VaraLakshmi SharathKumar
-
ఆస్తులు, అప్పులు వెల్లడించిన విరుదునగర్ ఎంపీ అభ్యర్థులు
చెన్నై: విరుదునగర్ అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆస్తులు, అప్పుడు వెల్లడించారు. బీజేపీ నాలుగో జాబితాలో లోక్సభ టికెట్ దక్కించుకున్న నటి 'రాధిక శరత్కుమార్', నటుడు & రాజకీయ నాయకుడైన విజయకాంత్.. కుమారుడు విజయ ప్రభాకరన్ DMDK తరపున విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారు. విరుదునగర్ నుంచి పోటీ చేయడానికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన రాధిక వద్ద రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు.. ఇలా మొత్తం రూ. 53.45 కోట్లు ఉన్నట్లు తెలిపింది. రాధిక రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం అప్పులు రూ. 14.79 కోట్లు ఉన్నట్లు సమాచారం. చెన్నై సిటీ కాలేజీకి చెందిన బీ ఆర్చ్ గ్రాడ్యుయేట్ అయిన విజయ ప్రభాకరన్ దగ్గర రూ. 2.50 లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, చరాస్తులు రూ.11,38,04,371 గా ఉన్నాయి. ప్రభాకరన్ మొత్తం అప్పులు రూ.12,80,78,587 వరకు ఉన్నాయని సమాచారం. ఈయన మొత్తం ఆస్తి రూ. 17.95 కోట్లు అని తెలుస్తోంది. -
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మీ శరత్కుమర్
-
సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్
‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. సమంత టైటిల్ రోల్లో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్మీట్లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్ విమన్ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మా మూవీ ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వరలక్ష్మీ శరత్కుమార్. హరి, హరీష్ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్కు లీడ్ కూడా ఉంది. అయితే సీక్వెల్ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ సక్సెస్ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్ చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్, క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మైఖెల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్కుమార్
విలన్ గ్యాంగ్లో రౌడీ లేడీ, న్యాయం చేయడానికి కృషి చేసే లాయర్... ఇలా నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్లతో దూసుకెళుతున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. తాజాగా ‘మైఖెల్’ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సందీప్ కిషన్ పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్గా రూపొందుతున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ విలన్గా నటిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
NBK107 నుంచి క్రేజీ అప్డేట్, బాలయ్యతో ‘జయమ్మ’ ఢీ!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' బ్లాక్బస్టర్ హిట్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఈ నెక్ట్ ప్రాజెక్ట్ ప్రముఖ డైరెక్టర్ గోపిచంద్ మిలినేనితో చేస్తున్న విజయం విధితమే. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన చిత్ర బృందం ఎన్బీకే 107నే వర్కింగ్ టైటిల్తో చిత్రాన్ని ప్రారంభించింది. చదవండి: మహేశ్ బాబు ట్వీట్కు రిప్లై ఇచ్చిన ‘పుష్పరాజ్’, ఫ్యాన్స్ ఫిదా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ని తీసుకున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఈ చిత్రంలో మరో విలన్ పాత్రకు పవర్ ఫుల్ లేడి పాత్ర ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా బుధవారం చిత్ర బృందం ఎన్బీకే 107 నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. చదవండి: Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఈ ప్రాజెక్ట్లో ప్రముఖ దక్షిణాది లేడి విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బాగస్వాయ్యం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెను సెట్స్లోకి ఆహ్వానిస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళనాట తిరుగులేని విలన్గా కొనసాగుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది ఆసక్తిగా మారింది. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొవచ్చు. ఇక తెలుగులోను తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లోను .. 'క్రాక్' సినిమాలో జయమ్మగాను ఆమె తన విలనిజాన్ని చూపించింది. ఇక బాలయ్యను కూడా ఆమె ఏ రేంజ్లో ఢీ కోట్టనుందో చూడాలి. Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board 💥💥 NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ — Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022 -
Tatvamasi: హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ‘తత్వమసి’
వరలక్ష్మీ శరత్ కుమార్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తత్వమసి’. రమణ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఈఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని గురువారం విడుదల చేసింది చిత్రబృందం. నల్లటి బ్యాక్గ్రౌండ్లో శ్రీచక్రం. దాని మధ్యలో ‘తత్వమసి’ అనే అక్షరాలపై ఎర్రని మరకలతో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, ఇషాన్, రాధాకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ'
చెల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవలె క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ జాంబిరెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జాంబీస్ లాంటి కొత్త జోనర్తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. ఇక మరో ఇంటట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం వరలక్ష్మి శరత్కుమార్ను సంప్రదించారట. ఇటీవలె తెలుగులో ఆమె నటించిన క్రాక్, నాంది సినిమాలకు మంచి ఆధరణ లభించింది. ముఖ్యంగా వరలక్ష్మి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. చదవండి : వైరల్ : షూటింగులో హీరో విశాల్కు తప్పిన పెద్ద ప్రమాదం సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు -
కరోనాపై వరలక్ష్మి శరత్కుమార్ అవగాహన
సాక్షి, చెన్నై: ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి గురించి ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు, వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా సంచలన నటి వరలక్ష్మి శరత్కుమార్ కరోనాపై అవగాహన కలిగించే విధంగా ద్విపాత్రాభినయం చేసిన వీడియో విడుదలైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్గా మారింది. ఇందులో ఆమె కరోనాపై పోరాటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. చదవండి: సోనూసూద్ సాయం: కరోనా బాధితుడికి కాన్సన్ట్రేటర్ -
చిరంజీవి ఫోన్ చేశారు: వరలక్ష్మీ శరత్కుమార్
‘‘నన్ను నేను ఓ ఇమేజ్ చట్రానికి పరిమితం చేసుకోవాలనుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేయకూడదని ఇండస్ట్రీలోకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నా.. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలం. నా దృష్టిలో నటన ఓ ఉద్యోగంలాంటిది. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది’’ అని నటి వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి మాట్లాడుతూ–‘‘నాంది’ సినిమాలో ఆద్య అనే క్రిమినల్ లాయర్ పాత్ర చేశా. ఆద్య పాత్ర నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. లాయర్ పాత్ర కాబట్టి భారీ డైలాగులు చెప్పాల్సి వచ్చేది. దీంతో స్కూల్ పిల్లల్లా రాత్రిళ్లు డైలాగ్స్ బట్టీ పట్టి, ఉదయం షూటింగ్కి వెళ్లేదాన్ని. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా విజయ్ ఈ కథ తయారు చేసుకున్నాడు. సౌత్లో 30కి పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించా.. ఇకపై కూడా నటిస్తాను. ఈ విషయంలో నటుడు విజయ్ సేతుపతిగారే నాకు స్ఫూర్తి. ఇటీవల విడుదలైన ‘క్రాక్’ సినిమాలో నేను నటించిన జయమ్మ పాత్ర బాగుందని నాన్నగారు(శరత్కుమార్) గర్వంగా ఫీలయ్యారు. చిరంజీవిగారు ఫోన్ చేసి ‘జయమ్మ పాత్రలో చక్కని నటన కనబరిచావు.. డబ్బింగ్ కూడా బాగుంది’ అని అభినందించడంతో చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్తో ఓ సినిమా చేస్తున్నా.. మరో రెండు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
కరోనాకి భయపడాలి
నటుడు శరత్కుమార్ ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయనకు నెగిటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా శరత్కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నాన్నను మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కరోనా అనేది ఎంత ప్రమాదమో కుటుంబంలో ఎవరికైనా పాజిటవ్ అని నిర్ధారణ అయినప్పుడే తెలుస్తుంది. అది ఎంత ఘోరమైన వైరస్సో తెలిసింది. అందుకే కరోనాకి భయపడాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. మాస్క్లు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన తండ్రికి వైద్యం చేసిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారామె. -
గోవాలో ఆటా పాటా
