vadivelu
-
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
స్టార్ కమెడియన్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా
ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్లో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.ఇక వడివేలు పిటిషన్ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్..
ప్రముఖ కమెడియన్ వెంగళ్రావు దీన స్థితిలో ఉన్నాడు. తమిళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. చికిత్సకు సైతం డబ్బుల్లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఒక చేయి, కాలు పక్షవాతానికి గురైందని, పని చేసే స్థితిలో లేనని, చికిత్సకు డబ్బులిచ్చి సాయం చేయాలని సినిమా తారలకు విజ్ఞప్తి చేశాడు.కదిలిన సినీతారలుఇది చూసిన తమిళ హీరో శింబు రూ.2 లక్షలు, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ రూ.25,000 ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కమెడియన్ వడివేలు.. నటుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు తనను నేరుగా కలిసి యోగక్షేమాలు తెలుసుకోనున్నాడు.వడివేలుతోనే ఎక్కువ సినిమాలుకాగా వెంగళ్రావు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో స్టంట్మెన్గా పని చేశాడు. తర్వాత నటుడిగా మారాడు. కాంతస్వామి, తలై నగరం, పగిరి.. ఇలా అనేక చిత్రాలు చేశాడు. ఎక్కువగా వడివేలుతో కలిసి పని చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లోనే దాదాపు 30 సినిమాలున్నాయి. ప్రస్తుతం వెంగళ్రావు విజయవాడలో నివసిస్తున్నాడు. #வடிவேலு உடன் காமெடி வேடங்களில் நடித்த #வெங்கல்ராவ் ஒரு கை, ஒரு கால் செயல் இழந்து, சொந்த ஊரான விஜயவாடாவில் சிகிச்சை பெற்று வருகிறார்.மருத்துவச் செலவுக்கு நடிகர்கள் மற்றும் சினிமா தொழில்நுட்பக் கலைஞர்கள் தனக்கு உதவும்படி வீடியோ வெளியிட்டுள்ளார்.@GovindarajPro #VengalRao pic.twitter.com/6wkYJBVTqK— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 24, 2024చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది? -
23 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. ఏ సినిమా కోసమంటే?
హీరోహీరోయిన్ కావొచ్చు.. హీరో-కమెడియన్ కావొచ్చు.. కొన్ని కాంబోలు సూపర్ హిట్ అవుతుంటాయి. అలా 'ప్రేమికుడు'(కాదలన్)లో ప్రభుదేవా, వడివేలుల కాంబో కేక పుట్టించింది. దీని తర్వాత 'మనదై తిరుడి విట్టాయ్'లోనూ కలిసి నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ జోడీ సెట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ కాంబో తిరిగి ఓ మూవీలో కనిపించనుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) వరుత్త పడాద వాలిభర్ సంఘం, రజనీ మురుగన్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు పొన్రామ్ కొత్తగా ఓ చిత్రం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. దీనికి 'లైఫ్ ఈజ్ బ్యూటిపుల్' అనే టైటిల్ నిర్ణయించారని టాక్. ఇందులోనే ప్రభుదేవా-వడివేలు కలిసి నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రభుదేవా దళపతి విజయ్ 'ద గోట్' మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. వడివేలు.. మరోసారి ఫహాద్ ఫాజిల్తో కలిసి నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్) -
మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్
సౌత్ ఇండియాలో ప్రముఖ హాస్య నటుల్లో నటుడు వడివేలు ఒకరు. కోలీవుడ్లో అయితే ఆయనొక లెజండ్ అని చెప్పవచ్చు. గతంలో కొన్ని సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ తెరపై కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన మామన్నన్లో వడివేలు నటనను చూసిన వారందరూ కూడా ఫిదా అయ్యారు. ఇంతటి పాపులారిటీ వచ్చినా తన కుటుంబాన్ని ఎప్పుడూ పబ్లిక్గా కెమెరా ముందు ఆయన చూపించడు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా తక్కువ మందితోనే ముగించేస్తాడు. కెమెరా వాళ్లను కూడా లోపలికి అనుమతివ్వడు. దీంతో ఆయనకు అబ్బాయితో పాటు అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వారి ఫోటోలు బయట పెద్దగా కనిపించవు. తాజాగా వడివేలు కుమారుడి పెళ్లి నాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది. వడివేలు కుమారుడి పేరు సుబ్రమణి ఆయన సుమారు 10 ఏళ్ల క్రితమే తనకు మరదలు వరుస అయ్యే భువనేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో వడివేలు వద్ద ఎంతో డబ్బు, కార్లు, ఆస్తులు ఉన్నా కూడా తనకు దగ్గరి బంధువు అయిన ఆమెనే తన కోడిలిగా తెచ్చుకున్నాడు. తన వియంకుడు కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వారి పెళ్లి కూడా చాలా తక్కువ మంది సమక్షంలోనే జరిగింది. కష్టపడటం నేర్పించాడు గతంలో ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి వడివేలు గురించి సుబ్రమణి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తనకూ కూడా సినిమాల్లో నటించాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా ఛాన్సుల కోసం తన తండ్రి వడివేలు ఎలాంటి సిపారసులు చేయలేదని చెప్పాడు. సిపారసు ద్వారా అవకాశం వస్తే ఎక్కువ కాలం నిలబడలేవని చెప్పడంతో తన తండ్రి పేరు ఎక్కడా కూడా ఉపయోగించుకోలేదని ఆయన చెప్పాడు. తన తండ్రి అంటే చాలా ఇష్టమని తన పిల్లలకు కూడా వడివేలే పేరు పెట్టినట్లు చెప్పాడు. తనకు ఏ అవసరం వచ్చినా వడివేలు సాయం చేస్తాడని ఆయన చెప్పాడు. అయనప్పటికీ తన తండ్రి మీద ఆధారపడకుండా జీవిస్తున్నట్లు సుబ్రమణి పేర్కొన్నాడు. కష్టపడి పనిచేయడం నేర్పించాడు అది చాలు అని ఆయన వినమ్రంగా చెప్పాడు. తనకు వడివేలు అంటే ఎంతో ప్రాణమని పేర్కొన్నాడు. పలుమార్లు సిటీకి రమ్మని నాన్నగారు చెప్పినా తాను వెళ్లలేదని సుబ్రమణి తెలపాడు. పండుగలు వస్తే అందరం కలిసి సంతోషంగా గడుపుతామని తెలిపాడు. ప్రస్తుతం ఆయన తన తండ్రి వడివేలు నుంచి వారసత్వంగా వచ్చిన పొలంలో ఒక మారు మూల గ్రామంలో వ్యవసాయమే చేసుకుంటున్నట్లు సమాచారం. (వడివేలు కూతురు కార్తీక పెళ్లి ఫోటో) ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటో కోలీవుడ్లో భారీగా ట్రెండింగ్ అవుతుంది. వడివేలుతో ఒక్కసారైనా వెండితెర మీద కనిపించాలనే కోరిక ఉన్నట్లు ఆయన చెప్పాడు. ఎప్పటికైన తెరపై కనిపిస్తానని ఆయన పేర్కొన్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా తన తండ్రి మీద ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతంలో తన కష్టంతో జీవిస్తున్న సుబ్రమణి గురించి నెటిజన్లు పాజిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. పల్లెటూరులో ఉండే తన స్నేహితులతో కలిసే ఆ ఇంటర్వ్యూ ఇవ్వడంతో అది చాలా రోజుల నుంచి వైరల్ అవుతూనే ఉంది. తనకు హీరో విజయ్, అజిత్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. -
వడివేలుతో ఫహద్ ఫాసిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా
ప్రముఖ హాస్య నటుడు వడివేలు, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఇంతకుముందు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన 'మామన్నన్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆ చిత్రంలో వడివేలు పాజిటివ్ పాత్రలో, ఫాహత్ ఫాజిల్ నెగిటివ పాత్రలోనూ నటించి మెప్పించారు. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మించనుండడం విశేషం. ఈయన ఇంతకుముందు తమిళం, తెలుగు తదితర భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా వడివేలు, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో తన 98వ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి వి.కృష్ణమూర్తి కథ, దర్శకత్వం బా ధ్యతలను వి.కృష్ణమూర్తి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశారు. కాగా ఇది రోడ్డు పైన నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, కలై సెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ సంస్థలో ఆర్బీ చౌదరి ఇంతకుముందు విజయ్ హీరోగా జిల్లా వంటి పలు చిత్రాలను నిర్మించారు. కాగా ఈయన తన 100వ చిత్రాన్ని నటుడు విజయ్ కథానాయకుడిగా నిర్మించనున్నట్లు చాలా కాలం క్రితమే వెల్లడించడం గమనార్హం. -
ఆ దెబ్బకు ఎనిమిదేళ్లు సినిమాలు మానేశా: డైరెక్టర్ భావోద్వేగం!
పోటాపోటీ(2011) సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ దర్శకుడు యువరాజ్ దయాలన్. ప్రస్తుతం ఇరుగపాట్రు అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతకుముందు తెనాలిరామన్(2014), ఇలీ(2015) చిత్రాలను తెరకెక్కించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడం కోలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ఇరుగపాట్రు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న యువరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఎనిమిదేళ్లలో తాను నిద్రపోకుండా చేసింది ఆ సినిమానే అని అన్నారు. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) యువరాజ్ మాట్లాడుతూ..' దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ స్టేజ్పైకి వచ్చాను. ఈ గత ఎనిమిదేళ్లలో నన్ను నిద్రపోనివ్వనిది ఒకటి ఉంది. అదే నా లాస్ట్ మూవీ ఎలి. ఆ రోజు ప్రెస్ షోకి మీలో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. అప్పుడే నేను, వడివేలు థియేటర్ బయటే ఉన్నాం. అయితే ఆ రోజు ఎవరూ బయటకు రాలేదు. అలా నేనూ వడివేలు థియేటర్లోకి వెళ్లాం. సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని నేను అడిగా. అంతా నిశ్శబ్దం. చాలా రోజుల తర్వాత ఇలాంటి నిశ్శబ్దాన్ని చూశా. అయితే ఒక సినిమా తర్వాత ప్రేక్షకులు మౌనంగా ఉంటే దాని అర్థం కేవలం రెండు విషయాలు మాత్రమే. ఒకటి అది ప్రపంచ స్థాయి సినిమా అయి ఉండాలి లేదా దానికి విరుద్ధంగానైనా ఉండాలి. వారి మౌనానికి కారణం.. నేను రెండోదే తీసుకున్నా.'అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) ఆ సినిమా పరాజయం కొన్నేళ్లపాటు నిద్ర లేకుండా చేసిందని చెప్పారు. వాళ్ల నిశ్శబ్దం నన్ను చిన్నాభిన్నం చేసిందని తెలిపారు. ఈ సినిమాతో వాళ్ల జీవితంలోని మూడు గంటలు వృథా చేశానని అనిపించింది. అందుకే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరుగపట్రు నిర్మాతల సహకారంతోనే తాను మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే వడివేలుతో తెరకెక్కించిన తెనాలి రామన్ సక్సెస్ కావడంతో.. మళ్లీ వడివేలుని కథానాయకుడిగా పెట్టి ఇలి రూపొందించాడు. 2015లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరుగపట్లు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, శ్రద్ధా శ్రీనాథ్, విక్రాంత్, అబర్నతి, శ్రీ, సానియా అయ్యప్పన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. -
Raghava Lawrence, Kangana Ranaut Chandramukhi 2 Pre-Release Event: రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2'ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నటుడు వడివేలు ఇంట విషాదం..
