S A Bobde
-
వర్చువల్ న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు సూచనలు కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్గానే సాగాయి. 2020 మార్చిలో మొదలు కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్టాప్లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్ఎక్స్ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు. లాయర్లకు దిశానిర్దేశం వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు. రెండేళ్లలో రికార్డు 2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి! -
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము. అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు. జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మందే.. స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత . జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు. ఏమిటి పరిష్కారం న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు తొలి మహిళా సీజే తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు. -
చెక్ బౌన్స్ సత్వర పరిష్కారానికి సుప్రీం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు కోర్టుల్లో పేరుకుపోయిన చెక్బౌన్స్ కేసుల సత్వర పరిష్కానానికి సుప్రీకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఒక లావాదేవీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఒకే సంవత్సరంలో దాఖలైన వివిధ కేసులను కలిపి ఒకేసారి విచారించేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కు చట్ట సవరణలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్లు ఉన్నారు. 1973, సీఆర్పీసీ 219వ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం ఈ తరహాలో మూడు కేసులు మాత్రమే కలిపి విచారించాల్సి ఉంది. ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణకు వీలైన ‘‘సమ్మరీ ట్రైల్’’ నుంచి కొంత ఆలస్యానికి కారణమయ్యే ‘‘సమన్స్ ట్రైల్’’కు మార్చడానికి కారణాలు ఏమిటన్నది సంబంధిత మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేసేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు 27 పేజీల ఉత్తర్వుల్లో సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మున్ముందు కోర్టు హాళ్లూ చిన్నవి అవుతాయి
పణాజి: సాంకేతికత కారణంగా భవిష్యత్తులో కోర్టు ప్రాంగణాలు, కోర్టు గదులు కూడా చిన్నవిగా మారి పోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపారు. న్యాయం అందించే విషయంలో కరోనా మహమ్మారి పలు సవాళ్లు విసిరినప్పటికీ, ఆ పరిణామం కోర్టుల నవీకరణకు బాటలు వేసిందని ఆయన తెలిపారు. శనివారం పోర్వోరిమ్లో ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం కొత్త భవనం ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. ‘రవి శంకర్ ప్రసాద్ మంత్రిత్వం కారణంగానే కోర్టు గదులు చిన్నవిగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాను. అదేవిధంగా, భారీగా ఉండే కోర్టు పత్రాలను భద్రపరిచేందుకు చాలా గదులుండేవి. కానీ, ఈ–ఫైలింగ్, డేటా రాకతో ఇకపై పెద్ద సంఖ్యలో గదుల అవసరం కూడా ఉండదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కనీస ప్రమాణాలు, ప్రణాళికలను రూపొందించింది’అని ఆయన చెప్పారు. ‘మౌలిక వసతులపై చర్చించేటప్పుడు కొత్త భవనాల నిర్మాణం అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. ఇవి అవసరమే అయినప్పటికీ ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించాల్సి ఉంది’అని సీజేఐ అన్నారు. ముంబై హైకోర్టుకు కొత్త భవనం నిర్మించాలన్న ఆయన..‘అప్పట్లో కేవలం ఏడుగురు జడ్జీలకు మాత్రమే సరిపోయే విధంగా నిర్మించారు. కానీ, ఇప్పుడు అక్కడ 40 మందికి పైగా జడ్జీలు విధులు నిర్వర్తిస్తున్నారు’అని వివరించారు. నాలుగున్నర శతాబ్ధాల ఘన చరిత్ర గోవా న్యాయవ్యవస్థకు ఉందని సీజేఐ జస్టిస్ బాబ్డే చెప్పారు. పోర్చుగీస్ పాలకులు ఆసియాలోనే మొట్టమొదటి హైకోర్టును 1544లో గోవాలోనే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. గోవా ధర్మాసనంలోని ముగ్గురు జడ్జీల్లో తను కూడా ఉన్నానని, తనను కొందరు గోవా జడ్జీగా పేర్కొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మౌలిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జస్టిస్ రమణ ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ అవసరాలు తీర్చేందుకు వీలుగా ప్రత్యేకంగా జాతీయ న్యాయ మౌలిక వసతుల కార్పొరేషన్ అవసరం ఉందని చెప్పారు. దీనిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరారు. ఈ కొత్త కార్పొరేషన్ న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులకు అవసరమైన ఏకరూపకత, ప్రామాణీకరణను తెస్తుందని చెప్పారు. అన్ని కోర్టులకు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, కోర్టు పత్రాల ఈ–ఫైలింగ్కు ఏర్పాట్లు చేయడం వంటివి కూడా మౌలిక వసతుల కిందికే వస్తాయని వివరించారు. ‘శిథిలావస్థకు చేరిన నిర్మాణాల్లో కోర్టులను నిర్వహిస్తున్న ఉదాహరణలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల రికార్డు గదులు కూడా ఉండటం లేదు. వాష్ రూంలు, వెయిటింగ్ గదులు లేని కోర్టు ప్రాంగణాలు కూడా ఉన్నాయి’అని ఆయన తెలిపారు. కరోనా కారణంగా కేసుల విచారణ వర్చువల్గా సాగుతుండటంతో కోర్టులను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లినట్లయిం దన్నారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు హాజరయ్యారు. -
ఎన్నికల బాండ్ల విక్రయానికి ఓకే చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎన్నికల బాండ్ల విక్రయానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, వి. రామసుబ్రమణియన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. 2018 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం నిరాటంకంగా జరుగుతోందని, ఇప్పుడు వీటిపై స్టే విధించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పశ్చిమబెంగాల్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త ఎన్నికల బాండ్లను విక్రయిస్తే షెల్ కంపెనీలు పుట్టుకొచ్చి రాజకీయ పార్టీలకు అక్రమ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అందుకే ఈ బాండ్ల విక్రయాలపై స్టే ఇవ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) తన పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఎన్నికల బాండ్ల కొనుగోలు సంస్థల పేర్లు గోప్యంగా ఉంచడం వల్ల విదేశీ కంపెనీల నుంచి నిధులు పెద్ద ఎత్తున వచ్చి అవి దుర్వినియోగమవుతున్నాయని, ఆ అకౌంట్లలో పారదర్శకత కనిపించడం లేదని ఎడిఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిపై , కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకొనే ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఎన్నికల బాండ్ల విక్రయం చేపడుతున్నామని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటు 15 రోజుల వరకు మాత్రమే ఉంటుందని, రాజకీయ పార్టీలు ఈ నిధులపై ఆదాయ పన్ను కూడా కట్టాలని అలాంటప్పుడు అక్రమ మార్గాల్లో నగదు వచ్చే అవకాశమే లేదని కేంద్రం పేర్కొంది. ఎన్నికల సంఘం కూడా బాండ్ల విక్రయానికి మద్దతు తెలపడంతో సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎస్పీ గ్రూప్లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్పై... టాటా గ్రూప్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్గా తొలగించారు. మార్చి, ఏప్రిల్లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్కు వెళ్లేందుకు టాటా గ్రూప్నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ
న్యూఢిల్లీ: భార్యలను వదిలేసిన, కట్నం కోసం వేధించిన ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధిత మహిళల తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వెజ్ సోమవారం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎస్.రామసుబ్రమణియన్ల ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై తాము వేరుగా పిటిషన్ వేశామనీ, దీనిపై న్యాయస్థానానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవాసీ లీగల్ సెల్ తరఫున సంజయ్ హెగ్డే పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..ఈ పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం బదులిచ్చినట్లు కూడా ధర్మాసనం తెలిపింది. కట్నం కోసం వేధించిన, భార్యలను వదిలివెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేరుగా ఉంటున్న తమ భర్తలను అరెస్టు చేయాలనీ, ఈ విషయంలో విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా తమకు సాయం అందించాలని వారు తమ పిటిషన్లలో అభ్యర్థించారు. ఇటువంటి కేసుల్లో సదరు భర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయాలంటూ వారి తరఫు న్యాయవాది సత్య మిత్ర కోరారు. ‘ఇటువంటి కేసుల్లో సదరు ఎన్నారై భర్తలు, న్యాయస్థానానికి హాజరు కాకుండా తప్పించుకోవడం, భారత్కు తిరిగి రాకపోవడం జరుగుతున్నాయి. ఈ విషయంలో వారి పాస్పోర్టు లను స్వాధీనం చేసుకుని, స్వదేశానికి రప్పించేం దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లలో కోరారు. ఇందుకోసం బాధితుల పక్షాన మానవీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. -
కొత్త సీజేఐ పేరును సూచించండి
-
కొత్త సీజేఐ పేరును సూచించండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో నెల రోజులే ఆయన పదవిలో ఉంటారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుందో మీరే సూచించాలని జస్టిస్ బాబ్డేను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ బాబ్డేకు ఒక లేఖ పంపారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా ఎంపికైనట్లే. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. ఒకవేళ సీనియర్ మోస్ట్ జడ్జి ఈ పోస్టుకు అర్హుడు కాడని భావిస్తే.. ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, ఒకరి పేరును ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ అత్యంత సీనియర్. 2022 ఆగస్టు 26 వరకూ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ కాలం ఉంది. -
సుప్రీం కొలీజియం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది. అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. -
పెళ్లి చేసుకోమని చెప్పలేదు: ఎస్ఏ బాబ్డే
న్యూఢిల్లీ: ‘‘మహిళలు అంటే మాకు చాలా గౌరవం.. వారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే. గతవారం ఓ అత్యాచార నిందితుడి బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు.. ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఈ క్రమంలో అనేక మంది మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రముఖ పౌరులు, మేధావులు, రచయితలు, కళాకారులు చీఫ్ జస్టిస్ బొబ్డేకు క్షమాపణ చెప్పాలని.. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగాలని కోరుతూ 5,000 మందికి పైగా ప్రజలు పిటిషన్లో సంతకం చేశారు. ఈ క్రమంలో వీటిపై ఎస్ ఏ బాబ్డే స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మేం నిందితుడిని ‘‘నీవు పెళ్లి చేసుకోబోతున్నావా’’ అని మాత్రమే ప్రశ్నించాము. అంతేతప్ప ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకో.. లేదంటే జైలుకెళ్తావ్’’ అని చెప్పలేదు. అలా ఎన్నిటికి చెప్పం. కోర్టు వ్యాఖ్యలని వక్రీకరించారు. ఈ సంస్థ, ముఖ్యంగా ఈ బెంచ్, స్త్రీత్వం పట్ల అత్యధిక గౌరవం కలిగి ఉంది’’ అని తెలిపారు. చదవండి: పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?: సుప్రీంకోర్టు వాళ్లిద్దరి మధ్య శృంగారాన్ని రేప్ అంటారా: సుప్రీం -
చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం ఎలా?
న్యూఢిల్లీ: కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన చెక్బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం ఎలా అన్న అంశంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల సభ్యులు, సెక్రటరీలు, అధికారుల పేర్లను గురువారంనాటికి తెలియజేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, ఆర్. రవీంద్ర భట్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అడిషినల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్జిత్ బెనర్జీని ఆదేశించింది. వివిధ మంత్రిత్వశాఖల సెక్రటరీలు, అధికారులు, సంబంధిత వర్గాలతో చెక్బౌన్స్ కేసుల సత్వర పరిష్కార అంశంపై చర్చించాల్సి ఉందని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు పేర్కొనడంతో, అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. 35 లక్షల పెండింగ్ కేసులు... నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ (ఎన్ఐ యాక్ట్) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని ఫిబ్రవరి 25వ తేదీన సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు తిరిగి బుధవారం ధర్మాసనం ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్ఐ యాక్ట్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో ధర్మాసనం ఈ అంశంపై దృష్టి పెట్టింది. 247వ అధికరణ కింద (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్ఐ యాక్ట్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వారం రోజుల్లో తెలియజేయాలని ధర్మాసనం గత నెల 25న అడిషినల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్జిత్ బెనర్జీని ఆదేశించింది. చెక్బౌన్స్లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యం లో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. -
లైంగిక వేధింపుల కేసు: గొగోయ్కి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన మీద నమోదైన సుమోటో లైంగిక వేధింపుల కేసును గురువారం సుప్రీం కోర్టు క్లోజ్ చేసింది. రంజన్ గొగోయ్పై నమోదైన కేసులో కుట్ర కోణం ఉండవచ్చని అనుమానించిన కోర్టు ఇలా చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. జస్టిస్ పట్నాయక్ కమిటీ, సీజేఐ ఎస్ఏ బాబ్డేల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. గొగోయ్పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ నివేదిక మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి ఉత్తర్వుల ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలు ఆయనపై కుట్రను ప్రేరేపించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ గొగోయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉందని పట్నాయక్ కమిటీ నివేదిక స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ పొందలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఎన్ఆర్సీ లాంటి కేసుల్లో జస్టిస్ గొగోయ్ ఇచ్చిన తీర్పులపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రంజన్ గొగోయ్ కొన్ని కఠినమైన పరిపాలనా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ గొగోయ్పై వచ్చిన ఆరోపణలు విచారణర్హం కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలను చేసినట్టు మేం అభిప్రాయపడ్డాం.. సుమోటాగా స్వీకరించిన ఈ కేసును మూసివేస్తున్నామని’’ కోర్టు స్పష్టం చేసింది. చదవండి: జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే యంత్రాంగమే ఎదుర్కోగలదు -
జస్టిస్ రాకేష్ జడ్జిమెంట్పై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, అమరావతి : మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. పదవీ విరణమణకు ఒక్కరోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ రాకేష్ తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. ఆ తర్వాత అవి వ్యక్తిగత అభిప్రాయాలుగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్ 31న జస్టిస్ రాకేష్ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ అప్పీల్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ గతంలోనే న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. -
సడలని రైతుల ఆత్మస్థైర్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎముకలు కొరికే చలి, అకాల వర్షాలు కురుస్తున్నా ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఏమాత్రం వెనకడుగు పడే పరిస్థితులు కనిపించట్లేదు. నాలుగు రోజులుగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనను విరమిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విపరీతమైన చలిని సైతం తట్టుకుంటూ వర్షం నుంచి తప్పించుకొనేం దుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారమే జరగాల్సిన ట్రాక్టర్ల ర్యాలీ వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. 26న ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ను కచ్చితంగా నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. ఈ ట్రాక్టర్ మార్చ్లో సుమారు 20 వేల మంది పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రామ్రాజీ ధుల్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న ఈ ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనేందుకు çపంజాబ్, హరియాణాల్లోని వేలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు మరిన్ని ట్రాక్టర్లను సమకూర్చుకునేందుకు రైతు నేతలు ప్రయత్నిస్తున్నారు. చర్చలపై, రైతుల సమస్యలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ విమర్శించింది. రేవారి వద్ద ఉన్న నిరసనకారులు, స్థానికుల మధ్య వివాదం సృష్టించేందుకు హర్యానా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో తమ పశువులను సైతం నిరసన స్థలికి తీసుకు వచ్చేందుకు వందలాదిమంది రైతులు సన్నాహాలు చేస్తున్నారు. చర్చలు జరగాలన్నదే మా ఆకాంక్ష: సుప్రీం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళన విషయంలో పురోగతి లేదని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య చర్చలు జరగాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పూ, పురోగతి కనిపించడం లేదని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని, త్వరలో సమస్యకు పరిష్కారం లభించే అవకాశముందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.చర్చలను కొనసాగించాలని ఈ సందర్బంగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ ప్రకటించారు. -
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ఈ రోస్టర్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ కొత్త రోస్టర్ ప్రకారం.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను, లెటర్ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మరో ఏడుగురు న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆరు నుంచి ఏడు ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేసులను సీజేఐ విచారిస్తారు. ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యూడీషియల్ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్ సంబంధిత కేసులను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుంది. -
నా సూచనలు సీజేఐకి మెయిల్ చేశా: ఉండవల్లి
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్లో చూపించాలని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు. జగన్ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్ కుమార్ తెలిపారు. -
రేవంత్ పిటిషన్ అశోక్ భూషణ్ బెంచ్కు బదిలీ
ఢిల్లీ : తెలంగాణ సచివాలయం కూల్చివేత పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డె నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణం లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చివేతను అర్దరాత్రి చేపట్టారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త సచివాలయం కోసం కూల్చివేత చేపట్టారు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం అని పిటిషన్లో తెలిపారు. తాజగా గురువారం కేసు విచారణ సందర్భంగా సచివాలయం నిర్మాణాల కూల్చివేత పూర్తయిందా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పులో అభ్యంతరం ఏముందని రేవంత్రెడ్డి తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ను ప్రశ్నించారు. (చదవండి : తెలంగాణ వర్షాలపై స్పందించిన యూవీ) దీనికి సమాధానంగా సచివాలయం కూల్చివేత అనేది నూతన సచివాలయం నిర్మాణానికి సన్నద్దం చేయడమా కాదా అన్నది తేల్చాల్సి ఉందని శ్రావణ్ కుమార్ వివరించారు. అయితే కేసు విచారణ యోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చునని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పు ఇచ్చినందు వల్ల రేవంత్ రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని తుషార్ మెహతా వెల్లడించారు. సచివాలయం అంశంపై గతంలో జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ విచారణ జరపడంతో.. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అదే బెంచ్ కు బదిలీ చేస్తామని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ ప్రతిపాదనను తుషార్ మెహతా వ్యతిరేకించారు. కేసు విచారణ యోగ్యమైనది కాదు కాబట్టి బదిలీ అవసరంలేదని వాదించారు. దీనికి అంగీకరించని చీఫ్ జస్టిస్ బెంచ్ రేవంత్ రెడ్డి కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 26న జరిగే అవకాశం ఉంది. -
వారి కోసం 14న నీట్ నిర్వహణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా, కంటైన్మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల నీట్ రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి నీట్కు అనుమతి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాలను ఈ నెల 16వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీన పరీక్షకు హాజరుకావొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 16వ తేదీన ఏ సమయానికి నీట్ ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్లతోపాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది. -
ఆంధ్రప్రదేశ్లో పెద్ద కథ నడుస్తోంది..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డేకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు ప్రముఖులు ట్విటర్ ద్వారా ఇలా స్పందించారు. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్) సీఎం వర్సెస్ సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డేకు లేఖ రాశారు. - బార్ అండ్ బెంచ్ [CM vs Supreme Court Judge] Andhra Pradesh Chief Minister YS Jagan Reddy writes to CJI SA Bobde. Complains that Justice NV Ramana is influencing the sittings of Andhra Pradesh High Court. @ysjagan @AndhraPradeshCM @JaiTDP pic.twitter.com/XYrdBTdWwK — Bar & Bench (@barandbench) October 10, 2020 ఇప్పుడు స్పష్టం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారాలు బహిర్గతం చేసినప్పటి నుంచి ఆయన సన్నిహితుడైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారని ఇప్పుడు స్పష్టమైందని జగన్ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆరోపించారు. - పాయల్ మెహతా ఏపీలో పెద్ద కథ.. ఆంధ్రప్రదేశ్లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ కుటుంబ అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపించారు. ఈ కథను నివేదించకుండా హైకోర్టు ఒక వింత గాగ్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ దీనిని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - రాజ్దీప్ సర్దేశాయ్ Big story is brewing in Andhra: a CM has directly accused next SC chief justice’s family of corruption. So far there has been a strange HC gag order on reporting this story! Now @ysjagan seems to have decided to take the battle to the public and the SC! Watch this space! pic.twitter.com/LH0k60p14S — Rajdeep Sardesai (@sardesairajdeep) October 10, 2020 ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర : హిందుస్తాన్ టైమ్స్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, కూల్చి వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాష్ట్ర హైకోర్టు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఆరోపించిందని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ఆ పత్రిక వెబ్సైట్లో పూర్తి వివరాలతో ఓ కథనం ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. (అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట) జస్టిస్ రమణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు. ఎన్వీ రమణ గతంలో టీడీపీ ప్రభుత్వానికి న్యాయ సలహాదారు, అదనపు అడ్వకేట్ జనరల్ అని ఆ లేఖలో వివరించారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసం అవినీతి వ్యవహారాలపై తొలి దశలోనే దర్యాప్తులు జరగకుండా స్టే ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడం సహా తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వరుస తీర్పులు ఇచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. వివిధ దశల్లో దాదాపు 30 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో (పిల్) ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నారని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన వెంటనే, జస్టిస్ రమణ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభించారని ఆరోపించారు. జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి రమేష్, జస్టిస్ కె.లలిత, మరికొంత న్యాయమూర్తులు టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించేలా తీర్పులిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రకటనతో పాటు సీఎం రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ కల్లం శనివారం ఆలస్యంగా మీడియాకు విడుదల చేశారు. (జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది
-
ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది. ఎందుకంటే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయి. ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయి. ఇక చిన్న చిన్న కేసుల్లో సైతం తీర్పుల సంగతలా ఉంచితే... రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్వీర్యమైపోయిందన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. వెంటనే ఓ వర్గం మీడియాలో అవన్నీ విపరీతమైన ప్రాధాన్యంతో ప్రసారమౌతూ అచ్చయిపోతున్నాయి. ఎందుకిలా అవుతోందని ఆరా తీసిన ప్రభుత్వం... అవన్నీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యంతో జరుగుతున్నాయని తెలుసుకుని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేకు అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్ ఎన్.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. గతంలో ఓ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం... అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని... కింద సంతకాలు మాత్రమే మారాయని... ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం పేర్కొన్నారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్ వివరించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలియజేశారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) సీజేఐకి లేఖ, ధ్రువపత్రాలు కూడా... అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్ సబ్కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్ చేశాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఇవన్నీ జస్టిస్ ఎన్.వి.రమణకు, టీడీపీ అధిపతి నారా చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధాన్ని, టీడీపీ నేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టేవే. ఇక జస్టిస్ ఎన్.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు’’ అని కల్లం వివరించారు. మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది... ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు. టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. హైకోర్టు ఉత్తర్వులివీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని వాస్తవాలు ఇవీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం సీజేకు అనుబంధ పత్రాలు అందజేశారు.. దానిలోని అంశాలు చూస్తే.. చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఆ ప్రభావం ఈ విధంగా ఉంది. ► చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్ రోస్టర్ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి.రమేశ్ తదితరులు ఉన్నారు. ► న్యాయంవైపు లేకుండా ఉన్న, హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్ను అనుమతించే దిశగా ప్రభావం. ► కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభావం టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించిన ప్రత్యేక సందర్భాలు అమరావతి ల్యాండ్ స్కామ్ : అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కె. లలిత జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి. జస్టిస్ డి.రమేష్ జస్టిస్ రమేష్ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఇలా ఉంది.. ► రమేష్ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు. సత్యనారాయణ మూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుం జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ► ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కౌంటర్ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. ► మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు. జస్టిస్ డి.సోమయాజులు ► పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు. విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది. ► కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా ‘ఎల్లో పిల్స్’ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడానికి కారణమయ్యాయి. ముందుగా ఆయా అంశాలపై ఈ రెండు మీడియా సంస్థలు కథనాలు ఇవ్వడంతోపాటు చర్చలు నిర్వహిస్తాయి. ఇలా జరిగిన కొద్ది రోజులకే వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిల్స్ దాఖలు అవుతాయి. వీటిలో కొన్ని.. జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పిల్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆగస్టు 15న ఒక కథనం ప్రచురించింది. అదే రోజు ఆ కథనాన్ని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఖండించారు. ఆ పత్రిక రాసింది తప్పుడు కథనమని హైకోర్టు రిజిస్ట్రార్కు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే అంటే ఆగస్టు 17న హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి ప్రామాణికత లేని ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో విచిత్రమేమిటంటే.. అటు హైకోర్టు.. ఇటు చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. విశాఖలో టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విశాఖలో బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి టీడీపీని అనుమతించకపోవడానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ వెళ్లడానికి చంద్రబాబును ప్రభుత్వం అనుమతించని ఒక రోజు తర్వాత, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఆయనకు నోటీసు జారీ చేసి అరెస్టు చేశాక ఈ పిల్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై కోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఒక నాయకుడు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని, భౌతికదూరాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిల్ను దాఖలు చేశారు. విచారణ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘనలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ రెండు పిల్స్ను కలిపి విచారించిన హైకోర్టు దీనికి సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొంది. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. 1. గ్రామ పంచాయతీ కార్యాలయాల అధికార పార్టీ జెండా రంగులేస్తోందని పిల్స్ 2. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై పిల్ 3. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరెన్నో అంశాలకు సంబంధించి రిట్ పిటిషన్లు 4. జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెన్షన్కు గురైన న్యాయాధికారి రామకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణపై హైకోర్టు నేరుగా విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని జస్టిస్ రవీంద్రన్ను కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టుపై కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే విచారణ బాధ్యతలను రవీంద్రన్కు అప్పగించింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
సుప్రీంలో ‘కొత్త రోస్టర్’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్), లెటర్ పిటిషన్లు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు విచారించనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేసుల విచారణ విషయంలో కొత్త రోస్టర్ ఆఫ్ అసైన్మెంట్ను రూపొందించారు. నూతన రోస్టర్ విధానం ఈ నెల ఐదో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది నవంబర్ 29న విడుదల చేసిన రోస్టర్ ప్రకారం.. ఇలాంటి పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. -
ఆ తీర్పుపై స్పష్టత అవసరం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు విషయంలో ఐదుగురు జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్పష్టత అవసరమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పులోని కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ దీనికి సంబంధించి నా మదిలో అనేక ప్రశ్నలు మెదలుతున్నాయి. ఈ విషయం గురించి నా సహోదరుల(న్యాయమూర్తులు)తో చర్చించాల్సి ఉంది. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు గందరగోళం సృష్టించేదిగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ 2014 జనవరి ఒకటిలోగా పూర్తయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనిపై మళ్లీ వివాదం సృష్టించడం చెల్లదని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏడాది మార్చి 6న తీర్పు వెలువరించింది. దీనిపై బాధితులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.(చదవండి: మారటోరియం... 3 రోజుల్లో ‘కేంద్రం’ నిర్ణయం..!) -
జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే
న్యూఢిల్లీ: అవాకులు చెవాకులు అర్థం పర్థం లేని నిందలు మోపుతూ చేసే సోషల్ మీడియా పోస్టింగులతో జడ్జీలూ బాధితులుగా మారుతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులకు జడ్జీలెవరూ స్పందించకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. జడ్జీలందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని భావించడం సరైంది కాదన్నారు. ఇతర వ్యక్తుల కంటే జడ్జీల జీవితాలు ఏమంత మెరుగ్గా ఉండవని, ఒక్కోసారి కుటుంబ సభ్యులూ త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీల వ్యక్తిగత లబ్ధి కోసమని కాకుండా, మొత్తం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టింగులు చేసి రూ.1 జరిమానా కట్టిన నేపథ్యంలో జడ్జీలు ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత్రి జస్టిస్‡ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు. -
ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్ దోషే
న్యూఢిల్లీ: న్యాయవాది ప్రశాంత్ భూషణ్కి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థపైనే ప్రశాంత్ భూషణ్ వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని అవన్నీ దేశ గౌరవాన్నే దెబ్బ తీసేలా ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసు నుంచి ట్విట్టర్కి విముక్తి కల్పించింది. ‘నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయస్థానాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పెట్టని గోడలు’ అని ధర్మాసనం అభివర్ణించింది. రాజ్యాంగానికి మూలస్తంభమైన అత్యున్నత న్యాయస్థానంపై ప్రశాంత్ భూషణ్ దాడికి దిగారని, అది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ ఏమని ట్వీట్ చేశారంటే ..? ప్రశాంత్ భూషణ్ జూన్ 27న చేసిన ట్వీట్లో దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే దీనికి కారణమన్నారు. రెండో ట్వీట్లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఎలాంటి మాస్క్, హెల్మెట్ ధరించకుండా నాగపూర్లోని రాజ్భవన్లో బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల బైక్ని నడుపుతున్నారని, లాక్డౌన్ అంటూ జనం సమస్యల్ని ప్రత్యక్షంగా విచారించడానికి నిరాకరిస్తూ హెల్మెట్ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ఆ ట్వీట్లో ప్రశ్నించారు. -
ప్రశాంత్ భూషణ్కి షాకిచ్చిన సుప్రీం కోర్టు!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులేనంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2009లో ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాక ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రశాంత్ భూషణ్ తండ్రి, సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్ కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత కోర్టు భౌతిక విచారణ ప్రారంభమైనప్పుడు ఈ కేసును విచారించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. (రామోజీరావుకు సుప్రీం నోటీసులు) 2009లో తెహల్కా మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్ ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులే ఉన్నారంటూ ఆరోపించారు. ఈ కేసుతో పాటు న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై నమోదైన మరో కోర్టు ధిక్కరణ కేసును కూడా సుప్రీంకోర్టు విచారిస్తున్నది. చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేపై ప్రశాంత్ భూషణ్ ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద రీతిలో కామెంట్ చేశారు. బాబ్డే బైక్ తొలడాన్ని తప్పుపడుతూ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛకు, కోర్టు ధిక్కరణకు స్వల్ప తేడా ఉన్నట్లు సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. (మాల్యా కేసు : సంచలన ట్విస్టు) ఈ క్రమంలో ‘16 మంది ప్రధాన న్యాయమూర్తులు అవినీతిపరులంటూ నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరు ఇబ్బందిపడ్డా.. వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగినా అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ ప్రశాంత్ భూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచురించిన సీనియర్ జర్నలిస్టు తరుణ్ తేజ్పాల్ కూడా క్షమాపణలు చెప్పారు. -
సుప్రీంకోర్టుకు మేధావుల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుపైనే కాక ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై కోర్టు ధిక్కరణ విచారణను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టుకు మేధావుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 131 మంది మేధావులు లేఖ రాశారు. వీరిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకుర్ కూడా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల పక్షాన పనిచేస్తున్న ప్రశాంత్ భూషణ్పై కోర్టు ధిక్కరణ చర్యలు సరి కావని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రతిష్ట, న్యాయవ్యవస్థ నిష్పక్షపాత వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఆయనపై చర్యలను నిలిపివేయాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. (బాకీలపై మరో మాట లేదు..) వారం రోజుల క్రితం ప్రశాంత్ భూషణ్ దేశంలో గత ఆరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కీలక పాత్ర పోషించారని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక ప్రస్తుత సీజేఐ ఎస్ ఏ బాబ్డే ఆ మధ్య హార్లే డేవిడ్ సన్ బైక్ని నడిపారని.. ఆ సమయంలో హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారంటూ మరో ట్వీట్ చేశారు. కోర్టు లాక్డౌన్లో ఉండగా ఒక చీఫ్ జస్టిస్ ఇలా చేయవచ్చా అని ప్రశ్నించారు. దాంతో ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (బ్యాట్ పట్టిన సీజే బాబ్డే.. టాప్ స్కోరర్) -
సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ యు.యు.లలిత్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతనంగా చేరారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ కొలీజియం ఐదో సభ్యుడయ్యారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు. అత్యున్నత న్యాయ స్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి, ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదిస్తుంది. జస్టిస్ లలిత్ కొలీజియంలో 2022లో పదవీ విరమణ చేసే వరకు కొనసాగుతారు. -
ప్రజల్లేకుండానే రథయాత్ర
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథోత్సవం నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరాదని షరతు విధించింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి రికార్డును పరిగణనలోకి తీసుకున్నాం. అదే జాగ్రత్త, అప్రమత్తతను రథయాత్ర విషయంలోనూ కనబరుస్తారని ఆశిస్తున్నాం. 18, 19వ శతాబ్దంలో ప్రబలిన ప్లేగు, కలరా ఇలాంటి ఉత్సవం వల్లే ప్రబలిందని మనకు చరిత్ర చెబుతోంది. దానిని దృష్టిలో ఉంచుకునే 18వ తేదీ నాటి తీర్పులో ఈ ఉత్సవంపై స్టే విధించాం. యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోకుంటే అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదముంది’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ఒడిశాలోని పూరీ యాత్రపైనే తప్ప, ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కాదని పేర్కొంది. గతంలో విధించిన స్టేను ఎత్తేయాలంటూ జగన్నాథ్ సంస్కృతి జన జాగరణ మంచ్, బీజేపీ నేత సంబిత్ మహాపాత్ర తదితరులు పిటిషన్లు వేయడం తెల్సిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బొపన్నల బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నాగ్పూర్లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు సహకారంతో ప్రజారోగ్యంపై ఏ మాత్రం రాజీపడకుండా రథ యాత్రను చేపడతామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ హామీ ఇచ్చారు. కేంద్రం, ఆలయ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రథయాత్రను నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర 10 నుంచి 12 రోజుల పాటు కొనసాగనుంది. సుప్రీంకోర్టు నిబంధనలివీ ► రథయాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలి. ► ప్రజలు ఇళ్లలోంచి బయటకురావద్దు ► ఒక్కో రథాన్ని 500 మంది (పోలీసులు, సిబ్బంది కలిపి) మాత్రమే లాగాలి. ► ఒక్కో రథం గంట సమయం తేడాతో ముందుకు కదలాలి. ► నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేయాలి. ► తీర్పు వెలువడిన సోమవారం రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ అమలు. ► వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమం కవరయ్యేలా మీడియాకు అనుమతి. ► రథాన్ని లాగే వారందరికీ కరోనాæ పరీక్షలు చేయాలి. రథయాత్రకు ముందు, రథయాత్ర సమయంలో, తర్వాతా వారు భౌతిక దూరం పాటించాలి. వారందరి ఆరోగ్య రికార్డులను నిర్వహించాలి. -
జగన్నాథుడి రథయాత్ర నిలిపివేత
న్యూఢిల్లీ/భువనేశ్వర్: జూన్ 23న ప్రారంభం కానున్న చారిత్రక పూరి జగన్నాథ్ రథయాత్ర, దాని అనుబంధ కార్యకలాపాలను కోవిడ్ కారణంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘ఒక వేళ రథయాత్ర జరిపితే జగన్నాథుడు మనల్ని క్షమించడు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఏడాది ఒడిశాలోని పూరిలో రథయాత్రకు అనుమతించడం లేదని చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. రథయాత్రకు అనుమతిస్తే ఆ దేవుడు క్షమించడని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తి కారణంగా పూరీసహా రాష్ట్రంలో మరెక్కడా రథయాత్రలు నిర్వహించకుండా కట్టడిచేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి రథయాత్రకు అనుమతిస్తే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడతారనీ, ఈ కరోనా సమయంలో ఇది అత్యంత ప్రమాదకరమని వాదించారు. ఇది చాలా సీరియస్ అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించేందుకు రేపటి వరకు సమయం కావాలని కోర్టును కోరారు. అయితే ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం జూన్ 30 వరకు ఎక్కువమంది ప్రజలు ఒక చోట హాజరు కాకూడదని ప్రకటించింది. ఎట్టకేలకు జూన్ 23న ప్రారంభం కానున్న రథయాత్రను కోర్టు నిలిపివేసింది. -
15 రోజుల్లోగా పంపేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్ళే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని కోరింది. అందుకు ఈ సమయం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల తరలింపు, వారి పేర్ల నమోదు, ఉపాధి అవకాశాల కల్పన సహా అన్నింటిపైనా జూన్ 9న ఆదేశాలివ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. వలస కార్మికుల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు గతంలో ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికుల నుంచి బస్సుల్లోగానీ, రైళ్ళలోగానీ చార్జీలు వసూలు చేయరాదనీ, వారికి ఉచితంగా భోజనసదుపాయం కల్పించాలనీ సుప్రీంకోర్టు మే 28న ఆదేశించింది. తీర్పుని రిజర్వులో ఉంచిన కోర్టు, కోవిడ్ కారణంగా లాక్డౌన్తో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కే.కౌల్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం కోరింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్త పథకాలు రూపకల్పన చేయాలని సూచించింది. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు జూన్ 3వ తేదీ వరకు 4,200 శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడిపినట్టు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చామనీ, 41 లక్షల మందిని బస్సుల ద్వారానూ, 57 లక్షల మందిని రైళ్ళ ద్వారా తరలించినట్టు మెహతా పేర్కొన్నారు. వలస కార్మికులకోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక రైళ్ళను నడిపినట్టు వెల్లడించారు. ఇంకా ఎంత మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు ఎన్ని రైళ్ళు అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. ఇకముందు కూడా వలస కార్మికుల అవసరాన్ని బట్టి వారిని తరలించేందుకు రైళ్ళు నడుపుతామని కోర్టుకి హామీ ఇచ్చారు. జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం కల్పించుకొని వలస కార్మికుల ప్రయోజనం కోసం చేపట్టాల్సిన కొన్ని చర్యలను వివరించింది. మొత్తం 22 లక్షల మందిలో ఇంకా 2.5 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే తరలించాల్సి ఉందని గుజరాత్ పేర్కొంది. ఇంకా ఢిల్లీలో 2 లక్షల మంది వలస కార్మికులుండగా 10 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి 5.50 లక్షల మంది వలస కార్మికులను తమ రాష్ట్రానికి చేర్చినట్టు ఉత్తరప్రదేశ్ విన్నవించింది. రాజస్తాన్ నుంచి 6 లక్షల మందిని, మహారాష్ట్ర నుంచి 11 లక్షల మందిని తరలించారు, ఇంకా 38 వేల మందిని తరలించాల్సి ఉంది. 28 లక్షల మంది బిహార్కి తిరిగి వచ్చినట్టు ఆ రాష్ట్రం పేర్కొంది. కోవిడ్కు ఉచిత చికిత్స చేస్తారా? ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’కింద కోవిడ్ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. దేశంలోని పేద, అట్టడుగు వర్గాల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ భారత్ని ప్రవేశపెట్టారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్–19 రోగులకు ఉచిత చికిత్సనందించాలని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్ల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లు కొందరికైనా ఉచిత చికిత్సనందించలేవా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, అవే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్ దారుడు, న్యాయవాది సచిన్ జైన్ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారించనుంది. ప్రైవేటులో కరోనా చికిత్స ఖర్చుకు పరిమితి విధించండి! ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై వారంలోగా స్పందించాలని జస్టిస్ అశోక్భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్దారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. -
తెల్లరంగు దుస్తులు ధరించండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల విచారణకు హాజరయ్యే లాయర్లు కోట్లు, నల్లరంగు పొడవైన గౌన్లు వేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు లాయర్లందరూ ఈ సూచనని పాటించాలని బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. లాయర్లు వేసుకొనే పొడవైన గౌన్ల ద్వారా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఈ గౌన్లు ధరించడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ‘వైద్యల సూచనలు, సలహాల మేరకు, కరోనాను కట్టడి చేయడానికి లాయర్లు, తెల్ల రంగు షర్టు, తెల్ల సల్వార్ కమీజ్, తెల్ల చీర, మెడచుట్టూ తెల్ల రంగు బ్యాండ్ ధరించాలి’ అని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వర్చువల్ సిస్టమ్ ద్వారా జరిగే విచారణకు హాజరయ్యే లాయర్లు తెల్ల రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు అందే వరకు కొత్త డ్రెస్ కోడ్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్గోవాంకర్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
యంత్రాంగమే ఎదుర్కోగలదు
న్యూఢిల్లీ: దేశంలో విపత్తులు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని కార్యనిర్వాహక వ్యవస్థే సమర్థంగా ఎదుర్కోగలదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. సంక్షోభాల్లో ‘ప్రజలు, ధనం, వస్తుసామగ్రి’ని ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవడం ఎలా అనేది యంత్రాంగమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లోనూ కోర్టులు పనిచేస్తాయనీ, యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా పౌరులకు అపాయం వాటిల్లినప్పుడు జోక్యం చేసుకుంటాయని సీజేఐ స్పష్టం చేశారు. -
‘కరోనా కంటే దాని వల్లే ఎక్కువ మరణాలు’
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కంటే.. అది సోకుతుందనే భయమే దేశంలో ఎక్కువ ప్రాణాలను బలితీసుకునేలా ఉందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహమ్మారి గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ఓ చానెల్ను ప్రారంభించి.. కరోనా వార్తలను నేరుగా ప్రజలకు చేరవేయాలని సూచించింది. అప్పుడే నకిలీ వార్తల ప్రవాహాన్ని అడ్డుకోగలుగుతామని అభిప్రాయపడింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వలసకూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతరత్రా అంశాల గురించి ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి వివరాలు సమర్పించారు.(కరోనా సంక్షోభం: విద్యుత్ టారిఫ్లు తగ్గింపు!) ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘వైరస్ కంటే ఎక్కువగా భయమే ప్రజలను చంపేలా కనిపిస్తోంది. కౌన్సిలర్ల అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు భజనలు, కీర్తనలు, నమాజ్ ఇంకా ఇతర మత ప్రార్థనలు, మత బోధకులతో ప్రజల మత విశ్వాసాలకు అనుసరించి వారిలో అవగాహన కల్పించండి’’అని సీజేఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన సాలిసిటర్ జనరల్.. 24 గంటల్లోగా.. శిక్షణ పొందిన కౌన్సిలర్లు, మౌలీలు, సాధువులను వలస కూలీల వద్దకు పంపించి వారిలో ఆత్మవిశ్వాసం నెలకొనేలా చేస్తామని సమాధానం ఇచ్చారు. గ్రామాల్లో కరోనా భయం తక్కువగానే ఉందని.. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులతో తమకు అంటువ్యాధి సోకుతుందని ప్రజలు భయపడుతున్నారన్నారు. అందుకే రహదారుల మీద పరిస్థితిని వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. వలసజీవుల కోసం తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకుంటూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా పరీక్షల నిమిత్తం ల్యాబ్ల సంఖ్యను 15,000కు పెంచామని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం వివరాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం కలిపి 21,064 పునరావాస క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
కరోనా వ్యాప్తి : సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సోమవారం సాయంత్రం 5.00 గంటలలోపు న్యాయవాదుల అన్ని చాంబర్లను సీల్ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వ్యక్తిగత వాదనలు ఉండవని స్పష్టం చేశారు. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతామని వెల్లడించారు. (లాక్డౌన్: ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి) న్యాయవాదులు తమ ఆఫీసులో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణకు హాజరుకావాలి సీజే సూచించారు. ఈ ఆదేశాలను ప్రతి వారం సమీక్షిస్తామని, కోర్టుహాల్లో న్యాయవాదులు వ్యక్తిగతంగా హాజరు కావద్దని తెలిపారు. కోర్టులోకి ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే ఐడీ కార్డులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీజే ప్రకటించారు. కాగా దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్న విషయ తెలిసిందే. ప్రజలంతా లాక్డౌన్ పాటించాలని కేంద్రం ఆదేశించింది. -
ఆరుగురు సుప్రీం జడ్జిలకు హెచ్1ఎన్1 వైరస్
సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ కేసులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆందోళన రేపుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక మైన హెచ్1ఎన్1 (స్వైన్ప్లూ) వైరస్ సోకింది. దీంతో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. స్వైన్ ప్లూ వ్యాప్తి చెందుతున్న వైనంపై సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) కోరామని తెలిపారు. అలాగే సుప్రీంకోర్టులో పనిచేసే వ్యక్తులపై టీకాలు వేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్తో కూడా సమావేశమయ్యారు. అనంతరం దేవ్ మాట్లాడాతూ వైరస్ వ్యాప్తిపై బాబ్డే చాలా ఆందోళన వ్యక్తం చేశారని, టీకాలు వేసేందుకు వీలుగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారన్నారు. కాగా కశ్మీర్, బెంగళూరు నగరాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు గాకా, తాజా కేసులతో ఈ వైరస్ ఢిల్లీ నగరానికి కూడా విస్తరించింది. బెంగళూరుకు చెందిన సాప్ ఇండియా సంస్థ తన ఉద్యోగుల్లో ఇద్దరికి హెచ్1ఎన్1 పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా అన్ని కార్యాలయాలను (శుభ్రపరిచేందుకు)మూసివేసింది. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. -
న్యాయవ్యవస్థ కృషి అమోఘం
న్యూఢిల్లీ: లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి ప్రసంగించారు. ‘లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సాధించడంలో భారత సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ చురుకైన, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసింది. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విశాఖ మార్గదర్శకాలు మొదలుకొని, సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్ పోస్టుల్లో నియమించేందుకు ఉద్దేశించిన పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు వరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశాన్ని ప్రగతిశీల సామాజిక పరివర్తన దిశగా తీసుకెళ్తున్నాయి’అని పేర్కొన్నారు. ‘దేశంలో భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడం హర్షణీయం. సామాన్యులకు న్యాయాన్ని సులభతరం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సంస్కరణలను తెచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పులు రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థ మరింత పటిష్టం చేశాయి. న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్న వివిధ లోపాలను గుర్తించి, సరిచేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన నిశ్శబ్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమతూకం సాధించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు అనేక దేశాల దృష్టిని ఆకర్షించాయి. సమాచార సాంకేతికాభివృద్ధి కారణంగా తలెత్తిన సమాచార పరిరక్షణ, గోప్యతా హక్కు వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంది’అని పేర్కొన్నారు. ‘లింగపరమైన న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణపై సమకాలీన దృక్పథాలు, మారుతున్న ప్రపంచంలో రాజ్యాంగానికి గతిశీల వ్యాఖ్యానం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమన్వయం, నేటి ఇంటర్నెట్ యుగంలో గోప్యతా హక్కు రక్షణ అనే ఐదు వేర్వేరు అంశాలు ప్రపంచ న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నిటిలోనూ లింగపరమైన న్యాయం అనే అంశమే ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రాధాన్యంగా ఉంది. పెరుగుతున్న ప్రజాకర్షక విధానాలపై గత దశాబ్దంలో రాజ్యాంగ విలువల ప్రాతిపదికన విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామం రాజ్యాంగాల మూలాలపై మరో చర్చకు తెరలేపింది’అని తెలిపారు. ప్రపంచవేగంగా, అనూహ్యంగా ఇటీవలి కాలంలో పరిణామం చెందుతూ వస్తోంది. దీనివల్ల న్యాయవ్యవస్థ మరింత క్రియాశీలకంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం, రాజీ మార్గాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తీర్పులను సత్వరం వెలువరించడంలో కోర్టులు చాలా ప్రగతిని సాధించాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే: సీజేఐ పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. ‘పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే. పర్యావరణ అంశాలను జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు అడ్డుకాజాలవు. భూమిపై మనిషి ఒక బీజంగా మాత్రమే కాదు, పరాన్నజీవిగా మారాడు. భూమికి ఇస్తున్న దానికంటే భూమి నుంచి మనిషి తీసుకునేదే ఎక్కువనే అభిప్రాయం ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒకే విధమైన అంతర్జాతీయ చట్టాలు అవసరం’అని సీజేఐ తెలిపారు. ‘దేశంలోని 103 కోట్ల ప్రజల హక్కులకు జవాబుదారీగా ఉంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్ష మేరకు తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో వివిధ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు. -
భయాలున్నా స్వాగతించారు!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన క్లిష్ట తీర్పులపై భయాందోళనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం దేశరాజధానిలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’ అంశంపై ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల మంది ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు’ అని అన్నారు. ఎంతో సున్నితమైన ‘అయోధ్య’, ‘ట్రిపుల్ తలాక్’ కేసు సహా వివిధ అంశాలపై ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం లేకుండా ఏ దేశం, ఏ సమాజం కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందజాలవన్నారు. తమ ప్రభుత్వం సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలను కల్పించేందుకు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతూకం ఉండేలా దేశ న్యాయవ్యవస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ వంటి వాటిని ప్రజలందరికీ మరింత వేగంగా న్యాయం అందించేందుకు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలంలో సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాయి. ఇలాంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నందుకు మనం గర్వపడాలి’ అని ప్రధాని చెప్పారు. పనికిరాని చట్టాలను రద్దు చేయడంతో పాటు సమాజ వికాసానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ కోర్టుల విధానం ద్వారా అన్ని కోర్టులను అనుసంధానించేందుకు, కోర్టు ప్రక్రియను సరళతరం చేసేందుకు నేషనల్ జ్యుడిషియర్ డేటాను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో 20కి పైగా దేశాల జడ్జీలు హాజరయ్యారు. సదస్సులో సీజేఐ జస్టిస్ బాబ్డే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రం మంత్రి రవిశంకర్æ, అటార్నీజనరల్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు. మన న్యాయవ్యవస్థకు 2వేల ఏళ్ల చరిత్ర: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ..‘మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లిష్ సంస్కృతుల సమ్మేళనమే భారత్ అని పేర్కొన్నారు. దేశంలో సాధారణ న్యాయ వ్యవస్థ 2 వేల ఏళ్లపాటు పరిణామం చెందుతూ వచ్చింది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ ఉండేవి. న్యాయాధికారుల సమక్షంలో బహిరంగంగానే విచారణ జరిగేది’అని తెలిపారు. అప్పట్లోని పరిస్థితులను సీజేఐ ప్రస్తావిస్తూ..ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు. తీర్పునిచ్చే గ్రామ పెద్ద.. కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు. దానిని బట్టి అప్పటికప్పుడు దోషి ఎవరనేది ధ్రువీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉండేది. అలాగే, ఎవరైనా వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పులి దంతాన్ని పట్టుకునే రివాజు ఉండేది. ఇలాంటివి మన సంప్రదాయాల్లో భిన్నత్వానికి ఉదాహరణలు’ అని తెలిపారు. ‘పెరుగుతున్న సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఫలితంగా నిర్ణయాల ప్రభావం సంబంధిత న్యాయస్థానం పరిధికి వెలుపలా ఉంటోంది’ అని అన్నారు. చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టాలి జస్టిస్ లావు నాగేశ్వరరావు చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా పరిణామం చెందుతూ ఉండాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘చట్టాలు పరిణామం చెందడం అతి ముఖ్యమైన అంశం. దేశ ప్రగతి, సామాజిక పరిస్థితులను ఈ చట్టాలు ప్రతిబింబింపజేస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు పరిణామం చెందనిపక్షంలో అది అన్యాయానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. ‘సమాజం, చట్టం మధ్య వారధిలా న్యాయమూర్తి పాత్ర ఉండాలి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా న్యాయస్థానాలు చట్టాలకు భాష్యాన్ని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జాగ్రత్త వహించాలి. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు ఓడిపోకూడదు..’ అని పేర్కొన్నారు. డెబ్బై ఏళ్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా న్యాయం వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆన్లైన్ డేటాకూ రక్షణ ఉండాలి వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. దీని వల్ల ఫోన్ సంభాషణలేకాదు, ఆన్లైన్ డేటాకు రక్షణ కల్పించాలి. జాతి అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారాలి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వివిధ న్యాయరీతులను అర్థం చేసుకుని, పాటించడం ద్వారా న్యాయ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎంతో కీలకమైన ప్రాథమిక విలువలు, లక్ష్యాలను సాధించేలా జడ్జీలు తీర్పులిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత 70 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు, చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు జడ్జీలిచ్చిన తీర్పులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాయి. జనాకర్షక నిర్ణయాలతో రాజ్యాంగ హక్కులు ప్రభావితం జస్టిస్ ఎన్.వి.రమణ జనాకర్షక నిర్ణయాలు రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేస్తాయని, న్యాయస్థానాలు ఈ సందర్భంలో సముచిత నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ భూమిపై శాంతి ఉండాలంటే మన జాతి, మన తెగ, మన తరగతి, మన దేశం వంటి వాటిపై మన విధేయతను అధిగమించాలని, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండాలని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన సూక్తిని జస్టిస్ రమణ ఉటంకించారు. ‘మహిళలు ప్రపంచ జనాభాలో సగం ఉన్నారు. మొత్తం ప్రపంచ పనిగంటల్లో మూడింట రెండో వంతు వారిదే. ప్రపంచ ఆదాయంలో పదో వంతు పొందుతారు. కానీ ప్రపంచ సంపదలో 0.01 శాతం కంటే తక్కువ సంపదను వారు కలిగి ఉన్నారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం ద్వారా గానీ, మరో విధానంలో గానీ లింగ సమానత్వాన్ని, మహిళల గౌరవాన్ని గుర్తించాలి. నిత్యం వివక్షకు గురవుతున్న మహిళల అభ్యున్నతిని.. చట్టంలో ఉన్నతమైన ప్రకటనలు చేయడం వల్ల ఉద్దరించలేమని మనం అందరం గ్రహించాం. లింగ సమానత్వాన్ని కాపాడేందుకు న్యాయ వ్యవస్థకు తగినతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లింగ సమానత్వం కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండరాదని మనం గ్రహించాలి..’ అని పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే చర్యలు కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే గొప్ప పనిగా మనం గ్రహించాలి’ అని అన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతు న్నందున ఈ టెక్నాలజీలో వ్యక్తమవుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. -
వ్యాజ్యాలకు ముందే మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ: వ్యాజ్యం దాఖలు కంటే ముందే మధ్యవర్తిత్వం జరిగేలా ‘తప్పనిసరి మధ్యవర్తిత్వ చట్టం’ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. ‘ప్రపంచీకరణలో మధ్యవర్తిత్వ పాత్ర’ అన్న అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సు మూడవ ఎడిషన్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యాజ్యం దాఖలుకు ముందే మధ్యవర్తిత్వం జరిగితే కోర్టు తీర్పుల నాణ్యత పెరుగుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన ‘ఆర్బిట్రరీ బార్’ భారత్లో తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి అనుభవంతో పాటు విషయ పరిజ్ఞానం కలిగిన లాయర్లు అవసరమవుతారని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యం, కామర్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిలో మధ్యవర్తిత్వం మౌలిక అంశమని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వాణిజ్యం జరుగుతున్న ఈ రోజుల్లో మధ్యవర్తిత్వం అత్యవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం కంటే రాజీ కుదర్చడం ఇంకా ఉత్తమమైనదని చెప్పారు. వాణిజ్య న్యాయస్థాన కోర్టుల చట్టం కూడా మధ్యవర్తిత్వం గురించి, సెటిల్మెంట్ గురించి చెప్పిందన్నారు. -
‘ధర్మ’ సందేహాలపై నిర్ణయం తీసుకుంటాం!
న్యూఢిల్లీ: ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు సిద్ధం చేస్తామని, తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ ప్రశ్నలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతిస్తూ తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఈ విస్తృత ధర్మాసనం ఏఏ అంశాలపై వాదనలు వినాలన్న అంశంపై కక్షిదారుల లాయర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఆ ధర్మ సందేహాలను తామే సిద్ధం చేస్తామని ప్రకటించింది. శబరిమలపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరవ తేదీ మహిళా వివక్షకు సంబంధించి సిద్ధం చేసే ప్రశ్నలతోపాటు, కాలావధికి సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులందరికీ అందజేస్తామని చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ఆధారంగా తాము మత స్వేచ్ఛ, మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం, పార్శీ మహిళలను పెళ్లి చేసుకున్న ఇతర మతస్తులకు పార్శీ ప్రార్థన స్థలాల్లో ప్రవేశంపై నిషేధం వంటి అంశాలపై ఒక న్యాయపరమైన విధానాన్ని అభివృద్ధి చేయనున్నామని బెంచ్ తెలిపింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యవయస్కులకూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ 2018 సెప్టెంబర్ 28న 4:1 మెజార్టీ తీర్పు ఇవ్వడం తెల్సిందే. -
విచారణకు 10 రోజులు చాలు
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో స్త్రీలపట్ల అనుసరిస్తోన్న వివక్షపై తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం 10 రోజుల వ్యవధిలో విచారణ పూర్తిచేయనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. పరిష్కరించాల్సిన సమస్యలు చట్టబద్ధమైనవి కనుక విచారణను ముగించేందుకు ఎక్కువ సమయం పట్టదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఈ విచారణ పదిరోజులకు మించి పట్టదనీ, ఎవరైనా కావాలనుకున్నా అంతకు మించిన సమయమివ్వలేము’అని జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ వెల్లడించింది. బెంచ్ పరిగణనలోనికి తీసుకునే ప్రశ్నలను ఖరారు చేయలేదని సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా వెల్లడించారు. అయితే ఈ న్యాయసంబంధిత ప్రశ్నలను సుప్రీంకోర్టు తయారుచేయవచ్చునని లా ఆఫీసర్ తెలిపారు. ముస్లిం మహిళల మసీదు ప్రవేశం, దావూదీ బోహ్రా ముస్లిం సమాజంలో స్త్రీల జననేంద్రియాలను తొలగించడం, పార్శీ స్త్రీలు పార్శీయేతర పురుషులను వివాహమాడడం లాంటి పలు అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది. -
సుప్రీంకోర్టుకు నిర్భయ దోషి.. టాప్ ప్రియారిటీ!
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అతడి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ సుప్రీంకోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే... విచారణ జాబితాలో ముఖేష్ పిటిషన్కు ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరి 1న ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న వ్యక్తి.. అభ్యర్థన టాప్ ప్రియారిటీ కలిగి ఉంటుంది. ఈ విషయంలో మీరు రిజిస్ట్రీని ఆశ్రయించండి’’ అని ఆయన న్యాయవాదికి సూచించారు. కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వారిని ఉరితీయాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టు ఆదేశాలు జారీచేసింది.(ఆ ముగ్గురికీ మరిన్ని అవకాశాలు ఉన్నాయా?) ఇక ఇప్పటికే ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న దోషులు.. వారికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే రివ్యూ పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసి భంగపడ్డారు. చివరి ప్రయత్నంగా ముఖేష్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరగా.. ఆయన దానిని తిరస్కరించారు. అయితే ఉరిశిక్ష తేదీ దగ్గరపడుతున్న వేళ్ల ముఖేష్ మరోసారి న్యాయస్థానం తలుపు తట్టాడు. ఆర్టికల్32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా శనివారం సుప్రీంకోర్టును కోరాడు. దీంతో అతడి అభ్యర్థన పరిశీలనను వేగవంతం చేస్తామని కోర్టు సోమవారం తెలిపింది.(‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!) ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి ‘ఆమెను నిర్భయ దోషులతో కలిపి ఉంచాలి’ -
‘ఎలక్టోరల్ బాండ్స్’పై స్టే ఇవ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులను అందించే ‘ఎలక్టోరల్ బాండ్స్’ పథకంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. 2018లో ప్రారంభమైన ఈ పథకంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర స్టే విధించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) అనే స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం విచారణ జరిపింది. స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నల్లధనాన్ని అధికార పార్టీకి అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకం మరింత దుర్వినియోగమయ్యే అవకాశముందని ఏడీఆర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకాన్ని అన్యాయంగా పునఃప్రారంభించారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కోసం 10 రోజుల పాటు బాండ్స్ అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
బ్యాట్ పట్టిన సీజే బాబ్డే.. టాప్ స్కోరర్
సాక్షి, ముంబై : ఆదివారం వచ్చిందంటే చాలు దగ్గరలోని మైదానంలో వాలిపోయి ఇష్టమైన ఆటలతో సరదాగా గడిపేయడానికి చాలామంది ఇష్టపడతారు. స్టాప్ట్వేర్ ఇంజనీర్ నుంచి సివిల్ ఇంజనీర్ వరకు వారాంతంలో కాలక్షేపం కోసం అంతోకొంత సమయం వెచ్చిస్తారా. దీనికి తానేమీ అతీతున్ని కాదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే సైతం మైదానంలో కాలుమోపారు. ఎప్పుడూ కేసులతో బిజీబిజీగా ఉండే సీజే.. ఆదివారం సరదాగా గడిపారు. రెండురోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వచ్చిన బాబ్డే సహచరులతో కలిసి క్రికెట్ ఆడారు. నాగపూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానం ఈ అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఆల్ జడ్జ్స్ ఎలెవన్,-హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలెవన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ను నిర్వహించారు. 15 ఓవర్ల ఈ మ్యాచ్లో ఆల్ జడ్జ్స్ జట్టు తరుఫున బరిలోకి దిగిన బాబ్డే 18 పరుగులతో రాణించి.. మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. మ్యాచ్ ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
పౌరసత్వం హక్కులకే కాదు.. బాధ్యతలకు కూడా..
నాగ్పూర్: పౌరసత్వం అనేది కేవలం హక్కుల కోసం మాత్రమే నిర్దేశించినది కాదని.. సమాజం పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సైతం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే పేర్కొన్నారు. రాష్ట్రసంత్ టుకడోజీ మహరాజ్ నాగ్పూర్ యూనివర్సిటీలో (ఆర్టీఎమ్ఎన్యూ) శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోని కొన్ని విద్యా సంస్థలు వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తిగత అనుభవంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో మేధాశక్తిని అభివృద్ధి చేయడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే విద్య ప్రాథమిక లక్ష్యమని అన్నారు. క్రమశిక్షణ విద్యలో భాగమని పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఇతరులను కలుపుకుపోవడం, అన్యోన్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సమాజం మన నుంచి ఏం కోరుకుంటుందో అలాంటి లక్షణాలు యువతలో పెంపొందేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ఏ వ్యక్తి అయినా కృషితోనే ఓ స్థాయికి చేరుకుంటారని.. ఆ స్థితికి చేరడానికి దోహదపడిన అంశాలను ఇతరులు సృష్టించారనేది గుర్తించాలని చెప్పారు. -
టాటాపై వాడియా కేసు వెనక్కి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశమేదీ తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో టాటా గ్రూప్ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ రతన్ టాటాతో పాటు టాటా సన్స్లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై 2018 డిసెంబర్ 15న ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ వాడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు. -
కోర్టుల్లో కృత్రిమ మేధ!
బెంగళూరు: కోర్టుల్లో విచారణను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేథను వాడాల్సిఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. శనివారం బెంగళూరులో ఆయన మాట్లాడారు. జడ్జిలు, లాయర్లు కేసుల్లో కొన్ని విషయాలను వెదుక్కునేందుకు సమయం వృథా కాకుండా కృత్రిమ మేథ సహాయం తీసుకోవాల్సి ఉందన్నారు. లాయర్లు, జడ్జిలకు ఉపయోగపడేందుకు మాత్రమే కృత్రిమ మేధ ఉంటుందని, జడ్జిల ప్రమేయం లేకుండా టెక్నాలజీ ద్వారా తీర్పులు వెలువడే అవకాశం లేదన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను తగ్గించే ప్రయత్నం కూడా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
దేశం కష్ట కాలంలో ఉంది
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగబద్ధమైందేనని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశం ప్రస్తుతం కష్ట సమయంలో ఉందనీ, హింసాయుత పరిస్థితులకు బదులుగా శాంతిని నెలకొల్పేందుకు కృషి జరగాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సీఏఏ రాజ్యాంగబద్ధమైందేనంటూ ప్రకటించాలని దాఖలైన పిటిషన్ను సీజేఐ జస్టిస్ బాబ్డే, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ విచారించింది. సీఏఏ విషయంలో జోక్యం చేసుకుని, ఈ చట్టం రాజ్యాంగ బద్ధమయిందేనని ప్రకటించాలని, దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలంటూ పిటిషనర్ తరపు లాయర్ వినీత్ ధండా కోరారు. రాజకీయ నేతల కారణంగా చట్టంపై ప్రజల్లో ఏర్పడిన సందిగ్ధాన్ని తొలగించేందుకు కోర్టు సాయపడాలన్నారు. స్పందించిన ధర్మాసనం.. సీఏఏకు అనుకూలంగా వచ్చిన ఈ పిటిషన్పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం హింసాయుత ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ముందుగా శాంతియుత వాతావరణం ఏర్పడాలి. ఒక చట్టం చట్టబద్ధతను కోర్టులు నిర్ణయించగలవే తప్ప, అవి రాజ్యాంగబద్ధమని ప్రకటించజాలవు. కానీ, సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముందుగా విచారణ చేపడతాం’అని పేర్కొంది. సీఏఏ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను 22వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. -
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి!
న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్కు, మైనారిటీల జాతీయ కమిషన్కు, భారత రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది. -
కోర్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత?
న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలను నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక తరగతికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ నిర్ణయం తరువాత ప్రత్యేక సీఐఎస్ఎఫ్ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సూర్యకాంత్లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. -
రాజ్యాంగ బద్ధతపై విచారిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) రాజ్యాంగ బద్ధతపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ల్లో మతపరమైన వేధింపులను ఎదుర్కొని డిసెంబర్ 31, 2004లోపు భారత్కు వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్, జైన్, పార్శీ, బౌద్ధ మతస్తులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అనంతరం, చట్టం రాజ్యాంగబద్ధతపై విచారణ జరుపుతామని పేర్కొంది. వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించాలని విచారణ సందర్భంగా న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ చేసిన సూచనను ధర్మాసనం సమర్థించింది. ‘చట్టం లక్ష్యాలను, నియమనిబంధనలను, చట్టంలోని కీలకాంశాలను ప్రజలకు వివరించండి. అందుకు దృశ్య, శ్రవణ మాధ్యమాలను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించండి’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ఆదేశించింది. అందుకు వేణుగోపాల్ అంగీకరించారు. చట్టం అమలును అడ్డుకోవాలని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనాన్ని కోరారు. అస్సాం ఆందోళనల్లో ఐదుగురు విద్యార్థులు చనిపోయారన్నారు. అయితే, నోటిఫై చేసిన తరువాత చట్టంపై స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత తీర్పులను ప్రస్తావిస్తూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, కపిల్ సిబల్లు చట్టం అమలుపై విధివిధానాలు రూపొందలేదని, అమలుపై ఆందోళన అవసరం లేదన్నారు. దాంతో చట్టం అమలుపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. ‘పౌర’ ఆందోళనలు చరిత్రలో నిలుస్తాయి: కన్హయ్య పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనల్లో జేఎన్యూ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. యూనివర్సిటీ 7 వ నెంబర్ గేట్ వద్ద విద్యార్థులు, ఇతర నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిపే నిరసనలు ముస్లింలను రక్షించడానికి కాదని, మొత్తం దేశాన్ని రక్షించేందుకని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టం కన్నా జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) మరింత ప్రమాదకరమైందని స్పష్టం చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాటిగా చరిత్రలో నిలిచిపోతాయి’ అన్నారు. ‘ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మనమంతా నోట్ల రద్దు సమయంలో నిల్చున్నట్లు భారీ లైన్లలో నిల్చుని మన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’ అన్నారు. పశ్చిమబెంగాల్లోని దినాజ్పూర్ జిల్లాలో సీఏఏ నిరసన ప్రదర్శనపై దుండగులు నాటు బాంబులు విసరడంతో ఐదుగురు గాయపడ్డారు. మద్రాస్ వర్సిటీకి కమల్ హాసన్: మద్రాస్ వర్సిటీలో దర్నా చేస్తున్న విద్యార్థులకు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంఘీ భావం తెలిపారు. క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో, వెలుపలి నుంచే విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జామియా కేసు చీఫ్ జస్టిస్కు బదిలీ జామియా మిలియాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా రక్షణ కల్పించాలని ఇద్దరు విద్యార్థినులు పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జామియా వర్సిటీ విద్యార్థినులు లడీదా ఫర్జానా, ఆయేషా రీనా పెట్టుకున్న పిటిషన్ వేశారు. అయితే, సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులను హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులే విచారించాలన్న సుప్రీం ఆదేశాలను కేంద్రం తరఫు న్యాయవాది జస్టిస్ విభూ దృష్టికి తెచ్చారు. దాంతో విచారణను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ జస్టిస్ విభూ నిర్ణయం తీసుకున్నారు. ‘పౌరసత్వం’పై నిరసనలు చేపట్టకూడదంటూ కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరులలో పోలీసులు ఆంక్షలు విధించారు. బెంగళూరులో గురువారం ఉదయం 6 నుంచి 21 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటాయి. దేశాన్ని మంటల్లోకి తోస్తున్నారు కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ కోల్కతా: ‘దేశంలోని మంటలను ఆర్పాల్సింది పోయి.. దేశాన్ని మంటల్లోకి నెడుతున్నారు. ఇది మీ ఉద్యోగం కాదు’అని హోం మంత్రి అమిత్షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్..’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు కానీ.. దేశంలోని ప్రతి ఒక్కరిని వినాశనాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. దేశం మంటల్లో కాలిపోకుండా చూడాలని అమిత్షాను కోరారు.దేశాన్ని మంటల్లోకి తోసేయడం మీ ఉద్యోగం కాదు.. కానీ మంటలు ఆర్పేయండి చాలు’అని ఎద్దేవా చేశారు. కోల్కతాలో కోల్కతాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. -
నిర్భయ కేసులో మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఆర్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, నిర్భయ తల్లి తరఫున విచారించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ బాబ్డే ప్రకటించారు. దీంతో బుధవారం మరో బెంచ్ విచారణ చేపట్టనుంది. మరో కేసు.. కేసులో దోషిగా తేలిన రాజకీయనేతలు, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నవారు రాజకీయ పార్టీలకు ఎలా నేతృత్వం వహిస్తారంటూ సుప్రీంలో దాఖలైన పిల్ విచారణ నుంచీ సీజేఐ తప్పుకున్నారు. లాయర్ అయిన జస్టిస్ బాబ్డే కుమార్తె ఇదే అంశంపై మరో విచారణ బెంచ్ ఎదుట వాదనలు వినిపించడంతో ఆయన కేసు విచారణ నుంచీ తప్పుకున్నారు. -
నిర్భయ కేసులో కొత్త మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషి అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కొత్త మలుపు తిరిగింది. దోషుల్లో ఒకరైన అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారించే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. అక్షయ్ పిటిషన్ను తాను వినబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో రివ్యూ పిటిషన్పై విచారణ కొరకు మరో కొత్త బెంచ్ను ఏర్పాటు చేయనున్నారు. అయితే బాబ్డే కోడలు గతంలో నిర్భయ తరుఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో తన కోడలు వాదించే కేసులో తాను ఎలాంటి తీర్పును ఇవ్వబోనని సీజే స్పష్టం చేశారు. అక్షయ్ పిటిషన్పై వాదనలు వినేందుకు బుధవారం కొత్త బెంచ్ను ఏర్పాటు చేయనున్నారు. సీజే బాబ్డే స్థానంలో మరో సీనియర్ న్యాయమూర్తిని ధర్మాసనంలోకి తీసుకోనున్నారు. వారి వాదనలు విన్న అనంతరం.. బుధవారమే తీర్పును వెలువరించే అవకాశం ఉంది. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషిగా తేలిన అక్షయ్ సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మంగళవారమే ఈ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. అయితే సీజే హఠాత్తుగా తప్పుకోవడంతో బుధవారానికి వాయిదా పడింది. దీంతో సుప్రీం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముగ్గురు దోషులు దాఖలు చేసిన రిప్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేస్తే దోషుల ఉరిశిక్షకు ముహుర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు మూడురోజుల క్రితమే తీహార్ జైలుకు ఇద్దరు తలారిలు వచ్చారని తెలిసింది. దోషులను ఉరితీసేందుకు బిహార్లోని బక్సార్ జైలు నుంచి ఉరితాళ్లను కూడా తెప్పించినట్లు సమాచారం. రానున్న రెండు రోజుల్లో దోషులను ఉరి తీస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
రేప్ కేసుల విచారణ తీరుపై ‘సుప్రీం’ కమిటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నియమించారని సోమవారం సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆ రాక్షస చర్యపై సమీక్షా?
న్యూఢిల్లీ: తన కూతురిని రాక్షసంగా చెరిచి హత్య చేసిన వారికి విధించిన తీర్పును సమీక్షించరాదంటూ నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషుల్లో ఒకరైన అక్షయ్కుమార్ 2017లో కోర్టు విధించిన ఉరిశిక్షను సమీక్షించాలని కోరుతూ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి శుక్రవారం ఓ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్పై విచారించే రోజున, అంటే ఈ నెల 17వ తేదీనే ఈ పిటిషన్పైనా వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తన కూతురిపై అత్యాచారం జరిగిన డిసెంబరు 16వ తేదీనే దోషులకు శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి మీడియా ఎదుట డిమాండ్ చేశారు. తన కూతురుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇలా ఉండగా.. నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్పై 18న విచారణ చేపడతామని అడిషనల్ సెషన్స్ జడ్జి స్పష్టం చేశారు. ఉరి అమలుకు సిద్ధం: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జైలుకు చెందిన తలారి... తీహార్ జైలులో ఉరిశిక్షను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు తలారి కోసం ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ జల్లాడ్ (55)... ఉరి అమలుకు సిద్ధమన్నాడు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తాం: కేజ్రీవాల్ మహిళల పట్ల ఎలాంటి అనుచిత చర్యలకు దిగబోమంటూ విద్యార్థుల చేత పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడాలని దేశమంతా కోరుకుంటోందని తెలిపారు. -
‘అయోధ్య’ రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. నవంబర్ 9వ తేదీన వెలువరించిన చారిత్రక తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రివ్యూకోసం దాఖలైన పిటిషన్లను, జత చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. వీటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని భావిస్తున్నాం. అందుకే ఈ పిటిషన్లన్నిటినీ తిరస్కరిస్తున్నాం’ అంటూ వాస్తవ కక్షిదారులు వేసిన 10 పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ఈ ధర్మాసనం పేర్కొంది. తీర్పుపై సమీక్ష కోరేందుకు అనుమతించాలంటూ మూడోపక్షం(థర్డ్ పార్టీ) దాఖలు చేసిన 9 పిటిషన్లను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులోని 10 పిటిషన్లు వాస్తవ కక్షిదారులవి కాగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, దాని మద్దతుతో వేసినవి 8, హక్కుల కార్యకర్తలు 40 మంది కలిసి వేసిన మరో పిటిషన్ ఉన్నాయి. వీటితోపాటు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్, నిర్మోహి అఖాడా వేసిన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆఖరి చాన్స్ ‘క్యూరేటివ్’ అన్ని రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురికావడంతో కక్షిదారులకు ఇక ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే క్యూరేటివ్ పిటిషన్. తీర్పులో ఏవైనా లోపాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించిన పక్షంలో వాటిని సవరించేందుకు క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. పునస్సమీక్షకు తగిన ఆధారాలున్నాయని న్యాయస్థానం భావించినా, విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. -
తక్షణ న్యాయం ఉండదు!
జోధ్పూర్: న్యాయమన్నది ఎప్పుడూ తక్షణం అందేదిగా ఉండరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే స్పష్టం చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకారంగా మారకూడదని, అలా మారినప్పుడు న్యాయానికి ఉన్న లక్షణాలేవీ మిగలవని ఆయన తెలిపారు. రాజస్తాన్ హైకోర్టులో శనివారం ఒక కొత్త భవనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దిశ హత్య కేసు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో ప్రాధాన్యమేర్పడింది. ఇటీవలి పరిణామాలు చాలా పురాతనమైన చర్చను సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాయన్న జస్టిస్ బాబ్డే న్యాయవ్యవస్థ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం విషయంలో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉండాలని, ఇందుకోసం కొత్త మార్గాలను అన్వేషించడంతోపాటు ఉన్నవాటిని దృఢతరం చేసుకోవాల్సిన అవసరమూ ఉందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వివాదాలను వేగంగా సంతృప్తికరంగా పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదే సమయంలో న్యాయవ్యవస్థ పట్ల మారుతున్న దృక్పథంపై కూడా అవగాహన ఉండాలని అన్నారు. న్యాయవ్యవస్థలో జరిగిన తప్పిదాలను స్వయంగా దిద్దుకునే ఏర్పాటు అవసరముందని, అయితే ఈ ఏర్పాట్లను ప్రచారం చేయాలా? వద్దా? అన్నది చర్చనీయాంశమని అన్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. చేసిన వ్యాఖ్యలు, జరిగిన తప్పిదాలను స్వయంగా సరిచేసుకునేందుకు జరిగిన ఒక ప్రయత్నమేనని అన్నారు. ‘లిటిగేషన్లను వేగంగా పరిష్కరించే పద్ధతులను ఏర్పాటు చేయడమే కాదు. లిటిగేషన్లను ముందస్తుగా నివారించాల్సి ఉంది’అని చెప్పారు. కేసు దాఖలయ్యే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఇప్పటికే కొన్ని చట్టాలున్నాయని, వాటిని అన్ని కేసులకూ తప్పనిసరి చేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. అంతకుముందు కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మానభంగ కేసుల విచారణ సత్వరం జరిగేలా ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన నిధులు అందిస్తుందని హామీ ఇచ్చారు. విచారణ జాప్యం దేశంలోని మహిళలను తీవ్రమైన బాధకు, ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో హేయమైన నేరాల విచారణకు 704 ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఉన్నాయని, పోక్సో, మానభంగ నేరాల విచారణకు మరో 1,123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ తరువాత మానభంగ కేసుల నిందితులకు సత్వర శిక్ష పడేలా చూడాలన్న డిమాండ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో దిశ నిందితులు మరణించడంపై కొన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేయడం, సంబరాలు చేసుకోవడం కొందరి ఆందోళనకు కారణమవుతోంది. పేదలకు అందని స్థాయిలో న్యాయ ప్రక్రియ: రాష్ట్రపతి దేశంలో న్యాయ ప్రక్రియ పేదలకు అందని స్థాయిలో ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. జోధ్పూర్లో శనివారం హైకోర్టు కొత్త భవనం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘న్యాయ ప్రక్రియ బాగా ఖరీదైపోయింది. పలు కారణాల వల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సాధారణ కక్షిదారులకు అందడం అసాధ్యంగా మారింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజుల్లో పేదవారెవరైనా ఇక్కడకు ఫిర్యాదు తీసుకుని రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఎందుకంటే రాజ్యాంగం పీఠికలో అందరికీ న్యాయం అందించడం బాధ్యతని మనమందరం అంగీకరించాం కాబట్టి’ అని అన్నారు. న్యాయం కోసం పెడుతున్న ఖర్చుపై గాంధీజీ ఆందోళన వ్యక్తం చేశారని, దరిద్ర నారాయణుల సేవే ఆయనకు అన్నింటికంటే ముఖ్యమైన అంశమని అన్నారు. గాంధీజీ ప్రాథమ్యాలను గుర్తు చేసుకుంటే, కటిక పేదవాడు, అతి బలహీనుడి ముఖాలను మనం మననం చేసుకుంటే ఈ అంశాల్లో మనకు తగిన మార్గం కనిపిస్తుందని అన్న రాష్ట్రపతి న్యాయ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత న్యాయసేవలు ఒక మార్గం కావచ్చునని సూచించారు. -
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా జస్టిస్ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్పర్సన్గా(ఎస్సీఎల్ఎస్సీ) కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఎస్సీఎల్ఎస్సీలో పెండింగ్ కేసులు తగ్గాయి. జనవరి 2018 లో 3,800 కేసులు ఉండగా.. ఆగస్టు 2019 నాటికి 1811కు తగ్గాయి. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం జామ్నగర్ హౌజ్లోని నల్సా కార్యాలయం సందర్శించారు. నల్సా డైరెక్టర్ సునీల్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించారు. న్యాయ సేవలు అందించడంలో సమర్థతను, న్యాయ సేవలు పొందగలిగే అవకాశాలను పెంపొందించడంపై చర్చించారు. నల్సా భవిష్యత్తు కార్యక్రమాలకు మార్గదర్శకంగా జస్టిస్ ఎన్.వి.రమణ ఒక విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించారు. లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం, డిజిటైజేషన్ చేయడం, న్యాయ సేవలు పొందడంలో ప్రొటోకాల్ రూపొందించడం వంటి కార్యక్రమాలపై నల్సా దృష్టిపెట్టనుంది. -
ఎస్సీ/ఎస్టీ క్రీమీలేయర్ అంశాన్ని సమీక్షించండి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు. -
సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం అమల్లోకి వచ్చింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సీనియర్లు విచారించనున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఉన్నారు. ఈ నెల 26 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇందులో కోర్టు ధిక్కారం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, సోషల్ జస్టిస్ వంటి అంశాల కేసులు సీజేఐ పరిధిలో ఉంటాయి. ట్రాయ్, ఎంక్వైరీ కమిషన్, కంపెనీ లా వంటి వాటి కేసులను కూడా సీజేఐ తన పరిధిలోనే ఉంచుకున్నారు. సాయుధ బలగాలు, పారామిలిటరీ, సాధారణ, క్రిమినల్ సివిల్ కేసులు, ట్రిబ్యునల్కు సంబంధించిన కేసులను ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భూ సేకరణలు, మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు, కొత్త విద్యా సంస్థలకు సంబంధించిన కేసులను జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ప్రభుత్వాలు, లోకల్ బాడీల కాంట్రాక్టులు, కేసుల లీజులు, ఫ్యామిలీ లా వంటి వ్యవహారాలను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. -
‘ఆధార్’ చట్ట బద్ధతపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీం శుక్రవారం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జూలైలో ఆధార్ సవరణ చట్టం సుప్రీం తీర్పుతో కేంద్రం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అందించడంలో స్వచ్ఛందంగా 12 అంకెల ఆధార్ నంబర్ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు చేసింది. ఈ బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఆధార్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది. -
సీజేగా బాబ్డే ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు మాజీ సీజే రంజన్ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్కే అద్వానీ, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అనంతరం వారంతా బాబ్డే శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్పూర్కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాబ్డే. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్గా రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్కౌన్సిల్లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ గొగోయ్ ఆదివారం రిటైరయ్యారు. -
సీజేఐగా బాబ్డే ప్రమాణం నేడు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నేడు ప్రమాణం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఈ పదవిలో ఉంటారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్పూర్కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్గా రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్కౌన్సిల్లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ గొగోయ్ ఆదివారం రిటైరయ్యారు. -
న్యాయ పీఠంపై... ఆ ఐదుగురూ!!
అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సారథ్యం వహించగా... జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం... స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పునిచ్చింది. తీర్పుపై ఐదుగురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... ఒక జడ్జి మాత్రం... ఆ స్థలం శ్రీరాముడి జన్మస్థానమనే హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ ఐదుగురి వివరాలూ చూస్తే... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్... 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్ కౌన్సిల్లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే రాజ్యాంగ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరిన ఈయన... బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో పని చేశారు. బోంబే హైకోర్టులోనే దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపడతారు. 2021 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ చంద్రచూడ్ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1998 నుంచి దాదాపు రెండేళ్లపాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా... 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉపన్యాసాలిచ్చారు. జస్టిస్ అశోక్ భూషణ్ ఉత్తరప్రదేశ్కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ జాన్పూర్లో జన్మించారు. అలహాబాద్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్ భూషణ్... 1979లో యూ పీ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. అలహాబాద్ హైకోర్టులో వివిధ పోస్టులలో పనిచేసిన అశోక్ భూషణ్ 2001లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి కావడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ నజీర్ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు. -
నూతన సీజేఐగా శరద్ అరవింద్ బాబ్డే!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. నియామకానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నవంబరు 18న జస్టిస్ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్ గొగోయ్ తర్వాత శరద్ అరవింద్ సీనియర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం లాంఛనప్రాయమే కానుంది. కాగా 1956 ఏప్రిల్24న మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన న్యాయవాద కుటుంబంలో బోబ్డే జన్మించారు. నాగ్పూర్ యూనివర్సిటీకి చెందిన ఎస్ఎఫ్ఎస్ కాలేజీలో న్యాయ విద్యనభ్యసించిన ఆయన.. 1978లో అడ్వకేట్గా తనపేరు నమోదు చేసుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచీలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో పాటుగా... మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్స్లర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ బోబ్డే.. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. ఇక జస్టిస్ శరద్ అరవింద్ తండ్రి అరవింద్ బోబ్డే 1980-85 మధ్య కాలంలో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. శరద్ అరవింద్ అన్న వినోద్ బాబ్డే కూడా పేరు మోసిన లాయర్(సుప్రీంకోర్టు)గా గుర్తింపు తెచ్చుకున్నారు. -
కారుణ్య నియామకం హక్కు కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగి మరణం.. బాధిత కుటుంబానికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోరే హక్కును ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు కారుణ్య నియామకం కోరే సదరు వ్యక్తి ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కలిగి ఉండాలని కూడా న్యాయమూర్తులు బి.ఎస్.చౌహాన్, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. బాధిత కుటుంబం ఆర్థిక స్థితిగతులన్నీ పరిశీలించిన తర్వాత.. యజమాని మరణంతో ఏర్పడిన సంక్షోభం నుంచి కుటుంబం బయటపడలేదని భావించినప్పుడు మాత్రమే అర్హుడైన కుటుంబ సభ్యుడికి ఉద్యోగావకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్లోని ఎంజీఎం గ్రామీణ బ్యాంకు దాఖలు చేసిన అప్పీల్ను బెంచ్ అనుమతించింది. ఎంజీఎం ఉద్యోగి ఒకరు మరణించినప్పుడు అతని కుమారుడు చక్రవర్తి సింగ్కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా 2010లో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సదరు బ్యాంక్ సుప్రీంలో సవాల్ చేసింది. చక్రవర్తికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేందుకు హైకోర్టు సింగిల్ జడ్జితో పాటు, డివిజన్ బెంచ్ పేర్కొన్న కారణాలు చట్టం ముందు నిలువజాలవని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.