unemployees
-
నిరుద్యోగులకు భార్య, భర్త టోకరా
-
లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల
వాష్టింగన్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇంట మాత్రమే కాదు.. విదేశాల్లోనూ లక్షల మంది ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని వాషింగ్టన్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అగ్రరాజ్యంలో వేలమంది భారతీయ ఐటీ ఉద్యోగులు.. లే ఆఫ్స్ బారిన పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీలతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కమిట్మెంట్ల కారణంగా తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు బాగా కష్టపడుతున్నారు. ఇక వీసా చిక్కులతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఈ లోపే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణలో మునిగిపోయారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు లే ఆఫ్స్ బారినపడి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అయితే అందులో 30 నుంచి 40 శాతం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా హెచ్1బీ, ఎల్1 వీసాల మీద వెళ్లిన వాళ్లే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగాల వేటకు.. వాట్సాప్ గ్రూపు ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లు.. వర్క్ వీసాల కింద డెడ్లైన్లు ముందు ఉండడంతో కొత్త జాబ్ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఉద్యోగాలు పొగొట్టుకున్న ఉద్యోగుల్లో కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిది వందల మందితో ఉన్న ఓ గ్రూప్ అందుకు నిదర్శనం. ఇక వీళ్ల కష్టాలను చూసి జిట్ప్రో(GITPRO), ఫిడ్స్(FIIDS) రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఓ ఉమ్మడి ప్లాట్ఫామ్ను వాళ్ల కోసం ఏర్పాటు చేశాయి. ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ప్లాట్ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉండడంతో ఉద్యోగులు సైతం తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని కొందరు ఉద్యోగుల గోడు వెల్లబోసుకోగా.. వాళ్ల వ్యథలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ రెండు వీసాలు ఎవరికంటే.. H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికన్ కంపెనీలు తమకు అవసరమయ్యే టెక్నికల్ ఎక్స్పర్ట్లను(విదేశీ ఉద్యోగులను) నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇక ఈ వీసా కింద భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అక్కడి బడా కంపెనీలు.హెచ్ 1 బీ వీసా జాబ్ పోతే గనుక.. 60రోజుల్లోగా హెచ్-1బీ స్పాన్సరింగ్ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక L-1A, L-1B వీసాలు.. కంపెనీలు తాత్కాలిక బదిలీల మీద పంపిస్తుంటాయి. మేనేజెరియల్ పొజిషన్స్ లేదంటే ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ వీసాలు ఎక్కువగా ఇస్తుంటారు. -
విజయ్ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు
Vijay Sethupathi Silent Help to get Jobs for 1 lakh Persons: బహుభాషా నటుడిగా రాణిస్తున్న విజయ్సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయనలో మరో ముఖం కూడా ఉంది. అదే సేవా భావం. ఆపదలో ఉన్న వారికి ఆప్పన్న హస్తం అందించడంలో విజయ్ సేతుపతి ముందుంటారు. అలాంటి ఈయన సహాయ సహకారాలతో ఇ.పి.వీరరాఘవన్ అనే సామాజిక సేవకుడు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి జీవితంలో వెలుగు నింపుతున్నారు. దీని గురించి ఈయన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను 2016 నుంచి సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నానన్నారు. ఆ విధంగా 2019లో సన్ టీవీ నిర్వహిస్తున్న నమ్మ ఊరు హీరో కార్యక్రమంలో ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత, నటుడు విజయ్ సేతుపతిని కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఆ తరువాత ఆయన సహాయ సహకారాలతో పాండిచ్చేరిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారన్నారు. అలా ఇప్పటి వరకు పాండిచ్చేరి, తమిళనాడులోని కొన్ని జిల్లాలకు చెందిన సుమారు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు పేర్కొన్నారు. -
Telangana: 56,979 కొలువులేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఉద్యో గాలను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటికీ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యో గులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ఇంకెన్నాళ్లు వేచిచూడాలని ఆవేదన చెందుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టు ఆర్థిక శాఖ నాలుగైదు నెలల కిందటే ప్రకటించింది. మూడు నెలల క్రితం ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో మొత్తం 57వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో.. ఉద్యోగాల భర్తీ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. పోస్టుల విభజన కోసం.. కొత్త జోనల్ విధానం ఆధారంగా.. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయిల్లో పోస్టుల విభజన, కొత్త జిల్లాల మధ్య పంపిణీ వంటి అంశాలను తేల్చడంపై ఆర్థికశాఖ దృష్టి పెట్టింది. తాజాగా ఈ కసరత్తు కూడా ఓ కొలిక్కి వచ్చిందని.. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నట్టు తేలిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ ఖాళీల వివరాలను ఆమోదించాల్సి ఉందని.. ఆ తర్వాత మార్గదర్శకాలు రూపొందించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేదు కొత్త జోనల్ విధానం నేపథ్యంలో మూడున్నరేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందే జారీ అయిన కొన్ని నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే కొనసాగింది. కొత్త నోటిఫికేషన్లేవీ విడుదల కాలేదు. అయితే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి చర్యలు చేపడతామని ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. దీనిపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు హడావుడిగా కసరత్తు మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల వారీగా ఖాళీల జాబితాను రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా 56,979 నేరుగా భర్తీ చేసే (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించాయి. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 44,022 ఉద్యోగాలు.. సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12,957 ఉద్యోగాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో కొత్త జోనల్ విధానంలో సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త విధానానికి అనుగుణంగా.. ఏ జిల్లాకు, జోన్కు నష్టం జరగకుండా మళ్లీ ఉద్యోగ ఖాళీలు, అవసరాల లెక్క తీశారు. దీని ప్రకారం.. 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తేల్చింది. అడ్డంకులు తొలగిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో సర్వీసు సంబంధిత అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని.. కానీ కొత్త నియామకాల విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు జిల్లాస్థాయి నియామకాల కమిటీ (డీఎస్సీ)లు ఉండేవి. ప్రభుత్వం వాటిని రద్దు చేసి.. దాదాపు అన్నిరకాల ఉద్యోగాల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఇతర నియామకాల బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్పీఆర్బీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎంఆర్బీ)ల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పోస్టుల సంఖ్య, నియామకాల ఆవశ్యకత ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖలకు అధికారాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తించిన ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేసుకునే వీలుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 12,957 పోస్టుల భర్తీకి సర్వీసు నిబంధనల అడ్డంకులు ఉన్నాయని అంటున్నాయి. ప్రభుత్వం గుర్తించిన 67 వేల ఖాళ్లలో టీచర్ పోస్టులు లేవు. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప ఖాళీల లెక్క తేలే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే టీచర్ పోస్టుల భర్తీపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్ స్ట్రెంత్ కొలిక్కి.. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. కేడర్ వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తిచేస్తే.. విభజన ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగ విభాగాలైన వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలోని పోస్టుల విభజన ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వయసైపోతోంది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు పలు సడలింపులు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో వయసు పెరిగి.. ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూన్ నాటి గణాంకాల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) కింద 24,62,032 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో పురుషులు 14,71,205, మహిళలు 9,90,827 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ నాటికి 40 ఏళ్లు దాటినవారు 40,994 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి 44 ఏళ్లు దాటి ఉద్యోగాలకు అనర్హులు కానున్నారు. పీఆర్సీ చెప్పిన ఖాళీలు 1.9 లక్షలు మాజీ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తొలి వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తమ నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని పేర్కొంది. అయితే అందులో పలు నోటిఫికేషన్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నియామకాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని అధికారవర్గాలు చెప్తున్నాయి. అవిపోగా మిగతా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడిస్తున్నాయి. -
ప్రత్యేకం: నిరుద్యోగుల కోసం ‘డీట్’ యాప్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్ను రూపొందించింది. ఉద్యోగాల వేటలో ఉన్నవారు తమ అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం అందుతుంది. అలాగే ఉద్యోగార్థుల అర్హత వివరాలను కూడా డీట్లో నమోదైన ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో డీట్ యాప్ ద్వారా ఈ–కామర్స్, ఆరోగ్య రక్షణ, సేవా రంగాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్లు, టెలీకాలర్లు, హెల్త్కేర్ అసోసియేట్లు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల భర్తీ జరిగింది. డీట్ యాప్ ఉద్యోగాలను వెతికేందుకే పరిమితం కాకుండా ఆన్లైన్ వీడియో ఇంటర్వ్యూల షెడ్యూల్లోనూ సాయం చేస్తోంది. రెజ్యూమ్ రూపకల్పనలోనూ.. ఉద్యోగార్థులు రెజ్యూమ్ లేదా సీవీని సులభంగా తయారు చేసుకునేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించింది. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగార్థులతో కమ్యూనిటీ గ్రూపుల ఏర్పాటును డీట్ ప్రోత్సహిస్తోంది. ఈ తరహా గ్రూపుల్లో సుమారు 8,800కు పైగా నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు, డీట్ ప్రత్యేకతలు, వాక్–ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూలు తదితరాలను తరచూ ఈ గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు డీట్ వేదికగా సుమారు 300కు పైగా నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఐటీ శాఖ చేరవేసింది. ఉద్యోగాల వేటలో ఉన్న వారికి రెజ్యూమ్ తయారీలో మెళకువలను నేర్పించడంతో పాటు ఉద్యోగాలు వెతికేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై 20కి పైగా ఆన్లైన్ అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘ఈక్విఫాక్స్’తో భాగస్వామ్యం.. డీట్ వేదిక ద్వారా షేర్ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్’తో ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలుకుని పెద్ద సంస్థల వరకు డీట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈక్విఫాక్స్ సాయం చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఉన్న నైపుణ్య లేమిని గుర్తించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వివిధ విభాగాలు, సంస్థల వారీగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేయడం దిశగా ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్’ను అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. -
క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్పాండ్లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్పాండ్కు బయల్దేరడం.. మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఆమె ఇంటివద్ద వదిలేయడంతో అక్కడే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్ది’అని అన్నారు. షర్మిలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఆటో యూనియన్ నేత అమానుల్లాఖాన్ ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు తెలిపారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
సచివాలయంలో ఉద్యోగం.. రూ. 67 లక్షలకు టోకరా
సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల అవసరాన్ని అసరాగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రవీందర్.. ఆటోడ్రైవర్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన బత్తిని వైకుంఠం.. రైతు. జిల్లాలోని కొండాపూర్ మండలం తొగర్పల్లికి చెందిన బందెమ్మ.. గృహిణి. వీళ్లు ముగ్గురికి సంగారెడ్డి పట్టణానికి చెందిన విజయ్కుమార్తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ సచివాలయంలో తనకు పరిచయాలు ఉన్నాయని విజయకుమార్ నమ్మబలికడంతో రవీందర్, వైకుంఠం అతనికి సహాయకులుగా ఉన్నారు. కాగా బందెమ్మ 25 మంది వద్ద నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్లుగా రూ.67 లక్షలు వసూలు చేసి వారికి అప్పగించింది. నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు అందజేశారు. విషయం తెలుసుకున్న డబ్బులు ఇచ్చిన పలువురు బాధితులు బందెమ్మను నిలదీశారు. దీంతో తాను తప్పించుకోవడానికి డబ్బులు తీసుకొని రవీందర్, వైకుంఠం, విజయకుమార్లు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని నవంబర్ 9వ తేదీన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె సంగారెడ్డి మార్క్స్నగర్లో నివాసం ఉంటోంది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నకిలీ ముఠాగుట్టు రట్టయ్యింది. పోలీసుల దర్యాప్తులో ఆమె సైతం నిందితురాలు అని తెలింది. దీంతో ఆమెతో పాటు రవీందర్, వైకుంఠాన్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బ్యాంకు చెక్ బుక్కులు, మొబైల్ ఫోన్లు, నకిలీ నియామక పత్రాలను స్వాధీన పరుచుకున్నారు. కాగా విజయకుమార్ పరారీలో ఉన్నాడు. ఆ ముగ్గురిని జ్యూడిషయల్ కస్టడీకి తరలించారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ వెంకటేష్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
నిరుద్యోగులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్
న్యూడిల్లీ: రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త ప్రకటించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ఢిల్లీ ప్రభుత్వం జాబ్ పోర్టల్(ఉపాధి కల్పన సైట్)ను నాలుగు రోజుల క్రితం ప్రారంభించింది. ప్రభుత్వం ప్రారంభించిన జాబ్ పోర్టల్కు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటివరకు 2లక్షల ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం పేర్కొనగా, 3లక్షల 22వేల మంది నిరుద్యోగులు జాబ్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 7,577 కంపెనీలు జాబ్ పోర్టల్లో నమోదు చేసుకున్నాయి. అయితే జాబ్ పోర్టల్లో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు ఎటువంటి చార్జీలను కట్టనవసరం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ జాబ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలంటే మొదటగా సైట్లో లాగిన్ అయ్యాక మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి, తర్వాత ఏ విభాగాలలో ఉద్యోగం కావాలో నమోదు చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒకే ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. కాగా పోర్టల్లో నమోదు చేశాక ఫోన్ లేదా వాట్సాప్లో పోర్టల్ అధికారులు నియామకాలకు సంబంధించిన సమాధానం ఇస్తారు. -
మిగిలింది ఒక్కరోజే..