తమిళనాడు: ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ్ముడు జగదీశ్వరన్(55) ఆదివారం(ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయన కొద్ది రోజులుగా తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. కాగా జగదీశ్వరీన్.. శింబు 'కాదల్ అలైవిట్టలై' సినిమాతో సహా పలు చిత్రాల్లో నటుడిగా తళుక్కుమని మెరిశారు. కానీ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై నుంచి మధురై వెళ్లిపోయాడు. అక్కడ ఒక వస్త్రాల షాపు పెట్టుకుని జీవనం కొనసాగించాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితమే వడివేలు తల్లి మరణించింది. ఈ విషాదం నుంచి తేరుకోమందే తమ్ముడు కూడా చనిపోవడంతో ఆయన ఇంట రోదనలు మిన్నంటాయి. చదవండి: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా.. -
Maamannan: ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన వడివేలు మామన్నన్ చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుందనడంలో ఎంలాంటి సందేహం ఉండదు. తాజాగా పలువురు నటీనటులు ఆయనపై పలు ఆరోపణలు చేస్తుంటే నటి షకీలా మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి బహిరంగంగానే మాట్లాడింది. (ఇదీ చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) 90వ దశకంలో హాట్ నటిగా వెలుగొందిన నటి షకీలా తమిళంలోనే కాకుండా పలు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. గ్లామర్ చిత్రాల్లోనే నటించే షకీలా.. ఇప్పుడు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన నటనను ప్రదర్శిస్తోంది. తమిళ్ విజయ్ టీవీలో 'కుక్ విత్ కోమలి' షో తర్వాత షకీలా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది. అందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది వడివేలు గురించి ప్రేమ ప్రియ కామెంట్ నా సినిమా కెరీయర్ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. నాకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చేవి. ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు. సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కోసారి ఏదోరకంగా అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్కు వెళ్తాను.. కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడి మూవీ మేకర్స్తో చెప్పించి వెనక్కి పంపేవారు. ఇలా చాలా సినిమాల్లో ఇదే జరిగింది.' అని ప్రేమ ప్రియ తెలిపింది. బెదిరించారు ఒక దర్శకుడు నన్ను ఫోన్లో బెదిరించాడు. నేను యూట్యూబ్ ఛానెల్లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని తిరిగి తెలపాలని ఒకరు వార్నింగ్ ఇచ్చారు. అందుకు నేను బయపడలేదు. వడివేలు గురించి ఏదైతే నిజమో అదే చెప్పాను. 2010లో వచ్చిన విజయ్ 'సురా' సినిమాలో వడివేలుతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన నో చెప్పారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కారణం ఏంటో చెప్పరు.' అని ప్రేమ ప్రియ తెలిపింది. వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు వడివేలుపై మీ-టూ ఫిర్యాదు చేసి ఉండవచ్చు కదా అని షకీలా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా వడివేల్కి, తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య అని ప్రేమ ప్రియ చెప్పింది. అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా పేర్కొంది. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని నటి షకీలా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి
‘లాస్య విలసిత.. నవ నాట్యదేవత.. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి.. స్వాగతాంజలి’ అంటూ సాగే పాట ‘చంద్రముఖి 2’ చిత్రంలోనిది. రాఘవా లారెన్స్, లక్ష్మీ మీనన్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్పై చిత్రీకరించిన ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి’ పాట తెలుగు, తమిళ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. యం.యం. కీరవాణి స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడారు. ఇక రజనీకాంత్ హీరోగా జ్యోతిక, ప్రభు, నయనతార లీడ్ రోల్స్లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. -
వడివేలు పేరు చెప్పగానే షాక్ అయ్యాను: ఉదయనిధి స్టాలిన్
కోలీవుడ్ ప్రముఖ హీరో, నిర్మాత, తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మామన్నన్'. నటి కీర్తి సురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో సక్సెస్ మీట్ను నిర్వహించారు. (ఇదీ చదవండి: జవాన్ ట్రైలర్: నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు) ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'ఆరుకల్ ఆరు కన్నాడీ' పెద్ద విజయం సాధించిందన్నారు. కాగా ఇప్పుడు తన చివరి చిత్రం 'మామన్నన్' మంచి ఓపినింగ్స్ సాధిస్తూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 510 థియేటర్లలో విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రెండవ వారంలో కూడా 470 థియేటర్లలో రన్ అవుతోందని చెప్పారు. ఇంత మంచి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు చాలా అనుభవాలను చవి చూశామన్నారు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) చిత్ర ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సన్నివేశాలను నాలుగు రోజులు పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్ మొదలైన 8 రోజులు వరకు దర్శకుడు మారి సెల్వరాజ ఏం తీస్తున్నారో అర్థం కాలేదన్నారు. తర్వాత క్రమంగా అవగాహన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు తండ్రిగా వడివేలు పేరు చెప్పగానే షాక్కు గురయ్యానన్నారు. అయితే ఇందులో వడివేలు నటించకపోతే ఈ చిత్రమే వద్దు వేరే చిత్రం చేద్దామని మారి సెల్వరాజ అన్నారన్నారు. ఆయనకు ఈ నమ్మకంతో ఈ చిత్రాన్ని అప్పగించానో దాన్ని పూర్తి చేశారని అన్నారు. మామన్నన్ చిత్రం 9 రోజుల్లోనే రూ.52 కోట్లు వసూలు చేసిందని, తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రం ఇదని ఆయన పేర్కొన్నారు. తెలుగులో మామన్నన్ జులై 14న 'నాయకుడు' పేరుతో విడుదల కానుంది. -
నాయకుడుతో...
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ లీడ్ రోల్స్లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ‘పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్ మల్టీప్లెక్స్– సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ‘‘పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
తెలుగులోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా
కోలీవుడ్లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామన్నన్' జూన్ 29న విడుదలై అక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఉదయనిధి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ చిత్రంపై పలు విమర్శలు వచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతని కెరీర్లో బెస్ట్గా నిలిచింది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇతర భాషల్లో హిట్ టాక్ వచ్చి.. భారీగా ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను టాలీవుడ్లో కూడా విడుదల చేస్తుంటారు. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. జులై 14వ తేదీన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఆరురోజులకు గాను రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగులో విడుదల అయిన తర్వాత ఏమేరకు కలెక్ష్న్స్ రాబడుతుందో చూడాలి. 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
స్టార్ హీరో చివరి సినిమాలో పాట పాడనున్న కమెడియన్
నటుడు ఉదయనిధి స్టాలిన్, నటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటుడు ఫాహత్ ఫాజిల్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటివరకు హాస్య పాత్రల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వడివేలు మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్కు తండ్రిగా సీరియస్ పాత్రలో నటించడం విశేషం. ఇటీవల ఉదయనిధి స్టాలిన్, వడివేలు కలిసున్న ఫొటోతో కూడిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బాణీలు కట్టిన ఒక పాటను నటుడు వడివేలుతో పాడించినట్లు సమాచారం. ఈ పాట రికార్డింగ్ సమయంలో వడివేలు, చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ తదితరులు ఏఆర్ రెహమాన్తో కూర్చుని ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడులో మంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం కావడంతో మామన్నన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి: నా జీవితంలో సామ్తో ఉన్న దశపై ఎంతో గౌరవం : చై -
పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!
నటి కీర్తీసురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన నటి ఈ బ్యూటీ. తల్లి మేనక నటి. తండ్రి సురేశ్ నిర్మాత. వీరి వారసత్వంతో ముందుగా మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన కీర్తీ ఆ తరువాత ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్కు దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికేయన్తో నటించిన రజనీ మురుగన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కీర్తీసురేశ్కు నటిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తెలుగులో మహానటి చిత్రంతో సావిత్రిగా జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే గెలుచుకుంది. కీర్తీ సురేశ్ ఏ తరహా పాత్రనైనా అవలీలగా నటించి శభాష్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధిస్టాలిన్కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. జయంరవితో నటిస్తున్న సైరన్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా చాలా మంది హీరోయిన్లు ఉన్నా, నటి కీర్తీసురేశ్ పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు సంబంధం చూశారు అనీ రకరకాల ప్రచారం వైరల్ అవుతోంది. ఇది ఒక రకంగా ఆమెకు ఫ్రీ పబ్లిసిటీనే అవుతోందని చెప్పవచ్చు. కాగా ఈ భామ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈమెకు ఫాలోవర్స్ అధికమే. ఇటీవల తన ఇన్స్ట్రాగామ్లో అభిమానులతో ముచ్చటించింది. అప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని అడగ్గా నటుడు వడివేలు రెండు చేతులను జేబులో పెట్టుకుని ఏముందీ? ఏమీలేదు అనే విధంగా ఒక కార్టూన్ పోస్ట్ చేసి ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు అని తేల్చి చెప్పింది. -
ప్రముఖ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట విషాదం
ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం. తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్ కమెడియన్ ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్ రిటర్న్స్తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. చదవండి: హీరోయిన్తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి శృతి హాసన్కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ -
హాస్య నటుడు వడివేలు పుట్టినరోజు వేడుక ( ఫొటోలు)
-
కమెడియన్ వడివేలుకు ఒమిక్రాన్? హాస్పిటల్లో చేరిక
ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఓ సినిమా కోసం లండన్ వెళ్లిన వడివేలు ఇండియాకు వచ్చిన అనంతరం స్వల్ప కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వెంటనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. కాగా ఈ మధ్యకాలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే హీరో విక్రమ్, కరీనా కపూర్, కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు
Court Issues Summons To Comedian Vadivelu: విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని సినీ నటుడు వైగై పుయల్ వడివేలుకు గురువారం ఎగ్మూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వడివేలు ఇంట్లో గతంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాంబరం సమీపంలో రూ .1.93 కోట్లకు 3.5 ఎకరాల స్థలాన్ని విక్రయించి, దానిని ఐటీ లెక్కల్లో చూపించనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వడివేలు కంగుతిన్నాడు. ఈ స్థలం విషయంలో సహచర నటుడు సింగముత్తు తనను మోసం చేసినట్టు ఆరోపిస్తూ.. ఆయన సెంట్రల్ క్రైం బ్రాంచ్ను ఆశ్రయించారు.చదవండి: చార్లీ చాప్లిన్లా 'ఇస్మార్ట్ బ్యూటీ' 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని తన ప్రమేయం లేకుండా సింగముత్తుతో పాటుగా మరికొందరు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్ కోర్టులో ఉంది. కాగా విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యా యి. అయితే, ఆయన హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం పిటిషన్ విచారణకు రాగా, సింగముత్తు తరపు న్యాయవాదులు హాజరై పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నట్లు తమ వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి విక్రయించి, ఇప్పుడేమో సింగముత్తు మోసం చేసినట్టు ఆరోపిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం విచారణకు తప్పక హాజరు కావాలని వడివేలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎగ్మూర్కోర్టు న్యాయమూర్తి నాగరాజన్ డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.చదవండి: ‘రిపబ్లిక్’ మూవీ చూసి రివ్యూ ఇచ్చిన టాలీవుడ్ పాప్ సింగర్ -
కమెడియన్కి జోడీగా కీర్తీ సురేష్..?
అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తూ, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ కీర్తీ సురేష్ మంచి ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె కమెడియన్ వడివేలు సరసన ‘నాయ్ శేఖర్ రిటర్న్స్’ అనే సినిమాలో నటించనున్నారని కోలీవుడ్ టాక్. సురాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘నాయ్’ అంటే కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టైటిల్ పెట్టారట. శేఖర్ పాత్రను వడివేలు చేయనుండగా ఆయన సరసన కీర్తి నటించనున్నారని భోగట్టా. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని, సినిమాకి కీలకంగా నిలిచే కథానాయిక పాత్ర ఉందనీ, ఆ పాత్రనే కీర్తీ సురేష్ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. మరి.. వడివేలుకి జోడీగా కీర్తి కనిపిస్తారా? లేక కథకి కీలకంగా నిలిచే పాత్రలో కనబడతారా? అసలు ఈ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్ -
వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ
Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్డమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్ ఆడియొన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు. వడివేలు 61వ పుట్టినరోజు ఇవాళ.. వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్ కట్టింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్ కంటపడడంతో .. ‘ఎన్ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. రాజ్కిరణ్తో పరిచయం వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ, నటుడు రాజ్కిరణ్.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు. వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్కిరణ్తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ కిరణ్. అలా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ‘ఎన్ రసవన్ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్కాంత్ ‘చిన్న గౌండర్’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు. త్రయం నవ్వులు గౌండమణి-సెంథిల్-చార్లీలాంటి టాప్ కమెడియన్ల హవా కోలీవుడ్లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన సింగరవేలన్(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్, బట్లర్ ఇంగ్లీష్ క్యారెక్టరైజేషన్ వడివేలుకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్తో కోలీవుడ్లో కింగ్ ఆఫ్ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్ ఆడియొన్స్కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది. తెలుగు వాళ్లకు.. తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్, విజయ్కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది. అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్మగన్) లాంటి సీరియస్ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి, ప్రేమికుడు, మిస్టర్ రోమియో, ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి, సింగమలై, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియొన్స్ను సైతం కితకితలు పెట్టించాడాయన. తెలుగులో స్ట్రయిట్ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు. వివాదాలు.. రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్కాంత్ మీదే అటెంప్ట్ టు మర్డర్ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్కాంత్పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్కాంత్తో వైరం కోలీవుడ్లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది. ఇక ఇమ్సయి అరసన్ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్ అందుకున్నాడు. 2018లో ఈ సినిమా సీక్వెల్ విషయంలో దర్శకుడు శంకర్(మొదటి పార్ట్కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై నడిగర్ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్లోనే ఆయన ఐదు సినిమాలు సైన్ చేయడం. ప్రే ఫర్ నేసమణి ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్డ్రింక్-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్’ కామెడీ పోర్షన్లు తెలుగు ఆడియొన్స్ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్) మూవీ. త్్్ విజయ్, సూర్య హీరోలు. ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్ పోషించాడు. ఓ సీన్లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్ పాక్లోని ఓ ట్విటర్ అకౌంట్ ద్వారా ట్రెండ్ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్ నేసమణి’ ట్రెండ్ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్ వైరల్ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. - సాక్షి, వెబ్స్పెషల్ -
సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానంటోన్న ప్రముఖ కమెడియన్
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సీఎం కరోనా నివారణ నిధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందించారు. అనంతరం వడివేలు మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రపంచాన్నే విస్మయ పరచారని పేర్కొన్నారు. పరిపాలనలో ఆయన తండ్రి పేరును నిలబెట్టుకున్నారని అన్నారు. కొంగునాడు విభజనపై జరుగుతున్న ప్రచారం గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ఇప్పుడు కొంగునాడు అంటూ విభజననే ఊహించలేం అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేయరాదని వడివేలు అన్నారు. తాను మళ్లీ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వడివేలు ఈ సందర్భంగా తెలిపారు. -
కమెడియన్ మొండితనం, దర్శకుడికి రూ.2 కోట్ల నష్టం!
'హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి' చిత్రానికి సంబంధించిన వివాదం పరిష్కారమైనట్టేనా? అన్న ప్రశ్నకు తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. దర్శకుడు శంకర్ హింసై అరసన్ 23 ఆమ్ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును కథా నాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం విజయవంతం కావడంతో అదే టీమ్తో హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి సీక్వెల్ను నిర్మించాలని దర్శకుడు శంకర్ భావించారు. షూటింగ్ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు. పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు, త్వరలోనే హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి చిత్రం సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘మహా సముద్రం’ మూవీలో సిద్దార్థ్కు అంత రెమ్యునరేషనా?! రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం -
వడివేలు స్నేహాన్ని వదలుకోను
చెన్నై : నటుడు వడివేలు స్నేహాన్ని వదలుకోనని దర్శకుడు, నటుడు మనోబాలా పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు తన యూట్యూబ్ చానల్ ద్వారా నటుడు సింగ ముత్తును ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో నటుడు వడివేలుపై పలు ఆరోపణలు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన వడివేలు సింగముత్తు, మనోబాలాపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై స్పందించిన మనోబాలా నటుడు వడివేలు తనకు 30 ఏళ్లుగా మంచి మిత్రుడని పేర్కొన్నారు. తనకు ఆయన్ను కించపరచాలనే ఉద్దేశం లేదన్నారు. అలాంటిది తనపై వడివేలు ఎందుకు ఫిర్యాదు చేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం వడివేలు ఆగ్రహంతో ఉన్నారని, తర్వాత ఆయనకు అన్ని వివరిస్తారని తెలిపారు. వడివేలుతో స్నేహానికి దూరం కావడం తనకు ఇష్టం లేదని మనోబాలా పేర్కొన్నారు. చదవండి : మరోసారి వివాదాల్లో హాస్య నటుడు వడివేలు -
'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ'
సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్ రాజకీయ పార్టీ గురించి పలువురు పలు విధాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.అందులో కొందరు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. వెటకారంగా మాట్లాడటంలో దిట్ట అయిన సీనియర్ హాస్య నటుడు వడివేలు గురించి చెప్పనే అవసరం లేదు. ఏ విషయంలోనైనా ఎగతాళి చేయడంలో వడివేలుది సపరేట్ భాణీ, ఈయన శనివారం తిరుచెందూర్కు వెళ్లి కుమారస్వామిని దర్శించుకున్నారు. అక్కడ మీడియాతో ముచ్చటించారు. రజనీకాంత్ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు వెటకారంగా బదులిచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా? అన్నది మీకూ తెలియదు, నాకూ తెలియదు. అసలు ఆయకే తెలియదు.. అని వ్యంగ్యంగా అన్నారు. రజనీ సంగతి ఏమోగానీ తాను మాత్రం రాజకీయ పార్టీని ప్రారంభించి 2021లో ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని అన్నారు. తన ఆశకు కొందరు అడ్డపడుతున్నారని పరిహాస్యమాడారు. నిజంగానే మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?అన్న ప్రశ్నకు తన పార్టీ జెండా రంగు ఇంద్ర ధనుస్సు అని, పార్గీ గుర్తు జామకాయ అని జోక్ చేశారు. తనకు రాజకీయాలు వద్దని, ప్రజలను నవ్యించడమే తనకు ఇష్టం అని వడివేలు అన్నారు. -
నాకంటే ఆయనే క్యూట్ : రష్మిక
చెన్నై : నాకంటే ఆయనే ఎంతో క్యూట్ అంటోంది హీరోయిన్ రష్మిక మందన. శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ అంటూ దక్షిణాదిని చుట్టేస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం ఫీవర్ తగ్గకముందే ఈ మధ్య మహేశ్బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక. తాజాగా నితిన్తో రొమాన్స్ చేసిన భీష్మతో మరో హిట్ను అందుకుంది. ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఈ కన్నడ భామ పారితోషికాన్ని కోటికి పైగా పెంచేసి నిర్మాతలకు దడ పుట్టిస్తుందనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న రష్మిక తరచూ ప్రచారంలో ఉండే ప్రయత్నాలను మాత్రం మిస్ కావడం లేదు. భీష్మ చిత్ర హిట్ హాంగోవర్లో ఉన్న ఈ భామ ఇటీవల ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగింది. అయితే అవి సాధారణానికి భిన్నంగా ఇంతకు ముందు హాస్య నటుడు వడివేలు పోజుల మాదిరి ఉండడం విశేషం. ఈ అమ్మడు ఆయన చిత్రాలను చూసి అలాంటి భంగిమల్లో ఫొటోలు తీసుకుందా అని అనిపించేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు రష్మిక ఫొటోల పక్కన అలాంటి భంగిమలతో ఉన్న నటుడు వడివేలు ఫొటోలను పోస్ట్ చేసి మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్స్ నటి రష్మిక దృష్టిలో పడ్డాయి. దీంతో ఆమె స్పందిస్తూ “నేను ఒప్పుకోను. నాకంటే వడివేలు చాలా క్యూట్గా ఉన్నారు’ అని పేర్కొంది. ఇకపోతే సినిమాలో క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెబుతారు అన్న ప్రశ్నకు తనకు తెలుగు నటుడు నితిన్ మంచి ఫ్రెండ్ కావాలని కోరుకుంటున్నాననీ, అదే విధంగా నటుడు విజయ్ అంటే చాలా ఇష్టం అనీ చెప్పింది. ఆయనతో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని అంది. ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు బదులు దాటేసిన రష్మిక తమిళ నటుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ నటుడెవరితోనైనా ప్రేమలో పడిందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కాగా నటి రష్మిక ఇప్పటికే శాండిల్వుడ్ నటుడితో ప్రేమాయణం జరిపి, ఆ తరువాత అతనితో బ్రేకప్ చేసుకుందన్నది గమనార్హం. ఇకపోతే ఇప్పటికే ఈ అమ్మడు కోలీవుడ్లో నటుడు కార్తీతో సుల్తాన్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆయన సోదరుడు సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హరి దర్శకత్వంలో సూర్య నటించనున్న చిత్రంలో నటి రష్మిక ఆయనకు జంటగా నటించనుంది. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక తెలుగులోనూ ఈ అమ్మడు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది. -
మరోసారి వివాదాల్లో హాస్య నటుడు వడివేలు
