visitors
-
మూడు లక్షలకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
అమర్నాథ్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్నాథ్కు తరలివచ్చారు.అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. -
జపాన్కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
G20 Summit: విదేశీ అతిథుల కోసం అనువాదకులు
న్యూఢిల్లీ: జీ20 సదస్సు కోసం వచ్చి ఢిల్లీ దుకాణాల్లో, ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో షాపింగ్ చేసే విదేశీ అతిథుల సౌకర్యం కోసం అక్కడి వర్తకులు మరో అడుగు ముందుకేశారు. షాపింగ్ సమయంలో భాషా బేధంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అనువాదకు(ట్రాన్స్లేటర్)లను సిద్ధంచేస్తున్నారు. ఇంగ్లి‹Ù, ఫ్రెంచ్, స్పానిష్ ఇలా జీ20 దేశాల్లో మాట్లాడే భాషలను అనర్గళంగా మాట్లాడి అనువదించగల 100 మంది మహిళా అనువాదకులను అక్కడి వర్తకులు రంగంలోకి దింపుతున్నారు. వీరు అందుబాటులో ఉండటంతో ఇకమీదట విదేశీ అతిథులు షాపింగ్ వేళ ఎలాంటి ఇబ్బందులు పడరని వర్తకులు చెబుతున్నారు. ఈ అనువాదకులు నిజానికి నూతన వ్యాపార వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూవర్స్). వీరిలో ఫ్యాషన్ డిజైనర్లు, సెలూన్, బొటిక్ యజమానులు, బ్లాగర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ‘ వీరంతా ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 8, 9, 10 తేదీల్లో ట్రేడర్లకు, అతిథులకు అనుసంధానకర్తలుగా మెలగుతారు’ అని వీరితో భాగస్వామ్యం కుదుర్చుకున్న ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్ చెప్పారు. ‘ ట్రేడర్లకు సాయపడే వాలంటీర్ల జాబితాను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు పంపాం. వీరు విదేశీ అతిథులకు అందుబాటులో ఉండి సాయపడతారు. దేశంలోనే షాపింగ్కు చిరునామాగా నిలిచే చాందీనీ చౌక్లో విదేశీయుల సందడి మరింత పెరగనుంది’ అని గోయల్ పేర్కొన్నారు. -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్లాండ్లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్లాండ్కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో
సాక్షి, భువనేశ్వర్ : ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే.. విచిత్రమైన అనుభవం వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్ నందనకానన్ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది. వచ్చేశాయి సింహాలు ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్వోకు ఆదేశించినట్లు నందన కానన్ డైరెక్టరు తెలిపారు. #ସିଂହ_ସଫାରୀରେ_ଫସିଲା_ବସ୍ ନନ୍ଦନକାନନ ସିଂହ ସଫାରୀରେ ଫସିଗଲା ବସ୍ । ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଲେ ପର୍ଯ୍ୟଟକ । ସିଂହଗୁଡିକୁ କାବୁ କରି ଫିଡିଂ ଚାମ୍ବରରେ ରଖିଲେ କର୍ମଚାରୀ । #Nandankanan #Zoo #KanakNews pic.twitter.com/NwCoXWD1nt — Kanak News (@kanak_news) July 9, 2023 -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్లో రోజుకు రూమ్రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్ల ఎఫెక్ట్తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మని ట్రోల్ చేస్తూ ఓ వీడియ్ నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఆయన దానికి స్పందించి..హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ ఒక రోజు ప్రభుత్వ స్కూల్ని సందర్శించారు. అక్కడ విజిటర్స్ బుక్లో రాయడానికి ఆయన.. వేరొక పుస్తకంలో చూసి రాస్తూ కనిపించారు. దీంతో రోషన్ శర్మ అనే వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తోపాటు.. కాపీ చేయకుండా విజటర్స్ బుక్లో ఒక్క పేరా కూడా రాయలేని అస్సాం సీఎం అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై గంటల వ్యవధిలోనే స్పందించిన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావని, దాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు. పైగా తాను ఆ భాషాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాయ్ బదులిస్తూ..అస్సామీ ఒక అందమైన భాష, సందర్శకుల పుస్తకంలో అస్సామీ భాషలో రాసి ఉంటే మరింత మెరుగ్గా కనిపించేది. ఇక్కడ భాష కాదు సమస్య . అతను వచనాన్ని కాపీ చేయడం గురించి మాత్రమే విమర్శించాను. అయినా విజిటర్స్ బుక్లో హిందీ లేదా ఇంగ్లీష్లోనే రాయాలని రూల్ లేదు . కాపీ చేయడం అనేది మీ స్థాయి నాయకుడికి తగదు. నాయకుడు తన విభిన్నమైన ఉన్నతాశయ ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉండేలా కానీ ఇలా కాపీ చేయకూడదూ అని సూచిస్తూ ట్వీట్ చేశాడు. Presenting the CM of Assam who can't even write a paragraph in a visitor's book without copying 🤣🤣🤣 pic.twitter.com/MHvoRAGDH1 — Roshan Rai (@RoshanKrRaii) April 4, 2023 (చదవండి: ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా? ఎన్సీపీ నేత ఫైర్) -
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్లో త్వరలో స్లీపర్ బెర్తులు -
కూతుళ్లతో సుప్రీం కోర్టుకు సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీం కోర్టు హాలులో లాయర్లందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దివ్యాంగులైన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లను ఆయన న్యాయస్థానానికి తీసుకువచ్చారు. విజిటర్స్ గ్యాలరీ గుండా వారిద్దరినీ ఫస్ట్కోర్ట్కు తీసుకువచ్చారు. తను కూర్చునే చాంబర్ను చూపించారు. ఇతర జడ్జీలు కూర్చుని ఉండే చోటును, లాయర్లు వాదించే సమయంలో ఎక్కడి ఉండేదీ వారికి చెబుతూ.. కోర్టు పని విధానాన్ని వివరించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. వచ్చిన అతిథులను చూసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Haldwani Eviction: సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
నుమాయిష్ నయా లుక్..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమస్యల కారణంగా షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది. ఆరంభమే...సంపూర్ణంగా... సాధారణంగా నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశి్వన్ మార్గం అన్నారు. ప్రారంభమైన స్టాల్స్ కేటాయింపు.. నుమాయిష్లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ కేటాయింపు లేఖలు అందజేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా ఈ దఫా స్టాల్స్కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు. తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఇ)ల నుంచి 50స్టాల్స్ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు. సందర్శన వేళలు పెంపు... వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన. ఈ సారి స్ట్రీట్ లైట్స్ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్ ఉన్నా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్ స్టాల్స్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్ మెయిన్ స్టాల్ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్ మార్గం చెప్పారు. (చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం ) -
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్బండ్పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ...ముచ్చెమటలు పట్టించేసిందిగా...
చాలామంది వేటితో పడితే వాటితో పరాచకాలు ఆడతుంటారు. ఎంతవరకు ఆటపట్టించాలో, వేటితో ఆడుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బంధించే ఉన్నాయి కదా అని వాటితో కూడా ఆడుకోవాలని చూస్తే అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ముందు వెనుక చూడకుండా క్రూరమృగాన్ని ఆటపట్టింటి ఎలా సమస్యను కొని తెచ్చుకున్నాడో చూడండి. వివరాల్లోకెళ్తే...చాలా మంది జూ చూసేందుకు వెళ్లి అక్కడ బోనుల్లో బంధించి ఉండే జంతువులను టచ్ చేయాలనుకుంటారు. ఓపక్క జూ అధికారులు వాటిని ముట్టుకోవద్దు అని చెప్పిన వినరు. ఎవరలేరు కదా వాటిని ముట్టుకునేందుకు ప్రయత్నించి నానా అవస్థలు పడుతుంటారు. జమైక జూలో కూడా ఒక సందర్శకుడు ఇలానే జంతువులను ముట్టుకునేందుకు ప్రయత్నించి ఇబ్బందులను కొనితెచ్చుకున్నాడు. ఆ సందర్శకుడు బోనులోనే బంధించి ఉంది కదా అని సంహాన్ని టచ్ చేసి ఆట పట్టించేందుకు ప్రయత్నిచాడు. అంతటితో ఊరుకోకుండా దాని నోటిలో వేలు పెట్టేందుకు ట్రై చేశాడు కూడా. సింహం ఊరుకుంటుందా..'నాతోనే మజాక్ చేస్తావ్ రా'.. అంటూ కోపంతో వాడి వేలును గట్టిగా కోరికి పట్టుకుంది. ఇక ఆ సందర్శకుడు పాట్లు మాములుగా లేవు. తన వేలుని వెనక్కి తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరికి వేలు పైన ఉన్న కండంతా పోయి ఎముకతో మిగిలింది. అందుకే పెద్దలు అంటారు వేటిలో పడితే వాటిలో వేళ్లు పెట్టకూడదని. ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది గానీ మనమే గుర్తించం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. Show off bring disgrace The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk — Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022 (చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు) -
అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి!
సాక్షి,హిందూపురం(అనంతపురం): ఐదు నుంచి ఆరు అంగుళాల గోధుమ వర్ణంతో వంపు తిరిగిన పొడవాటి ముక్కు.. తెలుపు రంగులో మెడ, తల, వీపు.. ఎరుపు, గుళాబీ మిళితమైన రెక్కల కొనలు.. రెక్కల మధ్య, మెడ కింద ముదురు ఆకుపచ్చ రంగు, కాళ్లు తొడల వరకు తెలుపు రంగుతో కూడిన పక్షులు చిలమత్తూరు మండలం వీరాపురంలో సందడి చేస్తున్నాయి. ఇవి రష్యా దేశంలోని సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు. సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం వేల మైళ్ల దూరం నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వీరాపురంతో పాటు వెంకటాపురం, పరిసర ప్రాంతాల చెరువుల్లో నీరు చేరింది. అటవీ శాఖ అధికారులు చెరువుల్లోకి చేప పిల్లలను సైతం వదిలారు. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలలోపు ఇక్కడకు పక్షులు వలస వచ్చి చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. నెలరోజుల తర్వాత ఆడ పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. గుడ్ల వద్ద ఒక పక్షి కాపలా ఉంటే.. మరో పక్షి ఆహారం సేకరించుకుని వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో గుడ్లు పొదుగుతాయి. రెండు నెలలు పాటు పిల్లలకు ఆహారం అందజేస్తాయి. పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక అవే ఆహారం కోసం వెళ్లి వస్తాయి. సంతానం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. -
Statue Of Equality: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు. ప్రారంభానికి ముందే అవస్థలు ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు. భారీ స్వాగత తోరణాలు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) -
Charminar: ‘లాడ్బజార్’.. తళుక్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే
సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్బజార్కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్ను సందర్శిచిన తర్వాత లాడ్బజార్లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు. రాత్రిపూట లాడ్బజార్లోకి వెళ్తే జిగేల్మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్బజార్ను నైట్ బజార్గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్బజార్లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి. ఆ పేరెలా వచ్చిందంటే.. ►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ► మహ్మద్ కూలీ కుతుబ్షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్బజార్లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్బజార్లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. -
మా ప్రైవసీకి భంగం కల్గిస్తారా.. ఎత్తిపడేసింది..
ప్రిటోరియా: సాధారణంగా చాలా మంది సరదాగా గడపటానికి జంతువుల సఫారీలకు, అభయారణ్యాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో సందర్శకులు.. క్రూరమృగాలను, ప్రత్యేక జీవులను దగ్గర నుంచి చూడటానికి ఇష్టపడతారు. వీటికోసం ఆయా పార్కులలో ప్రత్యేక వాహానాలు ఉంటాయి. అయితే, ఒక్కొసారి జంతువులను చూసే క్రమంలో.. సందర్శకులు అనుకొకుండా ఆపదలకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్లో గత ఆదివారం(నవంబరు28) జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలాటి గేమ్ రిజర్వ్లోని క్రూగెర్ నేషనల్ పార్కులో... కొందరు సందర్శకులు ప్రత్యేక వాహనంలో గైడ్ సహయంతో ఏనుగుల సఫారీకి వెళ్లారు. ఆ తర్వాత.. ఏనుగుల దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత.. గట్టిగా అరవడం ఆరంభించారు. వీరిని గమనించిన ఏనుగుల గుంపు కాస్త బెదిరిపోయింది. వారి వాహనం ఏనుగుల దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆఫ్రికా ఏనుగు వారు ప్రయాణిస్తున్న వాహనం వైపు ఘీంకరించుకుంటూ వచ్చింది. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండన్నట్లు..’ వారి వాహనాన్ని తొండం సహయంతో పక్కకు నెట్టి, కిందకు పడేసింది. ఈ సంఘటనతో అక్కడి వారంతా షాక్కు గురయ్యారు. వెంటనే వాహనం నుంచి దూకి పారిపోయారు . అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేవు. వాహనం మాత్రం తుక్కుతుక్కయ్యింది. శీతాకాలంలో ఏనుగులు మేటింగ్లో పాల్గొంటాయి. వాటి ఏకాంతానికి అంతరాయం కల్గినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాయని రిజర్వ్ మేనెజర్ హవ్మెన్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను.. సందర్శకులలో ఒక వ్యక్తి రికార్డు చేశాడు. అతను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏనుగు ఎంత భయంకరంగా ఉంది..’, ‘కొంచెంలో బతికి బట్టకట్టారు..’, ‘మీరు ఏనుగుకు దొరికితే అంతే సంగతులు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Too much intrusion will take your life in Wilderness. However, wild animals keeps on forgiving us since long.#responsible_tourism specially wildlife tourism should be educational rather recreational. हांथी के इतना घुसा नही जाता 🙏 watch second video too pic.twitter.com/AOKGZ2BAjB — WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021 -
ట్యాంక్బండ్పై సందర్శకుల హడావిడీ, సందడిగా చార్మినార్
-
Tit For Tat: ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ రేసిజం చూపిస్తున్న ఇంగ్లండ్కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక మీదట ఇంగ్లాండ్ నుంచి భారత్కు వచ్చే యూకే సిటిజన్స్కు పదిరోజుల క్వారంటైన్ నిబంధనను తప్పినిసరి చేసింది. రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ ఈ నిబంధనను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి భారత్ పర్యటనకు వచ్చే యూకే సిటిజన్లందరికీ క్వారంటైన్ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా.. భారత్కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. భారత్కు చేరుకున్న తర్వాత యూకే సిటిజన్లు తాము వెళ్లదలుచుకున్న డెస్టినేషన్కు ముందు పదిరోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్లో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను సడలించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు అధికారులు విజ్జప్తి చేసినప్పటికీ యూకే పెడచెవిన పెట్టింది. దీంతో కేంద్రం కూడా అదే తరహాలో ఇంగ్లండ్కు గట్టి షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళల వినూత్నంగా.. -
నేడు ట్యాంక్బండ్పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్బండ్పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
ఐక్యతా విగ్రహాన్ని ఎంతమంది సందర్శించారో తెలుసా?
అహ్మదాబాద్: గుజరాత్లోని నర్మదా జిల్లాలోని ‘స్టాచ్యూఆఫ్ యూనిటీ’ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు, 50 లక్షల మందికి పైగా సందర్శకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించినట్టు రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, అన్ని వయస్సుల జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోందని గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్గుప్తా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కెవాడియాలోని సర్దార్ సరోవర్ డ్యాం వద్ద, ప్రపంచంలోనే అతిపెద్దదైన, 182 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018, అక్టోబర్ 31 న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతానికి అదనపు హంగులు జోడించారు. ఈ ప్రాంతానికి రైలు, విమానాల రాకపోకలను మెరుగుపర్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది కొత్త రైళ్ళను, అహ్మదాబాద్ నుంచి సీప్లేన్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులపై కోవిడ్ ప్రభావం పడింది. కోవిడ్ ఆంక్షల కారణంగా ఏడు నెలల సుదీర్ఘ కాలం అనంతరం గతయేడాది అక్టోబర్ 17న తిరిగి సందర్శకులకు అనుమతించారు. ఈ యేడాది జనవరి 18న దేశంలోని పలు ప్రాంతాల నుంచి 8 రైళ్ళను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎక్కువ మంది సందర్శించారని ప్రకటించారు. ప్రస్తుతం పెరిగిన రవాణా సౌకర్యాల కారణంగా ఒక సర్వే ప్రకారం రోజుకి లక్ష మంది పర్యాటకులు కెవాడియాను సందర్శించొచ్చన్నారు. చదవండి: సోనియాపై కేసును మూసేయాలి -
వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్
ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రాకతిక అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం వాటిని చూసి అబ్బుర పడటం కూడా మనకు తెల్సిందే. అందులో కొన్ని సామాన్యంగా కనిపించని అపురూపమైనవి కూడా ఉంటాయి. అలాంటి మెక్సికో పశ్చిమ తీరానికి మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం ఈ బీచ్ విశేషం. దీన్ని రహస్య బీచ్గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్ రిజర్వ్గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలయింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ దీన్ని మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. పై నుంచి చూస్తే ఈ రహస్య బీచ్ ఓ బిలం లోపల ఉన్నట్లు కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఏదిఏమైనా టార్సిసియో స్వారెజ్ అనే వీడియో గ్రాఫర్ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్ కెమేరాతో బిలం బీచ్ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చింది. -
గోల్కొండ కోట సందర్శనకు అనుమతి
-
అక్కడ 24 గంటలకు మించి ఉంటే ఆంక్షలే!
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రవాసులు కాకుండా.. బయటి వ్యక్తులు ఎవరైనా.. 24 గంటలకు మించి మేఘాలయాలో ఉండాలనుకుంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఈ మేరకు మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (ఎంఆర్ఎస్ఎస్ఏ)లో సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మేఘాలయా రాష్ట్రంలోకి ప్రవేశించే బయటి వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలు అధికారుల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ ఉద్యోగులకు ఈ చట్టం వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు రూపొందించిన ఎంఆర్ఎస్ఎస్ఏను 2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాజా సవరణ ప్రతిపాదించినట్టు చెప్పారు. మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ బయటి వ్యక్తులు సులువుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు ప్రతిపాదిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం, నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే.. చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని అన్నారు. అసోంలో భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) అమలు చేసి గత ఆగస్టులో 19 లక్షల మందిని అసోం పౌరులుగా గుర్తించలేదు. కాగా అసోం తరహాలోనే మేఘాలయ ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు చేపట్టనుంది. -
‘వజ్రంగ్’లో పోలీసు జులుం
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): స్థానిక ఆర్ఎంసీలో పది రోజులుగా నిర్వహిస్తోన్న వజ్రంగ్ వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ఆదివారం పోలీసులు జులుం ప్రదర్శించడంతో ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రదర్శకుల సంఖ్య పెరిగిపోవడంతో కళాశాల యాజమాన్యం పోలీసుల సహాయం కోరింది. ఆది, సోమవారాల్లో 5 వేలకు మించి అనుమతించేది నిర్వహకులు ప్రకటించారు. ఈ ప్రదర్శనకు ఆదివారం విద్యార్థులు మళ్లీ పొటెత్తడంతో టూటౌన్ పోలీస్స్టేషన్ అధికారులు జులుం ప్రదర్శించడంతో విద్యార్థులు, ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. రెండు గంటలకు పైగా ప్రదర్శనను నిలిపివేసి విద్యార్థులను క్యూలో నిలబెట్టారు. పోలీస్ల రాకతోనే అటంకాలు వచ్చాయని సందర్శకులు విమర్శించారు. పోలీసు అధికారులు సందర్శకులపై విరుచుకుపడడం, విద్యార్థులను కొట్టేంతంగా పోలీసులు వ్యవహరించడంతో వారు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రదర్శనను తక్షణం నిలిపివేయాలని, లేకుంటే అందరిపైనా కేసులు పెడతామంటూ టూటౌన్ సీఐ, ఎస్సైలు బెదిరించారని ప్రొఫెసర్లు ఆరోపించారు. ఇంతవరకూ సాఫీగా సాగిన ప్రదర్శన ఈ పరిస్థితిపై వాట్స్ప్, నెట్లో చెడుగా ప్రచారమైందంటూ వాపోయారు. ప్రొఫెసర్లు, డాక్టర్లను ఏకవచనంతో ఎస్సై మాట్లాడారని, దీనిపై ఎస్పీ విశాల్ గున్నికి ఫిర్యాదు చేస్తామని పలువురు మెడికల్ విద్యార్థులు తెలిపారు. పోలీసుల తీరును కలెక్టర్, ఎస్పీలను కలసి వివరించేందుకు కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్లు, కాలేజీ విద్యార్థులు, ప్రదర్శన నిర్వాహకులు ఆదివారం రాత్రి సమావేశమై చర్చించారు. ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్పై కూడా.. ఈ ఉత్సవాల కవరేజికి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్పై టూటౌన్ ఎస్సై సత్యనారాయణ జులం ప్రదర్శించి అక్రిడిటేషన్ కార్డును లాగున్నారు. ప్రదర్శనకు వచ్చిన మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తుండగా ఫొటోలు తీస్తుంటే.. ఏమిటీ ఫొటోలు తీస్తున్నాం. ఫొటోలు డిలిట్ చేయలంటూ కెమెరా లాగుక్కునే ప్రయత్నం చేశారు. ‘సాక్షి’ ఫొటోగ్రాఫరని చెబుతున్నా వినకుండా.. నీవు ఫోటోలు ఎందుకు తీసున్నావ్, నేను ఎస్సైని తెలుసా అంటూ.. నీకు ఇక్కడ పనేంటని ప్రశ్నించారు. ‘సాక్షి’అయితే ఏంటీ, నీ అక్రిడిటేషన్ కార్డు చూపించు అంటూనే కేకులు వేశారు. చూపించిన ఆ కార్డును తీసుకొని ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కార్డును తీసుకొని వెళ్లిపోయారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల ఆదివారం సందర్శనకు వచ్చిన పలువురు ప్రదర్శన చూడకుండా తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై కాకినాడ డీఎస్పీ రవివర్మకు ఫిర్యాదు చేశారు. నేడు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా ‘సాక్షి’ఫోటోగ్రాఫర్ సతీష్పై టూటౌన్ ఎస్సై ప్రదర్శించిన జులంపై సోమవారం కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టేందుకు పిలుపు ఇచ్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్ అని చెబుతున్నా ఎస్సై అనుచితంగా వ్యవహరించడం సరికాదని, ఈ విషయాన్ని కలెక్టర్కు వివరించాలని జర్నలిస్టులు నిర్ణయించారు. -
తాజ్ సందర్శకులకు టైమ్ లిమిట్
ఆగ్రా : తాజ్ మహల్ సందర్శకులకు ఇక నుంచి టైమ్ పరిమితిని విధించనున్నారు. రద్దీని, కాలుష్య సమస్యను అరికట్టడానికి ఇక నుంచి తాజ్ మహల్ వద్ద కేవలం మూడు గంటలు మాత్రమే పర్యాటకులు గడిపేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) పరిమితి విధించబోతోంది. ఈ మేరకు ఏఎస్ఐ ఓ నోటీసును జారీచేసింది. ఆదివారం(ఏప్రిల్ 1) నుంచి ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటి వరకు సందర్శకులు సాయంత్రం ఆ ప్రేమ మందిరం మూసే వరకు అక్కడ గడిపే సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సిస్టమ్ను తీసేయనున్నారు. ‘హ్యుమన్ పొల్యూషన్’పై ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వచ్చాయి. తాజ్ వద్ద గడిపే సమయంపై పరిమితి విధిస్తేనే ఈ సమస్యను పరిష్కరించవచ్చని పలువురు నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. వీకెండ్లలో, సెలవుల్లో ఈ ప్రేమ మందిరాన్ని సందర్శించడానికి 50వేల మందికి పైగా సందర్శిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది పిల్లలు సందర్శిస్తారో ఇక రికార్డులు లేవు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ఈ తాజ్ మహల్ సందర్శన ఉచితం. దీంతో హ్యుమన్ కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టైమ్ పరిమితిని ఏఎస్ఐ తీసుకురాబోతోంది. కొత్త సిస్టమ్ ప్రకారం టైమ్ పరిమితి దాటి తాజ్ వద్ద ఎవరైనా ఎక్కువ సమయం వెచ్చిస్తే, అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఏఎస్ఐ అధికారులు చెప్పారు. -
తాజ్ సందర్శకులపై ఫీజు మోత
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ సందర్శకులపై భారీగా ఫీజు భారం పడనుంది. ఎంట్రీ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.40 నుంచి రూ.50కి పెంచటంతోపాటు తాజ్మహల్ లోపల చూడాలనుకున్న వారి నుంచి ప్రత్యేకంగా రూ.200 వసూలు చేయనున్నారు. పెంచిన చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. రూ.50 ప్రవేశ టికెట్ మూడు గంటలపాటు మాత్రమే చెల్లుబాటవుతుందని ఆయన చెప్పారు. రూ.1,250 చెల్లించే విదేశీ పర్యాటకులు సులువుగా సందర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే టికెట్ ధరలు పెంచామని, ఆసక్తి ఉన్నవారే సందర్శనకు వచ్చే అవకాశముందన్నారు. దళారుల బెడద తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1632లో నిర్మించిన తాజ్మహల్ లోపల మొఘల్ చక్రవర్తి షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ సమాధులున్నాయి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ను యునెస్కో 1983లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. -
పర్యాటకం ఢమాల్
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్ సంస్థ బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డాక పర్యాటక శాఖ ఆదాయం నేలచూపులు చూస్తోంది. నదిలో బోట్లు ఎక్కడానికే ప్రజలు భయపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు భవానీ ద్వీపం భారీగా తరలి వచ్చే సందర్శకులతో నిత్య కల్యాణం, పచ్చ తోరణం అన్నట్లు కళకళలాడేది. వారంలో కనీసం రెండు మూడు వేడుకలు జరిగేవి. పర్యాటక సంస్థ బోట్లతో పాటు ప్రైవేటు బోట్లతో సందర్శకులు నదీ విహారం చేసేవారు. అయితే ప్రస్తుతం భవానీద్వీపం సందర్శకులు లేక వెలవెలపోతోంది. ఆదాయానికి భారీగా గండి సాధారణ రోజుల్లో ఐదారు వందల మంది, శని,ఆదివారాల్లో రెండువేల మంది వరకు సందర్శకులు వచ్చేవారు. కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిన రోజు సుమారు ఐదువేల మంది పర్యాటకులు భవానీద్వీపంలో ఉన్నారు. రెండు వేల మంది వరకు వస్తే ద్వీపానికి, బోటింగ్కు కలిసి లక్ష రూపాయల ఆదాయం వచ్చేది. సాధారణ రోజుల్లో రూ.25 వేల ఆదాయం సమకూరేది. ప్రమాదం జరిగిన తరువాత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత శని, ఆదివారాల్లో కేవలం రెండు మూడు వందల మంది మాత్రమే వచ్చారని, ఆదాయం రూ.10 వేలకు మించి రాలేదని పర్యాటక సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. వారం రోజులుగా రోజుకు 100 మంది లోపే వచ్చారు. కార్తీకమాసంలో వారానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చింది. గత వారంలో రూ.50 వేలు కూడా రాలేదని సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత ద్వీపం నిర్వహణ ఖర్చులు రావడం లేదు. పోలీసుల ఆంక్షలు గతంలో కంపెనీల పార్టీలకు భవానీద్వీపాన్ని, బోట్లను అద్దెలకు ఇచ్చేవారు. ప్రమాదం జరిగిన తరువాత పోలీసు ఆంక్షలు బాగా పెరిగిపోయాయి. గత ఆదివారం భవానీద్వీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం నిర్వాహకులు మూడు నెలల క్రితం బుక్ చేసుకున్నారు. తొలుత నిర్వహకులకు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పర్యాటక సంస్థ చెప్పినట్లు సమాచారం. చివరకు పోలీసుల అనుమతులతో అతికష్టం మీద ఆ కార్యక్రమం జరిగింది. బోట్లను సూర్యాస్తమయం తరువాత తిప్పడం లేదు. శని, ఆదివారాల్లో గ్రూపు బుకింగ్లను నిలుపుదల చేశారు. పోలీసులు, పర్యాటక అధికారులు ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలో సగమైన గతంలో తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి 22 మంది ప్రాణాలు పోయేవి కావని సందర్శకులు పేర్కొంటున్నారు. పడవల్లో ప్రయాణానికి అర్చకులు విముఖత పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతులు ఇచ్చేందుకు రోజూ 15 మంది అర్చకులు బోట్లలో నది మధ్యలోకి వెళ్తారు. బోటు ప్రమాదం అనంతరం అర్చకులు బోట్లలో నదిలోకి వెళ్లేందుకు అంగీకరించడంలేదని దుర్గగుడి వర్గాలు పేర్కొన్నాయి. బోట్లకు బదులుగా జట్టీ, లేదా ఫంట్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. నది మధ్యలో ఏర్పాటు చేసిన ఫంట్ను ఒకటికి రెండుసార్లు పర్యాటకశాఖ, జల వనరులశాఖ అధికారులతో తనిఖీ చేయించనున్నారు. పవిత్ర సంగమం వద్ద బోల్తాపడిన బోటు ఇదే (ఫైల్) -
బీచ్లో సందర్శకుల సందడి
మొగల్తూరు:పాఠశాలలకు సెలవులు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పేరుపాలెం బీచ్కు సందర్శకులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి వచ్చి కెరటాలపై కేరింతలు కొట్టారు. సాయంత్రం వరకూ సాగర తీరంలో ఆనందంగా గడిపారు. -
చిన్నమ్మ కోసం జైలు రూల్స్ బ్రేక్
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. బెంగళూరు సెంట్రల్ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా రోజుకు ఒక్క విజిటర్ నైనా ఆమె కలవడానికి అనుమతిస్తున్నారని వెల్లడైంది. 31 రోజుల్లో 27 మంది విజిటర్లు ఆమెను కలవడానికి వచ్చినట్టు తెలిసింది. రోజుకు ఓ విజిటర్ అయినా ఆమె దగ్గరకు రావడం బెంగళూరు జైలు మాన్యువల్ ప్రకారం కఠోర ఉల్లంఘన. కానీ ఆ రూల్స్ ను బెంగళూరు జైలు ఉల్లంఘిస్తోంది. మరోవైపు సాధారణ ఖైదీల్లా కాకుండా... శశికళ టీమ్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు ఇండియా టుడే తెలిపింది. జైలు మాన్యువల్ ప్రకారం.. ఖైదీలను చూడటానికి విజిటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే రావాలి. కొన్ని సందర్భాల్లో శశికళను, ఆమెతో పాటు శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఇల్లవరసి, సుధాకరన్ లను చూడటానికి వచ్చే విజిటర్లు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వస్తున్నారని తెలిసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖులు వారానికోసారి లేదా 15 రోజుల్లో ఓసారి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రమే అర్హులై ఉంటారు. ఇప్పటివరకు శశికళను, ఇల్లవరసిని కలవడానికి వచ్చిన విజిటర్ల జాబితాను ఇండియా టుడే రాబట్టింది. ఆ జాబితా ప్రకారం 2017 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 18 వరకు చెన్నైకు చెందిన అడ్వకేట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జైలుకు వచ్చి శశికళను కలిసినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇల్లవరసి, సుధాకరన్ లు ప్రస్తుతం బెంగళూరులోని పరపణ్ణ అగ్రహార జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
గండిపేట.. జల(న) కళ
మణికొండ: గండిపేట(ఉస్మాన్సాగర్) జలకళను సంతరించుకుంది. ఇటీవల వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు చేరడంతో చెరువుకు పూర్వవైభవం వచ్చింది. దీంతో సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో చెరువును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు. జలకళతో పాటు జనకళ సంతరించుకోవడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లలో ఇంత పెద్ద ఎత్తున జనం రావడం ఇదే మొదటిసారి అని పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది. -
సందర్శనకు అనుమతివ్వం
సింగూర్ ప్రాజెక్టుకు రెండోరోజు పోటెత్తిన జనం మూడు చెక్పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు సీఐతో సహా నలుగురు ఎస్సైలు రంగంలోకి.. పుల్కల్: వరదల నేపథ్యంలో సింగూర్కు సందర్శకులు రావొద్దని పోలీసులు ముందే హెచ్చరించినా.. ప్రాజెక్టుకు జన తాకడీ తగ్గడం లేదు. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, జోగిపేట పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు చూసేందుకు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు నుంచి సింగూర్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో కలెక్టర్ రోనాల్డ్రోస్ తిరుగుప్రయాణంలో రోడ్ క్లియరెన్స్కు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సందర్శకులను నివారించేందుకు కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్దాన్పల్లి చౌరస్తా వద్ద సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో.. పెద్దరెడ్డిపేట చౌరస్తా వద్ద శంకరంపేట ఎస్సై విజయరావు, టేక్మాల్ ఎస్సై ఎల్లాగౌడ్ పర్యవేక్షణలో మరొక చెక్పోస్టు ఏర్పాటుచేశారు. అల్లాదుర్గం ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సోమవారం నుంచి సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రాజక్టు పరిసరాల వద్దకు అనుమతించేది లేదని జోగిపేట సీఐ వెంకటయ్య హెచ్చరించారు. స్థానిక ఎస్సై సింగూర్ గ్రామం నుంచి ప్రాజెక్టు వరకు ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పర్యవేక్షించారు. కాగా, మధ్యాహ్నం పోలీసులు భోజనం చేస్తుండగా.. సందర్శకులు ఒక్కసారిగా ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టును సందర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే, చైర్పర్సన్ సింగూర్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో పాటు సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి సందర్శించారు. ఇన్ప్లో వివరాలను ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
సింగూర్కు సందర్శకులు రావొద్దు
పుల్కల్: సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే వారు మరో మూడు రోజుల వరకు ఇటు వైపు రావొద్దని ఎస్ఐ సత్యానారాయణ సూచించారు. సదాశివపేట-సింగూర్ రోడ్డుతో పాటు అత్మకూర్- బొబ్బిలిగామ, సింగూర్-మాలపాహడ్ రహదారులు పూర్తిగా తెగిపోయి ప్రమాద కరంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉందన్నారు. వర్షాలు తగ్గే వరకు ఇటు వైపు రావొద్దని కోరారు. -
పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్’ అలుగు
ఎట్టకేలకు కరువుదీరా వర్షాలు కురిశాయి. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఊరటనిచ్చాయి.. జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మండలంలోని లక్నాపూర్ ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతోంది. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండుకుండలా మారింది. కాగా శనివారం రాత్రి కురిసిన వర్షానికి అలుగు పారుతోంది. దీంతో సందర్శకులు లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు అందాలు చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. - పరిగి -
జూరాలకు సందర్శకులు
దరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం క్రస్టుగేట్ల వద్ద యువకులు సంచరిస్తూ సందడి చేశారు. ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఫోటోలకు ఫోజులిచ్చి సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. పీజేపీ అధికారులు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లను చేపట్టలేదు. -
కుంటాల జలపాతంలో ఒకరు గల్లంతు
నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో ఒకరు గల్లంతయ్యారు. కుంటాల జలపాతం అందాలను తిలకించేందుకు ఆదివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి ఏడుగురు మిత్రబృందంతో కలిసి వచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ క్రమంలో కుంటాల జలపాతం వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు రుద్రవరం వినయ్(31) గల్లంతయ్యాడు. మిగతా మిత్రులు తేరుకునే లోపే ఆయన కనిపించకుండా పోయాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్టకు చెందిన వినయ్ బుక్స్టాల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుండే వాడని అతడి మిత్రులు తెలిపారు. కాగా జలపాతం వద్ద జాలువారే అందాలను తిలకించడానికి వచ్చి జలపాతంలో గల్లంతయ్యాడు. మిగతా స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి కావడంతో జాలర్లు ఉదయం గాలిస్తామని తెలిపారు. జలపాతంలో అతడు గల్లంతయ్యాడా.. లేక మిత్రులే తోసేశారా అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఏఎస్సై దశరథ్ను సంప్రదించగా.. వారు వివరాలు తెలపడానికి నిరాకరించారు. -
కడెంలో ప్రముఖుల సందడి
కడెం : కడెంకు మునుపెన్నడూ లేని విధంగా ఒక్కరోజే ప్రముఖల సందడి ఏర్పడి ఏర్పడింది. ఆదివార ం ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి మొదలైంది. కలెక్టర్ జగన్మోహన్ కుటుంబ సమేతంగా ఒక రోజు ముందే కడెం రిసార్స్కు చేరుకున్నారు. కలెక్టర్ను కలిసేందుకు పీసీసీఎఫ్ పీకే ఝా, అడిషనల్ పీసీసీఎఫ్ పీ మధుసూదన్ రావు, టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ ఎస్కే గుప్త ఆదివారం ఉదయం కడెంకు వచ్చారు. వారి వెంట సీఎఫ్ తిమ్మారెడ్డి, నిర్మల్, జన్నారం డీఎఫ్వోలు రాంకిషన్రావు, రవీందర్, కడెం ఎఫ్ఆర్వో నాగయ్య ఉన్నారు. మధ్యాహ్న సమయంలో జిల్లా జడ్జి ఉదయగౌరి కుటుంబసమేతంగా కడెం ప్రాజెక్టును సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి పడవలో జలాశయంలో విహరించారు. హరితారిసార్ట్స్, కడెం ప్రాజెక్టును మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు దివాకర్రావు, రేఖానాయక్ సందర్శించారు. సాయంత్రం కడెం ప్రాజెక్టు, బోటింగు కేంద్రం వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. వందల సంఖ్యలో పర్యాటకులు వాహనాల్లో రావడంతో ప్రాజెక్టుపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను నియంత్రించారు. చాలా రోజుల తర్వాత ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. -
ఆద్యంతం ఆనందం..
సిటీ ప్రజల ఆదరణ పొందిన ‘రాహ్గిరి’ ఆదివారం ‘డ్రామాగిరి’గా మారింది. వరల్డ్ థియేటర్ డేను పురస్కరించుకొని రాహ్గిరిలో నిశుంభిత ఆధ్వర్యంలో థియేటర్ ఆర్టిస్ట్, రచయిత, డెరైక్టర్ అయిన డాక్టర్ రామ్మోహన్ హొలంగుడి పర్యవేక్షణలో రోడ్డు భద్రతపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. రచయిత ఉమా కిరణం ‘మహిళా సాధికారత’పై ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్, సైకుల్ పర్యవేక్షణలో సైక్లింగ్, అభిమానిక, వేణు ఆధ్వర్యంలో జుంబా డాన్స్, ఫిట్జాబ్ ద్వారా ఫిట్నెస్, నావిగో స్ట్రీట్ గేమ్స్తో రాహ్గిరి ఆద్యంతం ఆనందాన్ని పంచింది. చిన్నపిల్లలతో తల్లిదండ్రులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఇందులో పాలుపంచుకోవడం విశేషం. - రాయదుర్గం -
‘రాజహంస’ కోసం క్యూ కట్టారు..
ఏవియేషన్ షోలో రెండో రోజూ సందర్శకుల కిటకిట హైదరాబాద్: పొగలు కక్కుతూ ఆకాశంలోకి దూసుకుపోవడం... అంతలోనే కిందపడుతుందేమో అనిపించడం.. మళ్లీ వేరే డెరైక్షన్లో విమానం దూసుకుపోవడం.. దానికి వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోతాయేమో అని భ్రమ కల్పించడం.. మొత్తం గా ఏవియేషన్ షోలో వైమానిక విన్యాసాలు సందర్శకులను ఊపిరి బిగబట్టేలా చేశాయి. రెండో రోజు కూడా ఏవియేషన్ షో కిటకిటలాడింది. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వైమానిక విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తుల స్టాల్స్ను ప్రదర్శించారు. విమానయానానికి అనుబంధంగా ఆయా ఉత్పత్తులు అధునాతన టెక్నాలజీని సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అందరి బాటా... రాజహంస వైపే.. ఏవియేషన్ షోకే హైలైట్గా నిలుస్తోన్న ఎమిరేట్స్(రాజహంస)ను చూసేందుకే సందర్శకులు మక్కువ కనబరుస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఆ డబుల్ డెక్కర్ విమానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, డీజీపీ అనురాగ్శర్మ తదితరులు సైతం ఏవియేషన్ షోను సందర్శించి ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కి అందులోని ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఇక సందర్శకులైతే మండుటెండలో క్యూలో నిలబడి ఆ విమానాన్ని చూసి మహదానందం పొందారు. -
సందర్శకులకు చంద్రబాబు ఆర్ధిక సాయం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి మంగళవారం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి చంద్రబాబును కలవడానికి వచ్చిన వారితో ప్రాగంణం కిక్కిరిసిపోయింది. విద్య, ఆరోగ్య, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారికి ఆర్థికం సాయం అందించారు. ► విజయవాడకు చెందిన నాగుల్బికు కిడ్నీ చికిత్స కోసం లక్ష రూపాయల సహాయం ప్రకటించారు. ► గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో ఆమె వైద్యానికి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. ► కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వెంకటరావమ్మ రైలు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ ఆర్ధికంగా దెబ్బతిన్నారు. ఆమెకు రూ. లక్ష రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. పలువురికి ఉన్నత చదువులు, వివాహానికి, వైద్య ఖర్చులకు, ఆర్ధికంగా ఎదుగుదలకు చంద్రబాబు సాయం అందించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి ఆయన భరోసా నిచ్చారు. దీనిపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. -
హింసను అరికట్టేందుకు ' స్పీక్ అప్'!
దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ ఆరెంజ్ కంటెయినర్ లో ' స్పీక్ అప్' పేరిట నిర్వహించిన కార్యక్రమం.. హాజరైన వారికి కన్నీళ్ళు తెప్పించింది. బాధిత మహిళల ఆవేదనను బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వినిపించిన ఆ స్వరం... అక్కడివారి హృదయాలను కదిలించింది. ఓ తాగుబోతు భర్తనుంచి ఆమె ఎదుర్కొంటున్న వేధింపుల వివరాలతో... బాధిత మహిళ జీవిత గాధ ఆధారంగా రూపొందించిన ఆడియో కథనం అది. మనసులను కదిలించిన ఆ భావోద్వేక సౌండ్ ట్రాక్ మహిళాలోకాన్నే మేలుకొలిపేందుకు, అవగాహన కల్పించేందుకు నినాదమైంది. అరబ్బు దేశంలో మొదటిసారి మహిళలపై గృహ హింసకు వ్యతిరేకంగా 'దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛిల్డ్రన్' ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇంటరాక్ట్రివ్ కార్యక్రమం అది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు పునాదిగా మారింది. పదిమంది మహిళల్లో సుమారు ఏడుగురు తమ జీవిత కాలంలో హింసను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం తెలుస్తోందని కార్యక్రమం మేనేజర్ ఫాతిమా అస్ ఫలాసి తెలిపారు. బాధితులు నిశ్శబ్దంగా అనుభవిస్తున్న కష్టాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలన్నదే తమ ఆశయమని, గుండె లోతుల్లో దాచుకున్న వారి భావోద్వేగాలను తెలుసుకొని వారికి ఉపశమనం కలిగించేందుకు తమ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని ఫాతిమా భావిస్తున్నారు. ఇటువంటి వేదికపై మహిళలు హింసపై మాట్లాడడం మంచి సంకేతమని, మరొకరికి సహాయంగా మారుతుందని ఫాతిమా అంటున్నారు. గత ఏడు సంవత్సరాల్లో దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛైల్డ్ సుమారు 15 వందలకు పైగా గృహహింస కేసులను పరిష్కరించింది. బాధితుల్లో ఎక్కువశాతం 18 ఏళ్ళ వయసున్నవారు... ఇతర దేశాలనుంచి వచ్చి, దుబాయ్ లోని పురుషులు, కుటుంబ సభ్యులవల్ల శారీరకంగానూ, మానసికంగానూ గృహ హింసకు గురైన వారే ఉన్నారు. అయితే మహిళలపై హింసకు పాల్పడటంలో ఏ దేశం మినహాయింపు కాదని, సుమారు ఆరు వందల మిలియన్లకు పైగా గృహహింసకు గురౌతుంటే దాన్ని హింసగా గుర్తించడం లేదని ఫాతిమా అన్నారు. అయితే హింస ఎటువంటిదైనా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని ఆమె తెలిపారు. అలాగే సమావేశం తర్వాత ఎందరో తమ అనుభవాలను, కన్నీటి గాధలను తమతో పంచుకున్నారని, సౌండ్ ట్రాక్ విన్నవారు స్పందించి, గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. అల్ ఫలాసీ ఆరెంజ్ కంటైనర్ మరి కొద్ది నెలల్లో గృహహింస నిర్మూలకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇటీవల జనంలో గృహహింసపై అవగాహన కల్పించేందుకు, జీవితాలను తీర్చిదిద్దేందుకు ఎన్నో టీవీ కార్యక్రమాలను సైతం రూపొందిస్తున్నారు. అయితేనేం రోజురోజుకూ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. ఆరెంజ్ కంటైనర్ మరి ఏ మేరకు సేవలు అందించగల్గుతుందో వేచి చూడాలి. -
గోల్కొండ.. పర్యాటకానికి అండ
పంద్రాగస్టు వేడుకలతో సందర్శకుల తాకిడి * చార్మినార్ను వెనక్కి నెట్టిన వైనం సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట పర్యాటకరంగానికి ఊతమిస్తోంది. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటపై ప్రభుత్వం నిర్వహించింది. మువ్వన్నెల జెండా రెపరెపలు గోల్కొండకు కొత్త ఊపునిచ్చాయి. దీంతో గోల్కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అప్పటి వరకు తెలంగాణలో అత్యధిక పర్యాటకులు సందర్శించే చారిత్రక స్థలంగా రికార్డుల్లో నమోదైన చార్మినార్ను వెనక్కునెట్టి గోల్కొండ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మరోసారి గోల్కొండ కోట మీద జాతీయ పతాకం సగర్వంగా ఎగరనుండటంతో ఈసారి కూడా కోట ఖ్యాతి మరింత విస్తరించనుంది. పంద్రాగస్టు వేడుకలను కోటలో నిర్వహించటంతో గత సంవత్సరం ఆగస్టులో దేశవిదేశాల్లో దానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. దీంతో సరిహద్దులు దాటి పర్యాటకులు కోట వైపు క్యూ కట్టారు. గత సంవత్సరం ఆగస్టు వరకు నెలకు సగటున లక్ష మంది పర్యాటకులు కోటను సందర్శిస్తూ రాగా... ఆ తర్వాత అది 1.60 లక్షలకు చేరుకుంది. అప్పటి వరకు సగటున నెలకు లక్షన్నర మంది పర్యాటకులతో తొలిస్థానంలో ఉన్న చార్మినార్ ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది. గోల్కొండకు పర్యాటకుల తాకిడి స్థిరంగా ఉంటుందని గుర్తించిన కేంద్రపురావస్తు శాఖ ప్రత్యేక చర్యలకూ సిద్ధమైంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోటలోని ‘సౌండ్ అండ్ లైట్ షో’కు కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. గత ఆగస్టు 15కు పూర్వం సగటున రోజుకు వంద మంది సౌండ్ అండ్ లైట్ షోను సందర్శిస్తుండగా ఒక్కసారిగా ఆ సంఖ్య 500 ను చేరుకోవటం విశేషం. అప్పటి వరకు రోజుకు రూ.పది వేలలోపు ఆదాయం ఉండగా అది ప్రస్తుతం రూ.75 వేలకు చేరింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక భారీగా పెరిగింది. సగ టున నెలకు 1200 విదేశీ పర్యాటకులు కోట దర్శనానికి వస్తుండడం విశేషం. -
ఎయిర్ పోర్ట్ సందర్శకులకు 'నో ఎంట్రీ'
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చూడాలనుకునేవారికి ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. నేటి నుంచి ఈ నెల 30 వరకు విమానాశ్రయాన్ని సందర్శించేందుకు వచ్చేవారికి అధికారులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల హెచ్చరికల ప్రకారం భద్రతా దృష్ట్యా ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల రక్షణా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరినీ తనిఖీ చేసి ఎయిర్ పోర్టు అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు. దాదాపు ఈ నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఉండనుంది. -
జల్లంత... తుళ్లింత
-
గోల్కొండ కోట కిటకిట
హైదరాబాద్: గోల్కొండ కోట ఆదివారం పర్యాటకులతో కిట కిటలాడింది. అధిక సంఖ్యలో పర్యాటకులు ఒకే రోజు తరలిరావడం రెండు నెలల తర్వాత ఇదే ప్రథమం. దీంతో గోల్కొండ కోటతో పాటు పరిసరాలు కిట కిటలాడాయి. పరీక్షల సీజన్ ముగియడంతో విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. కాగా, మరో పర్యాటక ప్రాంతమైన కుతుబ్షాహి సమాధుల ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు సందడి చేశారు. -
పర్యాటక కేంద్రంగా కుతుబ్ షాహీ సమాధుల అభివృద్ధి
-
కొత్త లుక్తో తారాపోర్వాలా అక్వేరియం
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటైన తారాపోర్వాలా మత్స్యాలయం (ఫిష్ అక్వేరియం) కొత్త హంగులతో శుక్రవారం నుంచి సందర్శకులకు కనువిందు చేయనుంది. చర్నీరోడ్ చౌపాటీకి సమీపంలో ఉన్న ఈ అక్వేర్యాన్ని నవీకరణ పనుల కోసం 2013 మార్చి నుంచి మూసివేశారు. ఇప్పుడు కొత్త హంగులతో, వివిధ రకాల దేశ, విదేశాలకు చెందిన దాదాపు 110 రకాల చేపలతో రూపుదిద్దుకున్న ఈ అక్వేర్యాన్ని సందర్శకుల కోసం ఈ నెల 27 నుంచి పునఃప్రారంభించనున్నారు. అయితే టికెటు చార్జీలు మాత్రం భారీగా పెంచారు. కొత్త చార్జీల్లో విద్యార్థులకు, వృద్థులకు, వికలాంగులకు సైతం ఎలాంటి రాయితీలు కల్పించలేదు. ఈ అక్వేర్యంలో మొబైల్, కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఎవరైనా దేశ, విదేశీ పర్యాటకులు వీడియో షూటింగ్ చేయాలనుకుంటే రూ.500 నుంచి రూ.10,000 (కెమెరాను బట్టి) వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా వీడియో చిత్రీకరణ పనులు చేపడితే అందుకు రూ.రెండు వేలు జరిమానా విధించడంతోపాటు షూటింగ్ చేసిన మొబైల్ లేదా కెమెరాను జప్తు చేస్తారు. ఈ మత్స్యాలయాన్ని 2-జీ, 3-జీ స్థాయిలో ఆధునికీకరించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.40, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.30, విదేశీ పర్యాటకులకు (పెద్దలకు) రూ.200, 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నియమ, నిబంధనలు వీడియో షూటింగ్ చేసే సమయంలో మత్స్యాలయ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా, చేపలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిష్ ట్యాంకులో చేతుల పెట్టడం, వాటి పక్కన నిలిచి ఫొటోలకు ఫోజ్ ఇవ్వడం లాంటివి చేయకూడదు. కెమెరా ఫ్లాష్ వాడకూడదు. ప్రొఫెషనల్, స్టిల్ కెమెరాతో షూటింగ్ చేయాలనుకునేవారు వారం రోజుల ముందు అనుమతి తీసుకోవాలి. చార్జీల వివరాలిలా ఉన్నాయి... వర్గాలు పాత (రూ.) కొత్త (రూ.) 3-12 ఏళ్ల లోపు పిల్లలకు 10 30 12 ఏళ్ల పైబడిన వారికి 15 60 వికలాంగులకు ఉచితం 30 వీడియో షూటింగ్ చార్జీలు (రూ.లలో) మొబైల్ ఫోన్తో 500 వీడియో కెమెరా, డిజిటల్ కెమెరా 1,000 ప్రొఫెషనల్ స్టిల్ కెమెరా 5,000 ప్రొఫెషనల్ షూటింగ్ 10,000 -
మంత్రిగారూ.. మాటియ్యరూ...
కనీస వసతులు కరువు కాలగర్భంలో పంచకూటాలయం మోక్షం లేని మల్లూరు రోడ్డు మంత్రి చొరవ చూపాలని కోరుతున్న ప్రజలు పర్యాటక కేంద్రాలు అనగానే జిల్లాలో మొదటగా గుర్తుకొచ్చేవి ములుగు పరిధిలోని లక్నవరం సరస్సు, రామప్ప, మల్లూరు ఆలయాలు. ఏళ్ల తరబడి ఇవి నిరాద రణకు గురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే మంత్రిగా ఎదిగిన చందూలాల్ నేడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యం లో పర్యాటక ప్రాంతాల దుస్థితిపై కథనం.. ములుగు : నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో సందర్శకులు, విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 12వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప ఆలయం, చెరువు ప్రసిద్ధి గాంచాయి. ప్రతీ ఏడాది లక్షలాది మంది పర్యాటకులు రామప్ప కు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ పర్యాటకులు, భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీ సం మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పా టు చేయకపోవడం బాధాకరం. ఆల యం నుంచి చెరువు ప్రాంతానికి సింగి ల్ రోడ్డు మాత్రమే ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఆలయానికి వెళ్లే దారిని నాలుగు లేన్లుగా మార్చి, చెరువు కట్టపై, ఆలయం లో పర్యాటకుల కోసం కనీస వసతులు కల్పిస్తే బాగుంటుంది. వెంకటాపురం మండలం రామాం జపూర్ శివారులోని పంచకూటాలయం పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తోంది. 2012 కాకతీయ శతాబ్ది ఉత్సవాల ముందు సందడి చేసిన ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పునర్నిర్మాణం కోసం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించారు. లక్నవరం బుస్సాపూర్ సమీపంలో ఉన్న లక్నవరం చెరువు ప్రత్యేకతను చాటుకుంటోం ది. ఓ వైపు దట్టమైన అడవి, మరో వైపు లోయ వీటి మధ్య ప్రయాణం కాస్త ఇబ్బంది పెడుతుంది. రామప్ప తరహాలో ఇక్కడ కూడా మహిళలు, చిన్నారులకు కనీస వసతు లు కరువయ్యాయి. చెరువులో ఉన్న ఏడు ఐలాండ్లను ఒక్కో విధంగా తీర్చిదిద్దితే పర్యాటకులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉయ్యాల వంతెన, కాటేజీలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కాకరకాయల దీవికి మరో వంతెన నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నా.. మోక్షం లభించలేదు. రోడ్డు సౌకర్యం లేని మల్లూరు మంగపేట మండలం మల్లూరు మహా క్షేత్రం ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా పేరు గాంచింది. ఆలయానికి భక్తులు, పర్యాటకులు ప్రతి శని, ఆది, గురువారాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హేమాచల నర్సింహస్వామి మహిమ గల వాడని ప్రజల నమ్మకం. గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. క్షేత్రానికి వెళ్లడానికి కనీసం రోడ్డు లేకపోవడం నాయకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. భక్తులు విడిది చేసేందుకు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి నిత్యం వందలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏటా సుమారు రూ.40లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ రోడ్డు, మంచి నీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ప్రచారం లేని హరిత వనాలు రామప్ప, లక్నవరం, ములుగు మండలం ఇంచర్ల పరిధిలో ఎకో టురిజం అధికారులు పచ్చటి వనాల మధ్య హరిత హోటళ్లను నిర్మించారు. కానీ వీటిపై ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. కేవలం డబ్బున్న వారికే హరిత హోటళ్లు పరిమితమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. కాగా, నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మంత్రి చందూలాల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. నేడు మంత్రి చందూలాల్ రాక హన్మకొండ/ములుగు : రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా వస్తున్న చందూలాల్కు 11.15 గ ంటలకు మడికొండలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలకనున్నాయి. 11.30కు అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పిస్తా రు. 11.40 కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి, మధ్యాహ్నం 12 గంటలకు ములుగుకు బయలుదేరుతారు. 12.45కు మహ్మద్గౌస్పల్లికి చేరుకుం టారు. బైక్ ర్యాలీతో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రేమ్నగర్ గట్టమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 1.20కు డీఎల్ఆర్ గార్డెన్స్లో జరిగే సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. -
మహేష్ బాబును కలవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే!
ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.... సెక్యూరిటీ సిబ్బందికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. తమ అనుమతి లేకుండా ఎవరినీ లోనికి అనుమతించవద్దని హెచ్చరించారు. ఇంతకు నమ్రతా ఎందుకలా సీరియస్ అయ్యారు. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు 'ఆగడు' ఫెయిల్యూర్తో నమత్రా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్ట్లపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. గతంలో మహేష్ బాబుకు కథ చెప్పేందుకు చాలామంది నిర్మాతలు... ఎలాంటి సమాచారం కానీ, అపాయింట్మెంట్ గానీ తీసుకోకుండా డైరెక్ట్గా కలిసేవారు. అయితే అదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. ఎవరైనా సరే....మహేష్ బాబును కలవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇటీవల మహేష్ బాబు.. ఓ నిర్మాత...దర్శకుడితో కలిసి కథ చెప్పేందుకు ఆయన ఇంటికి వెళ్లాడు. వాళ్లు కథ వినిపించేసి వెళ్లిపోయారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత...తమకు సమాచారం ఇవ్వకుండా వాళ్లను లోనికి ఎందుకు పంపించారని నమ్రతా శిరోద్కర్ ...సెక్యూరిటీకి క్లాస్ పీకారట. మరోసారి ఇటువంటివి రిపీట్ కావద్దొంటూ గట్టిగానే ఆదేశించినట్లు సమాచారం. కాగా మహేష్ బాబుకు సన్నిహితంగా ఉండే ఓ నిర్మాత కూడా నమ్రత కొత్త నిబంధనతో వాళ్ల ఇంటి దరిదాపులకు కూడా రావటం లేదట. మహేష్ బాబు కూడా 'భజన గ్యాంగ్'ను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబును కలవాలంటే ముందుగా నమత్ర వద్ద అనుమతి తీసుకోవాల్సిందే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఇక్కడా అంతే!
నగరంలోని జూలోనూ భద్రత అంతంతే తక్కువ ఎత్తులోనే పులుల ఎన్క్లోజర్లు పైకి ఎక్కుతున్న సందర్శకులు పట్టించుకోని జూ సిబ్బంది ఢిల్లీ సంఘటనతోనైనా మేలుకోని వైనం బహదూర్పురా: సందర్శకులు చేష్టలుడిగి చూస్తుండగా... వారి కళ్ల ముందే ఓ వ్యక్తిని పులి పొట్టన పెట్టుకున్న విషాద సంఘటనకు మంగళవారం ఢిల్లీలోని జూ వేదికైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలల్లో భద్రతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చే నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని పులులు, సింహాల ఎన్క్లోజర్ల దగ్గర పరిస్థితి ఢిల్లీకి భిన్నంగా ఏమీ లేదు. వీటి చుట్టూ ప్రస్తుతం ఉన్న ఇనుప కంచెల ఎత్తు తక్కువగా ఉండటంతో సందర్శకులు అప్పుడప్పుడు వాటిపైకి ఎక్కి కౄరమృగాలను తిలకిస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినప్పటికీ... జంతువులను దగ్గరగా చూడాలనే ఆతృతతో జాగ్రత్తలను పాటించడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో గతంలో ఓ సందర్శకుడు పులి ఎన్క్లోజర్ జాలీ నుంచి ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించగా... అతని చేతిని అది పూర్తిగా కోరికేసింది.ఇలాంటి సంఘటనల గురించి తెలిసినప్పటికీ... సందర్శకులు మేలుకోవడం లేదు. ఎన్క్లోజర్ల వద్ద వన్యప్రాణులకు బయటి ఆహారాన్ని అందించటం...రాళ్లు విసరటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాలు, పులుల ఎన్క్లోజర్ల పరిస్థితిని బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా... అదే తరహా దృశ్యాలు కనిపించాయి. తెల్ల పులుల ఎన్క్లోజర్ వద్ద ఇనుప తీగెలతో చేసిన కంచె సగం వరకే ఉంది. కొందరు సందర్శకులు ఈ కంచె పైకి ఎక్కుతూ... పులులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఢిల్లీలోని సంఘటన ఇక్కడి జూ అధికారులను కదిలించినట్టు లేదు. ఇనుప కంచెల పైకి ఎవరూ ఎక్కకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. చిన్నారులు ఇనుప కంచెల మీదకు వెళుతున్నా... జూ యానిమల్ కీపర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్క్లోజర్ వద్ద మోకాళ్ల ఎత్తు వరకే ఇనుప కంచె ఉంది. అక్కడ చిన్నారులను తల్లిదండ్రులు ఇనుప కంచెపై నిలబెట్టి పులులను చూపిస్తున్నారు. సింహాల ఎన్క్లోజర్ వద్ద తక్కువ ఎత్తున్న ఇనుప రాడ్లపైకి చిన్నారులతో పాటు పెద్దలు ఎక్కుతూ మృగరాజులను తిలకిస్తూ కనిపించారు. అలా ఎక్కకూడదంటూ యానిమల్ కీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు. పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద కంచె ఎత్తును పెంచితేనే ఢిల్లీలాంటి సంఘటనలను నివారించవచ్చు. పులులు, సింహాలకు బయటి ఆహారాన్ని తినిపించేందుకు చేతులను ఎన్క్లోజర్కు చాపుతూ ఆహారాన్ని విసరడం వంటివి సందర్శకులు చేస్తున్నారు. దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరాన్ని జూ అధికారులు, సిబ్బంది గుర్తించాలి. -
జూవిలాపం
- ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో జంతువులు కరువు - వృద్ధాప్యంతో దర్శనమివ్వని సింహాలు - షెడ్లకే పరిమితమైన ఏనుగులు - భూతద్దం పెట్టి వెతికినా కనిపించని మొసళ్లు - ఉసూరుమంటున్న సందర్శకులు తిరుపతి(మంగళం) : శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతి పెద్దది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇదంతా కేవలం పేరుకు మాత్రమే. సందర్శకులు మాత్రం జూపార్క్ ఏమాత్రమూ అలరించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 30 సంవత్సరాల్లో జూ పార్క్ పేరు పరంగా దినదినాభివృద్ధి జరుగుతున్నప్పటికీ జంతువుల పరంగా ఏమాత్రమూ ఎదుగుబొదుగు లేకుండా ఉంది. 2200 హెక్టార్ల విస్తీర్ణంలో 1100 జంతు, పక్షి జాతులతో సందర్శకులను రంజింపజేస్తున్నాయని అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కనపడడంలేదు. ఒకటి, రెండు మినహా గడిచిన 30 ఏళ్లలో అవే జంతువులు సందర్శకులకు దర్శనమిస్తున్నాయి. అందులో వయస్సు మీరినవి, ఒంటరిగా ఉన్నవి, గాయాలపాలైనవే ఎక్కువుగా ఉన్నాయి. రెండు కిలోమీటర్ల పరిధిలో జంతువుల నివాస ప్రాంతం ఉన్నప్పటికి 1100 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ సందర్శకులకు కనిపించేవి పదుల సంఖ్యలో కూడా ఉండవు. దీంతో సందర్శకులు నిరుత్సాహంతో ఉసూరుమంటున్నారు. పేరుకు జింకల సఫారీ, సింహాల సఫారీని ఏర్పాటు చేసినా అసలు వాటిలో సింహాలు, జింకలు మచ్చుకైనా కనపడవు. సఫారీలో మధ్యలో ఏర్పాటు చేసిన రింగురోడ్ల నిర్మాణానికి, జంతువులు సేద తీరేందుకు నిర్మించిన షెడ్లకు ఏమాత్రమూ అనుసంధానం లేకుండా పోయింది. ఈ కారణంగా సఫారీ వాహనంలో వెళ్లే సందర్శకులకు గంటల తరబడి వేచిచూసినా ఒక్క జంతువు కూడా కనబడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గడిచిన పదేళ్లకాలంలో కొత్త జంతువులను తీసుకొస్తామని చెబుతూ వచ్చిన అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. హిమాలయ బ్లాక్ బియర్, ఆడ జిరాఫీ, జీబ్రాలు, నీటి ఏనుగులు తీసుకొస్తామని గత పాలకులు, అటవీ శాఖ అధికారులు, సెంట్రల్ జూ అథారిటీ(సీజెడ్ఏ) ప్రకటనలు చేసినప్పటికి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. జిరాఫీ విషయానికి వస్తే అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో కోల్కతా జూపార్క్ నుంచి ఒక మగ జిరాఫీని తెప్పించారు. త్వరలోనే మరో ఆడ జిరాఫీని మగ జిరాఫీకి తోడు తెప్పిస్తామని చెప్పారు. అయితే ఐదేళ్లు గడిచిపోయినా తెప్పించలేదు. నక్కలు, తోడేళ్లు, హైనాలు జూలో ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా సందర్శకులకు కనిపించిన పాపానపోలేదు. అసలు అవి ఉన్నాయా లేవా అనే అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. మొసళ్లు అయితే పేరుకు ఉన్నప్పటికీ సందర్శకులకు కనిపించని దుస్థితిలో వాటి నివాస స్థావరాలు ఉన్నాయి. ఏనుగుల విషయానికి వస్తే జూలో నాలుగు ఏనుగులు ఉన్నప్పటికి అవి కేవలం షెడ్లకే పరిమితమ య్యాయి. గతంలో షెడ్లలో కట్టేసిన ఏనుగులను కనీసం దగ్గర నుంచైనా చూడనిచ్చేవారు. అయితే ఇప్పుడు భద్రతా కారణాలు చూపిస్తూ సందర్శకులు చూసే దూరాన్ని అమాంతం పెంచేశారు. గతంలో నిర్వహిస్తున్న ఏనుగుల అంబారీని సైతం నిలిపివేశారు. జూను అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలా అభివృద్ధికి మాస్టర్ప్లాన్ అమల్లో ఉన్నప్పటికీ ఇందుకు అనుకూలంగా ఒక్క అడుగు పడడంలేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిరిగి అటవీ శాఖ మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటికే జూపార్క్ను నాలుగైదు సార్లు సందర్శించి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు కొత్త జంతువులను తెప్పిస్తామని చెప్పినప్పటికీ అటు వైపు దృష్టి సారించడంలేదు. ఇప్పటికైనా మంత్రిగారు జూకు కొత్త జంతువులను తెప్పిం చాలని ఆశిద్దాం. -
జూ పార్కుకు సందర్శకుల తాకిడి
బహదూర్పురా, న్యూస్లైన్: నెహ్రూ జూలాజికల్ పార్కు మంగళవారం వేలాది మంది సందర్శకులతో సందడిగా కనిపించింది. 11,879 మంది పెద్దలు, 4,280 మంది చిన్నారులు, 90 కార్లలో వచ్చిన 450 మంది సందర్శకులల రాకతో మంగళవారం జూకు రూ. 3.79 లక్షల ఆదాయం సమకూరింది. కాలుష్య రహిత బ్యాటరీ వాహనాల నుంచి రూ.66,020, చేపల ఆక్వేరియంకు రూ.8672, చిట్టి రైలుకు రూ.10,335, నిశాచర జంతుశాలకు రూ.16,290 ఆదాయంతో కలిపి జూకు మొత్తం 4.80 లక్షల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జూకు సందర్శకుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. ఈనెల 1వ తేదీన 37,086 మంది సందర్శకులు రాగా, మంగళవారం రోజు 16,609 మంది సందర్శకులు వచ్చారు. ఆదివారం, సోమవారం ఆదాయాలను కలుపుకొని జూకు రూ.15 లక్షల ఆదాయం వచ్చింది. -
భావోద్వేగాల భోజనం
బౌద్ధ వాణి బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు. ఓ గృహస్థు ఒకనాడు గౌతమ బుద్ధుడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. బుద్ధుడు వెళ్లాడు. వెళ్లాక ఆయనకు తెలిసింది ఏమిటంటే ఆ గృహస్థు తనను పిలిచింది భోజనానికి కాదనీ, తనను విమర్శించడానికి, దూషించడానికి అని అర్థమైంది. బుద్ధుడు అతడి తిట్లన్నీ భరించాడు. అతడి ఆరోపణలనన్నింటినీ భరించాడు. అతడి విమర్శలన్నిటికీ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ గృహస్థు బుద్ధుడిని దూషించడం మానలేదు. చివరికి బుద్ధుడు అడిగాడు, ‘‘మిత్రమా... నీ ఇంటికి తరచు భోజన సందర్శకులు వస్తుంటారా?’’ ‘‘అవును. వస్తుంటారు’’ అని చెప్పాడు గృహస్థు. ‘‘వారి కోసం నువ్వు ఏమి సిద్ధం చేస్తుంటావు?’’ ‘‘పెద్ద విందునే సిద్ధం చేస్తాను’’ ‘‘ఒకవేళ భోజనానికి వస్తానన్న వారు చివరి నిమిషంలో రాకపోతే, వారి కోసం వండించిన పదార్థాల మాటేమిటి?’’ ‘‘ఏముందీ, మేమే భుజిస్తాం’’ అన్నాడు గృహస్థు. ‘‘సరే, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు. కానీ తిట్లు, పరుష పదాలు వడ్డించావు. అంటే నువ్వు నాకోసం సిద్ధం చేసిన పదార్థాలు దూషణలు, విమర్శలు మాత్రమే. కానీ వాటిని నేను తినదలచుకోలేదు. కాబట్టి నువ్వే వాటిని స్వీకరించు’’ అని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు బుద్ధుడు. చూడండి, ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడో! మాటకు మాట అనకుండా, ప్రతి విమర్శలు చెయ్యకుండా, అసలు కోపానికే తావివ్వకుండా, తనకు రావలసిన కోపాన్ని ఆ గృహస్థుకే తిరిగి ఇచ్చేశాడు. అంటే బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు. ఇదంతా గమనించిన శిష్యులకు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘ఎప్పుడూ కూడా, ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోకండి. ద్వేషం అనేది ద్వేషంతో చల్లారకపోగా, మరింత ద్వేషానికి దారి తీస్తుంది’’. మనం కూడా జీవితంలో ఇలాంటి అకారణ దూషణలకు, విమర్శలకు గురవుతుంటాం. కొన్ని మాటలు మరీ కఠినంగా, హృదయాన్ని బాధించే విధంగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం కోపంతో ఊగిపోకూడదు. ఒకటికి రెండు తిట్లు తిట్టి అవతలి వారి కన్నా దిగజారి పోకూడదు. మనలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని రెచ్చగొట్టేందుకు అవతలి వ్యక్తులు చేసే ప్రయత్నాలను సఫలం కానీయకూడదు. అప్పుడేం జరుగుతుంది? వాళ్ల మాటలు తిరిగి వాళ్లకే తగులుతాయి. వాళ్ల కోపం తిరిగి వారినే చేరుతుంది. మనం స్వీకరిస్తేనే కదా వారి నుంచి మనకు వచ్చేది. ఆ ‘బహుమతి’ని మనం ఎందుకు తీసుకోవడం? వాళ్ల దగ్గరే ఉండనిద్దాం. మనం మౌనంగా, మనశ్శాంతిగా ఉందాం. చివరికి వారే తెలుసుకుంటారు, తమ వల్ల జరిగిన తప్పేమిటో! ఇసుమంత కూడా కోపం తెచ్చుకోని మన వ్యక్తిత్వాన్ని వారు గౌరవించి తీరుతారు. అయితే మరీ మౌనంగా ఉండిపోతే వారు తమ విమర్శలు సరైనవేనని నమ్మే ప్రమాదం ఉంది. మనలో తప్పు ఉంది కాబట్టే మనం మౌనంగా ఉండిపోయామని అనుకునే అవకాశమూ ఉంది. అందుకే వారిని సహనంగా అడగాలి, ‘‘మీ మాటల్లో వాస్తవముందా?’’ అని అడగాలి. ఒకవేళ వాళ్ల వైపు నుండి వాస్తవం ఉన్నట్లయితే అప్పుడు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవం లేనట్లయితే సహజంగానే మనకు కోపం వస్తుంది. అప్పుడు వాదించీ, వారించీ లాభం లేదు. వాళ్ల మాటల్లోని కోపాన్ని మనలోకీ తెచ్చుకుని అరచి, ఆగ్రహం చెందీ ప్రయోజనం లేదు. ప్రశాంతతతో కూడిన చిరునవ్వుతోనే మనం అలాంటి వారికి అడ్డుకట్ట వెయ్యాలి. సాధారణంగా ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఇలాంటి మౌనమే మనకు తోడ్పడుతుంది. -
తమ్ముడే కాలయముడు
జీడి పిక్కల విషయమై వివాదం అన్నను నరికి చంపిన కసాయి నిందితుడు పరారీ నాతవరం , న్యూస్లైన్ : ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. అన్నను సొంత తమ్ముడే కత్తితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన గ్రామంలో సంచలనమైంది. మండలంలోని మాధవనగరం గ్రామానికి చెందిన జాలెం కన్నయ్యమ్మ, రాజు దంపతులకు ఐదుగురు మగసంతానం. వీరిలో పెద్ద కుమారుడు, ఆఖరి కుమారుడు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. రెండో కుమారుడైన చంటి, మూడో కుమారుడైన అప్పారావు, నాలుగోవాడైన కొండబాబు తల్లితో కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ఐదు కిలోల జీడిపిక్కల విక్రయం విషయమై చంటి, అప్పారావు మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొండబాబు వీరిద్దరినీ విడదీసి శాంతింపజేశారు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాత్రి 9గంటల సమయానికి చంటి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి వద్ద మాటు వేసి ఉన్న అప్పారావు అన్నయ్య చంటిపై కత్తితో దాడిచేసి ఒక కాలిపై నరికాడు. వెంటనే కింద పడిపోయిన చంటి మెడపై మరోసారి నరకడంతో అతడు అక్కకక్కడే కుప్పకూలిపోయాడు. ఇంటి సమీపంలో ఉన్న మరొక తమ్ముడు కొండబాబు వచ్చి చూసేసరికి అప్పటికే చంటి రక్తపుమడుగులో పడి కన్నుమూశాడు. దీంతో కొండబాబు పెద్ద కేకలు వేయడంతో ఇంటి చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు వచ్చారు. అప్పటికే అప్పారావు కత్తి పట్టుకుని పక్కనే ఉన్న తోటలోకి పరారయ్యాడు. ఈ సంఘటనపై మృతుడి అన్నయ్య రాంబాబు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏఎస్పీ విశాల్గున్ని, రూరల్ సీఐ దాశరథి, ఎస్ఐ పి.రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై చుట్టుపక్కల వారిని ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి భార్య గతంలోనే మృతిచెందగా తండ్రి హత్యతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలుగా మిగిలారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, కేసు విచారిస్తున్నట్టు ఏఎస్పీ విలేకరులకు తెలిపారు. -
ఏవియేషన్ షోలో స్టూడెంట్స్ హల్ చల్
-
‘ఇండియా ఏవియేషన్-2014’
-
షో మొదలైంది..
‘ఇండియా ఏవియేషన్-2014’ నగరంలో బుధవారం ప్రారంభమైంది. లోహవి‘హంగామా’కు బేగంపేట విమానాశ్రయం వేదికయింది. విదేశీ అతిథులతో కళకళలాడింది. తొలిరోజు బిజినెస్ సందర్శకులు సందడి చేశారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రత్యేకతలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు గగుర్పాటు కలిగించాయి. - బేగంపేట, సనత్నగర్ చూడడానికి ఈ లోహవిహంగాలన్నీ చిన్నవే. కానీ ఆధునిక హంగులు వీటిసొంతం. గాలిలో ఎగురుతూనే మీటింగ్ పూర్తి చేయొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. విలాసవంతంగా విందారగించే సదుపాయాలెన్నో వీటిల్లో ఉన్నాయి. వీటిలో సీట్ల అమరిక.. మార్చుకునే విధానం చూస్తే పాతాళ భైరవి సినిమా కచ్చితంగా గుర్తొస్తుంది. ఆపరేషన్ అంతా రిమోట్తోనే. సీట్లను 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. ప్రత్యేక ఫర్నిచర్ను వినియోగించడంతో లుక్ జిగేల్మంటుంది. ( 51 వేల అడుగుల ఎత్తులో 12 గంటలు ఏకధాటిగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. (ఉదాహరణకు ఫ్రాన్స్లో బయలుదేరి ఆగకుండా ఇండియా చేరుకోవచ్చు) ( దీని తయారీదారు డసల్ట్ ఏవియేషన్. ఇందులో మొత్తం సీట్లు 14( ప్రయాణంలో ఉన్నామనే భావన దరి చేరనీయకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు. ( రేంజ్: 5950 నాటికల్మైళ్లు( సర్వీస్ సెయిలింగ్: 15,545 మీటర్లు ( పొడవు: 29.19 మీటర్లు ( ఎత్తు: 7.83 మీటర్లు ( బరువు: 15,545 కేజీలు ( టేకాఫ్ వెయిట్: 31,300 కేజీలు( ల్యాండింగ్ వెయిట్: 28,305 కేజీలు పసిగట్టేస్తా న్సర్ పరిజ్ఞానంతో ఎయిర్పోర్ట్లోని ఏ మూలన ఎలాంటి కదలిక జరిగినా క్షణాల్లో టీవీ స్క్రీన్పై చూపించడమే కాదు.. అలారం సాయంతో హెచ్చరికలు జారీ చేసే సరికొత్త పరిజ్ఞానం ‘ఫెన్స్ షాక్ డిటెక్షన్ సిస్టమ్’ ప్రత్యేకత. ఒక్క ఎయిర్పోర్ట్లోనే కాకుండా మనకు కావలసిన నిర్దేశిత ప్రదేశాల్లో ఈ సిస్టమ్ సాయంతో అజ్ఞాత వ్యక్తులు కదలికల్ని గమనించి క్షణాల్లో అప్రమత్తం చేస్తుంది. ఎవరికీ కనిపించకుండా ఉండేలా సెన్సర్లను భూమిలో అమరుస్తారు. ఇవి మాస్టర్ నోడ్కు అనుసంధానమై ఉంటాయి. మాస్టర్ నోడ్ ఎన్కోడర్కు కనెక్టై సెంట్రల్ కంట్రోల్ సహాయంతో స్క్రీన్పై కదలికలను చూపిస్తుంది. ఒక్కో మాస్టర్ నోడ్కు 30 మీటర్ల దూరంలో 30 వరకు సెన్సార్లను అమర్చుకుంటూ వెళ్లవచ్చు. దీని ద్వారా కిలోమీటర్ల మేర నిర్దేశించుకున్న పరిధిలో వాహనాలు, మనుషులు ఇతరత్రా కదలికలు తెలుసుకునే అవకాశం ఉంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో ఓ స్టాల్లో వీటి గురించి వివరిస్తున్నారు. ఏం దాచారో చెప్పేస్తా సాధారణంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, షాపింగ్మాళ్లు, సినిమా హాళ్లలో భద్రతా కారణాల దృష్ట్యా మనం తీసుకెళ్లే లగేజీని స్కానర్లతో తనిఖీ చేస్తారు. మనుషులకోసం లోహాలను పసిగట్టే మెటల్డిటెక్టర్ను వినియోగిస్తారు. మరి అసాంఘిక శక్తులు ఆర్డీఎక్స్, నిషేధిత వస్తువులు, రహస్య సమాచారం కలిగిన పెన్డ్రైవ్లు, సీడీలను తాము వేసుకున్న దుస్తుల్లో పెట్టి తరలిస్తుంటారు. మరి అలాంటి వారి సంగతేంటి అనేగా మీ ప్రశ్న... ఇలాంటి వారిని పసిగట్టి భద్రతా వ్యవస్థను తట్టిలేపే అధునాతన టెక్నాలజీతో తయారైన ‘బాడీస్కానర్’ను ఏవియేషన్ షోలో ప్రదర్శిస్తున్నారు. స్క్రీన్ ముందుభాగంలో నిర్దేశిత ప్రదేశంలో నిలబడితే... దేహాన్ని మొత్తం ఈ పరికరం కేవలం సెకెండ్ల వ్యవధిలో స్కాన్ చేస్తుంది. కడుపులో ఉన్న వస్తువుల్ని సైతం టీవీ స్క్రీన్పై చూపిస్తుంది. గుండుసూది కంటే చిన్నవైన వస్తువుల్ని సైతం గుర్తించగలిగే పరిజ్ఞానం దీని సొంతం. దీని వినియోగం వలన ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవని తయారీదారులు చెబుతున్నారు. -
బైబై నుమాయిష్
అబిడ్స్, న్యూస్లైన్: నలభై ఏడు రోజులు నగరవాసులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచి... వినోదాల విందు చేసి... అభి‘రుచు’లకు అడ్డాగా మారిన 74వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్) ఆదివారంతో ముగి సింది. ఆఖరి రోజు... సెలవుదినం కూడా కావడంతో ఎగ్జిబిషన్కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి స్టాలూ కళకళలాడింది. వినోదాల పార్కు కేరింతలతో మురిసిపోయింది. చుక్చుక్రైలు ‘బ్రేక్’ లేకుండా మైదానమంతా చుడుతూనే ఉంది. ఫుడ్కోర్టులు ఘుమఘుమలతో ఘాటెక్కించాయి. మొత్తానికి చివరి రోజు నుమాయిష్లో జోష్ అంచులను తాకింది. ఎటు చూసినా జనకళతో జోరుగా కనిపించింది. లోపలే కాదు... మైదానం వెలుపలా అదే సందడి. 20.3 లక్షలమంది ఈ ఒక్కరోజే దాదాపు 70 వేలకు పైగా సందర్శకులు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. జనవరి ఒకటిన ఆరంభమైన నుమాయిష్ను మొత్తం కలిపి 20.30 లక్షల మంది సందర్శించారు. -
‘విడిది’లో విహారం...
-
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు చేదు అనుభవం