సాక్షి, నెల్లిమర్ల (విజయనగరం): నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్ల పోస్ట్లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నిరుద్యోగుల కోసం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 4లక్షల గ్రామ వలంటీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మండలం లోని 26 పంచాయతీల్లో ఈ గ్రామ వలంటీర్ల పోస్ట్ల కోసం దరఖాస్తులు వెల్లువులా వచ్చి పడుతున్నాయి. ప్రతి పల్లెలోనూ 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మండలంలో ఆయా గ్రామాల్లో నిరుద్యోగులు వలంటీర్ల పోస్ట్లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి నిరుద్యోగులు పోటెత్తారు. 266 గ్రామ వలంటీర్ల పోస్ట్లు... మండలంలో 26 పంచాయతీలకు గానూ సుమారు 266 గ్రామ వలంటీర్ల పోస్ట్లు ఉన్నాయి. గురువారం నాటికి 1384 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ అక్కారావు తెలిపారు. వీటిలో మొత్తం 77 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు ఏ రోజుకు ఆ రోజు గ్రామ స్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో పొందు పరుస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. ఒక్కో గ్రామంలోనూ నివాసముంటున్న కుటుంబ సభ్యుల వివరాలను ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు సేకరించారు. -
అధికారంలోకి రాగానే 2.30 వేల ఉద్యోగాలు భర్తీ
-
అస్మదీయులకోసం నిరుద్యోగుల కోటాకు ఎసరు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారు. గత నాలుగున్నరేళ్లల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ కలిపి రెండు లక్షలకుపైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే ఆ ఊసే మరిచారు. అదే సమయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన పోస్టులకు సైతం టీడీపీ సర్కారు ఎసరు పెట్టింది. ఖాళీగా ఉన్న 148 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉండగా.. వాటిని తాత్కాలిక పదోన్నతుల పేరుతో అస్మదీయులకు కట్టబెట్టింది. తద్వారా నిరుద్యోగుల పొట్టకొడుతోంది. అస్మదీయులకోసం నిబంధనలకు తిలోదకాలు.. వ్యవసాయ శాఖలో 173 వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా ఏపీపీఎస్సీ 25 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించిందని, మిగతా 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈలోగా తెలుగునాడు బీఎస్సీ (వ్యవసాయ) విస్తరణ అధికారుల అసోసియేషన్ రంగంలోకి దిగింది. పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేయాలంటూ వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసింది. అంతే.. సర్వీసు నిబంధనలను సైతం ఉల్లంఘించి మరీ అస్మదీయులకు ప్రయోజనం కల్పించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టుల్లో తాత్కాలిక పదోన్నతులకు వీలు కల్పించారు. తద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాకు పాతరేశారు. ఒకవైపు వ్యవసాయ బీఎస్సీ చదివి వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టుల భర్తీకోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఖాళీగా ఉన్న 148 వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేసేశారు. ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం పెట్టినా, డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాలోని పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేయడమంటే ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996లోని రూల్ 4 (బి) 11 ఉల్లంఘించడమేనని స్పష్టం చేసినా బాబు సర్కారు పట్టించుకోలేదు.148 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తూ వ్యవసాయ శాఖ గత నెల 12న మెమో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆ మెమోను ఇటీవల జరిగిన కేబినెట్లో పెట్టి సక్రమం చేస్తూ బాబు సర్కారు ఆమోదించింది. తెలుగునాడు అసోసియేషన్ విన్నవించడం ఆలస్యం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే.. అసోసియేషన్ను ఎవరు ఏర్పాటు చేయించారో తేటతెల్లం అవుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను తాత్కాలిక పదోన్నతులతో నింపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
చంద్రబాబు సభలో ఆందోళన
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం ఆయన పాల్గొన్న సభలో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి.. మెగా డీఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు నిర్లక్ష్యంగా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారనీ, సంయమనం పాటించాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆయన మాటలను పట్టించుకోకపోవడంతో ఆందోళన చేస్తున్న 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అక్రమంగా అరెస్టు చేశారని నిరుద్యోగులు వాపోయారు. 12,900 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడువేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల కంటే చంద్రబాబు సొంతజిల్లాకు తక్కువ పోస్టులు కేటాయించారని జిల్లాకు చెందిన మహిళా నిరుద్యోగులు ఆరోపించారు. అందరికీ విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి క్రమశిక్షణ లేదంటూ వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని అన్నారు. -
చంద్రబాబు దగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్
విజయనగరం మున్సిపాలిటీ : అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ సీఎం చంద్రబాబు సాగిస్తున్న దగాకోరు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేల నిరుద్యోగ భృతి హమీ అమల్లో టీడీపీ నయవంచన తీరును నిరసిస్తూ యువగర్జన పేరిట వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువత విజయనగరం పట్టణంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి నుంచి ప్రారంభమైన ర్యాలీకి బెల్లాన చంద్రశేఖర్, నగర పార్టీ కన్వీనర్ ఆశపు వేణు, పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్వీవీ రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తిలు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక రింగ్రోడ్ సాయిబాబా గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐస్ఫ్యాక్టరీ జంక్షన్, అయోధ్యామైదానంరోడ్, కోట జంక్షన్, మూడులాంతర్లు, గంటస్తంభం జంక్షన్, వైఎస్సార్ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్, ఎత్తుబ్రిడ్జి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అక్కడ సీఎం చంద్రబాబు డౌన్డౌన్ అంటూ యువత నినదించారు. అనంతరం యువజన, విద్యార్ధి విభాగం నాయకులు ఎస్.బంగారునాయుడు, జి.ఈశ్వర్కౌషిక్, ఎంఎల్ఎన్రాజు, అల్లు చాణక్య, బోడసింగి ఈశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు, తాడ్డి సురేష్, పొట్నూరు కేశవ, కరకవలస అనిల్, బోనేల తరుణ్, తాళ్లపూడి పండు, కరణం రమేష్, తరుణ్లు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్కు అందజేశారు. యువతను మోసం చేశారు... 2014 ఎన్నికల్లో మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాలుగున్నరేళ్లపాటు యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హమీలను విస్మరించి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సారి యువతను మోసం చసేందుకు రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారని బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చంద్రబాబు మాటలను యువత నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 10 లక్షల మందికి రూపాయి చొప్పున నిరుద్యోగ భృతి ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల పోస్టులు భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ఎన్ రాజు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్యలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చినహమీల ప్రకారం రూ.2వేల నిరుద్యోగ భృతి మొత్తాన్ని నాలుగు సంవత్సరాల మూడు నెలల బకాయిలతో కలిపి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగుకి రూ.లక్షా 2వేల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని, ఔట్ సోర్సింగ్ నియామకాలను నిలిపివేయాలన్నారు. గ్రూప్–2ని గ్రూప్–1లో విలీనం చేయాలన్న ప్రతిపాదను విరమించుకోవాలన్నారు. వెంటనే ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగం నాయకులు జీవీ రంగారావు, జి.ఈశ్వర్కౌషిక్, నెలపర్తి రాజ్కుమార్, హర్షరాజు, అప్పుపైడి,ఆనంద్, మనోజ్, పి.కృష్ణ, జిక్కరాజు, నాని, కర్రోతు సంతోష్, కంకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మెట్రోలో ఉద్యోగం.. రూ.1.50 కోట్లకు టోకరా
సాక్షి, హైదరాబాద్ : మెట్రో ప్రభుత్వానికి కాసులు కురిపిస్తోందో లేదో కానీ దోచుకునే వారికి మాత్రం కోట్లకు కోట్లు కురిపిస్తోంది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని పలు కన్సల్టెన్సీలు కోట్లాది రూపాయలను వెనుకేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతోంది. అలా కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చిన కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నాయి. అలాంటి ఓ బోగస్ కంపెనీ చేతుల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతిష్టాతక్మంగా ప్రారంభించిన మెట్రోరైలు బోగస్ కంపెనీల పాలిట కల్ప తరువుగా మారింది. మెట్రోలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నగరంలోని ఏబీసీ కన్సల్టెన్సీ ఒక్కో నిరుద్యోగి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేసింది. మొత్తం రూ.1.50 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో డబ్బు చెల్లించిన బాధితులు లబోదిబోమంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాలు కల్పిస్తామని బోర్డు తిప్పిన కన్సెల్టన్సీ నిర్వాహులకు అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైల్వే ఉద్యోగాలపై రచ్చ
సాక్షి, విజయనగరం : రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్పై విద్యార్ధులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పదో తరగతి చదివిన వారితోపాటు అదనంగా ఐటీఐ, టెక్నికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. విజయనగరం కోట జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ర్యాలీని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలి రావడంతో పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఉద్యోగం కోసం పోటెత్తిన నిరుద్యోగులు
చిత్రంలో కనిపిస్తున్నవారిని చూశారా.. వీరంతా ఉద్యోగం కోసం ఆశగా వచ్చిన వేలాదిమంది నిరుద్యోగులు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉద్యోగ నోటిఫికేషన్లు మాయమయ్యాయి. రాజకీయ వివక్షతో చిరుద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. బతుకుకోసం డిగ్రీ పట్టాలు చేతపట్టి వీధిన పడ్డారు. డెంకాడ మండలం చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన జాబ్ మేళాకు కోటిఆశలతో హాజరయ్యారు. ఇక్కడ వేలల్లో ఉన్న నిరుద్యోగులను చూసి.. బిత్తర పోయారు. అయ్యో.. రాష్ట్రంలో నిరుద్యోగం ఇంత దారుణంగా ఉందా అంటూ నిరాశచెందారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని.. బాబు పోతే తప్ప ఈ దుస్థితి మారేలా లేదంటూ కొందరు విమర్శించారు. డెంకాడ: చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్డీఎ, వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువ త పోటెత్తింది. పేర్లు న మోదుకు గంటల తరబడి వేచి ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 34 కం పెనీల ప్రతినిధులు జాబ్మేళాకు విచ్చేసి నిరుద్యోగ యువతీయువకులకు పరీక్షలు నిర్వహిం చారు. అందులో ప్రతిభ చూపిన వారికి ఇంట ర్వ్యూ చేశారు. ముందుగా ఆయా కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు... జీతభత్యాలు.. షరతులు తదితర వివరాలను తెలియజేశా రు. అయితే... రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్మేళాకు పదివేల మంది హోజరుకాగా.. రెండోరోజు ఆది వారం నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు ఆరువేల మంది రావడంతో కళాశాల మైదానం కిక్కిరిసింది. మూడేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం... వేలాది మంది విద్యార్థులు ఏటా డిగ్రీలు, ఇంజినీరింగ్ పట్టాలతో రిలీవ్కావడంతో జాబ్ మేళాకు పోటెత్తారు. అక్కడి నిరుద్యోగ లోకాన్ని చూసి కొంద రు బిక్కయిపోయారు. పరీక్ష రాయకుండానే ఇంటిముఖం పట్టారు. మరికొందరు గంటల తరబడి నిరీక్షిం చి ప్రతిభకు పదును పెట్టారు. ఏటా ఉద్యోగాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని... నేతల ప్రకటనలకు.. ఆచరణకు ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత’ తేడా ఉందంటూ నిట్టూర్చా రు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని... ఇప్పుడు బాబుకు చెక్చెబితే తప్ప జాబు వచ్చే అవకాశం కనిపించడంలేదంటూ బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వ కొలు వులు లేకపోవడంతో కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు వేలాది మంది తరలివస్తున్నారంటూ విద్యార్థులకు తోడుగా వచ్చి న తల్లిదండ్రులు పేర్కొన్నారు. పల్లెల్లో ఉంటే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని.. ఉద్యోగాలు చూసుకోమని చెబితే మీరే చూపిం చండంటూ సమాధానం చెబుతున్నారన్నారు. ఉద్యోగ కల్పనకు చర్యలు నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. జాబ్మేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల్లో పదివేల మంది యువతీ యువకులు హాజరుకాగా, 2 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పతివాడ, గీతలు పాల్గొన్నారు. -
జాబ్ రావాలంటే బాబు పాలన పోవాలి
