Skoda
-
స్కోడా ఈవీ వస్తోంది.. అదిరిపోయే రేంజ్!
వాహన తయారీ సంస్థ స్కోడా ఇండియా (Skoda) నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ ఏడాదే వస్తోంది. సెప్టెంబర్ కల్లా భారతీయ రోడ్లపై స్కోడా ఎన్యాక్ (Skoda Enyaq) పరుగు తీయనుంది. తొలుత పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేస్తారు. 63, 82 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్స్తో రూపుదిద్దుకుంది.పర్ఫార్మెన్స్, రేంజ్ఎన్యాక్ అధునాతన ఎలక్ట్రిక్ మోటార్లతో థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు తక్షణ టార్క్ను అందిస్తాయి. ఎన్యాక్ ఆకట్టుకునే రేంజ్ కలిగి ఉంది. ఒకసారి చార్జింగ్తో బ్యాటరీని బట్టి 439–597 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. 30 ని. చార్జింగ్ 10 నుంచి 80 శాతానికి చేరుతుంది.డిజైన్, స్టైల్ఎన్యాక్ దృఢమైన లైన్లు, ఉల్లాసమైన ఆకారాలను కలిగి ఉంటుంది. సిగ్నేచర్ స్కోడా గ్రిల్, ఎలక్ట్రిక్ ఓరియెంటెడ్ రీమేక్ అయినప్పటికీ, ఇప్పటికీ దాని ఐకానిక్ ఫీచర్ను కలిగి ఉంది. సొగసైన ఎల్ఈడీ హెడ్లైట్లు, వంపులు ఆధునిక లుక్ అందిస్తాయి. -
భారత్ ఎకానమీ వృద్ధి కోత
భారత్ ఎకానమీ 2024–25 ఆర్థిక సంవత్సరం అంచనాలకు పారిశ్రామిక మండలి–ఫిక్కీ(FICCI) 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ అంచనా వృద్ధి రేటు 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే విడుదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల విభాగం ఇటీవలే అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ పాలనా కాలంలో భారత్కు సంబంధించి స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవని సర్వే అభిప్రాయపడింది.ఎగుమతులు(Exports), విదేశీ మూలధన పెట్టుబడులు, ముడి పదార్థాల వ్యయాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా సరఫరాల చైన్కు సమస్యలు తెచ్చే వీలుందని అవుట్లుక్ పేర్కొంది. భారత్ ఎకానమీలో ప్రైవేటు వినియోగం కీలక అంశమని తెలిపింది. అగ్రి ఉత్పాదకత, గ్రామీణ మౌలిక పరిస్థితులు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు పెంపుపై దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావచ్చని, ఇది వడ్డీరేట్లు దిగిరావడానికి దోహదపడుతుందని విశ్లేషించింది.కైలాక్కు భారత్ ఎన్సీఏపీ రేటింగ్వాహన రంగంలో ఉన్న స్కోడా(Skoda) ఆటో ఇండియా తయారీ కైలాక్ ఎస్యూవీ తాజాగా భారత్ ఎన్సీఏపీ 5–స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. స్కోడా నుంచి ఈ రేటింగ్ పొందిన తొలి మోడల్ ఇదే. స్కోడా కుషాక్, స్లావియా ఇప్పటికే గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ‘స్కోడా డిజైన్లో భద్రత ఒక భాగం. 2008 నుండి ప్రతి స్కోడా కారు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత్లో 5–స్టార్ సేఫ్టీ రేటింగ్తో క్రాష్–టెస్ట్ జరిగింది. భారత్లో 5–స్టార్ సేఫ్టీ–రేటెడ్ కార్ల సముదాయంతో భద్రతపై కంపెనీ ప్రచారంలో ముందుంది’ అని స్కోడా తెలిపింది.ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?భారత్లో జేవీసీ రీ–ఎంట్రీకంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ బ్రాండ్ జేవీసీ భారత టీవీ విపణిలో రీఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రానిక్స్తో బ్రాండ్ లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రీమియం స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. ధర రూ.11,999 నుంచి ప్రారంభం. ఇవి అమెజాన్తో ప్రత్యేకంగా లభిస్తాయి. థామ్సన్, కొడాక్, బ్లావ్పంక్ట్, వైట్–వెస్టింగ్హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల ఉత్పత్తులను సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే తయారు చేస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్ కోసం షెంజెన్ స్కైవర్త్ డిజిటల్తో కంపెనీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019లో వీరా గ్రూప్తో చేతులు కలిపిన జేవీసీ కంజ్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. -
10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలుఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
స్కోడా కొత్త కారు 'కైలాక్' వచ్చేసింది: రూ.7.89 లక్షలు మాత్రమే
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ ఎస్యూవీని 'కైలాక్' (Kylaq) పేరుతో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం 2024 డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఇతర స్కోడా కార్ల కంటే కైలాక్ కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఆరు ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, హెడ్రెస్ట్లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.స్కోడా కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 114 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, టయోటా టైసర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!
మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, స్కోడా & నిస్సాన్ వంటి ప్రధాన వాహన తయారీదారులు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో స్కోడా కైలాక్, అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్ వంటివి ఉన్నాయి.స్కోడా కైలాక్స్కోడా కంపెనీ 2025 మార్చిలో కైలాక్ ఎస్యూవీని లాంచ్ చేయనుంది. ఇది MQB A0 IN ప్లాట్ఫామ్ ఆధారంగా తయారువుతోంది. కాబట్టి కుషాక్లోని చాలా ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 1.0 లీ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూహ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ మోడల్ 2025 మధ్య నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది చూడటానికి సాధారణ వెన్యూ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే మెకానికల్ అప్డేట్స్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.కియా సిరోస్కియా కంపెనీ సిరోస్ కారును 2025 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటూ.. సోనెట్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్రూఫ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్ఇప్పటికే రెండు లక్షల అమ్మకాలను సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. 2025 మధ్య నాటికి ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పొందనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనితీరు దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. -
దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా చకాన్ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్ ద్వారా తమ పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.One more BIG news for Maharashtra !Huge investments of total₹ 1,20,220 crore approved in today’s Cabinet Sub-Committee Meeting, with CM Eknath Shinde ji !The detailed list of approved investments is as follows:✅Tower Semiconductor with Adani Group at Taloja MIDC, Panvel… pic.twitter.com/DVI9z94WyU— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 5, 2024 -
స్కోడా కొత్త కారు.. వివరాలు
గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా సూపర్బ్ కారును కంపెనీ సరికొత్త 'స్పోర్ట్లైన్' రూపంలో పరిచయం చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ కారు స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్లైన్ మోడల్ రేడియేటర్ గ్రిల్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్లు, వెనుకవైపు స్కోడా బ్యాడ్జింగ్తో సహా అన్ని క్రోమ్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ పొందుతుంటాయి. ఇందులో 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్లపై స్పోర్ట్లైన్ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్లైన్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది లాంచ్ తరువాత తెలుస్తుంది. అయితే ఈ కారు దాని మునుపటి మోడల్ మాదిరిగా అదే పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. -
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
స్కోడా కాంపాక్ట్ ఎస్యూవీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీని భారత్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. 2025 తొలి అర్ద భాగంలో ఈ కారు రోడ్లపై పరుగు తీయనుందని వెల్లడించింది. కంపెనీ నుంచి భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి తయారైన మూడవ మోడల్గా ఇది నిలవనుంది. కుషాక్, స్లావియా మాదిరిగా ఎంక్యూబీ–ఏ0–ఇన్ ప్లాట్ఫామ్పై ఇది రూపుదిద్దుకోనుంది. పొడవు నాలుగు మీటర్ల లోపు ఉంటుంది. సంస్థకు ఇది ఎంట్రీ లెవెల్ మోడల్గా ఉండనుంది. 2022, 2023లో మొత్తం 1,00,000 పైచిలుకు కార్లను స్కోడా ఆటో ఇండియా విక్రయించింది. అన్ని మోడళ్లతో కలిపి 2026 నాటికి ఏటా 1,00,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రతి పాదిత కొత్త మోడల్కు పేరును సూచించేందుకు కంటెస్ట్లో పాల్గొనవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే భారత్కు స్కోడా ఎన్యాక్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన స్కోడా ఎన్యాక్ ఈ ఏడాదే భారత్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ పనితీరుపై దేశీయంగా టెస్టింగ్ జరుగుతోంది. ‘ఈ–మొబిలిటీ విషయంలో కంపెనీకి లోతైన అనుభవం ఉంది. వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లకు విస్తరిస్తాం. ఇందులో ఒక మోడల్ ప్రత్యేకంగా భారత్కు తీసుకువస్తాం’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనీబా తెలిపారు. 2027 నుంచి దేశీయంగా ఈవీలను అసెంబుల్ చేస్తామని వెల్లడించారు. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్ప్రైజ్ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్స్టామార్ట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత
ముంబై: కార్ల కొనుగోలు విషయంలో కస్టమర్లు భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా క్రాష్ రేటింగ్లు, ఎయిర్ బ్యాగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది. జనాదరణ పొందిన ఫీచర్లలో ఇంధన సామర్థ్యం మూడో స్థానంలో ఉంది. భారత్లో కార్లకు భద్రతా రేటింగ్ తప్పనిసరిగా ఉండాలని 10 మందిలో 9 మంది కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ‘అధిక రేటింగ్ మోడళ్లు కలిగిన తొలి 3 బ్రాండ్లలో స్కోడా ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షలో స్లావియా, కుషాక్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత మాకు తొలి ప్రాధాన్యత’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోలాక్ తెలిపారు. -
500 మందికి మాత్రమే.. ఈ కారు - ధర ఎంతో తెలుసా?