‘డాన్ శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నేటి నుంచి గోవాలో జరుగుతున్న చివరి షెడ్యూల్లో రవితేజ, శ్రుతీహాసన్లపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఒక ఇంటెన్స్ స్టోరీతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన ‘భూమ్ బద్దల్’ అనే ప్రత్యేక పాట బ్లాక్బస్టర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
జయమ్మకు బైబై
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా నటిస్తోన్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘క్రాక్’. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై మధు .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయమ్మ అనే కీలక పాత్రలో నటించారు వరలక్ష్మీ శరత్కుమార్. మంగళవారం తన క్యారెక్టర్కి సంబంధించిన షూటింగ్ ముగియడంతో జయమ్మ పాత్రకు బైబై చెప్పారు వరలక్ష్మీ. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా... ఇలా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అయిపోతారు వరలక్ష్మీ. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలు ఉండటం విశేషం. -
‘పెళ్లి చేసుకోను.. సినిమాలను వదలను’
మనసులో ఏం దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు నటి వరలక్ష్మి శరత్కుమార్. తనపై వచ్చే రూమర్లపై కూడా అలాంటి సమధానాలే ఇస్తారు వరలక్ష్మి. ఈ ఫైర్బ్రాండ్ వివాహం గురించి ఫిలింనగర్లో ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి వరలక్ష్మి పెళ్లి ముచ్చట ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వరలక్ష్మి ఓ బిజినెస్ మ్యాన్తో డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే సినిమాలను వదిలేసి.. పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వరలక్ష్మి వివాహం చేసుకోబోయే వ్యక్తికి ఇండియన్ క్రికెట్ టీమ్తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై స్పందించారు వరలక్ష్మి. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. అదేంటో నా పెళ్లి గురించి నాకే చివరగా తెలుస్తుంది. మళ్లీ అవే పుకార్లు. నా పెళ్లి గురించి ఎందుకు అందరికి ఇంత ఆసక్తి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. ఆ వార్తను ఇంటి పైకెక్కి అరిచి మరి అందరికి చెప్తాను. అప్పుడు దీని గురించి వార్తలు రాయండి. నేను పెళ్లి చేసుకోవడం లేదు.. సినిమాలు వదిలేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు వరలక్ష్మి.(మిమ్మల్ని మీరు నమ్మండి) Why am i the last to know that I'm getting married..??Hahahah the same nonsense rumors..why is everybody obsessed with me getting married..if I'm getting married I will shout it off the roof tops..to all u media ppl writing abt this..IM NOT GETTING MARRIED. IM NOT QUITTING FILMS pic.twitter.com/VimowM2pMR — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath) May 18, 2020 అయితే ఇన్నాళ్లు మీడియాలో విశాల్ - వరలక్ష్మిల వివాహం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఈ వార్తలను ఖండించేవారు. తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్లో విశాల్కు అనిశా రెడ్డితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.(విశాల్... నా ఓటు కోల్పోయావ్) -
పాటలే బ్యాలెన్స్
‘క్రాక్’ షూటింగ్ క్లైమాక్స్కు చేరుకుంది. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహ నిర్మాత. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది. అలాగే ఓ వారం రోజులు ప్యాచ్వర్క్ ఉంటుందట. షూటింగ్స్ చేయడానికి అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు పాటలను పూర్తి చేసి, వెంటనే రిలీజ్ కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ‘క్రాక్’ చిత్రబృందం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
కటారి క్రాక్
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్డౌన్ తర్వాత జరిపే చివరి షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
రొమాంటిక్ పోలీస్!
బీచ్లో ప్రేయసితో ప్రేమరాగం తీస్తున్నారట రవితేజ. ‘డాన్ శీను’(2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చీరాలలోని ఓ బీచ్లో జరుగుతోందట. అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరించే పనిలో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ పాట చిత్రీకరణకు ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్ను పూర్తి చేశారు రవితేజ. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే8న విడుదల కానుంది. -
మిమ్మల్ని మీరు నమ్మండి
హీరోయిన్.. లేడీ విలన్...క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా కథ రీత్యా ఎలాంటి పాత్రలోనైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా నటిగా ఒదిగిపోగలరు వరలక్ష్మీ శరత్కుమార్. ఇప్పటికి పాతిక సినిమాలను పూర్తి చేశారామె. ఈ సందర్భంగా ఓ పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేసి, తన భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు వరలక్ష్మి. ఆ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘మన జీవితంలో మంచి విషయాలు అంత సులభంగా జరగవు. కానీ మన కలలు నిజం కావాలి. అందుకే నేను శక్తి వంచన లేకుండా కష్ట పడుతుంటాను. ఇప్పుడు నా జీవితంలో నేను ఈ స్థాయిలో నిలబడటానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. 25 సినిమాలు పూర్తి చేసి నా కెరీర్లో ఓ బెంచ్మార్క్ను చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నన్ను సరిగా అర్థం చేసుకోలేని, నా పట్ల వ్యతిరేక భావనలను కలిగి ఉన్నవారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే... వీరి వల్లే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక–నిర్మాతలు, సహాయం చేస్తున్న నా స్టాఫ్ మెంబర్స్కు, అండగా ఉంటున్న నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్మి పని చేయండి. కలలు కంటూనే ఉండండి’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. తమిళంలో ఫుల్ బిజీగా ఉంటూ డబ్బింగ్ చిత్రాల్లో ప్రేక్షకులకు కనిపించే వరలక్ష్మి సందీప్కిషన్ ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో తెలుగులో తొలి స్ట్రయిట్ సినిమా చేశారు. ఇప్పడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
సరికొత్త కోణానికి నాంది
‘అల్లరి నరేష్ నూతన చిత్రం ‘నాంది’ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా, దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతగా పరిచయమవుతున్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ హీరోయిన్. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్నివ్వగా, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ‘అల్లరి’ నరేష్ మాట్లాడుతూ – ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. అందరూ కొత్తవారితో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నరేష్గారికి, సతీష్గారికి థ్యాంక్స్. క్రైమ్ థ్రిల్లర్లో సాగే కథ అయినప్పటికీ ఓ సామాజిక అంశాన్ని కూడా చర్చిస్తున్నాం’’ అన్నారు విజయ్ కనకమేడల. ‘‘ఈ నెల 22నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. మార్చిలో షూటింగ్ పూర్తి చేసి, వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘నరేష్గారిలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. ఈ సినిమాకు కథ: వెంకట్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిద్. -
పాత బస్తీలో డిష్యుం డిష్యుం
పాతబస్తీలో రౌడీమూకలను ర ఫ్ఫాడిస్తున్నారు ఆఫీసర్ రవితేజ. మరి ఆ రౌడీలు తప్పు తెలుసుకున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్కుమార్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఓ పెద్ద ఫైట్ని చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్లో సాగే ఈ ఫైట్ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ చక్కగా డిజైన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ సుమారు 25 శాతం పూర్తయిందని తెలిసింది. వేసవికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
జాతరలో క్రాక్
రికార్డింగ్ డ్యాన్స్లు, పాటలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. ఓ గుడికి సంబంధించిన జాతరతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంది. అప్పుడు అక్కడికి పోలీస్ డ్రెస్లో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. నెక్ట్స్ సీన్ను వెండితెరపై చూడాల్సిందే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్న చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రధారి. ఇందులో పోలీసాఫీర్గా నటిస్తున్నారు రవితేజ. ఈ నెల 21న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రస్తుతం జాతరకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రవితేజ, వరలక్ష్మీ శరత్కుమార్ ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి సహ – నిర్మాత. ‘క్రాక్’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆ హీరో సరసన వరలక్ష్మి..