పుత్తూరు: జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు పాలన అంతం కావాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అథ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రత్యేక హోదా హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెవిలో పూలతో పట్టణంలోని ఆరేటమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఆమె బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, అమర్నాధ్రెడ్డిలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారు యువతకు ఉద్యోగాలు కల్పించలేని అసమర్థులని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం చంద్రబాబు యువతకు అన్యాయం చేస్తున్నారని రోజా విమర్శించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా సుమారు 25 వేల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను వీధిన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా హామీని ఓటుకు నోటు కేసుతో తాకట్టు పెట్టి యువత ఆశలకు సజీవ సమాధి కట్టిన బాబు పాలనకు చరమ గీతం పాడేందుకు యువత ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. లోకేష్కు జాబ్ వచ్చింది నిరుద్యోగులకు జాబ్ రాలేదు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్కు మాత్రం మంత్రి ఉద్యోగం వచ్చిందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అథ్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు నోటు కేసుతో ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టి చంద్రబాబు నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. అంతకుమునుపు నిరుద్యోగులను వంచించిన రాష్ట్ర ప్రభుత్వంపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అథ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్యాంలాల్, ఇమామ్, యువజన విభాగం చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అథ్యక్షుడు మధు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ రాయల్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు జెన్కో షాక్
సాక్షి, ప్రొద్దుటూరు : ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. ‘బాబు వస్తే జాబు’ వస్తుందని నినాదాలతో అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం జెన్కో నోటిఫికేషన్లో వయో పరిమితి కుదించడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఏడేళ్ల నుంచి అకౌంట్స్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ అఫీసర్ల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఇటీవల 22 జేఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో పాటు మరో 4 పోస్టులను బ్యాక్ లాగ్ కింద భర్తీ చేయనుంది. జనరల్ కేటగిరీ వారికి గరిష్ట వయసు అర్హతను 34 ఏళ్లుగా పేర్కొనడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది మార్చిలో అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లుగా పేర్కొన్న జెన్కో ఏడు నెలల్లోనే ఏకంగా 8 ఏళ్లు తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. చాలా మంది గత కొద్ది రోజులుగా సీఎం, విద్యుత్శాఖాధికారులకు, జెన్కో ఉన్నతాధికా రులకు మెయిల్స్, ఫ్యాక్స్లు పెడుతున్నారు. ఏడేళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్కు వయసును 42 ఏళ్లకు పొడగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ) ఉద్యోగాలకు జెన్కో నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ప్రథమం. ఎన్నో ఏళ్లుగా జెన్కోలో ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసిన నిరుద్యోగలకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో అధికారులు అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు విన్నవిస్తున్నారు. గందరగోళంగా సిలబస్ ఈ పోస్టులకు ఇచ్చిన సిలబస్ కూడా గందరగోళంగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నాలుగు సెక్షన్లలో వివిధ అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నాలుగు సెక్షన్లలో దేనికింద ఎన్ని మార్కులు ఉంటాయన్న విషయం నోటిఫికేషన్లో ఇవ్వలేదు. దీంతో కొద్ది సమయంలోనే ఏయే అంశంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయించుకోలేక పోతున్నారు. సాధారణంగా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్ల్లో కూడా ప్రతి సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని మార్కులు ఉంటాయో స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇందులో సెక్షన్లకు సంబంధించి మార్కులను తెలపక పోవడంపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీని బదులు 2010లో విడుదల చేసిన జేఏఓ నోటిఫికేషన్లోని సిలబస్నే ఉంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రెండు పరీక్షలు ఒకే రోజు జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 వరకు గడువు విధించారు. వీటికి డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తుండటంతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నష్టపోవాల్సి వస్తోంది. ఏదో ఒక పరీక్షే రాయాల్సి వస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని వారు కోరుతున్నారు. -
20న జాతీయ స్థాయి జాబ్మేళా
కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20న జాతీయ స్థాయి మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాలల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.99 రుసుం చెల్లించి నేరుగా జాబ్మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్మేళాకు 20కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు హాజరుకానున్నాయని, అర్హతలను బట్టి వేతనం, ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతోపాటు ఇతరులు పాల్గొనవచ్చని సూచించారు. వివరాలకు 76800 76632/02/03, 76600 03345, 78429 19899, 81252 58415 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
21న నిరుద్యోగులకు జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 21న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మాన్యుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్లోని స్వర్ణభారత్ ట్రస్ట్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తారన్నారు. అభ్యర్థులు 18 నుంచి 21 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఇంటర్(బైపీసీ/ఎంపీసీ) లేదా డిగ్రీ ఫెయిల్, డిస్కంటిన్యూ చేసి ఉండాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్, విశాఖపట్టణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
తపాలా ఉద్యోగుల పోస్టులకు అనూహ్య స్పందన
– అరవై ఎనిమిది పోస్టులకు ఐదువేల దరఖాస్తులు కర్నూలు(ఓల్డ్సిటీ): తపాలా శాఖ ఏపీ సర్కిల్లో గతనెల 18న జారీ చేసిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ ప్రకటనకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నిరుద్యోగులు అధిక సంఖ్యలో గ్రామీణ తపాలా ఉద్యోగుల పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తుల చేసుకుంటున్నారు. ఓసీ, ఓబీసీ జనరల్ అభ్యర్థులు హెడ్ పోస్టాఫీసులో రూ.100 ఆన్లైన్ సెలెక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉన్నందున కర్నూలు ప్రధాన కార్యాలయంలో సంబంధిత కౌంటర్ల వద్ద రద్దీ పెరిగింది. రోజుకు సుమారు 200 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు వస్తున్నారు. ఈనెల 19 వరకు గడువు ఉంది. డివిజన్ పరిధిలోని 26 బ్రాంచి పోస్టుమాస్టర్, 9 మెయిల్ డెలివరీ (జీడీఎస్ఎండి), 28 మెయిల్ కన్వేయన్స్ (జీడీఎస్ఎంసీ), 5 ప్యాకర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తారు. డివిజన్లో మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉంటే, దరఖాస్తుదారుల సంఖ్య ఇప్పటికే ఐదువేలకు చేరింది. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు లాజిస్టిక్స్, ఎంఎస్ ఆఫీసు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ కోర్సుల్లో పీఎంకేవీవై ద్వారా 60 రోజుల ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు సుశాంత్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఎండీ ఎం ప్రవీణ్ సుశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువత ఈ నెల 30, 31వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్ ఎదురుగా ఉన్న క్రిష్ణ ఆర్కేడ్, మూడవ అంతస్తులో ఉన్న కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 8886868248 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
27 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ నిరుద్యోగ యువతకు ఈ నెల 27వ తేదీ నుంచి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యువతకు మూడు నెలల పాటు ఇంగ్లిష్, పని సంసిద్ధత, కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు చూపిస్తామన్నారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండి, ఎస్ఎస్సీ/ఇంటర్ పాస్,ఫెయిలైన యువతీయువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డుతో ఈ నెల 27, 28వ తేదీల్లో టీటీడీసీలో అడ్మిషన్ పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ–ఈజీఎం కార్యాలయం, ఫోన్ నెం.9866179471, 9885127745, 9966723684, 08518277499 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
రేపు నిరుద్యోగులకు జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగుల కోసం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఫస్ట్స్టెప్ శిక్షణ, ఉపాధి కేంద్రం చైర్మన్ ఎస్. రాజశేఖర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, సత్యసుమ మార్కెటర్స్ కంపెనీల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ల కోసం నిర్వహించే ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.7వేల జీతం, ఇన్సెంటీవ్ ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువకులకు స్థానిక భాగ్యనగర్లోని ఫస్ట్స్టెప్ సంస్థ కార్యాలయానికి చేరుకోవాలని, వివరాలకు 9393930109, 8099932144 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
తమ్ముడూ..మోసాల కుమ్ముడు
బడ్జెట్ ‘సిత్రాలు’ రూ.500 కోట్లు జిల్లాకే సరిపోవు ∙ ఆ అంకెలతో ఎందుకీ రంకెలు l ప్రశ్నిస్తున్న 84 వేల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ.500 కోట్లు. ఓసారి ఈ లెక్కల చిత్రాలేమిటో విశ్లేషించుకుందాం. జిల్లాలో నిరుద్యోగుల మొత్తం సంఖ్య 84 వేలు ... ఇచ్చిన హామీ భృతి రూ.2000. అంటే 84 వేల నిరుద్యోగులతో రూ.2000 గుణిస్తే ఎంత వస్తుంది...నెలకు సుమారు రూ.17 కోట్లు. బాబు అధికారంలోకి వచ్చి 36 నెలలైంది. బ్యాక్లాగ్ బకాయిలతో కలుపుకుంటే ... అంటే 36 నెలలు... 84 వేల మంది నిరుద్యోగులు ... నెలకు రూ.17 కోట్లు గుణిస్తే ఇప్పటి వరకు నిరుద్యోగులకు బాబు సర్కారు ఇవ్వాల్సింది సుమారు రూ.612 కోట్లు. అంటే బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లకు ఇంకో రూ.112 కోట్లు అదనమన్నమాట. ఒక్క ఈ జిల్లాకే సరిపడని ఈ కేటాయింపులతో ‘తందానా అంటే తాన తందానా’ అంటూ గంతులేస్తున్న ఈ తెలుగు తమ్ముళ్లు ఏం సమాధానం చెబుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తా’మన్న చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్ ‘సాక్షి’గా నిరుద్యోగులను నిలువునా దగా చేశారు. గతంలో ఎవరూ ఇవ్వని భృతిపై ఆశలు పెంచడంతో జిల్లాలో నిరుద్యోగులు, యువత గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేశారు.బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఆయన మాటలు నమ్మి ఓటేసినందుకు తగిన బుద్ధి చెప్పారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇచ్చిన హామీపై చంద్రబాబు పెదవి విప్పలేదు. కనీసం రాష్ట్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులుంటాయని గంపెడాశ పెట్టుకున్నారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు నిరాశనే మిగిల్చాయి. నిరుద్యోగ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రూ.500 కోట్లు కేటాయించారు. ఆ బడ్జెట్ ఏమూలకు వస్తుందని నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నాకు ఓటేయండి మీకు ఉద్యోగాలు కల్పిస్తానని, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి రూ.2000 ఇస్తామని ’ నాడు గొప్పగా ప్రకటించి ఆచరణలో దగా చేశారని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉపాధి వేటలో సుమారు 84 వేల మంది... జిల్లా కేంద్రం కాకినాడ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అధికారికంగా నమోదైన నిరుద్యోగులు 84 వేల151 మంది ఉన్నారు. వీరిలో పదో తరగతి ఉత్తీర్ణులై 10,641 మంది, ఇంటరీ్మడియట్ ఉత్తీర్ణులై 16,412 మంది, డిగ్రీ ఉత్తీర్ణులై 16596 మంది, బీఈడీ చేసి ఖాళీగా ఉన్న 4297 మంది, ఐటిఐ 13,314 మంది, డిపొ్లమా చేసి 5423 మంది, ఇతరులు 17,468 మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సర్కార్ జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన వారి సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 84 వేల 151 మంది నిరుద్యోగులకు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే రూ.2000 వంతున లెక్కేస్తే నెలకు రూ.16 కోట్ల 83 లక్షలపై చిలుకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 36 నెలలకు తాను ఇచ్చిన మాటను అమలు చేయాలంటే రూ.612 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అధికారికంగా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల లెక్కలు తీసుకుంటేనే ఇంత మొత్తంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు మన జిల్లాలో నిరుద్యోగులకే సరిపోవు. ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనే అంటే సుమారు లక్షన్నర మంది నమోదు కాని నిరుద్యోగులుంటారని అంచనా. బడ్జెట్లో అరకొర కేటాయింపులతోపాటు అర్హతకు నిర్ధేశించుకున్న మార్గదర్శకాలేమిటో కూడా స్పష్టం చేయకపోవడం తమను దగా చేయడమేనని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
ఆ సొమ్ము నిరుద్యోగులకు అందేనా..!
► ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో నిరుద్యోగులకు శఠగోపం ► దరఖాస్తు రుసుం పేరుతో రూ.3లక్షలు వసూలు ► కటకటాల్లో నిందితుడు ► తమ సొమ్ము తిరిగి ఇవ్వాలంటున్న నిరుద్యోగులు నందలూరు: నందలూరులో ఆల్విన్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన జరిగినప్పుడు మండలంలోని ఎంతోమంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఆల్విన్ కర్మాగారం ఏర్పాటుకు ఇచ్చారు. మండల వాసులకు ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి భూములకు నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ అమలుకే నోచుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆల్విన్ కర్మాగారం మూత పడింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటు చేస్తామని, రూ.250 కోట్లతో 12 పరిశ్రమలు వస్తాయని వెంకటకృష్ణ అలియాస్ సోలార్ వెంకట్, అలియాస్ వెంకటసుబ్బయ్య నమ్మబలికాడు. దీనికితోడు ఒక్క రోజులోనే రూ.100 చొప్పున సుమారు 3వేల దరఖాస్తులు విక్రయించి రూ.3లక్షల వరకు సొమ్ము చేసుకున్నాడు. దీంతో అతనిపై ఐపీసీ 420, 406 కేసులు నమోదు చేసినట్లు రాజంపేట డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. అయితే వెంకటకృష్ణ నుంచి రూ.2.10 లక్షల నగదు మాత్రమే రికవరీచేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆల్విన్ పరిశ్రమను కొనుగోలు చేసిన రాజేంద్ర కన్స్ట్రక్షన్ అధినేత కుమారుడు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్రరెడ్డికి తన పరిశ్రమలో ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వెంకటకృష్ణ చేసిన భూమిపూజ, హోమాలు, అతను నిర్వహించిన జాబ్మేళా గురించి తెలియదా? అతనికి తెలియకుండానే సుమారు నెలరోజుల నుంచి అక్కడ ఇన్ని పనులు చేయడం సాధ్యమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు వెంకటకృష్ణ ఏం చేయాలనుకున్నాడో పోలీసులు సమాచారం రాబట్టాల్సి ఉంది. దరఖాస్తు రుసుం పేరుతో వెంకటకృష్ణ తీసుకున్న నగదును తమకు ఎవరు చెల్లిస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి సొంత మండలంలో ఆయనకు తెలియకుండానే ఇంత తతంగం జరిగిందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో నిరుద్యోగులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అలాగే నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి అప్పగించాలని పలువురు కోరుతున్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వం
టీఎస్పీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాలి రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు ఎదులాపురం : ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదని పలువురు వక్తలు విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ‘యువత–నిరుద్యోగం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగుల చిరకాల స్వప్నంపై కేసీఆర్ నీళ్లు చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల అలుపెరుగని పోరాటం, ఆత్మబలిదానాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అన్నారు. స్వరాష్ట్ర ఆశయాల సాధన, హామీల అమలు కోసం విద్యార్థి, యువజన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతోపాటు అన్ని సంఘాలను కలుపుకొని ప్రజాపోరాటంగా ముందుకు కదులుతామని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ క్యాలెండర్ని విడుదల చేసి దాని ప్రకారం ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగాల నియమకాలను పారదర్శకంగా చేపట్టాలని, నిర్వహించింన పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని తదితర తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ దుర్గం రాజేశ్వర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షడు వెంకట్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మసి ఉల్లాఖాన్, ఐఫ్టీయూ సభ్యు డు వెంకట్నారాయణ, టీఏజీఎస్ రాష్ట్ర కార్యధర్శి తొడసం భీంరావ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మయూరి తదితరులు పాల్గొన్నారు. -
'నిరుద్యోగులకు తెలంగాణలోనూ అన్యాయమే'
కూసుమంచి(ఖమ్మం జిల్లా): ఆంధ్రా పాలనలో విద్యావంతులు ఉద్యోగాల్లేక నిరుద్యోగులుగా మిగిలారని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పినట్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం సభకు వెళ్లారనే విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా..ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేయడమే తన అభిమతమని అన్నారు. ఇందుకోసం పోరాడే పార్టీల వద్దకు ఒక్కోసారి వెళ్లాల్సివస్తోందని కోదండరాం బదులిచ్చారు. తనకూ సంస్కారం, వివేకం ఉందని, ఎవరో చెబితే వినాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని కొందరు తాము లక్ష ఉద్యోగాలు ఇస్తాం కానీ అవకాశం ఉన్నప్పుడు అని ప్రకటించటం పద్ధతికాదని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంపై సీఎంను కలిశారా అంటూ కోదండరాంను విలేకరులు ప్రశ్నించగా..సీఎంను కలవడమంటే దేవుడికి ఉత్తరం రాసినట్లేనని చమత్కరించారు. -
పదవీ విరమణ @ 60
-
పదవీ విరమణ @ 60
► ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ► ఏపీ తరహాలో రెండేళ్లు పెంచాలని ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లు ► రెండేళ్లలో లక్ష మందికిపైగా రిటైర్ కానున్న ఉద్యోగులు ► రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులతో ఖజానాపై ఆర్థిక భారం ► ఏటా రూ.5 వేల కోట్లు అవసరం ► రెండేళ్లకు పెంచితే ఆ మేరకు ఆదా చేయొచ్చని ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్ల పాటు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు విరమణ ప్రయోజనాల చెల్లింపులు ఆర్థికంగా భారంగా మారటంతో సర్కారు ఈ దిశగా మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు 58 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ ఉద్యోగుల పదవీ కాల పరిమితిని 60 ఏళ్లకు పెంచింది. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ రెండేళ్ల వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు పదో పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పట్నుంచి రిటైరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రయోజనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఖజానాపై ఆర్థిక భారం పెరిగిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 3.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నవంబర్లోగా 60 వేల మంది ఉద్యోగులు రిటైరవుతారని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు లెక్కలేస్తున్నాయి. రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లించే ప్రయో జనాలకు ఏటా దాదాపు రూ. 5 వేల కోట్లు కావాలి. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రయోజనాలేంటి? రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచితే ఒనగూరే ప్రయోజనాలను ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. దీంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఉద్యోగుల ఖాళీలు ఏర్పడే పరిస్థితిని నివారించే వీలుందని అంచనా వేసింది. మరోవైపు రిటైర్మెంట్ ప్రయోజనాలకు చెల్లించే నిధులు ఆదా చేసి.. అభివృద్ధి సంక్షేమ పనులకు మళ్లించే వెసులుబాటు లభిస్తుందని యోచిస్తోంది. దీంతోపాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఇప్పటివరకు ఉన్న గుర్తింపు కొనసాగుతుందని భావిస్తోంది. అదే సమయంలో రిటైర్మెంట్ వయో పరిమితి పెంచితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతుందనే కోణంలోనూ ఆరా తీస్తోంది. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే.. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో కొత్త ఉద్యోగావకాశాలకు గండి పడింది. దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అంతమేరకు కొత్త పోస్టులు లేకుండా పోయాయని నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచితే మరో రెండేళ్ల పాటు రిక్రూట్మెంట్లు ఆగిపోయే ప్రమాదముంది. దీంతో నిరుద్యోగుల నుంచి మరింత ఆందోళన వ్యక్తమవుతుందా? అయినా ఉద్యోగుల ప్రయోజనాలు, ఆర్థిక అవసరాల దృష్ట్యా వయో పరిమితి పొడిగించాలా? అని సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. దశల వారీగా రిక్రూట్మెంట్లను కొనసాగించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలని యోచిస్తోంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై మూడు నెలల కిందటే ఆర్థిక శాఖ సీఎంకు ఫైలు పంపిందని, దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అధ్యాపకులకు 62 ఏళ్లు! యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆరా తీయటంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం యూనివర్సిటీ అధ్యాపకులకు 60 ఏళ్ల వయో పరిమితి ఉంది. తమ సర్వీసును 62 ఏళ్ల వయో పరిమితికి పెంచాలని కొంతకాలంగా అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. దీంతో యూనివర్సిటీ అధ్యాపకులకు 62 ఏళ్ల వరకు పరిమితిని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సంబంధిత ప్రతిపాదనల ఫైలుతో పాటు విజ్ఞప్తులను పంపించాలని ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. -
జాబ్మేళాను సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(అర్బన్): కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న జాబ్మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాని ఏపీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా రూపుమాపేందుకు ఎంపీ చూపుతున్న చొరవను గుర్తించాలన్నారు. ఎంజీఆర్ఎస్ టెక్నాలజీస్ సహకారంతో చేపడుతున్న ఈ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులందరూ ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, జగదీష్, ఖాజా, రమణ, బాషా తదితరులు పాల్గొన్నారు. -
నేడు గ్రూప్–2లో ఉచిత శిక్షణకు ఎంపికలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్–2లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు పీడీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డులతో హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఉచిత శిక్షణ తరగతులు ఇస్తామన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(రాజ్విహార్): డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్(2015–16 సంవత్సరాల్లో) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని, వీరికి హైదరాబాద్, మిర్యాలగూడ..తదితర ప్రాంతాల్లోని రెడ్డీస్ సంస్థల్లో రెండేళ్ల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఏడాదికి రూ.1.45లక్షల వరకు ఉపకార వేతనం ఇవ్వడంతోపాటు పై చదువుకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సబ్సిడీపై క్యాంటీన్, హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 20 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియేట్ ఎంపీసీ, బైపీసీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ 08518 277153, 91601 05162, 98499 01149 నంబర్లుకు సంప్రదించవచ్చని తెలిపారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఓరియంటల్ స్కిల్స్ అండ్ సెఫ్టీ సర్వీసెస్ సంస్థ మేనేజర్ అభిషేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని ఎస్ఎల్వీ బీఈడీ కాలేజీలో గౌండ(బెల్దార్), ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, మహిళలకు హౌస్కీపింగ్ తదితర రంగాల్లో 90 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయంతో పాటు, హాస్టల్ వసతి, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు. ఇందుకు 10వ తరగతి, ఐటీఐ, ఒకేషనల్, డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 98666 82579, 94927 05795 నెంబర్లను సంప్రదించవచ్చన్నా -
11న డీఆర్డీఏ జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): డీఆర్డీఏ–ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ నెల 11న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. రాక్సా అకాడమీలో సెక్యూరిటీ గార్డు పోస్టుకు ఎంపిక నిర్వహిస్తామన్నారు. వీరికి మూడు నెలల పాటు అనంతపురంలో శిక్షణ ఇస్తారని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
26న నిరుద్యోగులకు జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 26న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఫస్ట్స్టెప్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో స్టాఫ్నర్సు, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్మేళా ఏర్పాటు చేశారన్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ.8వేల నుంచి రూ.20వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ప్రతి పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారని, ఎంపికైన వారు కర్నూలులోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు స్థానిక కల్లూరు ఎస్టేట్స్లోని సెట్కూరు కార్యాలయానికి ఆధార్కార్డు, సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 9177016174 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన నిరుద్యోగులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్న ఒక్క పోస్టును భర్తీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక బుధవారం మహాధర్నాను నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి సర్కిల్ నుంచి టవర్క్లాక్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో 1200 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం 707 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయడమేంటని ప్రశ్నించారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కేవలం 57 పోస్టులను కేటాయించడం దారుణమన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ ఐక్య వేదిక నాయకులు సుధాకర్, శంకర్, వీరాజీ, లక్ష్మీ, శిరీష, లక్ష్మీ తదితరులు పాల్గోన్నారు. -