Skoda Kushaq Matte Edition: చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) కారుని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇందులో ఓ కొత్త ఎడిషన్ విడుదల చేసింది. కుషాక్ కొత్త ఎడిషన్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర & వేరియంట్స్ స్కోడా ఇండియా విడుదల చేసిన కొత్త కారు పేరు 'కుషాక్ మ్యాట్ ఎడిషన్' (Kushaq Matte Edition). ధరల విషయానికి వస్తే, 1.0 టీఎస్ఐ మాన్యువల్ రూ. 16.19 లక్షలు, 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్ రూ. 17.79 లక్షలు, 1.5 టీఎస్ఐ మాన్యువల్ రూ. 18.19 లక్షలు, టాప్ స్పెక్ 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ ధర రూ. 19.39 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ ధర స్టాండర్డ్ కుషాక్ స్టైల్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువ కావడం గమనార్హం. లిమిటెడ్ ఎడిషన్ స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని లైనప్లో స్టైల్ అండ్ మోంటే కార్లో వేరియంట్ల మధ్య ఉంటుంది. ఇది కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ కొత్త కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) మ్యాట్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్పై గ్లోస్ బ్లాక్ ట్రిమ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్పై క్రోమ్ బిట్లు చూడవచ్చు. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ విజయం పొందిన తరువాత కంపెనీ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే మ్యాట్ ఎడిషన్ లాంచ్ చేసింది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ప్రత్యర్థులు కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని విభాగంలో ఫోక్స్వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఈ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. -
అధికారిక వెబ్సైట్లో మాయమైన స్కోడా సూపర్బ్.. కారణం ఏంటంటే?
Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్సైట్లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు
ఇప్పటికే భారతదేశంలో కొత్త బిఎస్6 ఫేస్-2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. వాహన తయారీ సంస్థలన్నీ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ కొత్త కారుని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: బిఎస్6 కొత్త నిబంధనల ప్రకారం, విడుదలైన స్కోడా కారు 'కొడియాక్' 7 సీటర్ SUV. ఈ కొత్త కారు ధర రూ. 37.99 లక్షలు. అంటే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ. అదే సమయంలో ఇందులోని స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39.39 లక్షలు. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ కావడం గమనార్హం. బుకింగ్స్ విషయానికి వస్తే.. ఈ ఎస్యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 3000 యూనిట్లకు (ఇండియా) మాత్రమే పరిమితం చేసింది. డెలివరీల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇది భారతదేశానికి సికెడి మార్గం ద్వారా దిగుమతై ఔరంగాబాద్ ప్లాంట్ వద్ద అసెంబుల్ అవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 స్కోడా కొడియాక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఈ ఎస్యువిలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్క్డ్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటోమాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఇందులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఫీచర్స్ విషయానికి వస్తే, 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్రూఫ్, మంచి సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ స్కోడా కొడియాక్ అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంటుంది. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 hp పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ పొందటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది. (ఇదీ చదవండి: వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్తో..) సేఫ్టీ ఫీచర్స్: స్కోడా కంపెనీ తన కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
భారత్లో స్కోడా కుషాక్ కొత్త ఎడిషన్ లాంచ్ - పూర్తి వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. స్లావియా, ఆక్టావియా అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న సంస్థ ఇప్పుడు కుషాక్ న్యూ ఎడిషన్ 'ఒనిక్స్' (Onyx) విడుదల చేసింది. దీని గురించి మరిన్ని ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ ధర రూ. 12.39 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 80,000 ఎక్కువ. ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న కుషాక్ యాక్టివ్, యాంబిషన్ ట్రిమ్ల మధ్యలో ఉంటుంది. ఎక్ట్సీరియర్ ఫీచర్స్: ఒనిక్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. డోర్లపై స్టైలైజ్డ్ గ్రే గ్రాఫిక్స్, B-పిల్లర్పై 'ఓనిక్స్' బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఫ్రంట్ బంపర్పై ఫాక్స్ డిఫ్యూజర్, ఫ్రంట్ గ్రిల్పై క్రోమ్ సరౌండ్, సైడ్ ప్రొఫైల్లో 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్: లోపలి భాగంలో 7-ఇంచెస్ టచ్స్క్రీన్, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హెడ్రెస్ట్లపై ఒనిక్స్ బ్యాడ్జింగ్, బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ కలర్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: ఇంజిన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ కుషాక్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందినప్పటికీ ఒనిక్స్ ఎడిషన్ మాత్రం 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 114 బీహెచ్పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే జతచేయబడుతుంది. సేఫ్టీ ఫీచర్స్: భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటి కుషాక్. కావున ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ పాయింట్ సీట్బెల్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX ఎంకరేజ్ వంటివి ఉంటాయి. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఒనిక్స్ ఎడిషన్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
భారత్కు స్కోడా ఎన్యాక్ ఐవీ
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా.. భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ ఐవీ మోడల్ను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెటర్ సాక్ తెలిపారు. అమ్మకాలు పెరిగిన తర్వాత దేశీయంగా తయారీ చేపడతామన్నారు. ‘కంపెనీకి టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. యూరప్ వెలుపల అతిపెద్ద మార్కెట్ కూడాను. మరిన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతోపాటు ఈవీలను సైతం భారత్కు పరిచ యం చేస్తాం. గతేడాది దేశంలో 57,721 యూ నిట్లు విక్రయించాం. 2021తో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించాం. 2023లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’ అని వివరించారు. -
స్కోడా ఎలక్ట్రిక్ కార్... ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కిలోమీటర్స్ రయ్ రయ్
-
స్కోడా ఎస్యూవీ బుకింగ్స్ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్యూవీ కొడియాక్ బుకింగ్స్ను తిరిగి ప్రారంభించింది. జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది. ఎక్స్షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కొడియాక్ బుకింగ్స్ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది. -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్షిప్లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
షాకిచ్చిన స్కోడా.. ఆ మోడల్ ధరలు పెంపు
ఇండియన్ రోడ్లపై తనదైన ముద్ర వేసిన స్కోడా సైతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎటువండి హడావుడి లేకుండా కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో స్కోడా కుషాక్ ధర పెంచింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్కి పోటీగా కుషాక్కు గతేడాది మార్కెట్లోకి తెచ్చింది. కుషాక్ ఎంట్రీ లెవల్ యాక్టివ్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షలు ఉండగా ఈ మోడల్పై రూ.30,000ల వరకు ధర పెరిగింది. ఇక కుషాక్లో హై ఎండ్ వేరియంట్ స్టైల్ ధర రూ.17.19 లక్షలు ఉండగా కొత్తగా మరో రూ.70,000 ధర పెంచింది స్కోడా. ఈ మేరకు పెరిగిన రేట్లను స్కోడా వెబ్సైట్లో అప్డేట్ చేసింది. -
త్వరలో భారత మార్కెట్లోకి స్కోడా ఎలక్ట్రిక్ కార్లు
న్యూఢిల్లీ: స్కోడా తాజాగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2030 నాటికి దేశీ మార్కెట్లో 25–30%వాటా ఎలక్ట్రిక్ కార్లది ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్లో దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా విద్యుత్ కార్లను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అయితే, ఎప్పట్లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేదీ ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు, స్వల్పకాలికంగా చూస్తే.. సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కార్ల విభాగంలోకి ప్రవేశించే ప్రణాళికలేవీ లేవని ఆయన వివరించారు. తమ ప్లాట్ఫాం, టెక్నాలజీ, ఇంజిన్లు ఇందుకు అనుగుణమైనవి కావని పేర్కొన్నారు. స్కోడా దేశీ మార్కెట్లో కుషాక్, స్లావియా, ఆక్టావియా, సూపర్బ్, కోడియాక్ వంటి మోడల్స్ను విక్రయిస్తోంది. ప్రముఖ జర్మనీ కార్ మేకర్ కంపెనీ అయిన ఫోక్స్వ్యాగన్ అనుబంధ కంపెనీగా స్కోడాకి ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. -
పుంజుకున్న వాహన విక్రయాలు
ముంబై: సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో వృద్ధి బాటపట్టాయి. మూడో దశ లాక్డౌన్ ఆంక్షల సడలింపు ప్యాసింజర్ వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గత నెలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ విక్రయాలు పెరిగాయి. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టయోటా, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు విక్రయాలు డీలాపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సంపద్రాయ టూ వీలర్స్ అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు వరుసగా 29% 6%, 15% చొప్పున క్షీణించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. బేస్ ఎఫెక్ట్ కారణంగా ట్రాకర్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ‘‘దేశంలో గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరు ఇంధన ధరలు రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం మార్చి వాహన విక్రయాలపై ప్రతికూలతను చూపొచ్చు’’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
స్కోడా నుంచి సరికొత్త స్లావియా
న్యూఢిల్లీ: ప్రీమియం మిడ్–సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా తాజాగా సరికొత్త స్లావియా కారును ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.69 లక్షల నుంచి రూ. 15.39 లక్షల (ఎక్స్ షోరూం) శ్రేణిలో ఉంటుంది. నెలకు 2,500–3,000 యూనిట్ల విక్రయాన్ని లక్ష్యం గా పెట్టుకున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హాలిస్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో సెగ్మెంట్ లీడరుగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 179 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేక్ డిస్క్ క్లీనింగ్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్–హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు కొత్త స్లావియాలో ఉంటాయి. -
సీన్ రివర్స్.. దిగుమతి రోజులు పోయాయ్..
