఎస్డబ్ల్యూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వసతి గృహాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నాం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తు్తన్నాం. సంఖ్య పెరగని పక్షంలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. -
సై.. అన్న షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: వచ్చేఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలాదీక్షిత్ (78) ముఖ్యమంత్రి అభ్యర్థిగా తలపడనున్నారా? అందుకు షీలా తన అంగీకారాన్ని తెలిపారా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్ లో క్రియాశీల బాధ్యతలను కాదంటూ వచ్చిన షీలా.. ఎట్టకేలకు తన అనుమతిని తెలిపినట్టు సమాచారం. పార్టీ తనను ఏమైనా చేయాలని ఆదేశిస్తే.. అందుకు తాను సిద్ధంగా ఉంటానని షీలా ఇటీవల తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోడలినని చెప్పుకొంటున్న షీలాను రంగంలోకి దించితే బ్రాహ్మణుల ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు ఆపార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధిష్టానానికి సూచించారని, దీంతో అధిష్టానం ఆదేశాలను షీలాదీక్షిత్ కాదనలేకపోయారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ 2014 లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 2015 లో నితీష్ కుమార్ లకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పని చేశారు. మరోవైపు, ఇందిర మనవరాలు ప్రియాంకగాంధీ సైతం యూపీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కేవలం అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక.. ఈసారి ఎలాగైనా యూపీలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కొందరు నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. -
రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. రూ.5 భోజనం బాగుందంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వే మరోమారు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జానా పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. పార్టీని బలపరచడంలో జానా దూకుడుగా లేరని సర్వే ఆరోపించారు. ఆ సమయంలోనే.. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని జానారెడ్డి చెప్పడంతో రాజీనామా అవసరం లేదని, పదవీలోనే కొనసాగాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వేల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దళితుడైన తనను షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తున్నారని సర్వే అన్నారు. పబ్లిక్ మీటింగ్ లోనే పార్టీ నాయకత్వ తీరుపై సర్వే వ్యాఖ్యలు చేయడం సరికాదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వే సత్యనారయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మళ్లీ ఊరిస్తున్న మాల్యా
ముంబై: ఇదిగో వస్తున్నా..అదిగో వస్తున్నా.అంటూ ఊరిస్తున్న బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా మరోసారి తాను ఇండియాకు వస్తానంటూ ప్రకటించారు. అదీ కొన్ని ప్రత్యేక షరతులతో.. తనకు పూర్తి భద్రత కల్పిస్తే వస్తానంటూ పాతపాటే పాడుతున్నారు. రుణాల చెల్లిపుల విషయంలో అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో వ్యాపార వేత్త విజయ మాల్యా భారతదేశానికి తిరిగి వచ్చేందకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముంబైలో శుక్రవారం జరిగిన యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాల్యా రక్షణకు సరైన హామీ లభిస్తే త్వరలోనే తాను ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలిపారు. భద్రత, స్వేచ్ఛ, రక్షణకు సంబంధించి హామీ లభిస్తే ఇండియా తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించినట్టు