నిరుద్యోగుల ఆగ్రహం
- కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా - నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ - ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కర్నూలు (టౌన్): రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరుద్యోగ భృతి ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించడంతో వందలాది మంది నిరుద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ బయటికి రావాలి, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కాని, నిరుద్యోగ భృతి కాని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నిరుద్యోగులను దగా చేయడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1200 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం సివిల్, ఏఆర్ పోస్టులు కలిపి 707 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇందులో 375 పోస్టులు కోస్తాంధ్ర ఇచ్చి అత్యంత వెనుకబడిన రాయలసీమకు 57 పోస్టులు మంజూరు చేయడం దారుణమన్నారు. గ్రూపు–2 పోస్టులను పాత పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం నిరుద్యోగులు..జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ను కలిశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ నిచ్చారు. ధర్నాలో నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు నాగేంద్ర, మౌలాలి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. దగా చేసిన ప్రభుత్వం: బిౖ.వె. రామయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో ఓట్ల కోసం నిరుద్యోగులకు ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పింది. చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. ఉద్యోగాలు కల్పించకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వలేమని నిసిగ్గుగా మంత్రి ప్రకటించడం దారుణం. నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తుంది. -
రుణాను‘బంధం’
కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షే.. ఎస్సీ, బీసీ, కాపు రుణాలంటూ ప్రభుత్వ ఆర్భాటం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు లబ్ధిదారులను చులకనగా చూస్తున్న పలువురు బ్యాంకర్లు ఉద్యోగాలిచ్చేస్తామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం.. కనీసం జీవనోపాధికి రుణం కూడా మంజూరు చేయలేకపోతోంది. జీవన ప్రమాణాలు మెరుగుపరచుకునేందుకు.. ఎంతో ఆశతో ఉపాధి కోసం రుణానికి దరఖాస్తు చేసుకుంటే, అధికారులు, బ్యాంకర్లు తమ చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటున్నారు. ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందాలనుకుంటున్న నిరుద్యోగులు.. ప్రభుత్వం తీరుతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. – కొత్తపేట జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆయా కార్పొరేషన్ల రుణాలు మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, కుప్పలు ðlప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఆర్థిక సంవత్సరం గడచినా ఒక్కరికీ రుణం మంజూరు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అప్పగించింది. అధికార పార్టీ నేతల నేతృత్వంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో కొందరికి ప్రభుత్వ సబ్సిడీ మంజూరు కాగా, వారు బ్యాంకు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక మందికి ఆ సబ్సిడీ కూడా మంజూరు కాకపోవడంతో మండల పరిషత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధికారులు కార్పొరేషన్ ఈడీలకు ఫోన్లు చేసి, ఆరా తీస్తున్నారు. త్వరలో సబ్సిడీ పడుతుందన్న సమాధానమే మినహా, సబ్సిడీ పడిన దాఖలాలు మాత్రం లేవు. ఆయా బ్యాంకుల అధికారులను రుణం విషయమై అడిగితే, కొందరు చిన్నచూపు చూస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓSలబ్ధిదారుడు–బ్యాంకు మేనేజర్ మధ్య సాగిన సంభాషణ ఇది... లబ్ధిదారుడు : సార్, మా లోన్ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? బ్యాంక్ మేనేజర్ : ఏం లోను? లబ్ధిదారుడు : కాపు కార్పొరేషన్ లోనండి. బ్యాంక్ మేనేజర్ : యూనిట్ ఏం పెట్టావు? అకౌంట్ ఓపెన్ చేయాలి. సబ్సిడీ రావాలి. లబ్ధిదారుడు : ఎంపీడీఓ గారు మంజూరు చేసిన లబ్ధిదారుల జాబితా మేరకు మీ బ్యాంకుకు పంపించారు. అకౌంట్ ఓపెన్ చేశాను. సబ్సిడీ కూడా పడింది. వ్యాపారం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. బ్యాంక్ మేనేజర్ : అయితే నీ యూనిట్ చూడాలి. లబ్ధిదారుడు : ఎప్పుడు వస్తారు? బ్యాంక్ మేనేజర్ : నాకు ఖాళీ ఉండాలి కదా! లబ్ధిదారుడు : తొందరగా వచ్చి చూసి లోను ఇప్పించండి సార్. బ్యాంక్ మేనేజర్ : ఎలా ఇచ్చేస్తామయ్యా. ఈ బ్రాంచికి రూ.1.05 కోట్ల రుణ బకాయిలు#న్నాయి. అవి వసూలు కావాలి. అప్పుడు నీ లోను గురించి ఆలోచిస్తాను. లోను మంజూరైంది కానీ.. గత ఏడాది నా భార్య కేశనకుర్తి గోవిందమ్మ పేరున డ్రైవాషింగ్ యూనిట్ కోసం బీసీ కార్పొరేషన్ లోనుకు దరఖాస్తు చేశాం. మంజూరైందన్నారు. బ్యాంకులో అకౌంటు ఓపెన్ చేయమంటే, చేశాం. మాతో పాటు దరఖాస్తు చేసుకున్న కొందరికి సబ్సిడీ కూడా మంజూరైందన్నారు. మాకు మాత్రం సబ్సిడీ పడలేదు. ఆ విషయమై ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నిసార్లు కలిసినా అదిగో వస్తుంది. ఇదిగో వస్తుంది అంటున్నారే మినహా సబ్సిడీ పడింది లేదు. – కేశనకుర్తి వెంకటేశ్వరరావు, కొత్తపేట బ్యాంకుల్లో లబ్ధిదారుల జాబితా నిరుద్యోగులకు ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకున్నాం. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలు బ్యాంకులకు పంపించాం. వారు అకౌంట్లు తెరిచి, ఖాతా నంబర్లు పంపించాలి. అకౌంట్లు ఓపెన్ చేసినా పలు సాంకేతిక కారణాల వల్ల సబ్సిడీ విడుదల కాలేదంటున్నారు. ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో సంప్రదిస్తున్నాం. అవసరమైతే బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా సంప్రదిస్తాం. – వై.ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ, రావులపాలెం జిల్లాలో రుణాలు తీరిది : కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరు యూనిట్లు సబ్సిడీ లోనింగ్ మంజూరు ఎస్సీ 9,559 4,303 1,613 – బీసీ 10,077 4,180 1,730 – కాపు 90,757 10,761 2,233 – -
ప్రత్యేక హోదా లేకపోతే ఉద్యోగాలు ఎలా?
AIYF, applications, unemployees నిరుద్యోగభృతి, దరఖాస్తులు, ఏఐవైఎఫ్ మొగల్రాజపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐౖవైఎఫ్) నగర కార్యదర్శి పి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని, లేదంటే నిరుద్యోగులకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతూ గురువారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ జంక్షన్లో నిరుద్యోగభృతి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం జరిగింది. ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి బీజేపీపై ఒత్తిడి తీసుకురాకపోవడం సరికాదన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారన్నారు. తెలంగాణాల్లో గ్రూప్,1,2,3,4లకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే మన రాష్ట్రంలో ఆ నోటిఫికేషన్ల ఊసే లేదన్నారు. ప్రతి విషయంలో తెలంగాణాతో పోటీ పడుతున్న చంద్రబాబునాయుడు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నాడని ప్రశ్నించారు. ఎంబీఏ గోల్డ్మెడలిస్ట్ పొందిన వారికి కూడా ఉద్యోగాలు కల్పించలేని స్థితిలో పాలకులు ఉన్నారన్నారు. సేకరించిన దరఖాస్తులన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సమాఖ్య ఏడో డివిజన్ అధ్యక్షుడు ఆర్.ప్రకాశరావు, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎ.రాము, సూరిబాబు,నూకరాజు, కె.విజయ్లతో పాటుగా సి.పి.ఐ. డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆ ఒక్కటీ అడగొద్దు!
– నిరుద్యోగులంతా ఉద్యోగుల కిందే లెక్క! – అరకొర సంపాదన ఉన్నా అంతే సంగతులు – పల్స్ సర్వేలో ఎంప్లాయ్గా నమోదుపై ఆందోళన – చంద్రన్న బీమాతో లింక్ పెట్టేస్తున్న సిబ్బంది – నిరుద్యోగ భృతి ఎగవేతకేనని యువత ఆవేదన – శ్రీనివాసరావు... బీటెక్ పూర్తి చేశాడు. అతని వయసు 24 సంవత్సరాలు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. ఖాళీగా ఉండలేక స్థానికంగా ఉన్న ఓ చిరువ్యాపార సంస్థలో నెలకు రూ.5 వేల జీతానికే పనికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతను ఉద్యోగా? నిరుద్యోగా? అంటే... ప్రభుత్వం దృష్టిలో అతను ఉద్యోగే! పల్స్ సర్వేలో నమోదు చేసిన వివరాల ప్రకారం అతను ఉద్యోగి కాబట్టి... నిరుద్యోగి భృతి పొందడానికి అర్హత కోల్పోయినట్లే! – రాజ్యలక్ష్మి... బీఎస్సీ, బీఈడీ చదివింది. కొన్నాళ్లు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసింది. తక్కువ జీతానికి పనిచేయలేక ఇంటి దగ్గరే ఉండిపోతోంది. ఇప్పుడామె ఉద్యోగా? నిరుద్యోగా? వాస్తవానికి ఆమె వివరాల్లో నిరుద్యోగిగానే పల్స్ సర్వేలో నమోదు చేయాలి. అలా చేస్తే నిరుద్యోగ భృతి వస్తుందో, లేదో తెలియదు కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న చంద్రన్న బీమాకు అర్హత లేకుండా పోతుంది. ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేతో నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పటికే ఈ సర్వేపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగుల వర్గం కూడా చేరుతోంది. సర్వేలో కొన్ని వివరాలు తమ భవిష్యత్తు ప్రయోజనాలకు ముప్పు కలిగించేవిధంగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. గత సర్వేలకు భిన్నంగా ఆర్థిక, వ్యక్తిగత వివరాలు లోతుగా అంటే 52 అంశాలతో గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, వాటి నమోదు తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ బొటనవేలి ముద్ర తీసుకోవడం వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వ్యవసాయాధారమైనది. మరోవైపు విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చే జిల్లా. దీంతో ఇంటికో రైతు ఉన్నట్లే... ఇప్పటి పరిస్థితుల్లో ఇంటికో నిరుద్యోగి కూడా ఉన్నారు. దాదాపు 28 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ జిల్లాలో 20 శాతం యువతే. ఆ లెక్కన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారే. అంటే దాదాపు 5.60 లక్షల మంది. వారిలో ప్రస్తుతం బీటెక్ తదితర డిగ్రీలు, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్నవారు 60 వేల వరకూ ఉంటారని అంచనా. ఇక 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు మధ్యనున్నవారంతా ప్రభుత్వ ఉద్యోగాల ఎదురుచూస్తున్నారు. కానీ గత మూడు నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేవు. దీంతో ఈ యువత అంతా ప్రచ్ఛన్న నిరుద్యోగులుగానే ఉన్నారు. సర్వేతో గందరగోళం... ‘బాబు వస్తే జాబొస్తుంది... జాబు వచ్చే వరకూ నెలనెలా నిరుద్యోగ భృతి వస్తుంది’ అంటూ గత సాధారణ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా ఊరూరా ఊదరగొట్టారు. అందులో ఎంత వాస్తవమెంతో ఇప్పుడుప్పుడే యువత గ్రహిస్తున్నారు. రెండేళ్లు గడిచిపోతున్నా నోటిఫికేషన్లు అవిగో ఇవిగో అంటూనే నాయకులు చెబుతున్నారు. ఇక నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వే యువతను మరింత గందరగోళంలోకి నెట్టేస్తోంది. సర్వే వివరాల్లో ఉద్యోగి (ఎంప్లాయ్), నిరుద్యోగి (అన్ఎంప్లాయ్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఎంప్లాయ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే గవర్నమెంట్, ప్రైవేట్, ఆర్గనైజేషన్స్... అని మూడు సబ్ ఆప్షన్స్ వస్తున్నాయి. వాటిలో ఏ ఒక్కదానిలో క్లిక్ చేసినా ఉద్యోగి కిందే లెక్క. ప్రభుత్వం ఒకవేళ భవిష్యత్తులో నిరుద్యోగి భృతి ఇస్తే... వీరికి ఆ ప్రయోజనం దక్కదు. ఇక అన్ఎంప్లాయ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే స్టూడెంట్, హౌజ్వైఫ్ తదితర సబ్ఆప్షన్లు ఉన్నాయి. అంటే వారికి ఏ రకంగానైనా సంపాదన ఉండకూడదు. యువత అంతా ఉద్యోగులే సర్వే, చంద్రన్న బీమా ఏకకాలంలో చేస్తుండటంతో నిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పరిస్థితి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం రాక ఏదొక రకమైన తాత్కాలిక ఉపాధి వెతుక్కున్న వారంతా తమను ఉద్యోగులుగానే నమోదు చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించింది. ఏదొక సంపాదన ఉందని చెబితే వారిని ఉద్యోగిగానే సర్వేలో నమోదవుతుంది. కాదు తాము నిరుద్యోగి అని చెబితే... ఎలా బతుకుతున్నావో చెప్పాలనే సర్వే సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నిరుద్యోగి అని నమోదు చేస్తే చంద్రన్న బీమా పథకం వర్తించదని చెప్పేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక నిరుద్యోగులైనవారు తమను ఉద్యోగులుగా సర్వేలో నమోదు చేయించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో యువత దాదాపుగా ఉద్యోగులగానే పరిగణించాల్సి వస్తుంది. అయితే విద్యార్థులు లేదంటే ఉద్యోగులు ఉన్నప్పుడు జిల్లాలో ఎవ్వరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరమేమి ఉంటుందనేది ప్రభుత్వం లెక్క! సంక్షేమ పథకాలకూ తూట్లు... పల్స్ సర్వేలో సొంత ఇల్లు తదితర ఆస్తులతో పాటు వాహనం, టీవీ, ఫ్రిజ్, ఏసీ మిషన్ వంటి వస్తువల వివరాలను నమోదు చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రభుత్వం తమకు సబ్సిడీ వంటగ్యాస్, తెల్లరంగు రేషన్కార్డు, ఉచిత వైద్యసేవ వంటి సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రమాదం ఉందని ఇప్పటికే పలువురిలో ఆందోళన నెలకొంది. అలాగే తమ పిల్లలకు ఉపకార వేతనాలు కూడా రద్దు చేస్తారేమోననే భయం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఎంప్లాయ్ ఆప్షన్లో నమోదు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ నష్టం జరగవచ్చనే ఆందోళన యువతలో కనిపిస్తోంది. దీనికితోడు అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ సర్వేపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
నకిలీ కాల్లెటర్లతో నిరుద్యోగులకు టోకరా..
శ్రీకాకుళం: ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ట్రైనింగ్ నిమిత్తం కొంత మొత్తం తమ ఖాతాలో జమ చేయాలంటూ నిరుద్యోగులకు కాల్ లెటర్లు వస్తుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో నిరుద్యోగులకు కాల్లెటర్లు రావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు పూజారి పురుషోత్తమరావు 2014లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ పోస్టుల ఎంపిక కోసం ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా ప్రాంతంలోని 41బెటాలియన్కు హాజరయ్యాడు. సాంకేతిక కారణాలతో ఎంపిక కాలేదు. అయితే జి.డి. కానిస్టేబుల్గా ఎంపికైనట్లు రెండు రోజుల కిందట ఐటీబీపీ, ఉదయ్పూర్, జమ్మూకాశ్మీర్ చిరునామాతో కాల్లెటర్ అందింది. అందులో ట్రైనింగ్ నిమిత్తం రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్ను 48 గంటల్లోగా కమాండర్ ఆఫీసర్, అనూప్సింగ్, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా నెంబర్ 20273768721కు చెల్లించాలని, వారంలోగా ట్రైనింగ్ ఆర్డర్ అందిస్తామని అందులో పేర్కొన్నారు. లేనిపక్షంలో ఉద్యోగం రద్దు చేస్తామని తెలిపారు. ఇదే తరహాలో ఆమదాలవలస, బూర్జ తదితర మండలాల నిరుద్యోగులకూ నకిలీ కాల్లెటర్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులు పోలీసులను సంప్రదిస్తున్నారు. ఇదే విషయమై ఆమదాలవలస సీఐ డి.నవీన్కుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వ ఉద్యోగాలు కోసం సెక్యూరిటీ డిపాజిట్లు ఎవ్వరూ చెల్లించరని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపినా, నకిలీ కాల్లెటర్లు పంపినా, ఫోన్లద్వారా మాట్లాడినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
ఉద్యోగాల పేరుతో భారీ మోసం
విశాఖ: విశాఖపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 66 మంది బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మోసపోయామని భావించిన బాధితులు దీనిపై శుక్రవారం పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారినని, తనకు హెచ్పీసీఎల్ జీఎం తెలుసనని భోగరాజు రామకృష్ణ అనే వ్యక్తి నిరుద్యోగులకు వల విసిరాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి రూ.2 లక్షల వరకు డబ్బు వసూలు చేశాడు. దీనిపై బాధితులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం సీఐని ఆశ్రయిస్తే... తమపైనే తిరిగి కేసు పెట్టి అరెస్ట్ చేస్తానంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యోగాల మూట విప్పండి సార్!
⇒ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ⇒ 25 వేల ఉద్యోగాలని ఊరించారు.. మూడో వంతు పోస్టులనే ప్రకటించారు ⇒ ఐదో వంతు ఉద్యోగాలకే నోటిఫికేషన్లు.. నత్తనడకన సాగుతున్న భర్తీ ప్రక్రియ ⇒ ఉద్యోగార్థుల జేబులు గుల్ల చేస్తున్న కోచింగ్ సెంటర్లు ⇒ సీఎం ఇచ్చిన మాట: 25,000 ఉద్యోగాల భర్తీ ⇒ తొలుత ప్రకటించింది: 15,522 ఉద్యోగాలు ⇒ ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇచ్చింది: 3,485 పోస్టులకు ⇒ (అందులో 3,175 పోస్టులు ఇంజనీరింగ్ పట్టభద్రులకే) సాక్షి, హైదరాబాద్: పంచ పాండవులు.. మంచం కోళ్లలా ముగ్గురని చెబుతూ రెండు వేళ్లను చూపించినట్లుంది.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ తీరు! ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీ ఆచరణ పట్టాలెక్కలేక కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం జూలై నెలాఖరున ఆదరాబాదరాగా పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ చెప్పినంత వేగంగా నోటిఫికేషన్లు జారీ కాకపోవటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీఎం ప్రకటనతోపాటు మంత్రి మండలి 25 వేల ఉద్యోగ నియామకాలకు ఆమోదం తెలిపింది. అందులో 15,522 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సర్కారు... మిగిలిన 10 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపడుతుందా..? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. తొలి విడత నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఏపీ జెన్కో, ట్రాన్స్కో డిపార్టుమెంటల్ సెలక్షన్ బోర్డులు ఈ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ నత్తనడకన సాగటం నిరుద్యోగుల పాలిట అశనిపాతంగా మారింది. అన్నీ ఇంజనీర్లకే.. ప్రకటించిన పోస్టుల్లో ఇప్పటివరకు అయిదో వంతు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. టీఎస్పీఎస్సీ, టీఎస్జెన్కో సారథ్యంలో 3,485 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మిగతా 12,087 పోస్టుల నోటిఫికేషన్లు నిరుద్యోగులను ఊరిస్తూనే ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. వివిధ విభాగాల్లో 2,629 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. వీటిలో 120 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 75 హార్టికల్చర్ పోస్టులు, 115 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్లు మినహా మిగతా పోస్టులన్నీ ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించినవే ఉన్నాయి. వీటితోపాటు 856 ఏఈ పోస్టుల భర్తీకి టీఎస్జెన్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి కూడా ఇంజనీరింగ్ పట్టభద్రులకు మాత్రమే కావటంతో ఇతర కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ కొనసాగుతోంది. పండుగ చేసుకుంటున్న కోచింగ్ సెంటర్లు ఉద్యోగుల భర్తీకి సర్కారు అనుమతిచ్చి రెండున్నర నెలలు కావొస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిని తలపిస్తున్నాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో రేపో మాపో గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నట్లుగా ఇటు ప్రభుత్వం.. అటు టీఎస్పీఎస్సీ హంగామా చేసింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చంటూ కోచింగ్ సెంటర్లు భారీ ప్రచారంతో నిరుద్యోగుల జేబులు గుల్ల చేసేందుకు పోటీ పడుతున్నాయి. తొలిసారిగా తెలంగాణ దృక్పథంతో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా భారీ వ్యాపారానికి ద్వారాలు తెరిచాయి. మరోవైపు రోజుకో కొత్త పుస్తకంతో ప్రైవేటు పబ్లిషర్లు పోటాపోటీగా నిరుద్యోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. గ్రూప్స్పై సందిగ్ధత.. తొలి విడతగా ప్రకటించిన వాటిలో గ్రూప్-1 పోస్టులు 52, గ్రూప్-2 పోస్టులు 434 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ల జారీపై స్పష్టత లేదు. గ్రూప్-2 పరీక్షల్లో 75 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించినట్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షల విధానాన్ని ప్రకటించింది. ఆ తర్వాత గ్రూప్-3, గ్రూప్-2 పరీక్షలకు ఇంటర్వ్యూ నిర్వహించవద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గ్రూప్-2 పరీక్షలకు ఇంటర్వ్యూ నిర్వహించాలా.. వద్దాఅనే విషయంలో టీఎస్పీఎస్సీ మల్లగుల్లాలు పడుతోంది. తొలుత ప్రకటించిన వాటిలో యూనిఫాం, టెక్నికల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. పోలీసు విభాగంలోని పోస్టులతోపాటు విద్యుత్ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులే మూడొంతులకు పైగా ఉన్నాయి. సాధారణ పోస్టులు తక్కువగా ఉండటంతో ఈ ఉద్యోగ ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకోలేకపోయింది. అందులోనూ అత్యధికంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో రెండో విడత ఉద్యోగాల భర్తీపైనే నిరుద్యోగులు గంపెడాశలతో నిరీక్షిస్తున్నారు. -
రాజధాని నిర్మాణమంతా గ్రాఫిక్స్
-
విశాఖ విమ్స్ డైరెక్టర్ అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నం విమ్స్ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఈ విషయాన్ని అధికారింగా ధృవీకరించడం లేదు. విమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను యోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకూ 16 మంది బాధితుల నుంచి ద్వారకా పోలీసులు ఫిర్యాదులు అందుకున్నట్లు సమాచారం. ఈ మోసాల ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఓ ప్రజా ప్రతినిధి రామన్ బళ్లాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం విదితమే. డైరెక్టర్ సుబ్బారావును ద్వారకా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిరుద్యోగులను ఎలా మోసగించాడు, బాధితులు ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డెక్కిన నిరుద్యోగ యువత
-
'నిరుద్యోగులకు పోలీస్ శాఖ ద్వారా శిక్షణ'
భువనగిరి: నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. బుధవారం భువనగిరికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా నివారణకు యువత ముందుకు రావాలని కోరారు. సారా తయారీకి అవసరమైన నల్లబెల్లం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. హైవే పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేస్తామని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఎస్పీ దుగ్గల్ చెప్పారు. -
'నిరుద్యోగులకు కానిస్టేబుల్ రాతపరీక్ష'
నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం జరిగిన పరీక్షా కేంద్రాలను రాములు నాయక్ మెదక్ డీఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు. -
నిరుద్యోగులకు కానిస్టేబుల్ రాతపరీక్ష
- ఎమ్మెల్సీ రాములునాయక్ నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములునాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్సీ రాములునాయక్ మెదక్ డిఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు. -
ఉన్న జాబు పాయె!
డీఎస్సీ మినహా మరే ఉద్యోగాలకు విడుదల కాని నోటిఫికేషన్ రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగులు ఇంటింటికీ ఉద్యోగ హామీ అటకెక్కినట్లే నిరుద్యోగ భృతి ఊసేలేని వైనం నమ్మించి మోసం చేశారని బాబుపై నిరుద్యోగుల మండిపాటు ఏరుదాటేదాక ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెత అక్షరాల చంద్రబాబుకు అతికినట్లు సరి పోతుందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రజల నెత్తిన హమీల వర్షం కురిపించి.. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊరూ వాడా ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంటే కిమ్మనడం లేదని వాపోతున్నారు. ఉద్యోగాలు రాని యువకులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు ఇపుడు ఆ ఊసెత్తక పోవడం ఆందోళన కలిగించే పరిణామం. పెరుగుతున్న నిరుద్యోగులు జిల్లాలో రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక పక్క చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఎంప్లాయిమెంట్ కేంద్రంలో సుమారు 75 వేల మంది నిరుద్యోగులు పేరు నమోదు చేసుకున్నారు. పేరు నమోదు చేసుకోని వారి సంఖ్య ఇంతకు రెండింతలు ఉంటుంది. వీరందరూ చంద్రబాబుపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారు. ఆయన గెలిచి అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని గంపెడాశతో ఎదురు చూశారు. ఒకవేళ ఉద్యోగం రాకున్నా నిరుద్యోగ భృతి వస్తుందని భావించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా మరో ఉద్యోగానికి ప్రకటన వెలువడని పరిస్థితి నెలకొంది. పైగా హౌసింగ్లో వర్క్ ఇన్స్క్టర్లుగా పనిచేస్తున్న వారితో పాటు ఆదర్శ రైతులను తొలగించారు. కొన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులనూ తొలగించారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితిలో పని చేస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. -
మహిళలకు ఇవ్వరట!
ఉద్యోగుల ఎంపికలో జోరుగా పైరవీలు బస్సుల్లో టికెట్లు కొట్టని కొత్త కండక్టర్లు వారు తెచ్చి ఇచ్చిందే రెవెన్యూ.. బస్సులు తిప్పితే భారీగా నష్టం డ్రైవర్లు, కండక్టర్లకు డబ్బులు తగ్గించి ఇస్తున్న అధికారులు ఆందోళనలో తాత్కాలిక ఉద్యోగులు నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలికంగా నియమించుకునే యువతకు సంబంధించి డ్రైవర్కు రూ.1,000, కండక్టర్కు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడంతో భారీగా నిరుద్యోగులు ఆర్టీసీ బస్స్టాండ్కు చేరుకున్నారు. సుమారు రెండు వేల మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు ఆయా బస్స్టాండ్లకు చేరుకున్నారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి తమ సర్టిఫికెట్లను అధికారులకు అందజేశారు. హెవీ లెసైన్స్ ఉన్నవారిని మాత్రమే డ్రైవర్లగా అధికారులు నియమించారు. టెన్త్ పాసైన వారిని కండక్టర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. అయితే తాత్కాలిక ఉద్యోగాల్లో పైరవీలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు, తెలిసిన వారి ద్వారా వచ్చిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారని సమాచారం. మహిళలను పక్కనబెట్టిన అధికారులు తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు మహిళలు అధికసంఖ్యలో ఆయా బస్స్టాండ్లకు చేరుకున్నారు. మొదటిరోజు ఒకరిద్దరు మహిళలు ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఇవ్వలేదన్న కారణంతో వారిని విధుల్లో నుంచి తొలగించారు. వీరితో పాటు కండక్టర్ ఉద్యోగం చేపట్టేందుకు ధ్రువపత్రాలు ఇచ్చిన పలువురు మహిళలను కూడా విధులకు దూరంగా పెట్టారు. విధుల్లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువువతుందని పలువురు మహిళలు వాపోయారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా బస్స్డాండ్లోనే పడిగాపులు కాస్తున్నా తమను విధుల్లోకి తీసుకోలేదని మహిళలు వాపోయారు. టికెట్లు కొట్టని కొత్త కండక్టర్లు కొత్తగా కండక్టర్లు ఎవరూ బస్సుల్లో టికెట్లు కొట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆర్టీసీకి భారీనష్టం వస్తుందని అధికారులే చెబుతున్నారు. పలువురు కండక్టర్లు వసూలు చేసిన దానిలో కొంతమాత్రమే అధికారులకు అప్పజెబుతున్నారని సమాచారం. ఉదాహరణకు నెల్లూరు బుచ్చి రూట్కు రోజు రూ. 5వేలు వస్తుంది. కానీ కొత్తగా నియమించిన కండక్టర్లు రూ.2వేలు మించి అప్పజెప్పడం లేదు. దీంతో డబ్బులు తగ్గించి ఇచ్చిన వారిని తొలగించి మళ్లీ కొత్తవారిని విధుల్లోకి తీసుకుంటున్నారు. తక్కువగా ఇస్తున్న రోజు వేతనం తాత్కాలిక డ్రైవర్కు రోజుకు రూ.1000, కండక్టర్కు రూ.800 చెప్పిన అధికారులు తక్కువ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. డ్రైవర్కు రూ.500, కండక్టర్కు రూ.400కు మించి ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశిస్తే రోజుకు 300 కిలోమీటర్లు తిరిగి డ్రైవర్కు మాత్రమే ఆ వేతనం వర్తిస్తుంద ంటున్నారు. వేతన విషయం ముందే ఎందుకు చెప్పలేదంటూ శనివారం బుచ్చికి వెళ్లే బస్సుకు డ్రైవర్గా విధులు నిర్వహించిన ఓ వ్యక్తి వాదనకు దిగారు. ఈ విషయంలో తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ వ్యక్తి తన సర్టిఫికెట్ను తిరిగి ఇచ్చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదే రీతిలో పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు డబ్బులు ఇస్తుండడంతో నిత్యం అక్కడ వివాదం చోటుచేసుకుంటుంది. -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
హైదరాబాద్ : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు...ఒంగోలు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగుల నుంచి సుమారు రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీయగా నిందుతుడు తప్పించుకు తిరిగాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వినోద్ కుమార్ పై నిఘా వేసిన సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని నుంచి కంప్యూటర్, ప్రింటర్, నకిలీ నియామక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
కరీంనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి, మోసాలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కమాన్పూర్ మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన కనుకుల మనోజ అలియాస్ మనోజ తివారి(22) నిరుద్యోగులకు ఎరవేసింది. అదే గ్రామానికి చెందిన గాజుల కనకశేఖర్కు సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రెయినీ ఇంజినీర్గా ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు, అతని చెల్లెలు గాజుల స్రవంతికి స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇప్పిస్తామని రూ.6లక్షలు వసూలు చేసింది. ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీయగా, మనోజ తివారి తప్పుడు ఉద్యోగపత్రాలు అందజేసింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈనెల 11న గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కూపీ లాగగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సింగరేణి కార్మికుడి కూతురైన మనోజ హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు వెళ్లింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-7కు చెందిన దేవరకొండ రాజన్న(47), పెరుగు తిరుపతి(40), కూకట్పల్లికి చెందిన డేగ శ్రీనివాస్(35), చంద్రమోహన్(39), జూబ్లిహిల్స్కు చెందిన మాకూరి సత్యనారాయణ(52), మెదక్కు చెందిన శ్రీలత(32)లతో కలిసి ఉద్యోగాల పేరుతో డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ఖైరతాబాద్లో ఎల్ఆర్ఎస్ అనే సంస్థను నెలకొల్పారు. వీరి పేర్లు, సెల్నెంబర్ల ఆధారంగా హైదరాబాద్కు వెళ్లినప్పటికీ నిందితులు తప్పుడు చిరునామా చెబుతూ పలుమార్లు తప్పించుకున్నారు. చివరకు మనోజను అరెస్టు చేసి 420, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఆమె వద్ద నుంచి ల్యాప్టాప్, తప్పుడు జాబ్కాల్ లెటర్లు, బ్యాంక్పాస్బుక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ముఠా ఇప్పటివరకు పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసినట్టు తెలిపారు. మనోజ మాట్లాడుతూ.. ఈ విషయాలు రాజన్న చూసుకునే వాడని, తనకు డబ్బులు ఇచ్చేవారు కాదని, హైదరాబాద్లో విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని రూ.11లక్షలు వసూలు చేశామని తెలిపింది. -
బాబోయ్..డీఎస్సీ
టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బాబు మార్కు కొర్రీలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో చేసిన మాటల గారడీలో భాగంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలను వంచించిన విధంగానే నిరుద్యోగ యువతతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అభ్యర్థులు వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది.. నెల్లూరు(విద్య) : జిల్లాలో 416 పోస్టులను టెట్, టీఆర్టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్లో చూపారు. ఆర్థిక శాఖ ఆమోదం సాకుతో 20 శాతం కుదించారు. ప్రస్తుతం ఉన్న 333 పోస్టుల కు 6వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి అభ్యర్థి అర్హత పరీక్ష ఫీజుగా రూ.250 చెల్లించాలి. 6వేల మందికి సుమారు రూ.15 లక్షలు ఒక్క జి ల్లా నుంచే ఖజానాకు రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 9,061 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 15 లక్షల మంది నిరుద్యోగులు రూ.250 చొప్పున ప్రభుత్వ ఖజానా నింపేం దుకు తమవంతు బాధ్యతను తమకు తెలియకుండానే భుజాలపైకి ఎత్తుకున్నారు. నిరుద్యోగులతో చెలగాటం పరీక్ష రుసుం రూ.250 బ్యాంక్లో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్నెట్ సెం టర్లో రూ.30 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. జెరాక్స్ కాపీలకు రూ.20 నుంచి రూ.50 ఖర్చవుతోంది. రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు జెరాక్స్ పత్రాలను విద్యాశాఖకు అందజేసేందుకు రూ.35 నుంచి రూ.50 వెచ్చించాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల నుంచి నిరుద్యోగులు నెల్లూరుకు చేరుకునేందుకు రూ.100 నుంచి రూ.150 ఖర్చవుతోంది. ఒక్కో అభ్యర్థి సగటున రూ.400 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలను వారు తప్పుపడుతున్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే ధ్రువపత్రాల జెరాక్స్లను అం దజేసే ప్రక్రియ ఎక్కడా లేదని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దరఖాస్తులను అందజేసేందుకు గర్భిణులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. స్పష్టతలేని నోటిఫికేషన్ అర్హత పరీక్షకు వెలువడిన నోటిఫికేషన్లో బీఎస్సీ, బీకాం, ఓపెన్ యూనివర్సిటీ, భాషాపండితులు, ఇంటర్ తత్సమాన అర్హత తదితర అం శాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నెల 16న ముగిసే ఆన్లైన్ చెల్లింపుల గడువును బుధవారం వరకు పొడిగించారు. ధ్రువీకరణ పత్రాల స్వీకరణకు ఫిబ్రవరి 5 వరకు నిర్ణయించారు. సెలవులు రావడంతో గడువు తేదీలను పొడిగించామని ప్ర భుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి నిరుద్యోగుల నుంచి మరింత సొమ్ము చేసుకునేందుకు ఈ గడువు పనికొస్తుందని అభ్యర్థులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పోస్టులకు రెండిం తలు, మూడింతలు అభ్యర్థులు దరఖాస్తులు చే సుకోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. విధులకు దూరంగా... ఆన్లైన్లో అప్లికేషన్లు అప్లోడ్ చేసిన తర్వాత వాటి ప్రతులను విద్యాశాఖకు అందజేసే క్రమం లో ఉపాధ్యాయ సిబ్బంది డిసెంబర్ నుంచి సా ధారణ విధులకు దూరమయ్యారు. కలెక్షన్ కమిటీలో డిప్యూటీ ఈఓ, ఏడీస్థాయి, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సుమారు 50 మంది ఫిబ్రవరి 5 తేదీ వరకు సాధారణ విధులకు హా జరయ్యే పరిస్థితి లేదు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత జెరాక్స్ కాపీలను స్వీకరిం చడం అర్థంలేని పని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు కూడా ఆన్లైన్లోనే వస్తాయనేది సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయం. ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించి భారీ స్థాయిలో సి బ్బందిని దరఖాస్తుల స్వీకరణకు నియమించడం ఎంతవరకు సమంజసమని పలువురు చర్చించుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తుల స్వీకరణలో నిమగ్నమవడం విద్యార్థులకు తీరని నష్టమని వారి తల్లిదండ్రులు అంటున్నారు.ఇలా సాధ్యం కాని హామీల్లో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఇన్ని అవకతవకల మధ్య డీఎస్సీకి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నిర్వహణ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. డీఎస్సీ దరఖాస్తు పాట్లు నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో టెట్ కమ్ టీఆర్టీ దరఖాస్తుల జెరాక్స్ పత్రాలను అందజేసేందుకు జిల్లావ్యాప్తంగా వచ్చే అభ్యర్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, దరఖాస్తులు ఇచ్చేందుకు చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు 7,110 దరఖాస్తులు స్వీకరించారు. -
విదేశాల్లో ఉద్యోగాలు పేరిట మోసం
నగరంలోని కొత్తపేటలో ఉద్యోగాల పేరుతో ఓ కన్సెల్టెన్సీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులకు టోకరా వేసింది. టీఎంసీఎస్ అనే కన్సెల్టెన్సీ ఈ మోసానికి పాల్పడినట్టు తెలిసింది. ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేసింది. చివరికి తాము మోసపోయామని తెలుసుకున్నబాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగాలిపిస్తామంటూ.. ఘరానా మోసం!
-
టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కుచ్చుటోపీ
టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు. కర్నూలుకు చెందిన మురళీమోహన్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి నిరుద్యోగులకు గాలం వేశాడు. నిరుద్యోగం అనే బలహీనతను ఆసరాగా చేసుకుని అతడు వారినుంచి దాదాపు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. సోమ్ము ముట్టగానే తిన్నగా జారుకున్నాడు. దీంతో మోసం పోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగం పేరుతో తమ వద్ద నుంచి భారీగా సొమ్మును తీసుకుని మోసం చేసాడంటూ మురళీమోహన్పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సత్తెనపల్లి పోలీసులు నిందితుడు మురళీమోహన్ను అరెస్ట్ చేశారు. -
ఆశల పల్లకిలో నిరుద్యోగులు
డిసెంబర్ మొదటివారం లేదా చివర్లో నోటిఫికేషన్లు! కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న యువత సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొలువులు వెల్లువలా వస్తాయని తెలంగాణలోని నిరుద్యోగ యువత కోటిఆశలతో ఎదురు చూస్తోంది. నోటిఫికేషన్లు త్వరలోనే వెలువడనున్నాయని సంకేతాలు రావడంతో శిక్షణ కేంద్రాలకు పోటెత్తుతోంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడం, త్వరలోనే కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ (టీచర్ పోస్టుల) తదితర పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం హైదరాబాద్కు తరలివస్తున్నారు. దీంతో నగరంలో కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన అశోక్నగర్, చిక్కడపల్లి తదితర ప్రాంతాలు నిరుద్యోగ యువతి,యువకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం గాంధీనగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో సీటు కోసం వందలమంది నిరుద్యోగులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణ కోసం వస్తున్న అభ్యర్థుల రద్దీని తట్టుకునేందుకు ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్లు ఒకేసారి నాలుగైదు బ్యాచ్లను కొనసాగిస్తున్నాయి. దసరా తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం! ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులను దసరా తరువాత నియమించేందుకు ఫైలు సిద్ధం చేస్తోంది. కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పడిన వెంటనే ప్రస్తుతం ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టనుంది. మొత్తానికి వచ్చేనెలలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తరువాత పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలపై దృష్టి సారించనుంది. అందుకు శాఖల వారీగా ఇండెంట్లు తెప్పించుకోవాల్సి ఉంది. మరోవైపు పరీక్షల సంస్కరణలు, వార్షిక కేలండర్ను ప్రకటించేం దుకు అవసరమైన చర్యలూ చేపట్టనుంది. మూడేళ్ల నుంచి నోటిఫికేషన్ల కరువు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సజావుగా జారీ కాలేదు. దీంతో గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అవసరమైన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని నవంబర్ లోపు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వీలైతే డిసెంబర్ మొదటి వారం లేదా చివరి వారంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. కోచింగ్ కోసం బారులు ఆర్టీసీ క్రాస్రోడ్స్లో కొత్త సినిమా వస్తే అభిమానులు టికెట్ల కోసం బారులు తీరడం మనకు తెలిసిందే... దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా కోచింగ్ సెంటర్లో సీటు కోసం నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఆదివారం గాంధీనగర్లోని ఓ స్టడీ సర్కిల్లో గ్రూప్-2 శిక్షణలో సీటు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా అభ్యర్థులు తరలివచ్చారు. ఇక్కడ గ్రూప్- 2 కోచింగ్ కోసం ఇప్పటికే మూడు బ్యాచ్లు నడుస్తుండగా మరో మూడు బ్యాచ్ల కోసం 1,500 దరఖాస్తులను ఇస్తున్నారని తెలియడంతో వందలాదిమంది నిరుద్యోగులు అర్ధరాత్రి నుంచే ఇక్కడ బారులు తీరారు. అలాగే, ఎన్బీకే ఎస్టేట్లో ఉన్న మరో ఇన్స్టిట్యూట్లో సీటు కోసం ఇదే విధంగా యువత బారులు తీరింది. అశోక్నగర్, చిక్కడపల్లిలోని దాదాపు ప్రతి కోచింగ్ సెంటర్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో 98 వేల ఖాళీలు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 98,016 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఇవి కాకుండా ఈ మూడునాలుగు నెలల్లో ఖాళీ అయిన పోస్టులు వీటికి అదనం. అయితే వాటిలోని 20 నుంచి 25 వేల పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. మరోవైపు కొన్ని పదోన్నతులపై భర్తీ చేయాల్సిన పోస్టులు ఉన్నాయి. మొత్తానికి డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 50 వేల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా టీచర్ పోస్టులు 15 వేలు ఉండగా, జూనియర్ లెక్చరర్ పోస్టులు 2,500 వరకు ఉన్నాయి. మరోవైపు పోలీసు కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-4లో నాలుగు వేలకు పైగా పోస్టులు రానున్నాయి. శాఖల వారీగా ఖాళీలు ఇవీ ... విద్యాశాఖలో: డిప్యూటీ డీఈఓ- 40, డిప్యూటీ ఐఓఎస్- 21, సీటీఈ లెక్చరర్స్- 48, డైట్ లెక్చరర్స్-166, ఎంఈఓ- 399 పోస్టులు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులను డెరైక్ట్ రిక్రూట్మెంట్, మిగతావి పదోన్నతులపై భర్తీ చేస్తారు. టీచర్ కేటగిరీలో: పీజీటీ- 1,131, టీజీటీ- 719, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్స్ - 254, క్రాఫ్ట్ టీచర్స్- 313, లాంగ్వేజ్ పండిట్- 765, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం -270, పీఈటీ - 404, స్కూల్ అసిస్టెంట్ - 3,367, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ - 616, ఎస్జీటీ - 11,874, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ - 184 పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పీఈటీ - 49, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) బయాలజీ - 164, ఎస్ఏ ఇంగ్లిష్ - 167, ఎస్ఏ హిందీ - 136, ఎస్ఏ మ్యాథ్స్ - 215, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ - 186, ఎస్ఏ ఫిజికల్సైన్స్ - 233, ఎస్ఏ సోషల్ - 117, ఎస్ఏ తెలుగు - 130, ఎస్జీటీ - 473 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వైద్య శాఖలో: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 3,500 పంచాయతీరాజ్ శాఖలో: గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీ - 417, గ్రేడ్-2 పంచాయతీ సెక్రటరీ - 371, గ్రేడ్-4 పంచాయతీ సెక్రటరీ - 1,143, గ్రేడ్-3 పంచాయతీ సెక్రటరీ - 2,111, వీఆర్ఓ అండ్ వీఏఓ - 4,081, విలేజ్ సర్వెంట్- వీఆర్ఏ- 1,087 పోస్టులు ఉన్నాయి. పోలీసు శాఖలో: కానిస్టేబుల్ పోస్టులు 7 వేల వరకు ఉన్నాయి. వీటిని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గ్రూప్-1 కేటగిరీలో: డీఎస్పీ-5, డివిజినల్ పంచాయతీ ఆఫీసర్- 2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ -6, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-19, ఎంపీడీఓ-114, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-32 ఉన్నాయి. గ్రూప్-2 కేటగిరీలో: డిప్యూటీ తహసీల్దార్-156, రెవెన్యూ ఇన్స్పెక్టర్- 77, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్-78, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్-45, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-4, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్- 99, అగ్రికల్చర్ ఏవో -290 తదితర పోస్టులు ఉన్నాయి. -
అర్హులైన నిరుద్యోగులకు రూ.వెయ్యి భృతి
హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు అయిదో రోజు కొనసాగుతున్నాయి. శనివారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నియామకాలు ఎప్పుడు చేపడతారని ప్రశ్నించింది. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్న వేయగా దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ అర్హులైన నిరుద్యోగులకు రూ.వెయ్యి భృతి ఇస్తామన్నారు. అలాగే బడ్జెట్ పాసైన తర్వాత నిరుద్యోగులకు భృతి ఇస్తామని తెలిపారు. ప్రయివేట్, ప్రభుత్వ సెక్టార్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని యనమల పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారానే ఉద్యోగాలు చేపడతామని వెల్లడించారు. -
బాబు వచ్చాడు.. జాబు పోయింది!!
-
నిరుద్యోగులంతా ఒక్కసారే పోటెత్తారు!
-
‘కోచింగ్’ దందా
నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్ : నిరుద్యోగులలో ఆశలు రేకెత్తిస్తూ ఇటీవల ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అరకొరగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా.. ఆశావహులు ఆయా ఉద్యోగాల కు భారీ స్థాయిలోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. కొందరు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసి ఇంట్లోనే సన్నద్ధం అవుతుండగా.. మరికొందరు కోచింగ్ సెంటర్ల బా ట పడుతున్నారు. దీనిని కోచింగ్ సెంటర్లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీజులు, మెటీరియల్ పేరుతో వేలల్లో డబ్బులు గుంజుతున్నాయి. అరకొరగానే పోటీ పరీక్షలకు సంబంధించి నిజామాబాద్ నగరం లో సుమారు 25 కోచింగ్ సెంటర్లున్నాయి. బస్టాండ్ సమీపంలో, సుభాష్నగర్, ఖలీల్వాడి, హమాల్వా డీ, గో ల్హన్మాన్ తదితర ప్రాంతాలలో ఈ కేంద్రాలున్నాయి. ఒక్కోదానిలో 200 నుంచి 400 వరకు అభ్యర్థులు వివిధ సబ్జెక్టులపై శిక్షణ తీసుకుంటున్నా రు. అన్ని కోచింగ్ సెంటర్లలో కలిపి సుమారు ఆరు వేల వరకు అభ్యర్థులున్నారు. నిర్వాహకులు నాలుగు గదులను అద్దెకు తీసుకొని, మూడు నాలుగు వందల మంది అభ్యర్థులను చేర్చుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏ కేంద్రంలోనూ సరైన వసతులు లేవు. చాలా చోట్ల ఇరుకు గదులలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్డులో నడుస్తున్న కోచింగ్ సెంటరూ ఉంది. కొన్ని సెంటర్లలో తాగునీటి వసతి సైతం కల్పించడం లేదు. చాలా చోట్ల అనుభ వం ఉన్న శిక్షకులు లేరు. డిగ్రీ పూర్తి చేసినవారితోనే త తంగం నడిపిస్తున్నారు. ప్రకటనల్లో మాత్రం అనుభవజ్ఞులైన శిక్షకులతో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని పేర్కొంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగం కోసం నిరుద్యోగు లు ఈ బాధలను భరిస్తున్నారు. వేలల్లో ఫీజులు ప్రస్తుతం వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, ఐబీపీఎస్ తదితర పోటీ పరీక్షలకు జిల్లాలో కోచింగ్ ఇస్తున్నారు. ఆయా కోర్సులకు రూ. 3,500 నుంచి రూ. 5 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. కోర్సులో చేరినప్పుడే పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు. స్టడీ మెటీరియల్ పేరుతో అభ్యర్థులనుంచి అదనపు మొత్తాన్ని గుంజుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పిస్తున్నామంటూ ఫీజులు వసూ లు చేస్తున్నారు. అయితే నిర్దేశిత సిలబస్ ప్రకారం ఎక్కడా స్టడీ మెటీరియల్ అందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచినట్లు గా మెటీరియల్ తయారు చేయించి విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. కోచింగ్ సెంటర్లపై పర్యవేక్ష ణ లేకపోవడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోచింగ్ సెంటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోంది. అభ్యర్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. న్యాయబద్ధం గా ఫీజులు వసూలు చేయకపోతే ఆందోళన చేస్తాం. -శ్రీనివాస్గౌడ్, విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి చాలా చోట్ల సరైన శిక్షకులు లేకున్నా కోచింగ్ సెంటర్లను నడిపిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. నిపుణులతో కోచింగ్ ఇప్పించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. కోచింగ్ సెంటర్లలో వసతులు కూడా కల్పించాలి. - ఎ.ప్రగతి కుమర్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు -
కొలువుల జాతర
నిజామాబాద్అర్బన్, న్యూస్లైన్: జిల్లాలో ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. డిగ్రీలు పూర్తి చేసిన వేలాది మంది కొలువుల కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల పలు శాఖలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో ఆయా పరీక్షలకు పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఏటా సుమారు 40వేల మంది ఉన్నత విద్య పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో పడుతున్నారు. సు మారు 1,600 మంది బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్, డీఎస్సీలకోసం ఎదురు చూస్తున్నారు. పది వేల మంది వరకు ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ వంటి కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వేలాది మంది ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కొంటుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశతో నోటిఫికేషన్లకోసం ఎదురు చూస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఏటా వేలాది మంది నిరుద్యోగులు తయారవుతుండగా, ప్రభుత్వం వందలలో కూడా పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. పీజీలు పూర్తి చేసినవారు సైతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో వారు చిన్న ఉద్యోగాలకు పోటీ పడాల్సి వస్తోంది. త్వరలో ‘మెడికల్’ పోస్టులు మెడికల్ కళాశాల పోస్టులకు సంబంధించి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. బుధవారం హైదరాబాద్లో జరిగే వైద్యశాఖ అధికారుల సమావేశం అనంతరం నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది. సుమారుగా 210 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్, డ్రైవర్, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులనూ భర్తీ చేస్తారు. జిల్లా విద్యాశాఖకు సంబంధించి డీఎస్సీ ద్వారా 1,173 టీచర్పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈనెలలో టెట్, వచ్చేనెలలో డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీపైనా నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే అంగన్వాడీ పోస్టులనూ భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో నిరుద్యోగులలో ఆశలు రేకెత్తుతున్నాయి. -
నిరుద్యోగులకు సంకటంగా మారిన రాష్ట్ర విభజన నిర్ణయం
-
నిరుద్యోగులకు ‘విభజన’ షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు ఉద్యోగాల భర్తీకి ఆగస్టులోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ జూలై నుంచే చర్యలు చేపట్టినా విభజన నేపథ్యంలో అవన్నీ ఆగిపోయాయి. నోటిఫికేషన్ల జారీపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని, రెండు మూడేళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న తమకు అన్యాయం చేయవద్దని అభ్యర్థులు ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో పలుమార్లు కలిశారు. అయినా సానుకూల స్పందన రాకపోవడంతో సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తమ ఆవేదనను అధికారులకు విన్నవించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్ను కలిసి నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. నోటిఫికేషన్ల జారీకి తాము సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా అభ్యర్థులతో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని లేఖ రాశామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని చైర్మన్ చెప్పినట్లు అభ్యర్థులు తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.