చెన్నై,పెరంబూరు: హాస్య నటుడు వడివేలు మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు.అతన్ని విచారించడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. వడివేలు ఇది వరకే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. వాటిలో ముఖ్యంగా ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2 చిత్ర వివాదం. శంకర్ నిర్మాతగా శింబుదేవన్ దర్శకత్వంలో వడివేలు హీరోగా నటించిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వడివేలుకు హీరోగా క్రేజ్ పెరిగింది. దీంతో అదే కాంబినేషన్లో ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి– 2 రూపొందించతలపెట్టారు. దీనికి సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగింది.అందుకోసం భారీ సెట్స్ వేశారు. అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రంలో నటించడానికి వడివేలు నిరాకరించారు. దీంతో శంకర్ నష్టపరిహారంగా రూ.4కోట్లు చెల్లించాలని వడివేలును డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా పంచాయితీ దశలోనే ఉంది. కాగా తాజాగా మధురై, పుదూర్కు చెందిన సతీష్కుమార్ వడివేలుపై పుదూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈయన పుదూర్లో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. కాగా ఈయన కార్యాలయంలో గోవిందరాజ్ అనే వ్యక్తి నిర్వాహకుడిగా పని చేస్తున్నాడు. కాగా గత ఒకటవ తేదీన తిరుప్పువనానికి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి మరొకరితో సతీష్కుమార్ కార్యాలయంలోని దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఉన్న నిర్వాహకుడు గోవందరాజ్పై దాడి చేశారు. డబ్బు సెటిల్మెంట్ చేయకపోతే నిన్నూ , సతీష్కుమార్ను నీటి ట్యాంకర్తో గుద్ది చంపుతామని బెదిరించారు. కాగా సతీష్కుమార్ ఇంతకు ముందు వడివేలు హీరోగా ఎలి అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా వడివేలు వద్ద మేనేజర్గా మణికంఠన్ పని చేస్తున్నాడు. కాగా ఆ చిత్ర లావాదేవీల్లో కారణంగానే నటుడు వడివేలు ప్రోద్బలంతో మణికంఠన్ సతీష్కుమార్ను బెదిరించినట్లు తెలిసింది. దీంతో సతీష్కుమార్ ఈ సంఘటనపై పుదూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నటుడు వడివేలును విచారించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
వడివేలుకు చుక్కెదురు
చెన్నై ,పెరంబూరు: హాస్యనటుడు వడివేలుకు ఆదాయ పన్ను శాఖ కమిటీలో చుక్కెదురైంది. ఆయన ఆ కమిటీకి చేసుకున్న అప్పీల్ తిరస్కరణకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే నటుడు వడివేలు ఆదాయ పన్ను శాఖకు సరైన లెక్కలు చూపకుండా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అందడంతో ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆయనకు చెందిన చెన్నై, మదురైలో గల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వడివేలు నటుడిగా బిజీగా ఉన్న సమయంలో 2010లో తను సినిమాకు పారితోషికంగా రూ.4లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు లెక్కలు చూపించాడు. అయితే సోదాల్లో రూ.లక్ష రొక్కం, రూ.50 లక్షల విలువైన ఆస్తులకు లెక్కలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పన్ను ఎగవేతకు పాల్పడినందుకుగానూ రూ.61.23 లక్షల జరిమానా చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. దీనిపై వడివేలు ఆదాయపన్ను శాఖ కమిటీలో అప్పీల్ చేసుకున్నాడు. అందులో.. తనకు నోటీసులు పంపడం సరికాదని, తనకు జారీ చేసిన జరిమానా నోటీసులను రద్దు చేయాల్సిందిగా కోరాడు. దీంతో ఆ కమిటీ వడివేలు అప్పీల్పై విచారణ జరపింది. అందులో వడివేలు ఆదాయపన్ను శాఖకు సరిగా పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డాడని రుజువు కావడంతో అతని అప్పీల్ను కొట్టివేసింది. దీంతో వడివేలు తనకు ఆదాయపన్ను శాఖ విధించిన రూ. 61.23 లక్షల జరిమానా చెల్లించి తీరాల్సిన పరిస్ధితి నెలకొంది. -
నేసమణి టీషర్టులకు గిరాకీ
పెరంబూరు: ఎంత పని చేశావయ్యా వడివేలు అని ప్రజలు అనుకంటున్నారు. నేసమణి పాత్రలో హస్య నటుడు వడివేలు ఫ్రెండ్స్ చిత్రంలో చేసిన వినోదాన్ని ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. విజయ్, సూర్య కలిసి నటించిన ఆ చిత్రంలో కాంట్రాక్టర్ నేసమణి పాత్రను పోషించిన వడివేలు నెత్తిపై నటుడు రమేశ్ఖన్నా సుత్తి పడేస్తాడు. దీంతో చచ్చానురా దేవుడో అంటూ వడివేలు పడిపోతాడు. కాగా ఫ్రెండ్స్ చిత్రం వచ్చి దశకం దాటినా ఈ కామెడీ సన్నివేశం ఇప్పటికీ పలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీ అవుతూనే ఉంది. ఆ నేసమణి కామెడీ సన్నివేశం దేశవ్యాప్తం అయ్యింది. ఇటీవల ఎన్నికల సమయంలో ఈ నేసమణి పాత్రపై సామాజిక మాధ్యమాల్లో మిమీస్ హల్చల్ చేశాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లలో ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ అంటూ పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో పత్రి అంశంపైనా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. కాగా వడివేలు పోషించిన నేసమణి పాత్ర ట్రెండీ అవడమే కాదు వ్యాపారంగా మారిపోయ్యింది. అవును నేసమణి తలపై సుత్తి పడేలా ప్రింటుతో తిరుపూర్ టీషర్టులు మార్కెట్లోకి వచ్చి హాట్కేక్లా అమ్ముడు పోతున్నాయి. విశేషం ఏమిటంటే ఈ టీషర్టులకు స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఏర్పడిందట. ఈ టీషర్టులను తిరుపూర్కు చెందిన ఆన్లైన్ వస్త వ్యాపారస్తుడు విమల్ తమారు చేస్తున్నాడు. నేసమణి పేరుతో టీషర్టులను తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందన్న విషయం గురించి అతను తెలుపుతూ గత మూడు రోజులు గా పేస్బుక్,ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి సా మాజిక మాధ్యమాల్లో నటడు వడివేలు నటించిన సేసమణి పాత్ర గురించే ట్రెండీ అవుతుండటంతో ఆ పాత్ర పేరుతో టీషర్టులు తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. అంతే కాటన్, పాలిస్టర్ క్లాత్లతో టీషర్టులను తయారు చేసి ఆన్లైన్లో పెట్టగా దేశ, విదేశాల నుంచి విపరీతంగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. -
నేను బాగుండటం ఇష్టం లేదా : వడివేలు
పెరంబూరు: హాస్య నటుడు వడివేలు పేరు విని చాలా కాలమైంది. హాస్యనటుడిగా ఓహో అని వెలిగిన వడివేలు గత శాసనసభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది.ఆ తరువాత నటుడు విజయకాంత్తో వైరం వల్ల అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూరం అయిన పరిస్థితి. కాగా వైగైపులిగా పిలవబడే వడివేలు గురువారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన్ని మీడియా చుట్టు ముట్టింది. వడివేలు మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఒక పెద్ద ఉత్సవానికి సమం అని పేర్కొన్నారు. ప్రజలు తెలివిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ప్రజలకు మంచి కాలం రాబోతోందని అన్నారు. ఎవరు అధికారం చేపట్టినా ప్రజలకు మంచి చేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ తాను బాగుండడం ఇష్టం లేదా? అని వడివేలు ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదా? అన్న ప్రశ్నకు అదంతా ఇప్పుడెందుకు? చిత్రం పూర్తి అయ్యింది. నమస్కారం చెబుతాం అని ఆయన ఆన్నారు. -
వడివేలు పాత్రలో యోగిబాబు?
తమిళసినిమా: నటుడు వడివేలు పాత్రను మరో నటుడు యోగిబాబు రీప్లేస్ చేయబోతున్నాడా? ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఈ విషయమే. వడివేలు ఒకప్పటి కామెడీ కింగ్. అలాంటి స్థాయిలో ఉండగా హీరోగా అవతారమెత్తాడు. అందుకు కారణం ప్రముఖ దర్శకుడు శంకర్నే. ఈయన ఎస్.ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో వడివేలును ఏకంగా ద్విపాత్రాభినయంలో హీరోగా పరిచయం చేశారు. దీనికి శంకర్ శిష్యుడు శింబుదేవన్ దర్శకుడు. ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో వడివేలు కామేడీ పాత్రలను పక్కన పెట్టేసి హీరో పాత్రలపైనే దృష్టి సారించాడు. శంకర్, దర్శకుడు శింబుదేవన్ పులికేసికి సీక్వెల్ను చేపట్టారు. వడివేలునే హీరో.ఈ చిత్రం కోసం చెన్నైలో బ్రహ్మాండ సెట్స్ వేసి షూటింగ్ తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఆ తరువాతనే వివాదాలు తలెత్తాయి. దర్శకుడికి, వడివేలుకు మధ్య భేదాభిప్రాయాలు కారణంగా ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చిత్రం కోసం వేసిన భారీ సెట్స్ కూలగొట్టాల్సిన పరిస్థితి. నిర్మాతగా దర్శకుడు శంకర్కు సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. దీంతో నిర్మాతల మండలి, నడిగర్సంఘంలో ఫిర్యాదులు, పంచాయితీలు చాలానే జరిగాయి. ఒక దశలో వడివేలు నష్టపరిహారం చెల్లించాలంటూ శంకర్ డిమాండ్ చేశారు. వడివేలుపై రెడ్ కార్డు పడనుందనే ప్రచారం జరిగింది. ఇంత రాద్ధాంతం తరువాత ఎట్టకేలకు వడివేలు మళ్లీ నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడనే ప్రచారం జరిగింది. అయితే చిత్ర షూటింగ్ మాత్రం మొదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు పాత్రలో నటుడు యోగిబాబును నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. యోగిబాబు గురించి చెప్పాలంటే ఇప్పుడు నంబర్వన్ కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. గత ఏడాదిలో ఇతను 10 చిత్రాల్లో నటించాడు. అంతే కాదు ఇప్పుడితను హీరోగా అవతారమెత్తాడు. ధర్మప్రభు అనే చిత్రంలో యముడుగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇతనికి పెద్ద అభిమాన గణమే ఉంది. దీంతో ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో వడివేలుకు బదులు యోగిబాబును నటింపజేసే అలోచనలో చిత్ర వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఇప్పటికీ వడివేలునే నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వడివేలు దిగి రాకపోతే యోగిబాబును లైన్లో పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. ఈ విషయంలో వాస్తవాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఆ టాప్ కమెడియన్ కథ ముగిసినట్టేనా?
కోలీవుడ్లో గౌండ్రమణి, సెంథిల్ తరం తరువాత సినిమాల్లో హాస్యాన్ని మరో కోణంలో ప్రేక్షకుల ముందుంచి పరవశింపజేసిన నటుడు వడివేలు. అలాంటి నటుడి వినోదానికి ఇక పుల్స్టాప్ పడినట్లేనా? పరిస్థితులు గమనిస్తే అలానే అనిపిస్తోంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన నటుడు వడివేలు. ఈ కామెడీ నటుడ్ని హీరోగా పరిచయం చేసింది దర్శకుడు శంకర్. ఆయనే వడివేలు హాస్య శకానికి ముగింపు పలికేలా ఉన్నారు. ఇందుకు వడివేలు స్వయంకృపరాధం కారణం అంటున్నారు. ఆ కథేంటో తెలుసుకోవాలనుందా?. స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా ఆయన శిష్యుడు శింబదేవన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి. ఈ చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును కథానాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వడివేలు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినా అవి బాక్సాపీస్ వద్ద పడకేశాయి. కాగా శంకర్ మళ్లీ హింసై ఆరసన్ 23 ఆమ్ పులికేసి చిత్ర యూనిట్తో దానికి సీక్వెల్ నిర్మించ తలపెట్డారు. చిత్రం కోసం భారీ సెట్లు వేసి షూటింగ్ను మొదలెట్టారు. కొన్ని రోజులు సవ్యంగా సాగిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల ఆగింది. అంతే ఆ ఆగడం ఇప్పటి వరకూ మళ్లీ జరగలేదు. ఇందుకు వడివేలు కాల్షీట్స్ కేటాయించక పోవడమే కారణంగా దర్శకుడు శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మండలి వడివేలకు నోటీసులు పంపి వివరణ కోరింది. అందుకు వడివేలు తన కాల్షీట్స్ను పులికేసి చిత్ర యూనిట్ వృథా చేశారన్నారు. ఆ చిత్రం కారణంగా తాను చాలా అవకాశాలను వదులకోవలసి వచ్చిందని వివరణ ఇచ్చారు. మళ్లీ నటించాలంటే అధనంగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. శంకర్ తన చిత్రాన్ని పూర్తి చేయకపోతే తాను ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ. 9 కోట్లను వడివేలు తనకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీన్ని నిర్మాతల సంఘం దృఢ పరచడంతో వడివేలు షాక్ అయ్యాడు. దీంతో తను పులికేసి చిత్రంలో మళ్లీ నటించడం మినహా మరో దారి లేదని చాలా మంది అనుకున్నారు. వడివేలు మాత్రం తాను ఆ చిత్రంలో నటించేది లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో నిర్మాతల సంఘం పులికేసి 2 చిత్రాన్ని పూర్తి చేసేవరకూ ఇతర ఏ చిత్రంలోనూ నటించరాదని వడివేలుపై రెడ్ కార్డ్ ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయమై వడివేలును సంప్రదించగా ఆయన ఈ విషయమై తనకు నిర్మాతల మండలి నుంచి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడివేలు ఏ చిత్రంలోనూ నటించడం లేదు. -
పులికేసికి లైన్ క్లియర్?