హైదరాబాద్ : తమిళ ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వరలక్ష్మీ శరత్కుమార్ ఎన్నాళ్ల నుంచో టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్తో ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు ఆమె సిద్ధమయ్యారు. సందీప్ కిషన్, హన్సికా మోత్వానీలు ప్రధాన పాత్రల్లో కనిపించే ఈ సినిమాకు నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఆమె నటించిన తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే వరలక్ష్మి మరో తెలుగు సినిమాకు సైన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మాస్ మహారాజా తదుపరి సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరవనున్నారు. ఆర్టీ66 వర్కింగ్ టైటిల్గా రవితేజ, శ్రుతిహాసన్లు ప్రధాన పాత్రల్లో గోపిచంద్ మలినేని నిర్ధేశకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టాగూర్ మధు నిర్మించే ఈ సినిమా త్వరలో సెట్స్పై అడుగుపెట్టనుందని నిర్మాతలు ధ్రువీకరించారు. వరలక్ష్మి సహా పలువురు దిగ్గజ నటులు ఈ మూవీలో నటించనున్నారని సమాచారం. రవితేజ మరోసారి పోలీస్ అధికారిగా కనిపించే ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతారు. వరలక్ష్మి మారి 2, పందెం కోడి సహా పలు చిత్రాల్లో తన నటన, గ్లామర్తో ఆకట్టుకున్నారు. -
జోరు పెరిగింది
‘పందెంకోడి 2, సర్కార్’ వంటి తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో కీలకపాత్ర పోషించిన వరలక్ష్షీ్మ శరత్కుమార్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడామె డైరెక్ట్గా తెలుగు చిత్రాలకు సైన్ చేస్తూ టాలీవుడ్లో జోరు పెంచారు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్కుమార్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘రవితేజగారి సినిమాలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తారు. కాగా, సందీప్కిషన్ హీరోగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్’ వరలక్ష్మికి తొలి తెలుగు చిత్రం. తమిళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్బిజీగా ఉన్నారామె. -
కేసులు ఇవ్వండి ప్లీజ్
సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో లె రకెక్కిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో నటించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్ను తెనాలిలో ఆదివారం విడుదల చేశారు. ‘‘ఇంతకాలం రకరకాల భోజనాలు తిన్నట్టుగా అనిపించినా, ఈ సినిమాతో అమ్మ చేతి వంట తిన్నంత తృప్తిగా ఉంది. చాలాకాలం తర్వాత నా సినిమాను నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను’’ అని తెనాలిలో జరిగిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో అన్నారు సందీప్ కిషన్. బ్రహ్మానందం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాయికార్తీక్. -
జీవితంలో పెళ్లి చేసుకోను
‘ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడండి?’ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఇది. ‘ఇంకా ఆలోచించలేదు. నచ్చినవాడు దొరికినప్పుడు’ అంటూ సమాధానాలు ఇస్తుంటారు హీరోయిన్లు. వరలక్ష్మీ మాత్రం ‘అసలు పెళ్లి చేసుకునేది లేదు’ అంటున్నారు. అనుకున్నది, అనిపించినది ముక్కుసూటిగా చెప్పేయడం నటి వరలక్ష్మీ శరత్కుమార్కు అలవాటు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కన్ని రాశి’ అనే తమిళ సినిమాలో నటించారామె. ఈ సినిమా ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్లో మీరు ఎవర్ని పెళ్లాడతారు? అని ప్రశ్నించగా – ‘‘కన్ని రాశి’ స్క్రిప్ట్ చదవగానే నాకు నచ్చింది. ఇందులో లవ్ మ్యారేజ్ ప్రాముఖ్యతను ప్రస్తావించాం. కానీ నా జీవితంలో నేను ఎవ్వర్ని పెళ్లి చేసుకోను. పెళ్లి అనే సంప్రదాయాన్ని నేను పెద్దగా నమ్మను’’ అని అన్నారు. గతంలో విశాల్, వరలక్ష్మి రిలేషన్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. -
విశాల్... నా ఓటు కోల్పోయావ్
పెరంబూరు: నటుడు విశాల్, నటి వరలక్ష్మి మధ్య మంచి స్నేహసంబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య అంతకంటే ఇంకేదో బంధం ఉందనే ప్రచారం చాలా కాలం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటి వదంతులు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నటుడు విశాల్కు ఇంట్లో వాళ్లు హైదరాబాద్కు చెందిన అనీశారెడ్డి అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపించడంతో పుకార్లకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఫైర్బ్రాండ్గా పేరున్న నటి వరలక్ష్మిశరత్కుమార్ నటుడు విశాల్పై మండిపడ్డారు. ‘నీ సంకుచిత బుద్ధి బయట పడింది. నీపై నాకున్న గౌరవం తగ్గింది. ఇంకా సాధువులా నటించకు’ అంటూ ఆయనపై మాటల తూటాలు పేల్చారు. ఈ గొడవేంటో ఓ సారి చూద్దాం.. 2019–2022 ఏడాదికి గాను నడిగర్సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంఘ పదవులకు పోటీ పడుతున్న పాండవర్ పేరుతో విశాల్ జట్టు, స్వామి శంకర్దాస్ పేరుతో కే.భాగ్యరాజ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నారు. స్వామి శంకర్దాస్ జట్టు గురువారం నటుడు విజయకాంత్ను కలిసి మద్దతు కోరారు. శుక్రవారం నటుడు కమలహాసన్ను కలిశారు. కాగా పాండవర్ జట్టులో కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ఒక వీడియోను గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాదు నటి వరలక్ష్మి శరత్కుమార్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటుడు విశాల్ నడిగర్సంఘ మాజీ అధ్యక్షుడు శరత్కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై విమర్శలను గుప్పించారు. శరత్కుమార్, రాధారవి ఫొటోలను చూపిస్తూ వారి స్వప్రయోజనాల కోసం నాటక రంగ కళాకారుల శ్రేయస్సును పట్టించుకోలేదని, వారి అక్రమాలనుప్రశ్నించడానికే తాము ఈ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నాటక వృద్ధ కళాకారులకు అందిస్తున్న పింఛన్లు, నిర్మిస్తున్న సంఘ భవననిర్మాణం వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ వీడియోకు స్పందించిన నటి వరలక్ష్మిశరత్కుమార్ విశాల్పై మండిపడ్డారు. ఆమె తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. ‘మర్యాద గల విశాల్కు.. మీరు విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియోను చూసి మీరు ఎంతగా దిగజారిపోయారన్న విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురియ్యాను. మీపై ఉన్న కొంచెం మర్యాద, గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది. నా తండ్రిపై మీరు చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు ఎవరైనా నిరపరాధులే. నా తండ్రి నేరస్తుడే అయితే ఇప్పటికే జైలులో ఉండే వారు. కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి. ఇలాంటి నీచపు వీడియోలు మీ స్థా«యిని చూపుతున్నాయి. అయినా మిమ్మల్ని తప్పుపట్టలేం ఎందుకంటే మీరు పెరిగిన విధం అలాంటిదని భావిస్తున్నాను. ఇకపై కూడా సాధువులా చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు. మీ అబద్ధాలను, ధ్వంద మనస్థత్వాన్ని అందరూ గ్రహించారని భావిస్తున్నాను. మీరు నిజంగానే సాధువు అయితే మీ పండవర్ జట్టు సభ్యులు మీ నుంచి దూరం అయి మరో జట్టును ఏర్పాటు చేయరు. మీరు మంచి పనులు చేస్తే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నా తండ్రిని కించపరిచే కంటే, మీరు చేసిన మంచి కార్యాలను చెప్పి ఓట్లు అడుక్కోవచ్చు. ఇంత కాలం మిమ్మల్ని గౌరవించి ఒక స్నేహితురాలిగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాంటిది ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధించిన విషయాలతో వీడియో విడుదల చేయకుండా, ఇలా దిగజారి ప్రచారం చేసుకోవడం చాలా బాధనిపిస్తోంది. మీరు తెర వెనుక కూడా బాగానే నటిస్తున్నారనుకుంటున్నాను. మీరు నా ఓటును కోల్పోయారు. మీరు ఎప్పుడూ చెబుతున్నట్లు సత్యమే గెలుస్తుంది’ అని నటి వరలక్ష్మి శరత్కుమార్ నటుడు విశాల్పై మాటల దాడి చేశారు. వరలక్ష్మికి ఆ హక్కు ఉంది కాగా వీడియోను విడుదల చేసిన విశాల్పై నటి వరలక్ష్మి, నటి రాధికాశరత్కుమార్ చేసిన మూకుమ్మడి మాటల దాడి చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఇక విశాల్ వ్యతిరేకవర్గం దీన్ని బాగానే వాడుకుంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రం పాండవర్ జట్టు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ను స్థానిక ఆల్వార్పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం నటుడు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. నడిగర్సంఘంలో 30 ఏళ్లుగా జరగనిది తాము మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎందరు ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించారన్నది అందరికీ తెలుసన్నారు. ఇక నటి వరలక్ష్మి తనపై విసుర్ల గురించి స్పందిస్తూ ఆమె లాంటి ప్రతి స్నేహితులకు స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. నిసిగ్గుగా చెప్పిందే చెప్పడమా? విశాల్ వీడియోపై శరత్కుమార్ సతీమణి, నటి రాధికా శరత్కుమార్ ఘాటుగా స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ నెల 23న సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో పాండవర్ జట్టు విడుదల చేసిన వీడియోలో శరత్కుమార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, పలు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మూడున్నరేళ్ల ముందు చెప్పిన పాత పల్లవినే మళ్లీ సిగ్గు లేకుండా చెప్పడం బిచ్చగాడు వాంతి చేసుకున్నట్లు ఉంది. విశాల్ మీరు చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు నిరూపించారా? అయినా మీరు చేసిన ఫిర్యాదులు విచారణలో ఉండగా గతంలో చెప్పిన అసత్యాలు ఇప్పుడు నిజం అవుతాయా? మీపై వేయి కుళ్లిన గుడ్లు ఉండగా శరత్కుమార్ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నిర్మాతల మండలిలో డబ్బు అంతా ఖాళీ చేసి కోర్టు బోనులో నిలబడ్డారే, అలాంటి మీకు ఇలాంటి వీడియోను విడుదల చేసే అర్హత ఉందా? అంటూ రాధికాశరత్కుమార్ విశాల్పై విరుచుకుపడ్డారు. -
పాము ప్రేమిస్తే?
‘‘ఇప్పటి వరకు వచ్చిన పాము కథా చిత్రాలన్నీ పగ నేపథ్యంలో రూపొందాయి. కానీ, మా ‘నాగకన్య’ చిత్రం పాము నేపథ్య కథావస్తువు అయినప్పటికీ విభిన్నంగా ఉంటుంది. పగతో కాకుండా ప్రేమ నేపథ్యంలో సాగుతుంది’’ అంటున్నారు నిర్మాత కె.ఎస్.శంకర్ రావు. కమల్హాసన్ నటించిన తమిళ ‘నీయా’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం ‘నీయా–2’. జై హీరోగా, రాయ్లక్ష్మి, వరలక్ష్మీశరత్ కుమార్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’ పేరుతో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘నోము, దేవతలారా దీవించండి, దేవి, అమ్మానాగమ్మ’ వంటి పాము నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. మా సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాము కథాచిత్రాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాలేదు. మా సినిమానే తొలిసారి విడుదలవుతోంది’’ అన్నారు. ఎల్.సురేష్ మాట్లాడుతూ– ‘‘నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. కథ డిమాండ్ మేరకే గ్రాఫిక్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అన్నారు. -
కేసులు ఇవ్వండి ప్లీజ్
సందీప్ కిషన్ హీరోగా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ట్యాగ్ లైన్. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. హన్సిక, వరలక్ష్మీ శరత్కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం సందీప్కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ని చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్లో సందీప్ కిషన్ లాయర్గా కనిపిస్తున్నారు. ‘‘ఈ చిత్రాన్ని నాగేశ్వరరెడ్డి తనదైన స్టైల్లో లాఫింగ్ రైడర్గా రూపొందిస్తున్నారు. బుధవారం నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది’’ అని నిర్మాతలు తెలిపారు. బ్రహ్మానందం, మురళీశర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సాయిశ్రీరాం, సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల. -
నాగకన్య విన్యాసాలు
దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చిన కమల్హాసన్ చిత్రాల్లో ‘నీయా’ ఒకటి. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ అప్పట్లో మంచి హిట్. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా ‘నీయా 2’ రూపొందింది. తెలుగు వెర్షన్ టైటిల్ ‘నాగకన్య’. జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్. సురేష్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగు హక్కులను లైట్ హౌస్ సినీమ్యాజిక్ అధినేత కె.ఎస్. శంకర్ రావు దక్కించుకున్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థ్రిల్కి గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి పాముగా మారే సన్నివేశాలు, పాము చేసే విన్యాసాలు హైలైట్గా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు గ్రాఫిక్స్కి భారీగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో పిల్లలు, పెద్దలకు మంచి ఎంటర్టైనర్ అవుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
వేసవిలో నాగకన్య...
వరలక్ష్మీ శరత్కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా, జై హీరోగా నటించిన చిత్రం ‘నాగకన్య’. ఎల్. సురేష్ దర్శకత్వంలో జంబో సినిమాస్ బ్యానర్పై ఎ.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని వేసవి కానుకగా మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ లుక్స్కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వీరి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొచ్చేలా ఉంటుంది. మా చిత్రం ట్రైలర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ ఓ హైలైట్గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్ చేసేలా ‘నాగకన్య’ చిత్రం ఉంటుంది’’ అన్నారు. -
రయ్ రయ్
క్యారెక్టర్ నచ్చితే చాలు... హీరోయిన్గా, విలన్గా, సపోర్టింగ్ యాక్ట్రస్గా ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తాఉన్న నటి వరలక్ష్మీ శరత్కుమార్. తన తర్వాతి చిత్రం కోసం ఆమె బైక్ ఎక్కారు.. అదేనండీ.. రేసర్గా మారారు అని చెబుతున్నాం. కె. వీరకుమార్ దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘చేజింగ్’. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్లుక్ను విడుదల చేశారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి... వెండితెరపై బైక్ రేసర్గా రయ్ రయ్ అంటున్న వరలక్ష్మి స్పీడ్ ఎంతో తెలియాంటే కొన్ని రోజులు ఆగకతప్పదు. యమున, బాల, జెర్రోల్డ్, రఘు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దాసి సంగీత దర్శకుడు. -
ముసుగు తీసేద్దాం
‘‘మనందరం ముసుగులమే. ఇతరుల కోసం అబద్ధాలు ఆడుతూ, వాళ్లను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో మనం మనలా కాకుండా మరోలా ఉండే ముసుగు వేసుకుని బతుకుతున్నాం. ఆ ముసుగులు లేకుండా మనకు నచ్చినట్టుగా జీవించగలగాలి’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. వరలక్ష్మీకి ట్యాటూలంటే చాలా ఇష్టం. ఆల్రెడీ 7,8 ట్యాటూలను వేయించుకున్నారు కూడా. ప్రతి ట్యాటూకి ఓ స్టోరీ ఉంటుంది. లేటెస్ట్గా మరో రెండు ట్యాటూలకు తన శరీరం మీద చోటిచ్చారు. కొత్తగా వేయించుకున్న ఈ ట్యాటుల వెనక అర్థాన్ని వివరిస్తూ – ‘‘సినిమా మీద నాకున్న ఇష్టం, సినిమాల్లో ఉన్న ధీర మహిళలకు సపోర్ట్గా ఈ ట్యాటూలను వేయించుకున్నాను. మనం వేసుకున్న ముసుగులను ఉద్దేశిస్తూ మాస్క్ ట్యాటులు వేసుకున్నాను. ముసుగు వేసుకొని బతుకుతున్న మనందందరం ఏదో రోజు ఆ ముసుగుని తీసేద్దాం. మనల్ని మనమే ఇష్టపడటం నేర్చుకుందాం’’ అన్నారు వరలక్ష్మి. -
కోమలవళ్లి అంటేనే కోపం వస్తుంది
కోమలవళ్లి పేరు ఎవరు చెప్పినా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సర్కార్ చిత్రం రచ్చకు ప్రధాన కారణం ఈ పేరే. విజయ్ నటించిన చిత్రం సర్కార్ చిత్రంతో ఎంత వివాదం జరిగిందో తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ నేతల ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలకు సర్కార్ చిత్ర యానిట్ తలొగ్గి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను కట్ చేసింది. ముఖ్యంగా చిత్రంలో ప్రతినాయకి పాత్రకు కోమలవళ్లి అనే పేరు పెట్టడం సమస్యకు ప్రధాన కారణం. కారణం ఆ పేరు దివంగత ముఖ్యమంత్రి అసలుపేరు కావడమే.ఎట్టకేలకు సర్కార్ చిత్ర సమస్య సమసినా, రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. కోమలవళ్లి పేరు ఇప్పుడు సినిమా రంగంలో రచ్చకు కారణమైంది కానీ, చాలా కాలం క్రితమే రాజకీయపరంగా ఆగ్రహా జ్వాలలు పుట్టించింది. ఆ కథేంటే ఒక్క సారి చూద్దాం. 2002లో కాంగ్రెస్, తమిళ కాంగ్రెస్ పార్టీల కూటమి మదురైలో సమావే«శాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తూ జయలలిత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటుగా ఆరోపిస్తూ, ఇకపై ఎప్పుడూ అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని వెల్లడించారు. సోనియా వ్యాఖ్యలు జయలలితకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో ఆమెకు సవాల్ విసిరేలా వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నేత వాజ్పేయిని కలిశారు. అనంతరం ప్రతికా సమావేశంలో ప్రధానమంత్రి కావాలని ఆరాట పడుతున్నారు అడ్వేగే అంథోనియ మయినో అంటూ సోనియాగాంధీ అసలు పేరుతో దుయ్యబట్టారు. దీంతో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్లో అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జయలలిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అప్పుడాయన కోమలవల్లి, అమ్ము, జయలలిత అంటూ జయలలిత పేర్లను ప్రస్తవిస్తూ విమర్శించారు. అలా విమర్శల దాడిలో ఆ రాజకీయ నాయకుల అసలు పేరు బయట పడి చాలా మందికి తెలిసేలా చేసినా, మరో పక్క రాజకీయ ప్రకంపనలు పుట్టించాయనే చెప్పాలి. 16 ఏళ్ల అయిన తరువాత మళ్లీ ఇప్పుడు సర్కార్ చిత్రంతో కోమలవళ్లి పేరు ఆగ్రహజ్వాలలకు కారణమైంది. దినకరన్ కూడా అమ్మకు అలాంటి పేరు లేదని అంటున్నారు. అదే నిజమైతే కోమలవళ్లి పేరు ఎందకింత కలకలానికి దారి తీస్తోందన్నదే అంతు చిక్కని ప్రశ్న. -
భారీ కటౌట్
అభిమాన హీరో సినిమా విడుదలవుతోందంటే ఫ్యాన్స్కి పండుగే. హీరో కటౌట్లు పెట్టి, ఫ్లెక్లీలు కట్టి బాణసంచా కాల్చుతూ సందడి చేస్తుంటారు. తమిళ హీరో విజయ్కి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తమిళనాడులోనే కాదు.. కేరళలోనూ ఆయనకు అభిమానులున్నారు. తాజాగా విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేరళకు చెందిన కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్ను రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్– డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లు. కళానిధి మారన్ నిర్మాత. ఈ చిత్రాన్ని నిర్మాత అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు(మంగళవారం) విడుదల కానున్న ఈ సినిమాపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. కర్ణాటక, కేరళలో దీపావళి రోజున 24 గంటలు సినిమాను ప్రదర్శించేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంటే దీపావళి రోజున ఒక్కో థియేటర్లో ‘సర్కార్’ వరుసగా 8 షోలు ప్రదర్శించబోతుండటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్. రెహమాన్. -
ఎదిరిస్తే అంతే
అతనొక కార్పొరేట్ దిగ్గజం. ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఓటు వేయడం కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పనిగట్టుకుని ఎన్నికల కోసం భారత్కి రావడానికి కారణమేంటి? ఇక్కడ ఏం చేశాడు? అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ కథానాయికలు. ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని తెలుగులో విడుదల చేస్తున్నారు.నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అశోక్ వల్లభనేని మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్హిట్ సినిమా తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ‘సర్కా ర్’. ‘కత్తి, తుపాకీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు హ్యాపీగా ఉంది. రెహమాన్ చక్కని స్వరాలు అందించారు’’ అన్నారు. -
‘పందెం కోడి 2’ మూవీ రివ్యూ
టైటిల్ : పందెం కోడి 2 జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విశాల్, కీర్తి సురేష్, రాజ్ కిరణ్, వరలక్ష్మీ శరత్కుమార్ సంగీతం : యువన్ శంకర్ రాజా దర్శకత్వం : లింగుసామి నిర్మాత : విశాల్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న విశాల్, ఈ సారి ఓ సీక్వెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2005లో రిలీజ్ అయి తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన పందెం కోడి 2తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 13 ఏళ్ల తరువాత తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? విశాల్ నటిస్తూ నిర్మించిన పందెంకోడి 2తో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ ; రాజా రెడ్డి (రాజ్ కిరణ్) కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి. ఏడేళ్ల క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ(వరలక్ష్మీ శరత్ కుమార్) భర్త హత్యకు గురవుతాడు. తన భర్తను చంపిన వారి కుటుంబంలో అందరినీ చంపేసిన భవానీ మనుషులు రాజా రెడ్డి అడ్డుపడటంతో గోపి అనే కుర్రాన్ని మాత్రం చంపలేకపోతారు. అందుకే ఆ కుర్రాన్ని కూడా జాతరలోనే చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటుంది భవానీ. ఏడేళ్లుగా జాతర చేయకపొవటంతో ఊళ్లల్లో కరువు తాండవిస్తుంది. దీంతో ఈ సారి ఎలాగైనా జాతర చేయాలని అన్ని ఊళ్ల పెద్దలను ఒప్పించి జాతర పనులు మొదలు పెడతాడు రాజా రెడ్డి. ఏడేళ్లుగా ఈ గొడవలకు దూరంగా ఉన్న రాజా రెడ్డి కొడుకు.. బాలు(విశాల్) కూడా జాతర కోసం ఊరికి వస్తాడు. జాతర మొదలైన నాలుగో రోజు గోపిని కాపాడే ప్రయత్నాల్లో రాజారెడ్డి గాయపడతాడు. ఈ విషయం ఊరి ప్రజలకు తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వరని భయంతో ఊళ్లో జనాలకు రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని చెప్పుకుండా దాచిపెట్టి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు బాలు. జాతర పూర్తయ్యే వరకు బాలు అసలు విషయం ఊరి ప్రజలకు తెలియకుండా ఆపగలిగాడా..? రాజా రెడ్డి మాట ఇచ్చినట్టుగా బాలు, గోపి ప్రాణాన్ని కాపాడాడా..? అనుకున్నట్టుగా జాతర సజావుగా జరిగిందా..? చివరకు భవానీ కథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విశాల్ మరోసారి తనదైన మాస్ యాక్షన్తో మెప్పించాడు. పందెం కోడి తొలి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో విశాల్ నటన, యాక్షన్ అన్ని సూపర్బ్ అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో విశాల్ నటన ఆకట్టుకుంది. హీరోయిన్గా కీర్తి సురేష్కు మరో మంచి పాత్ర దక్కింది. తను గతంలో చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కీర్తి ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ను అలరించింది. రాజా రెడ్డి పాత్రలో రాజ్కిరణ్ ఒదిగిపోయారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు మరింత హుందాతనం తీసుకువచ్చాయి. నెగెటివ్ రోల్ వరలక్ష్మీ నటన సూపర్బ్. వరలక్ష్మీ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇతర నటీనటులంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ : 2005లో పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న లింగుస్వామి సీక్వెల్ లో కాస్త తడబడ్డాడు. మరీ అవుట్ డేటెడ్ కథా కథనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ తరహా ఫ్యాక్షన్ కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే విశాల్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా అంతా కేవలం వారం రోజులు పాటు జరిగే ఓ జాతరకు సంబంధించిన కథ కావటంతో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. విశాల్, కీర్తి సురేష్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అలరిస్తాయి. యువన్ శంకర్ రాజా సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవటం నిరాశపరిచే అంశమే. కేఏ శక్తివేల్ సినిమాటోగ్రఫి సినిమాకు పెద్ద ఎసెట్. జాతర వాతావరణాన్ని, యాక్షన్ ఎపిసోడ్స్ను అద్భుతంగా తెరమీద చూపించారు. ఎడిటింగ్, ఆర్ట్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. విశాల్ నిర్మాతగానూ మంచి మార్కులు సాధించాడు. సినిమా అంతా జాతర వాతావరణంలో చిత్రీకరించటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. విశాల్ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్తో సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ ; విశాల్ నటన యాక్షన్ ఎపిసోడ్స్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ ; రొటీన్ స్టోరి నేటివిటి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
దీపావళికి సర్కార్
‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. కళానిధి మారన్ నిర్మించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్హిట్ తర్వాత ‘సర్కార్’ లాంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళంలో విడుదలైన ఫస్ట్ లుక్కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్ నిర్వహించి, నవంబర్ 6న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. -
ఆ అర్హత విశాల్కి ఉంది
‘‘గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్. తనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని. పొల్లాచ్చిలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ రెక్కీకి వెళ్లినప్పుడు నాకు రూమ్ లేకపోవడంతో విశాల్ తన రూమ్కి తీసుకెళ్లి, బెడ్ నాకు ఇచ్చి, నేలపై పడుకోవడానికి రెడీ అయ్యాడు. పురట్చి దళపతి (విప్లవ సేన నాయకుడు) అని విశాల్ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకు అర్హత ఉంది’’ అని డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ అన్నారు. విశాల్ హీరోగా, కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్కుమార్ హీరోయిన్లుగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్ను నటి లక్ష్మీప్రసన్న, ఆడియో సీడీలను క్రిష్ విడుదల చేశారు. ఈ వేడుకలో కొంత మంది రైతులకు విశాల్ ఆర్థిక సాయం చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘నాన్న జి.కె.రెడ్డిగారు, అన్నయ్య విక్రమ్ కృష్ణగారి వల్లే ఓ నటుడిగా మీ ముందు గర్వంగా నిలబడి ఉన్నా. ‘పందెంకోడి’ ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను మరో 25 సినిమాలు చేసేలా నా 25వ సినిమా ‘పందెంకోడి 2’ ఉంటుంది. ‘పందెంకోడి 3’ చేయడానికి మళ్లీ 13 ఏళ్లు కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా సమర్పకులు ‘ఠాగూర్’ మధుగారు నా తర్వాతి సినిమా నిర్మాత. నా ప్రతి సినిమాకు టికెట్పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్లో ఒక రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. నాకు థియేటర్ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అన్నారు. ‘‘విశాల్, నా కాంబినేషన్లో ‘పందెంకోడి 3’ కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లింగుస్వామి. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘లగడపాటి’ శ్రీధర్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రచయిత ఆకుల శివ, కథానాయికలు కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్కుమార్ పాల్గొన్నారు. చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘పందెం కోడి’ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. ఎత్తుకు పై ఎత్తు వేసి విలన్స్ని హీరో ఎలా ఢీ కొన్నాడు అన్నదే కథ. జయాపజయాల నుంచి నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేం. డిజిటల్ కంటెంట్తో థియేట్రికల్ రెవెన్యూ తగ్గినా డిజిటల్ మార్కెట్లో వచ్చే రెవెన్యూ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. విశాల్తో తమిళంలో ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నా. నిఖిల్తో చేస్తోన్న ‘ముద్ర’ షూటింగ్ పూర్తి కాబోతోంది’’ అన్నారు. -
పులిముందు వేషాలా?
‘కత్తిని చూసి భయపడటానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డని’, ‘జాతరలో పులివేషాలు వేయొచ్చు..కానీ, పులిముందే వేషాలు వేయకూడదు’... ‘పందెంకోడి 2’ చిత్రంలోని ఇలాంటి డైలాగులు విశాల్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్కుమార్, రాజ్కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ–‘‘ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. రేపు(ఆదివారం) హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
గొంతు పోయింది!
ఇప్పటి హీరోయిన్లలో కొందరు తమ పాత్రకు తమ గొంతునే వినిపించుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసమే కొంచెం కష్టమైనా శ్రద్ధగా పరభాషను నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్లోకి వరలక్ష్మీ శరత్కుమార్ కూడా జాయిన్ అయ్యారు. అంతే కాదు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’, విశాల్ ‘పందెం కోడి 2’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు వరలక్ష్మీ. ఈ రెండు సినిమాలకు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారామె. ‘‘డబ్బింగ్ చెప్పీ చెప్పీ గొంతు పోయింది. కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. ‘పందెం కోడి 2’ ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. సూపర్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ‘సర్కార్’ నవంబర్లో రానుంది. -
నిర్మాతలు సినిమాకి ఊపిరిలాంటోళ్లు
2005లో విడుదలైన సూపర్హిట్ చిత్రం ‘పందెం కోడి’తో అటు తమిళ్లోను ఇటు లె లుగులోను విశాల్ మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఆ హిట్ ఫీట్ని సాధించటానికి రెడీ అయ్యారు చిత్రదర్శకుడు లింగుస్వామి, హీరో విశాల్. ‘పందెం కోడి’కి సీక్వెల్గా ఈ హిట్ కాంబినేష్న్లో రూపొందిన ‘పందెం కోడి 2’ అక్టోబర్ 18న తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో ప్రముఖ పంపిణీదారుడు నారాయణదాస్ నారంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో 25 సినిమాలు పూర్తయ్యాయి. నేనీ రోజు మీ (ప్రేక్షకులు) ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు, మా అన్నయ్య విశాల్కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్ ప్రారంభించాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నా 25 సినిమాల ప్రయాణంలో ప్రతి చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. నిర్మాతలు సినిమాలకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెం కోడి 2’ కథ విషయానికొస్తే... ఏడు రోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో ఈ సీక్వెల్ రూపొందింది. ‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో నటనను ప్రదర్శించిన కీర్తీ సురేశ్ మా సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించింది. ‘పందెం కోడి’ పార్ట్ 3 చేస్తే అందులో కూడా కీర్తీనే హీరోయిన్. వరలక్ష్మీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. రాజ్కిరణ్గారు చాలా హుందాగా నటించారు. తెలుగులో మా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్న ‘ఠాగూర్’ మధు గారికి థ్యాంక్స్’’ అన్నారు. లింగుస్వామి మాట్లాడుతూ– ‘‘విశాల్లోని ఎన ర్జీ లెవెల్స్ను ‘పందెం కోడి’లో చూపించాను. ఈ సీక్వెల్లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సీక్వెల్కి ఇంత గ్యాప్ రావటానికి కారణం మీరా జాస్మిన్లా నటించే హీరోయిన్, లాల్లా విలనిజమ్ చూపించే నటులు కోసం వెయిట్ చేయడమే’’ అన్నారు. ‘‘మహానటి’ తర్వాత ఆ రేంజ్లో తృప్తినిచ్చిన చిత్రమిది. అక్టోబర్ 17 నా బర్త్డే, సినిమా 18న విడుదలవుతుంది. నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్గా భావిస్తున్నాను’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘ఇది నాకు స్పెషల్ మూవీ’’ అన్నారు వరలక్ష్మీ. ‘‘విశాల్ అసోసియేషన్లో చేస్తున్న తొలి సినిమా ఇది. మొదటి భాగం కంటే రెండో భాగం ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, అనిల్ సుంకర, బీవీయస్ఎన్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, టీయంసి సుమన్, వీరినాయుడు, ముత్యాల రామదాస్ తదితరులు పాల్గొన్నారు. -
పండగకి పందెం
విశాల్, మీరాజాస్మిన్ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ సినిమా విశాల్ కెరీర్కి టర్నింగ్ పాయింట్తో పాటు తెలుగులో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను తీసుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన 12ఏళ్ల తర్వాత సీక్వెల్గా విశాల్–లింగుస్వామి కాంబినేషన్లో ‘పందెంకోడి 2’ తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై తెరకెక్కుతోన్న ‘పందెం కోడి 2’ చిత్రం ట్రైలర్ని రేపు (శనివారం) విడుదల చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్కుమార్, రాజ్కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా, కెమెరా: కె.ఎ.శక్తివేల్, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా. -
అమావాస్య చందమామ!
కథానాయికలు కేవలం గ్లామర్కి మాత్రమే అంటే అస్సలు ఒప్పుకోరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారామె. ఇందులో భాగంగా ఇటీవల అంధురాలిగా నటించడానికి కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజపార్వై’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు చిత్రబృందం. 1981లో వచ్చిన కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ‘రాజపార్వై’ సినిమా ‘అమావాస్య చంద్రుడు’ టైటిల్తో తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంటే వరలక్ష్మీ అమావాస్య చందమామగా కనిపించబోతోందా?. చూపు లేని అమ్మాయిగా కనిపించడానికి వరలక్ష్మీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంధురాలిగా నటించడం ఓ సవాల్ అంటే.. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తారు వరలక్ష్మీ. అందుకోసం కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తమిళ హీరోయిన్స్లో ఫుల్ బిజీ యాక్టర్ కూడా వరలక్ష్మీనే. సుమారు 4–5 సినిమాలతో బిజీగా ఉన్నారు. -
పులి మేక కలిసి ఆడే ఆట!
గతేడాది విశాల్ హీరోగా తమిళంలో నటించిన ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజై హిట్ సాధించింది. అలాగే ఈ ఏడాది ఆయన నటించిన ‘ఇరంబుదురై’ కూడా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఇప్పుడు విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సండై కోళి 2’. లింగుస్వామి దర్శకత్వం వహించారు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. విశాల్– లింగుస్వామి కాంబినేషన్లోనే 2005లో వచ్చిన ‘పందెం కోడి’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇది విశాల్ కెరీర్లో 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్స్తో పాటు టీజర్ను రిలీజ్ చేశారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై రూపొందిన ‘పందెం కోడి 2’ చిత్రాన్ని విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘ఇది పులి, మేక ఆట కాదు. పులి, మేక కలిసి ఆడే ఆట’, ‘ నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడం మాత్రమే మొదలుపెట్టాను’ అనే డైలాగ్స్ బాగున్నాయి’’అని సమర్పకులు ‘ఠాగూర్’ మధు అన్నారు. -
మీసం మెలేసిన మారి
గుమ్మడికాయ కొట్టి మీసం మెలేశారు మారి అండ్ గ్యాంగ్. ‘మారి 2’ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడమే వాళ్ల సంతోషానికి కారణం. ధనుష్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మారి 2’. ధనుష్, బాలాజీ మోహన్ కాంబినేషన్లోనే 2015లో వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటించారు. వరలక్ష్మీ శరత్కుమార్, విద్యా ప్రదీప్ కీలక పాత్రలు చేశారు. ‘‘మళ్లీ మారిగా నటించడం ఆనందంగా ఉంది. సెట్లో బాగా ఎంజాయ్ చేశా. షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అని పేర్కొన్నారు ధనుష్. ‘‘సిల్వర్ స్క్రీన్పైకి మారి మళ్లీ వస్తున్నాడు. ఫన్నీగా షూటింగ్ గడిచిపోయింది. మారిని మిస్ అవుతున్నాం’’ అన్నారు దర్శకుడు బాలాజీ మోహన్. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
తంగమాన పొన్ను
...అని పొగుడుతున్నారట కీర్తీ సురేశ్ను ‘సండై కోళి 2’ (పందెం కోడి 2) టీమ్. ఇంతకీ ఆ పొగడ్తకు అర్థం ఏంటో అనుకుంటున్నారా? మరేం లేదు.. బంగారంలాంటి అమ్మాయి అని అర్థం. బంగారు వర్ణమంత అందంగా ఉంటారని ఇలా పొగడ్తల వర్షం కురిపించారని అనుకుంటే పొరబాటే. ఈ పొగడ్తలకు కారణం కీర్తి మేని ఛాయ కాదు మనసు. కీర్తీ సురేశ్కు ఏదైనా సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకు పని చేసిన చిత్రబృందానికి ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం అలవాటులా ఉంది. ‘మహానటి’ సినిమాకు పని చేసిన అందరికీ బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ‘సండై కోళి 2’ టీమ్కి అలానే చేశారు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సండై కోళి 2’. 2005లో సూపర్ హిట్ అయిన ‘సండై కోళి’ చిత్రానికి సీక్వెల్. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన భాగం షూటింగ్ పూర్తి అవ్వగానే తనతో పాటు పని చేసిన టీమ్ అందరికీ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చారట కీర్తీ. దీంతో టీమ్ అంతా ఫుల్ ఖుష్ అయిందట. నెలల తరబడి తనతో పాటు పని చేసిన టీమ్కి ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తుంటే కీర్తీ సురేశ్ నిజంగానే బంగారం అనకుండా ఉండక మానలేరు కదా? -
పాట కోసం ఫ్లైట్ ఎక్కాడు!
పాట కోసం ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్లారు హీరో విజయ్. అక్కడి బ్యూటీఫుల్ లొకేషన్స్లో ప్రేయసితో డ్యూయెట్ పాడుకుంటారట. ఈ సాంగ్ ‘సర్కార్’ చిత్రం కోసమే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రీసెంట్గా చెన్నై షెడ్యూల్లో కోర్ట్ సీన్స్ను తెరకెక్కించిన ‘సర్కార్’ టీమ్ ఇప్పుడు సాంగ్ షూట్ కోసం లాస్ వేగాస్ వెళ్లారని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో వరలక్ష్మీ శరత్కుమార్ కూడా పాల్గొంటారు. ఈ నెల 11వరకు ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారట. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ‘కత్తి, తుపాకి’ చిత్రాల తర్వాత విజయ్–మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. -
కాలేజీలో కోర్ట్
ఆదివారం విశ్రాంతి తీసుకోకుండా కాలేజీకి వెళ్లారు తమిళ హీరో విజయ్. కాలేజీకి వెళ్లిన తర్వాత బోన్లో నిలబడ్డారట. కాలేజీకి వెళ్తే బెంచ్లు ఉండాలి కానీ కోర్టులో ఉండే బోన్లు అక్కడ ఎందుకు ఉన్నాయి? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ‘కత్తి, తుపాకీ’ చిత్రాల తర్వాత హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘సర్కార్’. ఇందులో కథానాయికగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ కాలేజీలో కోర్ట్ సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్ఆర్ఐ పాత్రలో విజయ్ కనిపిస్తారట. ‘సర్కార్’ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నారని, ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలవుతుందని కోలీవుడ్ టాక్. విజయ్–అట్లీ కాంబినేషన్లో ‘తేరీ, మెర్సెల్’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. -
సూపర్ ఫన్
అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ స్నేక్స్ అతని జీవితంలోకి వచ్చాయి. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. జై, వరలక్ష్మీ శరత్కుమార్, రాయ్ లక్ష్మీ, కేథరిన్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘నీయా 2’. సురేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1979లో వచ్చిన కమల్హాసన్ ‘నీయా?’ చిత్రానికి ఇది సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. ‘నీయా 2’లో హీరో జై సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. కొడైకెనాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెట్లోకి లేటెస్ట్గా జాయిన్ అయ్యారు వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మి శరత్కుమార్, రాయ్ లక్ష్మీ, జై లపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ‘‘టామ్ బాయ్ వరలక్ష్మి శరత్కుమార్ సెట్లో జాయిన్ అయ్యారు (సరదాగా). సూపర్ ఫన్ను ఎంజాయ్ చేస్తున్నాం. ఆమె టాకింగ్ స్పీడ్ను జై, నేను అందుకోలేక పోతున్నాం. మాకు మరింత ఎంటర్టైన్మెంట్ కావాలి వరూ. అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్లకు’’ అని రాయ్లక్ష్మీ పేర్కొన్నారు. -
హక్కుల కోసం పోరాటం
ట్రైబల్స్ హక్కుల కోసం పోరాటం సాగించారు జర్నలిస్ట్ ఉష. మరి..ఈ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఎలా విజయం సాధించారు? అన్న ప్రశ్నలకు థియేటర్లోనే ఆన్సర్స్ దొరుకుతాయి. వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్య పాత్రలో మనోజ్కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెల్వెట్ నగరం’. రమేష్ తిలక్, ఆరై్జ, సింగర్ మాళవిక ముఖ్య పాత్రలు పోషించారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్లో వరలక్ష్మీ జర్నలిస్ట్ ఉష క్యారెక్టర్ చేశారని కోలీవుడ్ సమచారమ్. ఈ సినిమాలో తన క్యారెక్టర్కు డబ్బింగ్ కంప్లీట్ చేశారు వరలక్ష్మీ. త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తూనే హీరోయిన్గా చేసేందుకు కూడా స్క్రిప్ట్స్ వింటున్నారు. -
నేను బాగానే ఉన్నా
కోలీవుడ్లో ఒకటే హాట్ టాపిక్.. దర్శక, నిర్మాత–నటుడు ధనుష్ గాయపడ్డారని. దాంతో ఆయన ఫ్యాన్స్ హైరానా పడిపోయారు. కానీ కంగారు పడాల్సినంత దెబ్బ ఏమీ తగలలేదని ధనుష్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మారి 2’. సాయిపల్లవి, వరలక్ష్మీ శరత్కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్ ఇది. ప్రస్తుతం ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఈ షూట్లోనే ఓ స్టంట్ చేయబోయి ధనుష్ గాయపడ్డారట. ఈ విషయంపై ధనుష్ క్లారిటీ ఇస్తూ– ‘‘నేను బాగానే ఉన్నాను. పెద్దగా గాయాలేమీ తగల్లేదు. మీ అభిమానమే నా బలం. మీ ఆత్మీయతకు రుణపడి ఉంటా’’ అని ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ‘మారి 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మేలో ‘మిస్టర్ చంద్రమౌళి’
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కుమారుడు గౌతమ్కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఈ సినిమా మేలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. వరలక్ష్మీశరత్కుమార్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో, బాప్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో క్రియేటీవ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ షెడ్యూల్ ప్రకారమే చిత్ర షూటింగ్ను పూర్తి చేసిందన్నారు. నాలుగు పాటల్లో ఇప్పటికే రెండు పాటలను చిత్రీకరించామన్నారు. మరో రెండు పాటల కోసం చిత్ర యూనిట్ థాయ్ల్యాండ్కు వెళ్లిందన్నారు. కాగా ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతంచేసుకుందన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నామని, మేలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
స్పెషల్ బర్త్ డే
‘ఇది నా స్పెషల్ బర్త్ డే’ అంటున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎందుకంత స్పెషల్? అని అడిగితే ‘ఈ బర్త్ డేకు సేవ్ శక్తి అని బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం, విజయ్ మురుగదాస్ నెక్ట్స్ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావడం’ అని అంటున్నారు. విషయం ఏంటంటే.. వరలక్ష్మీ నిర్వహించిన బ్లడ్ క్యాంప్లో దాదాపు 270 మంది పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారట. ఇక మురుగదాస్ డైరెక్షన్లో ఆమె చేయబోతున్న విషయానికి వస్తే.. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ ఓ కీ రోల్ ప్లే చేస్తుందని ఆమె బర్త్ డే సందర్భంగా సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. ఈ రెండు విషయాలు తనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని, అందుకే ఈ బర్త్ డే స్పెషల్ అని వరలక్ష్మీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వరలక్ష్మీ డైరీ ఈ ఇయర్ మొత్తం ఫుల్ బిజీ. సుమారు 7 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారామె. అందులో ఒకటి తండ్రి శరత్కుమార్తో చేస్తోన్న ‘పాంబన్’ ఒకటి. తండ్రీకూతురు ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ఇది. -
చంద్రమౌళి మనిషి కాదు!
కార్తీక్ ఒకప్పటి లవర్బాయ్. ‘అభినందన’ సినిమా ఒక్కటి చాలు.. కార్తీక్ని గుర్తు చేయడానికి. ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో ఉన్న కార్తీక్ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మణిరత్నం ‘కడలి’ చిత్రం ద్వారా ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయమయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ రోల్ తండ్రి చేశారా? కొడుకా? అన్నది ఏప్రిల్లో తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే.. అసలు చంద్రమౌళి మనిషి కాదనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో టైటిల్ లోగో కింద కారు సింబల్ ఉండటంతో ఈ సినిమా కథ అంతా కారు చూట్టూ తిరుగుతుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ కారు పేరు చంద్రమౌళి అన్నది కొందరి ఊహ. అన్ని ఊహలకు ఏప్రిల్ 27న సమాధానం దొరికేస్తుంది. ఆ రోజే ఈ సినిమా విడుదల కానుంది. తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రెజీనా, వరలక్ష్మీ శరత్కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
నెపోలియన్ రీమేక్లో వరలక్ష్మి?
తమిళ సినిమా: నటి వరలక్ష్మీ శరత్కుమార్ నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్తో జత కట్టనున్నారా? ఇందుకు అవుననే సమాధానమే కోలీవుడ్ నుంచి వస్తోంది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు వీరిద్దరూ తారాతప్పట్టై చిత్రంలో విలన్, హీరోయిన్గా నటించారు. తాజాగా హీరోహీరోయిన్లుగా నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. నిర్మాతగా రంగప్రవేశం చేసిన ఆర్కే.సురేశ్ ఆ తరువాత ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదుగుతూ తాజాగా కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయనిప్పుడు తనీముగం, బిల్లాపాండి, వర్గన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. మరో పక్క విలన్గానూ నటిస్తున్న ఆర్కే.సురేశ్ తెలుగు చిత్రం నెపోలియన్ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారన్నది తాజా వార్త. తెలుగులో ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రాన్ని చూడమని ఒక మిత్రుడు చెప్పారని, చిత్రం చూసిన తరువాత తనకు బాగా నచ్చిందని ఆర్కే.సురేశ్ తెలిపారు. తాను స్టూడియో 9 పతాకంపై విజయ్సేతుపతి హీరోగా ధర్మదురై చిత్రం నిర్మించిన తరువాత చాలా కథలు విన్నా సంతృప్తి కలిగించలేదన్నారు. అలాంటిది నెపోలియన్ తెలుగు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే బాగుందని భావించానన్నారు.ఈ చిత్రం కోలీవుడ్కు చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు.ఇందులో తాను హీరోగా నటిస్తూ నిర్మించనున్నానని, ఒక ముఖ్య పాత్రలో నటుడు సముద్రఖని నటించనున్నారని, మరో కీలక పాత్రను బాలీవుడ్ నటుడు పోషించనున్నారని తెలిపారు. ఇందులో హీరోయిన్ పాత్రను నటి వరలక్ష్మీశరత్కుమార్ పోషించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. -
నిపుణన్ సక్సెస్ మీట్
తమిళసినిమా: దక్షిణాదిలో యాక్షన్ కింగ్గా ముద్ర వేసుకుని కథానాయకుడిగా 150 చిత్రాల మైలురాయి చేరుకున్న నటుడు అర్జున్. నటుడిగానే కాకుండా, నిర్మాత, దర్శకుడిగానూ సత్తా చాటుకున్న ఈయన తాజాగా నటించిన నిపుణన్ చిత్రం 150వ చిత్రంగా నమోదు చేసుకుంది. ఇందులో అర్జున్తో పాటు ప్రసన్న, నటి వరలక్ష్మీశరత్కుమార్, వైభవ్, కృష్ట వంటి యువ నటీనటులు నటించారు. అరుణ్వైద్యనాథన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ సక్సెస్మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్వైద్యనాథన్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర కథను తయారు చేసుకున్నప్పుడే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. నటుడు అర్జున్ 150వ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కళాకారులు, సాంకేతిక వర్గం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ చిత్రం చూసిన పత్రికల వారి అభిప్రాయం, ప్రేక్షకుల అభిప్రాయం ఒకటే కావడంతోనే ఈ నిపుణన్ ఇంత విజయం సాధించిందని పేర్కొన్నారు. చిత్ర హీరో అర్జున్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అరుణ్వైద్యనాథన్ నిపుణన్ చిత్ర స్క్రిప్ట్ను చెప్పిన విధంగానే తెరకెక్కించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కథాకారులకు, అదే విధంగా తన 150 చిత్రాలకు పనిచేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇకపై కూడా నటుడిగా కొనసాగాలనుకుంటున్నానని, నిపుణన్ లాంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని అర్జున్ పేర్కొన్నారు. అదే విధంగా దర్శకుడిగా ప్రముఖ హీరోలతో పనిచేయాలని కోరుకుంటున్నానని, అలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా ప్రస్తుతం ఈయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సొల్లివిడవా అనే పేరుతో ఒక యూత్ఫుల్ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో తాను ఒక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు అర్జున్ వెల్లడించారు. -
సేవ్ శక్తి అంటున్న వరలక్ష్మీ శరత్కుమార్
నటి భావనపై అత్యాచారయత్న సంఘటన చిత్ర వర్గాలో్లనూ, మహిళలపై ప్రభావం చూపిందనే చెప్పాలి. ముఖ్యంగా కథానాయికల్లో చాలా మంది అలాంటి అరాచకాలను ఇకపై సాగనీయరాదన్న ధృడ నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా నటి వరలక్ష్మీ శరత్కుమార్ నడుం బిగించారు. అందులో భాగంగా సేవ్ శక్తి నినాదంతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి భద్రత కలిగించే విధంగా అడుగులు వేస్తున్నారు. సేవ్శక్తి పేరుతో ఒక సంఘాన్ని ప్రారంభించనున్నారు. మహిళా దినోత్సవం(మార్చి 8)న స్త్రీల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చెనై్నలో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక ట్వీట్ చేశానన్నారు. అందులో ఒక మహిళగా తన భావాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. అందుకు కారణం సమాజంలో మార్పు రావాలన్న ఆకాంక్షేనని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా సమాజంలో మార్పు తీసుకురాకపోతే, ఇక అది కలగానే మిగిలిపోతుందన్నారు. దీనికి తన వంతు ప్రయత్నంగా సేవ్శక్తి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళల సంతకాలను సేకరించి వాటిని ప్రభుత్వానికి విన్నపంగా అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు రెండు అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రతి తాలుకాలో మహిళా కోరు్టను ఏర్పాటు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరు నెలలో్లగా తీర్పు రావాలన్నారు. అప్పుడే లైంగిక వేధింపులకు గురైనవారు ఆ గాయాలను మరచి నూతన భవిష్యతు్తకు బాటలు వేసుకోగలరు. ఈ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ నెల 8న స్థానిక రాజరత్నం హాలులో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేం ఘనత కాదు : ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో మహిళలకు రక్షణ ఎకు్కవే. మహిళలపై అత్యాచారాలు అరుదుగానే జరుగుతున్నాయి. అంతమాత్రాన దీన్ని ఘనతగా చెప్పుకోలేం అన్నారు. అలాంటి దుస్సంఘటనలే జరగకుండా చూసుకోవాలి. న్యాయవాదులతో చర్చించా : మహిళలపై లైంగిక వేధింపులకు తగిన శిక్షల గురించి ప్రముఖ న్యాయవాదులతో చర్చించా. చట్టంలో లోపాలేమీ లేవు, వాటిని అమలు పరచడంలోనే ఉంది చిక్కంతా అన్నారు. అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి : వేధింపులకు గురైన మహిళలు దాని గురించి మాట్లాడకూడదు అనే సమాజంలో మార్పు రావాలి. అన్యాయాన్ని ఎదిరించి గొంతు విప్పాలి. లేకుంటే స్త్రీలు ఎప్పటికీ ఆట వస్తువుగానే మిగిలిపోతారు. నేను ఈ పోరాటానికి సిద్ధం కావడానికి ఒక ప్రముఖ నటి బాధింపునకు గురవడం కారణం కాదు. ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు, ఇకపై ఏ మహిళ లైంగిక వేధింపులకు గురి కాకూడదు. అప్పటివరకు తన పోరాటం చేస్తా. స్త్రీ సంఘం ఏర్పాటు : ఇక సినిమాకు చెందిన మహిళల కోసం ఏమి చేయనున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని, ఈ విషయంపై ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య)కు విజ్ఞప్తి చేయనున్నాం. స్త్రీల కోసం ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆ విన్నపం. అందులో సినీ నటీమణుల నుంచి ఏ శాఖకు చెందిన మహిళలైనా సభ్యులుగా చేరవచ్చు. వారి సమస్యలను ఆ సంఘానికి చెప్పుకుని వెంటనే పరిష్కారం పొందవచ్చు. అయితే ఆ సంఘానికి సినిమాకు చెందిన వారు కాకుండా ఒక విశ్రాంత న్యాయమూర్తి, ఐపీఎస్ అధికారి లాంటి వారిని అ«ధ్యక్షుడిగా నియమించాలనుకున్నాం. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది.