workshop
-
ప్రత్యర్థుల విష ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్పై వర్క్షాపు నిర్వహించారు. మీడియా అంశాలపై పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగీపురం శ్రీనాధాచారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాజా పరిణామాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని.. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సాధించాలన్నారు. ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సజ్జల చెప్పారు. -
అయోధ్య రామాలయానికి ఏడాది.. నిర్మాణం పూర్తయ్యేదెన్నడు?
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతన రామాలయానికి నేటితో (జనవరి 22)తో ఒక ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రామాలయం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మొదటి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా రామ్లల్లాను దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వస్తున్న రామ భక్తులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ పంచాంగాన్ని అనుసరించి జనవరి 11న తొలి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వచ్చినవారు అయోధ్యకు కూడా తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయోధ్య ధామ్లో ట్రస్ట్ పలు సదుపాయాలు కల్పించింది. అయోధ్య ఎస్పీ మధుసూదన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, అయోధ్యకు భక్తుల రాక అధికంగా ఉన్నందున పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు అయోధ్యలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారన్నారు. సెక్టార్ జోన్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. సరయు ఘాట్లో స్నానం చేసిన తర్వాత, భక్తులు నాగేశ్వర్ ధామ్, హనుమాన్ హనుమాన్ గర్హి, రామ్ లల్లాను సందర్శిస్తారని ఆయన తెలిపారు.అందరికీ బాలరాముని దర్శనం కల్పించేందుకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశామన్నారు. రామ మందిర భవననిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండవ అంతస్తుల పనులు మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా ఆలయం లోపల ఐకానోగ్రఫీ, ఇతర క్లాడింగ్ పనులు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్ రెండవ ఫ్లోర్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు -
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం
సాక్షి, తాడేపల్లి: వర్క్షాప్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో మరింత జోష్ పెరిగింది. ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కార్పై పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భదత్రలు అదుపు తప్పగా, బాధితులకు అండగా నిలిచేందుకు ఎక్కడిక్కడ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు.రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి దశలోనూ పార్టీ పటిష్ట నిర్మాణం దిశగా, గ్రామ, బూత్ కమిటీలతో పాటు అనుబంధ విభాగాల ఏర్పాటు చేశారు. ప్రజల కోసం పార్టీ పిలుపునిస్తే ఉవ్వెత్తున స్పందించేలా బలోపేతం చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.‘‘మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదంటూ నిన్న(గురువారం) జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు.మరోవైపు, చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మంచిని జనం గుర్తు చేసుకుంటున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్ జగన్ -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి వర్క్ షాప్ (ఫొటోలు)
-
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్షాప్స్కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
'మనం' చాక్లెట్ తిన్నామంటే.. మైమరిచిపోవాలంతే!
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.అంతర్జాతీయ గుర్తింపు..భారత్లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.ఎన్నో రకాల వెరైటీలు.. డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.వర్క్షాప్స్తో పిల్లలకు నేరి్పస్తూ..చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం! -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించండి
సంగారెడ్డి అర్బన్: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ మోహన్రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫౌండేషన్ వీక్ సెలబ్రేషన్లో భాగంగా 3 రోజుల వర్క్షాప్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందడమే కాక ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ప్రతిభావంతులైన, వినూత్నమైన ఆలోచనలు, సాంకేతికతను కలిగి ఉన్నారని, ఇది గొప్ప శుభపరిణామమన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో బీవీఆర్ మోహన్రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ కీలకపాత్ర పోషిస్తోందని అభినందించారు. కార్యక్రమంలో సైంట్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్షాప్ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్షాప్లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్షాప్ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్షాప్లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్షాప్లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్షాపు జరిగింది. వర్క్షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్ జరిగి, శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. -
జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక!
సాక్షి, అమరావతి : జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. అవసరమైతే రాజ్యాంగంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్ 243 (సీ) క్లాజ్ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్లో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని జాతీయ పంచాయతీరాజ్ శిక్షణ సంస్థలో ఈ ప్రత్యేక వర్క్షాప్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ చంద్రశేఖర్కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు), పంచాయతీరాజ్ శాఖ విభాగాధిపతులకు ఇటీవల లేఖలు కూడా రాశారు. కేంద్రం సవరణ చేసినా, సగం రాష్ట్రాలు ఆమోదం తర్వాతే అమల్లోకి ఒకవేళ.. కేంద్రం ఇప్పుడు దేశమంతటా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నుకొనేలా రాజ్యాంగ సవరణ చేసినా.., అది అమలులోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్ శాఖ అదికారులు చెప్పారు. అన్ని దశల ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. రాష్ట్రం నుంచి 9 మంది.. అన్ని రాష్ట్రాల నుంచి 261 మంది.. ఈ వర్క్షాప్లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ సర్పంచుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. వీరితో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు (చాలా రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ – బీడీవోలు అంటారు), రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణ సంస్థ ప్రతినిధులు ఈ వర్క్షాప్లో పాల్గొనాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 9 మంది హాజరవనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 1995కి ముందు ఆ పదవులకు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష ఎన్నికలే.. రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకొంటున్నారు. 1995కి ముందు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనేవారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధివిధానాల్లో మార్పులు చేశారు. దాని ప్రకారం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చాయి. ఆ మేరకు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిం ది. -
పంచాయతీ రాజ్ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు
చండీగఢ్: దేశానికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత అవసరమైందో స్వాతంత్య్రం వచి్చన నాలుగు దశాబ్ధాల తర్వాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతానికి అప్పటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను సైతం కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ‘ఫలితంగా దేశ జనాభాలో గ్రామాల్లో నివసించే మూడింట రెండొంతుల మంది కనీస సౌకర్యాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు, పక్కా ఇళ్లు వంటి వాటికి కూడా నోచుకోలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాలకు కూడా దేశంలోని సుమారు 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం సమకూరలేదు’ అని ఆయన అన్నారు. ఇందుకు జమ్మూకశీ్మరే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఫరీదాబాద్లోని సూరజ్కుండ్లో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హరియాణా క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్’ రెండు రోజుల వర్క్షాప్ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. అమృత్ కాల్ తీర్మానాల సాధనకు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా నేడు భారత్ ఐక్యంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఆగస్ట్ 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం రోజున యావత్ దేశం ‘అవినీతి..ఆశ్రిత పక్షపాతం.. బుజ్జగింపు రాజకీయాలు క్విట్ ఇండియా’ అని ఐక్యంగా నినదించాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటికీ చేరేందుకు జిల్లా పరిషత్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమిపై ప్రధాని విసుర్లు ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి భారత్ ప్రగతికి ప్రతిబంధకంగా, ప్రమాదకరంగా మారిందని ప్రధాని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో సోమవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవాలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
AP: ముగిసిన జీ20 సదస్సు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా మార్చి 28 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన జీ 20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో ‘రేపటి ఆర్థిక నగరాలు – అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అవకాశాలు’పై ప్రధానంగా సదస్సు జరిగింది. 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, పది అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఈబీఆర్డీ లాంటి అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ సదస్సుకు అధ్యక్షత వహించారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను పెంచడంపై సదస్సులో చర్చించారు. రెండో రోజు సాగర తీరంలో యోగా, ధ్యానంతో పాటు పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (క్యూఐఐ) సూచికల అన్వేషణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయంపై డేటాను క్రోడీకరించడంపై సమగ్రంగా చర్చించారు. మూడో రోజు కెపాసిటీ బిల్డింగ్పై వర్క్షాపు నిర్వహించారు. కొరియా, సింగపూర్లకు చెందిన నిపుణులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపై చర్చించారు. నాలుగో రోజు శుక్రవారం దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఆఖరి రోజు ‘జన్ భగీదారి’.. జీ 20 సదస్సు చివరి రోజు జన్ భగీదారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం రివాజు. ఇందులో భాగంగా ఆతిథ్య దేశంలోని స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల వీసీలు, విద్యార్థులతో వర్క్షాపు నిర్వహిస్తారు. శుక్రవారం వర్క్షాపులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, మణిపూర్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి శాఖల డైరెక్టర్లు 80 మంది పాల్గొన్నారు. వీరితో పాటు వీసీలు, ఫ్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు కూడా హాజరయ్యారు. సుస్థిరాభివృద్ధి దిశగా.. తొలిరోజు సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీ 20 దేశాల ప్రతినిధులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మౌలిక సదుపాయాల రంగంపై చర్చించడం మంచి పరిణామమని చెప్పారు. సుస్థిరాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, లక్షలాది గృహాలను నిర్మిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఆత్మీయ ఆతిథ్యం.. విశాఖలో తొలిసారిగా జరిగిన జీ 20 సదస్సును రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి అతిథులు హాజరైన నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. 2,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కల్పించింది. ఆంధ్రా, భారతీయ వంటకాలను వడ్డించడంతోపాటు తెలుగు సంప్రదాయ పద్ధతుల్లో ఆత్మీయ స్వాగతం పలికింది. తెలుగు వైభవాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. -
స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణం..విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో మూడోరోజైన గురువారం ‘సామర్థ్య నిర్మాణం’పై వర్క్షాపును ఇండియన్ ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో జీ–20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్లలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రభుత్వాలు సమగ్ర, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆర్థిక సాయం చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిసారించారు. వర్క్షాపు మొదటి సెషన్లో భారత్ సహా సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ నిపుణులు తమ దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు. సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్లోహ్.. సింగపూర్ విధానాలు, సమ్మిళిత, స్థిర నగరాలను నిర్మించే వ్యూహాలను సమర్పించారు. ఇందులో డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టంతో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్, అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య తదితర అంశాలపై వివరించారు. సెషన్ అనంతరం దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణాభివృద్ధి.. ఫైనాన్సింగ్లపై సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై మాట్లాడారు. తమ దేశంలోని సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, వాటిని తగ్గించడానికి అనుసరించిన విధానాలను, పునరాభివృద్ధికి సంబంధించిన అంశాలను సియోల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు ఇన్హీ కిమ్, హుయ్ షిన్లు సమర్పించారు. చైనా, రష్యా, యూరోపియన్ కమిషన్తో పాటు భారతదేశ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్ను పెంచడానికి చేపట్టిన చర్యలను ఫోకస్ చేయడానికి కేస్ స్టడీస్ను అందజేశారు. విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన వర్క్షాపు అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులు విశాఖ నగరంలో విజయవంతంగా నడుస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (వీసీఐసీడీపీ)లోని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ పథకం, ముడసర్లోవ రిజర్వాయరులోని రెండు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్లాంట్లను వీరు సందర్శించారు. 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తిచేయడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీ–20 దేశాల ప్రతినిధులు స్వాగతించి అభినందించారు. ఇక చివరిరోజు శుక్రవారం జరిగే సమావేశంలో దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొంటారు. ఇందులో వీరు తమ సంస్థల్లో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలను, విజయాలను వివరిస్తారు. అలాగే, విశాఖ పరిధిలోకి వచ్చే వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
రేపటి ఆర్థిక నగరాలపై సమగ్ర చర్చ