తమిళసినిమా: ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రానికి లైన్క్లియర్ అయ్యిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేసి స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి.శంకర్ శిష్యు డు శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో వడివేలుకు హీరోగా అవకాశాలు వచ్చేశాయి. అయితే ఆ తరువాత నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. అదే సమయంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న వడివేలు నటనకు దూరం అయ్యారు. చాలా గ్యాప్ తరువాత దర్శకుడు శంకర్ మరోసారి వడివేలుకు అవకాశం కల్పించి ఇంసై అరసన్కు సీక్వెల్గా ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు. అయితే చిత్రం సగంలోనే ఆగిపోయింది. కారణం వడివేలు కాల్షీట్స్ కేటాయించకపోవడమే. దీంతో శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కొంత కాలంగా సాగుతూ వస్తోంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వడివేలుతో సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారు. అయినా వడివేలు తన కాల్షీట్స్ను ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర యూనిట్ సరిగా వాడుకోకుండా వృథా చేశారని, ఇంకా ఆ చిత్రానికి డేట్స్ కేటాయించలేనని చెప్పేశారు. తాను మళ్లీ ఆ చిత్రం చేయాలంటే అదనంగా పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో శంకర్ తరఫున తాము ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి కొంత భాగం చిత్రీకరించడంతో సుమారు రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు, ఆ మొత్తాన్ని వడివేలు తమకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలిని కోరారు. ఇదే విషయాన్ని వడివేలుకు నిర్మాతల మండలి ఆదేసించింది. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని పూర్తి చేసే తీరాల్సిన పరిస్థితి నెలకొందని సినీ వర్గాల సమాచారం. అదే విధంగా ఆయన చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్లు తాజా టాక్. ఇదే గనుక నిజం అయితే ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి త్వరలోనే మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందన్నమాట. -
నటనా, రెడ్కార్డా?
తమిళ సినిమా: నటిస్తారా? రెడ్కార్డుకు సిద్ధ పడతారా? అంటూ నటుడు వడివేలుకు నిర్మాతల సంఘం అల్టిమేటం జారీ చేసిందా? దీనికి అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. విషయం ఏమిటంటే హాస్యనటుడిగా రాణిస్తున్న వడివేలును స్టార్ డైరెక్టర్ శంకర్ హీరోగా పరిచయం చేశారు. ఆయన ఎస్.ప్రొడక్షన్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 2006లో తన శిష్యుడు శింబుదేవన్ను దర్శకుడిగా పరిచయం చేసి ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు వడివేలుకు హీరోగా క్రేజ్ పెరిగింది. ఇక ఆ తరువాత హాస్య పాత్రల్లో నటించేది లేదంటూ ప్రకటించేశారు. హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రం విజయంతో దర్శకుడు శంకర్ ఆ చిత్రానికి సీక్వెల్ను నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీంతో శింబుదేవన్ దర్శకత్వంలోనే వడివేలు హీరోగా హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేశారు. అందుకోసం భారీ సెట్స్ వేశారు. వడివేలు ఈ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. చిత్ర షూటింగ్ ప్రారంభం అయి కొంత భాగం జరిగిన తరువాత వడివేలు సడన్గా తానీ చిత్రంలో నటించనని వైదొలిగారు. వడివేలు కథలో, కాస్ట్యూమ్స్ వంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై దర్శకుడు శంకర్ నిర్మాతల మండలి, నడిగర్సంఘానికి వడివేలుపై íఫిర్యాదు చేశారు. అందులో తన చిత్రంలో వడివేలును నటింపజేయాలని, లేని పక్షంలో తాను హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రం కోసం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.9కోట్లను ఆయన తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరారు. దీంతో నిర్మాతల మండలి నిర్వాహకులు, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి ఈ వ్యవహారంపై చర్చించారు. నటుడు వడివేలును వివరణ కోరుతూ లేఖ రాశారు. అయితే ఆ చిత్రం కోసం తాను కేటాయించిన కాల్షీట్స్ను వారు వృథా చేశారని, దీంతో తాను పలు ఇతర చిత్రాలను కోల్పోయి నష్టపోయానని, అందువల్ల ఇకపై హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో నటించలేనని బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల వడివేలుతో మరోసారి సమావేశమై చర్చలు జరిపారు. అప్పుడు వడివేలు తనను మరో రెండు కోట్లు అదనంగా చెల్లిస్తేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై గురువారం విశాల్ నేతృత్వంలో బృందం సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు వడివేలు ఎలాంటి నిబంధనలు విధించకుండా హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో నటించాలని, లేని పక్షంలో నష్టపరిహారంగా ఆ చిత్ర నిర్మాత శంకర్కు రూ.9 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు, అదీ కాకపోతే నటుడు వడివేలుపై ఇకపై ఏ చిత్రంలోనూ నటించకుండా రెడ్ కార్టు విధించేవిధంగా తీర్మానం చేసినట్లు సమాచారం. దీంతో వడివేలు మళ్లీ హింసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
విమల్తో వైగైపులి
తమిళసినిమా: యువ నటుడు విమల్తో కలిసి వైగైపులి వడివేలు నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న హాస్యనటుడు వడివేలుపై రెడ్ కార్డు పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఆయన మాత్రం అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా కొత్త చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా నటుడు విమల్తో కలిసి నటించనున్నారు. నటుడు విమల్ కథానాయకుడిగా నటించి నిర్మించిన మన్నర్ వగైయరా చిత్రం మంచి సక్సెస్ను అందించడంతో ఈయన కూడా ఇప్పుడు జోరు పెంచారు. మన్నర్ వగైయరా చిత్ర సక్సెస్తో పలువురు ప్రముఖ, యువ దర్శకులు విమల్తో చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే చిత్రాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న విమల్ ఈ ఏడాది అరడజను చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు ఎళిల్తో కలిసి ఒక చిత్రం, సురాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. సురాజ్ దర్శకత్వంలో పోలీస్అధికారి పాత్రలో నటించనున్నారు. ఇందులో వడివేలు ప్రధాన పాత్రలో నవ్వించడానికి రెడీ అవుతున్నారు. వెట్ట్రివేల్ చిత్రం ఫేమ్ వసంతమణి, తమిళన్ చిత్రం ఫేమ్ మజిత్ దర్శకత్వంలోనూ విమల్ నటించడానికి అంగీకరించారు. అదేవిధంగా మన్నర్ వగైయరా చిత్రం ఫేమ్ భూపతి పాండియన్ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ఇలా ఈ ఏడాది ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న కన్నిరాశి చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో నటి వరలక్ష్మీశరత్కుమార్ నాయకిగా నటిస్తున్నారు. సర్గుణం దర్శకత్వంలో నటిస్తున్న కలవాణి 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. చిత్రపరిశ్రమ సమ్మె కారణంగా నిలిచిపోయిన కలవాణి 2 చిత్రం మే 3 నుంచి మళ్లీ మొదలుకానుంది. -
వడివేలు మొండిపట్టు
సాక్షి సినిమా:ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రానికి వడివేలు మొండికేశారు. హాస్యనటుడిగా ఉన్న వడివేలు ఇంసైఆరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి శంకర్ నిర్మాత. శింబుదేవన్ దర్శకుడు. ఆ చిత్రం విజయం సాధించడంతో దానికి సీక్వెల్ను ప్రారంభించారు. అయితే కొంత షూటింగ్ జరిగిన తరువాత చిత్రానికి సమస్యలు వడివేలు రూపంలో మొదలయ్యాయి. శంకర్ వడివేలుపై నిర్మాతల మండలిలో, దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు. ఆ సంఘాలు విడివేలు వివరణ కోరుతూ లేఖలు పంపాయి. తాజాగా వడివేలు నటీనటుల సంఘానికి బదులు లేఖ రాశారు. అందులో.. తాను పులికేసి చిత్రంలో నటించడానికి 1–6–2016లో ఒప్పుకున్నానన్నారు. 2016 డిసెంబరు లోగా చిత్రాన్ని పూర్తి చేస్తామని, అప్పటివరకూ ఇతర చిత్రాల్లో నటించరాదని తనతో చెప్పారన్నారు. అయితే నిర్ణీత గడువులోగా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో తాను పలుసార్లు కాల్షీట్స్ ఇచ్చి పులకేశి చిత్రంలో నటించానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తన కాస్ట్యూమర్ ఎస్.ప్రకాశ్ను సంస్థ నుంచి తొలగించారని ఆరోపించారు. నిర్ణీత గడువు పూర్తయిన తర్వాత దురుద్దేశంతోనే తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటిస్తే తాను అంగీకరించిన పలు చిత్రాలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ వివరణపై నటీనటుల సంఘం, నిర్మాతల సంఘం వడివేలు లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి. -
అంతా మీ ఇష్టమేనా?