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇండియాలో తయారైన కార్లను విదేశాలకు ఎగుమతి చేసే స్టేజ్కి చేరుకుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్లాంటులో తయారు చేసిన కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ‘ఇంజనీరిడ్ ఇన్ ఇండియా డ్రివెన్ బై ది వరల్డ్’ కాన్సెప్టుతో ఈ పని చేపట్టింది. పూనేలో ఉన్న కార్ల తయారీ యూనిట్లో రూపొందిన టీ క్రాస్ మోడల్ కారును మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్టు స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా చైర్మన్ కాన్వాన్ సిలీన్ ప్రకటించారు. ఇక్కడ తయారైన కార్లకు మెక్సికో, సౌతాఫ్రికా, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనా దేశాల్లో చాలా డిమాండ్ ఉందని ఫోక్స్వ్యాగన్ ప్రతినిధులు తెలిపారు. గతంలో వెంటో కారుని ఎగుమతి చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇండియాలో టైగూన్ మోడల్లతో అమ్ముడవుతున్న కారుకి విదేశాల కోసం టీ క్రాస్ పేరుతో ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. ఇండియలోని ప్లాంట్లో తయారైన కార్లు 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. జర్మనీ ప్లాంట్లకు ఏమాత్రం తగ్గని క్వాలిటీతో ఇండియాలో కార్లు తయారు చేస్తున్నామన్నారు. చదవండి:కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..! -
హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే...?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రముఖ చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా స్పీడ్ పెంచింది. గ్లోబల్ మార్కెట్లలోకి ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా లాంచ్ చేసేందుకు సిద్దమైంది. కళ్లు చెదిరే లుక్స్తో స్కోడా పోర్ట్ఫోలియోనుంచి రానున్న ఎలక్ట్రిక్ కారు ఎన్యాక్ కూపే iV (Enyaq Coupe iV) గ్లిప్స్ను తాజాగా కంపెనీ విడుదల చేసింది. స్కోడా ఎన్యాక్ కూపే iV లాంచ్ ఎప్పుడంటే..? ఎలక్ట్రిక్ కార్లలో భాగంగా స్కోడా ఎన్యాక్ కూపే iV ఎస్యూవీను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్ చిత్రాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. భారత మార్కెట్లలోకి స్కోడా Enyaq Coupe iV ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఎన్యాక్ iVకు ఎస్యూవీగా రానుంది. క్రేజీ లుక్స్తో...! వోక్స్వ్యాగన్ ID.5 స్ఫూర్తితో స్కోడా Enyaq Coupe iV ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ చేసినట్లు కన్పిస్తోంది. దూకుడుగా ఉండే ఫ్రంట్ ఫేస్తో పాటు వాలుగా ఉండే రూఫ్లైన్, పెద్ద వీల్ ఆర్చ్లు ఎన్యాక్ కూపే iVకి బోల్డ్ రోడ్ లుక్ను అందించనున్నాయి. సైడ్ స్కర్ట్లు బాడీ కలర్లో పెయింట్ చేశారు. వెనుకవైపు స్కోడా సిగ్నేచర్ సి-ఆకారపు బ్యాక్ లైట్లు రానుంది. విలక్షణమైన ఫ్రంట్ గ్రిల్తో పాటుగా 131 ఎల్ఈడీ లైట్స్ను అమర్చారు. రేంజ్ విషయానికి వస్తే..! స్కోడా ఎన్యాక్ కూపే iV ఎస్యూవీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510 కిమీల రేంజ్ను అందిస్తుంది. ఈ కారు సున్నా నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.2 సెకన్లలోనే చేరుకోనుంది. కాగా స్కోడా ఎలక్ట్రిక్ కార్లలో భాగంగా మరో ఐదు వేరియంట్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కార్ల సామర్థ్యం 148 hp నుంచి 306 hp వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. టాప్ వెర్షన్ గరిష్టంగా 180 kmph వేగాన్ని కలిగి ఉంది. చదవండి: మహీంద్రా సంచలన నిర్ణయం..! ఆ కంపెనీని పూర్తిగా అమ్మేసింది..! -
మూడు వేరియంట్లలో స్కోడా కొత్త కొడియాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా తాజాగా భారత్లో కొత్త కొడియాక్ ప్రీమియం ఎస్యూవీని ఆవిష్కరించింది. స్పోర్ట్లైన్, లారిన్, క్లెమెంట్ వేరియంట్లలో రూపొందించింది. ఎక్స్షోరూంలో ధర రూ.34.99– 37.49 లక్షలు ఉంది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సెవెన్ స్పీడ్ ట్రాన్స్మిషన్, ఏడు సీట్లు, తొమ్మిది ఎయిర్బ్యాగ్స్, అడాప్టివ్ ఫ్రంట్ హెడ్లైట్స్, ఎలక్ట్రానిక్, మెకానికల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిషన్ బ్రేకింగ్, హ్యాండ్స్ఫ్రీ పార్కింగ్తో పార్క్ అసిస్ట్ వంటి హంగులు ఉన్నాయి -
ధరల పెంపు దిశగా మరో కార్ల కంపెనీ! జనవరి నుంచి అమలుకి ప్లాన్
కార్ల కంపెనీలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. కరోనాతో ఓ వైపు ఆదాయం తగ్గిపోగా మరోవైపు పెట్రోలు ,డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా కార్ల ధరల పెంపు వచ్చి చేరింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ కంపెనీ స్కోడా ఇండియా మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సగటున ప్రతీ మోడల్పై 3 శాతం వరకు ధరలు పెరగబోతున్నాయి. స్కోడా కంపెనీ నుంచి కుషాక్, ర్యాపిడ్, కోడియాక్, ఓక్టావియా వంటి పాపులర్ మోడళ్లు ఉన్నాయి. మన్నికతో కూడిన వేగం అందివవ్వడం స్కోడాకు మార్కెట్లో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. మిడ్ రేంజ్ కార్ల మార్కెట్లో స్కోడాకు ప్రత్యేక స్థానం ఉంది. చిప్సెట్ల కొరత సమస్యను తెర మీదకు తీసుకువచ్చి మారుతి మొదలు మేజర్ కార్ల తయారీ కంపెనీలు గత మూడు నెలలుగా ధరలు పెంచుతూ వచ్చాయి. ఇప్పుడు చిప్సెట్ల సంగతి మూలనర పడగా రా మెటీరియల్ ధరలు ముందుకు వచ్చాయి. దీంతో మరోసారి కార్ల కంపెనీలు ధరలు పెంచుతాయా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..! -
నేను కూడా తగ్గేదే లే అంటున్న స్కోడా కంపెనీ
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు జోరందుకోవడంతో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు ఈవీ మార్కెట్లు పోటీ పడుతున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ రేసులోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ స్కోడా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. స్కోడా ఆటో గ్లోబల్ చైర్మన్ థామస్ షాఫెర్ మాట్లాడుతూ.. భారత్, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. దేశం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు కీలక మార్కెట్ గా ఉంటుందని తెలిపారు. స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా ఈ దశాబ్దం చివరి నాటికి మొత్తం ఉత్పత్తిలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయ అవసరాలకు తగ్గట్టు కార్లను తయారు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. సరసమైన ధరలకు కార్లను తీసుకొనిరావాడానికి స్థానికీకరణ చాలా కీలకమని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, హ్యుందాయ్, కియా కంపెనీలకు పోటీగా తీసుకొని రానున్నట్లు తెలిపారు. అవసరం అయితే, పెట్టుబడులను భారీగా పెంచాలని చూస్తున్నట్లు వివరించారు. (చదవండి: మార్క్ జుకర్బర్గ్ నువ్వు ఏం చేస్తున్నావ్? ఫేస్బుక్పై ఫైర్!) -
టెస్లా పాటే పాడుతున్న ఫోక్స్వ్యాగన్
దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్లు వాటికి వంత పాడాయి. పన్ను తగ్గించండి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్వ్యాగన్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్ వ్యాగన్ కోరింది. ఈ మేరకు ఫోక్స్వ్యాగన్ ఇండియా హెడ్ గుర్ప్రతాప్ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్ ఆటోమోబైల్ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్ వార్త సంస్థతో అన్నారు. మినహాయింపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం ఫోక్స్ వ్యాగన్ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆడీ ఈ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని ఇండియాలో లాంఛ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్వ్యాగన్, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఫోక్స్వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. క్లారిటీ లేదు ఫారిన్ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్వ్యాగన్ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్ పెట్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. స్వదేశీపై ప్రభావం ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. -
ఆ కారులో ఏముందబ్బా, విరగబడి కొంటున్నారట!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా..జూలై నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 234 శాతం వృద్ధి నమోదు చేసింది. 2021 జూన్తో పోలిస్తే 320 శాతం వృద్ధి సాధించింది. గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా 3,080 కార్లను విక్రయించింది. 2020 జూలైలో ఈ సంఖ్య 922 మాత్రమే. ఈ ఏడాది జూన్లో కొత్తగా 734 కార్లు మాత్రమే రోడ్డెక్కాయి. జూలై అమ్మకాల జోరుకు కుషాక్ మోడల్ కీలకమని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఆవిష్కరించిన నెలరోజుల్లోనే సుమారు 6,000 బుకింగ్స్ను కుషాక్ సొంతం చేసుకుందని చెప్పారు. కొత్తగా డీలర్షిప్ కేంద్రాల ఏర్పాటుకు 200 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గత నెలలో నెట్వర్క్ 15 శాతం విస్తరించినట్టు పేర్కొన్నారు. కుషాక్ ఫీచర్స్ స్కోడా తన కొత్త మోడల్ కుషాక్ ఎస్యూవీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇండియా 2.0 ప్రాజెక్ట్లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్ విడుదలై ఎస్యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు సరికొత్త కుషాక్ పోటీ ఇచ్చింది. అందుకు కారణం ఆ కారు ఫీచర్లేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆ కారు ఫీచర్లు ఎలా ఉన్నయో తెలుసుకుందాం. రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో ఇది లభ్యం. బేస్ వేరియంట్లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను జత చేసింది. ఇక టాప్-ఆఫ్-లైన్ మోడల్ ఎస్యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను అమర్చింది.1.5-లీటర్ వేరియంట్ 6,000 ఆర్పిఎమ్ వద్ద 147.5 బిహెచ్పి మరియు 3,500 ఆర్పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్ 5,500 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్పి పవర్, 1,750 ఆర్పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో లభ్యం. నాలుగు సంవత్సరాల / 1,00,000కిలోమీటర్ల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది. దీన్ని ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాదు 2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కూడా అందిస్తుంది. -
స్కోడా ‘కుషాక్’ వచ్చింది..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ స్కోడా తాజాగా కుషాక్ మోడల్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద రూపొందించిన ఈ తొలి మోడల్ ద్వారా కంపెనీ మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వేరియంట్నుబట్టి ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో రూ.10.5 లక్షల నుంచి రూ.17.6 లక్షల వరకు ఉంది. 1 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్తోపాటు 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ రకాలతో వాహనం తయారైంది. హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, ఆరు వరకు ఎయిర్బ్యాగ్స్ వంటివి అదనపు హంగులు. జూలై 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 30,000, వచ్చే సంవత్సరం 60,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసకున్నట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. -
Skoda Kushaq : హ్యాండ్సమ్ లుక్స్, అదిరే ఫీచర్స్ , ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ:చాలా కాలంగాఎదురు చూస్తున్న 'స్కోడా' తన పాపులర్ ఎస్యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేలా సరికొత్తగా స్కోడా కుషాక్ను ఆవిష్కరించింది. తద్వారా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో ఒక కొత్త ప్రయాణానికి నాంది పలికింది. యాక్టివ్, అంబిషన్, స్టైల్ అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇక ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్10.50 లక్షల ధరలతో ప్రారంభించి, టా ప్ ఎండ్ మోడల్ ధరను 17.60 లక్షలుగా నిర్ణయించింది. కస్టమర్లు ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు. జూలై 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.'వన్ నేషన్. వన్ ప్రైస్' ఫిలాసఫీని ముందుకు తీసుకువెళుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్కోడా కుషాక్ ఫీచర్లు: సరికొత్త ఫీచర్లతో భారతీయ కస్టమర్లకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ , బిగ్ రియర్ బంపర్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, సన్రూఫ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ లాంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎంక్యూబీ-ఏవో-ఇన్ ప్లాట్పాంలో స్కోడా కుషాక్ తొలి మోడల్ ఎస్యూవీ కావడం విశేషం. రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో ఇది లభ్యం. బేస్ వేరియంట్లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను జత చేసింది. ఇక టాప్-ఆఫ్-లైన్ మోడల్ ఎస్యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను అమర్చింది.1.5-లీటర్ వేరియంట్ 6,000 ఆర్పిఎమ్ వద్ద 147.5 బిహెచ్పి మరియు 3,500 ఆర్పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్ 5,500 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్పి పవర్, 1,750 ఆర్పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ , కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో లభ్యం.నాలుగు సంవత్సరాల / 1,00,000 కిమీల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది. దీన్ని ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాదు 2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కూడా అందిస్తుంది. Premium comes in a range of beautiful and elegant colors with the new ŠKODA KUSHAQ. Book your test drive today: https://t.co/wCzjc6JAC6 Book Online: https://t.co/j1PCblIXIo#SKODA #SKODAKUSHAQ pic.twitter.com/f1pcdm8VQQ — ŠKODA AUTO India (@SkodaIndia) June 28, 2021 -
మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు
ముంబై: స్కోడా ఆటో ఇండియా తన ప్రీమియం సెడాన్ ఆక్టావియా కారు కొత్త వెర్షన్ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త స్కోడా ఆక్టేవియా రెండు వేరియంట్ల' లో లభిస్తుంది. ఇందులో స్టైల్ వేరియంట్ ధర రూ.25.99 లక్షలుగా, లారిన్ - క్లైమెంట్ వేరియంట్ ధర రూ.28.99 లక్షలుగా ఉంది. నాలుగో తరానికి చెందిన ఈ కారు రెండు 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇది 190 పీఎస్ శక్తిని ఇస్తుంది. లీటరుకు 15.81 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులను అమర్చారు. అలాగే ఏబీఎస్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రల్ (ఈఎస్సీ), ఈబీడీ, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అత్యవసర వేళలో ఉపయోగపడే ‘‘మైస్కోడా కనెక్ట్’’ అనే ఇన్బిల్ట్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. దేశవ్యాప్తంగా డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. పాత కారుతో పోల్చితే సైజ్లో కొంచెం పెద్దదిగా డిజైన్ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, హారిజంటల్ ఫాగ్ల్యాంప్స్ ఇవ్వగా వెనుక వైపు టైల్ల్యాంప్ డిజైన్లోనూ మార్పులు చేశారు. చదవండి: కోవిడ్-19 పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్ -
ఈ స్కోడా కారుపై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్
ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ స్కోడా గతేడాది జరిగిన 2020 ఆటో ఎక్స్పోలో ఆక్టేవియా ఆర్ ఎస్245 పెర్ఫార్మెన్స్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రారంభంలో కేవలం 200 యూనిట్లను మాత్రమే భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, కరోనా కారణంగా ఈ కార్ల ఆర్డర్లు రద్దయ్యాయి. దీంతో, ఇవి ఆయా డీలర్షిప్ సెంటర్లలోనే మిగిలిపోయాయి. ఈ స్టాక్ క్లియర్ చేసుకునేందుకు ఇప్పుడు భారీ ఆఫర్ను ప్రకటించింది స్కోడా కంపెనీ. ఆక్టేవియా ఆర్ఎస్ 245 వేరియంట్పై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. ఆక్టేవియా ఆర్ఎస్245ను గత ఏడాది రూ.35.99 లక్షల(ఎక్స్-షోరూమ్) కు లాంచ్ చేసింది. ఈ కారు 2.0-లీటర్, టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 370ఎన్ఎమ్ వద్ద 245 హెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డిఎస్జి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది. కొత్త వేరియంట్లో డ్యూయల్-క్లచ్ గేర్బాక్స్, ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ని వంటి ఫీచర్లను కూడా అందించింది. దీనిలోని ట్రాక్షన్ ముందు చక్రాలకు 100 శాతం శక్తిని ప్రసారం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. తర్వాత తరం ఆక్టేవియా కార్లను తీసుకోని రావడానికి మిగిలిపోయిన ఆర్ఎస్ 245 వేరియంట్పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు! -
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే!
న్యూఢిల్లీ: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)ను ఇప్పట్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా పేర్కొంది. ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణకు భారత్లో తగిన పరిస్థితులు లేవని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈవీల్లో వినియోగించే బ్యాటరీల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి మార్కెట్ ఈవీ బ్యాటరీల ధరలను భరించేందుకు సిద్ధంగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్రం ఈవీ బ్యాటరీ ధరల్ని తగ్గించినప్పటికీ పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని, ఈ ధరలు సమాన స్థాయికి చేరేందుకు మరి కొన్నేళ్ల సమయం పట్టొచ్చని తెలిపారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనందున ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఈవీ వ్యాపారం లాభసాటి కాదని చెప్పారు. చదవండి: సింగిల్ ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణం! -
స్కోడా ‘కుషాక్’
సాక్షి, ముంబై: చెక్ దేశపు వాహన తయారీ సంస్థ స్కోడా గురువారం తన కొత్త కుషాక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. కంపెనీ తలపెట్టిన ఇండియా 2.0 ప్రాజెక్ట్లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్ ఘనతకెక్కనుంది. మధ్య తరహా ఎస్యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు సరికొత్త కుషాక్ పోటీ ఇవ్వనుంది. స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 115 బీహెచ్పీ శక్తిని, 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండోది 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్పీ శక్తిని విడుదల చేసింది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీఎస్జీ గేర్బాక్స్ కలిగి ఉంది. స్కోడా కుషాక్ ధరలు జూన్ లేదా జూలైలో ప్రకటించనున్నారు. బుకింగ్స్ జూన్లో ప్రారంభమవుతాయి, జూలై 2021 నాటికి కుషాక్ కార్ల డెలివరీలు ప్రారంభం కావచ్చని స్కోడా సంస్థ భావిస్తోంది. -
స్కోడా వోక్స్వ్యాగన్కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజిల్ కారులో ఉద్గార నిబంధనలను తారుమారు చేసేందుకు మోసపూరిత పరికారాన్ని (చీట్ డివైజ్) కంపెనీ ఏర్పాటు చేసిందంటూ ఉత్తరప్రదేశ్లో ఓ వినియోగదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా కోరుకున్న ఫలితం దక్కలేదు. వాహనాల్లో చీట్ డివైజ్ల ఏర్పాటుపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టేవేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ ఎందుకు కొనసాగించరాదంటూ ఈ నెల 4న విచారణలో భాగంగా ప్రశ్నించిన ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్లో పెట్టింది. ‘చీట్’ లేదా ‘డిఫీట్ డివైజ్’ అన్నది సాఫ్ట్వేర్తో కూడిన ఓ పరికరం. దీన్ని ఆటో ఇంజన్లలో అమర్చడం ద్వారా కాలుష్యం విడుదల పరీక్షల ఫలితాలను తారుమారు చేయగలదు. ఈ విషయంలో అంతర్జాతీయంగా వోక్స్వ్యాగన్ కొన్నేళ్ల క్రితం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నది. ఈ కేసులో స్కోడా వోక్స్వ్యాగన్ రూ.671.34 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. -
స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ : ధర ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా మిడ్ రేంజ్ సెడాన్ను బుధవారం లాంచ్ చేసింది. ర్యాపిడ్ స్కోడాలో కొత్త వేరియంట్ను భారత మార్కెట్లో తీసుకొచ్చామని స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. స్కోడా రాపిడ్ రైడర్ ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ కారు ధరను 7.99 లక్షల రూపాయలుగా (ఎక్స్-షోరూమ్ ఇండియా) నిర్ణయించింది. (వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్) బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఇందులోని వన్-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10 పీఎస్ పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ ఎయిర్బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్తో ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రఫ్ రోడ్ ప్యాకేజీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. 16.51 సెంటీమీటర్ల కలర్ టచ్స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డస్ట్ అండ్ పొల్యూషన్ ఫిల్టర్ లాంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 1.0 టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్తో వచ్చే కొత్త రాపిడ్ టిఎస్ఐ శ్రేణి ఉత్పత్తులను కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిందని, తమ కొత్త రైడర్ ప్లస్ పోటీ ధర వద్ద మోటివ్ డిజైన్, చక్కటి ఇంటీరియర్స్ క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్ల కలయికను అందిస్తుందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ధర రూ.36 లక్షలు; ఆన్లైన్లోనే సేల్
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ఆక్టేవియా ఆర్ఎస్ 245 మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.35.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఈ కారుకు ఆన్లైన్ బుకింగ్లు వచ్చే నెల 1 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. రూ. లక్ష చెల్లించి బుక్ చేసుకోవాలని, 200 కార్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చామని వివరించారు. బుక్స్కోడాఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుపుతామని తెలిపారు. ఈ కారును 2లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో రూపొందించామని, ఏడు గేర్ల ఆటోమేటిక్ డ్యుయల్–క్లచ్ ట్రాన్సిమిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ర్యాలీ గ్రీన్, రేస్ బ్లూ, కొరిడా రెడ్, మ్యాజిక్ బ్లాక్ మరియు కాండీ వైట్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది. -
స్కోడా చకన్ ప్లాంట్లో ఉత్పత్తికి బ్రేక్
న్యూఢిల్లీ: కొత్త ఉత్పత్తుల తయారీకి అనుకూలంగా అప్గ్రేడ్ చేసే దిశగా పుణెలోని చకన్ ప్లాంటులో నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా వెల్లడించింది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య దాకా కార్యకలాపాలు ఆపివేయనున్నట్లు వివరించింది. ఇటీవలే అక్టోబర్–నవంబర్ మధ్యలో కూడా స్కోడా నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేసింది. ఫోక్స్వ్యాగన్ గ్రూప్ ఇండియా ఈ ఏడాదే తమ మూడు ప్యాసింజర్ కార్ల తయారీ అనుబంధ సంస్థలన్నింటినీ ఒకే సంస్థగా స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా కింద మార్చింది. ఇందులో ఫోక్స్వ్యాగన్ ఇండియా, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా ఉన్నాయి. -
స్కోడా ‘కొడియాక్, సూపర్బ్’ స్పెషల్ ఎడిషన్స్ విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ‘కొడియాక్’, ప్రీమియం సెడాన్ ‘సూపర్బ్’ కార్లలో స్పెషల్ ఎడిషన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్ వెర్షన్ సూపర్బ్ (డీఎస్జీ) కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 25.99 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 28.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇక డీజిల్ వేరియంట్ కొడియాక్ కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 32.99 లక్షలుగా నిర్ణయించింది. -
మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్’ లిమిటెడ్ ఎడిషన్
న్యూఢిల్లీ: ప్రముఖ యూరోపియన్ కార్ల తయారీ సంస్థ ‘స్కోడా’... భారత మార్కెట్లో తన మిడ్–సైజ్ సెడాన్ ‘రాపిడ్’ స్పెషల్ ఎడిషన్ను మంగళవారం విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా (ఎక్స్–షోరూం) కంపెనీ ప్రకటించింది. యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి అత్యవసర భద్రతా ఫీచర్లను కలిగిన ఈ పరిమిత ఎడిషన్.. 1.6 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో అందుబాటులోకి వచ్చింది. ఇతర ఫీచర్ల పరంగా.. వెనుక పార్కింగ్ సెన్సార్లు, యాంటీ గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, విండ్స్క్రీన్ డీఫాగర్, రఫ్ రోడ్ ప్యాకేజ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్తో కూడిన ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉన్నట్లు వెల్లడించింది. -
స్కోడా కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: కారును సొంతం చేసుకోవాలని కలలు కంటున్నవారికి సువర్ణావకాశం. డ్రీమ్ కార్ను సొంతం చేసుకునే సమయం ఇది. తొలకరి జల్లుల కంటే ముందే ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివిధ లగ్జరీ మోడళ్ల కార్ల కొనుగోళ్లపై నగదు డిస్కౌంట్, లాయల్టీ బోనస్, క్యాష్బ్యాక్ , బై బ్యాక్ లాంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రాపిడ్, ఆక్టావియా, కొడియాక్ తదితర కార్లపై దాదాపు రూ.1. 75 వరకు భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. అవకాశం మే 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నగదు లాభాలు, లాయల్టీ బోనస్ ఇతర ప్రయోజనాలు రాపిడ్ ( ఆంబిషన్ ఎంటీ డీజిల్, ఆంబిషన్ ఏటీ పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోలు తప్ప) రూ. 50వేల వరకు డిస్కౌంట్ , దీంతోపాటు రూ .25వే లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఆంబిషన్ ఎంటీ డీజిల్ ఆంబిషన్ ఏటీ, పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోల్ మోడల్స్ పై రూ. 25వేల లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు రాపిడ్ మై 2018 రూ .1 లక్ష వరకు డిస్కౌంట్, దీంతోపాటు 10వేల రూపాయల మెయింటినెన్స్ ప్యాకేజీ కూడా లభ్యం. ఆక్టావియా రూ. 50వేల వరకు డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) మరో రూ .50వేల లోయల్టీ బోనస్ సూపర్బ్ మై 2019 రూ .50వేల డిస్కౌంట్ వరకు (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) 3 సంవత్సరాల తర్వాత 57 శాతం బై బ్యాక్ ఆఫర్ సూపర్బ్ మై -2018 కారుపై రూ .1.75 లక్షల డిస్కౌంట్ కోడియాక్ రూ .50వేల డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) రూ .50వేల లోయల్టీ బోనస్. ఈ ఆఫర్లు భారతదేశం అంతటా వర్తిస్తాయి. -
మార్కెట్లో స్కోడా ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ కారు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా తమ ప్రీమియం సెడాన్ కారు ఆక్టావియాలో కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు (పెట్రోల్ ఇంజిన్) ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇక డీజిల్ వేరియంట్ రేటు రూ. 16.99 లక్షలుగా (ఎక్స్షోరూం) ఉంటుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 16.7 కి.మీ. మైలేజినిస్తుంది. 8.1 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 219 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. మరోవైపు డీజిల్ వేరియంట్ లీటరుకు 21 కి.మీ. మైలేజీనిస్తుంది. 8.4 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. గరిష్టంగా గంటకు 218 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. -
వాహన సంస్థల ఫ్రెండ్లీ షి‘కారు’
(సాక్షి, బిజినెస్ విభాగం): కానోడికి కానోడు మనోడనేది నానుడి. కానీ ఇపుడు వాహన పరిశ్రమలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కంపెనీలు పోటీ కంపెనీల్ని ప్రత్యర్థులుగా భావించడం మానేస్తున్నాయి. ప్రతి కంపెనీ... తోటి కంపెనీని ఫ్రెండ్లీగానే చూస్తోంది. దీనికి ప్రధాన కారణం భారత్ స్టేజ్ (బీఎస్)–6 నిబంధనలే, ఇవి మరో ఏడాదిలో అమల్లోకి రానుండటం తో... వీటికి తగిన ఇంజిన్ల తయారీ కోసం కార్ల కంపెనీలు గట్టి కసరత్తు చేస్తున్నాయి. సొంతగా ఇంజిన్లు తయారు చేయాలంటే పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఇతర చర, స్థిర వ్యయాలు అదనం. మరోవైపు బీఎస్–6 నిబంధనల గడువు దగ్గరకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో వాహన పరిశ్రమలో కంపెనీలు మిత్ర గీతం ఆలపిస్తున్నాయి. పోటీ అని చూడకుండా ఒక కంపెనీ, మరో రెండు, మూడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ పరిణామాలపై ‘సాక్షి’ బిజినెస్ ప్రత్యేక కథనమిది... భారత్ స్టేజ్ అంటే... మోటార్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మోటార్ వాహనాల నుంచి వాతావరణంలోకి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్, పర్టిక్యులేట్ మ్యాటర్(పీఎమ్), సల్ఫర్ ఆక్సైడ్ల మోతాదులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిబంధనల్ని రూపొందించారు. 2017 నుంచి భారత్ స్టేజ్–4 నిబంధనలు అమల్లోకి రాగా... 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్–6 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బీఎస్–6 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ల తయారీ, కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవటం కంపెనీలకు వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఇంజిన్ల తయారీ ఖరీదు కావడం, ఇతర వ్యయాల కారణంగా కొనుగోలు దారులకు కూడా అదనపు భారం తప్పదు. తప్పనిసరై ఒప్పందాలు... వ్యయ భారం తగ్గించుకునే క్రమంలో భాగంగా కార్ల కంపెనీలు పోటీ కంపెనీలతో తప్పనిసరై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తర్వాతి తరం ఇంజిన్ల తయారీ కోసం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఆరుకు పైగా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం దీంట్లో భాగమే. ఈ రెండు కంపెనీలే కాక ఫియట్, ఫోర్డ్, తదితర పెద్ద కంపెనీలు కూడా ఇంజిన్లకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇంజిన్లను ఇతర కంపెనీల నుంచి సమీకరించడం వల్ల కార్ల కంపెనీలకు చాలా అంశాలు కలసివస్తాయి. స్థిర, చర వ్యయాలు తక్కువగా ఉండటమే కాకుండా కంపెనీలు ప్రొడక్ట్ డెవలప్మెంట్పై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది. దీంతో వాహనం ధరను ఆకర్షణీయ స్థాయిలో నిర్ణయించవచ్చు. బీఎస్–4 డీజిల్ ఇంజిన్ల కన్నా బీఎస్–6 డీజిల్ ఇంజిన్ల ఖరీదు ఎక్కువ. ఈ ఇంజిన్లను సరుకులు రవాణా చేసే త్రీ వీలర్ల నుంచి ఆధునిక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్కు(ఎస్యూవీ) వినియోగించనున్నారు. టాటా మోటార్స్కు ఫియట్ ఇంజిన్లు... టాటా మోటార్స్ ఇటీవలే హారియర్ పేరిట కొత్త ఎస్యూవీని మార్కెట్లోకి తెచ్చింది. దీనిని 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్తో రూపొందించారు. ఈ ఇంజిన్లను ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (గతంలో ఫియట్ ఇండియా) నుంచి టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాదే మార్కెట్లోకి రానున్న ఏడు సీట్ల హారియర్ మోడల్కు కూడా ఇంజిన్లను ఈ కంపెనీ నుంచే టాటా మోటార్స్ తీసుకుంటోంది. హారియర్లో ఆటోమేటిక్ వేరియంట్కు కావలసిన ఇంజిన్ల కోసం కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్తో టాటా చర్చలు జరిపిందని, సాంకేతిక కారణాలతో డీల్ కుదరలేదని సమాచారం. హారియర్ ఆటోమేటిక్ వేరియంట్కు కావలసిన బీఎస్–6 డీజిల్ ఇంజిన్లను సరఫరా చేస్తామని ఫియట్ క్రిస్లర్ కంపెనీ ముందుకు వచ్చింది. టాటా మోటార్స్కే కాకుండా బ్రిటిష్ బ్రాండ్ ఎమ్జీ మోటార్స్కు కూడా ఇంజిన్లను సరఫరా చేయడానికి ఫియట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎమ్జీ మోటార్స్ భారత మార్కెట్లో హెక్టర్ మోడల్తో అరంగేట్రం చేయనుంది. ఐదు సీట్ల ప్రీమియం ఎస్యూవీ... హెక్టర్లో ఫియట్ సరఫరా చేసే ఇంజిన్లనే ఉపయోగిస్తారు. ఇదే ఇంజిన్ను ఫియట్ కంపెనీ తన జీప్ కంపాస్ ఎస్యూవీలో ఉపయోగిస్తోంది. ఫోర్డ్కు మహీంద్రా... ఇంజిన్ల సరఫరా ఒక్క ఫియట్ కంపెనీకే పరిమితం కాలేదు. దేశీ దిగ్గజ వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇంజిన్లను సరఫరా చేయనుంది. ఈ కంపెనీ 1.2 లీటర్ల టర్బో–చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను ఫోర్డ్ కంపెనీకి సరఫరా చేస్తోంది. తన ఈకో స్పోర్ట్ ఎస్యూవీలో ఈ ఇంజిన్లను ఫోర్డ్ వాడుకోనుంది. ఇటీవలే మహీంద్రా మార్కెట్లోకి తెచ్చిన మహీంద్రా ఎక్స్యూవీ 300 ఎస్యూవీలో ఈ ఇంజిన్నే వాడారు. మహీంద్రా ఇంజిన్లను సరఫరా చేయటంతో పాటు, వేరే కంపెనీ నుంచి ఇంజిన్లను కొనుగోలు కూడా చేస్తోంది. తన త్రీ వీలర్ల కోసం చిన్నదైన రెండు సిలిండర్ల డీజిల్ ఇంజిన్లను గ్రీవ్స్ కాటన్ కంపెనీ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక గ్రీవ్స్ కాటన్ బీఎస్–సిక్స్ ఇంజిన్లను పియాజియో కంపెనీకి సరఫరా చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పియాజియో కంపెనీ తన త్రీ వీలర్లలో ఈ ఇంజిన్లను ఉపయోగించనున్నది. ఫోక్స్వ్యాగన్ ప్రాజెక్ట్ 2.0 ఫోక్స్వ్యాగన్– స్కోడా భారత్లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వచ్చే ఏడాది కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం బీఎస్–6 ఇంజిన్ల కొనుగోలుదారుల కోసం చూస్తోంది. జర్మనీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే బీఎస్– 6(యూరో–సిక్స్) ఇంజిన్లు తయారు చేస్తోంది. భారత్లో ప్రాజెక్ట్ 2.0 పేరుతో కొత్త తరం ఇంజిన్ల తయారీకి శ్రీకారం చుట్టనుంది. ఇంజిన్ల తయారీకి స్థానిక విడిభాగాలను 95 శాతం వరకూ వినియోగించుకోనున్నది. టెక్నాలజీ కోసం కూడా... బీఎస్–6 ఇంజిన్ టెక్నాలజీ కోసం టాటా మోటార్స్ సంస్థ వెస్ట్పోర్ట్ ఫ్యూయల్ సిస్టమ్స్తోను, అశోక్ లేలాండ్ జపాన్కు చెందిన హినోతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కెనడాకు చెందిన వెస్ట్పోర్ట్ 4, 6 సిలిండర్ల సీఎన్జీ ఇంజిన్లను టాటా మోటార్స్కు సరఫరా చేయనుంది. తన ట్రక్కులు, బస్సుల కోసం ఈ ఇంజిన్లను టాటా మోటార్స్ ఉపయోగిస్తుంది. కమ్మిన్స్ కంపెనీతో ఇంజిన్ల సరఫరా ఒప్పందాలు గత కొన్నేళ్లుగా టాటా మోటార్స్ కొనసాగిస్తోంది. బీఎస్–సిక్స్ డీజిల్ ఇంజిన్ల కోసం తాజాగా మరో ఒప్పందాన్ని టాటా మోటార్స్ కుదుర్చుకుంది. -
పెరగనున్న కొత్త మోడల్ కార్ల ధరలు
న్యూ ఢిల్లీ : స్వీడిష్ కార్ల కంపెనీ వోల్వో తన కార్లన్నింటి ధరలను 5శాతం మేర పెంచనునన్నట్లు ప్రకటించింది. 2018 కేంద్ర బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని పెంచినందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 2018 బడ్జెట్లో కేంద్రం సీకేడీ, సీబీయూ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 5శాతం పెంచింది. దీంతో సీకేడీ దిగుమతులపై విధించే పన్ను 15 శాతం, సీబీఐ దిగుమతులపై విధించే పన్ను 25 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న వోల్వో కార్లన్ని సీకేడీ లేదా సీబీయూ విభాగానికి చెందినవే కావడంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ధరలు పెరిగాయి కదాని వినియోగదారులేమీ బాధపడాల్సిన పనిలేదని, పాత ధరల్లోనే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కారును కొనుగోలు చేసుకోవచ్చని తెలిసింది. ఈ పెరిగిన ధరలు కేవలం భారత్లోకి దిగుమతి అయ్యే కొత్త మోడల్ కార్లకే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ, బీఎమ్డబ్య్లూ, ఆడీ క్యూ3 మాదిరిగానే భారత్లో వోల్వో తన ఎస్యూవీ, యక్స్సీ40లను కూడా ప్రారంభించనుంది. ఫోర్డ్, స్కోడా కూడా... దిగుమతి సుంకం పెరిగిన నేపథ్యంలో ఫోర్డ్, స్కోడా కంపెనీలు కూడా వాటి కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. స్కోడా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా 1 శాతం నుంచి ధరలను పెంచుతోంది. ఫోర్డ్ కూడా ఎప్పటి మాదిరిగానే తన కార్ల ధరలను 4శాతం పెంచేసింది. ఈ పెంచిన ధరలు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. -
పెరగనున్న స్కోడా ధరలు
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతోంది. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను పెంచడంతో అన్ని మోడళ్ల ధరలను 1 శాతం వరకూ (రూ.10,000 నుంచి రూ.35 వేల వరకూ) పెంచుతున్నామని తెలిపింది. దశల వారీగా కార్ల ధరలను మరింతగా పెంచుతామని పేర్కొంది. మోడళ్లను బట్టి భవిష్యత్తులో ధరల పెంపు 3 నుంచి 4 శాతం రేంజ్లో ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ రూ.8.32 లక్షల ఖరీదు చేసే మిడ్ సైజ్ సెడాన్ రాపిడ్ నుంచి రూ.34.5 లక్షలు ధర ఉండే ఎస్యూవీ కోడియాక్ వరకు మోడళ్లను విక్రయిస్తోంది. -
స్కోడా నుంచి ‘కొడియాక్’ ఎస్యూవీ
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తాజాగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) కొడియాక్ను ఆవిష్కరించింది. ఈ 7 సీటర్ ఎస్యూవీ ధరను రూ. 34,49,501గా నిర్ణయించింది. తొలి ఏడాదిలో కనీసం 1,000 కొడియాక్ ఎస్యూవీలను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు స్కోడా ఆటో బోర్డు సభ్యుడు క్లాస్ డైటర్ షుర్మన్ తెలిపారు. జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్వ్యాగన్లో భాగమైన స్కోడా.. ప్రస్తుతం ర్యాపిడ్, సూపర్బ్, ఆక్టావియా పేరిట మూడు రకాల ప్రీమియం సెడాన్ కార్లను భారత్లో విక్రయిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన కొడియాక్ ఎస్యూవీ.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇసుజు ఎంయూ–ఎక్స్లతో పాటు ఫోక్స్వ్యాగన్ టిగువాన్లతో పోటీపడనుందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఔరంగాబాద్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేసే ఈ కారులో తొమ్మిది ఎయిర్బ్యాగ్స్, నాలుగేళ్ల వారంటీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. బుధవారం నుంచి దీనికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే నెల మొదటి వారం నుంచి డెలివరీ మొదలవుతుందని సంస్థ ఇండియా డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ వెల్లడించారు. -
స్కోడా ‘ఆక్టావియా’లో కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.15.49 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘స్కోడా’ తాజాగా తన బెస్ట్–సెల్లింగ్ సెడాన్ కారు ‘ఆక్టావియా ఫేస్లిఫ్ట్’లో కొత్త వెర్షన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా దీని ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.15.49 లక్షలు. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఆప్షన్లో నాలుగు రకాల వేరియంట్లున్నాయి. ఇవి 1.4 లీటర్, 1.8 లీట ర్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి ధరలు రూ.15.49 లక్షలు– 20.89 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఇక 2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో కూడా నాలుగు రకాల వేరియంట్లున్నాయి. వీటి ధర 16.90 లక్షలు– రూ.22.89 లక్షల శ్రేణిలో ఉంది. కొత్త ఆక్టావియాలో హ్యాండ్స్–ఫ్రీ పార్కింగ్, ఎనిమిది సేఫ్టీ ఎయిర్బ్యాగ్స్ తదితర ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. -
స్కోడా ఆక్టావియా లాంచ్.. ధర
న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్కు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కొడా కొత్త సెడాన్ ఆక్టావియా ను లాంచ్ చేసింది. భారతదేశంలో అత్యుత్తమంగా అమ్ముడుపోయిన సెడాన్ ఆక్టవియా కొత్త వెర్షన్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 15.49 లక్షల( ఆల్ ఇండియా ఎక్స్ షోరూం ధరలు) నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపింది.. పెట్రోల్ డీజిల్ ఇంజిన్ రెండు వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా పెట్రోల్ లో 1.4 లీటర్, 1.8 లీటర్ల రెండు ఇంజిన్ ఎంపికలతో రూ. 15.49-20.89 లక్షల మధ్య ధరకే లభిస్తుంది. డీజిల్ 2-లీటర్ ఇంజన్తో నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటి రూ .16.9-22.89 లక్షల మధ్య ఉంటాయని కంపెనీ ప్రకటించింది. స్కొడా కీలకమై బ్రాండ్ ఆక్టవియా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు మిలియన్ యూనిట్లు అమ్ముడైంది. 2001లో భారతదేశంలోఎంట్రీ ఇచ్చినప్పటినుంచి 90,000 యూనిట్లు విక్రయించింది. జనవరి-జూన్లో 15 శాతం వృద్ధి సాధించిన కంపెనీ విక్రయాలను మరింత పెంచుకోనుందని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో స్కొడా ఆటో ఇండియా 7,576 యూనిట్లు విక్రయించినట్టు తెలిపారు. కొత్త ఉత్పత్తులతో ఈ ఏడాది 30 శాతం అమ్మకాలు పెరగాలని, తద్వారా ప్రీమియం సెగ్మెంట్లో మా స్థానం మరింత మెరుగు పరుస్తామని దీక్షిత్ వెల్లడించారు. కొత్త ఆక్టివియాలో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఐ బజ్ డ్రైవర్ ఫెటీగ్ ఎలర్ట్, ఎనిమిది ఎయిర్ బాగ్స్ లాంటి అదనపు ఫీచర్లతో కార్ లవర్స్ ను ఆకట్టుకోనుంది. కొత్త ఆక్టేవియా ఈ విభాగంలో టొయోటా కరోలా అల్టిస్ గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
మరిన్ని కంపెనీల వాహన ధరలు తగ్గాయ్
♦ జాబితాలో హ్యుందాయ్, ♦ నిస్సాన్, స్కోడా, ఇసుజు, కేటీఎం ♦ రూ.2.4 లక్షల వరకు తగ్గింపు న్యూఢిల్లీ: తాజాగా మరిన్ని కంపెనీలు వాటి వాహన ధరలను తగ్గించాయి. నిస్సాన్, హ్యుందాయ్, స్కోడా, ఇసుజు, కేటీఎం కంపెనీలు వాటి వాహన ధరల్లో రూ.2.4 లక్షల వరకు కోత విధించాయి. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ధరల తగ్గింపు ప్రాంతాన్ని, మోడల్ను బట్టి మారుతుందని పేర్కొన్నాయి. ధరల తగ్గింపును పరిశీలిస్తే.. ⇔ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వాహన ధరలను 5.9 శాతం వరకు తగ్గించింది. ⇔ నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ సహా తన వాహన ధరలను 3 శాతం వరకు తగ్గించింది. జీఎస్టీ అమలు వల్ల అటు వాహన తయారీ కంపెనీలకు, ఇటు కస్టమర్లకు ఇరువురికీ లబ్ధి కలుగుతుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. నిస్సాన్ మోటార్ ఇండియా భారత్లో నిస్సాన్, డాట్సన్ బ్రాండ్స్ కింద రెడిగో మొదలు టెర్రానో వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది. ⇔ స్కోడా ముంబై ప్రాంతంలో వాహన ధరలను 7.3% వరకు తగ్గించింది. అంటే కస్టమర్లు రూ.2.4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ⇔ టాటా మోటార్స్.. వాణిజ్య వాహన ధరలను 8.2 శాతం వరకు తగ్గించింది. ⇔ ఇసుజు మోటార్స్ ఇండియా వాహన ధరల్లో 12 శాతం వరకు కోత విధించింది. ⇔ కేటీఎం కంపెనీ తన బైక్స్ ధరలను రూ.8,600 వరకు తగ్గించింది. కాగా రెనో ఇండియా, మహీంద్రా, హోండా కార్స్, ఫోర్డ్, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ వంటి పలు కార్ల కంపెనీలు ఇప్పటికే ధరల తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ వంటి పలు టూవీలర్ కంపెనీలు కూడా వాహన ధరలను తగ్గించాయి. -
ఫోక్స్వ్యాగన్, స్కోడాలతో టాటా మోటార్స్ జట్టు
⇒ సంయుక్తంగా ప్రొడక్టుల రూపకల్పనే లక్ష్యం ⇒ 2019లో మార్కెట్లోకి తొలి ఉత్పత్తి! న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన సంస్థ ‘టాటా మోటార్స్’ తాజాగా అదే రంగంలోని ఫోక్స్వ్యాగన్ గ్రూప్, స్కోడా కంపెనీలతో దీర్ఘకాలపు వ్యూహాత్మక భాగస్వామ్యఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులోభాగంగా మూడుసంస్థలు కలిసి సంయుక్తంగా ప్రొడక్టులను రూపొందించనున్నాయి. టాటా మోటార్స్ సీఎండీ గుంటర్ బషెక్, ఫోక్స్వ్యాగన్ ఏజీ సీఈవో మథియస్ ముల్లర్, స్కోడా ఆటో సీఈవో బెర్న్హార్డ్ మేయర్ ఒప్పందంపై సంతకాలు చేశారని టాటా మోటార్స్ పేర్కొంది. భాగస్వామ్యంలో భాగంగా తొలి ఉత్పత్తిని 2019లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది. -
స్కోడా కారును గాడిదలతో లాగించి..
లుథియానా: ఏదైనా వస్తువులు అమ్మేటప్పుడు కంపెనీలు అన్ని సర్వీసులు అందిస్తామని వినియోగదారులకు హామీయిస్తుంటాయి. తీరా ఏదైనా సమస్య వచ్చినప్పడు తమకు సంబంధం లేదన్నట్టుగా చాలా కంపెనీలు వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వినియోగదారులు సదరు సంస్థలతో గొడవలకు దిగడం, తిట్టిపోయడం జరుగుతుంటుంది. చైతన్యవంతులైతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తుంటారు. పంజాబ్ లోని లుథియానాకు చెందిన కారు యజమాని ఒకరు వినూత్నంగా నిరసన తెలిపాడు. తన స్కోడా కారుకు రిపేరు రావడంతో కంపెనీ సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాడు. అక్కడగా సరిగా స్పందించకపోడంతో వినూత్న నిరసన చేపట్టాడు. తన కారును గాడిదలతో లాగించి నిరసన తెలిపాడు. కారును గాడిదలు లాక్కెళ్లడం చూసినవారంతా ముక్కన వేసేసుకున్నారు. ఇలాగా కూడా నిరసన తెలపొచ్చా అని చర్చించుకున్నారు. -
ఇపుడు స్కోడా వంతు
న్యూఢిల్లీ: చెక్ కార్ మేకర్ స్కోడా ఇండియాలో దాదాపు 5 వందల కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ ఆక్టావియా మోడల్ 539 యూనిట్లను వెనక్కి తీసుకోనుంది. వెనుక రెండు డోర్లలో తెలెత్తిన లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రియర్ డోర్ల్ చైల్డ్ లాక్ లోపాన్ని పరిష్కరించడానికి వీలుగా నవంబర్ 2015, ఏప్రిల్ 2016 మధ్య ఉత్పత్తయిన ఆక్టావియా సెడాన్ 539 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు స్కోడా ఇండియా యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వెనుక తలుపులు మాన్యువల్ పిల్లల లాక్ తనిఖీ కోసం ఆయా వినియోగదారులను తమ డీలర్లకు సంప్రదిస్తారని తెలిపింది. ఈ తనిఖీకి 12 నిమిషాలు సరిపోతుందని, ఒక వేళ రీప్లేస్ చేయాల్సివ స్తే.. 45 నిమిషాల్లో ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ర్యాపిడ్, ఎటి ఆక్టావియా, సూపర్బ్ మోడల్ కార్లను భారత్ లో విక్రయిస్తోంది. ఢిల్లీ ఎక్స్ షో రూం లో వీటి 16 నుంచి 22 లక్షల మధ్య ఉంది. కాగా దేశంలో 20 లక్షలకు పైగా వాహనాలను వివిధ కార్ల తయారీ సంస్థలు సెక్యూరిటీ కారణాల రీత్యా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. -
రూ.100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు!
♦ ఈ ఏడాదిలో 40 డీలర్షిప్స్లకు.. హైదరాబాద్తో మొదలు ♦ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్షిప్స్ను ఆధునీకరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్తో కలసి 5,500 చదరపు అడుగుల స్కోడా ఎక్స్క్లూజివ్ షోరూంను ప్రారంభించారు. ‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్తో పాటూ కొత్త మోడళ్లను సందర్శించటం సులువవుతుంది’’ అని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ కొత్త లుక్ తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తాం’’ అని చెప్పారాయన. స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది చివరికి 20 వేలకు చేరొచ్చని అంచనా వేశారు. -
స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్
ధరలు రూ.22.68 లక్షల నుంచి రూ.29.36 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ప్రీమియం సెడాన్ ‘సూపర్బ్’లో కొత్త వేరియంట్ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ థర్డ్ జనరేషన్ స్కోడా సూపర్బ్ను 1.8 లీటర్ పెట్రోల్, 2 లీటర్ల డీజిల్ ఇంజిన్లతో రూపొం దించామని స్కోడా ఆటో ఇండియా సీఎండీ సుధీర్రావు చెప్పారు. పెట్రోల్ వేరియంట్ కార్ల ధరలు రూ.22.68 లక్షలు, రూ.23.91 లక్షలు, రూ.26.89 లక్షలని, అలాగే డీజిల్ వేరియంట్ కార్ల ధరలు రూ.26.39 లక్షలు, రూ.29.36 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై) పేర్కొన్నారు. మైలేజీ 14-18 కి.మీ. వస్తుందని పేర్కొన్నారు. డ్యుయల్-జోన్ ఏసీ, పార్కింగ్ సెన్సర్లు, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్రూఫ్, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో అడ్జెస్ట్ చేసుకోగలిగే సీట్లు, తదితర ఫీచర్లున్నాయని ఆయన తెలిపారు. కాగా ఈ థర్డ్ జనరేషన్ స్కోడా సూపర్బ్ కారు-టయోటా కామ్రి, మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ, ఆడి ఏ 3 కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
భారత్లో స్కోడా ఫాబియా రీ ఎంట్రీ
త్వరలో ప్రీమియం ఎస్యూవీ కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీ సంస్థ స్కోడా... తన హ్యాచ్ బ్యాక్ మోడల్ ఫాబియాను భారత్లో తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడం, 50-60 శాతం విడిభాగాలు దిగుమతి చేసుకోవాల్సి రావటం వల్ల ఖర్చులు తడిసిమోపెడై 2013లో ఫాబియా విక్రయాలను కంపెనీ నిలిపివేసింది. ప్రస్తుతం భారత్ మినహా పలు దేశాల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంది. తిరిగి దీనిని భారత్లో ప్రవేశపెట్టాలని కంపెనీ గట్టిగా అనుకుంటున్నా... ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. రీ ఎంట్రీ ఇవ్వనున్న ఫాబియాకు అత్యధిక విడిభాగాలను స్థానికంగానే సేకరించనున్నారు. కాగా, 2014లో దేశవ్యాప్తంగా అన్ని మోడళ్లూ కలిపి కంపెనీ 15,500 కార్లను విక్రయించింది. దీన్లో స్కోడా బేసిక్ మోడల్ అయిన ర్యాపిడ్ వాటా 70 శాతానికి పైగా ఉంది. ర్యాపిడ్ ధర హైదరాబాద్లో మోడల్ను బట్టి రూ.7.7 లక్షల నుంచి ఆరంభమవుతూ ఉండగా... అంతకన్నా తక్కువ ధర ఉన్న ఫాబియాను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలు జోరందుకుంటాయని కంపెనీ భావిస్తోంది. ప్రీమియం ఎస్యూవీ కూడా... భారత్లో ప్రీమియం ఎస్యూవీని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు స్కోడా ప్రాంతీయ సేల్స్ హెడ్ మహేశ్ తివారీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఫాబియా రీ ఎంట్రీని ధ్రువీకరించిన ఆయన... ఈ రెండూ ఎప్పుడు విడుదలవుతాయనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదన్నారు. ‘సూపర్బ్’ కొత్త మోడల్ 2016 ద్వితీయార్థంలో రానుందని తెలియజేశారు. జీల్ ఎడిషన్ మోడళ్లను ఆవిష్కరించేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2015లో అమ్మకాల్లో 20-25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు చెప్పారు. కంపెనీ ఇప్పటి వరకు భారత్లో 2 లక్షల కార్లను విక్రయించింది. అన్ని మోడళ్లకూ అదనపు హంగులను జోడించి జీల్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది.