vijaykumar
-
'పెళ్లి’ ఆశతో ప్రేమలో పడ్డాం.' వనితా విజయ్కుమార్ లవర్స్ డే స్పెషల్!
తమిళ నటి వనిత విజయకుమార్ గురించి కోలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతేడాది అక్టోబర్లో వార్తలొచ్చాయి. బీచ్లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు. కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్ను విడుదల చేసింది. మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంది. 'పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.. కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.. అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది...? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో పెళ్లి కూతురిలా రెడీ అయిన వనితా విజయ్ కుమార్ను చూసిన కొందరు అభిమానులు ఫిదా అవుతున్నారు.నాలుగో పెళ్లిపై రూమర్స్..గతేడాది అక్టోబర్లో నాలుగో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఇలానే ఓ కొరియోగ్రాఫర్ రాబర్ట్కు ప్రపోజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. తాజా పోస్టర్ చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి పెళ్లి గురించి చర్చ మొదలెట్టారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ కంటే ఆమె పెళ్లి గురించి ఎక్కువ చర్చించుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
పసిడి కోక.. కట్టుకుంటే కేక
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్కుమార్.. పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ మేరకు విజయకుమార్ బంగారంతో నిలువు, అడ్డం పోగులను చేనేత మగ్గంపై నేశారు. 800 నుంచి 900 గ్రాముల బరువు.. 49 అంగుళాల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీరను రూపొందించారు.కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశాడు. ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం రూ.18 లక్షలు ఖర్చయినట్టు విజయ్కుమార్ తెలిపారు. అక్టోబరు 17న సదరు వ్యాపారి కూతురు పెళ్లి ఉండడంతో.. ఆరు నెలల కిందటే ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, సువాసన వచ్చే చీర, కుట్టులేని జాతీయ జెండాను చేనేత మగ్గంపై నేసిన విజయ్కుమార్.. తాజాగా బంగారు చీరను నేయడం విశేషం. -
75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్గా..
ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్ప్యాక్ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్ప్యాక్ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్ ఓల్డ్బోయిన్పల్లికి చెందిన విజయ్కుమార్. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్ప్యాక్ కలను సాధించలేకపోతున్నారు.సిక్స్ప్యాక్ కోసం గంటల తరబడి జిమ్లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్ప్యాక్ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్ప్యాక్ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్కుమార్ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్వాక్లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్కుమార్పై సాక్షి కథనం.. సునాయాసంగా కఠోర ఆసనాలు 28 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామాలుఓల్డ్బోయిన్పల్లికి చెందిన ఎం.విజయ్కుమార్ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్ వరకూ ఉన్న జిమ్ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్లో ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిపరడిన విజయ్కుమార్ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్లోనూ...కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్కుమార్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్ వర్కవుట్తోపాటు జాగింగ్, సైక్లింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.అందరూ క్రీడాకారులే... వ్యాయామం, క్రీడలు విజయ్కుమార్తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్లకు వెళతారు. సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్ కోచ్గా ఉన్నాడు.ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...సికింద్రాబాద్ ప్రాంతంలో విజయ్కుమార్ వర్కవుట్ చేయని జిమ్, సైక్లింగ్ చేయని రోడ్డు, జాగింగ్ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.శేషజీవితం సమాజానికి అంకితం నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. – మందుల విజయ్కుమార్ -
‘నారాయణ’ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బలి
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్ను హైదరాబాద్లోని హయత్నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
జనసేన ‘కిక్కు’ దిగింది
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు. తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్లను స్వాదీనం చేసుకున్నారు. -
నటి శ్రీదేవి విజయ్కుమార్ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్నగర్: నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను తీసింది. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరం మండలం కందుకూర్ నుంచి కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూర్కు కోళ్లను తరలిస్తున్న డీసీఎం.. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగా గురువారం అర్ధరాత్రి మక్తల్ మండలం బొందల్కుంట స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం వసుదుర్గాకు చెందిన డీసీఎం డ్రైవర్ విజయ్కుమార్ (40)తో పాటు కోళ్లను లోడ్ చేసేందుకు వెళ్లిన అంబ్లే గ్రామానికి చెందిన జగదీష్ అలియాస్ మంజు (37), భద్రావతికి చెందిన షఫివుల్లా (35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. డ్రైవర్ విజయ్కుమార్కు భార్య కుమార్బాయితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్కు (మంజు)కు భార్య గీత, ఇద్దరు పిల్లలు, షఫి ఉల్లాకు భార్య షాభానుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. Follow the Sakshi TV channel on WhatsApp: -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ను మంత్రి అభినందించారు. -
మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్కుమార్ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం. విజయ్కుమార్ మిల్లెట్స్తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్కుమార్ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. -
లే‘టేస్ట్’ ట్రెండ్..!
మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్కుమార్ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చదివిన విజయ్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు. భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్పై పని చేసే ఇంక్యుబేటర్ను సొంతంగా ప్లేవుడ్తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు. ఆదాయం బాగుంది నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. – పిల్లా విజయ్కుమార్, పాలతోడు, మండపేట మండలం -
టిప్పర్ ఢీకొని.. కాపాడండని వేడుకుని..
ఖమ్మం క్రైం: అతి వేగంతో వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొని ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. టిప్పర్ కింద చిక్కుకుపోయిన యువకుడు తనను కాపాడాలని వేడు కున్నాడు.. పోలీసులు స్పందించి యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరా లివి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన దొప్పా వీరబాబు కుమారుడు విజయ్కుమార్ ఖ మ్మంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఖమ్మం శ్రీని వాసనగర్లో ఉంటున్న ఆయన మంగళవారం గదికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. పక్కనే అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కుడివైపునకు తిరగడంతో విజయ్కుమార్ను ఢీకొంది. విజయ్ అదుపు తప్పి లారీ చక్రాల కింద పడిపోయాడు. ఆయన నడుం భాగంపైకి టైర్లు ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తన ప్రాణాలు కాపా డాలని ఆ యువకుడు వేడు కున్నాడు. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ చేరుకుని విజయ్ను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా టిప్పర్ నడిపిన డ్రైవర్ బుడిగ ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
ఆస్ట్రేలియాకు పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో డిప్యూటీ తహసీల్దార్ విజయ్కుమార్పై దాడి చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా దేశం వదిలి పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ నెల 17న పెనమలూరులో రేషన్షాపును పీడీఎస్ డీటీ గుమ్మడి విజయ్కుమార్ తనిఖీ చేశారు. స్టాకు తేడా ఉండటంతో రిపోర్టు రాస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో వచ్చి డీటీ విజయ్కుమార్, వీఆర్వో మంగరాజుపై దాడి చేశారు. ఈ దాడి తర్వాత కనిపించకుండాపోయారు. పోలీసులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బోడె అనుచరులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులు తర్వాత బోడె ప్రసాద్ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ పారిపోయి అక్కడ తల దాచుకున్నారని, ఆ తర్వాత 19వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఆ రేషన్ డీలర్ టీడీపీ కార్యకర్తే.. సోషల్ మీడియాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం వీడియో విడుదల చేశారు. రేషన్ డీలర్ లుక్కా అరుణ్బాబు టీడీపీ కార్యకర్త అని మరోసారి బహిరంగపరిచారు. రేషన్ షాపు తనిఖీ చేయడం నేరమని, డీటీని ప్రశ్నించేందుకు వెళితే అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేదిలేదని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనుచరులను జైలు పాల్జేసి తాను మాత్రం కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపోవడంపై ఆ పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. రేషన్ షాపులో అక్రమాలు జరగకపోతే స్టాకులో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార ఏమైనట్టని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు ఏ ప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. శనివారం ఆయన సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్తో కలిసి అనంతపురం కలెక్టరేట్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, వైఎస్సార్ జిల్లా జాయిం ట్ కలెక్టర్తో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను పరిశీ లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరా లు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. వీటిపై కలెక్టరు నివేదిక పంపుతారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్ష ల మేరకే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త జిల్లాలన్నింటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. రాయలసీమలో కొత్త జిల్లాలపై 1,600కు పైగా అ భ్యంతరాలు వచ్చాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గానీ పెట్టాలన్న భావన వ్యక్తమైందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందన్నారు. రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్లో కలపాలని, కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో ఉంచమని కోరుతున్నారన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని చెప్పారు. నగరిని తిరుపతిలో ఉంచాలని అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి అంశం పూర్వాపరాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు మౌలిక వసతులపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో బుధవారం విజయవాడలో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ తరపున సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్, జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వాటిలో సహేతుకంగా ఉన్నవి, వాటి అవసరం వంటి అంశాలను పరిశీలిస్తామన్నారు. వీటిపై మార్చి 10 లోపు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలుపుతారని, ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 1,400 వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని, ఒకే విషయానికి సంబంధించి ఎక్కువ వచ్చాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని, నర్సాపురాన్ని జిల్లాగా ఉంచాలని కోరుతూ ఎక్కువ సూచనలు వచ్చాయని తెలిపారు. పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల గురించి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయన్నారు. సహేతుక కారణాలుంటే రెవెన్యూ డివిజన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. ప్రత్యేక డిజైన్తో 3 నుంచి 4 లక్షల చదరపు అడుగుల్లో వీటిని నిర్మించాలని చెప్పారన్నారు. వీటి కోసం ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్ను నియమించాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాలకు దాదాపు అన్ని జిల్లాల్లో భవనాలు గుర్తించామన్నారు. ప్రభుత్వ భవనాలు, భూముల్లోనే కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు. తప్పనిసరైతేనే ప్రైవేటు భవనాలు చూస్తున్నామన్నారు. -
అధ్యయనం.. ఆకాంక్షలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి శాస్త్రీయంగా రూపొందించినట్లు ప్రణాళికాశాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ తెలిపారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై జరిగిన సుదీర్ఘ కసరత్తును గురువారం ఆయన విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో విలేకరులకు తెలియచేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తూ జిల్లా కేంద్రాలు అందరికీ సమీపంలో ఉండేలా ప్రతిపాదించినట్లు తెలిపారు. మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ప్రతిపాదించినట్లు విజయ్కుమార్ తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రజల అభివృద్ధికి రెండు జిల్లాలు దోహదం చేస్తాయన్నారు. పార్వతీపురం జిల్లా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో ఏర్పాటవుతుంది. అరకు జిల్లా అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం ప్రాంతం రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉన్నా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని వివరించారు. కోనసీమ ప్రజల కల సాకారం శ్రీకాకుళం పేరుతో ఉన్న సంస్థలన్నీ ఎచ్చెర్లలో ఉన్నందున ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం, అభివృద్ధి దెబ్బతినకుండా రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించినప్పుడు అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉండడంతో పెందుర్తిని అందులో కలిపామన్నారు. భీమిలికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలన్న ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అమలాపురం కేంద్రంగా ప్రతిపాదించామని తెలిపారు. సగటు జనాభా 20 లక్షలు నరసాపురం పార్లమెంటు స్థానంలో భీమవరం మధ్యలో ఉండడంతో జిల్లా కేంద్రంగా ప్రతిపాదించి కొత్త రెవెన్యూ డివిజన్ తెచ్చామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులో కలిసిపోయి ఉండడంతో దాన్ని ప్రకాశం జిల్లాకు కలిపామని తెలిపారు. ఇదే ప్రాతిపదికన నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో, హిందూపురంలోని రాప్తాడుని అనంతపురం జిల్లాకి కలుపుతున్నట్లు చెప్పారు. తిరుపతి పార్లమెంట్లోని సర్వేపల్లి అసెంబ్లీని నెల్లూరు జిల్లాలో, చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా నివసిస్తున్నట్లు తెలిపారు. 26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లాలోకి, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి తెలిపారు. 26 జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దవిగా ఒంగోలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ రెండు జిల్లాల్లో నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడమేనని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువైనా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, అక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉంటున్నట్లు చెప్పారు. జన గణన అడ్డంకి కాదు.. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయవచ్చని, సహేతుక కారణాలుంటే పరిగణనలోకి తీసుకునే అవకాశముంటుందని ప్రణాళిక శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించాక వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త జిల్లాలపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, ఆర్థిక వ్యవహారాలపై ఆయా కమిటీలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తాయన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జనాభా గణన అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. సమావేశంలో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె.శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
అసాధారణ స్థాయిలో అమరరాజా కాలుష్యం
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్ తిరుపతి, చిత్తూరు యూనిట్ల పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ తెలిపారు. ఆ యూనిట్లు, వాటి పరిసరాల్లో సేకరించిన శాంపిల్స్ను పీసీబీ లేబొరేటరీ, హైదరాబాద్లోని ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లలో విశ్లేషించగా ఈ విషయాలు బయటపడినట్టు తెలిపారు. అక్కడ వాడిన నీటిని ట్రీట్ చేయకుండా బయటకు వదలడంతో ఆ నీటిని వాడిన పరిసరాల్లోని మొక్కలు, మనుషులు, జంతువుల్లోకి లెడ్ ప్రవేశించే పరిస్థితి నెలకొందన్నారు. డబ్లు్యహెచ్వో గుర్తించిన 10 అత్యధిక ప్రమాదకరమైన మెటల్స్లో లెడ్ ఒకటని తెలిపారు. -
అమరరాజాను తరలించాలని మేమే చెప్పాం
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై హైకోర్టులో తాము పిటిషన్ వేశామని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్ను తరలించాలని తాము చెప్పగా.. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలిపోతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం అవాస్తవమని స్పష్టం చేశారు. అవాస్తవాలు రాసిన ఆ పత్రికకు లీగల్ నోటీసు ఇస్తామని, పరువు నష్టం దావా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి విజయకుమార్ ఇంకా ఏం చెప్పారంటే.. గడువు ఇచ్చినా కాలుష్యాన్ని నియంత్రించ లేదు రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ప్రతినెలా చేస్తున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 54 పరిశ్రమల్లో తనిఖీలు చేశాం. వాటిలో కాలుష్యం ఎక్కువగా వస్తుందని గమనించి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వాటిని సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా కొంత సమయం అడిగింది. అందుకు 2 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఉల్లంఘనలు ఎంతవరకు సరయ్యాయో తెలుసుకునేందుకు మళ్లీ తనిఖీ చేశాం. అప్పుడు కూడా సరికాకపోవడంతో మళ్లీ నోటీసు ఇచ్చాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉత్పత్తిని నిలిపివేసి, తప్పుల్ని సరి చేసుకున్నాక మళ్లీ పునఃప్రారంభం చేసుకునేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ నోటీసు ఇచ్చాం. దీనిపై వారి వాదన వినిపించేందుకు రెండుసార్లు (లీగల్ హియరింగ్)కు అవకాశం ఇచ్చాం. అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు, తిరుపతి యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే అందులో పనిచేసే కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం మరింత పెరిగి, అక్కడి వారి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించాం. ఏలూరులో ఇలాంటి పరిస్థితిలోనే లెడ్, నికెల్ లెవెల్స్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడిన విషయాన్ని గుర్తు చేశాం. అలాంటి వైపరీత్యాలు వస్తున్న క్రమంలో కాలుష్యాన్ని నియంత్రిస్తే తప్ప పరిశ్రమను నడిపించడానికి వీల్లేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. ఈ విధంగా ఈ ఏడాది 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని, 50 పరిశ్రమలను మూసివేయాలని క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చాం. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునే వరకు మూసివేసి, నియంత్రణ చర్యలు తీసుకున్నాక ఉత్పత్తి చేసుకోవాలని చెప్పాం. క్లోజర్ ఆర్డర్ ఇచ్చాక అమరరాజా బ్యాటరీస్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 వారాలపాటు స్టే ఇచ్చింది. ఈలోపు ఓ బృందాన్ని నియమించి పూర్తిస్థాయి తనిఖీలు చేసి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఒక సాంకేతిక టీమ్ని నియమించి అక్కడికి పంపి హైకోర్టుకు నివేదిక సమర్పించాం. ఉద్యోగుల రక్తంలోనూ సీసం చేరింది అమరరాజా ప్లాంట్ వద్ద వాడే నీటిని పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించాలి. కానీ లెడ్ (సీసం)తో కలిసిన నీటిని నేరుగా మొక్కలు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏవిధమైన ఏటీపీ (ఎఫిలియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) చేయకుండా నేరుగా లెడ్ కలిసిన నీటిని ఎస్టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండపక్కనే ఉండటం వల్ల ఈ నీటితోపాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్ నీరు చెరువుల్లో కలిసింది. మల్లెమడుగులో కేజీకి 134.79 మిల్లీగ్రాముల లెడ్ ఉంది. గొల్లపల్లిలో 319 మిల్లీగ్రాములు, నాయుడు చెరువులో అయితే 3,159 మిల్లీగ్రాములు ఉంది. ఈ నీరు తాగిన జంతువుల్లోకి లెడ్ వెళుతోంది. అక్కడి మొక్కల్లోకి వెళ్లి వాటినుంచి కూరగాయల ద్వారా మనుషుల శరీంలోకి లెడ్ వెళుతోంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు, లోపల, పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 కిలోమీటర్ల భూమి, నీటిలో లెడ్ ప్రవేశించింది. భూమి, నీరు, ఇతర రకరకాల శాంపిల్స్ని విశ్లేషించాం. ప్రతిచోటా రెండు చొప్పున శాంపిల్స్ని సేకరించి ఒకటి పీసీబీ లేబొరేటరీలో, మరొక శాంపిల్ని హైదరాబాద్లో ఉన్న స్వతంత్య్ర సంస్థ ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)కి పంపించాం. ఈ రెండు నివేదికలను హైకోర్టుకు సమర్పించాం. పరిశ్రమ మెయిన్ గేటు దగ్గర ఉన్న బోర్ వెల్ శ్యాంపిల్ తీసుకుని ఈపీటీఆర్ఐకి పంపితే అందులో లీటర్కి 0.08 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. వాస్తవానికి ఇది 0.01కి మించి ఉండకూడదు. ఎల్వీఆర్ఎల్ఏ స్టోర్స్ అనేచోట తీసుకున్న శాంపిల్లో 200 శాతం ఎక్కువ లెడ్ ఉంది., మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర లీటర్కి 0.3 మైక్రో గ్రాములు లెడ్ ఉంది. పరిశ్రమకు దగ్గరున్న గొల్లపల్లి చెరువులో 500 శాతం, కరకంబాడీ చెరువులో 90 శాతం, నాయుడుచెరువులో 1,200 శాతం ఎక్కువ లెడ్ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్ను బెంగళూరులోని ఒక లేబొరేటరీకి పంపించాం. 12 శాతం శాంపిల్స్లో బ్లడ్ లెవెల్స్ డెసిలేటర్కి 42 మైక్రో గ్రాములు ఉంది. ఇది అత్యధికంగా 10 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. 450 మంది ఉద్యోగుల శరీరంలో పరిమితిని దాటిపోయి లెడ్ ఉంది. ఈ ఉద్యోగులను లెడ్ రాని ఏరియాలో పనిచేయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు పూర్తిస్థాయి అధ్యయనం చేయమని చెప్పడంతో మద్రాస్ ఐఐటీ నిపుణులను తనిఖీలకు పంపాం. వాళ్లతోపాటు పీసీబీ సిబ్బందిని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. పర్యావరణాన్ని దెబ్బతీస్తే మానవ జాతికి ఇబ్బంది ఈ రెండు పరిశ్రమలు ఉన్నచోట మొక్కలు, చెట్లు, నేల, నీరు, గాలి, చుట్టుపక్కల అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దాన్ని ఎంతో కొంత పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పాం. జరిగిన ఉల్లంఘనల్ని సరిచేసే వరకు ఆ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని చెప్పాం. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని, పరిసర గ్రామాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీసి.. పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మానవ జాతి మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం. -
'అమర్రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం'
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టామని పర్యావరణ శాఖ అధికారి, ఎక్స్ ఆఫీసీయో కార్యదర్శి విజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమర్రాజాను టార్గెట్ చేశామన్నది అవాస్తవమని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమర్రాజాకు నోటీసులు ఇచ్చి 2 నెలల సమయం ఇచ్చాం. ఆ తర్వాత మళ్లీ తనిఖీ చేసి కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పాం. పర్యావరణ చర్యలు చేపట్టకముందే రెండోసారి నోటీసులు ఇచ్చాం. హానికరమైన అంశాలు గుర్తించి అమర్రాజాకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. పరిశ్రమల ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా పీసీబీ నియంత్రిస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ కేటగిరీ పరిశ్రమల్లో ప్రతి నెలా తనిఖీలు చేస్తాం. జనవరిలో 54 పరిశ్రమలు తనిఖీ చేశాం. కొన్ని పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించాం.అందులో భాగంగానే అమర్రాజాతో పాటు చాలా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టి 54 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 64 పరిశ్రమలకు ఉత్పత్తి ఆపాలని ఆదేశాలు ఇచ్చాం. 50 పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం అని తెలిపారు. -
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమని పుదుచ్చేరి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తేని.విజయకుమార్ కొనియాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సాయినగర్ గ్రామ సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సర్పంచ్ డీవీ రమణ, సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. తక్కువ సమయంలో పారదర్శకంగా ప్రజలకు సేవలందించడంలో సచివాలయ వ్యవస్థ సంజీవనిలా పనిచేస్తుందని అక్కడి సిబ్బందిని ప్రశంసించారు. చెవిరెడ్డి సేవలు ఆదర్శం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సేవలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని మంత్రి విజయకుమార్ కొనియాడారు. ఫోన్లో చెవిరెడ్డిని అభినందించారు. -
ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని బెనిఫిట్స్ తీసుకెళ్లొచ్చంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కొందరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఇన్చార్జుల నిర్లక్ష్యం కారణంగా అది నెరవేరట్లేదు. ఫలితంగా పదవీ విరమణ చేసిన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే రిటైర్డ్ ఏసీపీ కేఎన్ విజయ్కుమార్ పరిస్థితి. సీసీఎస్లో ఏసీపీగా పనిచేసిన కేఎన్ విజయ్కుమార్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ దక్క లేదు. ఇటీవల ఆయన కరోనా బారినపడి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది రోజులు గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. ఆర్థిక కారణాలతో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రస్తుతం మరో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. ఎంతో సేవ చేసిన తన తండ్రిని పోలీస్ విభాగం గాలికి వదిలేసిందంటూ ఆయన కుమార్తె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, విజయ్కుమార్ను ఫోన్లో ‘సాక్షి’పలకరించింది. ‘నాకు రావాల్సిన బెనిఫిట్స్ నేను దాచుకున్నవి. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కష్టార్జితం నుంచి పొదుపు చేసుకున్న నగదు ఇప్పుడు చేతికి అందట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇందల్వాయి ఎస్ఐ శివప్రసారెడ్డిపై వేటు మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..! -
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. -
అధిక రైతాంగం తిరోగమన సంకేతం
సేద్యంలోనే స్వేదం చిందిస్తున్న 70 కోట్ల మంది కలిగిన రైతు రాజ్యం భారతావని. 40 కోట్ల ఎకరాల సువి శాల సాగుక్షేత్రం. ప్రతీఏటా 28.5 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్న సుఫల ధరిత్రి. జీడీపీలో 16.5 శాతం వాటా కలిగిన వ్యవసాయ ప్రభావ ఆర్థిక వ్యవస్థ. ఈ గణాంకాలు చూస్తే వ్యవసాయ రంగంలో భారతదేశం అద్భుతం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ ఎక్కువ మంది రైతులు, ఎక్కువ సాగుభూమి, జీడీపీలో ఎక్కువ శాతం వ్యవసాయం వాటా... ఈ లెక్కలన్నీ వాస్తవానికి తిరోగమన సంకేతాలు. జంతువుల మాదిరిగానే, ఒకప్పుడు మానవులకు కూడా ఆహార అన్వేషణలోనే కాలమంతా గడిచేది. కానీ, మానవ జీవితం అక్కడే ఆగిపోలేదు. ఆహారం సంపాదించడానికే మొత్తం కాలం, శ్రమ ఖర్చు చేయడం లేదు. చాలా దేశాలు తమకు కావల్సిన తిండిని ఉత్పత్తి చేసుకుంటూనే, జేబులు నింపే మరో పని చేసుకుంటున్నాయి. కానీ కొన్ని సమాజాలు మాత్రం ఆరంభ దశలోనే ఆగిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితానుంచి బయట పడడం లేదు. అలాంటి కొన్ని దేశాల జాబితాలో భారతదేశం ఉండడం ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత వైఫల్యం. 1950 దశకంలో నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయిస్ ప్రతిపాదించిన ‘నిర్మాణాత్మక పరివర్తన ఆర్థిక సిద్ధాంతం ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల నుంచి ద్వితీయ, తృతీయ రంగాలుగా పేర్కొన్న పారిశ్రామిక, సేవారంగాలకు ఎంత ఎక్కువ మంది బదిలీ కాగలిగితే ఆ దేశాలు అంత తక్కువ సమయంలో వృద్ధి చెందుతాయని ఆ సిద్ధాంతం తేల్చి చెప్పింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్ ఇలా పరివర్తన చెందినవే. ఫోర్ ఏసియన్ టైగర్స్గా పేరొందిన హాంగ్ కాంగ్, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్ ఈ థియరీని అనుసరించి, కేవలం 30 ఏళ్లలో (1960–90) తమ స్థితిని అమాంతం మార్చుకున్నాయి. భారతదేశంలో సగానికిపైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతుంటే, అమెరికాలో కేవలం 0.7 శాతం మంది, జపానులో 3.9, జర్మనీలో 2.4, ఇంగ్లండులో 1.4, రష్యాలో 5.9 శాతం మంది మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. మనలాంటి దేశమే అయిన చైనాలో 26 శాతం, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇజ్రాయిల్లో 2 శాతం మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఒకప్పుడు వ్యవసాయం మీదనే ఆధారపడిన మిగతా జనమంతా పారిశ్రామిక, సేవా రంగాలకు మారి వ్యక్తిగతంగా బాగుపడ్డారు. దేశాలు బాగుపడ్డాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, భారతదేశ జిడిపిలో వ్యవసాయరంగం వాటా 16.5 శాతమైతే, అమెరికాలో అది 0.9 శాతం. చైనాలో 7.9, జపానులో 1.1, జర్మనీలో 0.7, ఇంగ్లండులో 0.7, రష్యాలో 3.55, ఇజ్రాయిల్లో 2.4 శాతం వ్యవసాయ రంగం వాటా. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తక్కువ ఉన్నప్పటికీ ఈ దేశాలన్నీ ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి కలిగిన దేశాలు. ఆయా దేశాలు వ్యవసాయాన్ని తమకు తిండి పెట్టే రంగంగా, మిగతా రంగాలను ఆర్థికంగా శక్తినిచ్చే రంగాలుగా చూస్తున్నాయి. కానీ భారతదేశంలో రెండింటికీ వ్యవసాయమే దిక్కయింది. తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామీకరణకు తరలించడం సాధ్యమయ్యే పనికాకపోవచ్చు. అందుకే వ్యవసాయాధారిత పరిశ్రమలను పెంచే పని వేగం అందుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు స్థాపించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన అందులో భాగంగానే కనిపిస్తున్నది. నిర్మాణాత్మక పరివర్తన ఆర్థిక సిద్ధాంతం అమలు చేసి తీరాలని భారతదేశంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. నెహ్రూ నాయకత్వంలో రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం కూడా వేగవంతమైన పారిశ్రామికీకరణే. కానీ వేర్వేరు కారణాల వల్ల ఆ స్ఫూర్తి కొనసాగలేదు. దేశంలో ఆహార కొరత ఏర్పడి, హరితవిప్లవం అత్యవసరం అయిపోయి, పారిశ్రామికీకరణ ఆశించిన వేగం అందుకోలేదు. హరిత విప్లవం కారణంగా దేశంలో ఉత్పత్తి పెరిగింది కానీ, ఉత్పాదకత పెరగలేదు. పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిన దేశాలే వ్యవసాయ రంగంలోనూ ఉత్పాదకతను బాగా పెంచుకోవడం గమనించదగ్గ విషయం. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించిన వివరాలు భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత డొల్లతనాన్ని బయట పెడుతున్నవి. భారతదేశంలో 40 కోట్ల ఎకరాల్లో ఏటా 285 మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధించగలుతున్నారు. కానీ మనలాంటి వాతావరణ పరిస్థితులే కలిగిన చైనాలో కేవలం 38 కోట్ల మంది రైతులు, 34 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో ఏటా 571 మిలియన్ టన్నుల పంట పండిస్తున్నారు. దేశంలో ఎకరానికి ఏడాదికి సగటున 17.8 క్వింటాళ్ల వరిధాన్యం పండిస్తే, చైనాలో 28.4 క్వింటాళ్లు పండిస్తున్నారు. అమెరికాలో 34.8, జపాన్లో 26.7, రష్యాలో 20 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. వరి, గోధుమ లాంటి తిండి గింజలు, పప్పుల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంటే, ఉత్పాదకతలో మాత్రం 38వ స్థానంలో ఉన్నది. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో తాము విధిలేక వ్యవసాయం చేస్తున్నామని 65 శాతం మంది రైతులు చెప్పారు. అవకాశం వస్తే మరో రంగంలోకి పోతామని 62 శాతం మంది రైతులు చెప్పుకున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేయడం కన్నా పట్టణాలకు పోయి కూలీ చేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని 69 శాతం మంది వెలిబుచ్చారు. మరో అవకాశం వస్తే వెళ్లిపోతామని రైతులూ అంటున్నారు, ఇది దేశానికీ అవసరం కాబట్టి భారతదేశంలో కొత్త వృత్తుల సృష్టి జరిగి తీరాలి. అందరూ ఒకే పంట వేయడం ఎట్ల లాభదాయకం కాదో, అందరూ ఒకే పనిలో ఉండడం కూడా ప్రయోజనకరం కాదు. చైనాలో కేవలం పదేళ్ల కాలంలోనే వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్యను 70 శాతం నుంచి 23 శాతానికి తగ్గించారు. ప్రతీ ఏటా ప్రభుత్వం నిర్దేశించుకునే లక్ష్యాల్లో వ్యవసాయ రంగం నుంచి ఈసారి ఇంత మందిని ఇతర రంగాలకు తరలించాలనే లక్ష్యం కూడా ఉండి తీరాలి. పారిశ్రామిక, సేవా రంగాల్లో వచ్చే గణనీయ ఆదాయంలో కొంత భాగాన్ని (క్రాస్ సబ్సిడీగా) వ్యవసాయ రంగాభివృద్దికి ఉపయోగించడం ఉత్తమ ఆర్థిక విధానం అవుతుంది. దేశ రక్షణ బాధ్యతల్లో ఉండే సైనికుల సంక్షేమం మాదిరిగానే, ప్రజల ఆహార భద్రత బాధ్యత నిర్వరిస్తున్న రైతు సంక్షేమం అమలు కావాలంటే కూడా ఇతర రంగాల పురోగతి తప్పనిసరి. వ్యాసకర్త గటిక విజయ్కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రజా సంబంధాల అధికారి Vijaynekkonda@gmail.com -
తగ్గుతున్న వెరీ యాక్టివ్ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏడాది కాలంలో సాగిన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలపై సమీక్ష.. రాబోయే నాలుగేళ్లలో చేపట్టాల్సిన పనులకు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకూ ‘మన పాలన–మీ సూచన’ పేరుతో మేధోమథన సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జరుగుతుందన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ► ప్రజా ప్రభుత్వంలో ఏడాది పాటు సాగిన పాలన, పనితీరు ఏ విధంగా ఉంది. రాబోయే రోజులకు సంబంధించి ప్రజలు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారనే దానిపై ఐదు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ► ఏడాదిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు, పనితీరుపై లబ్ధిదారులు, సమాజంలోని ముఖ్య నాయకులు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి తరహాలో కార్యక్రమాలుంటాయి. ► 25న పాలనా వ్యవస్థలో వికేంద్రీకరణ, గ్రామ, వార్డు స్థాయిలో వచ్చిన మార్పులు, గ్రామ సచివాలయాలు, పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకున్న చర్యలపై మేధోమథనం ఉంటుంది. ► 26న వ్యవసాయం, రైతులు, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడులు, విద్యుత్, సాగునీరు, ఆక్వా, పశు సంవర్ధకం వంటి రంగాల్లో జరిగిన మేలు, ప్రజా సూచనలపై చర్చ. ► 27న విద్యా రంగంలో తెచ్చిన పెను మార్పులు, విద్యను అభ్యసించే పద్ధతిలో వచ్చిన మార్పులు, తల్లులకు కల్పించిన సేవలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య వంటి అన్ని అంశాలపై లబ్ధిదారులు, నిపుణులతో మేధోమథనం. ► 28న పరిశ్రమలకు సంబంధించిన మౌలిక వసతులు, నైపుణ్యాల పెంపు, వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ఆయా రంగాలకు ఏవిధమైన వసతులు వచ్చాయనే దానిపై సమీక్ష. లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం. ► 29న ఆరోగ్య వ్యవస్థపై మేధోమథనం. ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులు, ఆరోగ్య వ్యవస్థ, వైద్య విద్యలో సంవత్సర కాలంగా జరిగిన పనులు, కలిగిన లబ్ధి, రాబోయే రోజులకు సూచనలు తీసుకుంటాం. కోవిడ్పైనా సమీక్ష ఉంటుంది. ► 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతుంది. ► రాష్ట్ర స్థాయిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మూడు గంటలపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ► ప్రతిరోజూ ఉదయం పథకాల లబ్ధిదారులు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడి.. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకూ అవే అంశాలపై జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, లబ్ధిదారులు, నిపుణులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ► ఆ జిల్లాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజల నుంచి సూచనలు తీసుకుంటాం. 13 జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుని.. వాటన్నింటినీ క్రోడీకరించి ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ► ప్రతి రంగానికి సంబంధించి ప్రజల సూచనలు తీసుకుని రాబోయే రోజులకు లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకెళ్లడం వీటి ఉద్ధేశం. ప్రతిరోజూ కార్యదర్శులు ఆయా రంగాలపై క్లుప్తంగా నివేదికలు ఇస్తారు. అనంతరం ప్రజలు, లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం. ► ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమంగా దీనిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతరం ప్రజల అభిమతాలను పరిగణనలోకి తీసుకోవాలనే ధృక్పథంతో ముందుకెళుతున్నాం. -
26 నుంచి సచివాలయ సేవలు..
సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు. -
చంద్రబాబుపై కొనసాగుతున్న ఫిర్యాదులు
-
చంద్రబాబుపై ఫిర్యాదుల వెల్లువ
నక్కపల్లి (పాయకరావుపేట)/సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్)/ఏలూరు టౌన్: దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్ను ఉద్దేశించి ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాలుగు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీ లెజిస్లేటివ్ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుపై నక్కపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ విజయకుమార్, ఎస్ఐ రామకృçష్ణలకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై బోస్టన్ కమిటీ నివేదికను చదివి వినిపించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్ను చంద్రబాబు వాడు వీడు అంటూ సంబోధించి చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కాగా, చంద్రబాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సౌత్జోన్ ఏసీపీ సూర్యచంద్రరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఏలూరులో దళిత్ రైట్స్ ఫోరం ఫిర్యాదు దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాళ సుదర్శన్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్నూలులో.. ఐఏఎస్ అధికారి విజయకుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ప్రజా, దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి వారంతా నిరసన తెలిపారు. విజయవాడలో.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమిషనర్ తిరుమలరావుకు సోమవారం దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితుల పట్ల టీడీపీ తీరు మార్చుకోకపోతే రాజకీయసమాధి కడతామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ల సంఘం ఆగ్రహం ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్పై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మున్సిపల్ కమిషనర్ల సంఘం ఖండించింది. విజయ్ కుమార్ని కించపరిచేలా మాట్లాడడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విజయ్ కుమార్ బీసీజీ నివేదికను వివరించారని, రాజధానిపై కీలక సమాచారాన్ని వివరించడం ఉన్నతాధికారిగా ఆయన బాధ్యత అని తెలిపింది. అధికారిగా తన విధులు నిర్వర్తించిన విజయ కుమార్ను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడటం తగదని, చంద్రబాబు తక్షణమే తన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్షురాలు ఆశాజ్యోతి డిమాండ్ చేశారు. సంబంధిత వార్తలు.. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్న దళిత సంఘాలు -
ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టండి..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. ఐఏఎస్ అధికారి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా మంత్రులు ఆదివారం ఓ ప్రకటన చేశారు. ‘బీసీజీ నివేదికను మున్సిపల్శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్కుమార్ ఒక ఐఏఎస్గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది. ఆ నివేదిక మీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శుల చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి ఆయనను, విజయ్కుమార్ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళలమీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకారాన్ని బయటపెట్టుకున్నారు. అధికారిగా విజయ్కుమార్ బాధ్యతలు ఏంటో ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ పూర్వకంగా విజయ్కుమార్గాడు అని సంబోధించడం ద్వారా తనను ఏ వ్యవస్థలూ ఏమీ చేయలేవు, అన్ని వ్యవస్థలనూ నేను మేనేజ్ చేస్తున్నాను అనే అహంకార పూరిత వైఖరిని కూడా చంద్రబాబు ప్రదర్శించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు భాషా సంస్కారంగాని, కులపరమైన సంస్కారం గాని, సామాజిక న్యాయంపట్ల గౌరవం గాని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం గాని లేవని మరోసారి స్పష్టమైన నేపథ్యంలో ఆయనను, ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా స్వయంగా విజయ్కుమార్ వద్దకు వెళ్లి, ఆయనకు కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాం. ఇది జరిగేవరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా, అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు వీరుమాత్రమే కాకుండా శాంతి భద్రతలను గౌరవించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ మంత్రులు అని పేర్కొన్నారు. చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా! మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం.. ‘బాధ తక్కువ.. బాగు ఎక్కువ’ అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! -
ప్రతిభావంతులకే కొలువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సమర్ధులు, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో పలుమార్లు సమీక్షలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అభ్యర్థుల విధులు, అర్హతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, దాదాపు 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకాలు జరగనుండగా.. 2.80లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పనిచేసే వలంటీర్లను నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు తొలుత ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా కంప్యూటర్ల ఏర్పాటులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంతో రాత పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపారు. కాగా, సుమారు 20లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షకు ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించే అధికారుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పరీక్ష ఇలా.. గ్రామ సచివాలయాల్లో నియామకాల సంబంధించిన రాత పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్, ఓఎంఆర్ విధానంలో జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉండేలా ఆలోచిస్తున్నారు. నియామకాల్లో అభ్యర్థుల స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులకు 18–42 ఏళ్ల మధ్య వయోపరిమితి విధించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ పోస్టును బట్టి అది మారే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నారు. వార్డు సచివాలయాల్లో పరీక్ష ఇలా.. వార్డు సచివాలయాల పరీక్షకు మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 50 మార్కులు ఎంపిక చేసిన సిలబస్, 50 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం, 50 మార్కులు జనరల్ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తున్నారు. ఓఎంఆర్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. అలాగే, పక్కా డ్రెయిన్లు, రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు వంటి విధులు నిర్వహించే అభ్యర్థులకు బీటెక్ను విద్యార్హతగా నిర్ణయించారు. ఇటువంటి అభ్యర్థులకు ఇంజనీరింగ్కు సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 100 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం, జనరల్ నాలెడ్జి్జకి సంబంధించినవి ఉంటాయి. పరీక్షకు రెండున్నర గంటల సమయాన్ని కేటాయించారు. పరీక్షలో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అనంతరం ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఈ పోస్టులకు 18ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అదే విధంగా గరిష్ట వయో పరిమితిని 42ఏళ్లుగా నిర్ణయించినట్టు సమాచారం. రిజర్వేషన్లు యథావిధిగా అమలులో ఉంటాయి. గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల నియామక ప్రక్రియ విధి విధానాలు ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. నియామక ప్రక్రియ విధానాలు ఖరారుచేయడం, ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్ జారీచేయడం, పరీక్ష నిర్వహణ వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తోంది. పట్టణాభివృద్ధి, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖల కమిషనర్లు, ఎల్ అండ్ వో అడిషనల్ డైరక్టర్ జనరల్లు కమిటీ సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక వేతనం రూ.15వేలు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లపాటు శిక్షణాకాలం ఉంటుంది. ఈ సమయంలో వారికి రూ.15వేల వరకు వేతనం చెల్లించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాత వేతనాల పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎంపికైన వారందరూ ప్రభుత్వోద్యోగులేనని మున్సిపల్ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. పట్టణాల్లో ఏర్పాటుచేసే 3,786 సచివాలయాల్లో మొత్తం 34,723 మంది ఉద్యోగులను నియమించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. కాగా, నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీచేసే అవకాశం ఉంది. -
జయనగరలో పోలింగ్ ప్రశాంతం
జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్కుమార్ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. జూన్ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. -
కళాకారుల ఆనందమే ఆయన ఆహారం
‘‘లలిత కళలంటే లలితాగాయత్రి యొక్క అంశ కలిగిన కళలు. ఈ కళలు అబ్బటం ఆ దేవత ఆశీర్వచనం. అటువంటి కళాకారులు ఎక్కడ పుట్టినా గౌరవించేవాళ్లు కొందరు ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన చిరస్థాయిగా ఉన్నారంటే కళలకు, కళాకారులకు ఆయన చేసిన సేవే. ఆయన పేరు వినగానే మనకు ‘భువనవిజయం’ గుర్తొస్తుంది. కళలకు ఉన్న గొప్పతనం అలాంటిది. సుబ్బరామి రెడ్డి మనసెప్పుడూ కళల మీద, కళాకారుల మీదే ఉంటుంది. వాళ్లను గౌరవించటం. వాళ్ల ఆనందమే ఈయన ఆహారం. నా పూర్వ జన్మ సుకృతం వల్ల రేపు కాకతీయ కళలను గుర్తు చేసుకుంటూ తీసుకోబోయే ఈ అవార్డు నాకు ప్రత్యేకమైంది. ఆలీ నాకంటే నటనలో సీనియర్. పరిశ్రమలో నటించటం పక్కన పెడితే, అసలు ఉండటమే కష్టం. అందుకే ఆలీ ‘ఏ’ నేను ‘బీ’’ అన్నారు బ్రహ్మానందం. ‘కాకతీయ లలిత కళా పరిషత్’ ఏర్పాటు చేసి, కళాకారులను సన్మానిస్తున్నారు సుబ్బరామి రెడ్డి. మార్చి 11న మహబూబ్నగర్లో జరగనున్న ఈ ఉత్సవాల్లో బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘కళలోనే దైవత్వం ఉంది. అందుకే కళాకారులను గౌరవించినా, అభినందించినా, సత్కరించినా.. మనకు ఆ శక్తి వస్తుంది. 700 సంవత్సరాల క్రి తం పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల వైభవం, కళల సంపద అపూర్వం. ఆ తర్వాత మనకు గుర్తు వచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు. కాకతీయ కళా పరిషత్ను 2 నెలల క్రితం ప్రారంభించినప్పుడు మోహన్బాబును సత్కరించాం. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా ఈ కళా వైభవోత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. తెలంగాణాలో మొట్టమెదటిగా æమహబూబ్నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. కళాకారులను, స్థానిక కళాకారులను, సినీ కళాకారులని ఇందులో సన్మానించదలిచాము. ఈ కార్యక్రమంలో 1100 చిత్రాల్లో నటించి, హాస్యాన్ని పంచిన బ్రహ్మానందంకు ‘హాస్య నట బ్రహ్మా’ అనే బిరుదు ప్రదానం చేయనున్నాం. దాదాపు 40 ఇయర్స్ కెరీర్ ఉన్న ఆలీకు కూడా అవార్డ్ ఇవ్వబోతున్నాం. పలువురు సినీరంగ ప్రముఖులను, స్థానిక కళాకారులను ‘‘కాకతీయ అవార్డు’తో సత్కరిస్తాం’’ అన్నారు. ‘‘బ్రహ్మానందం గారు తెలియని తెలుగువారుండరు. సుబ్బరామిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడి కంటే గొప్ప భక్తుడు,కళా పోషకుడు, కళా బంధువు’’ అన్నారు శాసన సభ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్. ‘‘నటరాజుకి కళాకారులంటే ఇష్టం. ఆ నటరాజే సుబ్బరామిరెడ్డి గారు. కేవలం 33 సంవత్సరాల్లో 1100 సినిమాలు పూర్తి చేసిన బ్రహ్మానందంగారిని సన్మానించటం ఆనందం’’ అన్నారు ఆలీ. -
కొమ్మమూరు..కన్నీరు
కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. కాంట్రాక్టు సంస్థ వందల కోట్ల విలువైన కాలువ పనుల్లో అవకతవకలు జరిగాయి. పనులు చేయాల్సిన గడువు ముగిసిపోయినా.. పలుమార్లు నోటీసులిచ్చినా కనీసం స్పందించని కాంట్రాక్టు సంస్థపై సర్కారు చూపుతున్న వల్లమాలిన ప్రేమలో పదో వంతు కూడా తమపై లేదని రైతులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఫలితంగా వర్షాకాలంలోనూ కాలువలో సక్రమంగా నీరు పారక.. సాగునీరందక రైతులు ఏటా నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ► కాలువ రాదు.. చేను తడవదు ► ఏటా అన్నదాతకు అవస్థే ► తొమ్మిదేళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ ► పనుల విలువ రూ.196 కోట్లు ► ఇప్పటి వరకు చేసింది రూ.50 లక్షల పనులే ► ఈ ఏడాదీ మొదలుకాని పనులు చీరాల: కృష్ణాడెల్టా పరిధిలో ఎప్పుడో కాటన్ దొర సమయంలో కాలువల పనులు జరిగాయి. ఆనాటి నుంచి నేటి వరకు తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. దీంతో ఏటా సాగునీరందక రైతులు విలవిల్లాడుతున్నారు. రైతుల మొర ఆలకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2 వేల కోట్లతో కృష్ణాడెల్టా ఆధునికీకరణ చేయాలని సంకల్పించారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి వనరైన కొమ్మమూరు కాలువను నల్లమడ కాలువ నుంచి పెదగంజాం వరకు రూ.196 కోట్లతో ఆధునికీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి కాలువలకు 2007లో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 47 కిలోమీటర్ల పొడవున నల్లమడ నుంచి పెదగంజాం వరకు ఉన్న కొమ్మమూరు కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంకెన్నేళ్లు.? కృష్ణా డెల్టా ఆ«ధునికీకరణ టెండర్ల ప్రక్రియ పూర్తయి తొమ్మిదేళ్లు సమీపిస్తున్నా కనీసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ అండర్ కన్స్ట్రక్షన్సంస్థ పనులు పూర్తి చేయడం లేదు. ముందుగానే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వం చెల్లించింది. గతంలో సంభవించిన లైలా, జల్, ఓగ్ని, నీలం, థానే వంటి తుఫాన్లకు కొమ్మమూరు కాలువ కరకట్టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువ కట్టలు సైతం బలహీనపడి కోతకు గురయ్యాయి. కృష్ణా డెల్టా నుంచి కొంత మేర నీరు వదలినప్పటికీ కొమ్మమూరు కాలువలకు ఇరువైపులా బలహీనంగా ఉన్న కట్టలకు గండ్లు పడి చుట్టు పక్కల ఉన్న పొలాలను నీరు ముంచెత్తుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంతోనే కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి పూర్తి స్థాయిలో కాకుండా నామమాత్రంగా కొమ్మమూరు కాలువకు నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వలన దిగువ ప్రాంతాలకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో, కాటన్ దొర హయాంలో జరిగిన మరమ్మతులు మినహా మరలా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి జరగలేదు. ఆధునికీకరించాల్సింది ఈ విధంగా... కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా సాగునీటి కాలువ కొమ్మమూరు కెనాల్ను 47 కిలో మీటర్ల మేరకు ఆధునికీకరించాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లాలో నల్లమడ కాలువ నుంచి కాలువ చివరి ప్రాంతమైన పెదగంజాం వరకు పనులు చేయాలి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న కాలువను 5 లక్షల క్యూబిక్ మీటర్ల లోతు తవ్వడంతో పాటు కాలువ పొడవునా నడిచి వెళ్లేందుకు వీలుగా 34 ర్యాంపులు, 35,500 క్యూబిక్ మీటర్లు సీసీ లైనింగ్, ఇసుక ప్రాంతంలో 4.92 లక్షల చదరపు మీటర్ల పొడవున రాతితో లైనింగ్ ఏర్పాటు, 11 రెండు లైన్ల బ్రిడ్జిలు, 26 ఒక లైన్ బ్రిడ్జిలు, 64 బాక్స్ కల్వర్టులు, 15 అండర్ టన్నెళ్లను హై పర్టిక్యులర్స్ పద్ధతి ప్రకారం ఆధునికీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రూ.50 లక్షలను ఖర్చు పెట్టి పెదగంజాం ప్రాంతంలో కొన్ని కల్వర్టులు మాత్రమే నిర్మించారు. గడువు పూర్తై చాలాకాలం అయినా కృష్ణా డెల్టా ఆధునికీకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చాం...పెనాల్టీలు విధించాం – ఇరిగేషన్ డీఈ, విజయ్కుమార్, చీరాల. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థకు పనులు చేయని కారణంగా పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అలానే నష్ట పరిహారం విధించినా ఆ సంస్థ స్పందించడం లేదు. ఏదో ఒక కారణంతో గడువును పొడిగించుకుంటున్నారు. కొమ్మమూరు ఆ«ధునికీకరణ జరిగితేనే జిల్లాలోని రైతులకు మేలు జరుగుతుంది. -
వాహనాల దొంగ అరెస్ట్
మరిపెడ : వాహనాలను చోరీ చేసిన దొంగను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేందర్నాయక్ తెలిపారు. స్థానిక పీఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన చోరీకి సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. మరి పెడ మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి విజయ్కుమార్ వివిధ ప్రాంతాల నుంచి 16 ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. మరిపెడ ఎస్సైలు నరేష్, నందీలు శనివారం ఉద యం మండల కేంద్రంలోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో విజయ్ కుమార్ గ్లామర్ వాహనంపై తడబడుతూ కనిపించాడు. అప్రమత్తమై న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మరో 15 వా హనాలు చోరీ చేసినట్లు వెల్లడించా డు. దీంతో ఆ వాహనాలను అతడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 16 వాహనాలకు ఒకే తాళం.. చోరీ చేసిన వాహనాలన్నింటికి నిం దితుడు ఒకే తాళం ఉపయోగించినట్లు డీఎస్పీ తెలిపారు. విజయ్కుమార్ గతంలో ద్విచక్రవాహన మెకానిక్గా పనిచేశాడు. అతడు ఏ ద్విచక్ర వాహనం తాళమైనా తీసేటట్లు ఓ తాళం చెవిని సృష్టించి ఈ చోరీలకు పాల్పడ్డాడు. మరిపెడ ప్రాంతంలో ఇంతపెద్ద ఎత్తున వాహనాలు దొరకడం ఇదే ప్రథమం. ఈ బైక్లను మరిపెడ మండలంతోపాటు పాటు తొర్రూరు, కురవి, కొడకండ్ల మండలాలతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రం లో వాహనాలు దొంగిలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఎస్సైలను అభినందించిన ఎస్పీ.. ఒక్కరోజులోనే నిందితుడితోపాటు 16 వాహనాలు స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీనివాస్తోపాటు ఎస్సైలు నరేష్, నం దీప్, ఏఎస్సై రాంజీ, హెడ్కానిస్టేబుల్ చంద్రయ్య, అఫ్జల్, బిచ్చానాయక్, పీసీలు సమ్మలాల్, కరుణాకర్, శంకర్, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించారని, వారికి రి వార్డులు అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
'మా నాన్న బట్టలూడదీసి దారుణంగా చంపారు'
న్యూఢిల్లీ: తన తండ్రి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరపాలని అనుకున్న ఢిల్లీకి చెందిన అంబిలి అనే మహిళా జర్నలిస్టుకు విషాదం ఎదురైంది. తన తండ్రి విజక్ కుమార్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బట్టలూడదీసి దారుణంగా హతమార్చి రక్తపుమడుగులో పడేసి వెళ్లారు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా తండ్రి నివాసానికి వెళ్లిన ఆమెకు ఈ భయంకర దృశ్యం కనిపించింది. దీంతో పోలీసులకు చెప్పగా వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అంబిలి ఏం చెప్పిందంటే.. 'నేను ప్రతిరోజు మానాన్నకు ఫోన్ చేస్తుంటాను. కానీ ఎందుకో నిన్న మధ్యాహ్నం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లాను. ఇంటి తలుపు బద్దలు కొట్టినట్లు కనిపించింది. అనుమానం వచ్చి మరో రెండు అడుగులు లోపలికి వేశాను. మానాన్న బెడ్ రూం తలుపు కొంచెం తెరిచి ఉంది. లైట్స్ ఆపేసి ఉన్నాయి. టీవీ స్టాండ్ సోఫాలో పడి ఉంది. టీవీ లేదు. బాగా అనుమానం వేసి లైట్స్ ఆన్ చేసి మ్యాట్ కింద ఏదో కప్పి ఉన్నట్లు గమనించాను. ఆ దృశ్యం చూసి గుండె జారిపోయింది. మా నాన్నను ఒంటిపై నూలుపోగులేకుండా చేసి ఎవరో దారుణంగా చంపేసి రక్తపు మడుగులో పడేశారు. రెండు రోజుల్లో ఆయన పుట్టిన రోజు' అంటూ బోరుమని ఏడ్చింది. విజయ్ కుమార్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. 2011లో రిటైర్డ్ అయ్యారు. కేరళ నుంచి ఢిల్లీకి 1994లో వచ్చారు. ఆయన భార్య ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తుంది. అంబిలి రాజ్యసభ టీవీలో పనిచేస్తుంది. సోదరుడు కూడా దుబాయ్ లోజర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. -
భార్య కేసు పెట్టిందని..సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఈ సమాజంలో తరచూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కళ్లు చెదిరే వేతనాలు, విలాసవంతమైన జీవితం ఉంటుందనే కోటి ఆశలతో సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెడుతున్న యువత ఆ రంగంలో ఉండే ఒత్తిడి, కుంగుబాటును తట్టుకొని నిలబడలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇక నిన్నటికి నిన్న యాప్ రూపొందించాలన్న తన కల సక్సెస్ కాకపోవడంతో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా మరో టెక్కీ చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నాడు. భార్య వేధింపుల కేసు పెట్టిందని మనస్థాపానికి లోనైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణానికి చెందిన విజయ్కుమార్ (30) ఉప్పల్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాదిక్రితం అదే పట్టణానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. కాగా వారు నాలుగు రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఇద్దరి మద్య మనస్పర్థలు రావటంతో దివ్య పుట్టింట్లో ఉంటోంది. విజయకుమార్ కర్మన్ఘాట్ క్రాంతినగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల దివ్య అతనిపై వరంగల్ స్టేషన్లో 498ఏ కేసు పెట్టినట్లు నాలుగు రోజుల క్రితం అతని తండ్రి విద్యాసాగర్ ఫోన్ చేశాడు. గురువారం ఉదయం తండ్రి ఫోన్ చేయగా విజయ్కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇబ్రహీంపట్నంలో ఇంజీనీరింగ్ చదువుతున్న తమ్ముడి కుమారుడు మహేష్కు సమాచారం అందింయాడు. అతను విజయ్కుమార్ ఇంటికి వెళ్లి పిలిచినా తలుపులు తీయకపోవటంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా విజయ్కుమార్ లుంగీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. భార్య కేసు పెట్టిందన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. -
పెనుమళ్లలో యువకుడి హత్య
పెనుమళ్ల(కాజులూరు) : కాజులూరు మండలం పెనుమళ్లలో బుధవారం రా త్రి జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు కథనం ప్రకారం. గ్రామానికి చెందిన పంతగడ విజయ్కుమార్(26) యానాం రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే స్థల వివాదంపై అతని తల్లి నాగరత్నం, ఎదురింటిలో ఉండే గీత కార్మికుడు పోతు వీరాస్వామి మధ్య వివాదం జరుగుతోంది. విజయ్కుమార్ కలుగజేసుకుని ఇద్దరినీ మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన వీరాస్వామి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటి అరుగుపై భార్యాపిల్లలతో కలిసి నిద్రిస్తున్న విజయ్కుమార్పై పైశాచికంగా దాడిచేసి కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. వెంటనే విజయ్కుమార్ భార్య కుమారి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతనిని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పటంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో విజయ్కుమార్ ప్రాణాలొదిలాడు. గొల్లపాలెం ఎస్సై సిహెచ్.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కాకినాడ రూరల్ సీఐ పి.పవన్ కిషోర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. దాడి అనంతరం నిందితుడు పోతు వీరాస్వామి భార్యతో కలిసి గ్రామం నుంచి పరారయ్యాడని, త్వరలో అతనిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. మృతుడు విజయ్కుమార్కు ఆరేళ్ల క్రితం వివాహం కాగా భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామ ప్రజలందరితో ఎంతో సఖ్యతతో ఉంటూ వివాదరహితుడిగా మంచి పేరున్న విజయ్కుమార్ ఇలా మృతిచెందడం స్థానికులను కలచివేసింది. -
విజయవాడలో రియల్టర్ ఆత్మహత్య
నూజివీడులో భూములు కొని నష్టపోయిన వ్యాపారి రాజధాని అక్కడే వస్తుందని నమ్మి అప్పులు చేసి కొనుగోళ్లు వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెంచడంతో బలవన్మరణం విజయవాడ: రాజధాని నిర్మాణం కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోనే జరుగుతుందని నమ్మి ఆ ప్రాంతంలో భూములు కొని నష్టపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుప్పాల విజయ్కుమార్.. సోమవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరుకు వెళ్లడంతో విజయ్ కుమార్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విజయ్కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై గతంలో ప్రభుత్వం పలు ప్రకటనలు చేయడంతో.. విజయవాడలోని రామవరప్పాడులో నివాసి విజయ్కుమార్ నూజివీడులో స్థలాలు కొన్నాడు. దాని కోసం తనకు గన్నవరం సమీపంలోని తేలప్రోలు వద్దనున్న 36 సెంట్ల స్థలాన్ని అమ్మాడు. ఆ సమయంలో పొరుగు స్థలం వారితో వివాదం ఏర్పడినట్లు సమాచారం. సొంత స్థలం అమ్మిన పైకంతో పాటు.. అధిక వడ్డీలకు మరో రూ. కోటి వరకూ అప్పుచేసి మొత్తం రూ. 5 కోట్లతో నూజివీడులో స్థలాలను కొనుగోలు చేశాడు. వాటిలో కొన్నింటికి అడ్వాన్స్లు మాత్రమే చెల్లించాడు. కొన్ని రిజిస్ట్రేషన్లు చేయగా, కొన్ని రిజిస్ట్రేషన్ కాలేదు. స్థలాలు వెంటనే అమ్ముడుబోతే వారికి పూర్తిగా డబ్బు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. స్థలాలు అమ్మకాలు జరగకపోవడంతో తాను కొన్న భూములకు మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించలేకపోయాడు. కాగా, సాయిరామ్ అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 3 వడ్డీకి రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిపై నెలకు రూ. 1.20 లక్షల వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఐదు నెలల నుంచి ఫైనాన్షియర్స్ నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నెల 9వ తేదీ వచ్చినా వడ్డీ చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి వద్ద నుంచి సోమవారం ఉదయం 10.23 గంటలకు ఫోన్ వచ్చింది. దీంతో విజయకుమార్ వణికిపోయాడు. భార్యను బయటకు పంపి..: అప్పుడే రామవరప్పాడులోని స్కూల్లో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలకు భోజనం క్యారియర్ ఇచ్చేందుకు భార్య బయలుదేరింది. ఆమెతో ఫోన్ విషయాన్ని వివరించి బాధపడ్డాడు. భార్య బయటకు వెళ్లగానే ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ వద్ద విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. అప్పులిచ్చినవారి ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడని, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. -
‘కరుణ’ చూ(డా)పాలి..
చిన్నతనంలోనే అమ్మ మృత్యుఒడికి చేరింది.. ఆర్థికస్థోమత లేని నాన్న ఆ చిన్నారిని మరొకరికి దత్తత ఇచ్చాడు.. పెద్దయ్యాక ఆ యువకుడు సేవా గుణంతో రెండు కాళ్లు చచ్చుబడిపోరుున అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు.. అతడే నర్సంపేటకు చెందిన విజయ్కుమార్. పెళ్లి సమయంలో అధికారులు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.. వందల సార్లు కార్యాలయూల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.. ఈయన గురువారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయూనికి కాళ్లు చచ్చు బడిపోరుున భార్యను, ఒడిలో నెల పసిగుడ్డును ఎత్తుకుని వచ్చాడు. కలెక్టర్ కరుణ దయతలచి స్థలం, పనిచేసుకోవడానికి రూ.75 వేల రుణం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.. నర్సంపేట : రెండు చేతుల్లో భార్య.. ఆమె చేతిలో బిడ్డతో 43సార్లు కలెక్టరేట్కు. అన్నిసార్లూ దరఖాస్తు చేశాడు. ఇంతకంటే ఎక్కువసార్లు ఆర్డీఓ కార్యాలయంలో అర్జీలు ఇచ్చాడు. ఇదంతా గుంట జాగ కోసం. అదీ.. అధికారులు ఇచ్చిన హామీనే. ఆదర్శ వివాహం చేసుకున్న యువకుడి పాట్లు ఇవీ. రఘునాథ పల్లి మండలం ఇబ్రహీంపురానికి చెందిన పబ్బ విజయ్కుమార్ నర్సంపేటలోని వూధన్నపేట రోడ్లో అద్దెకు ఉంటున్నాడు. ఈయన తల్లి బాల్యంలోనే చనిపోరుుంది. వేరొకరికి దత్తత ఇచ్చి తండ్రి దూరమయ్యూడు. విజయ్కుమార్కు గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్వాసి భూక్య శారద పరిచయుమైంది. పుట్టుకతోనే ఈమె రెండు కాళ్లు చచ్చుబడిపోయూరుు. కాళ్లు రప్పించేందుకు విజయ్కుమార్ ఎంతో శ్రమకోర్చి ఆపరేషన్ చేరుుంచినా విజయవంతం కాలేదు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. కుల, యుువజన సంఘాల బాధ్యులు, జేఏసీ నాయుకుల సమక్షంలో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇంటి స్థలం కోసం ఆర్డీఓ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి భార్యతో సహా ఇలా కార్యాలయూల్లో దరఖాస్తు చేసుకుంటేనే ఉన్నాడు. ఎప్పుడూ ‘మళ్లీ దరఖాస్తు చేస్కో’ అనే సమాధానంతో ఏడాదిపాటు విసిగి పోయూడు. ఈ క్రమంలో నివాస స్థలం ఏర్పా టు కోసం గత కలెక్టర్ ఆదేశించారు.జాగా చూపించారే తప్ప పట్టా ఇవ్వలేదు. కలెక్టర్ కరు ణ అరుునా కరుణించాలని విజయ్కుమార్ విజ ్ఞప్తి చేస్తున్నాడు. ‘నడవలేని భార్య, వూకు పుట్టిన బాబును వదిలి వేరే పనికి వెళ్లలేకపోతున్నా. నర్సంపేటలోని పోచవ్ముగుడి సమీపంలో చూపి ంచిన గుంట స్థలానికి హక్కుపత్రం ఇప్పించాలి. ఆదర్శ వివాహం చేసుకుంటే రూ. 75 వేల లోన్ ఇస్తారంటా. నాకు మంజూరు చేయనే లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
పాపకి ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చారు?
విజయ్కుమార్: ఏమ్మా.. పాపకి ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీలత: మావారు రమేశ్ శ్రీరాంపూర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ నాన్నగారు ఉంటున్నారు. మొదటి కాన్పుకావడంతో ఇక్కడికి వచ్చా. పాపకు కొద్దిగా జ్వరం ఉంది. ఇక్కడ చేర్పించాము. వైద్యం చేశారు. ఇప్పుడు పాప ఆరోగ్యం కుదుటపడింది. విజయ్కుమార్: మీ ఆయనకు ఏమైందమ్మా..? ఇప్పుడు ఎలా ఉంది? వైద్యం మంచిగా అందిస్తున్నారా? ఎల్లయ్య భార్య: నా భర్త మణుగూరులో కేబుల్మన్గా పనిచేస్తున్నడు. ఆయన నోటి నుంచి మాట రావట్లేదు. చేతులు పడిపోయి పక్షవాతం రావడంతో రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు కాస్త కొలుకున్నడు. ఈరోజు పాలు తాగిండు. చేతిలో కొంచెం కదలిక వచ్చింది. వైద్యం బాగానే అందిస్తున్నారు. విజయ్కుమార్: ఎక్కడ పనిచేస్తున్నావు? ఏ వ్యాధితో ఆస్పత్రిలో చేరావు? అప్పారావు: ఆర్సీహెచ్పీలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నా. మొస ఆడకపోవడంతో ఆస్పత్రిలో చేరిన. ఛాతిలో నుంచి నొప్పి వెన్నులోకి వస్తుంది. నొప్పి తగ్గకముందే డిశ్చార్జి రాశారు. విజయ్కుమార్: డాక్టర్ గారు అప్పారావును ఎందుకు డిశ్చార్జ్ చేశారు..? డాక్టర్ భానుమతి: అన్ని రకాల పరీక్షలు చేశాం. నొప్పికి క్యాప్సుల్స్ ఇచ్చాము. ఇంకా తగ్గలేదంటున్నారు కదా! మరో రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందిస్తాం. విజయ్కుమార్: ఏంటి.. ఎలా ఉన్నావు? వైద్యం మంచిగా అందుతుందా? మదనయ్య: జ్వరం వచ్చింది సారు. అందుకే ఆస్పత్రిలో చేరిన. పచ్చ కామెర్లు వచ్చాయి. వైద్యం బాగానే అందిస్తున్నరు. (విజయ్కుమార్: కామెర్లు తగ్గేంత వరకు మాంసాహారం తినకు. రెస్ట్ చాలా అవసరం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.) విజయ్కుమార్: డెంగీ అని ఎలా నిర్ధారిస్తున్నారు? డాక్టర్ అనిత: రక్త పరీక్షలు నిర్వహించి జ్వరాన్ని నిర్ధారిస్తున్నాం. డెంగీలో ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వల్ల నీరసించిపోతారు. అలాంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే జాయిన్ చేయించుకుంటున్నాం. విజయ్ కుమార్: రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయి? వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? డాక్టర్ సంజీవరావు: ప్రతిరోజు సుమారు 20 నుంచి 30 కేసులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా హైపర్ టెన్షన్తో వచ్చేవారు ఉంటున్నారు. వారికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నాం. రోగులను ప్రతినెలా పరీక్ష చేయాల్సి వస్తోంది. వారితోపాటు కొత్తగా వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. లైఫ్స్టైల్ మోటివేషన్ ద్వారా వారిలో హైపర్టెన్షన్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. విజయ్కుమార్: కార్మికులు ఎక్కువగా జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటారు కదా! వారికి అత్యాధునిక వైద్యం అందిస్తున్నారా? డాక్టర్ రామకృష్ణ: లేజర్ ట్రీట్మెంట్తో జాయింట్ పెయిన్స్ తగ్గిస్తున్నాం. ఆపరేషన్కు ముందు కొన్ని ఎక్సైర్సైజ్లు చేయిస్తున్నాం. జాయింట్స్లో పట్టు వచ్చిన తర్వాత ఆపరేషన్కు రిఫర్ చేస్తున్నాం. విజయ్కుమార్: మన దగ్గర బ్లడ్బ్యాంక్ నిర్వహణ ఎలా ఉంది? రక్తం స్టాక్ ఉంటుందా? డాక్టర్ మంతా శ్రీనివాస్: సింగరేణిలో బ్లడ్బ్యాంక్ నిర్వాహణ చాలా బాగుంది. ఇక్కడ అన్ని గ్రూపుల రక్త నమూనాలను భద్రపరుస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. రక్తదానం చేసే వారి పేర్లు, ఫోన్ నంబర్లతో ఒక రిజిష్టర్ మెయింటెన్ చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో దాతలు వెంటనే వచ్చి రక్తదానం చేస్తున్నారు. విజయ్కుమార్: ల్యాబ్లో సిబ్బంది సరిపడా ఉన్నారా? రోజుకు ఎన్ని టెస్ట్లు చేస్తుంటారు? డాక్టర్ సునీల: ప్రతిరోజు 500 నుంచి 600 బ్లడ్ శాంపిల్స్ను పరీక్షిస్తున్నాం. సిబ్బంది సరిపడా లేకపోవడంతో రిపోర్ట్లు ఇవ్వడం ఆలస్యమవుతోంది. డెంగీ వంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వాటి పరీక్షలు చేయడానికి సరిపడా ఎక్విప్మెంట్ (పరికరాలు) అందుబాటులో ఉండటంలేదు. విజయ్కుమార్: సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం. ఈలోగా కాంట్రాక్టు పద్ధతిలో కొంతమందిని రిక్రూట్ చేద్దాం.. మెడికల్ కిట్లు అన్నీ ఉంటున్నాయా? అంతోటి నాగేశ్వరరావు: డయాలసిస్ ఎక్విప్మెంట్ అందుబాటులో లేదు. కార్మికులను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపిస్తున్నారు. దీనివల్ల కార్మికులు వారి మస్టర్లను నష్టపోతున్నారు. (విజయ్కుమార్: డయాలసిస్ కిట్స్ కోసం టెండర్ల కోసం వెయిట్ చేయకుండా లోకల్ పర్చేజ్ చేయండి..) సీఎంఓ డాక్టర్ ప్రసన్న సింహ: రోజుకు రెండు మూడు కిట్స్ అవసరమవుతున్నాయి. వర్కర్లు, డిపెండెంట్లకు ఆస్పత్రిలో ఉన్న కిట్స్ సరిపోతున్నాయి. బయటి నుంచి వచ్చే పేషెంట్ల కోసం కొనుగోలు చేసి తీసుకువస్తాం. సామ్యూల్: ఆస్పత్రిలో బార్బర్ సమస్య ఉంది. అలాగే వార్డ్ బాయ్స్కు రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించండి. (విజయ్కుమార్: బార్బర్ల సమస్య పరిష్కారానికి కృషి చేశాం. యూనిట్ను ట్రేడ్గా తీసుకుని నియామకాలు చేస్తాం. రెస్ట్ రూమ్ కోసం ఖాళీ గది ఉంటే చెప్పండి దానిని కేటాయిస్తాం.) విజయ్కుమార్: ఏమ్మా.. పేషెంట్లను మంచిగా చూసుకుంటున్నారా? ఎల్లమ్మ: చూసుకుంటున్నాం సార్. కానీ స్వీపర్లు తక్కువగా ఉన్నారు. మాకు రెస్ట్ కూడా ఇవ్వడం లేదు. -
తెల్లారిన బతుకులు
జహీరాబాద్ : తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారాయి. పీర్ల పండుగకు హాజరయ్యేందుకు ముంబై నుంచి వరంగల్కు వస్తుండగా.. మృత్యువు కంటెయినర్ రూపంలో ముగ్గురిని బలిగొంది. మృతుల్లో ఇద్దరు మంబై వాసులు కాగా మరో వ్యక్తి వరంగ ల్ జిల్లా వాసి. ఈ సంఘటన మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (26) ముంబైలోని ఓ ప్రాంతంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన హసన్అలీ (48), అన్వర్ అన్సారి (43)లు మిత్రులు కాగా ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చే సేవారు. కాగా వీరికి గోవర్ధన్ తో పరిచయం ఏర్పడింది. అయితే గోవర్దన్ తన సొంత గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హసన్, అన్సారీలను ఆహ్వానించాడు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లికి కారులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న హసన్అలీ, పక్కనే కూర్చొన్న వరంగల్కు చెందిన గోవర్ధన్లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చొన్న అన్వర్ అన్సారి తీవ్రంగా గాయపడి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న జహీరాబాద్ సీఐ సాయి ఈశ్వర్గౌడ్, చిరాగ్పల్లి ఎస్ఐ విజయకుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన రూ.3 లక్షలను పోలీసులు భద్రపర్చారు. ప్రమాద స్థలంలో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
డీఈఓ బదిలీ ?
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయ్కుమార్ బదిలీ అరుునట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత బదిలీ ఫైల్పై విద్యాశాఖ మంత్రి సంతకమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా విద్యాశాఖాధికారిగా విజయ్కుమార్ ఇక్కడికి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. తనిఖీలతో హడలెత్తించిన ఆయన... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. అయితే డీఈఓ కార్యాలయ ఆధునికీకరణ, సీసీ కెమెరాల ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిధులను సమీకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉపాధ్యాయుల సస్పెన్షన్లు సరికాదని... నోటీస్లు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్తోపాటు ఉన్నత విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీఈఓపై విచారణ కూడా జరిగింది. కానీ.. ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు మళ్లీ ఆందోళనకు దిగారు. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం డీఈఓకు సానుకూలంగా ఉంటూవచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నలుగురు డీఈఓలపై ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం.. ఇందులో వరంగల్ జిల్లా డీఈఓ విజయ్కుమార్పైనా ఫిర్యాదుల నేపధ్యంలో ఆయన బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అయనను మహబూబ్నగర్కు గానీ,రంగారెడ్డి జిల్లాకు గాని డీఈఓగా బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
టీఆర్ఎస్కు మద్దతెలా ఇచ్చారు?
సీపీఐ, సీపీఎంలకు ఇతర వామపక్షాల నిలదీత హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి సీపీఐ, సీపీఎం ఎలా మద్దతు ఇచ్చాయని బుధవారం మఖ్దూంభవన్లో జరిగిన భేటీలో ఇతరవామపక్ష పార్టీల నాయకులు నిలదీశారు. ఇటీవలి మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ, సీపీఎం ఏ విధంగా మద్దతిచ్చాయని సీపీఐ ఎంఎల్ నాయకుడు గుర్రం విజయ్కుమార్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎంసీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపినట్లు తెలిసింది. ప్రజా సమస్యలపై వామపక్షపార్టీలుగా ఉమ్మడిగా వ్యవహరిస్తుండగా, మధ్యలో ఇలాంటి నిర్ణయాల వల్ల చేటు జరుగుతుందని వారు పేర్కొన్నట్లు సవూచారం. దీనిపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ బూర్జువా పార్టీలతో పొత్తు, మద్దతు విషయంపై పార్టీ కేంద్రకమిటీ త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటించనున్నదని చెప్పారు. -
నేటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ
మూడు దశల్లో 4,871 మందికి.. నేటి నుంచే త్రైమాసిక పరీక్షలు మరోవైపు ‘స్వచ్ఛ విద్యాలయం’ విద్యారణ్యపురి : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు సోమవారం నుంచి ఈనెల 22 వరకు మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్కుమార్, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, రేణుక, రవీందర్రెడ్డి, కృష్ణమూర్తి తమతమ డివిజన్లలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనగామ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ డివిజన్ల నుంచి ప్రతీ సబ్జెక్టుకు నలుగురు చొప్పున 7 సబ్జెక్టులకు 28 చొప్పున 112 మంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్(డీఆర్పీ)లు హైదరాబాద్లో శిక్షణ పొంది వచ్చారు. వీరు సోమవారం నుంచి లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ప్రధానంగా 9వ తరగతి, టెన్త్లో మారిన పాఠ్యాంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాక ఈఏడాది టెన్త్లో 80 మార్కులు థియరీ, 20 మార్కులు ఇంటర్నల్స్గా పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్కు మూడు రోజులపాటు శిక్షణ ఉంటుంది. ఈనెల 13,14,15 తేదీల్లో ఒక దశ, ఈనెల 16,17,18 తేదీల్లో రెండో దశ, ఈనెల 20,21,22 తేదీల్లో మూడవ దశలో శిక్షణలు ఉంటాయి. జనగామ డివిజన్లో 1,258మందికి, మహబూబాబాద్లో 1,825మందికి, ములుగులో 1,290మందికి, వరంగల్లో 498 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వీరు తాము బోధించే పాఠ్య పుస్తకాలు, లంచ్బాక్స్లు కూడా శిక్షణకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు రోజుకు రూ.80చొప్పున అందజేస్తారు. అలాగే ఓవైపు ఉన్నత పాఠశాలలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ జరగనుండగా.. ఈనెల 13నుంచే జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఉన్నత పాఠశాలల్లో కొందరు టీచర్లు శిక్షణకు వెళితే.. మరికొందరు త్రైమాసిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, త్రైమాసిక పరీక్షలు కొనసాగుతుండగా శిక్షణలు ఏర్పాటు చేయటంపై కూడా కొంత విమర్శలు వస్తున్నప్పటికీ తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ పేర ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. -
పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య
బెంగళూరు: పాతకక్షలతో రౌడీషీటర్ను దారుణంగా నరికి చంపిన సంఘటన ఇక్కడి మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీటీఎం లేఔట్లో నివాసం ఉంటున్న నఖ్రా బాబు (35)ను దారుణంగా హత్య చేశారు. ఇదే ఏడాది జూన్ 24న రాత్రి కర్ణాటక-తమిళనాడు సరిహద్దులలోని సిఫ్కాట్లో బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ కవల అలియాస్ విజయ్కుమార్ కారులో వెళ్తుంటే ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా రోడ్డుపై వెంటాడి హత్య చేశారు. ఈ కేసులో నఖ్రా బాబుతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జామీనుపై బయటకు వచ్చిన నిందితులు బెంగళూరులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే రెండు వర్గాలు రాజీకి వచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇక్కడి బీటీఎం లేఔట్లోని జైభీమానగరలోని వెళ్లారు. ఆ సమయంలో ఇరు వ ర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పరస్పరం దాడులకు చేసుకున్నారు. కవలను హత్య చేసిన నఖ్రా బాబును దారుణంగా హత్య చేశారు. అతని వెంట ఉన్న విశ్వ, హీరాలాల్, బాబులకు తీవ్రగాయాలు కావడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విజయ్కుమార్కు అశ్రునివాళి
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కరీంనగర్: అనారోగ్యంతో మృతి చెందిన సీని యర్ జర్నలిస్టు, జీవగడ్డ సాయంకాలం పత్రిక సంపాదకుడు బి.విజయ్కుమార్ అంత్యక్రియ లు ఆదివారం ఘనంగా జరిగాయి. శనివారం ఆయన చనిపోయారనే విషయం తెలియగానే వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. విజయ్కుమార్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం రాత్రి నుంచి కరీంనగర్ ప్రెస్క్లబ్లో ఉంచారు. బస్సుయాత్ర సందర్భంగా జిల్లాకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం అక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి, అంజలి ఘటించారు. అశ్రునయనాల మధ్య నగరంలో అంతిమయాత్ర, అంత్యక్రియలు నిర్వహించారు. అంతి మయాత్రలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్, విసరం నేత వరవరరావు, రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరె డ్డి భాస్కర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు. ఎంతో మంది జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్కుమార్ మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. 1971లో విద్యుల్లత సాహిత్య పత్రికను చాలాకాలం తన సంపాదకత్వంలో నిర్వహించారని, ఎమర్జెన్సీ కాలంలో పోలీసుల చిత్రహింసలు, 20 నెలల జైలుశిక్ష అనుభవించిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి జర్నలిస్టులు, ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అద్దె ఇల్లు.. ఆరుబయటే వీడ్కోలు విజయ్కుమార్ కరీంనగర్లోని గణేష్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్య సబిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రీనా ఆయన చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. విజయ్కుమార్ పార్కిన్సన్ వ్యాధితో అయిదేళ్ళుగా మంచానికే పరిమితిమయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం విషమించటంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఆయన కన్నుమూశారు. అద్దె ఇల్లు కావటంతో మృతదేహాన్ని జర్నలిస్టులు నేరుగా ప్రెస్క్లబ్కు తరలించారు. అంతిమ సంస్కారాల తర్వాత ఆయన కుటుంబీకులు, బంధువులకు ప్రెస్క్లబ్లోనే విడిది ఏర్పాటు చేశారు. -
పెంకి చెల్లెలు
‘‘మా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సినిమాలో నరేశ్ చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా అని మేం తర్జనభర్జన పడుతుంటే కార్తీక పేరును మా హీరో నరేశే సూచించారు. ఆయన సూచన మేరకు కార్తీకను ఆ పాత్రకు ఎంపిక చేశాం. మేం అనుకున్న దానికంటే వంద రెట్లు గొప్పగా నటించింది కార్తీక. అల్లరి నరేశ్కి పోటీగా కామెడీ పండించింది’’ అని దర్శకుడు బి.చిన్ని అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేశ్, కార్తీక అన్నాచెల్లెళ్లుగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు పై విధంగా స్పందించారు. ‘‘అల్లరి నరేశ్ కామెడీతో పాటు కార్తీక పోరాటాలు, డాన్సులు ఈ చిత్రానికి హైలైట్. తనది పెంకి చెల్లెలి పాత్ర. ఇందులో మన ఇంట్లో అల్లరి పిల్లలా అనిపిస్తారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన. ఈ చిత్రానికి కథ: విక్రమ్రాజ్, కెమెరా: విజయ్కుమార్ అడుసుమిల్లి, సంగీతం: శేఖర్చంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ. -
చోడవరం ఎస్ఐపై వేటు
వీఆర్లో పెడుతూ ఉత్తర్వులు ఇసుక మాఫియా సంఘటన చోడవరం : ఇసుక తుఫాన్ దెబ్బ మరో ఎస్ఐకి తగిలింది. చోడవరం ఎస్సై విజ య్కుమార్ను వీఆర్లో పెడుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదివా రం ఉత్తర్వులు వచ్చాయి. ఇటీవల జిల్లా ఎస్పీ ప్రవీణ్ చోడవరం పరిసరాల్లో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలపై ఆకస్మిక దాడు లు చేయడం, సీఐని సస్పెండ్ చేయడం తెలిసిందే. దీనిలోభాగంగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణపై చో డవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట ఎస్ఐలను కూడా విచారించినట్టు తెలిసింది. ఈ మేరకు చోడవరం ఎస్ఐ విజయ్కుమార్పై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి బదిలీ చేస్తూ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో పెట్టారు. ఈ చర్యలతో మిగతా పోలీసు అధికారుల్లో కూడా గుబు లు పట్టుకుంది. పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు కొందరు ఇసుక వ్యాపారులను కూడా విచారించినట్టు తెలిసింది. -
పాఠశాలల్లో మళ్లీ తనిఖీలు
కంచనపల్లి జెడ్పీఎస్ఎస్లో డీఈఓ తనిఖీ హెచ్ఎంకు మెమో.. ఇద్దరు టీచర్ల ఇంక్రిమెంట్లో కోత విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొన్ని నెలల క్రితం ఈ తనిఖీలు చేపట్టిన విషయం విదితమే. ఆ తర్వాత వివిధ కారణాలతో నిలిపివేసిన అధికారులు మళ్లీ తనిఖీలకు ఉపక్రమించారు. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్కుమార్ శుక్రవారం జిల్లాలోని రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని జెడ్పీఎస్ఎస్ను ఆకస్మికంగా తనిఖీచేశారు. వ్యక్తిగత పనిపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఓడీ! కంచనపల్లి జెడ్పీఎస్ఎస్లో డీఈఓ తనిఖీ చేసిన సమయంలో హెచ్ఎం డి.సమ్మయ్య సెలవులో ఉన్నారు. అయితే, హాజరుపట్టికను పరిశీలిస్తే హెచ్ఎం ఎక్కువగా ఓడీలు కూడా వేసుకుంటున్నట్లు తేలింది. మరో ఉపాధ్యాయుడు పవన్కుమార్ తన వ్యక్తిగత పనిపై వెళ్లగా అతనికి కూడా హాజరుపట్టికలో ఆన్ డ్యూటీ(ఓడీ) వేశారు. దీంతో హెచ్ఎం పనితీరు సంతృప్తికరంగా లేదని గుర్తించిన డీఈఓ ఆయనకు మెమో జారీ చేశారు. ఇక పవన్కుమార్ వ్యక్తిగత పనిపై వెళ్తూ ఓడీ పెట్టినట్లు గుర్తించిన డీఈఓ ఆయన ఒక రోజు వేతనంలో కోత విధించారు. ఆ తర్వాత డీఈఓ విజయ్కుమార్ పదో తరగతి విద్యార్థుల ఇంగ్లిష్, సోషల్ స్టడీస్లో విద్యా సామర్థ్యాన్ని పరిశీలించగా, వారు చిన్నచిన్న ప్రశ్నలకు సైతం జవాబులు చెప్పలేకపోయారు. ఈ మేరకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఆర్.అశోక్, పి.సంపత్కు రాబోయే అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా తెలుగు, హిందీలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా సంతృప్తికరంగా ఉండడంతో ఆయా ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. కాగా, మండలాల్లో ఎంఈఓలు పాఠశాలలను సరిగ్గా తనిఖీ చేయకపోవడంతో ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇక నుంచి వరుసగా పాఠశాలల తనిఖీలు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ విజయ్కుమార్ వెల్లడించారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
బాధితులకు తక్షణ న్యాయం కేసుల పరిష్కారంలో వేగం నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ విజయ్కుమార్ కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి.విజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ జిల్లాలోని ఇతర అధికారులతో కలిసి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. అలాంటి వారికి సిబ్బంది వత్తాసు పలికినా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి పోలీసుల సహకారం ఉన్నట్లు తెలిసినా శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయం కోసం స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. విధుల పట్ల అంకితభావం, బాధితులకు న్యాయం చేయటంలో చిత్తశుద్ధి చూపించాలని సూచించారు. నేరాలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే నేరాలను అదుపు చేసేలా సిబ్బంది విధులను నిర్వర్తించాలన్నారు. స్టేషన్లలో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసులకు అందే ప్రతి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా ధైర్యంగా తనను కలిసి వివరించవచ్చునని చెప్పారు. సివిల్ పంచాయితీల విషయంలో పోలీసులు స్టేషన్లలో పంచాయితీలు పెట్టినట్లు తన దృష్టికి వస్తే తన నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. జిల్లాలో జరిగే పేకాట, కోడిపందేలాపై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ బి.డి.వి. సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ డీఎస్పీలు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కాపులు ధర్మాన్ని గెలిపించారు
మండలి బుద్ధ ప్రసాద్ తిరుచానూరు : తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు, బలిజలు ధర్మాన్ని గెలిపించారని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. తిరుపతి బలిజ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో కాపు ప్రజాప్రతినిధులకు అభినందన సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి 13 జిల్లాల నుంచి పలువురు కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, తిరుపతి బలిజ జేఏసీ నాయకుడు వూకా విజయ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు ధర్మాన్ని గెలిపించారన్నారు. కర్ణుడు కవచ కుండలాలతో జన్మించాడని, కాపులు నీతినిజాయితీ అనే కవచ కుండలాలతో పుట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కాపులను బీసీ జాబితాలో చేర్చినప్పుడే తమ కులం సంతోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే కాపులను వాడుకున్నాయే తప్ప న్యాయం చేయలేదన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చినంత మాత్రాన ఇప్పుడున్న బీసీలకు రిజర్వేషన్లలో ఎటువంటి అన్యాయం జరగదని వారు స్పష్టం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు కులస్తుడైన చిరంజీవిని కలిస్తే, ఆయన స్పర్శ తగిలితే చాలు జీవితం ధన్యం అవుతుందనుకున్న కాపులను ఆయన నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవుల నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటికోట రామారావు(ఏలూరు), కే.అప్పలనాయుడు(గజపతినగరం), పి.నారాయణస్వామినాయుడు(నెల్లిమర్ల), మీసాల గీత(విజయనగరం), పి.రమేష్బాబు(ఎలమంచిలి), డీకే.సత్యప్రభ(చిత్తూరు), కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధ, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ ఆశాలత, కోలా ఆనంద్ పాల్గొన్నారు. -
అక్షరాస్యత పెరిగితేనే అభివృద్ధి
మార్టూరు : అక్షరాస్యత శాతం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ విజయ్కుమార్ పేర్కొన్నారు. సమాజంలో గుర్తింపు రావాలన్నా.. మంచి జీవితం గడపాలన్నా విద్య ఎంతో అవసరమన్నారు. మార్టూరు జెడ్పీహెచ్ఎస్లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ మాట్లాడారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు బడిబయట లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, డబ్బుతో కూడా పనిలేదన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. విద్య మంచి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్చడంలో మార్టూరు మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పిల్లలు పాఠశాలకు వెళ్లేలా చూడాలని కోరారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ వందకు 29 మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని, వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ.. బడిబయట ఉన్న పిల్లలను ఇప్పటికే పాఠశాలలో చేర్పించామని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా బడి బయట ఉంటే బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాలకు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతి కిషోర్బాబు, ఎంపీడీఓ సింగయ్య, మార్టూరు సర్పంచ్ దేవుని దయానాయక్, మార్టూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జెన్నెట్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిహారం కోసం రైతుల కన్నెర్ర
అమలాపురం : నీలం తుపాను పరిహారం కోసం రైతులు చేస్తున్న నిరీక్షణ నిరసనగా మారింది. పరిహారం పంపిణీ జాప్యంపై కోనసీమ రైతులు కన్నెర్ర చేశారు. పరిహారం మంజూరై ట్రెజరీలో నిధులు మురిగిపోతున్నా.. రైతులకు పంపిణీ చేయడంలో జిల్లా వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వందలాది మంది రైతులు సోమవారం స్థానిక ఏడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. నీలం తుపాను పరిహారం కోసం నాలుగు రోజుల క్రితం ఏడీఏ కార్యాలయం వద్ద కోనసీమ రైతు పరిరక్షణ సమితి, బీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశమయ్యేందుకు సోమవారం జేడీఏ విజయ్కుమార్ ఇక్కడకు వచ్చారు. ఏఓలు, ఏడీఏలు పరిహారం పంపిణీపై నిర్లక్ష్యం వహించారని, తమకు పరిహారం ఎప్పుడు అందుతుందో స్పష్టమైన హామీ ఇచ్చితీరాలని రైతులు ఏడీఏ భాస్కరరావు, ఏఓలు ధర్మప్రసాద్, ప్రశాంత్కుమార్తో పాటు సిబ్బందిని కార్యాలయం నుంచి బయటకు పంపించి, తలుపులు మూసివేసి, కార్యాలయం బయట బైఠాయించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న జేడీ విజయ్కుమార్పై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీలు, జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు, కోనసీమ అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం, రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, నాయకులు రంబాల బోసు, తిక్కిరెడ్డి గోపాలకృష్ణతో జేడీ చర్చలు జరిపారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ 16నెలల క్రితం సంభవించిన నీలం తుపాను పరిహారం ఆరుల నెలల క్రితమే మంజూరైందని, ఇప్పటి వరకు రైతులకు పంపిణీ చేయలేదని రైతులు మండిపడ్డారు. కోనసీమకు రూ.14.57 కోట్ల పరిహారం మంజూరైతే, రూ.7 కోట్లు పంపిణీ చేశారని, మిగిలిన రూ.7.57 కోట్లు పంపిణీ చేయకపోవడంతో 18 వేల మంది రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. దీనిపై గతంలో ఇచ్చిన హామీపై జేడీని నిలదీశారు. అనేక సార్లు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలిచ్చినా, ఏఓల నిర్లక్ష్యం వల్ల పరిహారం జమ కాలేదన్నారు. జనవరి 31 తర్వాత ఇచ్చిన ఖాతాలకు సంబంధించి, మిస్ మాచింగ్ ఖాతాలకు ఇప్పటికీ పరిహారం పంపిణీ చేయలేదన్నారు. కొన్ని షాపుల్లో అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తూ బిల్లు తక్కువగా ఇస్తున్నారని జేడీకి ఫిర్యాదు చేశారు. విత్తన ప్యాకెట్లపై తప్పుడు ఫోన్ నంబర్లు వేస్తున్నారని, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదని తిక్కిరెడ్డి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కోనసీమలో విత్తనాల అమ్మకాలతో రైతుల నుంచి వ్యాపారులు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా వసూలు చేశారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక దశలో జేడీ ‘ఈ సమావేశానికి రాకూడదనుకుంటూనే వచ్చాను’ అనడంతో రైతులు మండిపడ్డారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే పంపిణీ కాగా 4, 5 విడతల్లో పంపిణీ చేయాల్సిన పరి హారం రూ.7.57 కోట్ల బిల్లు ట్రెజరీకి పంపించామని, అపాయింట్మెంట్ డేట్కు ముందుగా పంపడం వల్ల ట్రెజరీలో ఆంక్షలతో మంజూరు కాలేదని జేడీ చెప్పారు. నిధుల విడుదలకు అనుమతి కోసం కమిషనర్కు లేఖ రాశామన్నారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఆగస్టు 5 వరకు ఏఓలు గ్రామసభలు నిర్వహించి, పరి హారం అందని రైతుల ఖాతాల వివరాలు సేకరిస్తారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పరి హారం పంపిణీలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని జేడీ అంగీకరించారు. ప్రతీ రైతుకు పరిహారమిచ్చేలా రైతు నాయకులతో కలిసి మరోసారి సర్వే చేయాలని ఏఓలకు సూచిం చారు. విత్తన వ్యాపారుల మోసాలపై విచారణ చేయిస్తామని, దాడులు చేసి ఇప్పటికే కొన్ని లెసైన్సులు రద్దు చేశామని చెప్పారు. రైతు నాయకులు వాసంశెట్టి సత్యం, గణేశుల రాం బాబు, అడ్డాల గోపాలకృష్ణ, జున్నూరి కొండయ్యనాయుడు, దామిశెట్టి చంటి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. -
ఐకేపీ ఆనిమేటర్ సజీవ దహనం
కాశినాయన/పోరుమామిళ్ల, న్యూస్లైన్: కాశినాయన మండలంలోని రెడ్డికొట్టాలలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐకేపీలో ఆనిమేటర్గా పనిచేస్తున్న ఆదిబోయిన రామశేషయ్య(40) సజీవ దహనమయ్యాడు. అగ్నిమాపక అధికారి విజయకుమార్ కథనం మేరకు.. రామశేషయ్యకు భార్యతో పాటు యోగేశ్వర్, బిందు అనే ఇద్దరు పిల్లలున్నారు. రామశేషయ్య అమ్మ బోద కొట్టంలో చిల్లర అంగడి వ్యాపారం చేసుకుంటూ ఉండేది. సాయంత్రం ఏమి జరిగిందో తెలియదుకానీ గుడిసెలో మంటలు లేచి ఒక్కసారిగా చుట్టుకున్నాయి. శేషయ్య కుమారుడు యోగి(16) మంటలకు కాలి కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. శేషయ్య గుడిసెలో చిక్కుకుపోయి మాడిపోయాడు. లోపల కిరోసిన్ లేదా పెట్రోల్ వుండటం వల్ల మంటలు తీవ్రస్థాయిలో లేచినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోరుమామిళ్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడి వెళ్లి మంటలకు ఆర్పివేశాక, రామశేషయ్య మృతదేహం మాడిపోయిన స్థితిలో కనిపించింది. కుటుంబ యజమాని మరణించడంతో ఆ కుటుంబం వీధినపడ్డట్లైంది. -
మావోయిస్టు లొంగుబాటు
సంగారెడ్డి క్రైం, న్యూస్లైన్ : చత్తీస్గఢ్ రాష్ట్రం మెయిన్పూర్ డివిజన్లో జిల్లా కమిటీ సభ్యుడుగా పనిచేసిన మావోయిస్టు సీతా నరసింహులు అలియాస్ జానీ సలాం అలియాస్ జనార్దన్ (34) సంగారెడ్డిలో ఎస్పీ విజయ్కుమార్ ఎదుట బుధవారం లొంగిపోయారు. మెదక్ జిల్లా కొండపాక మండలం దోమలోనిపల్లి గ్రామానికి చెందిన సీతా నరసింహులు మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో 16 ఏళ్లు పార్టీలో పనిచేశారని ఎస్పీ తెలిపారు. 1997లో గిరాయిపల్లి దళ కమాండర్ శ్రీరాముల శ్రీనివాస్ ఉపన్యాసాలకు ప్రభావితుడై పార్టీలో చేరి 1999 వరకు గిరాయిపల్లి దళంలో దళ సభ్యుడిగా పనిచేశాడని చెప్పారు. 1999లో నల్లమల అటవీ ప్రాంతానికి బదిలీ అయి 2004 వరకు అక్కడే పనిచేశాడన్నారు. 2000 సంవత్సరంలో ఏసీఎంగా పదోన్నతి పొంది, అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో పనిచేసినట్లు చెప్పారు. పార్టీ విధి విధానాలు నచ్చక పోవడం, ఆరోగ్య సమస్యలు తదితర కారణాలతో లొంగిపోయినట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించి ఉన్నందున ఆ రివార్డుతో పాటు ఇతర సదుపాయాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయ్కుమార్ పేర్కొన్నారు. -
ప్రజల సాక్షిగా ప్రజాదర్బార్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాదర్బార్ ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా కలెక్టర్ విజయకుమార్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అర్జీలు రాసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడమేగాకుండా వాటిని అక్కడికక్కడ విచారించేందుకు వీలుగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల స్థాయిలో పరిష్కారం కాని వాటిని నేరుగా తన వద్దకు తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేశారు. అందరి సమక్షంలో సంబంధిత సమస్య గురించి కింది వరుసలో కూర్చున్న అధికారులను మైక్ ద్వారా మాట్లాడిస్తూ బహిరంగంగా చెప్పించడంతో ప్రజలు కూడా వాటి స్థితిగతులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఈ విధానంతో ప్రజలు కూడా సమస్య స్థితిగతిని సావధానంగా తెలుసుకుని ముందుకు కదులుతున్నారు. గతంలో గుంపులు గుంపులుగా ప్రజలు అర్జీలు చేతపట్టుకొని వచ్చేవారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరి అర్జీని కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్లు స్వీకరించారు. హెల్ప్ డెస్క్తో తీరిన రాత కష్టాలు ప్రజాదర్బార్ కోసం ప్రకాశం భవనంలోకి ప్రజలు అడుగు పెట్టగానే కుడివైపు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యను అధికారులకు ఎలా తెలియజేయాలో తెలియక అక్కడే ఉన్న ప్రైవేట్ రైటర్లను ఆశ్రయించేవారు. వారు ఒక్కో అర్జీదారుడి నుంచి 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా సంబంధిత అధికారి తనకు బాగా పరిచయమని, తాను చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికి 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్తో ప్రైవేట్ రైటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్డ్ డెస్క్లో సిబ్బంది ప్రజలకు అర్జీలు రాసే పనిలోనే నిమగ్నమయ్యారు. టెన్ టేబుల్స్ హెల్ప్ డెస్క్లో అర్జీలు రాయించుకున్న ప్రజలు సమీపంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ అర్జీపై నంబర్ వేస్తారు. ప్రత్యేకంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్దకు నంబర్ వేసి పంపించే ప్రక్రియ చేపట్టారు. టేబుల్-1లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, కార్మిక, ఎక్సైజ్, దేవాదాయ, రిజిస్ట్రార్, ట్రెజరీ, అటవీ, డీపీఆర్ఓ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్స్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులను ఉంచారు. టేబుల్-2లో వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ, జిల్లా సహకార సంస్థ, ఏపీఎస్ఐడీసీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఉంచారు. టేబుల్-3లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, ఐటీడీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్డీఎం, భూగర్భ జలవనరుల శాఖ, నాబార్డు, పీడీసీసీ బ్యాంకులకు చెందిన అధికారులను ఉంచారు. టేబుల్-4లో డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సీపీఓ శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-5లో విద్యాశాఖ, గురుకుల పాఠశాలలు, రాజీవ్ విద్యామిషన్, వయోజన విద్యాశాఖ, ఆర్ఐఓ, జిల్లా గ్రంథాలయం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను ఉంచారు. టేబుల్-6లో ఆర్అండ్బీ, ట్రాన్స్కో, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఉంచారు. టేబుల్-7లో జిల్లా పరిశ్రమల కేంద్రం, చేనేత జౌళిశాఖ, మార్కెటింగ్, మైన్స్, స్టెప్, ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-8లో డీఎంహెచ్ఓ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, రిమ్స్, రెడ్క్రాస్లకు చెందిన వారిని ఉంచారు. టేబుల్-9లో మెప్మా, మునిసిపల్ కమిషనర్లను ఉంచారు. టేబుల్-10లో జిల్లాపరిషత్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీఓ, ఆర్టీసీ అధికారులను ఉంచారు. -
ప్రజాదర్బార్లో ‘హెల్ప్ డెస్క్’
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రజాదర్బార్లో సమూల మార్పులకు కలెక్టర్ విజయకుమార్ శ్రీకారం చుట్టారు. సమస్యలతో సతమతమవుతున్న వారు తమ సమస్యను అర్జీ రూపంలో అధికారులకు తెలియజేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను కాగితంపై రాయించేందుకు కలెక్టరేట్ వద్ద రైటర్లుగా చలామణవుతున్న వారిని ఆశ్రయిస్తున్నారు. ఒక్కో అర్జీకి 10 నుంచి 30 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. అర్జీరాస్తున్న సమయంలో సంబంధిత వ్యక్తి సమస్యను తెలుసుకుంటున్న రైటర్.. ఆ అధికారి తనకు తెలుసని, అర్జీతో పనిలేకుండా ఆ పనిని తాను చేయిస్తానని వారిని నమ్మబలుకుతూ 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా కలెక్టర్ దృష్టికి వచ్చింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆవేదనతో ప్రజాదర్బార్కు వచ్చేవారికి అర్జీల రూపంలో అదనపు ఖర్చు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రజాదర్బార్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం రెండు శాఖలకు చెందిన పదిమంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ప్రజాదర్బార్కు వచ్చేవారు వీరిని వినియోగించుకునేందుకు వీలుగా ‘హెల్ప్ డెస్క్’ అనే బ్యానర్ను కూడా రాయించారు. ఎక్కువ మంది ఉపయోగించుకునే విధంగా హెల్ప్ డెస్క్ను రూపకల్పన చేశారు. అంతేగాకుండా సంబంధిత అర్జీదారుని సమస్యను స్పష్టంగా అర్జీలో రాసేవిధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అధికారుల బృందాలు ఏర్పాటు... ప్రజాదర్బార్లో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు పదిమంది జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను కలెక్టర్ విజయకుమార్ ఏర్పాటు చేశారు. ఈ పది బృందాలు ప్రజాదర్బార్ జరిగే వేదికకు దగ్గరగా టేబుళ్లు వేసుకుని కూర్చుంటాయి. ఇకనుంచి అర్జీదారులు నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్లకుండా ముందుగా ఆ అధికారుల బృందం వద్దకు వెళ్తారు. ఆ సమస్యను సంబంధిత శాఖ జిల్లా అధికారి పరిశీలిస్తారు. తమ పరిధిలో పరిష్కారమయ్యే విధంగా ఉంటే తమ కిందిస్థాయి అధికారికి అక్కడికక్కడే ఫోన్చేసి తగు ఆదేశాలు జారీచేస్తారు. అంతటితో ఆగకుండా ఆ సమస్యను ఎప్పుటిలోగా పరిష్కరిస్తారో కూడా స్పష్టంగా తెలుసుకుంటారు. కొన్నిరకాల సమస్యలు కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేవి ఉంటాయి. అలాంటి వాటిని స్క్రూట్నీ చేసి కలెక్టర్ వద్దకు పంపిస్తారు. కలెక్టర్ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజాదర్బార్లో సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఒక అధికారి ‘న్యూస్లైన్’ కు తెలిపారు. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రజాదర్బార్ను వినూత్నంగా నిర్వహించేందుకు కలెక్టర్ విజయకుమార్ చొరవ చూపడం విశేషం. -
కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం
మహబూబ్నగర్ క్రైం, న్యూస్లైన్: కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా కార్యదర్శి పెద్ద విజయ్కుమార్పై గుర్తు తెలి యని వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. జిల్లా కేంద్రంలోని బోయపల్లిగేట్ సమీపంలోని లారీ అసోసియేషన్ కార్యాలయానికి పెద్ద విజయ్కుమార్ వ్యక్తిగత పనులపై వెళ్లాడు. అసోసియేషన్కు సంబంధించిన ఓ వ్యక్తితో ఓ విషయంపై గొడవ జరిగింది. దీంతో ఇద్దరి మద్య మాటామాట పెరి గి వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి విజయ్కుమార్ ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితుడి కొడుకు పదునైన ఆయుధంతో విజయ్కుమార్పై దాడిచేయగా..తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. సమీపంలోనే ఉన్న విజయ్కుమార్ అనుచరులు అతడిని వెంటనే పట్టణంలోని నవోదయ ఆస్పత్రికి తరలించారు. మైరుగైన వైద్య చికిత్స కోసం అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. విజయ్కుమార్పై జరిగిన దాడి జరిగిన విషయం పట్టణంలో దావనంలా వ్యాపించడంతో కాంగ్రెస్ నేతలు, అతని అనుచరులు ఆస్పత్రి వద్దకు చే రుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో ఆస్పత్రి సిబ్బందితో గొడవపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. సీఐ పాండురంగారెడ్డి, వన్టౌన్ ఎస్ఐ రమేష్లు బాధితుడిని అడిగి ఘటనకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. హత్యాయత్యానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కేంద్రానిది తొందరపాటు నిర్ణయం
యలమంచిలి/యలమంచిలి రూరల్, న్యూస్లైన్: రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా యలమంచిలి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు కొఠారు సాంబశివరావు, నక్కా వెంకటరమణలకు మద్దతుగా శనివారం దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారిద్దరినీ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. యలమంచిలి ఉపాధ్యాయుడు వి.నాగేశ్వరరావు రూపొందించిన సమైక్యాంధ్ర సీడీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్ కూడా శిబిరంలో పాల్గొన్నారు. ఎన్జీవో హోంలో సాయంత్రం జరిగిన అఖిపక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి యలమంచిలి పట్టణంలో రాజకీయపార్టీలు, ఉద్యోగసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛందసంస్థలు, ఆటో, మోటార్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ నెల 13న యలమంచిలి పట్టణంలో బంద్ చేయాలని నిర్ణయించాయి. సమావేశంలో బొద్దపు ఎర్రయ్యదొర, ఆడారి శ్రీధర్, పిళ్లా రమాకుమారి, సిహెచ్.సోమేశ్వరరావు, ఓరుగంటి విద్యాసాగర్, జాగారపు కొండబాబు, ఎల్లపు సూరి అప్పారావు, వి.జె.ఆర్.వర్మ, అల్లుమళ్ల నాగు తదితరులు పాల్గొన్నారు.