అంతా నటీనటుల ఇష్టమేనా? కథ నచ్చిందనో... పారితోషకం నచ్చిందనో... మరొకటో... ఏవేవో కారణాల వల్ల సినిమా ఒప్పుకుని, తర్వాత ‘తూచ్! నేనీ సినిమా చేయడం లేదు’ అనడం నటీనటుల ఇష్టమేనా?!! కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతల పరిస్థితేంటి? తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇప్పుడీ ప్రశ్నలే వేస్తోంది. అటువంటి నటీనటులపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెబుతోంది. చెప్పడమే కాదు... చేతల్లో చూపిస్తోంది! త్రిష, వడివేలు, శింబుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఇంతకీ, ఈ ముగ్గురూ ఏం చేశారంటే.... మీతో సెట్ కాదులే సామి! విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిష హీరోయిన్. ఇప్పుడు ఆ సిన్మాకి సీక్వెల్గా దర్శకుడు హరి ‘సామి స్క్వేర్’ తీస్తు న్నారు. విక్రమ్ హీరో. త్రిష, కీర్తీ సురేశ్లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే... కొన్ని రోజులు షూటింగ్ చేశాక ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని త్రిష సినిమాకి ‘గుడ్బై’ చెప్పేశారు. దాంతో చిత్రనిర్మాణ సంస్థ తమీన్స్ ఫిలిమ్స్ నిర్మాతల మండలికి కంప్లయింట్ చేసింది. త్రిష తప్పుకోవడంతో మాకెంతో నష్టం ఏర్పడిందని కంప్లయింట్లో పేర్కొన్నారు. పులికేసి... ప్రాబ్లమ్ ఏంటి? హాస్యనటుడు వడివేలు హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో దర్శకుడు శంకర్ ‘ఇమ్సై అరసన్ 23వ పులికేసి’ నిర్మించారు. తమిళంలో మంచి హిట్! తెలుగులో ‘హింసించే 23వ రాజు–పులికేసి’ పేరుతో విడుదల చేస్తే.. ఇక్కడా బాగానే ఆడింది. దానికి సీక్వెల్గా సేమ్ టీమ్ ‘ఇమ్సై అరసన్ 24వ పులికేసి’ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. త్రిషలా వడివేలుకి కూడా టీమ్తో ఏవో క్రియేటివ్ ప్రాబ్లమ్స్ రావడంతో షూట్కి రావడం మానేశారు. అప్పుడు చేద్దాం... ఇప్పుడు చేద్దామంటూ డేట్స్ ఇవ్వకుండా అలస్యం చేస్తున్నారట! మరోపక్క ఐదు కోట్ల రూపాయలతో సెట్ వేసిన యూనిట్ ఆయన కోసం వెయిట్ చేస్తోంది. చివరకు, చిరాకు వచ్చి నిర్మాతల మండలికి శంకర్ కంప్లయింట్ చేశారు. శింబు వల్ల 18 కోట్లు హాంఫట్!? త్రిష, వడివేలు ఇష్యూలతో కంపేర్ చేస్తే శింబుది డిఫరెంట్! ఈ యంగ్ హీరో ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’. మొన్న జూన్లో విడుదలైన ఈ సిన్మా ఫ్లాప్. అయితే విడుదలకు ముందు సినిమాను రెండు పార్టులుగా తీయనున్నట్టు వార్తలొచ్చాయి. అసలు మేటర్ ఏంటంటే... నిర్మాత సింగిల్ పార్టుగానే తీయాలనుకున్నారట! శింబు రెండు పార్టులు తీయాలని వాదించాడట! నిర్మాత కాదనే సరికి ఇప్పటివరకు నేను నటించిన సన్నివేశాలతోనే సినిమా విడుదల చేసుకోమని వదిలేశాడట! కట్ చేస్తే... శింబు షూటింగ్ చేసింది 29 రోజులే. దర్శకుడు ఏవో సర్దుబాట్లు చేసి సినిమా రెడీ చేశారు. ఫ్లాప్ కావడంతో నిర్మాతకు 18 కోట్లు నష్టం వచ్చిందట! శింబు ప్రవర్తన వల్లనే 18 కోట్లు హాంఫట్ అయ్యాయని చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలికి కంప్లయింట్ చేశారు. దాంతో నిర్మాతల మండలి ముగ్గురికీ నోటీసులు పంపించింది. వీళ్ల వివరణతో సంతృపి చెందకపోతే... ఒక్కొక్కరిపై రెండేళ్లు బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ!! -
కోర్టు బోనెక్కిన హాస్యనటులు
చెన్నై: ఎట్టకేలకు హాస్యనటుడు వడివేలు, సింగముత్తులు గురువారం కోర్టు బోనులో నిలబడ్డారు. వీరిద్దరి కేసు చాలా కాలంగా చెన్నై హైకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. వడివేలు, సింగముత్తు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఆ తరువాతే స్థలం కొనుగోలు వ్యవహారంలో శత్రువులుగా మారి ఒకరినొకరు విమర్శించుకున్నారు. నటుడు వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించారు. అయితే ఆ స్థలాన్ని నకిలీ దస్తావేజులతో కొనిపించి సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు చాలాకాలంగా హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 7వ తేదీన నటులు వడివేలు, సింగముత్తు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి మురళీధరన్ ఆదేశాలు జారీ చేసినా వారు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి 20వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో నిన్న వడివేలు, సింగముత్తు ఇద్దరు హైకోర్టులో హాజరయ్యారు. కాగా ఈ స్థల మోసం వ్యవహారంలో ఈ నటులిద్దరూ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అలాంటిదేమి జరగలేదని తెలియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
మంటగలిసిన మానవత్వం
తమిళసినిమా: ఎట్టకేలకు హాస్యనటుడు వడివేలు, సింగముత్తులు గురువారం కోర్టు బోనులో నిలబడ్డారు. వీరిద్దరి కేసు చాలా కాలంగా చెన్నై హైకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. వడివేలు, సింగముత్తు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఆ తరువాతే స్థలం కొనుగోలు వ్యవహారంలో శత్రువులుగా మారి ఒకరినొకరు విమర్శించుకున్నారు. నటుడు వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించారు. అయితే ఆ స్థలాన్ని నకిలీ దస్తావేజులతో కొనిపించి సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు చాలాకాలంగా హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 7వ తేదీన నటులు వడివేలు, సింగముత్తు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి మురళీధరన్ ఆదేశాలు జారీ చేసినా వారు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి 20వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో గురువారం వడివేలు, సింగముత్తు ఇద్దరు హైకోర్టులో హాజరయ్యారు. కాగా ఈ స్థల మోసం వ్యవహారంలో ఈ నటులిద్దరూ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అలాంటిదేమి జరగలేదని తెలియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
ఆర్కే, వడివేలు కాంబినేషన్ లో మరో చిత్రం
నటుడు ఆర్కే, వడివేలు కలిసి నటించిన ఎల్లాం అవన్ సెయల్, అళగర్ మలై చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ లో చిత్రం తెరకెక్కనుంది.నటుడు ఆర్కే ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తూ తన పాసరై బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం వైగై ఎక్స్ప్రెస్. నీతుచంద్ర, ఇనియ, కోమలశర్మ, సుజావరూణి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్కే.సెల్వమణి, ఎంఎస్.భాస్కర్, రమేశ్ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి షాజీకైలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 200 లకు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్కే తెలిపారు. వైగై ఎక్స్ప్రెస్ చిత్రం విడుదలకు ముందే మరో చిత్రాన్ని నిర్మించి, హీరోగా నటించడానికి ఆర్కే సిద్ధమయ్యారు. దీనికి నీయుమ్ నానుమ్ నడువుల పేయుమ్ అనే టైటిల్ను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో హాస్య పాత్రను నటుడు వడివేలు పోషించనున్నారని చెప్పారు.ఇంతకు ముందు తన్నీయిల్ గండం వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్ఎన్ .శక్తివేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. వినోదమే ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. ఈ చిత్రానికి రాజారత్నం ఛాయాగ్రహణం అందించనున్నారని ఆర్కే తెలిపారు. -
ఆ పాత్రకు నేనే కరెక్ట్!
ప్రేమలో ఓడిపోయిన యువకుడి పాత్రలో నటిం చడానికి తానే కరెక్ట్ అని నటుడు జై అన్నారని నవ దర్శకుడు మహేంద్రన్ రాజామణి చెప్పారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎనక్కు వాయ్త్త అడిమైగళ్. వాసన్ మూవీస్ పతాకంపై శ్యామ్ సుందర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జై కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి ప్రణీత నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో కరుణాకరన్, నవీన్, కాళీవెంకట్, నాన్ కడవుల్ రాజేంద్రన్, తంబిరామయ్య, వినీత, ఆర్ఎన్ఆర్.మనోహర్ నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా స్థానిక ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు మహేంద్రన్ రాజామణి మాట్లాడుతూ ఈ చిత్ర టైటిల్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది కాదన్నారు. చిత్రంలోని హీరో అభిమానానికి దాసోహం అయిన స్నేహితుల ఇతివృత్తమే చిత్ర కథ అన్నారు. ప్రేమలో ఓడిపోయిన హీరోతో అతని స్నేహితులు పడే కష్టాలే చిత్ర కథనం అన్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర కాస్త ప్రతినాయకి ఛాయలతో ఉంటుందన్నారు. ఈ పాత్రకు నటి ప్రణీతను సంప్రదించగా ఆమె అభ్యంతరం చెప్పకుండా అంగీకరించారని తెలి పారు. చిత్రంలోని ఒక పాటను ఎత్తైన కొండపై చిత్రీకరించదలచామన్నారు. అక్కడ హీరోయిన్కు కనీస సౌకర్యాలు లేవని, జీప్లో మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకోవలసి ఉంటుందన్నారు. అయి నా నటించడానికి సిద్ధపడిన ప్రణీతను అభినం దనలతో ముంచెత్తారు. ఇక నటుడు జై కు కథను చెప్పగా ప్రేమలో ఓడిపోయిన కథానాయకుడి పాత్రకు తానే కరెక్ట్ అని నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఇది బలమైన కథా చిత్రం కాకపోయినా రెండున్నర గంటల సేపు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నమ్మించే చిత్రంగా ఉంటుందని దర్శకుడు మహేంద్రన్ రాజామణి చెప్పారు. -
నాకు బిరుదులు వద్దు - విశాల్
‘‘నేను తీసిన ‘బొమ్మరిల్లు’ చిత్రాన్ని హరి చెన్నైలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు తను నిర్మించిన ‘ఒక్కడొచ్చాడు’ హిట్ కావాలని కోరుకుంటున్నా. ‘పందెంకోడి’ చిత్రంలో విశాల్ నటన సూపర్బ్. హార్డ్వర్క్ కారణంగానే తను సక్సెస్ అవుతున్నాడు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘కత్తి సండై’ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో జి.హరి ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. జగపతిబాబు విలన్గా నటించారు. ‘హిప్ హాప్’ తమిళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ‘దిల్’ రాజు విడుదల చేశారు. విశాల్ మాట్లాడుతూ- ‘‘లవ్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్న చిత్రమిది. సమాజంలోని ప్రతి మనిషి మైండ్కు ఓ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్తో మాట్లాడే అవకాశం ఈ చిత్రంలో వచ్చింది. ఐదేళ్ల తర్వాత వడివేలు గారు ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అభిమానులు నాకు ‘యాక్షన్ లెజెండ్’ బిరుదు ఇవ్వాలనుకుంటున్నారు. నాకు అవేవీ వద్దు.. విశాల్గానే ఉండాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘విశాల్ మంచి నటుడే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. తను నాకు స్ఫూర్తి’’ అని తమన్నా చెప్పారు. చిత్ర నిర్మాత హరి, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, సి. కల్యాణ్, మిర్యాల రవీందర్ రెడ్డి, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, దర్శకులు శ్రీవాస్, మెహర్ రమేశ్, హీరోయిన్లు శ్రీదివ్య, మెహరీన్ పాల్గొన్నారు. -
త్వరలో కత్తిసండై ఆడియో ఆవిష్కరణ
కత్తిసండై చిత్రం కోసం 12 కెమెరాలతో 7 రోజుల పాటు పోరాట దృశ్యాలను చిత్రీకరించినట్లు ఆ చిత్ర దర్శకుడు సురాజ్ తెలిపారు. నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయనతో తమన్నా రొమాన్స్ చేస్తున్న ఈ చిత్రంలో వడివేలు, సూరి వినోదాన్ని పండిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ జగపతిబాబు, బాలీవుడ్ నటుడు తరుణ్ ఆరోరా విలనిజాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో చరణ్ దీప్, జయప్రకాశ్, చిన్ని జయంత్, నిరోషా, దాడి బాలాజీ, ఆర్తీ, పావ లక్ష్మణన్ నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కనల్కన్నన్, దళపతి దినేష్, యాక్షన్ గణేశ్ మొదలగు ముగ్గురు స్టంట్మాస్టర్స్ పోరాట దృశ్యాలను కంపోజ్ చేయడం విశేషం. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతైమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజస్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయన దీనితో పాటు విక్రమ్ప్రభు, శాలిని జంటగా వీరశివాజీ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడం మరో విశేషం. కత్తిసండై చిత్ర వివరాలను దర్శకుడు సురాజ్ తెలుపుతూ ఈ చిత్రం కోసం ఇటీవల ఈసీఆర్ రోడ్డులో భారీ పోరాట దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ముఖ్యంగా విలన్లు జగపతిబాబు, తరుణ్ఆరోరాలను హీరో విశాల్ వేటాడి పట్టుకునే కారు, బైక్ చేజింగ్ సన్నివేశాలను 12 కెమెరాలతో 7 రోజుల పాటు చిత్రీకరించినట్లు తెలిపారు. బైక్ చేజింగ్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయన్నారు. జెట్ స్పీడ్గా సాగే కథ, కథనాలతో కూడిన కత్తిసండై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
కోర్టుకు హాజరుకావాలి
చెన్నై : ఈ నెల 27 న కోర్టుకు హాజరు కావలసిందిగా ప్రముఖ హాస్యనటుడు వడివేలును నామక్కల్ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకెళితే.. గత నెల 18న దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విశాల్ వర్గానికి మద్దతు తెలిపిన హాస్యనటుడు వడివేలు ఒక సమావేశంలో అసలు ఇప్పుడు దక్షిణ భారత నటీనటుల సంఘం ఉందా అంటూ సంఘాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ నామక్కల్ జిల్లా రంగస్థల సంఘం అధ్యక్షుడు రాజా అక్టోబర్ 27వ తారీఖున నామక్కల్ జిల్లా నేర విభాగ కోర్టులో ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి నటుడు వడివేలు ఈ నెల 20వ తారీఖున కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే శుక్రవారం వడివేలు కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరపు న్యాయవాది హాజరయ్యి వర్షాల కారణంగా వడివేలు కోర్టుకు హాజరుకాలేక పోయారని వివరించారు. దీంతో ఈ నెల 27న వడివేలు కోర్టుకు హాజరుకావలసిందిగా నామక్కల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
నా అందానికి ఎక్కడో ఉండాల్సింది
తొలి అడుగుతోనే తెలుగు, తమిళం భాషల్లో జయం అంటూ మంచి విజయాలను అందుకున్న నటి సదా. దీంతో ఈమె భవిష్యత్ బంగారు బాటే అనుకున్నారు. అలాగే వరుసగా అవకాశాలను అందుకుంటూ కొన్ని చిత్రాలు చేసేసింది సదా. తెలుగులో బాలకృష్ణ, తమిళంలో అజిత్, విక్రమ్, జయంరవి, మాధవన్ ప్రముఖ నటుల సరసన నటించేసింది. దీంతో సదా చిన్న నిర్మాతలకు అందని ద్రాక్షే అన్నంతగా ప్రచారం జరిగింది కూడా. అలాంటిది ఊహించని విధంగా ఆమెకు అవకాశాలు దూరం అయ్యాయి. కారణం ఏమైనా సదాను చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తమిళం సినిమా మరిచిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి సమయంలో హాస్యనటుడు వడివేలుతో యువళగీతం పాడడానికి సై అనడంతో ఒక్కసారిగా కోలీవుడ్ సదాపై దృష్టి సారించింది. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. నటి శ్రీయ మంచి ఫామ్లో ఉండగా హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్ స్టెప్స్ వేసి తన మార్కెట్ను చేతులారా చెడగొట్టుకున్నారు. అది స్వయంకృతాపరాధమేనని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. అసలు అవకాశాలే లేని సదా ఇప్పుడు అదే వడివేలు సరసన ఎలి చిత్రంలో నటిస్తోంది. మరి ఈమె లక్ ఎలా ఉంటుందో? అయితే ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నానంటున్న సదాతో చిన్న భేటీ ప్ర: నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు. అయినా మీకంటూ ఒక స్థాయికి చేరుకోలేక పోయారు. దీనిపై మీ స్పందన? జ: నిజమే నటిగా రంగప్రవేశం చేసి పదేళ్లు అయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ 35 చిత్రాల్లో నటించాను. అయినా ఇప్పటికీ నేను ఆశించిన పాత్ర లభించలేదు. అందుకు కారణం కూడా తెలియలేదు. ఇంకా చెప్పాలంటే నా ప్రతిభకు, అందానికి నేనుండాల్సిన స్థాయే వేరు. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. ఇకపై అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్ర: అజిత్, విక్రమ్ లాంటి పెద్ద హీరోలతో నటించిన మీరు వడివేలుతో నటించడం గురించి? జ: ఎలి మెగా బడ్జెట్ చిత్రం. మంచి హాస్య భరిత కథా చిత్రం. ఇందులో వడివేలుతో రొమాన్స్ సన్నివేశాలు ఉండవు. ఆయనకు నాకు మధ్య సాన్నిహిత్య సన్నివేశాలు చోటు చేసుకోవు కాబట్టే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాను. మరో విషయం ఏమిటంటే వడివేలు సరసన తెనాలిరామన్ చిత్రం లోనే నటించమని అడిగారు. అప్పుడు నేను నటించలేని పరిస్థితి. దాంతో నిరాకరించాను. ప్ర: ఈ చిత్రంలో వడివేలుతో కలిసి హిందీ పాటలో నటించార ట? జ: అది వడివేలు డ్రీమ్ సాంగ్. హిందీ చిత్రం ఆరాధనలో రాజేష్ఖన్నా, షర్మిళా టాగూర్ నటించిన మేరే సప్పునోంకి రాణి పాటకు ఆడాం. ఈ చిత్రంలో నాది క్లబ్ డ్యాన్సర్ పాత్ర. పాత తరం హీరోయిన్ల గెటప్. డ్రస్, హేర్ స్టయిల్, డ్యాన్స్ అంతా నాటి తరహాలో ఉంటాయి. ప్ర: సింగిల్ సాంగ్కు కూడా నటించడానికి సిద్ధం అయినట్లున్నారు? జ: ఇంతకు ముందు చాలామంది చిన్న చిత్రాలకు ఒక పాట కు నటించమని అడిగారు. వారందరికి నో చెప్పాను. మదగజరా జ చిత్రంలో విశాల్ సరసన నటించమని కోరడంతో కాదనలేక పోయాను. సహజంగా నేను డ్యాన్సర్ని కావడంతో ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ వచ్చినట్లుందే? జ: చంద్రముఖి చిత్రంలో నటించే అవకాశం మొదట నాకే వచ్చింది. నేను నటించలేని పరిస్థితి నెలకొనడంతో ఆ అవకాశం జ్యోతికను వరించింది. ఆ తరువాత మరో చిత్రంలో రజినీకాంత్ సరసన నయనతార నటించిన పాత్రలో నేను నటించాల్సింది. అదీ కుదరలేదు. అదే చిత్ర దర్శకుడు పి వాసు దర్శకత్వంలో కన్నడంలో చంద్రముఖి-2 లో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. నచ్చిన పాత్రలు లభించకపోవడంతో పెద్ద గ్యాప్కు కారణం. ప్ర: మైథిలి అనే తెలుగు చిత్రంలో గ్లామరస్ పాత్రలో విజృంభించారట? జ: ఆ చిత్రంలో పాటల సన్నివేశాల్లో కొంచెం గ్లామర్గా నటించిన మాట వాస్తవమే. ఆ సన్నివేశాల్నే కొందరు నెట్లో ప్రసారం చేయడంతో నేను అందాలారబోశానని ప్రచారం చేస్తున్నారు. ప్ర: బాయ్ ఫ్రెండ్ సంగతేమిటి ? జ: నేనొక చిత్రంలో నటిస్తే ఆ చిత్రం పూర్తి అయిన తరువాత అందుకు సంబంధించిన వారెవరితోనూ మాట్లాడను. అది నా పాల సి. నాకు బాయ్ఫ్రెండ్ లేరు. భవిష్యత్తులో సినిమా రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటానా? అన్నది చెప్పలేను. నేను ఎంచుకునేవాడు నన్ను నమ్మడం కంటే నాకు తనపై అధిక నమ్మకం కలగాలి. -
జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్
చెన్నై: వడివేలు అని పేరు వింటుండగానే చటుక్కున మన ముఖాల్లో నవ్వులు విరబూస్తుంటాయి. స్వతహాగా తమిళ హాస్య నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో ఆయన భాష పలికే తీరు, ఆ సమయంలో హావభావాలు కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అయితే, ఎప్పుడూ నవ్వించే ఆయన ఈసారి మాత్రం ఔరా అని అనిపించనున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఈసారి హీరోల మాదిరిగా గాల్లో ఎగురుతూ ఫైట్ చేయనున్నారు. అవి అలాంటిఇలాంటి పోరాటాలు కాదు.. ఏకంగా జాకీచాన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉండేలా ఆయన ఫైట్ చేయబోతున్నారు. ఎప్పుడూ తనను హాస్య నటుడుగానే చూసే ప్రేక్షకులు ఫైట్ చేసే హీరోగా చూడలేరని, తాను ఈసీన్ చేయలేనని చెప్పినా.. డైరెక్టరే స్వయంగా పట్టుబట్టి మరీ ఈ సీన్ చేయిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్ర డైరెక్టర్ యువరాజ్ స్వయంగా చెప్పారు. గత కొన్ని రోజులుగా తెరమరుగైనా వడివేలు ఇప్పుడు 'ఎలి' అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్రంలోనే ఈ పైట్లు కనిపించబోతున్నాయి. -
వడివేలుతో సదా
హాస్య నటుడు వడివేలు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో నటి సదా కోలీవుడ్కు రీ ఎంట్రీ అవుతున్నారు. తెనాలి రామన్ చిత్రం తరువాత వడివేలు హీరోగా నటిస్తున్న చిత్రం ఎలి.తెనాలిరామన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన యువరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎలి (ఎలుక)లక్షణాలతో వడివేలు కురిపించే హాస్యపు జల్లులే చిత్ర కథ అంటున్నారు దర్శకుడు. జయం రవికి జంటగా జయం చిత్రంలో కోలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన సదా ఆ తరువాత అజిత్, విక్రమ్, మాధవన్ వంటి స్టార్ హీరోలతో నాయకిగా నటించారు. తెలుగులోను జయం తదితర చిత్రాల్లో నటించిన సదాకు ఆ తరువాత బాలీవుడ్ ప్రయత్నాలు చేశారు. దీంతో దక్షిణాదిలో అవకాశాలు దూరమయ్యాయి. కోలీవుడ్లో సదా నటించిన చివరి చిత్రం పులివేషం. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ చిత్రంలో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకుందామనుకున్న సదా ఆశలు నీరుగారి పోయాయి. ఆ మధ్య విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రంలో సింగిల్ సాంగ్ సదా చేశారు. అనివార్య కారణాల వలన ఆ చిత్రం విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితిలో చాలా గ్యాప్ తరువాత ఈ భామ వడివేలు చిత్రం ఎలి చిత్రంలో ప్రత్యక్షం అవుతున్నారు. ఈ చిత్రంలో సదా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని దర్శకుడు యువరాజ్ వెల్లడించారు. చిత్ర షూటింగ్ సగభాగం పూర్తి అయ్యిందని, మే నెల కల్లా చిత్ర నిర్మాణం పూర్తి చేసి సమ్మర్ స్పెషల్గా ఎలిని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందించడం విశేషం. -
శ్రేయారెడ్డి రీ ఎంట్రీ
నటి శ్రేయా రెడ్డి గుర్తున్నారా? ఆ మధ్య తిమిరు (తెలుగులో పొగరు) చిత్రంలో ప్రతినాయకిగా దుమ్మురేపిన నటి ఈమె. అంతకు ముందు తమిళంలో హీరోయిన్గానూ అంతకంటే ముందు తెలుగులోనూ నటించిన శ్రేయా రెడ్డి నటుడు విశాల్ అన్నయ్య విక్రమ్ను పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. ఈమె మళ్లీ నటనపై దృష్టిసారించడం విశేషం. ఆండవ కానూన్ అనే చిత్రంలో శ్రేయా రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు వడివేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తన రీఎంట్రీ గురించి శ్రేయారెడ్డి తెలుపుతూ ఆండవ కనూన్ (దేవుని చట్టం) చిత్రంలో నటిద్దామా? వద్దా? అన్న శంకతోనే అంగీకరించానన్నారు. ఎందుచేతనంటే ఆ పాత్ర అంత క్రిటికల్గా ఉంటుందన్నారు. తేని నేపథ్యంలో సాగే గ్రామీణ కథా చిత్రం అని తెలిపారు. అయితే చిత్ర కథ విన్న విశాల్, విక్రమ్తో పాటు పలువురు తనను నటించమని ప్రోత్సహించారని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నారు. దర్శకుడు వడివేల్కు కథపై చాలా పట్టు ఉందని ఆయన చిత్రీకరణ విధానం చూస్తుంటే అర్ధం అయ్యిందని అన్నారు. చిత్రంలో నూతన జంట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని వారికి గత 90 రోజులుగా నటనలో శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. -
పరిష్కారమైన తెనాలి రామన్ సినిమా వివాదం
-
ఆ సన్నివేశాలు తొలగించండి
చెన్నై: తమిళ సినీ హాస్య నటుడు వడివేలుకు చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు తొలగించాలని ఆదేశించింది. ఈ చిత్రంలో కృష్ణదేవరాయలు పేరు, తెలుగు భాషను కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించి విడుదల చేసుకోవాలని హైకోర్టు సూచించింది. వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలను కించపరిచేవిధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని తెలుగు సంఘాలు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అభ్యంతకర సన్నివేశాలను తొలగించేందుకు నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశంపై తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
‘తెనాలిరామన్’పై ఆగ్రహం
చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీకృష్ణదేవరాయలను కించపరుస్తూ తమిళ సినీ హాస్య నటుడు వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిత్రాన్ని నిషేధించాల్సిందేని ముక్తకంఠంతో ఘోషించాయి. ఒకే తల్లిబిడ్డల్లా మెలగుతున్న తెలుగు, తమిళుల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు తమిళ సినీ పెద్దలు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వల్లువర్కోట్లం వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించాయి. పలు తమిళ సంఘాలకు చెందిన వారు సైతం ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం విశేషం. ఇండియన్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ, తెనాలి రామన్ చిత్రంపై తమ ఆందోళన కేవలం తెలుగుభాషా పరమైనది కాదని, ద్రవిడ సంస్కృతిని కాపాడుకునే యత్నమని అన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రే లేదని చిత్ర నిర్మాత, దర్శకులు ప్రకటించగా, సెన్సార్ అధికారి ఉందని చెప్పడం గమనార్హమని అన్నారు. సినిమా విడుదల సమయంలో తెలుగువారి ముసుగులో కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ అనుమానాన్ని ఎన్నికల కమిషన్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కాపాడుకునేందుకు పదిరోజులుగా అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కృష్ణదేవరాయల పాత్ర చిత్రీకరణ తమ సంస్కృతికి విరుద్దంగా ఉందని అన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చేందుకు కొందరు రెచ్చగొట్టే చర్చలు చేపడుతున్నారని ఆరోపించారు. తెలుగువారంటే ప్రత్యేక అభిమానమని చెప్పే సీఎం జయలలిత ఈ విషయంలో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ మేము ఆమెకు అండగా ఉన్నాం, ఈరోజు ఆమె మాకు అండగా నిలవాలని జయకు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.ప్రపంచ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి, పెరియార్ యూనివర్సిటీ సభ్యులు తంగటూరి రామకృష్ణ మాట్లాడుతూ, మొత్తం భారత దేశమే కీర్తించే శ్రీకృష్ణ దేవరాయల, తెనాలిరామకృష్ణల పాత్రలను సైతం అభ్యంతరకరంగా చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో ఈ చిత్రం విడుదలను నిలిపివేశారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఁఆహో అంధ్రభోజా శ్రీ కృష్ణదేవరాయ...రూ. అంటూ ప్రసిద్ద తెలుగుసినిమా గీతాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త ఆలపించారు. ద్రవిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ, తెలుగు, తమిళులు రాష్ట్రంలో పాలునీళ్లలా కలిసిపోయివుండగా, ఈ చిత్రం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేదిగా ఉందని అన్నారు. కొందరు బెదిరిస్తే తెలుగువారు భయపడిపోరని తమిళనాడు తెలుగమక్కల్ పేరవై అధ్యక్షుడు బాలగురుస్వామి వ్యాఖ్యానించారు. తమిళుడు అంటూ వడివేలును వెనకేసుకువచ్చే ఈ నేతలు మూడేళ్లుగా సినిమాలు లేని అతనికి ఏరకమైన అండగా నిలిచారని నిలదీశారు. ఐటీఎఫ్ కార్యదర్శి నందగోపాల్ తమిళంలో ప్రసంగించి నినాదాలు చేశారు. జార్ఖండ్ ముక్తిమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్ ప్రసంగించారు. ధర్నాలో టామ్స్ అధ్యక్షుడు గొల్లపల్లి ఇజ్రాయల్, శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శిగుంట శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
'వడివేలు సినిమాను అడ్డుకుంటాం'
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామన్గా ద్విపాత్రాభినయం చేసిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ చిత్రంపై వివాదం ముదురుతోంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రను జోకర్గా చిత్రీకరించడంపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాల ఐక్యవేదిక ఆందోళన కొనసాగిస్తోంది. ప్రధానపాత్ర పోషించిన వడివేలుకు వ్యతిరేకంగా తెలుగు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను చిత్రాన్ని కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు వడివేలుకు తమిళ చిత్రపరిశ్రమ బాసటగా నిలిచింది. కళాకారుడైన వడివేలు జోలికి వస్తే తమిళులంతా ఏకమవుతారని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ తెలుగు సంఘాల వారిని హెచ్చరించారు. -
వడివేలుకు అండగా కోలీవుడ్
తెనాలిరామన్ చిత్ర వ్యవహారం ఆ చిత్ర హీరో వడివేలుకు తమిళ చిత్ర పరిశ్రమ అండగా నిలబడుతోంది. కొన్ని తెలుగు సంఘాలు ఆయ న ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమం చేపట్టడాన్ని తమిళ సినీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, నిన్న దర్శకుడు గౌతమన్లు ఖండన తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. తాజాగా స్టంట్ మాస్టర్ జాగ్వర్ తంగం, వడివేలుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. జెకొవా ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై జోష్వా రేవదాస్ నిర్మిస్తున్న చిత్రం కాదల్ పంచాయిత్తు. నవ నటుడు రేవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వి.కలైశంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి జాన్సన్ సంగీత స్వరాలు కట్టారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లోనే జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు పేపరసు మాట్లాడుతూ నవ హీరోలు రజనీకాంత్లా బిల్డప్ ఇస్తూ నటించరాదన్నారు. తాను తిరుపాచ్చి చిత్రం రూపొందిస్తున్నప్పుడు ఆ చిత్రం కోసం నీఎంద ఊరు నాన్ ఎంద ఊరు అనే పాటను రికార్డ్ చేసి చిత్ర హీరో విజయ్కి వినిపించగా ఇంత బిల్డప్ పాట అవసరమా అంటూ అడిగారన్నారు. అప్పటికే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉన్నా ఆ పాటలో నటించడానికి సంకోచించారన్నారు. కాబట్టి వర్ధమాన హీరో తొలి రోజుల్లోనే ఓపెనింగ్ సాంగ్స్, పంచ్ డైలా గ్స్ అంటూ బిల్డప్ల జోలికి పోకుండా సహజత్వానికి ప్రాముఖ్యతనిస్తూ ఒక్కో మెట్టూ ఎదగాలని సూచిస్తున్నట్లు పేపరసు వ్యాఖ్యానించారు. అనంతరం స్టంట్ మాస్టర్ జాగ్వర్ తంగం మాట్లాడుతూ తెనాలి రామన్ వ్యవహారంలో కొన్ని సంఘాలు వడివేలుపై దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. దీన్ని తీవ్రం గా ఖండిస్తున్నామని అన్నారు. వడివేలుపై దాడి చేయాలని ప్రయత్నించినా? తెనాలి రామన్ చిత్ర విడుదలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలైపులి ఎస్.ధాను, పి.ఎల్ తేనప్పన్, పట్టియార్ శేఖర్, దర్శకుడు సురాజ్ పాల్గొన్నారు -
ముదురుతున్న వివాదం
చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామన్గా ద్విపాత్రాభినయం చేసిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రను జోకర్గా చిత్రీకరించినట్లు ఇటీవల విడుదలైన టీజర్ వల్ల తెలుస్తోం ది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన చెన్నైలో స్థిరపడిన తెలుగు వారు తమ అభ్యంతరాన్ని నిర్మాతకు తెలిపారు. జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు వినతిపత్రం సమర్పించారు. వీరిని ఖాతరు చేయని నిర్మాత చిత్ర విడుదలకు ముందే తెలుగు సంఘాల వారికి సినిమా చూపేది లేదని, సన్నివేశాలను తొలగించేది లేదని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు ప్రతిగా తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద పలువురు తెలుగు ప్రముఖులు ఈ నెల 5వ తేదీన సమావేశమై అభ్యంతర సన్నివేశాలు తొలగించకుండా సినిమాను విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమిళనాడు తెలుగు మక్కల్ పేరవై వారు అదే రోజున సాలిగ్రామంలోని వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వడివేలు జోలికొస్తే ఖబడ్దార్ కళాకారుడైన వడివేలు జోలికి వస్తే తమిళులంతా ఏకమవుతారని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ చెన్నైలోని తెలుగు సంఘాల వారిని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక తమిళ కళాకారుడు తన జన్మభూమిలోనే బెదిరింపులకు గురికావడం సహించబోమని పేర్కొన్నారు. నిజంగానే కృష్ణదేవరాయలను కించపరిచి ఉంటే తాము కూడా తెలుగు సంఘాల వారి పోరాటంలో గళం కలుపుతామని, ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడం తమ అభిమతం కాదని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రను వక్రీకరించలేదని నిర్మాత ప్రకటించారని, సినిమా ఇంకా విడుదల కాకుండానే పుకార్లను నమ్మి నిరసనలు చేయడం సమంజసం కాదని ఆయన వెల్లడించారు. రాజకీయ కారణాల వల్ల వడివేలుకు అండగాలేరనే అంశాన్ని తెలుగు సంఘాలు అవకాశంగా తీసుకుంటే తమిళులంతా ఏకమవుతారని హెచ్చరించారు. తమిళ కళాకారుడైన వడివేలును కాపాడుకోవడం మన బాధ్యత అంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయినా హద్దుమీరి ప్రవర్తిస్తే తెలుగు సంఘాల వారికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. -
వడివేలును బెదిరిస్తే తీవ్ర పరిణామాలు : సీమాన్
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. -
'రాజకీయ చదరంగం' ఎంతటి వారినైనా...
-
వడివేలు కుటుంబాన్ని పరామర్శించిన జగన్