సాక్షి, విశాఖపట్నం: పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అందుకవసరమైన నిధుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై జీ–20 దేశాల ప్రతినిధుల బృందం సమగ్రంగా చర్చించింది. జీ–20 దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మీడియాకు వెల్లడించారు. రేపటి ఆర్థిక నగరాలు మరింత వృద్ధి చెందేందుకు తీసుకోవలసిన చర్యలు, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులను పెంచడం వంటి అంశాలపైనా ప్రతినిధులు విస్తృతంగా చర్చించారన్నారు. ఈ సదస్సుకు 14 జీ–20 సభ్యదేశాల నుంచి 57 మంది ప్రతినిధులు, ఎనిమిది మంది ఆహ్వానితులు, పది అంతర్జాతీయ సంస్థల నుంచి మరికొంతమంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. మిగిలిన ఆరు సభ్య దేశాల ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారని ఆయన చెప్పారు. పట్టణాలు/నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక వనరుల కోసం వినూత్న మార్గాలను గుర్తించడం వంటి వాటిపై చర్చ జరిగిందని తెలిపారు. సమావేశాల్లో భాగంగా ఇప్పటివరకు ఏడు సెషన్లు, ఒక వర్క్షాపు నిర్వహించారన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక వసతులపై.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (క్యూఐఐ) సూచికలను అన్వేషించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయంపై డేటాను క్రోడీకరించడం, ప్రైవేటు రంగానికి ఆ డేటా ఉపయోగపడేలా చేయడంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారని, వీటిపై కొన్ని ప్రెజెంటేషన్లు ఇచ్చారని ఆరోఖ్యరాజ్ వివరించారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిందన్నారు. సుపరిపాలనకు ఏ రకమైన నైపుణ్యం అవసరమవుతుందో నిపుణులు సూచనలు చేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ఏడీబీ, ఈబీఆర్డీ వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన 13 మంది నిపుణులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. గత జనవరిలో పూణేలో జరిగిన జీ–20 ఐడబ్ల్యూజీ సదస్సులో చర్చకు వచ్చిన అంశాలపై విశాఖలో బ్లూప్రింట్ ఇచ్చామన్నారు. బీచ్లో యోగా, ధ్యానం.. రెండో రోజు బుధవారం ఉదయం సదస్సు నిర్వహిస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో ఉన్న బీచ్లో జీ–20 దేశాల ప్రతినిధులకు యోగా, «ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో నిర్వహించిన కార్యక్రమంలో సాత్విక ఆహారాన్ని పరిచయం చేశారు. రుషీకేష్లో మూడో సదస్సు.. జూన్ ఆఖరులో ఈ జీ–20 మూడో ఐడబ్ల్యూజీ సదస్సు రుషికేష్లో జరుగుతుందని ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. విశాఖ సదస్సులో చర్చించిన అంశాలను పైలట్ స్టడీస్ కింద అక్కడ సమర్పిస్తారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యం ఎంతో బాగుందని అతిథులు ప్రశంసించారని ఆరోఖ్యరాజ్ తెలిపారు. అంతేకాదు.. సదస్సు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి మనసు దోచుకున్నాయన్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని తొట్లకొండ, కైలాసగిరి వ్యూపాయింట్, ఆర్కేబీచ్, సీహారియర్ మ్యూజియం, వీఎంఆర్డీఏ బీచ్లు అతిథులను కట్టిపడేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఏపీలో గృహనిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంగళవారం రాత్రి అతిథులకు ఇచ్చిన గాలా డిన్నర్లో వివరించారన్నారు. నేడు, రేపు ఇలా.. ఇక గురువారం జీ–20 దేశాల ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాపు జరుగుతుందని ఆరోఖ్యరాజ్ చెప్పారు. కొరియా, సింగపూర్లకు చెందిన నిపుణులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపైన, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపైన చర్చిస్తారన్నారు. విశాఖ నగరంపై కూడా ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే, శుక్రవారం జరిగే సమావేశానికి దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరవుతారని చెప్పారు. -
కాజీపేటలో రైల్ వ్యాగన్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ (పీఓహెచ్) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్గా మార్చాలని నిర్ణయించింది. వర్క్షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు. ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆ వివాదంతోనేనా.. కాజీపేటకు 1980లలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రైల్వేకు ఇది రెండో యూనిట్.. దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్ అవుతుంది. రైల్వే సొంత యూనిట్గా మారుతుంది. పవర్ మెక్–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్ టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్షాప్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు. -
గడప గడపపై వర్క్ షాప్
-
ప్రతీ గడపకూ టైం కేటాయించాల్సిందే!: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో మరింత సమయం గడపాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో గడప గపడకు.. పై గత సమీక్ష కన్నా ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు మాత్రం తీరు మార్చుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. 175 సీట్లకు 175 కొట్టాలి. ఒక్క సీటు మిస్ కావొద్దు. ప్రతి ఇంటికి వెళ్లాలి. నెలలో కనీసం పదహారు రోజులు గ్రామాల్లో ఉండాలి. వంద శాతం ఇళ్లను కవర్ చేయాలి. ఎమ్మెల్యేగా ఓడితే గౌరవం తగ్గుతుంది. కష్టపడితే గెలుపు దక్కుతుంది. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ను రీచ్ కావాలి అని ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కార్యకర్తలతో సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. జరుగుతున్న సంక్షేమం ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో.. కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇంకేమి చేయాలి? అనే అంశాలపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు ఇవాళ్టి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇదీ చదవండి: వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్! -
టీపీసీసీ ’మేధో మథనం’
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ తరహాలోనే టీపీసీసీ కూడా ‘మేధో మథనం’కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో వర్క్షాప్ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఏఐసీసీ రాజస్తాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన ‘చింతన్ శిబిర్’లో చేసిన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలుపుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఓ టికెట్, పదవుల్లో యువకులకు పెద్దపీట, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం అంశాలపై ఈ వర్క్ షాప్లో చర్చించనున్నట్టు తెలిపాయి. కాగా, ఈ వర్క్షాప్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరుకావట్లేదని తెలుస్తోంది. అమెరికాలో జరగనున్న ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం అక్కడకు వెళ్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఈ సభల కోసం అమెరికాకు బయలుదేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన లేకుండానే తొలిసారి రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ వర్క్షాప్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్తోపాటు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఏఐసీసీ సూచన మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ఇలాంటి వర్క్షాప్లు నిర్వహించి ఉదయ్పూర్ తీర్మానాలకు ఆమోదం తెలిపే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వర్క్షాప్ను గాంధీభవన్లో నిర్వహించాలా లేక వేరే ప్రదేశంలోనా అన్న దానిపై టీపీసీసీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. -
మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమ గళం వినిపించిన మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. రాణా, స్వాతి లాంటి ప్రముఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వేధింపులకు పాల్పడ్డారంటూ కొన్ని గణాంకాలను సభాముఖంగా చదివి వినిపించారు. ప్రశ్నించేవారిని అణచి వేసే ధోరణి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్ (న్యూస్ మినిట్), మాలిని సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని . బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ,ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలోవారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మనం తక్కువోల్లం కాదు.. సానా గొప్పోల్లం ఇంతమంది జర్నలిస్టులు ఒక్క చోటికి రావడం అద్భుతం. ఏ రంగమైనా మహిళలకు ఇబ్బందులు తప్పవు. అయినా ఏ మాత్రం వెరవకుండా నిబద్ధతగా ఉండాలన్నారు. మగవారి కన్న మనం 100 శాతం ఎ క్కువ శ్రమ చేయాల్సిందే అన్నారు. మనం తక్కువోల్లం కాదు..సానా గొప్పోల్లం..ఇదే స్ఫూర్తితో పట్టుదలగా విధి నిర్వహణలో సెన్సిటివిటీగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి కొత్తగా నిర్మాణమవుతున్న సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని కవిత హామీనిచ్చారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. అంతేకాదు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం లేదని అర్థమవుతోందని, ఇకపై వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడాలని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు సూచించారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఈ వర్క్షాప్లో ముగింపు సమావేశంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందని, ఆ వైపుగా మహిళా జర్నలిస్టులు చేస్తున్న కృషి సంతోషంగా ఉందని కొనియాడారు. -
విలువలు పాటించినప్పుడే జర్నలిస్టులకు గౌరవం
సాక్షి,సనత్నగర్: న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలో వారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి కొత్తగా నిర్మించే సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని ఆమె హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన మహిళా జర్నలిస్టుల వర్క్షాప్ ఆదివారం ముగిసింది. సమావేశానికి ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తానన్నారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా గొంతెత్తితే ఆపేందుకు ‘టెక్ ఫాక్స్’ద్వారా వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వారిని అణచడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ పత్రిక రంగంలోని అన్ని పాత్రలను తానే పోషించి కాకతీయ అనే పత్రికను నడిపారని ఎమ్మెల్సీ వాణీదేవి గుర్తు చేశారు. జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మారుతీసాగర్, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
హోలి హోలీల రంగ హోలీ... మంచి రంగులే మంచిది చమ్మకేళీ!
హోలీ పండగరోజు ‘రంగు పడుద్ది’ అని అరవడం, రంగు ఇష్టంగా పడిపించుకోవడం బాగానే ఉంటుంది గానీ అది ఏ ‘రంగు’ అనేది ముఖ్యం. ఎందుకంటే అన్ని రంగులు ఒక్కటి కాదు! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి రోజు రంగుల రూపంలో చెడు రసాయనాలు చేటు చేస్తున్నాయి. చర్మం, కళ్లు...మొదలైన వాటికి హాని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, థానే జిల్లాలోని ముర్బాద్, సరగామ్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం అగ్రికల్చరల్ సైన్స్డిపార్ట్మెంట్ వర్క్షాప్ నిర్వహించింది. హోలీ సందర్భంగా వాడే రంగులలోని కెమికల్స్ వల్ల జరిగే హాని గురించి వివరించారు. ‘అలా అని పండగ సంతోషం దూరం చేసుకోనక్కర్లేదు’ అని చెబుతూ... మందారం, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, గోరింటాకుతో పచ్చని రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగు... ఎలా తయారు చేయాలో నేర్పించారు. మరిచిపోయిన మోదుగుపూల రసాన్ని మళ్లీ రంగం మీదికి తీసుకువచ్చారు. ‘మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంది?’ అని అడిగారు. చింతచెట్టు, నిమ్మచెట్టు, నీలగిరి చెట్టు... ఇలా రకరకాల సమాధానాలు వినిపించాయి. ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవడం, ఆ రంగులను అందంగా ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి?.. మొదలైన విషయాలు నేర్పించారు. దీనిద్వారా వారికి ఉపాధి అవకాశం దొరికింది. ‘మేము పచ్చటి చెట్ల మధ్య నివసిస్తున్నాం. అయితే హోలీ పండగ రాగానే రంగుల కోసం పట్టణం వెళ్లేవాళ్లం. ఎదుటి వ్యక్తిని ఎంతగా రంగుల్లో ముంచెత్తితే పండగ అంత ఘనంగా జరిగింది అనుకునేవాళ్లం. ఇక్కడికి వచ్చిన తరువాత నా దృష్టి మారింది. రసాయన రంగులను ఉపయోగించడం వల్ల జరిగే హాని గురించి తెలుసుకున్నాను. నేను ఇక్కడ విన్న విషయాలను మా కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా చెబుతాను’ అంటుంది వర్క్షాప్కు హాజరైన శాంతి పవార్. ‘ఈసారి పండగ కొత్తగా జరుపుకుందాం. ఆరోగ్యకరంగా జరుపుకుందాం’ అనే నినాదంతో ముందుకు కదిలారు వర్క్షాప్కు హాజరైన మహిళలందరూ తాము తయారు చేసిన సహజమైన రంగులను ఇంటింటికి పరిచయం చేస్తున్నారు. వర్క్షాప్ లో విన్న విషయాలను చెబుతున్నారు. తాము తయారు చేసిన రంగులు అమ్ముడుపోతున్నాయనే సంతోషం కంటే, తమ ద్వారా మంచి సందేశం చేరుతుందనే తృప్తి వారి కళ్లలో కలర్ఫుల్గా కనిపిస్తుంది. -
రైతులు ఫ్రంట్లైన్ వారియర్లు కాదా
సాక్షి, హైదరాబాద్: వరి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భారతీయ రైతు సంఘాల కూటమి (సిఫా) ఆరోపించింది. తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం... రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ను వరి వేయొద్దని చెప్పడంతో సమస్య మొదలైం దని స్పష్టం చేసింది. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కరువు కాటకాలు ఉండగా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి వసతి ఏర్పడిందని వెల్లడించింది. దీంతో వరివైపు రైతులు మళ్లారని సిఫా వివరించింది. కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వర్కర్లు అంటూ వైద్య సిబ్బంది, పోలీసులు తదితరులను గుర్తించారే కానీ రైతులను ఆ కేటగిరీలో చూపించలేదని విమర్శించింది. సిఫా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో ‘అగ్రికల్చర్ యాజ్ ఫోకస్ ఏరియా ఆఫ్ రీజినల్ అప్రోచెస్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా’ అంశంపై జాతీయ వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్కు సిఫా ముఖ్య సలహాదారు పి.చెంగల్రెడ్డి, ప్రొఫెసర్ దేవీప్రసాద్ జువ్వాడి సంధానకర్తలుగా వ్యవహరించారు. సాగుకు మద్దతేదీ..? వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నా ధాన్యం సేకరణ, ఎగుమతులు కేంద్రం చేతిలో ఉన్నాయని చెంగల్రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రం కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చిందే తప్ప వ్యవసాయానికి మద్దతివ్వలేదన్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలకు ఉన్న గౌరవం వ్యవసాయాధికారులకు లేదన్నారు. కేంద్రం వ్యవసాయ విధానాల్లో విఫలమైందన్నారు. తెలంగాణ రైతులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. రైతు సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వరిపై కేంద్రం వైఖరి సరికాదు: బి. వినోద్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ ఫోన్ ద్వారా తన సందేశం వినిపిస్తూ కేంద్రం వరి కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, వైద్య రంగంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో బ్యాంకులు ప్రైవేటీకరణ బాటపడితే రైతులకు రుణాలు కలగానే మిగులుతుందన్నారు. సంప్రదాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తేనే వ్యవసాయ రంగం బాగుంటుందన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలన్న తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. పాలీహౌస్ పద్ధతిలో వ్యవసాయం చేసినా ప్రభత్వం రుణాలు, వడ్డీ రాయితీ కల్పించకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రైతు రఘురాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్షాప్లో వార్త ఎడిటర్ సాయిబాబా, ఆలిండియా అగ్రికల్చర్ స్టూడెంట్ అసోసియేషన్ నేత సాయికాంత్, సిఫా తెలంగాణ అధ్యక్షుడు సోమశేఖర్రావు ప్రసంగించారు. -
లవ్లీ ఫ్లవర్స్...
-
పారిశ్రామికాభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
-
ఇతర ప్రాంతాలకూ ‘నెక్సస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ స్టార్టప్లకు తోడ్పాటునిచ్చేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటైన ’నెక్సస్ స్టార్టప్ హబ్’ తాజాగా ఇతర ప్రాంతాలకూ కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. టి–హబ్ తరహా భాగస్వాములతో జట్టు కట్టే దిశగా చర్చలు జరుపుతోంది. సోమవారమిక్కడ టి–హబ్లో డిఫెన్స్ స్టార్టప్స్ వర్క్షాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎరిక్ అజూలే ఈ విషయాలు తెలియజేశారు. అమెరికా ప్రభుత్వ సహకారంతో నెక్సస్ స్టార్టప్ హబ్ తొలిసారిగా భారత్లోనే ఏర్పాటైందని ఆయన చెప్పారు. ‘‘దీనిద్వారా ఇప్పటిదాకా 93 స్టార్టప్ సంస్థలకు శిక్షణ అందించాం. సుమారు రెండేళ్ల కాలంలో ఇవి దాదాపు 5.6 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించాయి. వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి’’ అని ఎరిక్ వివరించారు. మరోవైపు, రక్షణ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారంతో ముందుకెడుతున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ (తాత్కాలిక) ఎరిక్ అలెగ్జాండర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి వర్క్షాప్లు తోడ్పడతాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్ను హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఇందులో మార్ఫిడో టెక్నాలజీస్, కాన్స్టెలీ సిగ్నల్స్ వంటి 15 పైగా స్టార్టప్లు పాల్గొంటున్నాయి. రక్షణ రంగంలో వ్యాపారావకాశాల గురించి స్టార్టప్ సంస్థలు అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ నెల 18, 19న హైదరాబాద్లోనే జరగనున్న అమెరికా– భారత్ రక్షణ రంగ సదస్సులో కూడా పాల్గొనే అవకాశం స్టార్టప్స్కు దక్కనుంది. దిగ్గజాలతో అవకాశాలకు వేదిక.. లాక్హీడ్ మార్టిన్ వంటి రక్షణ రంగ దిగ్గజ సంస్థల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఇలాంటి వర్క్షాప్లు తోడ్పడతాయని స్టార్టప్ సంస్థ కాన్స్టెలీ సిగ్నల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సత్య గోపాల్ పాణిగ్రాహి తెలిపారు. కీలకమైన మేథోహక్కులు, దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాల గురించి అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుం దని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాడార్ సిమ్యులేషన్ సిస్టమ్స్ను రూపొందించే కాన్స్టెలీ సిగ్నల్స్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. సహ వ్యవస్థాపకుడు అవినాష్ రెడ్డితో పాటు నలుగురితో ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 12 మం ది సిబ్బంది ఉన్నారని పాణిగ్రాహి తెలిపా రు. దేశీయంగా ఇప్పటిదాకా రెండు సిస్టమ్స్ విక్రయించామని, వీటి ఖరీదు రూ. 50 లక్షల నుంచి రూ.8–10 కోట్ల దాకా ఉంటుందని తెలిపారు. -
‘స్పందన’ అర్జీలను తక్షణమే పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: స్పందన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సీఎస్ ఆధ్వర్యంలో స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించి వర్క్ షాపు నిర్వహించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధింత కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. 12 శాఖలు ద్వారా 92 శాతం స్పందన ఫిర్యాదులను స్వీకరిస్తునట్లు తెలిపారు. స్పందన అర్జీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని శాఖలు సకాలంలో బాధ్యతాయుతంగా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారాలపై అక్టోబర్లో ఎమ్మార్వో, ఎండీవోలకు జిల్లాస్థాయిలో సెన్సిటైటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎస్ వెల్లడించారు. -
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స
-
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలనకు నడుం బిగించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని.. అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకుపోవాలన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రభుత్వం తొలి రోజు నుంచే దృష్టి సారించిందని గుర్తుచేశారు. త్వరలో వార్డు సేవకులను ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో వార్డు సేవకులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చించడమే ఈ వర్క్షాప్ ఉద్దేశమని పేర్కొన్నారు. అదేవిధంగా సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. మంచి నీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేయాలని.. ఇబ్బందులను దాచిపెట్టకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
జీవితాన్ని ఆగి చూద్దామా..!
అది ప్రాణిక్ హీలింగ్ వర్క్షాప్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్హాల్లో జరుగుతోంది. వెళ్లేసరికి అప్పటికే హాల్ నిండిపోయింది! వర్క్షాప్కి వచ్చిన వారిలో 80 శాతం యువతే ఉండటం ఆశ్చర్యమనిపించింది. ‘‘పరుగెడుతున్నాం. పరుగెడుతూనే ఉన్నాం.ఈ పరుగుకు అర్ధమేంటో తెలియాలి కదా! అందుకే అప్పుడప్పుడు కాస్త ఆగి మనల్ని మనం చూసుకోవాలి’’.. వేదిక మీద మాట్లాడుతున్న దినేష్.. పుట్టెడు ఇంటి సమస్యలు మీదేసుకొని జీవితాన్ని లాగలేక లాగే మధ్యతరగతి తండ్రి ఏమీ కాదు. బి.టెక్ పూర్తిచేసి ఇటీవలే ఉద్యోగంలో చేరాడట. ఇన్నాళ్లూ చదువు, ఇప్పుడు ఉద్యోగ విధుల పరుగులో పడిపోయి తనని తాను మర్చిపోతున్నానని, ఆన్లైన్లో హీలింగ్ వర్క్షాప్స్ గురించి తెలుసుకుని పేరు ఎన్రోల్ చేసుకున్నానని చెప్పాడు. ‘‘ఎస్.. నేను కూడా అంతే! ఎంత కాదనుకున్నా మైండ్సెట్లో చాలా చెత్త చేరుతుంది. అది రోజువారీ పనిలో ఉండే ఒత్తిళ్లు అవ్వచ్చు, రకరకాల ఇగోస్ అవ్వచ్చు.. వీటిని క్లీన్ చేసుకోవాలంటే కొన్ని మెథడ్స్ అవసరం. ఇలాంటి వర్క్షాప్స్ గురించి కొంత తెలుసు. నేరుగా తెలుసుకుందామని వచ్చాను’’ అంది రేడియో ఆర్జేగా వర్క్ చేస్తున్న వర్ష. ఇలాగే మరికొందరు. వారంలో ఆదివారం జాలీడే అంటూ ఇంట్లో బద్ధకంగా గడిపేస్తుంటారంతా అనే మాటలకు అర్ధం లేదనిపించింది వీరిని కలిశాక. లంచ్ టైమ్ అయ్యింది. ఆఫీస్కు వెళుతున్నట్టు ఎవరి లంచ్ బాక్స్ వాళ్లే తెచ్చుకున్నారు. కొత్త పరిచయస్తులతో కలిసి నవ్వుతూ భోజనం చేస్తున్నారు. వారిలో డిగ్రీ చదివేవాళ్లు, కాల్సెంటర్లలో పనిచేసేవాళ్లు, గృహిణులతో పాటు వ్యాపారులూ ఉన్నారు. ‘‘యోగా, ధ్యానం చేసే పద్ధతులను తెలుసుకోవడం కోసమే కాదు ఒకేలాంటి అభిరుచి ఉన్న మరికొందరితో పరిచయాలు ఏర్పడతాయి. దీని వల్ల కొత్త జీవనంలోకి ఉత్సాహం వస్తుంది’’ అంటోంది ఇంటివద్దే బొటిక్ నిర్వహిస్తున్న శ్రీవాణి. జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికి ఆధ్యాత్మిక ప్రయాణమూ అవసరమే అన్నది ఆమెకున్న మరొక నమ్మకం. ‘‘కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగుండటం లేదు. మానసిక సమస్యలే అందుకు కారణం. వాటిని క్లియర్ చేసుకోవడానికే ఇక్కడకు వచ్చాను’’ అని చెప్పారు ఆరుపదుల వయసు దాటిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పూర్ణచందర్రావు. ‘‘పదేళ్లుగా హెల్త్ అండ్ హీలింగ్, బాడీ అండ్ సోల్, స్పిరిచ్యువల్ ప్రాణిక్ హీలింగ్ వంటి వర్క్షాప్స్కి హాజరవుతున్న’ట్టు చెప్పారు యోగా టీచర్ సుభద్ర. ‘ఇంటి వద్ద చుట్టుపక్కల వారికి ఉచితంగా హీలింగ్ క్లాసులూ తీసుకుంటున్నాను’ అంటూ విజిటింగ్ కార్డుతో ఆహ్వానం పలికారు ఆమె. ఆరోగ్య సమస్యలకు మైండ్పై చూపే చెడు ప్రభావాలే కారణం అంటూ సాయంత్రం వరకు రకరకాల పరిష్కారాలు సూచిస్తూనే ఉన్నారు నిర్వాహకులు. ఈ వర్క్షాప్స్ను ఏడాదిపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు గురించి హీలింగ్ గురు శివ ను అడిగితే ‘హాజరయ్యేవారి ఆసక్తే’ అన్నారు. మరుసటి రోజు ఆఫీస్కొచ్చి రోజువారీ షెడ్యూల్ని చెక్ చేస్తుంటే స్నేహితురాలు రమ్య నుంచి ఫోన్ ‘ఈ వీక్ కుదిరితే ఇంటికి రా! మా అబ్బాయి విపాసన ధ్యానకేంద్రలో చేరాడు. పది రోజుల వరకు ఫ్రీ’ అంది. ‘ఇంకా వాడు డిగ్రీయే చదువుతున్నాడు కదా! అప్పుడే ఈ ధ్యానకేంద్రాల చుట్టూ తిరగడమేంటి?’ అని అడిగితే ‘తన గురించి తను తెలుసుకోవాలని ఉందన్నాడు. మంచిదేగా’ అంది. జీవితపు పరుగు పందాన్ని ఆగి ఆగి కొనసాగించడం ఈ రోజుల్లో అవసరమే అనే అభిప్రాయం మెల్లగా బలపడుతున్నట్లే ఉంది. పరుగుపందెంలో క్షణం ఆగినా వెనుకబడిపోతాం. ఓడిపోతాం. కానీ, జీవితం పరుగులో కాస్త ఆగి మనల్ని మనం సమీక్షించుకుంటే సక్సెస్ సాధిస్తామని నేటి తరం భావిస్తోంది! – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
వచ్చే నెలనుంచి కాలేజీల విలీన పక్రియ
ఎంజీయూ(నల్లగొండ రూరల్) : వచ్చే నెల నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలల విలీన ప్రక్రియను చేపడతామని రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన రీసెర్చ్ మెథడాలజీ మూడు రోజుల వర్క్ షాప్ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయని, అడ్మిషన్లు లేని డిగ్రీ, పీజీ కాలేజీలు 55, 20 శాతం అడ్మిషన్లు ఉన్న కాలేజీలు150 ఉన్నాయన్నారు. దోస్త్ ఆన్లైన్ (డిగ్రీ అడ్మిషన్లు)అడ్మిషన్లు 4 లక్షల 10 వేల సీట్లు ఉండగా గత ఏడాది 1 లక్ష 80 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. 400 డిగ్రీ కాలేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒక మండలంలో 2, 3 డిగ్రీ కాలేజీల నుంచి పూర్తిస్థాయి అడ్మిషన్లు లేనపుడు వాటిని విలీనం చేయడం వల్లా క్వాలిటి విద్య పెరగడంతో పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కొన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 200 కాలేజీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. 2018–19 కి విద్యార్థులు తరగతి గదుల్లో ఉండాలి.. ఉపాధ్యాయులు బోధించాలే... అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. యూనివర్సిటీకి, పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడడంతో పాటు అధ్యాపకులకు నైపుణ్యం పెంచేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థికి ఉద్యోగం, ఉపాధి లభించే విధంగా నైపుణ్యాలను పెంచుతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఇస్తామన్నారు. సీబీసీఎస్ విధానం విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. బయోమెట్రిక్ అన్ని కళాశాలల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరానికి చేరుకుంటారని అన్నారు. విద్యపై విద్యార్థులు దృష్టి సారించాలని, తరగతులకు రాకపోతే ఏమాత్రం ఫలితం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు నైపుణ్యం పెంచి ఉద్యోగం, ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం ప్రయత్నంతోనే విజయం సాధిస్తామన్నారు. ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యార్థికి నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవడానికి సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్గా రాలేకపోతే దూరవిద్య ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువు పైనే దృష్టి ఉండాలన్నారు. రూరల్ ఎంగేజ్మెంట్ను రాష్ట్రంలోనే మొదటిసారిగా యూనివర్సిటీలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన విధానంపై 23, 24, 25 తేదీల్లో 500 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్టార్ ఉమేశ్ కుమార్, రమేష్,రవి, లక్ష్మీ ప్రభా, సరిత, వసంత, తదితరులు పాల్గొన్నారు. అక్రమ నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక యూనివర్సిటీలో జరిగిన అక్రమ అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. నియామకాలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు వెల్లడించారు. -
ఐపీఎల్లో డీఆర్ఎస్..?
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి డీఆర్ఎస్(డిసిషన్ రివ్యూ సిస్టమ్)ను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో క్రికెట్లో కీలకంగా మారిన అంపైర్ తుది సమీక్ష నిర్ణయం రాను రాను అన్ని ఫార్మట్లకు విస్తరించనుంది. దీంతో ఐపీఎల్-2018 సీజన్లో డీఆర్ఎస్ ప్రేశపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నదని, దీనికి కసరత్తులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే విశాఖపట్టణంలో ఐసీసీ ప్యానెల్కు బయట ఉన్నభారత టాప్ పది మంది అంపైర్లతో బీసీసీఐ వర్క్షాప్ నిర్ణయించినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. ఆ సదరు ఛానెల్తో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు. డీఆర్ఎస్ విషయంలో బీసీసీఐ వర్క్షాప్ నిర్వహించటం ఇదే తొలిసారని, ఇక భవిష్యత్తులో అంపైర్ తుది నిర్ణయంలో టెక్నాలజీ కీలక మారునుందన్నారు. ఈ నేపథ్యంలో డీఆర్ఎస్పై అంపైర్లకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్షాప్ నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఐపీఎల్లో డీఆర్ఎస్ ప్రవేశ పెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ వర్క్షాప్ ఐసీసీ అంపైర్ల కోచ్ డెనిస్ బర్న్స్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాల్ రిఫ్ఫిల్ల నేతృత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. పాల్ రిఫ్పిల్ 2004-05 లో అంపైర్గా మారారు. -
అనర్థాలపై చైతన్యం అవసరం
► బాల్యవివాహాలపై కలెక్టర్ దివ్య, ఎస్పీ అన్నపూర్ణ ► బాలికా విద్యను ప్రోత్సహించాలని పిలుపు ► భరోసా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ► వర్క్షాప్లో సలహాలు, సూచనలు సాక్షి, వికారాబాద్: బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తే.. వీటి నియంత్రణ సాధ్యమవుతుందని కలెక్టర్ దివ్య, ఎస్పీ అన్నపూర్ణ అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బాల్యవివాహాల నివారణ, అనర్థాలపై తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహం జరిపే విషయాన్ని గ్రామపెద్దలకు తెలుస్తుంది కాబట్టి వారు బాధ్యతను గుర్తెరిగి ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాలబాలికలకు ఎన్నో రంగాల్లో అవకాశాలుంటాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కస్తూర్బా గురుకులాల్లో హెల్ప్లైన్ ద్వారా వారి భవిష్యత్తు మార్గదర్శకాలను ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. గొట్టిముక్కులలో బాలికల విద్యకు పాటుపడుతూ బాల్యవివాహాల నిర్మూలనకు తీసుకున్న చర్యలపై ఆ గ్రామ సర్పంచ్ అరుణను కలెక్టర్ అభినందించారు. జిల్లా ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ..బాల్యవివాహాల నిర్మూలనకు తమ శాఖ తరఫున శాయశక్తులా కృషిచేస్తామన్నారు. బాల్యవివాహాలు జరిపినట్లు తమ దృష్టికి తీసుకువస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా సంబందీకులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తామని తెలిపారు. త్వరలో ఏర్పాటు చేసే భరోసా కేంద్రంలో మహిళా హోంగార్డు, కౌన్సిలర్లతో పా టుగా మానసిక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంచే విషయాన్ని పరి శీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ సురేష్ పొద్దార్, జిల్లా మహిళా సం క్షేమ అధికారి జ్యోత్స్న, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్. ఎస్ గాలబ్, ప్రొఫెసర్లు పృథ్వీకర్రెడ్డి, వెంకట్రెడ్డి, చైల్డ్లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ వెంకటేష్, సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పోలీసు అధికారులు, పలుగ్రామాల సర్పంచులు,కార్య దర్శులు, వీఆర్వోలు, చైల్డ్లైన్, మహితా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక చొరవ చూపాలి బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చు. విద్యార్థినులు కళాశాల విద్యను అభ్యసించడానికి కళాశాలలు అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఉండకపోవడంతో బాల్యంలోనే తల్లిదండ్రులు వారికి వివాహాలు జరిపిస్తున్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. ఈ వివాహాల వల్ల కలిగే అనర్థాలను బాలికల తల్లిదండ్రులకు తెలియజేయడానికి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ ప్రత్యేకంగా చొరవ చూపాలి. –కలెక్టర్ దివ్య -
నేడు జనసేన ఆధ్వర్యంలో వర్క్షాప్
► రాష్ట్ర నాయకుడు నర్సింహా మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాలులో జనసేన ఆధ్వర్యంలో వర్క్షాప్ శనివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు పర్దిపూర్ నర్సింహా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీలోకి వచ్చేవారికి కార్యకర్తలు, నాయకులకు సామర్థ్యపు పరీక్షలు నిర్వహి స్తామన్నారు. విశ్లేషకులు, విషయ రచయితలు, వక్తలుగా రాణించే వారికి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీలో పదవిని ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వర్క్షాప్ ఉంటుందన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి శంకర్గౌడ్, మీడియా హెడ్ హరిప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సైదాల శ్రీనివాస్, గుంత సంతోశ్, ఆవునూరి రమేశ్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
పెళ్లి అంటే వర్క్షాప్ : సెహ్వాగ్
న్యూ ఢిల్లీ : మైదానంలో తన బ్యాటింగ్తో చెలరేగిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియా ద్వారా అదే స్థాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. వివాహం వర్క్షాప్లాంటిది అంటూ కితాబిచ్చాడు.. ఈ బంధంలో భర్త వర్క్ చేస్తే, భార్య షాపింగ్ చేస్తారు. కానీ, తన భార్య ఆర్తీ అహల్వత్ వర్క్ చేస్తూ షాపింగ్ చేస్తుంది అంటూ ట్విట్టర్లో వీరూ పోస్ట్ చేశాడు. బీవీజీ(తన భార్యామణి) రాక్స్ అంటూ డాషింగ్ ఓపెనర్ చమత్కరించాడు. ఇంతకు ముందు కూడా టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా.. భార్య మూడ్ ఎలా మారిపోతుందో తెలుసుకోవడం భర్తకు ఎంత కష్టమో.. అచ్చంగా అలాగే భువీ ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లను గొప్ప బ్యాట్స్మన్ గ్రహించడం అసాధ్యమని సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ పేల్చిన విషయం తెలిసిందే. Marriage is a workshop where husband works and wife shops. But Biwi ji Rocks ! Works and Shops ! pic.twitter.com/8W8WEr7wvd — Virender Sehwag (@virendersehwag) February 18, 2017 -
కార్యాచరణతో సేవలందించండి
ఖరీఫ్ సాగుకు సమాయత్తం వర్క్షాపులో కలెక్టర్ కోనశశిధర్ అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు మెరుగైన పారదర్శక సేవలు అందించాలంటే ఖరీఫ్నకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక రైతు శిక్షణ కేం ద్రం (ఎఫ్టీసీ)లో ఖరీఫ్ కాలానికి సాగుకు సమాయత్తం – కార్యాచరణపై నిర్వహించిన వర్క్షాపులో కలెక్టర్ ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మే నుం చి ప్రారంభం కానున్న 2017 ఖరీఫ్లో రైతులకు నాణ్య మైన విత్తనాలు అందించడానికి కృషి చేయాలన్నారు. వేరుశనగ పంట విస్తీర్ణాన్ని కొంత వరకు తగ్గించి కనీసం 5 లక్షల ఎకరాల్లో జొన్నలు, రాగి, సజ్జ, కొర్ర లాంటి బహుధాన్యపు పంటల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. ఇందులో 4 లక్షల ఎకరాలు వ్యవసాయశాఖ, మిగతా ఒక లక్ష ఎకరాల్లో పంట వేయించాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలన్నారు. గత ఏడాది బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ బాగానే చేశామని, ఈ సారి చౌకదుకాణాల ద్వారా విత్తన పంపిణీ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించాలన్నారు. మూడు నాలుగు నెలల్లో హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లను నింపుతామన్నారు. 2014 ఇ¯ŒSపుట్ సబ్సిడీ పంపిణీ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ–2 ఖాజామొహిద్ధీన్, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏలు డి.జయచంద్ర, చంద్రానాయక్, ఎం.కృష్ణమూర్తి, ఆత్మ పీడీ డాక్టర్ పి.నాగన్న, డీఐవో రామ్ప్రసాదరెడ్డి, ఏఆర్ఎస్, కేవీకే, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు రవీంద్రనాథరెడ్డి, సహదేవరెడ్డి, వై.పద్మలత, పి.లక్షి్మరెడ్డి, జా¯ŒSసుధీర్, సంపత్కుమార్, ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ మేనేజర్లు రెడ్డెప్పరెడ్డి, బాల భాస్కర్, పరశురామయ్య, డివిజ¯ŒS ఏడీలు, పాల్గొన్నారు. -
నేడు ఆర్యూలో వర్క్షాప్
కర్నూలు సిటీ: ఉపాధి కోర్సులు, సీబీసీఎస్ సిలబస్పై అభిప్రాయాలను సేకరించేందుకు శనివారం ఆర్యూలో వర్క్షాపు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వర్క్షాపులు నిర్వహించేందుకు ఉన్నత విద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి వర్క్షాప్నకు రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాలో ఉన్న వర్సిటీలకు చెందిన వీసీలు, డీన్లు, ప్రొఫెసర్లు, ఏపీఎస్ఎస్డీసీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఆర్యూ వీసీ వై.నరసింహూలు అధ్యక్షత వహించనున్నారు. -
ఢిల్లీ వెళ్లిన డీఈఓ
కర్నూలు సిటీ: ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న వర్క్షాప్లో పాల్గొనేందుకు డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర మానవ వనరులల శాఖ ఆధ్వర్యంలలో వర్క్షాపు నిర్వహించనున్నారు. దీనికి ఒక్కో రాష్ట్రం నుంచి ఒక డీఈఓ, ఒక డిప్యూటీ ఈఓ హాజరుకావాలి. ఏపీ నుంచి కర్నూలు జిల్లా విద్యాధికారి వెళ్లారు. తిరిగి ఈ నెల 12వ తేదీ ఈయన జిల్లాకు రానున్నారు. -
నేడు టీటీడీసీలో వర్క్షాప్
అన ంతపురం టౌన్ : నగర శివారులోని టీటీడీసీలో శుక్రవారం వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఉపాధి హామీ నిధులను అనుసంధానం చేసిన నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ, డీఆర్డీఏ అధికారులతో సమావేశమై ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. -
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్
-
అత్యవసర వైద్యంపై వర్క్షాప్
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఎమర్జన్సీ అండ్ క్రిటికేర్ వైద్యంలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను వివరించేందుకు ఎనిమిదవ జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజు ప్రాణాప్రాయ, అత్యవసర వైద్యసేవలపై వర్క్షాపు నిర్వహించారు. íపీడియాట్రిక్ ఎమర్జన్సీ రీసెర్చి మెథడాలజీ, పీడియాట్రిక్, అడల్డ్ క్రిటికల్ కేర్ అంశాలను యువ వైద్యులకు వివరించారు. అమెరికాకు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ అజయ్లు వైద్య విద్యార్థులకు పరిశోధనల కోసం పేపర్లు ఎంపిక చేసే విధానం, పేపర్ ప్రజెంటేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చండ్ర రాధికారాణి, డాక్టర్ చంద్రశేఖర్లు బేసిక్లైఫ్ సపోర్ట్ గురించి, ట్రామా, ఎమర్జన్సీ ట్రీట్మెంట్లో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతుల గురించి వర్క్షాపులో వివరించారు. కాగా ఈ సదస్సును శనివారం సాయంత్రం వైద్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మళ్లీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధికారాణి తెలిపారు. -
గేట్ కళాశాలలో వర్క్షాపు
చిలుకూరు: మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఎండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ఎలక్ట్రికల్ కంట్రోల్ అండ్ అటోమిషన్ అనే అంశంపై వర్క్ షాపు నిర్వహించారు. ఈ వర్క్షాపును కళాశాల చైర్మన్ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వర్క్షాపులో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులుకు కళాశాలలో అన్ని హంగులతో వసతులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మైకెల్ ఫారడే పుట్టిన రోజున విద్యార్థులు వర్క్షాపు నిర్వహించడం హర్షంచదగిన విషయమన్నారు. వర్క్షాపు రెండు రోజుల పాటు జరుగుతుందని ప్రిన్సిపాల్ రామరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త యాప్స్ సృష్టించండి!
* రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారావు నంబూరు (పెదకాకాని): నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంగళవారం ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఫంyŠ lమెంటల్స్పై రాష్ట్రస్థాయి వర్స్షాపు ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఘంటా సుబ్బారావు మాట్లాడుతూ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో 85 శాతం గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లేనని తెలిపారు. ప్రజల అవసరాల కోసం నూతన యాప్స్ రూపొందించాలని సూచించారు. దేశంలోనే మొదటిసారిగా 100 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీరు తమ కళాశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, దీంతో కనీసం పదివేల మంది బీటెక్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మనదేశంపై ఎంతో నమ్మకంతో గూగుల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, మొదట మన రాష్ట్రంలో వీవీఐటీలో వర్క్షాపును ప్రారంభించినట్లు లె లిపారు. సీమన్స్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)ని ఆంధ్రప్రదేశ్లో మొదటి విభాగాన్ని 15 రోజుల్లో వీవీఐటీలో ప్రారంభించనుందని తెలిపారు. 20 లక్షల మంది డెవలపర్స్ను తయారు చేయడమే లక్ష్యం గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ హెడ్ పియోస్ సరస్వత్ మాట్లాడుతూ 20 లక్షల మంది ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్స్ను తయారు చేయాలనే సంకల్పంతో గూగుల్ ఉందని, భారతదేశంపై ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. గూగుల్ సంస్థ తమ కళాశాలలో ఆంధ్రప్రదేశ్లో మొదటిగా నైపుణ్యాభివృద్ధి పై వర్క్షాపును నిర్వహించడం సంతోషంగా ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. పదో తేదీన కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, నైపుణ్యాభిసంస్థ నిపుణులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతిని పరిరక్షించుకుందాం
ప్రొద్దుటూరు కల్చరల్: సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రాంత ప్రముఖ్ కాకర్ల రాముడు పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో శుక్రవారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ ద్వారా సాంస్కృతిక విషయాల వర్క్షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతిలో మనదైన ప్రత్యేక సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలను సజీవంగా జనజీవనంలో నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఏ సంస్కృతి అయినా దాని ప్రత్యేకత ద్వారా విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. ఈ వర్క్షాప్లో 6–10వ తరగతులు చదివే విద్యార్థులకు సంగీతం, నృత్యం, ఏకపాత్రభినయం, చిత్రకళ, కోలాటం, చెక్కభజన, హస్తకళలల్లో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 15 ప్రభుత్వ, మున్సిపల్ ప్రైవేటు పాఠశాలల 500 మందిపైగా విద్యార్థులు వర్క్షాప్లో శిక్షణ పొందుతున్నారు. సరస్వతీ విద్యామందిరం సంచాలిత సమతి అధ్యక్షుడు మునిస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కర్నూలు సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీనివాసులు, సంచాలిత సమితి పట్టణ కార్యదర్శి పద్మనాభయ్య, గౌరవాధ్యక్షుడు వర్రా గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతిని పరిరక్షించుకుందాం
ప్రొద్దుటూరు కల్చరల్: సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రాంత ప్రముఖ్ కాకర్ల రాముడు పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో శుక్రవారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ ద్వారా సాంస్కృతిక విషయాల వర్క్షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతిలో మనదైన ప్రత్యేక సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలను సజీవంగా జనజీవనంలో నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఏ సంస్కృతి అయినా దాని ప్రత్యేకత ద్వారా విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. ఈ వర్క్షాప్లో 6–10వ తరగతులు చదివే విద్యార్థులకు సంగీతం, నృత్యం, ఏకపాత్రభినయం, చిత్రకళ, కోలాటం, చెక్కభజన, హస్తకళలల్లో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 15 ప్రభుత్వ, మున్సిపల్ ప్రైవేటు పాఠశాలల 500 మందిపైగా విద్యార్థులు వర్క్షాప్లో శిక్షణ పొందుతున్నారు. సరస్వతీ విద్యామందిరం సంచాలిత సమతి అధ్యక్షుడు మునిస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కర్నూలు సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీనివాసులు, సంచాలిత సమితి పట్టణ కార్యదర్శి పద్మనాభయ్య, గౌరవాధ్యక్షుడు వర్రా గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల అడ్డుకట్టకు లీడ్ ఏజెన్సీ
జాతీయ రహదారి భద్రత వర్క్షాప్లో సిఫారసులు సాక్షి, విశాఖపట్నం: రహదారి భద్రతకు సంయుక్తంగా పాటుపడాలని అన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందుకోసం వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేశాయి. రక్తమోడుతున్న రహదారుల్లో 2020 నాటికి ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గించాలనే బ్రెజీలియా డిక్లరేషన్ స్ఫూర్తిగా విశాఖలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ రహదారి భద్రత వర్క్షాప్ శనివారం సాయంత్రం ముగిసింది. వివిధ రాష్ట్రాల మంత్రులు, రవాణాశాఖ కమిషనర్లు, ఐదు దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని రహదారి భద్రతపై విస్తృతంగా చర్చించి సిఫార్సులు చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వీటి ఆమోదానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సూచించారు. పర్వతప్రాంతాలు ఎక్కువున్న హిమాచల్, మేఘాలయలాంటి రాష్ట్రాల్లో రోడ్డుభద్రతపై చర్చించి సిఫార్సులు చేయాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రంలోనూ లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానాన్ని అన్నిరాష్ట్రాల్లో అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, రోడ్ల వెంబడి ఉండే ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెం టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతోపాటు పరికరాల కొనుగోలుకు ఆర్థికసాయమందించాలని సిఫారసు చేసింది. -
మలేరియాను అరికట్టాలి
సబ్ యూనిట్ అధికారులకు డీఎంహెచ్ఓ సూచన ఎంజీఎం/హసన్పర్తి : సబ్ యూనిట్ అధికారులు పీహెచ్సీల్లోని సిబ్బంది కి, ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా పనిచేసి మలేరియా అరికట్టాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. హసన్పర్తి పీహెచ్సీ ఆవరణలోని క్లస్టర్ సమావేశ మందిరంలో జోనల్ (వరంగల్, కరీంనగర్) మలేరియా వర్క్షాప్ మంగళవారం జరిగింది. ఈ వర్క్షాప్లో ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఏటా 1.5 మిలియన్ల ప్రజలు మలేరియా బారిన పడుతున్నారని తెలిపారు. సబ్ యూనిట్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్న సమయంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమలతో ప్రాణాంతక మెదడువాపు, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, బోధకాలు వ్యాపిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా అధికారి జయశ్రీ, జిల్లా మలేరియా అధికారి పైడిరాజు, జిల్లా హెల్త్ ఎడ్యూకేటర్ అన్వర్, సమన్వయర్తగా వ్యవహరించిన పరంజ్యోతి, పళినాకుమారి, విప్లవ్కుమార్ పాల్గొన్నారు. -
సమాంతర సినిమా నిర్మాణంపై ఉచిత వర్క్షాప్