సమాచారం. రుణాల చెల్లింపులో బ్యాంకులతో చర్చలు జరపనున్నట్టు మాల్య తమకు హామీ ఇచ్చారని ఇండిపెండెంట్ ప్రతినిధి కిరణ్ మజుందార్ షా తెలిపారు. మాల్యా ప్రతిపాదనలకు బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు మరో ఇండిపెండెంట్ ప్రతినిధి సీవై పాల్ వెల్లడించారు. అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది జీతాల చెల్లింపునకు తాను చేసిన ప్రయత్నాలు తన ఆస్తులు సీజ్ చేయాలనే కర్నాటక హైకోర్టు నిర్ణయం మూలంగా విఫలమయ్యాయన్నారని చెప్పారు. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం తనపై వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారన్నారు. మనీ లాండరింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మాల్యా వాదించారనీ, ఆధారాలు లేని ఆరోపణలని కొట్టి పారేసారని తెలిపారు. కాగా బ్యాంకుల కన్సార్టియానాకి 9 వేల కోట్లకు పైగా బకాయి పడి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా, రుణాల చెల్లింపుకు గడువుల గడువుల మీద విధిస్తూ బేరసారాలకు దిగాడు. ఆయన ప్రతిపాదనలకు కన్సార్టియం ససేమిరా అనడంతో వివాదం మరింత సాగుతోంది. అటు మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రశ్నించేందుకు ఈడీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు, గోవాలోని ఆయన విల్లా స్వాధీనం తెలిసిందే. -
'అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచండి'
ప్యాంగ్యాంగ్: శత్రు దేశాల నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా.. అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాలని, ఏ సమయంలో నైనా దాడి చేయడానికి వీలుగా సన్నాహకాలు చేసుకోవాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా నూతనంగా తయారుచేసిన రాకెట్ లాంచర్లను పర్యవేక్షించిన సందర్భంగా కిమ్ అధికారులతో మాట్లాడుతూ.. అణ్వాయుధాల సంఖ్య, నాణ్యతను పెంచాలని, ఇది దేశ రక్షణకు అత్యవసరమని చెప్పినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బుధవారం ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై మరిన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో కిమ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆదేశాలతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కథనాలపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ అధికారి బిల్ అర్బన్.. ఉద్రిక్త పరిస్థితులలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటానికి బదులుగా అంతర్జాతీయ ఒప్పందాలు, బాధ్యతలకు కట్టుబడి ఉండాల్సిందిగా ఉత్తర కొరియాను కోరారు. -
'ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం'
జమ్మలమడుగు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇంతకుముందే తాను ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. ఆయన మళ్లీ చూద్దామన్నారని, ఈ సారి బాబును కలిసినప్పుడు మళ్లీ రాజినామా విషయాన్ని ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల
వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'ఆగడు' సినిమాతో భారీ డిజాస్టర్ను ఎదుర్కొన్న శ్రీనువైట్ల. ఆ తరువాత 'బ్రూస్ లీ' సినిమాతో మరోసారి ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాడు. దీంతో కాస్త బ్రేక్ తీసుకొని గ్యారెంటీ హిట్తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో యంగ్ హీరోలతో మంచి సక్సెస్లు సాధించిన శ్రీను మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామాతో తిరిగి సక్సెస్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా రెడీకి సీక్వల్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. మరోసారి రామ్ హీరోగా 'రెడీ'కి సీక్వల్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
