sampath
-
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు: సంపత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.‘‘ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్కు మాదిగల గురించి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్లు మాదిగల గురించి ఆలోచించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తున్నారు. వర్గీకరణ అమలు జరిగిందంటే.. అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. మాదిగలు గుండె మీద చెయ్యి వేసుకుని పడుకోండి. చంద్రబాబు హయాంలో వర్గీకరణకు ఎదురైనా సాంకేతిక లోపాలు తెలిసిన వాడిగా సీఎం క్యాబినెట్ కమిటీ వేశారు. ఏక సభ్య కమిటీ వేశారు కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది.వర్గీకరణ పకడ్బందీగా అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారు. తరతరాలుగా అవమానాలు, అసమానతలు ఎదురొడ్డినా మాదిగలు ధైర్యంగా ఉండండి. అధికారిక సమావేశంలోనే కాంగ్రెస్ని డిమాండ్ చేశాను’’ అని సంపత్ పేర్కొన్నారు. -
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్లోని సవాయిమధోపూర్. జార్ఘండ్లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
జనహృదయ విజేత
సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పేద ప్రజల్లో దైవంలా కొలువై నిలిచారు. అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... వైఎస్సార్ పేద ప్రజల బాగుకోసం దాన్ని ఉపయోగించారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు.ఆ విధంగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు దగ్గర చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘జలయజ్ఞం’ ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. ఆయన కాలంలోనే ఎన్నో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు.దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్మెంటు పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్, వైద్య విద్యలను అందించి అనేక మందిని ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దారు. ప్రతి నిరుపేదకూ ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి పేదవారి సొంతింటి కలను నిజం చేశారు. నిరుపేద ముస్లిం యువతకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకుల వంటి వృద్ధులకు పింఛన్ను క్రమం తప్పకుండా ఇచ్చి వారి ఆకలి తీర్చారు.ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త విని ఎందరో అభిమానుల గుండెలూ ఆగిపోయాయి. ఆయన భౌతికంగా లేకపోయినా సకల జనుల హృదయాల్లో ‘రాజన్న’గా ఆయన నిలిచే ఉన్నారు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. కూతురుపై కన్నేశాడు
హన్మకొండ: మైనర్పై అత్యాచారానికి యత్నించిన ఘటనలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ శుక్రవారం అరెస్టయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైంలో బండారి సంపత్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వర్ధన్నపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం లైంగిక బంధానికి దారితీసింది. దీంతో సదరు మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సంపత్తో సహజీవనం సాగించి.. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆమెకు అప్పటికే పదేళ్ల వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఆ బాలికకు తండ్రిగా వ్యవహరించాలి్సన సీఐ కీచకుడిగా మారాడు. ఇటీవల అత్యాచారానికి యత్నించడంతో బాలిక తల్లి కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి విచారణ చేపట్టారు. లైంగిక దాడికి యత్నించినట్లు నిర్ధారణకు వచ్చి సీఐ సంపత్పై పోక్సో కేసు నమోదు చేశారు. రెండేళ్లక్రితం సంపత్పై ఫిర్యాదు.. ఎస్సై బండారి సంపత్ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లాడని రెండేళ్ల క్రితం అప్పటి పోలీస్ కమిషనర్ తరుణ్జోషిని కలిసి ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. అçప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సంపత్ను ఏఆర్కు అటాచ్ చేశారు. -
షణ్ముక్ సోదరుడి మరిన్ని ఆగడాలు.. బాధితులు చాలామందే
యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ అలియాస్ షన్ను.. ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు. అయితే ఓ అమ్మాయి.. షణ్ముక్ సోదరుడు సంపత్పై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) యూట్యూబర్గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన షణ్ముక్ జస్వంత్కి సంపత్ అని అన్న ఉన్నాడు. అయితే ఇతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన నమ్మించి మోసం చేయడంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు వల్ల సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు. సంపత్.. తన ఎంబీఏ క్లాస్మేట్ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట. ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
షణ్ముఖ్ సోదరుడి వ్యవహారంలో సంచలన విషయాలు
-
గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్..
-
Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్బాస్ ఫేం షణ్ముఖ్
బిగ్బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. అన్న కోసం వెళ్తే.. అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. -
పెళ్లికి పిలుస్తలేరు.. చావుకు చెప్తలేరు!
మానకొండూర్ రూరల్: ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంపత్ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్ ఆ భూమి విషయంలో సంపత్తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే.. అడప శ్రీనివాస్, సంపత్ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్ పెట్టాలని సూచించారు. సంపత్ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. -
హెచ్సీఏలో ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవకతవకలు, అవినీతి, కోర్టు వివాదాలు, పరస్పర ఆరోపణలు, సస్పెన్షన్లు, పర్యవేక్షకుల పరిపాలన తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ ఆధ్వర్యంలో నేడు ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి మొహమ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షుడిగా 2019లో ఎన్నికైన హెచ్సీఏ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది సెపె్టంబర్ 26నే ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా... వేర్వేరు వివాదాలతో అవి వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు జరిగే వరకు రోజూవారీ కార్యకలాపాల కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో మూడు వరల్డ్కప్ మ్యాచ్లు కూడా జరిగాయి. చివరకు అక్టోబర్ 20న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ముందు హెచ్సీఏను ప్రక్షాళన చేసే క్రమంలో 57 క్లబ్లపై నాగేశ్వరరావు నిషేధం విధించారు. దాంతో ఈ క్లబ్లకు ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది. నాలుగు ప్యానెల్లుగా... అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్... ఇలా ఆరు పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. లోధా కమిటీ సిఫారసులు, కొత్త నియమావళి కారణంగా గతంలో కీలక పదవులు నిర్వహించిన సీనియర్లందరూ ఈసారి పోటీలో లేకపోగా, తాము మద్దతునిస్తూ సన్నిహితులను బరిలోకి దించారు. దాంతో ఈసారి ఎక్కువగా కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. నాలుగు వేర్వేరు గ్రూప్లుగా విడిపోయి అభ్యర్థులంతా పోటీ చేస్తున్నారు. అయితే ఫలితం విషయంలో గ్రూప్లతో సంబంధం లేదు. ఒక్కో పదవి కోసం అత్యధిక ఓట్లు సాధించిన వారు ప్యానెల్తో సంబంధం లేకుండా ఎన్నికవుతారు. పోలింగ్ కోసం మొత్తం 173 ఓట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 101 రెగ్యులర్ క్రికెట్ క్లబ్లు కాగా 48 ఇన్స్టిట్యూషన్ క్లబ్లు ఉన్నాయి. 9 జిల్లా క్లబ్లతో పాటు 15 మందికి అంతర్జాతీయ ఆటగాళ్ల హోదాలో ఓటు హక్కు ఉంది. గెలిస్తే తాము హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని చక్కదిద్దుతామని, వివాదాలు లేకుండా నడిపిస్తామని అభ్యర్థులంతా హామీ ఇస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. -
మనస్తాపంతో.. నాన్నమ్మకు ఫోన్చేసి.. చివరికి..
మెదక్: మనస్తాపం చెందిన ఒక యువకుడు చెరువులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లిలో చోటుచేసుకుంది. సంగాయిపల్లి గ్రామానికి చెందిన సంపత్(20) అంబాజిపేట పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇంటి నుంచి బైక్పై బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తాను చెరువులో దూకి చనిపోతున్నానని నాన్నమ్మ దుర్గమ్మకు ఫోన్చేసి చెప్పాడు. వెంటనే ఆమె యువకుడి మేనమామలకు చెప్పడంతో వారు అక్కడకు చేరుకుని వెతకగా చెరువులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ తెలిపారు. నాలుగు రోజులుగా సంపత్ మనస్తాపంతో బాధపడుతున్నాడని చెప్పారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఈ వాలంటీర్ వ్యవస్థకు శతకోటి వందనాలు
-
Kannada TV Actor Sampath J Ram: సినీ ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు సంపత్ జె. రామ్(35) సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సహా నటుడు రాజేశ్ ధృవ తన ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సంపత్ శనివారం రాత్రి బెంగళూరు నెలమంగళలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. సంపత్ ఇటీవల తగినన్నీ అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామమైన కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా నరసింహరాజపురలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంపత్ 'అగ్నిసాక్షి' సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్నారు. అతని మృతిపై మరో నటుడు రాజేశ్ ధృవ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 'నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి.. చాలా పోరాటం మిగిలి ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. దయచేసి తిరిగి రండి.' భావోద్వేగానికి గురయ్యారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వేరోస్ సభ్యుడి స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, నల్గొండ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలకు సేవ చేస్తానంటూ తన పదవికి రాజీనామా చేసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ని ప్రశ్నించారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమెల్యే గ్యాదరి కిషోర్, మరికొందరు అధికారం పార్టీ నేతలు సోమవారం .. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకోమని కౌంటర్ ఇచ్చారు. దీంతో తమ నాయకుడు ప్రవీణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్వేరోస్ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వేరోస్ సభ్యుడు సంపత్ అనే వ్యక్తి పేరుతో ఓ ఆడియో కాల్ వైరల్గా మారింది. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్కు ఫోన్ చేసిన సంపత్..‘నీది ప్రవీణ్ కుమార్ను విమర్శించే స్థాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి ప్రవీణ్ కుమార్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. ఏడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందా మీకు అని ప్రశ్నించాడు. -
అణగారిన వర్గాల దీపస్తంభం
అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రీబాయి ఫూలే. ఆనాటి సమాజపు కట్టు బాట్లను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభిం చారు. సావిత్రీబాయి మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మిం చారు. వాళ్ల కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన తొమ్మిదో ఏట పన్నెండేళ్ల జ్యోతి రావు ఫూలేను 1840లో వివాహ మాడారు. నిరక్షరాస్యురాలైన ఆమెకు భర్త జ్యోతిబా మొదటి గురువు. ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇది నడపటం అగ్రవర్ణాలకు నచ్చకపోయినా, పట్టు వీడక ఫూలే దంపతులు సాగించిన విద్యా ఉద్య మానికి తక్కువ కాలంలోనే గుర్తింపు, సహ కారం లభించాయి. దంపతుల జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. మానవ హక్కుల గురించి మహిళలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్ స్థాపిం చారు సావిత్రీబాయి. కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా ఈ సంఘం పనిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రీబాయి. 1873లో భర్త మహాత్మా ఫూలేతో కలిసి ‘సత్య శోధక్ సమాజ్’ స్థాపించి, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా; వితంతు పునర్వి వాహాలకు అనుకూలంగా ఉద్యమం నడిపారు. ఈ సంఘపు మహిళా విభాగానికి ఆమె నేతృత్వం వహించారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభ వించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోశారు. అలా పురుడు పోసుకుని తనవద్దే వదిలేసి పోయిన ఓ బ్రాహ్మణ వితంతువు బిడ్డను అక్కున చేర్చుకుని, యశ్వంత్గా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు. వితంతువు లకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్య పర్చి, వారికి శిరో ముండనం చేయ బోమంటూ సమ్మె చేయించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరా డారు. దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి మరువలేనిది. కరువు వాతపడిన కుటుంబాల్లోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రీబాయి ఫూలే సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. (నేడు సావిత్రీబాయి ఫూలే జయంతి) సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా మొబైల్ : 78933 03516 -
వెలుగులోకి వస్తున్న సంపత్ వ్యవహారాలు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్లోని మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ప్లాట్స్లో మకాం వేసి... సుదీర్ఘకాలం తర్వాత హర్యానా స్పెషల్ టాస్క్ఫోర్స్కు చిక్కి... ఇటీవల తీహార్ జైలు నుంచి చంఢీగడ్ చేరిన ఘరానా గ్యాంగ్స్టర్ సంపత్ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతడికి కస్టడీలోకి తీసుకున్న చంఢీగడ్ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న నెహ్రా బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్నూ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాదిలోని పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారి, సైబరాబాద్లో తలదాచుకున్న నెహ్రా ఇక్కడ ఉన్నప్పుడూ యథేచ్చగా అక్కడ దందాలు సాగించినట్లు వెలుగులోకి వచ్చింది. చంఢీగడ్లో ఉన్న తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడని అక్కడి పోలీసులు గుర్తించారు. తన స్మార్ట్ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా వీరికి ఆదేశాలు జారీ చేస్తూ పోలీసు నిఘాకు చిక్కికుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తేల్చారు. సంపత్ ప్రధానంగా చంఢీగడ్లోని మొహాలీతో పాటు పంచకుల ప్రాంతాల్లోనే తన దందాలు కొనసాగించాడు. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన రామ్దీప్ సింగ్, శుభ్నవ్దీప్ సింగ్, జస్పీత్ సింగ్, గుర్వీందర్ సింగ్లను తన ప్రధాన అనుచరులుగా ఏర్పాటు చేసుకున్న అతను ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలన్నీ వీరి ద్వారానే చేయించేవాడు. రాజస్థాన్లోని చురు జిల్లాకు చెందిన దినేష్ కుమార్ ఆర్మీలో పని చేసేవాడు. ఇతడినీ తన అనుచరుడిగా మార్చుకున్న సంపత్ ప్రత్యేకమైన పనుల కోసం మాత్రమే అతడిని రంగంలోకి దింపేవాడు. మాదాపూర్లో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులతో కలిసి సాధారణ జీవితం గడిపిన సంపత్ నిత్యం సెల్ఫోన్లో చాటింగ్స్, కాల్స్తో బిజీగా ఉండే వాడు. వీటి ద్వారానే అనుచరులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేవాడు. మొహాలీ, పంచకుల ప్రాంతాల్లో బెదిరింపులు, దోపిడీలు, బంది పోటు దొంగతనాలతో పాటు కిడ్నాప్స్ సైతం చేయించాడు. ఇందుకుగాను తన నలుగురు అనుచరులకూ ఆయుధాలు కారు సమకూర్చాడు. మొహాలీకి చెందిన వరీంద్రకుమార్ అనే యువకుడిని కిడ్నాప్ చేయించి భారీగా వసూలు చేశాడు. సొహాన ప్రాంతంలో ఓ కారుతో పాటు భారీ నగదు దోచుకున్నారు. ఇతడి అనుచరులను చంఢీగడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ ఉద్యోగి దినేష్ సింగ్ సెలవు పెట్టివచ్చి సంపత్ చెప్పిన పనులు చేసేవాడు. ఘరానా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడిగా పని చేసిన సంపత్ అతడి ఆదేశాల మేరకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. -
డబుల్ హ్యాండ్ షూటర్.. సల్మాన్ఖాన్కూ వార్నింగ్
సాక్షి, సిటీబ్యూరో: కేవలం 26 ఏళ్ల వయస్సుకే హర్యానా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారి, రెండేళ్ల క్రితం సైబరాబాద్లో చిక్కిన ఘరానా గ్యాంగ్స్టర్ సంపత్ నెహ్రాను తాజాగా చండీఘడ్ చేరాడు. తీహార్ జైల్లో ఉన్న అతడిని అక్కడ నమోదైన హత్యాయత్నం కేసులో పీటీ వారెంట్పై తీసుకెళ్లారు. 2017 జూన్ 7న మియాపూర్లో అరెస్టైనప్పటి నుంచి సంపత్ నెహ్రాను ఏదో ఒక నగర, జిల్లా పోలీసులు ‘తీసుకువెళ్తూ’ తమ కేసుల్లో అరెస్టు చేస్తూనే ఉన్నారు. గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కే వార్నింగ్ ఇచ్చిన సంపత్ పేరు ఉత్తరాదిలో మారుమోగింది. రాజస్థాన్లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్ తండ్రి రామ్ చందర్ చండీఘడ్కు వలస వెళ్లి అక్కడ పోలీసు విభాగంలో ఎస్ఐగా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. సంపత్ పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో బీఏ చదివాడు. ఆ దశలోనే వర్శిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు అనుచరుడిగా పని చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడంతో తానే ఓ గ్యాంగ్స్టర్గా మారాడు. యువత, విద్యార్థులతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న సంపత్ తన సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్లకూ విస్తరించాడు. వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడు. ప్రతి నేరంలోనూ తుపాకీ వినియోగించిన సంపత్ డబుల్ హ్యాండ్ షూటర్. అతను రెండు చేతులతోనూ ఏక కాలంలో తుపాకీ పేల్చగలడు. హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పోలీసుల అదుపులోకి తీసుకున్న తన అనుచరుడు దీపక్ అలియాస్ టింకును విడిపించే ప్రయత్నంలో సంపత్ పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎస్కార్ట్ అధికారుల కళ్లల్లో కారం చల్లడంతో పాటు కాల్పులు జరిపి తన అనుచరుడిని తప్పించాడు. రాజస్థాన్లోని రాజ్ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన సంపత్ అతడిని హత్య చేశాడు. మూడు రాష్ట్రాల్లోనూ అతడి కోసం గాలిస్తున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో చండీఘర్కు పారిపోయిన సంపత్ అక్కడి ఖోర్బా ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆపై సైబరాబాద్కు వచ్చిన సంపత్ మియాపూర్ పరిధిలోని గోకుల్ప్లాట్స్లో ఓ అద్దె ఇంట్లో మకాం పెట్టాడు. ఇతడి కదలికలను గుర్తించిన హర్యానా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు 2017 జూన్ 7న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సంపత్ను 2016లో చండీఘడ్లో నమోదైన సందీప్సింగ్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో అక్కడి పోలీసులు పీటీ వారెంట్పై గత వారం తీసుకువెళ్లారు. ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న సంపత్ నెహ్రా బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్నూ విడిచిపెట్టలేదు. ఆయన నుంచి డబ్బు వసూలు చేయడానికి పథకం వేసి వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో రాజస్థాన్ కోర్టుకు వచ్చినప్పుడు చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రధానంగా సోషల్మీడియా వేదికగానే ఇతడి దందాలు నడిచాయి. జోధ్పూర్ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ 2016లో సల్మాన్కు వార్నింగ్ ఇచ్చాడు. సంపత్కు రాజస్థాన్లోని రాజ్ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిని హత్య చేసిన చరిత్ర ఉండటంతో ఈ వార్నింగ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న జోధ్పూర్ పోలీసులు సల్మాన్ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. -
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
వాటీజ్ దిస్ నాన్సెన్స్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరించడం ద్వారా రేగిన మంటలు హైకోర్టులో ఇంకా చల్లారలేదు. తమ బహిష్కరణకు సంబంధించి వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయమూర్తిని ఉద్దేశించి ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఏఏజీ ఎదురుదాడి, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారిని ఈ నెల 15న తమ ముందు హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. రూ.10వేల పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందవచ్చునని ఇరువురు కార్యదర్శులకు స్పష్టంచేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివవంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుకు సహకరించాల్సిన అదనపు ఏజీ ఎదురుదాడికి దిగారని, న్యాయవ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారని.. అయినా కూడా, ఈ కోర్టు తనను తాను నియంత్రించుకుంటూ తప్పని పరిస్థితుల్లో ఇరువురు కార్యదర్శులకు బెయిల్బుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకసారి కోర్టు ధిక్కరణ కింద ఫారం–1 నోటీసులు అందుకున్న తర్వాత, ఇరువురు కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టంచేశారు. మినహాయింపు ఎలా కోరతారు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు గతేడాది తీర్పు వెలువరించారు. అయితే, ఈ తీర్పును అమలు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ఓ న్యాయవాది కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు నిరాకరించారు. కోర్టు ధిక్కరణ కింద ఫారం–1 నోటీసులు అందుకున్న ఇరువురు కార్యదర్శులు.. కోర్టు ముందు హాజరవుతారని తెలిపారని, మళ్లీ ఇప్పుడు హాజరు నుంచి మినహాయింపు ఎలా కోరతారని ప్రశ్నిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. నేను చెప్పేది వినండి... తిరిగి ఈ కేసు మధ్యాహ్నం విచారణకు వచ్చినప్పుడు న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు తరఫున హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు విచారణను వాయిదా వేయాలని కోరబోగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘గతంలో కూడా మీరు ఇలాగే వాయిదా కోరారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు కోర్టు ముందు హాజరవుతారని చెప్పారు. మరి కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు నిబంధనల ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉందా? లేదా? చెప్పండి’అని అడిగారు. దీంతో ఏఏజీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముంది? విచారించేందుకు ఏం ఆధారాలున్నాయి? నేను చెప్పేది వినండి’అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. ఏఏజీ తీరుతో న్యాయవాదులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుడ్సెన్స్తో అడుగుతున్నా.. ఏఏజీ అంత తీవ్రంగా మాట్లాడినప్పటికీ.. న్యాయమూర్తి ఏ మాత్రం చలించకుండా, ‘నాన్సెన్స్తో కాదు.. గుడ్సెన్స్తో అడుగుతున్నా. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి’అని ఏఏజీని అడిగారు. కోర్టు ధిక్కార పిటిషన్ను విచారణకు స్వీకరించిన తర్వాత, ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ ధిక్కార వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేదని రామచంద్రరావు చెప్పగా.. విచారణకు స్వీకరించినట్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఇరువురు కార్యదర్శులు కోర్టు ముందు హాజరవుతారని గత విచారణ సందర్భంగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. మీకు కావాల్సిన విధంగా... ఈ దశలో ఏఏజీ మరోసారి తీవ్రస్థాయిలో ఊగిపోతూ.. కోర్టు ధిక్కార పిటిషన్ను మూసివేయాలని ధర్మాసనం ఆదేశాలు ఉండగా, ఎలా విచారణ జరుపుతారని ప్రశ్నించారు. ఈ కేసులో ఏదో చేయాలని ముందే నిర్ణయించుకుని (ప్రీ మైండెడ్) ఉంటే ఆ మేర ఉత్తర్వులు జారీ చేయవచ్చునని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీనియర్ న్యాయవాది వాయిదా కోరితే ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ అవసరం లేదని, దానిని మూసేయాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో చెప్పిందని ఏఏజీ చెప్పగా.. అలా జారీ చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. అయితే, అలా ఇవ్వొచ్చంటూ ఏఏజీ విసురుగా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోతుండగా, న్యాయమూర్తి ఆయన్ను ఆగాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం ప్రారంభించారు. కోర్టులో ఏఏజీ వ్యవహారశైలిని మొత్తం తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. గతంలో వాయిదాలు తీసుకున్న విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. కోర్టుకు సహకరిస్తూ, న్యాయస్థానం ప్రతిష్టను కాపాడాల్సిన ఏఏజీ.. కోర్టుపై ఎదురుదాడికి దిగారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు కార్యదర్శులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునివ్వగా.. ఈ తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో.. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ రెండు నెలలపాటు స్టే విధించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయకపోవడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని, ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా స్టే ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్కుమార్లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
కోమటిరెడ్డి,సంపత్ పిటిషన్పై హైకోర్టు తీర్పు
-
కంప్యూటర్ ఇంజినీర్ కత్తెర పట్టాడు
కంప్యూటర్ కీ బోర్డుపై ఆడించాల్సిన చేతులు.. సెలూన్లో కత్తెర పట్టి హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నాయి.. కులవృత్తికి మించింది లేదు గువ్వల చెన్నా.. అనే నానుడిని నిజం చేస్తున్నాడీ కంప్యూటర్ ఇంజినీర్.. కులవృత్తిలో రాణిస్తున్నాడు.తానెంచుకున్న వృత్తికి చదువును జోడించి తన ప్రత్యేకతనుచాటుకుంటున్నాడు.అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు చారమ్స్ హెయిర్ బ్యూటీ సెలూన్ నిర్వాహకుడు సంపత్ కుమార్. రాంగోపాల్పేట్ : సికింద్రాబాద్ కార్ఖానాలోని కాకాగూడకు చెందిన నారాయణ, సత్య దంపతుల కుమారుడు సంపత్కుమార్. తండ్రి సికింద్రాబాద్ వైఎంసీఏ కాంప్లెక్స్లో చారŠమ్స్ హెయిర్ డ్రెస్సింగ్ పేరుతో రెండు దశాబ్దాలుగా బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల వద్ద వ్యక్తిగత హెయిర్ డ్రెస్సర్గా కూడా పనిచేస్తున్నారు. కుమారుడు సంపత్కుమార్ 2011లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. కొద్దినెలల పాటు ఉద్యోగంలో చేరి నెలకు రూ.25 వేల నుంచి రూ.30వేల జీతం పొందేవాడు. కానీ ఆ ఉద్యోగం నచ్చక తండ్రి వద్దే హెయిర్ డ్రెస్సర్గా పనిచేస్తున్నాడు. అందరిలో ఒకడిగా ఉండకూడదని భావించి భిన్నంగా కనిపించాలని ఈ నిర్ణయానికి వచ్చాడతను. డిప్లొమాలు..ప్రముఖుల వద్ద శిక్షణ సంపత్కుమార్ హెయిర్ డ్రెస్సర్ వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అంతర్జాతీయ పోకడలు, ఫ్యాషన్, తదితర అంశాల్లొ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో డిప్లొమాలు చేశాడు. ముంబైలోని ఉదయ్ టెక్కీస్ ఇనిస్టిట్యూట్తో పాటు అంతర్జాతీయ నిపుణుల వద్ద పలు డిప్లొమా కోర్సులు పూర్తి చేశాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, హెయిర్, స్కిన్లకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలను ఆకళింపు చేసుకుని ముందుకెళ్తున్నాడు. నగరంలోనే ఈ రంగంలో ఇన్ని డిప్లొమాలు చేసి ఎంతో నైపుణ్యం సంపాదించుకున్న వారిలో సంపత్కుమార్ లాంటి వారు లేరంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఆలిండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ పోటీలను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ హెయిర్ బ్యూటిషియన్లు, మేకప్ ఆర్టిస్ట్లు పాల్గొన్నారు. ఇందులో సంపత్కుమార్ హెయిర్కట్, మేకప్లో బంగారు పతకం సాధించాడు. గతంలో సూరత్లో జరిగిన పోటీల్లోనూ సంపత్ వెండి పతకం సాధించాడు. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో బహుమతి సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇనిస్టిట్యూట్ పెడతా.. ఎంతోమంది తమ కులవృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. రోజురోజుకూ ఫ్యాషన్ ఈ రంగం విస్తృతమవుతోంది. ఈ వృత్తిలో ఉండేవారు నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునేందుకు ఒక ఇనిస్టిట్యూట్తో శిక్షణ అందించాలనుకుంటున్నాను.– సంపత్ కుమార్ -
స్కెచ్ ఫ్రమ్ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్లో హర్యానా స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులకు ఈ నెల తొలి వారంలో చిక్కిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సంపత్ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న నెహ్రా.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్నూ విడిచిపెట్టని విషయం విదితమే. అక్కడి పోలీసుల నిఘా తప్పించుకోవడానికి నగరంలో తలదాచుకున్న నెహ్రా... ఇక్కడి నుంచే తన దందాలు యథేచ్ఛగా కొనసాగించాడు. చండీగఢ్లోని తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడు. వాట్సప్ ద్వారా వీరికి ఆదేశాలు జారీ చేస్తూ ‘పనుల’కు పురమాయించాడు. ఈ ఐదుగురినీ అక్కడి మొహాలీ పోలీసులు గత వారం పట్టుకున్నారు. వీరిలో ఆర్మీలో నాయక్ హోదాలో పని చేస్తున్న వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. అవసరమైతే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను హత్య చేయాలంటూ ఇతడికి టాస్క్ అప్పగించినట్లు తెలిసింది. ఆ రెండు ప్రాంతాల్లోనే... సంపత్ ప్రధానంగా చండీగఢ్లోని మొహాలీ, పంచకుల ప్రాంతాల్లోనే తన దందాలు కొనసాగించాడు. అక్కడి వివిధ ప్రాంతాలకు చెందిన రామ్దీప్ సింగ్, శుభ్నవ్దీప్ సింగ్, జస్పీత్ సింగ్, గుర్వీందర్ సింగ్లను తన ప్రధాన అనుచరులుగ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతాల్లో వ్యవహారాలన్నీ వీరి ద్వారానే చేయించేవాడు. రాజస్థాన్లోని చురు జిల్లాకు చెందిన దినేష్కుమార్ ఆర్మీలోని సిగ్నల్ కారŠప్స్ విభాగంలో నాయక్గా పని చేస్తున్నాడు. ఇతడినీ తన అనుచరుడిగా మార్చుకున్న సంపత్.. ప్రత్యేక టాస్క్ల కోసం మాత్రమే రంగంలోకి దింపేవాడు. సిటీలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులతో కలిసి లోప్రొఫైల్ జీవితం గడిపిన సంపత్.. నిత్యం చాటింగ్స్, కాల్స్తో బిజీగా ఉండేవాడు. వీటి ద్వారానే అనుచరులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేవాడు. మొహాలీ, పంచకుల ప్రాంతాల్లో బెదిరింపులు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు కిడ్నాప్స్ సైతం చేయించాడు. దీనికోసం నలుగురు అనుచరులకూ రెండు .315 రివాల్వర్లు, .32 పిస్టల్, తూటాలతో పాటు కత్తులు, కారు సమకూర్చాడు. మొహాలీకి చెందిన వరీంద్రకుమార్ అనే యువకుడిని కిడ్నాప్ చేయించి భారీగా వసూలు చేశాడు. సొహాన ప్రాంతంలో ఓ కారుతో పాటు భారీ నగదు దోచుకున్నారు. సిటీలో సంపత్ను పట్టుకున్న తర్వాత మొహాలీ పోలీసులు రామ్దీప్ సింగ్, శుభ్నవ్దీప్ సింగ్, జస్పీత్ సింగ్, గుర్వీందర్ సింగ్లతో పాటు దినేష్ కుమార్నూ అరెస్టు చేశారు. సెలవుపై వచ్చి ‘డ్యూటీ’... నాయక్ దినేష్ ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన గ్యాంగ్లో కీలక సభ్యుడిగా ఉన్న ఇతడిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సంపత్ వాడేవాడు. ఇతడి నుంచి వర్తమానం అందిన ప్రతిసారీ సెలవు పెట్టుకుని వచ్చే దినేష్ తనకు అప్పగించిన ‘పని’ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేవాడు. అయితే ప్రస్తుతం తాను పూర్తి అజ్ఞాతంలో ఉండటంతో దినేష్ను రావాల్సిందిగా సంపత్ సూచించాడు. దీంతో ఏప్రిల్లో నెల రోజుల సెలవుపై ఇతగాడు మొహాలీ చేరుకొని మిగిలిన నలుగురు గ్యాంగ్ మెంబర్స్తో కలిసి ఉంటున్నాడు. సెలవు పూర్తయినప్పటికీ తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడంటే సంపత్ పెద్ద టాస్క్నే ఇతడికి అప్పగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘరానా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడిగా పని చేసిన సంపత్ అతడి ఆదేశాల మేరకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేశాడు. ఆయన నుంచి అందినకాడికి దండుకోవాలనే ఉద్దేశంతో సోషల్మీడియా ద్వారా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసు విచారణకు హాజరైనప్పుడు జోధ్పూర్ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ సల్మాన్కు గతేడాది వార్నింగ్ ఇచ్చాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న జోధ్పూర్ పోలీసులు సల్మాన్ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. అవసరమైతే సల్మాన్ ‘పని’ చేయాల్సిందిగా సంపత్ నుంచి దినేష్కు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని మొహాలీ పోలీసులు చెప్తున్నారు. తొమ్మిదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న దినేష్ ఏఏ నేరాలు చేశాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కోమటిరెడ్డి, సంపత్ కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణా
-
అధ్యయనం తర్వాతే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించిన విషయంలో తన పరిధిలో ఏం చేయగలనో చూస్తున్నానని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం స్పీకర్ను ఆయన చాంబర్లో కలిసి.. కోమటిరెడ్డి, సంపత్ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని, స్పీకర్గా ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి కోమటిరెడ్డి, సంపత్ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తూ.. వినతిపత్రం అందజేసింది. దాదాపు అరగంటకుపైగా జరిగిన ఈ భేటీలో స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వాదనలు విన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తారనే నమ్మకముంది: జానా కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదో ఘటనను సాకుగా చూపి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించడం, మిగతా సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని జానారెడ్డి స్పీకర్తో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చామని, బహిష్కరించిన సభ్యులకు న్యాయం చేసి సభ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో గతంలో వచ్చిన తీర్పులను కూడా స్పీకర్కు వివరించారు. ఇక శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ కూడా తన వాదన వినిపించారు. ఎలాంటి తప్పూ చేయకున్నా, తమ స్థానాల్లోనే ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారని... పంచాయతీరాజ్ చట్టంపై కనీస చర్చ జరగకుండా ఆమోదింపజేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కూడా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ను కలసిన వారిలో సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లతో పాటు సీఎల్పీ ఉపనేతలు టి.జీవన్రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, పద్మావతి, రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీ ఎంఏ ఖాన్, మాజీ మంత్రులు దానం నాగేందర్, మర్రి శశిధర్రెడ్డి, డి.శ్రీధర్బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్కుమార్ యాదవ్, రవీంద్రనాయక్ తదితరులు ఉన్నారు. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం..: జానా స్పీకర్ మధుసూదనాచారితో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి సభకు హుందాతనం తీసుకురావాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వమైనా స్పందించి ప్రతిష్టను కాపాడుకోవాలని సూచించారు. మధ్యవర్తిగా స్పీకర్ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. లేదంటే ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. తనకున్న పరిధులు, సందర్భాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న రీతిలో స్పీకర్ హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం కోసం వారం రోజులు వేచి చూస్తామన్నారు. అప్పటికీ నిర్ణయం వెలువడకుంటే తెలంగాణలో శాసనసభను, సమాజాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారనే విషయాన్ని రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తామని.. జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
హర్యానా మాఫియా డాన్ అరెస్ట్
-
మాఫియా డాన్ సంపత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ సంపత్ నెహ్రా పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని మియాపూర్లో గత కొంత కాలంగా పోలీసుల కన్నుగప్పి తలదాచుకుంటన్నాడు. ఈ నేపథ్యంలో పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ, హరియాణా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో పట్టుబడ్డాడు. సంపత్ హరియాణాలో మాఫియా డాన్గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఎవరికీ కనిపించకుండా తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాడు. ఎదిరించిన వారిని ఆధారాలు లేకుండా అంతమొందించడం సంపత్కు వెన్నతో పెట్టిన విద్య. అయితే పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు దాడులు జరపడంతో ఇరువై రోజుల క్రితం భాగ్యనగరానికి పారిపోయి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా మియాపూర్లో తన కార్యకలాపాలు జరుపుతున్నాడు. ఈనేపథ్యంలో సంపత్ గురించి పక్కా సమాచారం అందుకున్న హరియాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకులను స్వాథీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు పది హత్య కేసులు, మూడు హత్యాచార కేసులు, పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపుల కేసులు నమోదైనట్లు హరియాణ పోలీసులు వెల్లడించారు. -
వారికి ఏం రక్షణ ఉన్నట్లు?
సాక్షి, హైదరాబాద్ : ‘అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో ఉండటం అసౌకర్యంగా ఉందని భావించి, వారిని బహిష్కరిస్తుంటే, ఆ సభ్యులకు చట్ట ప్రకారం ఏం రక్షణ ఉన్నట్లు’అని హైకోర్టు ప్రశ్నించింది. కోమటిరెడ్డి బహిష్కరణకు మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసరడం కారణమైనప్పుడు, సంపత్ను ఏ కారణంతో బహిష్కరించారో చెప్పాలని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదిని నిలదీసింది. ఈ రెండు విషయాలపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ తీర్మానంతోపాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఈనెల 17న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా? వద్దా? అనే దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలను వినిపిస్తూ, సభ ప్రతిష్టను దిగజార్చేలా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారిని బహిష్కరించే అధికారం సభకు ఉందని వివరించారు. బహిష్కరణకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 184(3) ప్రకారం సభకు కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకు ఉందని, ఆ మేరకే కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరించారని చెప్పారు. సింగిల్ జడ్జి తన తీర్పులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బహిష్కరణ ఉందని చెప్పారే తప్ప, సభ్యుల అనుచిత ప్రవర్తన గురించి పట్టించుకోలేదని వివరించారు. మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్ తమ పిటిషన్లోనే అంగీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తీర్మానంలో ప్రస్తావించలేదు కదా? హెడ్ఫోన్ విసరడం వల్లే బహిష్కరించినట్లు ఎక్కడ పేర్కొన్నారు? అని ప్రశ్నించింది. హెడ్ఫోన్ విసిరి గాయపరిచిన ఘటనకు సభ మొత్తం సాక్ష్యమని, అలాంటి వాటికి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని వైద్యనాథన్ తెలిపారు. దీనికి ధర్మాసనం.. కోమటిరెడ్డిని హెడ్ఫోన్ విసిరిన కారణంగా బహిష్కరించామంటున్నారు.. మరి సంపత్ను ఏ కారణంతో బహిష్కరించారని అడిగింది. దీనికి వైద్యనాథన్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై తమకు స్పష్టతనివ్వాలని వైద్యనాథన్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోమటిరెడ్డి న్యాయవాదిపై ఆగ్రహం వాదనలు ప్రారంభం కావడానికి ముందు కోమటిరెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సింగిల్ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్ల తరఫున ఒక్కరే అఫిడవిట్లు దాఖలు చేసి.. తమ ముందు మాత్రం వేర్వేరుగా దాఖలు చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబితే, విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వైద్యనాథన్ స్పందించకపోవడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. -
ప్రగతి భవన్ వాళ్లతోనే నేలమట్టం..!!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభా నియమాల్ని ఉల్లఘించారనే కారణంగా ఎమ్మెల్యే పదవుల్ని కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ గురువారం పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరించి చేయని తప్పుకు తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారని వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మాకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకముంది. చేయని తప్పుకు మాకు శిక్ష విధించారు. మాకు తప్పక న్యాయం జరుగుతుంది. మా శాసన సభ్యత్వం రద్దు అంశం కోర్టు పరిధిలో ఉంది గనుక ఆ విషయంపై ఎక్కువగా మాట్లాడం’అని కోమటిరెడ్డి, సంపత్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు తనను రాజకీయంగా ఎవరూ ఏమీ చేయలేరని కోమటిరెడ్డి అన్నారు. ‘నా అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ది రాజకీయ హత్య’ అని ఆయన టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. మంత్రిగా పనిచేసిన తనకు కేసీఆర్ ప్రభుత్వం కావాలనే గన్మెన్లను తొలగించిందని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తనను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజల గుండెల్లో నాకు స్థానమున్నంత వరకు నన్నెవరూ ఏం చేయలేరు. నా ప్రాణానికి హాని జరిగితే నల్లగొండ ప్రజలు ప్రగతిభవన్ను నేలకూల్చి కేసీఆర్ను తెలంగాణ పొలిమేర దాటిస్తారని హెచ్చరించారు. మంత్రి జగదీశ్రెడ్డి కుటుంబానికి మూడు హత్య కేసులతో సంబంధముందని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ 6 రోజుల నుంచి ఫామ్ హౌజ్లో సేద తీరుతున్నాడని మండిపడ్డారు. -
తెలంగాణ అడ్వకేట్ జనరల్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ద్వారా గవర్నర్కు పంపినట్లు తెలిసింది. అయితే ప్రకాశ్రెడ్డి రాజీనామా లేఖపై గవర్నర్ నిర్ణయం వెలువడాల్సి ఉంది. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో ప్రకాశ్రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి బహిష్కరణ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో చోటుచేసుకున్న పరిణామాలే ప్రకాశ్రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 12న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సమర్పిస్తామంటూ హైకోర్టుకు ఏజీ హోదాలో ప్రకాశ్రెడ్డి హామీ ఇవ్వడంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా అలా ఎలా హామీ ఇస్తారని నిలదీయడంతో ఏజీ నొచ్చుకున్నట్లు సమాచారం. అంతేగాక ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం ప్రకాశ్రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఏజీకి స్పష్టం చేయడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజులుగా తర్జనభర్జన పడ్డ ఏజీ.. తన సన్నిహితుల వద్ద రాజీనామాపై చర్చించారు. అనంతరం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో లేఖను సీఎస్ ద్వారా గవర్నర్కు పంపారు. ఇదీ జరిగింది ఈ నెల 12న అసెంబ్లీలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన చేతిలో ఇయర్ ఫోన్ను విసిరేశారు. అది వెళ్లి వేదికపై ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్కు తగిలిందని, దీంతో ఆయన కంటికి గాయమైందంటూ వివాదం రేగింది. దీన్ని ఆధారం చేసుకొని నల్లగొండ ఎమ్మెల్యే వెంకట్రెడ్డితో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ను కూడా సభ నుంచి బహిష్కరించారు. నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం వర్తమానం పంపారు. ఈ నేపథ్యంలో ఆ ఇరువురు ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి దిగారు. తమ బహిష్కరణను సవాల్ చేయడంతో పాటు తమ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ముందుకెళ్లకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, అలాగే గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్ ఉల్లాసంగానే గడిపారు కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఈ నెల 19న విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇయర్ ఫోన్ విసిరిన తర్వాత కూడా మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉల్లాసంగా గడిపారని, వేదికపై ఉన్న స్పీకర్తో నవ్వుతూ మాట్లాడారని కోర్టుకు తెలిపారు. గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లే సమయంలో ఆయనతోపాటు బయట వరకు వెళ్లి వీడ్కోలు పలికి వచ్చారని, ఆ తర్వాతే ఇయర్ ఫోన్ వల్ల కంటికి గాయమైందంటూ ఆరోపణలు మొదలుపెట్టారని తెలిపారు. తర్వాత ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇయర్ ఫోన్ విసిరి మండలి చైర్మన్ను గాయపరిచినందుకు కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరించ లేదని, గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరించినందుకే బహిష్కరించామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నల్లగొండ, అలంపూర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇదే సమయంలో ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మీ ఆదేశాలు వద్దు.. నా హామీ చాలు ఈ సమయంలో ఏజీ ప్రకాశ్రెడ్డి స్పందిస్తూ.. వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీని తప్పక సమర్పిస్తామని, ఇది తన హామీ అని చెప్పారు. ప్రకాశ్రెడ్డి ఇచ్చిన ఈ హామీని నమోదు చేసిన న్యాయమూర్తి ఫుటేజీల సమర్పణ నిమిత్తం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఫుటేజీలు తీసుకోవాలంటే సభ తీర్మానం అవసరమని, అందువల్ల ఫుటేజీల సమర్పణకు మరింత గడువు కావాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఆ రోజున వీడియో ఫుటేజీలు సమర్పించి తీరాలని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం వద్ద రెండ్రోజుల క్రితం ఓ సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇలా హామీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఏజీని ప్రశ్నించినట్లు సమాచారం. ఫుటేజీలు సమర్పిస్తే వచ్చే ఇబ్బందులను సైతం సీఎం ఈ సందర్భంగా లేవనెత్తారు. అయితే ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏజీ ఏకీభవించలేదని తెలిసింది. సాల్వే నియామకంపై చెప్పని సర్కార్ తాను మాములు న్యాయవాదిగా ఆ హామీ ఇవ్వలేదని, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్గా హామీ ఇచ్చినందున దానికి ఓ విలువ ఉంటుందని ప్రకాశ్రెడ్డి అన్నట్టు సమాచారం. తాను ఇచ్చిన హామీపై వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని అన్నట్టు తెలిసింది. కానీ ఈ విషయంలో సీఎం అభిప్రాయం భిన్నంగా ఉండటంతో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాశ్రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి, సంపత్ల వ్యవహారంలో హైకోర్టులో జరుగుతున్న విచారణకు ఢిల్లీ నుంచి సుప్రీం సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకాశ్రెడ్డికి ఎలాంటి సమాచారం అందలేదు. సాల్వే ద్వారా వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ప్రకాశ్రెడ్డికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని అవమానంగా భావించిన ప్రకాశ్రెడ్డి ఏజీ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూలై 17న ప్రకాశ్రెడ్డి అడ్వొకేట్ జనరల్గా నియమితులయ్యారు. నేడు కేసు విచారణ తమ బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది. గవర్నర్ ప్రసంగం రోజున జరిగిన ఘటనలకు సంబంధించిన మొత్తం ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు గత వారం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో న్యాయస్థానం తదుపరి ఏం ఆదేశాలు ఇవ్వబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోమటిరెడ్డి, సంపత్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. -
తెలంగాణలో ఈ రోజు బ్లాక్డే
సాక్షి, హైదరాబాద్: నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ శాసనసభ్యత్వాలను రద్దుచేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ మంగళవారం సాయంత్రం గాంధీభవన్లో దీక్షకు దిగారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరిట 48 గంటలపాటు కొనసాగనున్న నిరాహార దీక్ష ప్రారంభం సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపడమే లక్ష్యంగా మనమంతా పనిచేద్దామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్లాగా ఆస్పత్రిలో తాను దొంగ దీక్షలు చేయలేదని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు అప్పగించి.. కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలకు భయపడేది లేదని, సంపత్ను 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. పోడియం వద్ద ఉన్నా సమయంలో తాను విసిరివేసిన పేపర్లు చూపిస్తున్నారు, కానీ, స్వామి గౌడ్కు గాయం అయ్యే సమయంలో విజువల్స్ చూపించడం లేదని అన్నారు. 2019 ఎన్నికలో తెలంగాణలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఓడించి, బయటి దేశాలకు పంపిద్దామని అన్నారు. ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ.. ఆలంపూర్ ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారని, రైతులు, విద్యార్థులు, యువత గొంతుగా తాను అసెంబ్లీలో గళమెత్తానని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ హామీ ఏమైందని కేసీఆర్ను ప్రశ్నించారు. -
కేసీఆర్లాగా ఆస్పత్రిలో దొంగ దీక్షలు చేయలేదు
-
గాంధీభవన్లో ’ప్రజాస్వామ్య పరిరక్షణ’ నిరాహార దీక్ష
-
సభ్యులపై వేటు.. కాంగ్రెస్ యాక్షన్ప్లాన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్ : నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేల శాసన స్వభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఈ మేరకు దూకుడుగా ముందుకువెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష చేపట్టనున్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరిట గాంధీభవన్లో ఈ ఇద్దరు నేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. వీరి దీక్షకు సంఘీభావంగా సీనియర్ నాయకులంతా పాల్గొననున్నారు. అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేల స్వభ్యత్వం రద్దుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, ఈ విషయంలో న్యాయపోరాటం కూడా చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసే అవకాశముంది. అదేవిధంగా కోమటిరెడ్డి, సంపత్పై చర్యలకు వ్యతిరేకంగా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నిరసన సభలు చేపట్టాలని వ్యూహం సిద్ధంచేస్తోంది. అధిష్టానం నుంచి అనుమతి రాగానే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతంగా నిర్వహించాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఆ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వేదికపైకి హెడ్సెట్ విసిరేయడం.. అది తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్కు గాయం అయింది, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు చెందిన మొత్తం 11 మంది సభ్యులను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి శాసన మండలిలోనూ ఐదుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. -
సంపత్ను చేర్చుకోవాల్సిన అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని టీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు అన్నారు. మంత్రి హరీశ్రావుపై సంపత్ వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆర్డీఎస్పై సంపత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారని లీకులు ఇవ్వాల్సిన అవసరం హరీశ్కు లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పథకం శంకుస్థాపన నడిగడ్డ ప్రజల కళ్ళలో కొత్త కాంతులు నింపిందన్నారు. కేసీఆర్ పాదయాత్ర వల్లే తుమ్మిళ్ల లిఫ్టు రూపుదిద్దుకుందన్నారు. ఇకనైనా రేవంత్, సంపత్లు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. -
అన్ని వర్గాల సమస్యలపై పోరాటం
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ సాధనకు ఉద్య మం చేసిన విద్యార్థులు.. కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 14 లక్షల మంది విద్యార్థు లకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసెంబ్లీ వద్ద శనివారం వారు మీడియాతో మాట్లాడారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రీయింబర్స్మెంట్పై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించడం లేదన్నారు. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లోని 38 మంది విద్యార్థు్థల మరణాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 లోగా ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేదంటే విద్యార్థి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తున్నారని, తమ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. -
కన్ఫర్మ్: రేవంత్ వస్తున్నాడు..!
వికారాబాద్ అర్బన్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడం గల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. ఎస్సీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్కు వచ్చారు. మాజీమంత్రి గడ్డం ప్రసాద్కుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో సంపత్ మాట్లాడారు. బూటకపు మాటలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ను 2019లో గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. రేవంత్ కాంగ్రెస్లో చేరడం ఖాయమని, ఆయన వస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్లో చేరేందుకు చాలామంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. -
సీఎం హామీ ఏమైంది?: సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి అఖిలపక్ష బృందంతో వచ్చి కేంద్ర పెద్దలతో కలుస్తానన్న సీఎం కె.చంద్రశేఖర్రావు హామీ ఏమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యే సంపత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 28 తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే ఒక్క అంశంపై కూడా కేంద్రం నుంచి స్పందన లేదు’ అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. -
సొంత పార్టీపై అలిగిన ఎమ్మెల్యే సంపత్
-
సీఎల్పీ మీటింగ్లోనే చర్చిస్తా: సంపత్
హైదరాబాద్: తనకు కలిగిన అవమానంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎల్పీ మీటింగ్లోనే జరిగిన అంశంపై చర్చిస్తానన్నారు. తనను కలిసిన ఎమ్మెల్యేలకూ ఇదే విషయం చెప్పానన్నారు. సీఎల్పీ మీటింగ్ పై ఇంకా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో.. వంశీచంద్కు మైక్ ఇవ్వాలని పదే పదే కోరిన జానారెడ్డి తనకు మైక్ ఇవ్వాలని అడగలేదంటూ సంపత్కుమార్ పార్టీపై అలిగిన విషయం విదితమే. -
సొంత పార్టీపై అలిగిన ఎమ్మెల్యే సంపత్
హైదరాబాద్: సొంత పార్టీపై అలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ శనివారం నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఇది గుర్తించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చెన్నారెడ్డి సంపత్ను బుజ్జగించేందుకు యత్నించారు. సంపత్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో.. వంశీచంద్కు మైక్ ఇవ్వాలని పదే పదే కోరిన జానారెడ్డి నాకు మైక్ ఇవ్వాలని అడకకపోవడం బాధాకరం. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపినందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. అందుకే ఎస్సీ, ఎస్టీ బిల్లుపై మాట్లాడేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. సబ్ కమిటీ సభ్యుడినైన నాకే అవకాశం రాకుండా చేశారు. మా నాయకులు కూడా నా వైపు నిలవలేదు. ఈ రోజు కాంగ్రెస్తో కాకుండా ప్రత్యేకంగా కూర్చుంటా.. జోకర్లు, బ్రోకర్ల కోసం రాత్రి 11 గంటల వరకు సభ నడిపారు’ అని ఆరోపించారు. -
'ఆ ఇద్దరూ వాడుకుంటున్నారు'
హైదరాబాద్సిటీ: ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తమ రాజకీయ ప్రాయోజనాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. దళితుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటూ, దళితుల సంక్షేమం పై దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. దళితుల సంక్షేమం పై ప్రభుత్వం శ్వేత పత్రం ఇచ్చెందుకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా దళితులకు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, వెంకయ్యల దుర్భుద్దే అఖిలపక్ష సమావేశం వాయిదాకు కారణమని అన్నారు. వీరిద్దరికి దళితులపై చిత్తశుద్ధి లేదన్నారు. వర్గీకరణపై ఇప్పటికే 90శాతం పనిని నాటి యూపీఏ ప్రభుత్వం పూర్తిచేసిందని తెలిపారు. వర్గీకరణపై ప్రధానితో మాట్లాడకుండా హైదరాబాద్కు వస్తే దళితుల ఆగ్రహాన్ని చవిచూస్తారని అన్నారు. -
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట సంపత్కుమార్!
పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం న్యూశాయంపేట : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట సంపత్కుమార్ మూడోసారి ఎన్నికవనున్నారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కోశాధికారిగా దుబ్బ రమేష్ ఎన్నికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది. కాగా, సోమవారం తోట సంపత్కుమార్ ప్యానల్ హంటర్రోడ్లోని అసోసియేషన్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించింది. నామినేషన్ల స్వీకరణకు సోమవారం 4 గంటల వరకు అవకాశం ఉండగా, మూడు పదవులకు ముగ్గురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న తోట సంపత్కుమార్ పేరును బుద్ధా ప్రభాకర్రావు, తోట సాంబయ్య ప్రతిపాదించారు. ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తున్న ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు పేరును చిదురాల వేణుగోపాల్, ఎర్రబెల్లి రాంగోపాల్రావు ప్రతిపాదించారు. కోశాధికారిగా పోటీ చేసిన దుబ్బ రమేష్ పేరును టి.యుగంధర్, కృష్ణమూర్తి ప్రతిపాదించారు. అసోసియేషన్ ఎన్నికల కోసం గత నెల 27న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 2,3 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గత బుధవారంతో గడువు ముగిసింది. ఈనెల 8న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పోటీలో ఎవరూ లేకపోవడంతో తోట సంపత్కుమార్ ప్యానల్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుధవారం(ఈనెల 5న) అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్.రాజగోపాల్రావు తెలిపారు. మిగతా గవర్నింగ్ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు. రైస్మిల్లర్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా : సంపత్ రైస్ మిల్లర్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని తోట సంపత్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అందరి సహకారంతో అసోసియేషన్ను ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకట్నారాయణగౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు దేవునూరి అంజయ్య, గోనె రవీందర్, మాధవ శంకర్ ప్రభాకర్, తోట చంద్రయ్య, ఇరుకుల్ల రమేష్ పాల్గొన్నారు. డబ్ల్యూజీఎల్ 401 : నామినేషన్లు పత్రాలు అందజేస్తున్న తోట సంపత్కుమార్, తదితరులు -
ఫొటోగ్రాఫర్ సంపత్కు ఏఐఐపీసీ అవార్డు
ఖమ్మంఅర్బన్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ సంపత్కు ఏఐఐపీసీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు . శుక్రవారం ఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో ఐఐపీసీ (ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఐపీసీ చైర్మన్ ఓపీ శర్మ చేతుల మీదుగా అందించారు.ఫొటోగ్రఫీ పోటీల్లో సంపత్ ఫొటోలను ఎంపిక చేసి అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు. -
గొంతుకోసి పారిపోతూ..
ఖమ్మం జిల్లా గుండాల మండలం ఆళ్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసి పరారైన దుండగులను బోడు పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి గ్రామానికి చెందిన సంపత్ (29)పై ఆదివారం దుండగులు కత్తులతో దాడి గొంతు కోసి పరారయ్యారు. దీంతో గుండాల పోలీసులు చుట్టు పక్కల స్టేషన్లలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. పారిపోతున్న ఇద్దరు నిందితులను టేకులపల్లి మండలం బోడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా.. నిందితులు దుమ్ముగూడెం మండలానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కామాంధులకు 20 ఏళ్ల కారాగారం
ఓ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయస్థానం జడ్జి చిదానందం సోమవారం తీర్పు చెప్పారు. 2013లో చిత్తూరు జిల్లాలోని పెనుమూరు ప్రాంతంలో ఓ మహిళను తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన సంపత్, కాశి బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు
తట్టుకోలేక కూతురితో కలసి భర్తను చంపిన భార్య వీణవంక: కన్నకూతురిపై కన్నేసిన తండ్రి లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. వేధింపులు తట్టుకోలేక అతడి భార్య కూతురుతో కలసి అతడిని హతమార్చిన ఉదంతం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్లో ఆదివారం జరిగింది. జిల్లాలోని కమలాపూర్ మండలం కన్నూర్కు చెందిన రావుల సంపత్ అత్తగారి ఇల్లయిన నర్సింగాపూర్కు పదేళ్ల క్రితం కుటుంబంతో సహా వచ్చాడు. సంపత్కు భార్య తిరుపతమ్మ, కూతురు(16), కుమారుడు వంశీ ఉన్నారు. సంపత్, తిరుపతమ్మ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఇప్పుడు పరీక్షలు రాస్తోంది. మద్యానికి బానిసైన సంపత్ కన్ను కన్నకూతురుపై పడింది. తన లైంగిక వాంఛ తీర్చమంటూ ఐదు నెలలుగా కూతురును వేధిస్తున్నాడు. శనివారం రాత్రి బాగా మద్యం తాగి వచ్చిన అతడు కూతురును కోరిక తీర్చమంటూ వేధించాడు. ఇది తట్టుకోలేక సంపత్ భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి లక్ష్మి, కూతురు కలసి సంపత్ను ఇంటి ముందు కర్రకు కట్టేసి రోకలిబండతో చితకబాదారు. తీవ్ర రక్తస్రావంతో సంపత్ ఆదివారం ఉదయం మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను హతమార్చిన భార్య
వీణవంక : మద్యానికి బానిసై వేదిస్తున్న భర్తను భార్య హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన సంపత్, తిరుమల దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సంపత్.. భార్యా పిల్లలను వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి సంపత్ను ఇంట్లో బంధించి రోకలి బండతో కొట్టి చంపింది తిరుమల. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నచ్చే ప్రేమగాథ
చిత్రం: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, తారాగణం: నాని, మెహరీన్, ‘మిర్చి’ సంపత్, మాటలు: జై కృష్ణ, పాటలు: కృష్ణకాంత్, కెమేరా: యువరాజ్,యాక్షన్: విజయ్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: హను రాఘవపూడి ఈ మధ్య చూసిన సినిమాల్లో కథ గురించి, టేకింగ్ గురించి, ప్లాట్ గురించి, కెమెరా వర్క్ గురించి మాట్లాడడం సహజంగా జరుగుతోంది. ఈ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ దర్శకుడు హను.. మంతుడు... అంటే పనిమంతుడు అని చెప్పాలనిపిస్తుంది. దర్శ కత్వ ప్రతిభ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కృష్ణగాడి (నాని) వీర ప్రేమగాథ చిన్నప్పుడే మొదలైంది. పదేళ్ల వయసులో మహాలక్ష్మిని (మెహరీన్) ప్రేమిస్తాడు. కానీ చెప్పుకోలేడు. చెబితే వాళ్ల అన్న రామరాజు కుళ్లబొడుస్తాడేమోనని భ యం. కాదు ప్యాంటు తడుపుకునేంత భయం. ఎందుకంటే మహాలక్ష్మి అన్న రాయలసీమలోని ముఠా నాయకుడు రాజన్నకు నమ్మినబంటు. చాలా పరాక్రమశాలి. ఓ ఇరవైమందిని ఒంటి చేతితో మట్టి కరిపించగల శక్తిమంతుడు. ఇతని ప్రత్యర్థి అప్పిరెడ్డి... రాజన్నను చంపాలనే ప్రయత్నంలో తన ఐదుగురు కొడుకులను పొగొట్టుకుంటాడు. అతణ్ణి ఎప్పుడె ప్పుడు చంపుదామని చూస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్కి కూడా అన్నకు తగ్గట్టు కాస్త తెగువ ఎక్కువే. దాని వల్ల హీరో నానికి కష్టాలు కావాల్సినన్ని. చిన్నతనం నుంచి పెకై ప్పుడూ దెబ్బలాడు కునే హీరో, హీరోయిన్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించేసుకుం టారు. ‘మా అన్నకు చెప్పి ముహూర్తం పెట్టమ’ని హీరోయిన్ ఒత్తిడి చేస్తుంది. కానీ ‘మీ అన్నే వచ్చి నన్ను అడగాలి’ అని తప్పించుకునే పిరికివాడు హీరో. రాజన్నకు ఓ తమ్ముడు. పేరు శ్రీకాంత్ (‘మిర్చి’ సంపత్). హైదరాబాద్లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. ఎవరికీ భయపడని నీతిమంతుడు. అరెస్ట్ చేస్తే జాబ్ చేస్తున్నట్టు ఉంటుందని, ఎన్కౌంటర్ చేస్తే జాబ్ ‘బాగా’ చేస్తు న్నట్టుంటుందని అతని నమ్మకం. క్రిమినల్స్ని అతను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్నట్టు, వదిలేస్తే మిస్సింగ్ న్యూస్లో ఉంటారు. ఎంతటి మూర్ఖుడంటే డీఎస్పీని కూడా ఎన్కౌంటర్ చేసే టైప్. ఇంతలో దుబాయ్ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డాన్ సింగపూర్ నుంచి డేవిడ్ ఇబ్రహీం(మురళీశర్మ) హైదరాబాద్లోకి ఎంటరవుతాడు. వాళ్ల అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో చాదర్ సమర్పించుకోవడానికి వస్తాడు. ఆ సమయం లోనే ర్యాష్ డ్రైవింగ్ కేసులో మురళీశర్మను ‘మిర్చి’ సంపత్ అరెస్ట్ చేస్తాడు. ఇక ‘మిర్చి’ సంపత్కున్న ఎన్కౌంటర్ ఇమేజ్కు భయ పడి, తమ భాయ్ని విడిపించుకోవడం కోసం రాజన్న దగ్గరకొ చ్చిన అతని పిల్లల్ని కిడ్నాప్ చేయాలని యత్నిస్తారు భాయ్ అను చరులు. ఈ ప్రయత్నాన్ని హీరోయిన్ అన్న విఫలం చేసి పిల్లల్ని హీరో నానికి అప్పగిస్తాడు. ఈ పిల్లల్ని జాగ్రత్తగా హైదరాబాద్కు తీసుకువెళితే తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. చావడానికి కాదు బ్రతకడానికి ఓ ధైర్యం కావాలి అన్న ఫిలాసఫీ వెనక దాక్కునే పరమ పిరికి క్యాండిడేట్ మన హీరో. శుద్ధ పిరికివాడైన హీరోగారి నాన్న ఎవరి పిల్లవాడినో కాపాడ బోయి తన ప్రాణాల్ని పోగొట్టుకుంటాడు. అందుకే తండ్రిని మూర్ఖుడనుకుంటాడు హీరో. ఇంతలో హీరోయిన్ అన్న ఇచ్చిన ఆఫర్కి ఉబ్బిత బ్బిబై, పిల్లల్ని హైదరాబాద్ చేర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సెకండాఫ్లో కావాల్సినంత కామెడీ, అంతకంటే ఎక్కువ ట్విస్టులతో కథ సుఖాంతమవుతుంది. పిరికి హీరో- వాళ్ల నాన్న చేసిన త్యాగాన్ని గౌరవించడమే కాక ధైర్యవంతుడిగా ఎలా మారతాడనేది డెరైక్టర్ తెరపై క్రియేట్ చేసిన రెండున్నర గంటల ప్రయాణం. ప్రేమ హీరోతో ఏమైనా చేయిస్తుందనేది మనందరికీ తెలిసిన విషయం. సినిమా మీద ప్రేమతో ఈ టీమ్ చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. సినిమా సెకండ్ హాఫ్ అంతా ప్రధానంగా ముగ్గురు చిన్నపిల్లల చుట్టూరా నడపడం తెలివైన ఎత్తు. సినిమాను ఫ్యామిలీలకు సన్నిహితం చేసి, ఆడి యన్స మార్కెట్ సైజ్ పెంచడానికి ఉపకరించే బాక్సాఫీస్ వ్యూహం. పాత్రలకు నటుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హీరో ఫ్రెండ్గా ‘సత్యం’ రాజేశ్, అలాగే మురళీశర్మ, బ్రహ్మాజీ, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి, ‘ప్రభాస్’ శ్రీను నవ్విస్తారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీజీ, డీఐ, విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ తీయగా ఉన్నాయి ఏదీ అతిగా లేదు. కెమేరామన్ యువరాజ్ విజువల్స్, ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే ‘నువ్వంటే నా నవ్వు...’ పాట, ఆ లొకేషన్లు, చిత్రీకరణ తాజా అనుభూతినిస్తాయి. సాహిత్యమూ బాగుంది. నానీని పట్టుకోలేము అన్నంత బాగా పెర్ఫార్మ్ చేశాడు. స్ప్లిట్ సెకండ్లో హావభావాల్ని మార్చాల్సిన సన్నివేశాలు ఎన్నో స్క్రిప్ట్లో ఉన్నాయి. అన్నీ పట్టువిడుపులతో ఆడుకున్నాడు. హను రాఘవపూడి, నాని - ఇద్దరూ ఇద్దరే. ఇది వీళ్లిద్దరి వీరగాథ. - ప్రియదర్శిని రామ్ -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
పొన్నూరు(గుంటూరు): అభం శుభం తెలియని చిన్నారి పై ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపుడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కొండమూది సంపత్(16) బిస్కెట్ కొనిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం పాపను అక్కడే వదిలేసి వెళ్లడంతో.. ఎడ్చుకుంటూ ఇంటికి చేరిన చిన్నారిని కుటుంబ సభ్యులు ఏం జరిగిందని అడగడంతో.. చిన్నారి జరిగిన విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జనవరిలోగా పోస్టల్ ఏటీఎంలు
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే జనవరి లోగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోని 16 పట్టణాల్లో పోస్టల్ ఏటీఎం మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ సంపత్ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ నుంచి పరికరాలు రాగానే వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం గుంటూరులో జరిగిన అఖిల భారత పోస్టల్ ఉద్యోగ సంఘం గ్రూప్-సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన సీపీఎంజీ సంపత్.. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్) గురించి పలు వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 25 వేల పోస్టాఫీసులున్నాయనీ, దశల వారీగా వీటిని కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోస్టాఫీస్లన్నింటినీ కంప్యూటరీకరణ చేస్తున్నామనీ, ఆఫీసులన్నింటినీ మెయిన్ సర్వర్ కిందకు తెచ్చేందుకు సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. దీనివల్ల ఖాతాదారులు ఎక్కడైనా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుందని వివరించారు. సోమవారం నుంచి ఆంధ్రా, తెలంగాణ సర్కిళ్ల పరిధిలోని 60 పోస్టాఫీస్లను సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్తున్నామని, విజయవాడ రీజియన్ పరిధిలోని 15 పోస్టాఫీస్లు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించామన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని పోస్టాఫీస్లనూ సీబీఎస్ పరిధిలోకి తీసుకెళ్లడం పూర్తయితే, బ్యాంకు ఏటీఎంలతోనూ పోస్టల్ ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుందని సీపీఎంజీ సంపత్ వివరించారు. -
పోస్టల్ నిధుల గోల్మాల్పై విచారణ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు పోస్టల్ సర్కిల్లోని పోస్టాఫీసుల్లో జరిగిన నిధుల గోల్మాల్పై పోస్టల్ శాఖ డెరైక్టర్ విచారణ చేస్తున్నారని పోస్ట్మాస్టర్ జనరల్ (పీఎంజీ) సంపత్ వెల్లడించారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన శనివారం జిల్లాలోని పలు పోస్టాఫీసులను ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా తొలుత ఒంగోలు హెడ్పోస్టాఫీస్ను పీఎంజీ పరిశీలించారు. జిల్లాలోని పోస్టాఫీసుల్లో దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు గోల్మాల్ అయిన విషయాన్ని ‘సాక్షి’ ఆయన దృష్టికి తీసుకెళ్లింది. సింగరాయకొండ, కందుకూరు, ఒంగోలు పోస్టాఫీసుల్లో నిధుల గోల్మాల్ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోస్టుబాక్స్ తీసిందీ లేనిది ‘నాణ్యత’తో తెలుసుకోవచ్చు... పోస్టల్ శాఖకు సంబంధించిన నూతన పథకాల గురించి వివరించారు. కొత్తగా ‘నాణ్యత’ పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్లో ప్రవేశపెట్టారన్నారు. పోస్ట్బాక్స్ లోపల డేటాబేస్ చిప్ అమర్చి, ఆ చిప్ నుంచి నేరుగా పోస్టల్ కార్యాలయాలకు ఆన్లైన్ కనెక్షన్ ఇస్తారన్నారు. ఈ ఆన్లైన్ ద్వారా హైదరాబాద్లోని చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ ప్రతిరోజు పోస్ట్బాక్సుల్లో వేసిన ఉత్తరాలు తీస్తున్నది, లేనిది తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి పోస్ట్బాక్సులో రోజూ ఎన్ని ఉత్తరాలు వేస్తున్నారో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన అర్థమవుతుందని చెప్పారు. పోస్టాఫీసుల్లో మీ-సేవ: పోస్టాఫీస్ల్లో మీ-సేవ సౌకర్యం కూడా కల్పించామని పీఎంజీ తెలిపారు. 90 రకాల డాక్యుమెంట్లు మీ-సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. రెవెన్యూ రికార్డుల మొదలుకొని అనేక రకాల రికార్డులను అందించవచ్చునన్నారు. ‘సునాయాసం’ అనే మరో పథకాన్ని కూడా మీ-సేవతో పాటు ఏర్పాటు చేశామని.. ఈ పథకం ద్వారా వాటర్ బిల్లులు, విద్యుత్, మున్సిపల్, టెలిఫోన్ బిల్లులతో పాటు వినియోగదారులకు అవసరమైన మరికొన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా అన్ని పోస్టాఫీసులను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాల్లో పర్యటించి పోస్టాఫీసుల్లో ఉండాల్సిన స్టేషనరీ, వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించటానికి అన్ని రకాల అప్లికేషన్లు, ఫారాలు వృథా కాకుండా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు వివరించారు. ఒంగోలు హెడ్పోస్టాఫీస్కు కంప్యూటర్లు కావాలని, వీటితో పాటు మరికొన్ని స్టేషనరీ అవసరమవుతాయని చెప్పారని అందుకోసం అన్ని సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇక్కడ నుంచి అద్దంకి పోస్టాఫీస్ను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయనతో పాటు ఒంగోలు హెడ్ పోస్ట్మాస్టర్ పి.వెంకటేశ్వర్లు, ఎస్ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలు
జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పోలింగ్ డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు ఢిల్లీలోని మూడు అసెంబ్లీ స్థానాలకూ వచ్చేనెల 25నే ఉప ఎన్నికలు తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులేవీ లేవన్న ఈసీ న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 మధ్య మొత్తం ఐదు దశల్లో ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువ రించింది. డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపింది. శనివారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఢిల్లీల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు(కృష్ణానగర్, మెహ్రౌలీ, తుగ్లాబాద్) కూడా నవంబర్ 25నే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ మూడు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీజేపీ నేతలు హర్షవర్ధన్, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధురిలు ఎంపీలుగా నెగ్గడంతో ఆయా చోట్ల తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ల్లో తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. జమ్మూకాశ్మీర్లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో ఎన్నికలు వాయిదా వేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ వాయిదా కోసం గట్టిగా పట్టుబట్టింది. అయితే ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేమీ లేదని వీఎస్ సంపత్ తెలిపారు. అక్కడి అధికార యంత్రాంగంతో, వివిధ రాజకీయపార్టీలతో పలుమార్లు సమావేశమయ్యామని, అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపినట్లు చెప్పారు. కాగా, ఓటు ఎవరికి వేశారో నిర్ధారించుకునేందుకు ఓటర్లకు రసీదును ముద్రించి చూపే ‘ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ’ విధానాన్ని అమలు చేయనున్నారు. జమ్మూకాశ్మీర్లో మూడు, జార్ఖండ్లో ఏడు స్థానాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. జమ్మూకాశ్మీర్ శాసనసభ గడువు జనవరి 19, 2015తో పూర్తవనుంది. జార్ఖండ్ అసెంబ్లీకి జనవరి 2, 2015తో గడువు ముగియనుంది. ప్రస్తుతం జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తిమోర్చా, ఆర్జేడీలు మిత్రపక్షాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. జమ్మూకాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా అధికారంలో కొనసాగుతున్నాయి. బాధితులను వదిలి.. రాజకీయాలు: సీఎం ఒమర్ వరద బాధితులను ఆదుకోవాలని తాము భావిస్తుంటే.. మిగతా పార్టీలు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో తుపాను సహాయ కార్యక్రమాలకు విఘాతం ఏర్పడుతుందని పేర్కొంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్నికలకు దూరంగా ఉండే ప్రశ్నే లేదని, తమ శక్తిమేరకు పోరాడతామని చెప్పారు. ‘‘ప్రజలు ఇంకా తుపాను బీభత్సం నుంచి తేరుకోలేదు. బాధితులను ఆదుకోవాల్సిన సమయమిది. కానీ మేం తప్ప మిగతా పార్టీలు దీనిపై దృష్టి పెట్టడం లేదు’’ అని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అలీ మొహమ్మద్ సాగర్ అన్నారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ వెలువరించడాన్ని అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ స్వాగతించాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 14 లోక్సభ స్థానాలకుగాను 12 సీట్లను నెగ్గిన బీజేపీ మంచి ఊపు మీద ఉంది. -
పంచలోహ విగ్రహ దొంగల అరెస్ట్
వరంగల్ క్రైం : పంచలోహ విగ్రహాన్ని అక్రమంగా విక్రరుుస్తున్న నలుగురిని వరంగల్ సీసీఎస్ పోలీసు లు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీస్స్టేష న్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు నిందితుల వివరాలు వెల్లడించారు. జిల్లాలోని కొత్తగూడ మం డలంలోని వేలుబెల్లి గ్రామానికి చెందిన కనకంటి సంపత్, ఇదే మండలానికి చెందిన వాసం సురేష్, నెక్కొండ మండల కేంద్రానికి చెందిన యాట పూర్ణచందర్, కాజీపేట సిద్ధార్థనగర్కు చెందిన ఖమ్మం కృష్ణలు స్నేహితులు. ఇందులో సంపత్, సురేష్లు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండ గా, పూర్ణచందర్ కూలీగా, ఖమ్మం కృష్ణ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే వాసం సురేష్ ఇటుకల తయారీకి కావాల్సిన మట్టికోసం కొద్దిరోజుల క్రితం తన వ్యవసాయ భూమిలో మట్టి గడ్డను తవ్వుతుండగా అక్కడ ఒక బండరాయి బయటపడింది. దానిపై సూర్యుడు, చంద్రుడు, శంకరుడు బొమ్మలు చెక్కి ఉండడంతో సురేష్ నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఆంజనేయస్వామి భక్తుడు పూర్ణచందర్ కు విషయం చెప్పాడు. దీంతో సురేష్, పూర్ణచందర్ లు కలిసి ఇటీవల బండరాయి కనిపించిన ప్రదేశాని కి చేరుకున్నారు. అయితే బండరాయి బయటపడిన ప్రాంతంలో మరికొద్ది లోతు తవ్వితే పంచలోహ వి గ్రహాలు, గుప్తనిధులు లభిస్తాయని పూర్ణచందర్.. సురేష్కు సూచించాడు. దీంతో వారు పక్కనే ఉన్న మరో రైతు సంపత్తో కలిసి బయటపడిన బండరా యి ప్రదేశంలో లోతుగా తవ్వడంతో ఏకదంతంపై వినాయకుడు చెక్కి ఉన్న పంచలోహ విగ్రహం బయటపడింది. అయితే విగ్రహం విలువైనదిగా గ్రహించిన నిందితులు దానిని ప్రభుత్వానికి అందించకుండా ఖమ్మం కృష్ణ ద్వారా విగ్రహాన్ని బయట వి క్రయించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు విగ్రహాన్ని పట్టుకుని కాజీపేట రైల్వే బ్రిడ్జి పరి సర ప్రాంతంలో కొనుగోలుదారుడి కోసం గురువా రం వేచిచూస్తున్నారు. స్థానికుల సమా చారం మేర కు క్రైం ఇన్స్పెకర్ ఆదినారాయణ సిబ్బందితో కలిసి నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరా న్ని ఒప్పుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ తెలి పారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అర్బన్ క్రైం డీఎస్పీ రాజామహేంద్రనాయక్, ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, ఎస్సై లక్మీనారాయణ, హెడ్కానిస్టేబుల్ టి.వీరస్వామి, కె.శివకుమార్, సదానందం, కానిస్టేబుళ్లు మహేశ్వ ర్, రవికుమార్, జంపయ్యను ఎస్పీ నగదు బహుమ తి ప్రకటించి అభినందించారు. -
సినిమా రివ్యూ: పవర్
బలుపు చిత్ర విజయం తర్వాత ’మాస్ మహారాజ’ రవితేజ తదుపరి చిత్రం పవర్. గతంలో డాన్ శ్రీను, మిస్టర్ ఫర్ఫెక్ట్, బలుపు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కే ఎస్ రవీంద్ర) పవర్ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తారు. హన్సిక, రెజీనాలతో కలిసి రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’ బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్ను, తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్టైన్మెంట్ను అందించడంలో రవితేజ తన మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిరుపమ పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్తో ఆలరించారు. కథకు తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు. ఆణిముత్యం పాత్రలో బ్రహ్మనందం మరోసారి తనదైన శైలిలో నవ్వులు విరబోయించారు. ఆణిముత్యం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆణిముత్యం పాత్రతో తెలుగు చిత్రాలకు తన అవసరం ఎంత ఉందో అనే అంశాన్ని మరోసారి బ్రహ్మనందం ప్రూవ్ చేసుకున్నారు. ఇటీ వల కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో పాలుపంచుకుంటున్న సప్తగిరి అవకాశం లభించిన ప్రతిసారి మెరుపులు మెరిపించారు. నిడివి తక్కవైనా సప్తగిరి తన హాస్యంతో ప్రభావం చూపడంలో సఫలమయ్యారు. విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్రాజ్ పరిమితమయ్యారు. టెక్నికల్ రొటిన్ కథకు మోహన కృష్ణ, కే చక్రవర్తితో కలిసి కోన వెంకట్ అందించిన మాటలు అక్కడక్కడా బుల్లెట్లా పేలాయి. రవితేజ ఎనర్జీకి, కథకు తగినట్టుగా మాటలతో కోన ఆకట్టుకున్నారు. జయనన్ విన్సెంట్తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫి బాగుంది. రవితేజను మరింత గ్లామర్గా చూపించారు. చిత్ర ఆరంభంలో వచ్చే యాక్షన్, చేజింగ్ ఎపిసోడ్స్ టాలీవుడ్ రే ంజ్కు మించి ఉన్నాయి. మ్యూజిక్ తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ పాడిన నౌటంకి పాట వినడానికే కాకుండా తెరపై చూడటానికి కూడా బాగుంది. ఇతర పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే తమన్ అందించిన సంగీతంలో కొత్తదనమేమి కనిపించలేదు. రెగ్యులర్ బాణీలే మళ్లీ మళ్లీ వింటున్నామా అనే సందేహం కలుగుతుంది. దర్శకత్వం: రచయితగా గుర్తింపు పొంది.. దర్శకుడిగా మారిన బాబీ.. తన తొలి చిత్రంలో సాహసానికి ఒడిగట్టకుండా రెగ్యులర్ సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని పవర్ తెరకెక్కించారు. రవితేజ ఇమేజ్, ఎనర్జీని చక్కగా వాడుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యారు. అయితే పాత చింతకాయనే కథనే మళ్లీ సరికొత్త ప్యాకేజీలో కొత్త రుచిని అందించారని చెప్పవచ్చు. విక్రమార్కుడులో ఉండే ఆత్మను, బలుపులో ఉండే ఎంటర్ టైన్మెంట్ను మిక్స్ చేసి పవర్గా కొత్త ప్రొడక్ట్ను రూపొందించారు. అయితే ప్రస్తుత కాలంలో సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రొటిన్ కథను చక్కటి స్క్రీన్ప్లే, వినోదం అనే పట్టాలకెక్కించి తన ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుడిని తప్పదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా... బలదేవ్ పాత్రను ఆరంభంలోనే ముగించడం, హస్పిటల్లో ఎపిసోడ్లో హోంమంత్రి తల్లికి సంబంధించిన సీన్, ఇంటర్వెల్ ట్విస్, చివర్లో బ్రహ్మీ పాట కొత్తగా అనిపించడమే కాకుండా దర్శకుడి ప్రతిభకు అద్దపట్టాయి. అయితే క్లైమాక్స్ను చూస్తే బలుపు తరహా ఇంకా మూస ధోరణినే నమ్ముకున్నారనిపిస్తుంది. ఓవరాల్గా అనేక ప్రతికూల అంశాలున్నా... ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సానుకూల అంశాలు డామినేట్ చేశాయని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్లతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడం, త్వరలో వచ్చే భారీ చిత్రాల పోటిని ఎదురిస్తే తప్ప భారీ విజయం చిక్కకపోవచ్చు. --రాజబాబు అనుముల (ఇంగ్లీష్ రివ్యూ) -
తప్పించరూ
రాజకీయ పక్షాల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్కుమార్ మనస్తాపానికి గురయ్యూరు. తనను ఆ పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సంపత్కు విజ్ఞప్తి చేశారు. ఇది ప్రచారంగా తొలుత సంకేతాలు వెలు వడ్డా, చివరకు తాను విజ్ఞప్తి చేసుకున్నది వాస్తవమేనని ఈసీ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై : రాష్ట్ర ఎన్నికల అధికారిగా గతంలో నరేష్ గుప్తా వ్యవహరించారు. విధి నిర్వహణ లో నిక్కచ్చితనం, ఎవరికీ భయపడని నైజం, ముక్కు సూటితనం ఆయన్ను రాష్ట్రంలో ఒక మంచి ఎన్నికల అధికారిగా నిలబెట్టింది. తన పదవీ కాలం ముగిసే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పదవికి వారసుడిగా ప్రవీణ్కుమార్ పేరును సిఫారసు చేసినట్టు ప్రచారం ఉంది. నరేష్ గుప్తా బాణిలో ప్రవీణ్కుమార్ పని తీరు ఉండడం ఆ ప్రచారానికి బలం చేకూరినట్టు అయింది. 2010 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగేళ్లుగా ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికలను దిగ్విజయవంతం చేశారు. ఈ ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా ఆయన చేపట్టిన చర్యలు కొంత మేరకు ఫలితాన్ని ఇచ్చాయి. సరికొత్త తరహాలో ఎన్నికల ఏర్పాట్లు చేసి, ప్రశాంత పూరిత వాతావరణంలో దిగ్విజయవంతం చేశారు. అనేక ఉప ఎన్నికలు నిర్వహించిన ఆయన లోక్సభ ఎన్నికల ద్వారా తీవ్ర ఆరోపణలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో నగదు బట్వాడా కట్టడి చేశారు. 144 సెక్షన్ అమల్లోకి రాజకీయ పక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. విమర్శలు, ఆరోపణలు : లోక్సభ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేకు తొత్తుగా ఈసీ వ్యవహరిస్తున్నట్టు ఎన్నికల నామినేషన్ల పర్వం ఆరంభం నాటి నుంచి డీఎంకే ఆరోపిస్తోంది. నగదు బట్వాడా కట్టడి ఇతర పార్టీలకు మాత్రమేనని, అధికార పక్షానికి దొడ్ది దారిలో ఎన్నికల అధికారుల ద్వారా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు లభిస్తున్నదన్న విమర్శలు బయలు దేరాయి. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చి కొందరు అధికారుల ద్వారా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు హల్చల్ చేశాయి. ఎన్నికలు ముగిసినా, ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. డీఎంకేతో పాటుగా అన్ని వామపక్షాలు, డీఎండీకే, కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపణలు గుప్పిస్తూ రావడం ప్రవీణ్కుమార్ను మనస్తాపానికి గురి చేసినట్టుంది. తనపై ఆరోపణలు, విమర్శలు ఎక్కువవుతుండడంతో ఇక, ఆ పదవిలో కొనసాగకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. స్పష్టీకరణ : తనను పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సంపత్ను ప్రవీణ్కుమార్స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా గత వారం ప్రచారం సాగింది. అయితే, దీన్ని ఆయన ఖండించ లేదు. అదే సమయంలో ఇది ఓ ప్రచారం అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనను తప్పించాలని విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఓ తమిళ మీడియాలో ఆయన మాట్లాడుతూ, తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, నిజాయితీగా ఎన్నికలు నిర్వహిస్తే, ఆరోపణలు మూట గట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 144 సెక్షన్ను చట్ట పరంగా, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అమలు చేశానేగానీ, చట్ట విరుద్ధంగా తాను నడచుకోలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు, విమర్శలతో తాను ఆ పదవిలో ఇంకా కొనసాగలేనని, అందుకే తనను తప్పించాలని కేంద్ర కమిషన్ను కోరినట్టు తేల్చేశారు. తుది నిర్ణయం కేంద్ర కమిషన్ చేతిలో ఉందని, అక్కడి నుంచి వచ్చే సమాధానం మేరకు తదుపరి తన అడుగులు ఉంటాయని పేర్కొనడం గమనార్హం. ప్రవీణ్కుమార్ను కేంద్ర కమిషన్ తప్పించేనా, అన్నది అనుమానమే. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడవు ఉంది. ఈ సమయంలో కొత్త అధికారి కొలువు దీరేనా, లేదా, ప్రవీణ్ నిజాయితీకి పట్టం కట్టే రీతిలో కొనసాగించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
రాష్ట్రంలో రూ.108 కోట్లపైగా స్వాధీనం
హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ రూ.108 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 4లక్షల 10వేల లీటర్ల మద్యంతో పాటు 30,660 మద్యం కేసులను నమోదు చేశామన్నారు. మద్యం కేసులకు సంబంధించి 13, 300 మందిని అదుపులోకి తీసుకున్నామని భన్వర్ లాల్ తెలిపారు. ఈ క్రమంలోనే 8,043 బెల్టు షాపులను మూసివేశామన్నారు. 70 కేజీల బంగారం, 293 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలన్నారు. ఈసారి రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ పక్షాలు ఇతర పార్టీల గుర్తులు వాడకుండా మోడల్ బ్యాలెట్ లను ముద్రించుకోవచ్చని భన్వర్ లాల్ తెలిపారు.ఎన్నికల్లో భాగంగా రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన సీఈసీ సంపత్ రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 70,171 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, అందులో 25,390 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నట్లు గుర్తించామని సంపత్ పేర్కొన్నారు. ఇందులో 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు, మద్య ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. -
ఓటెయ్యండి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి
-
రాష్ట్రంలో రూ.105 కోట్లు స్వాధీనం చేసుకున్నాం: సంపత్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు సీఈసీ వి.ఎస్. సంపత్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లును సమీక్షించిన సంపత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 70,171 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో 25,390 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు, మద్య ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.105 కోట్లను స్వాధీనం చేసుకున్నామని సంపత్ పేర్కొన్నారు. ఇది దేశం మొత్తం మీద స్వాధీనం చేసుకున్నదానిలో 46 శాతంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలన్నారు. ఈసారి రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ పక్షాలు ఇతర పార్టీల గుర్తులు వాడకుండా మోడల్ బ్యాలెట్ లను ముద్రించుకోవచ్చని సంపత్ తెలిపారు. -
'తప్పుడు ఈవీఎంల విషయంలో జాగ్రత్త పడ్డాం'
-
అమ్మ ఓకే బొమ్మ వద్దు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ మార్కెట్లు రాష్ర్టంలో నడుస్తుండగా, అమ్మ థియేటర్ కూడా రాబోతోంది. అమ్మ పేరున అధికార దుర్వినియోగం సాగుతోందంటూ అన్నాడీఎంకేపై ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా చెన్నై సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, సీఎం ఫొటోలు ఎక్కడ ఉన్నా తొలగిం చడమో లేక కప్పిఉంచడమో చేయాలని అదేశించారు. అయితే కొందరు ఆరోపిస్తున్నట్లుగా అమ్మ అనే పదా న్ని తొలగించాల్సిన అవసరం లేదనిన్నారు. అమ్మ అనేది ప్రతి ఒక్కరూ వాడే పదం, అందులో ఎటువంటి రాజకీయమో, తప్పిదమో లేదని వివరించారు. ఈనెల 5న ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడగా ఆనాటి నుంచి 17వ తేదీ వరకు మొత్తం 54,976 ఫిర్యాదులు అందగా వాటిల్లో 52,258 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలపై 34,254 ఫిర్యాదులు, గోడలపై పార్టీల రాతలపై 20,722 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాహనాల తనిఖీల్లో 10 కోట్ల 25లక్షలా 69 వేల 324 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే *10 లక్షలా 41 వేల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడినట్లు అమ్మ ఓకే.. బొమ్మ వద్దు చెప్పారు. తగిన ఆధారాలతో వ్యాపారులు 10లక్షలు, రాజకీయ నాయకులు 50వేలు తీసుకెళ్లవచ్చని అన్నారు. ఆధారాలు చూపినా పట్టుబడిన నగదును ఇచ్చేందుకు నిరాకరించిన అధికారులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఒక మహిళా అధికారిపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల్లో ఉత్సవాలు చేసుకోవచ్చు, అయితే అక్కడి వేదికలపై రాజకీయ నాయకులు ఆశీనులు కారాదని చెప్పారు. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇంటర్నెట్ ద్వారా ప్రచారానికి ఈసీ నుంచి అనుమతి పొందారని తెలిపారు. నోటాకు చిహ్నంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రిపై విచారణ ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని మంత్రి సంపత్పై విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కడలూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థికి ప్రచారం చేస్తున్న మంత్రి ఎంసీ సంపత్ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా ఒక దినపత్రికలో ఫొటోతో సహా వార్త వచ్చినట్లు డీఎంకే ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని కడలూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. నివేదికను అనుసరించి చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రిపై నేరం రుజువైన పక్షంలో ఎఫ్ఐఆర్, చార్జిషీటు దాఖలు చేస్తామని వివరించారు. -
‘ఓటర్ల నమోదుకు మరో చాన్స్’
నోయిడా: ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని పౌరులు వాటిని నమోదు చేసుకునేందుకు లోక్సభ ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా మరో అవకాశం కల్పించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్. సంపత్ తెలిపారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సవరించిన ఓటర్ల జాబితాలో పేర్లులేని వ్యక్తులు కొత్తగా పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆదివారం నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పా రు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 9 లక్షల పోలింగ్ కేంద్రాల్లోని బూత్స్థాయి అధికారులు ఫారం-6 జారీ చేసి, పూరించిన ఫారాలను స్వీకరిస్తారని వివరించారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నాం కాబట్టి కలకాలం ఆ పేర్లు ఉంటాయని అనుకోవద్దని, సిబ్బంది తప్పులు, పొరబాట్ల కారణంగా తాము ఏటా విడుదల చేసే సవరించిన ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఓటర్లు సవరించిన ఓటర్ల జాబితాను తరచూ చూసుకోవాలని...ఒకవేళ పేర్లు గల్లంతైతే కొత్తగా నమోదు చేసుకోవాలన్నారు. -
ఇద్దరు మిత్రుల బలవన్మరణం
చిలకలగూడ, న్యూస్లైన్: కలిసి చదువుకున్న ఇరువురు స్నేహితులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వీరి మృతి మిస్టరీగా మారింది. చిలకలగూడ పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మెదక్జిల్లా దౌలతాబాద్ మండలం రామసాగర్కు చెందిన చంద్రమౌళి కుమారుడు బిక్కుమళ్ల సంపత్ (27), నిజామాబాద్జిల్లా కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కొత్త సంపత్కుమార్ (27)లు నగరంలో ఎంబీఏ చదువుకున్నారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. చదువు పూర్తయ్యాక సంపత్ మెడికల్ రిప్రజంటేటివ్గా పనిచేస్తుండగా, కంప్యూటర్ కోర్సులు చదవిన సంపత్కుమార్ బేగంపేటలోని సెల్యుజెనిక్ సంస్థలో స్టాఫ్వేర్ ఇంజినీర్గా చేరాడు. వారాసిగూడ అంబర్నగర్లోని ముకుందం ఇంటి పెంట్హౌస్ను ఆరునెలల క్రితం సంపత్ అద్దెకు తీసుకుని ఉంటుండగా, సంపత్కుమార్ తన సోదరుడు సతీష్తో కలిసి చింతల్లో ఉంటున్నాడు. చింతల్నుంచి బేగంపేట దూరం కావడంతో పదిరోజుల క్రితం అంబర్నగర్లోని సంపత్ గదికి వచ్చి ఉంటున్నాడు. సోమవారం ఉదయం సంపత్ బంధువులతో కలిసి షాపింగ్కు వెళ్లి మధ్యాహ్నం 1.30కి గదికి వచ్చాడు. గజ్వేలులో ఉంటున్న సంపత్ సోదరుడు 2.30కి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి అదేప్రాంతంలో ఉంటున్న బాబాయ్ రాజును సంపత్ వద్దకు పంపాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో రాజుకు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఇద్దరూ అపస్మారకస్థితిలో కనిపించారు. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా సంపత్ చనిపోయి ఉన్నాడు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సంపత్కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతు మృతిచెం దాడు. గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ డీఐ ఖాజామొయినుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మూడురోజుల్లో మెడికల్షాప్ ప్రారంభం.. మరో మూడురోజుల్లో గజ్వేల్లో మెడికల్షాపు ప్రారంభించేందుకు బిక్కుమళ్ల సంపత్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగావిలపిస్తున్నారు. ఏడాదికి రూ. 8 లక్షలకు మరో కంపెనీ ఆఫర్.... కొత్త సంపత్కుమార్కు మరో కంపెనీ నుంచి ఏడాదికి రూ. 8 లక్షల జీతంతో మంచి ఆఫర్ వచ్చింది. ఈనెల 25వ తేదీలోగా చేరాలంటూ ఆఫర్ లెటర్ అందింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడు సతీష్కుమార్కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే కాగా తండ్రి శ్రీనివాస్ క్లాత్ మర్చంట్. మిస్టరీగా మారిన ఆత్మహత్యలు.... సంపత్, సంపత్కుమార్లు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ విద్యావంతులే. తమ ఫీల్డ్స్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆరాటపడేవాళ్లే. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడవలసిన ఆగత్యం ఏమోచ్చింది? తలుపులు లోపలకు వేసుకున్నారంటే ప్రాణాలు తీసుకునేందుకే అనేది స్పష్టం అవుతోంది. ఉదయం వరకు బంధువులతో షాపింగ్ చేసిన సంపత్ గదికి వచ్చిన తర్వాత స్నేహితునితో కలిసి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు గదిలో ఏం జరిగింది అనేది తెలియడంలేదు. ఇరువురు ఉపయోగించిన మూడు సెల్ఫోన్లు కాల్డేటా ఆధారంగా మిస్టరీని ఛేదించేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, బిక్కుమళ్ల సంపత్ మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు తన ఫోన్ నుంచి తన ఫోన్కే ఓ ఎస్ఎంఎస్ పంపుకున్నాడు. అందులో ‘ఇంట్లో గొడవలు తగ్గిపోవాలన్పది నా చివరి కోరిక.. మనీకి కాదు మనుషులకు విలువ ఇవ్వాలి’ అని ఉంది. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహిస్తామని, ఓట్ల లెక్కింపును 8వ తేదీన ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా తయారీ 100 శాతం పూర్తయిందని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ఢిల్లీ, మిజోరం అసెంబ్లీలకు ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంపత్ చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించడం కోసం వ్యయ పరిశీలకులను, పోలింగ్ సజావుగా జరపడం కోసం పోల్ పరిశీలకులను నియమించడంతోపాటు ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం అవేర్నెస్ అబ్జర్వర్లను తొలిసారిగా నియమించనున్నట్లు ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను మోహరించనున్నామన్నారు. తొలిసారిగా తిరస్కార ఓటు హక్కు... సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఆప్షన్ల జాబితాలో నన్ ఆఫ్ ద ఎబౌ(పైవారిలో ఎవరూ కాదు) అనే అవకాశాన్ని కూడా చేర్చనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అంటే అభ్యర్థులలో ఎవరికీ ఓటు వేయడానికి ఇష్టపడనివారు పై వారిలో ‘ఎవరూ కాదు’ అనే ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. అయితే నన్ ఆప్ ద ఎబౌ అప్షన్కు మిగతా అభ్యర్థులందిరి కన్నా ఎక్కువ ఓట్లు పడినట్లయితే ఫలితం ఎలా ఉంటుందనేది ఎన్నికల కమిషన్ స్పష్టం చేయలేదు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలో ఏకాలంను ఖాళీగా వదలరాదని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాన్ని కూడా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలలో అమలుచేయనుంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు ఏ కాలంను ఖాళీగా వదల కుండా చూసుకోవాలి. ఏ కాలాన్నైనా ఖాళీగా వదిలినట్లయితే వారి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గువుతాయి.