'రిపబ్లిక్ డే'కు పరేడ్ గ్రౌండ్లో ఎర్పాట్లు
-
ఐఎస్ఐఎస్కు చెక్ పెట్టేందుకే 'ధర్మసేన'
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ను తిప్పికొట్టేందుకు హిందూ స్వాభిమాన్ సన్నద్ధమతోంది. ఉత్తరప్రదేశ్లో 'ధర్మసేన' పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని రూపొందించి ఉగ్రవాదులపై పట్టు సాధించాలని హిందూ స్వాభిమాన్ నేతలు భావిస్తున్నారు. అందుకే ధర్మసేన పేరుతో సైనిక శిక్షణ అందిస్తున్నామన్నారు. దస్నా కేంద్రంగా పనిచేస్తున్న హిందూ స్వాభిమాన్ ఆధ్వర్యంలో 15 వేల మంది కార్యకర్తలు కత్తిసాము తదితర యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్నారు. 2020 నాటికి తీవ్రవాద దాడులు పెరగునున్నాయని హిందూ స్వాభిమాన్ నాయకులు నమ్ముతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సేనలో 8-30 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులు, చిన్నారులు చేరుతున్నారు. వీరికి కత్తులు, తుపాకులను ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలు దాదాపు 50 ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో రహస్యంగానూ, మరికొన్నిటిలో బహిరంగంగానూ శిక్షణ ఇస్తున్నారు. మీరట్ లో మూడు, ముజఫర్నగర్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో బహిరంగంగానే శిక్షణ ఇస్తున్నాయి. శత్రువు దాడి చేసినపుడు తిప్పికొట్టడమే లక్ష్యంగా ధర్మ సేన సిద్ధం అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) కు చెక్ పెట్టేందుకంటూ హిందూ ధర్మసేన సన్నద్ధమవుతోంది. హిందుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రాణాలర్పించడానికైనా వెనుకాడేది లేదని ధర్మసేనలో శిక్షణ పొందుతున్నవారు చెప్తున్నారు. మొదటి ఆరు నెలల్లో ధర్మసేన సైనికులకు భగవద్గీత శ్లోకాలు బోధించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్లో తర్ఫీదు ఇస్తున్నట్లు హిందూ స్వాభిమాన్ నేతలు చెబుతున్నారు. అలాగే ఆరు నెలలు శిక్షణ పొందినవారు కావాలనుకుంటే స్వయంగా తామే శిక్షణ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రెండేళ్లలో 15 వేల మందిని సైనికులుగా తయారు చేసినట్టు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీస్ ఉన్నతాధికారి అలోక్ శర్మ తెలిపారు. ప్రయివేటు సైన్యం ఏర్పాటు వార్తలపై పరిశీలన జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
సీపీఎల్కు సర్వం సిద్థం
-
పశ్చిమగోదావరిలో కోడి పందేల సందడి
-
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీశైలం
-
అమరావతి మాస్ట్ర్ ప్లాన్
-
టీడీపీ గూటికి ఆనం బ్రదర్స్
-
100 కోట్ల పెట్టుబడులతో వీసీలు రెడీ: విన్ విజన్
హైదరాబాద్లో విన్ విజన్ ఐ కేర్ ఆసుపత్రి ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విన్ విజన్ పేరుతో నగరంలో మరో కంటి ఆసుపత్రి ప్రారంభమైంది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జే రామేశ్వర్ రావు మంగళవారమిక్కడ ఆసుపత్రి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జాయింట్ డెరైక్టర్ ఎన్వీ రత్నం చౌదరి మాట్లాడుతూ.. రూ.12.5 కోట్ల పెట్టుబడులతో 12 వేల చ.అ.ల్లో పర్యాటక భవనం సమీపంలో విన్ విజన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. ఇందులో 80 శాతం నిధులను పరికరాల కోసం, మిగతా వాటిని ఆసుపత్రి ఇంటీరియర్ కోసం వినియోగించామని పేర్కొన్నారు. విన్ విజన్లో కాటరాక్ట్, లాసిక్, రెటీనా, గ్లుకోమా, పీడియాట్రిక్ ఆప్తమాలజీ, అకులోప్లాస్టీ తదితర సేవలన్నీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు 20 సెంటర్లలో విన్ విజన్ ఆసుపత్రులను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు గాను రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు వెంచర్ కేపిటలిస్ట్లు (వీసీలు), బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రధాన సెంటర్లుంటాయని.. మిగతా వాటిలో క్లినిక్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో ప్రధాన సెంటర్లో రూ.12.5 కోట్లు, క్లినిక్స్లో రూ.4 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విన్ విజన్ ఐ కేర్ చైర్మన్ డాక్టర్ సతీష్ గుప్తా, ఎండీ డాక్టర్ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు. -
అందాలారబోతకు యామీ గౌతం సై
ఎవరు అవునన్నా కాదన్నా హీరోయిన్ల కేరీర్కు గ్లామర్కు విడదీయరాని బంధం ఉంటుందన్నది నిజం. నేను గ్లామర్కు దూరం, చుంబనాలకు ఒప్పుకోను, ఈత దుస్తులకు ససేమిరా అంగీకరించను అన్నవాళ్లంతా ఆ తరువాత అలాంటి వాటికి మేము సైతం అన్నవాళ్లే. నటి యామీ గౌతందీ ఇదే వరుస. గౌరవం చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయం అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తరువాత మళ్లీ తమిళ తెరపై కనిపించలేదు. కారణం నేను గ్లామరస్ పాత్రలు చెయ్యను. కురుచ దుస్తులు అస్సలు ధరించను. అందాలారబోతకు దూరం లాంటి స్టేట్మెంట్లతో మడి కట్టుకుని కూర్చోవడమే అనే టాక్ ప్రచారంలో ఉంది. ఇలానే నటి రెజీనా కూడా ఇంతకు ముందు గ్లామర్కు దూరం అని ప్రచారం చేసుకుంది. ఆ తరువాత జ్ఞానోదయం అయినట్లుంది. అందాలారబోతకు రెడీ అనేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలీవుడ్ ఆ అమ్మడిని పక్కన పెట్టేసింది. రెజీనాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఆమె గ్లామర్నిప్పుడు టాలీవుడ్ వాడుకుంటోంది. ఇక నటి యామీ గౌతమ్ కథ డిటోనే. అందాలారబోతకు ససేమిరా అనడంతో దక్షిణాది సినిమా ఈ భామను దూరం పెట్టేసింది. బాలీవుడ్లోనూ సనంరే అనే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. యామీ గౌతం కంటే వెనుక రంగంలోకి దిగిన నటి అలియాభట్ లిప్లాక్, ఈత దుస్తులు, అంటూ దుమ్మురేపుతూ దూసుకు పోతోంది. దీంతో ఇంకా గ్లామర్ విషయంలో మడి కట్టుకు కూర్చుంటే మొత్తానికే పక్కన పెట్టేసార్తని భావించిందో ఏమో ఇప్పుడు గ్లామర్ పాత్రలకు నేను రెడీ అంటున్నారు. కురుచ దుస్తులయినా పర్వాలేదు స్టైల్గా ఉండి తనకు అసౌకర్యం అనిపించకుండా ఉంటే వాటిని ధరించడానికి నేను సైతం సిద్ధం అంటూ ప్రకటింసేసిందని సమాచారం. చాలా కాలం ముందు నితిన్ యామీగౌతమ్ జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన ద్విభాషా చిత్రం తెలుగులో కొరియర్ బాయ్ పేరుతో ఇటీవలే తెరపైకి వచ్చింది. తమిళంలో జయ్తో యామీ జత కట్టిన ఈ చిత్రం తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుం పేరుతో విడుదల కావలసి ఉంది.ఇప్పటికి యామీ కి కొత్తగా అవకాశాలేమీ లేవు.అందాలారబోతకు సై అంటోంది కాబట్టి ఇకపై వస్తాయేమో చూడాలి. -
హుస్సేన్సాగర్ ప్రక్షాళన మొదలు పెట్టిన HMDA
-
ఏపీ ప్రజలకు భారీగా విద్యుత్ షాక్!
-
బాహుబలి2 రెడీ అవుతున్న జక్కన్న
-
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ వడ్డనకు రంగం సిద్ధం
-
ఏసీబి దూకుడుతో బెంబేలెత్తుతున్నపొలిటిషన్లు
-
వరుసగా వచ్చేస్తున్న తెలుగు సినిమాలు
-
పుష్కర పర్వానికి సర్వం సిద్ధం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల ముహూర్తం సమీపించింది. మరో 24 గంటల్లో పుష్కర పండగ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర రాజధాని రాజమహేంద్రి పుష్కర పండుగకు ముస్తాబైంది. రోజూ లక్షలాది మంది భక్తులు రాజమండ్రి తరలిరానున్నారు. వారి భద్రతకు పెద్దఎత్తున పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. ఘాట్లు ఉన్న ప్రాంతంలో నో వెహికిల్ జోన్ బౌండ్రీలను ఏర్పాటు చేశారు. రాజమండ్రి నగరంలో భక్తులు ఘాట్ల వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి నగరంలో ప్రముఖ ఆలయాలు, రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్న ప్రముఖ ఆలయాలను భక్తులకు చూపించేందుకు నమూనా ఆలయాల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఎగ్జిబిషన్లు, కడియం నర్సరీలు భక్తులను ఆలరించనున్నాయి. పుష్కరఘాట్లు ఇవే.. కోటిలింగాలఘాట్ పుష్కరఘాట్ మార్కండేయ ఘాట్ పద్మావతి ఘాట్ సరస్వతి ఘాట్ (వీఐపీ ఘాట్) గౌతమీ ఘాట్ సుబ్బాయమ్మ ఘాట్ రామపాదాల ఘాట్ (ధవళేశ్వరం) ముఖ్యమైన ఆస్పత్రులు ప్రభుత్వాస్పత్రి 0883-2442555 బొల్లినేని ఆస్పత్రి 0883-2477770 సాయి ఆస్పత్రి 0883-2470033 సురక్ష ఆస్పత్రి 0883-2445504 జీఎస్ఎల్ ఆస్పత్రి 0883- 2484999 ఆభయ ఆస్పత్రి 0883-2461640 స్వతంత్ర ఆస్పత్రి 0883-2400401 అత్యవసర సర్వీసులు పుష్కర కంట్రోల్ రూమ్ 12890 (టోల్ఫ్రీ) 0883-2555537/38 పోలీసు కంట్రోల్ రూమ్ 100, 1090 ఆంబులెన్స్ 108 విద్యుత్ శాఖ 1920, 0883-2442590 ఏపీఎస్ఆర్టీసీ 0883-2555001/2 లూథర్గిరి (ఆర్టీసీ) 0883-2555004/5 హెచ్బీ కాలనీ (ఆర్టీసీ) 0883-2555006/7 జెమినీ గ్రౌండ్స్ (ఆర్టీసీ) 0883- 2555003 రైల్వే ఎంక్వైరీ 139, 0883-2423535, 2555117 పుష్కర యాత్రికులు చేయాల్సినవి నిర్దేశించిన స్నానఘట్టాల వద్ద భక్తులు పుష్కర స్నానం చేయాలి. అనుమానిత వస్తువులు కనపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్ నిబంధనలు, ఆంక్షలను భక్తులు విధిగా పాటించాలి. చెత్తను చెత్తడబ్బాలో మాత్రమే వేయాలి. విమాన సర్వీసులు జెట్ ఎయిర్వేస్ 0883-2487009 స్పైస్ జెట్ 93999 78090 పుష్కర నగరాలు ఈఎస్ఐ ఆస్పత్రి సాంస్కృతిక కళాశాల ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు సుబ్రహ్మణ్య మైదానం ఆనం కళాకేంద్రం పుష్కర యాత్రికులు చేయకూడనివి పుష్కర ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగ్లు పూర్తిగా నిషేధం. నదీతీరం వద్ద దుస్తులు ఉతకరాదు. బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కరాదు. భిక్షాటనను భక్తులు, పర్యాటకులు ప్రోత్సహించరాదు. నదిలో స్నానం చేసినప్పుడు సబ్బు, షాంపూ ఉపయోగించరాదు. బహిరంగ మల, మూత్రవిసర్జన చేయరాదు. బారికేడింగ్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించరాదు. పార్కింగ్ స్థలాలు ఇవే.. హౌసింగ్ బోర్డు కాలనీ (లాలాచెరువు) చౌడేశ్వరనగర్ శివాలయం లూథర్గిరి ఆర్ట్స్ కాలేజీ ఎస్కేవీటీ కాలేజీ ఆర్టీసీ బస్టాండ్ లారీస్టాండ్ (వీఎల్ పురం) జెమినీ గ్రౌండ్ మార్గాని గ్రౌండ్ గూడ్స్ షెడ్ వీటితో పాటు మరో 143 ప్రాంతాల్లో తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికం యాగాది కార్యక్రమాలు: ఎస్కేవీటీ పాఠశాల టీటీడీ నమూనా ఆలయం: మున్సిపల్ స్టేడియం నమూనా దేవాలయాలు: కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వాహనాలు ప్రవేశం లేని మార్గం ధవళ్వేరం-రాజమండ్రి రోడ్డులోని ఐఎల్టీడీ జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్, కోటిపల్లి బస్టాండ్, వీటీ కాలేజీ రోడ్డు, తాడితోట జంక్షన్, చర్చిగేటు రోడ్డు, కంబాలచెరువు సెంటర్, ఇన్కం ట్యాక్స్ కార్యాలయం, లలితానగర్, సీతంపేట, పేపరు మిల్లు దాటే వరకు వాహనాలకు ప్రవేశం లేని ప్రాంతంగా (నో వెహికిల్ జోన్ బౌండ్రీ) నిర్దేశించారు. ముఖ్య అధికారులు రామ్ప్రకాష్ సిపోడియా: పుష్కర ప్రత్యేకాధికారి కె.ధనుంజయరెడ్డి: పుష్కర ప్రత్యేకాధికారి హెచ్.అరుణ్కుమార్: కలెక్టర్ జె.మురళి: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేవీఎస్ చక్రధర్బాబు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.విజయ్రామరాజు: సబ్ కలెక్టర్, రాజమండ్రి. -
మార్కెట్లోకి HONDA HR-V న్యూకార్
-
సునీల్తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడా..?