సీతంపేట: తక్కువ ఖర్చుతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియా సహకారంతో సమాంతర సినిమా ఏ విధంగా నిర్మించాలి తదితర అంశాలపై ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి వర్క్షాప్ నిర్వహించనున్నారు. ప్రముఖ సమాంతర సినిమా దర్శకుడు క్యాంప్ శశి సినిమా నిర్మాణంపై ఉచితంగా అవగాహన కల్పించనున్నారు. ధరణి ఎన్జీవో ఆర్గనైజేషన్, ఆర్కే మీడియా హౌస్, వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సంయుక్తగా వర్క్షాప్ నిర్వహిస్తున్నాయి. ఔత్సాహిక యువకులు, దర్శకులు, షార్ట్ఫిల్మ్ల రూపకర్తలు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు 9866084124 ఫోన్ నంబరును సంప్రదించవచ్చు. -
14న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్పై ఉచిత వర్క్షాప్
అక్కయ్యపాలెం: తక్కువ ఖర్చుతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియా సహకారంతో ఇండిపెండెంట్ సినిమా ఏ విధంగా నిర్మించవచ్చు అనే అంశంపై ఈనెల 14న పౌరగ్రంథాలయంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కార్టూనిస్టు హరి వెంకట్ తెలిపారు. అక్కయ్యపాలెం శాంతిపురంలోని ఆర్.కె.మీడియా హౌస్లో సోమవారం ఉదయం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఇండిపెండెంట్ సినిమా దర్శకుడు క్యాంప్ శశి శిక్షణ ఇస్తారని తెలిపారు. మెయిన్ స్ట్రీమ్ సినిమా ఒరవడికి భిన్నంగా ప్రపంచ సినిమా స్ఫూర్తితో సమాంతర, ఇండిపెండెంట్ సినిమా నిర్మాణం జరుగుతోందన్నారు. ఇటీవల కాలంలో ఇండిపెండెంట్ సినిమా విశేష ఆదరణ పొందుతోందన్నారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఇండిపెండెంట్ సినిమాలు ప్రశంసలతోపాటు అవార్డులు గెలుచుకున్నాయని గుర్తుచేసారు. భౌగోళికంగా, సాంస్కతికంగా విభిన్నమైన వాతావరణం ఉన్న విశాఖ నగరంలో ఇటువంటి ఇండిపెండెంట్ సినిమాల నిర్మాణం జరగాలని అభిలాషిస్తూ ఆర్.కె.మీడియా హౌస్, ధరణి సొసైటీ సంయుక్తంగా ఉచిత వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాల్గొనదలచినవారు మరిన్ని వివరాలకు 9866084124 ఫోన్ నంబరుకు సంప్రదించవచ్చన్నారు. -
క్లౌడ్ కంప్యూటింగ్పై వర్క్షాపు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకేలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్వలో ఐదు రోజుల పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అనే అంశంపై నిర్వహించే వర్క్షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాపులో మంజ్రా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా) సీఈఓ ప్రొఫెసర్ రాజ్కుమార్ భూయ్యా మాట్లాడుతూ సాంకేతిక విప్లవ లాభాలు సామాన్య మానవుడి సమస్యలు తీర్చేలా ఉండాలన్నారు.70 శాతం ఐటీ వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ద్వారా జరుగుతున్నాయని, వాటిలో భారత దేశం 30 శాతంతో ముందుకు వెళ్తోందన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీకృత విధానంతో మొబైల్ అప్లికేషన్లు, హెల్త్కేర్ అప్లికేషన్లు, రోబోటిక్ సర్వీస్లు వంటి వాటిలో వినూత్న ఆవిష్కరణలు జరిపి సున్నిత సమస్యలకు సాంకేతికతను జోడించి పరిష్కరించాలన్నారు. అనంతరం రాజ్కుమార్ భయ్యాను వర్సిటీ అధ్యాపకులు సత్కరించారు. మొబైల్ అండ్ క్లౌడ్ ల్యాబ్ హెడ్ సతీ‹ష్నారాయణ్ శ్రీరామ్, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ కృష్ణమోహన్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎంహెచ్ కృష్ణప్రసాద్, కరుణ తదితరులు పాల్గొన్నారు. -
29 నుంచి రైతు సంఘం వర్క్షాపు
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఈ నెల 29వ తేదీ నుంచి 30 వరకు కడప నగరం చిన్నచౌకులోని సప్తగిరి కళ్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వర్క్షాపు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, ప్రదాన కార్యదర్శి జి.చంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్రెడి హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే వర్క్షాపులో వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు – ప్రభుత్వ పాత్ర , సమస్యలు పరిష్కార మార్గాలు, కరువు, నీటి పారుదల (ఆవశ్యకత), రుణమాఫీ ఆవశ్యకత, ప్రభుత్వం, కౌలుదారి వ్యవస్థ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారన్నారు. ఈ వర్క్షాపునకు అఖిల భారత కిసాన్ సభ ఉపా«ధ్యక్షుడు రావుల వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కె.బి.వి. ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య హాజరవుతారన్నారు. -
వర్క్షాప్లో...
‘36 వయదినిలే’... (36 ఏళ్ల వయసులో అని అర్థం). దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జ్యోతిక నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం చూసినవాళ్లు నటిగా జ్యోతిక ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని ప్రశంసించారు. ఈ చిత్రం విడుదల సమయంలో ‘మంచి కథలు వస్తే ఇక వరుసగా సినిమాలు చేస్తా’ అని జ్యోతిక, ‘నా భార్య జ్యోతిక నటిగా కంటిన్యూ అయితే నాకేం అభ్యంతరం లేదు’ అని హీరో సూర్య పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జ్యోతికకు మంచి కథే దొరి కింది. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘కుట్రమ్ కడిదల్’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన బ్రమ్మ జి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వర్క్షాప్ జరుగుతోంది. 20 రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెడతారు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. -
హర్టీ కేక్స్
కాలంతో కరిగి పోకుండా ఎంతో కాలం పదిలంగా ఉండే శిల్పాలు, బొమ్మలు చాలా చూసి ఉంటారు. వాటిని తాకి నాటి శిల్పుల కళా చాతుర్యానికి ఆశ్చర్య పోతుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నవి మాత్రం అలాంటివి కావు. ఈ కళాత్మక శిల్పాలు తాకినా.. నోటిలో వేసుకున్నా ఇట్టే కరిగిపోతాయి. - ఓ మధు స్వయంగా చేస్తేనే పర్ఫెక్ట్.. సాధారణంగా వర్క్షాప్లు అనగానే పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తయారీ విధానం చూడటం తప్ప స్వయంగా చేసే అవకాశం వర్క్షాప్లలో తక్కువ. కానీ నేను అలా కాకుండా 5-8 మంది మాత్రమే వర్క్షాప్లో ఉండేట్లు చూసుకుంటాను. రెండు రోజుల వర్క్షాప్లో మెటీరియల్ ఇచ్చి పూర్తిగా వారితోనే కేక్ తయారు చేయిస్తాను. దీంతో వారు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. అలా నా దగ్గర శిక్షణ తీసుకున్న చాలా మంది హాబీగా మాత్రమే కాకుండా బిజినెస్ పరంగానూ రాణిస్తుండటం ఆనందంగా ఉంది. 20 నుంచి బేసిక్ బేకింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాను. ఆసక్తి గల వారు 8885848635 నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రసన్న అలంకరణ, రుచి రెండూ కేక్ తయారీకి ముఖ్యమే. ఈ రెండిటిలో ప్రయోగాలు చేస్తూ అందమైన కేక్ బొమ్మలు మలచడంలో ప్రసన్న దేవిశెట్టి దిట్ట. హాబీని చక్కని వ్యాపార మార్గంగా మలుచుకున్నారీమె. తన నైపుణ్యాన్ని తనకే పరిమితం చేసుకోకుండా కేక్ మేకింగ్, డెకరేటింగ్, చాక్లెట్ మేకింగ్లలో నలుగురికి శిక్షణనిస్తున్నారు. చదువుతూనే పదను పెట్టా.. ‘చిన్నప్పటి నుంచి కేక్ తయారీ అంటే సరదా. అప్పుడప్పుడు సన్నిహితులు, బంధువులకు సరదాగా కేక్ తయారు చేసి ఇచ్చేదాన్ని కూడా’ అంటూ గుర్తు చేసుకున్నారు ప్రసన్న. ఎవరికైనా వ్యాపారం ప్రారంభిస్తే ఆర్డర్లు వస్తాయి. అయితే బీటెక్ చదువుతున్నప్పుడే ప్రసన్న ఫస్ట్ ఆర్డర్ అందుకున్నారు. ‘న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి పక్కనే ఉన్న స్కూల్ వాళ్లు 40 కేజీల కేక్ తయారు చేయమని అడిగారు. అదే నా ఫస్ట్ ఆర్డర్. ఖర్చులు, లాభనష్టాలు లెక్కలేసుకోకుండా ఎంతో ఇష్టంగా తయారు చేసి ఇచ్చాను. స్కూల్ నిర్వాహకులు, వందల మంది పిల్లలు తిని చాలా బాగుందన్నారు. చాలా తృప్తిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి నా ఆసక్తిని మరింత మెరుగుపరుచుకొని కేక్ మేకింగ్లో రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ, పెళ్లైన తర్వాత భర్త ప్రోత్సాహం అందించడంతో చెన్నై, బెంగళూర్, పుణె.. ఇలా పలు నగరాలకు వెళ్లి తగిన శిక్షణ తీసుకున్నానం’టూ వివరించారామె. పది మందికి నేర్పిస్తూ.. సరదాగా నేర్చుకున్న కేక్, చాక్లెట్ తయారీలో ప్రసన్న సాధిస్తున్న వ్యాపార విజయం.. అనేక మందికి స్ఫూర్తిని అందించింది. దీంతో పలువురు తమకూ నేర్పమంటూ అడగడం ప్రారంభించారు. మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే వ్యాపార పరంగానూ రాణించేందుకు ఇది చక్కని మార్గమని అంటున్న ప్రసన్న.. టీచర్గా కూడా మారారు. గృహిణిగా ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కేక్ మేకింగ్ వర్క్షాప్లు సైతం నిర్వహిస్తూ ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్లో సైతం క్లాస్లు తీసుకుంటారు. అలా ఇప్పటికి 800 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. కేక్ మేకింగ్లో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారీ సృజనశీలి. చిన్నప్పటి నుంచి సహజంగా అబ్బిన పెయింటింగ్ను కేక్లపై ప్రదర్శిస్తూ కొత్త కొత్త ఆర్టిస్టిక్ కేక్స్ అందిస్తున్నారు. -
‘నీరాంచల్’పై రెండు రోజుల వర్క్షాప్
సమావేశానికి ఐదు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్రం కొత్తగా అమలు చేస్తున్న ‘నీరాంచల్’ పథకంపై రాష్ట్ర స్థాయిలో అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ హైదరాబాద్లో గురు, శుక్రవారాల్లో వర్క్షాప్ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వర్క్షాపులో పాల్గొంటారని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. దేశవ్యాప్తంగా వాటర్షెడ్ల నిర్మాణంలో కొత్త పద్ధతులు అవలంబించేందుకు తొమ్మిది రాష్ట్రాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా నీరాంచల్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. పెలైట్ ప్రాజెక్టుకు ఎంపికైన ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల చొప్పున ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయి. వర్క్ షాపులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ మదాన్ ‘నీరాంచల్’ పథకం లక్ష్యాలను వివరించనున్నారు. -
మంత్రి రావెలకు చేదు అనుభవం !!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రస్థాయి స్వచ్ఛ వసతి గృహం వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో మంత్రి రావెలను హాస్టళ్ల వార్డెన్లు నిలదీశారు. ప్రభుత్వ హాస్టళ్ల మూసివేతపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కంగుతున్న మంత్రి రావెల సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు. -
బుల్లి అతిథికో గూడు..
పక్షులకు ఆపద్బాంధవుడిగా ఉంటూ వాటిని కాపాడేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది సిటీకి చెందిన యానిమల్ రీహాబిలిటేషన్ అండ్ ప్రొటక్షన్ ఫ్రంట్ (ఏఆర్పీఎఫ్). ఇందులో భాగంగా జంతు సంరక్షణపై వర్క్షాప్లు నిర్వహిస్తోంది. పిచ్చుకల కోసం స్వయంగా గూడును తయారు చేసుకొనేలా చెక్క ముక్కలతో బర్డ్ నెస్ట్ తయారీపై బంజారాహిల్స్లోని లామకాన్లో శనివారం వర్క్షాప్ నిర్వహించారు. పక్షి ప్రేమికులు ఈ వర్క్షాప్లో భాగం పంచుకున్నారు. ఈ గూడులను గ్రిల్కి, కిటికీకి, ఇంటి దగ్గరి చెట్ల కొమ్మలకి.. ఇలా ఎక్కడైనా అమర్చుకోవచ్చు. పిల్లలనూ భాగస్వాముల్ని చేయాలి.. సిటీలో పెరుగుతున్న కాలుష్యంతో ఇక్కడ పక్షులు జీవించడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పిచ్చుకలు అంతరించిపోతాయి. పిల్లలకు పక్షులపై ప్రేమ పెంచాలి. మా పాపని ఈ వర్క్షాప్లో భాగం చేశాను. ఇక నుంచి తనే ఎంచక్కా పక్షి గూళ్లను తయారు చేసి ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకుంటుంది. - ప్రసన్న -
ఎన్ఏటీ వర్క్షాప్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఐఐటీ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నేషనల్ అథారిటీ టెస్ట్(ఎన్ఏటీ)పై అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనల కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ రెండురోజుల వర్క్షాప్ గురువారం ప్రారంభమైంది. తొలిరోజున నిపుణుల ప్రజెంటేషన్ జరిగింది. ఆప్టిట్యూడ్ టెస్ట్లో అంతర్జాతీయ అనుభవాన్ని వాడుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఈ వర్క్షాప్ నిర్వహిస్తోంది. -
ఉత్తమ ‘పుర’ సేవలపై అధ్యయనం
♦ పురపాలనపై వర్క్షాపులో మంత్రి కేటీఆర్ ♦ ఈ నెల 27న చెన్నైలో పర్యటిస్తా ♦ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తాం సాక్షి, హైదరాబాద్: దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తమిళనాడులో నగర, పురపాలక సంస్థలకు నిధుల సమీకరణ కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తమిళనాడు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సంస్థ విజయవంతంగా సేవలందిస్తోందన్నారు. ఈ సంస్థ పనితీరుపై అధ్యయనం కోసం ఈ నెల 27న చెన్నైలో పర్యటించనున్నట్లు తెలిపారు. పురపాలనలో ఉత్తమ విధానాలపై శనివారం హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా, స్మార్ట్సిటీగా తీర్చిదిద్దేందుకు ఉత్తమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. నగరంలో మంచి రోడ్లు, పరిశుభ్రమైన వీధులు, మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ, జల మండలి విభాగాలు వంద రోజుల ప్రణాళికలను ప్రకటించాయన్నారు. పురపాలనలో నగర పౌరులను భాగస్వాములను చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులతో వార్డు కమిటీలు, బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా నిర్వహించని విధంగా హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల చొప్పున 44 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేయడంతోపాటు 2,500 ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ. 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ నగరంలోని పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థల నుంచి సేకరిస్తున్న సామాజిక బాధ్యత నిధులను నగరాభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించాలన్నారు. మహారాష్ట్రలోని పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆ రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శి మనీషా పటాంకర్ వివరించారు. నాగ్పూర్లో 24 గంటల నీటి సరఫరా, నీటి పునర్వినియోగం కోసం తీసుకుంటున్న చర్యలపై విశ్వరాజ్ ఇన్ఫ్రా సంస్థ ఎండీ అరుణ్ లఖానీ, బెంగళూరులో పన్నుల విధానంలో మార్పులపై నగర ఉప కమిషనర్ మల్లిఖార్జున్, ఢిల్లీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ఐఎల్ఎఫ్ఎస్ ఎండీ మహేశ్బాబు తదితరులు మాట్లాడారు. ఢిల్లీ, నాగ్పూర్, బెంగళూరు, మహారాష్ట్రల్లో ఉత్తమ పుర సేవలపై అధ్యయనం కోసం రాష్ట్ర అధికారుల బృందాలను పంపనున్నామని సదస్సు అనంతరం మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సదస్సుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహమ్మద్లు హాజరయ్యారు. -
అత్తాపూర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ :రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఆదివారం తెల్లవారుజామున ఓ వర్క్షాపులో ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఇదే ప్రాంతంలో రెండో అగ్నిప్రమాదం సంభవించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘సబ్ప్లాన్’ పదేళ్ల నిబంధన తొలగించాలి
- వర్క్షాపులో నిపుణుల సూచన సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల ఉపప్రణాళిక చట్టం-2013 ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పదేళ్లపాటు అమల్లో ఉండాలనే నిబంధనను సరి చేసి, రెగ్యులర్గా కొనసాగించేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. అందుబాటులో ఉన్న సమాచారం(డేటాబేస్)తో ఎస్సీ, ఎస్టీలకు మౌలిక వసతులు కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొం దించాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలపై జరిగిన వర్క్షాపులో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయా అంశాలపై మరింత విస్తృతస్థాయిలో చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. డేటాబేస్ బాధ్యతలను సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) డెరైక్టర్కు అప్పగించారు. సబ్ప్లాన్ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్ రోడ్లకు 16 శాతం, విద్యకు 25 శాతం నిధులు కేటాయించాలని అధికారులు సూచించారు. సోమేశ్కుమార్ మాట్లాడుతూ కేవలం డబ్బు కేటాయించినంత మాత్రాన అభివృద్ధి జరగదని, నిధులను సక్రమంగా వ్యయం చేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ ఉప ప్రణాళికల బడ్జెట్ను ఖర్చు చేయడంలో లోపాలున్నాయని, వాటిని అధిగమిం చాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎస్టీ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్, ప్లానింగ్ డెరైక్టర్ సుదర్శన్రెడ్డి, సెస్ డెరైక్టర్ గాలిబ్, ఓయూ ఫ్యాకల్టీ రెడ్యానాయక్, ఎస్టీ శాఖ జేడీ దశరథ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భవనాలపై వర్క్షాప్
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి వివిధ ప్రభుత్వ శాఖల తరలింపునకు అవసరమైన భవనాలను సమకూర్చే బాధ్యతను సీఆర్డీఏ చేపట్టింది. ఇందుకోసం శనివారం నిర్వహించిన వర్క్షాపులో 150 ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. తమ శాఖలకు అవసరమైన భవనాల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్కు నిర్దేశించిన నమూనాలో అందజేశారు. రాష్ట్ర సచివాలయ, కమిషనర్, డెరైక్టర్, ఇతర కార్యాలయాల అధిపతులు తమ శాఖల తరపున పంపిన నోడల్ అధికారులు తమకు కావాల్సిన భవనాల వివరాలను పేర్కొన్నారు. కృష్ణా నది పక్కన 130 కిలోమీటర్ల పొడవున సీఆర్డీఏ రీజియన్ ఉంటుందని, అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం సముదాయాలు 400 ఎకరాల్లో ఉంటాయని ఈ వర్క్షాపులో కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. 2050 నాటికి 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని, ప్రతీ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, కార్పొరేషన్లు అన్నీ ఒకేచోట ఉంటాయని ఆయన చెప్పారు. -
లంబాడీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్షాప్
బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ -
పెయింటింగ్ వర్క్షాప్
ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే వారికోసం సికింద్రాబాద్లోని అవర్ సాక్రెడ్ స్పేస్లో వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే వర్క్షాప్ చిత్రలేఖనంలో బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. వాటర్ కలర్స్ను వాడుతూ అందమైన ఊహలకు రూపమివ్వడానికి ఉపకరించేలా ఇది కొనసాగుతుంది. -
చేర్యాల స్క్రోల్
చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్... గీతల్లో అందమైన రంగులను నింపుకొని పురాణాలను, ఇతిహాసాలను,ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టే అద్భుతమైన కళ. అలాంటి కళను.. ఇటీవల తన వర్క్షాప్ ద్వారా సిటీవాసులకు పరిచయం చేశాడు కళాకారుడు, నేషనల్ అవార్డీ డి.వైకుంఠం నకాష్. ఎప్పుడూ ఉద్యోగం, ఇల్లు, పిల్లలతో బిజీగా ఉండే మహిళలు ఆ వర్క్షాప్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కరోజు శిక్షణ పొందిన వారు.... తరువాత తాము వేసిన పెయింటింగ్స్ చూస్తూ ముచ్చటపడ్డారు... కాకతీయుల కాలంలో తెలంగాణలో పుట్టిన ఈ చేర్యాల్ పెయింటింగ్కు ఎంతో చరిత్ర ఉంది. రంగుల నుంచి బ్రష్ల వరకు ఓ ప్రత్యేక శైలి. మొదట్లో ఇళ్లు, దేవాలయాల్లో గోడలకే పరిమితమైన ఈ కళ తర్వాత కేన్వాస్పైకి చేరింది. సహజసిద్ధమైన రంగులతో వేసే ఈ పెయింటింగ్స్ జానపద గాథలను తలపిస్తాయి. 1978లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు చొరవ.. ఈ పెయింటింగ్స్కు దేశవిదేశాల్లో మంచి కీర్తి తెచ్చిపెట్టింది. గతంలో మహాభారతం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాల్లోని వాటినే కథలుగా చేర్యాల్ చిత్రాల్లో కనిపించేది. గ్రామీణ ప్రాంతాల్లో కుల పురాణాలను చిత్రాల్లో పొందుపరిచి... ఆయా కులస్తులకు కథలుగా చెప్పేవాళ్లు. ప్రకృతిసిద్ధమైన రంగులు ఈ పెయింటింగ్స్లో వాడే రంగులన్నీ కొన్ని రకాల రాళ్ల పొడి, దీపానికి పట్టే మసి, శంకు పొడి, కూరగాయల నుంచి తయారు చేసిన సహజ సిద్ధమైనవే. ఇందుకు ఉపయోగించే పెద్ద బ్రష్షులను మేక వెంట్రుకలతో తయారు చేస్తారు. అతి క్లిష్టమైన లైనింగ్ కోసం ఉపయోగించే చిన్న కుంచెలను ఉడుత తోక వెంట్రుకలతో తయారు చేస్తారు. గంజి, సుద్దమట్టి, బంక లిక్విడ్లా తయారు చేసి ఒక తెల్లటి ఖాదీ బట్టపై కోటింగ్ వేసి గట్టిపడేలా చేస్తారు. అటు తర్వాత ఆ క్లాత్పై డ్రాయింగ్ వేసి రంగులను అద్దుతారు. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ పెయింటింగ్స్కు దేశవిదేశాల్లో ఎంతో ఆదరణ ఉంది. ఒకప్పుడు వరంగల్ జిల్లాలోని చేర్యాల్లోని ఎన్నో కుటుంబాలు పోషించిన ఈ పెయింటింగ్ వారి పొట్టనింపలేదు. ఇప్పుడు నాలుగు కుటుంబాలకే పరిమితమైంది. ఈ కళ ఇంతటితో అంతరించి పోకూడదనే లక్ష్యంతో... వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు వైకుంఠం నకాష్. ఈ చిత్రాలతో వీరి కుటుంబ ప్రయాణం 15వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది. వైకుంఠం ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. సహజమైన అనుభూతి అవర్సేక్రెడ్ స్పేస్లో జరిగిన ఈ వర్క్షాప్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెగ్యులర్ యాక్టివిటీస్ను పక్కనపెట్టి... కుంచె చేత పట్టారు. తమ చేతుల్లో అందంగా రూపుదిద్దుకున్న చిత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. ‘పెయింటింగ్స్ వేయడం నాకు చాలా ఇష్టం. చేర్యాల్ పెయింటింగ్స్ గీయడం, సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం... మంచి అనుభూతినిచ్చింది. ఇకనుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తా’ అని ఎస్బీఐ క్యాష్ ఆఫీసర్ రమ తెలిపారు. ‘గతంలో ఆయిల్ పెయింటింగ్స్ వేసినా... ఈ వర్క్షాప్లో పాల్గొని చేర్యాల్ పెయింటింగ్స్ నేర్చుకోవడం, వెంటనే గీయడం... థ్రిల్లింగ్గా అనిపించింది’ అని చెబుతున్నారు జయంతి శ్రీధర్. -
తయారీ రంగానికి బూస్ట్..
చట్టాలు, నిబంధనలు మారుస్తాం ఎకానమీని మళ్లీ వృద్ధి బాట పట్టిస్తాం మేక్ ఇన్ ఇండియాపై పరిశ్రమ వర్గాలతో భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ రంగానికి, ఉపాధి కల్పనకూ ఊతమిచ్చే విధంగా అవసరమైతే చట్టాలను, ప్రభుత్వ పనితీరునూ మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎకానమీని మళ్లీ వృద్ధి బాట పట్టిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై సోమవారం జరిగిన వర్క్షాప్లో పరిశ్రమవర్గాలు, ప్రభుత్వాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘గత 3 నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమైంది. మారడానికి మేం సిద్ధంగా ఉన్నాం. చట్టాలు నిబంధనలు మార్చాలన్నా మార్చాలన్నా మేం రెడీ. ఆఖరికి వ్యవస్థే మారాలన్నా కూడా సిద్ధమే’ అని ఆయన చెప్పారు. తయారీ రంగం ఎదుగుదలకు ఎదురవుతున్న ఆటంకాలను పారదర్శకమైన, సమిష్టి నిర్ణయాలతో తొలగించగలమని హామీ ఇచ్చారు. సాధారణంగా ప్రభుత్వ విధానాలు తప్పించుకునేట్లు, పక్కదారి పట్టించేవిగాను, గందరగోళంగానూ ఉంటూ జాప్యాలకు దారి తీస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. వీటిని ఏబీసీడీగా ఆయన అభివర్ణించారు. వీటి స్థానంలో జవాబుదారీతనం, యాజమాన్య ధోరణి, బాధ్యత, క్రమశిక్షణ అలవడేలా చూడటానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీన్ని ఆయన ‘రోడ్ (ఆర్వోఏడీ)’గా అభివర్ణించారు. మానవ వనరుల అభివృద్ధి, నవకల్పనలు, పరిశోధనలనేవి ప్రభుత్వ పనితీరులో భాగమైపోవాలని ప్రధాని అభిప్రాయపపడ్డారు. జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని లోప రహితంగానూ(జీరో డిఫెక్ట్), పర్యావరణానికి ఎలాంటి హాని కలుగని విధంగాను(జీరో ఎఫెక్ట్) అమలు చేయాలన్నది తమ లక్ష్యమని ప్రదాని చెప్పారు. అంతర్జాతీయంగా బ్రాండ్ ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతటా సమంగా అభివృద్ధి జరగాలని చెప్పారు. వర్క్షాప్లో ఎవరు ఏం చేయాలన్నది, విధానాల్లో ఏమేం మార్పులు చేయాలన్న దాంతో పాటు అనుసరించాల్సిన ప్రణాళికపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఇక నిర్ణయాలు ఆటోమేటిక్గా అమలు కాగలవన్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అందర్నీ భాగస్వాములను చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానానికి కొత్త కోణం జోడిస్తున్నామని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశోధనల్లో భార తీయ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాల నుంచి, వారి పనితీరు నుంచి తయారీ రంగం ప్రేరణ పొందవచ్చని ఆయన సూచించారు. వర్క్షాప్లో వజ్రాభరణాలు, ఆటోమొబైల్స్, చమురు.. గ్యాస్, విద్యుత్, రసాయనాలు తదితర 24 పైచిలుకు రంగాలకు సంబంధించిన పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వాధికారులు తమ అభిప్రాయాలు తెలిపారు. వచ్చే 30-40 ఏళ్ల అవసరాలకు సరిపడా సుశిక్షితులైన మానవ వనరులను అభివృద్ధి చేసుకునేందుకు విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమ వర్గాలు కలిసి పనిచేయాలని మోదీ సూచించారు. నవకల్పనలు, పరిశోధనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నారు. పాతికేళ్ల నుంచి భారత్ ఐటీ రంగంలో సత్తా చాటుకుంటున్నప్పటికీ, గూగుల్ వంటి దిగ్గజాన్ని సృష్టించలేకపోయిందని, మన నిపుణులు విదేశాలకు తరలిపోతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలకు అవరోధాలు తొలగిస్తాం: అరుణ్ జైట్లీ వ్యాపారాలకు అవరోధాలు తొల గించి, సానుకూల పరిస్థితులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మెరుగైన పన్ను విధానాలు అమలు చేస్తామని, మేక్ ఇన్ ఇండియా నినాదం కింద తయారీ రంగానికి తోడ్పాటు అందిస్తామని ఆయన చెప్పారు. ఇటు దేశీ, అటు విదేశీ మార్కెట్లకు ఎగుమతుల కోసం చౌకగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తమ ముఖ్యోద్దేశం అని మేక్ ఇన్ ఇండియాపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వివరించారు. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కఠిన పరపతి విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తయారీ రంగంలో మందగమనానికి ఏకైక కారణం అధిక వడ్డీ రేట్లేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఈ వారం జరిగే బ్యాంకర్ల భేటీ .. మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత ఊతం ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజన్పై విసుర్లు..: ఎగుమతుల కన్నా దేశీ మార్కెట్పై దృష్టితో మేక్ ఇన్ ఇండియాను తలపెట్టాలంటూ రాజన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై జైట్లీ ఘాటుగా స్పందించారు. దీని ప్రధానోద్దేశం.. చౌక ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ మాత్రమేనని, అవి దేశీ మార్కెట్ కోసమా లేక ఎగుమతుల కోసమా అన్నది అప్రస్తుతం అన్నారు. ‘మేక్ ఇండియా అనేది భారత్లో వినియోగదారుల కోసమా లేక విదేశాల్లో వారి కోసమా అన్నది అప్రస్తుతం. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నాణ్యమైన వస్తువులు చౌకగా కొనుక్కోవాలనుకుంటున్నారన్నది నేటి ప్రధాన సూత్రం. చౌకగా, నాణ్యమైన సర్వీసులు పొందాలనుకుంటున్నారు’ అని జైట్లీ చెప్పారు. ఇటు ధరలోనూ, అటు నాణ్యతలోనూ పోటీపడలేకపోతే భారత్ కేవలం వ్యాపార దేశంగా మాత్రమే మిగిలిపోతుందే తప్ప తయారీ కేంద్రంగా ఎదగలేదన్నారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈసారి కన్నా వచ్చే ఏడాదిలో ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆత్మరక్షణపై మహిళలకు వర్క్షాప్
న్యూఢిల్లీ: ‘మీపై ఎవరైనా దాడి చేస్తే భయపడకండి. వెంటనే కళ్లు తదితర సున్నిత భాగాలపై కొట్టండి. చిమ్మచీకటిగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తాల్సి వస్తే మీ వెంట పెప్పర్ స్త్రేని ఉంచుకోండి. ప్రతిఘటించేందుకు పిడికిళ్లను ఉపయోగించకండి. మోకాళ్లను మాత్రమే వినియోగించండి’ ఇలా అనేక విలువైన సలహాలు, సూచనలను నిపుణులు మహిళలకు తెలియజేశారు. మహిళల భద్రతకు సంబంధించి మంగళవారం నగరంలో మంగళవారం ఓ వర్క్షాప్ను నిర్వహించారు. ‘ఉమెన్ సేఫ్టీ అండ్ సర్వైవల్’ పేరిట ఈ కార్యక్రమం అమెరికాకు చెందిన ఓ సంస్థ సహకారంతో స్థానిక స్వచ్ఛంద నేతృత్వంలో జరిగింది. ‘ఓ మహిళపై దాడి జరిగినపుడు ఏవిధంగా ప్రతిఘటించాలో ఆమెకు తెలియదు. అందువల్ల వారికి తగు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’అని స్ట్రీట్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రాం (ఎస్ఎల్ఏపీ) సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు మృగంకా దడ్వాల్ పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా దాడికి గురికావచ్చనీ, దానిని తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఇటువంటి శిక్షణ పొందినట్టయితే వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందన్నారు. ‘నాపై దాడి జరగదనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఒకవేళ దాడి జరిగితే పెప్పర్ స్ప్రేని ఎలా ఉపయోగిస్తాననే అంశం నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది’ అని ఈ కార్యక్రమానికి హాజరైన వాణి మెహతా పేర్కొంది. మరో మహిళ దడ్వాల్ మాట్లాడుతూ సరైన సమయంలో సరయిన విధంగా వ్యవహరించాలి. చిమ్మచీకటిగా ఉండే ప్రాంతంలో వెళ్లాల్సి వచ్చినపుడు పెప్పర్ స్ప్రేని ఉంచుకోవాలి. అది ఎంతగానో ఉపయోగపడుతుంది.’అని పేర్కొంది. -
విద్యార్థులు వక్తలుగా రాణించాలి
సామాజిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి బాలవక్త వర్క్షాప్లో ఏజేసీ కృష్ణారెడ్డి విద్యారణ్యపురి : విద్యార్థి దశ నుంచే ప్రాక్టీస్ చేస్తే విద్యార్థులు భవిష్యత్లో వక్తలుగా రాణించే అవకాశం ఉంటుందని అదనపు జారుుంట్ కలెక్టర్ (ఏజేసీ) కె.కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ, కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాలోని అన్ని డివిజన్లలో బాలవక్త పోటీలను నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఎంపిక చేసిన సుమారు 50 మంది విద్యార్థులకు రెండు రోజులుగా హన్మకొండలోని ఎస్ఆర్వీ హైస్కూల్లో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. శనివారం వర్క్షాప్ను ఏజేసీ కృష్ణారెడ్డి సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివిధ అంశాలపై నిర్వహించే ఉపన్యాస పోటీల్లో భాగస్వాములు కావడం వల్ల స్టేజీ ఫికర్ పోతుందన్నారు. విద్యార్థులకు కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఇలాంటి వర్క్షాప్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటాక్ సంస్థ బాధ్యులు ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మూడింటిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థులతో పంచుకోవాలని సూచించారు. రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్ట్ ఏఎంఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించాలంటే చిన్నతనం నుంచే నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. వర్క్షాప్లో భాగస్వాములవుతున్న విద్యార్థులకు ఈనెల 14న జిల్లాస్థాయి వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టాప్ టె న్లో నిలిచిన పది మందికి ‘బాలవక్త’ బిరుదును ప్రదానం చేయనున్నట్లు వివరించారు. వర్క్షాప్లో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, ప్రధాన కార్యదర్శి జి.కృష్ణ, డిప్యూటీ డీఈఓ డి.వాసంతి మాట్లాడారు. ఉపాధ్యాయుడు ఎన్.రాజ్గోపాల్, నటుడు, వ్యాఖ్యాత కె.తిరుమలయ్య, సైకాలిజిస్టు జి.భవాని, పాఠ్యపుస్తక రచయిత డాక్టర్ ఆర్.గణపతి, కేయూ ప్రొఫెసర్ నర్సింహారావు వర్క్షాప్లో విద్యార్థులకు పలు మెళకువలు నేర్పించారు. రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సతీష్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
కిచెన్ గార్డెనింగ్ వర్క్షాప్కు విశేష స్పందన
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సబ్సిడీపై కిట్ల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్లో శనివారం జరిగిన కిచెన్ గార్డెనింగ్ వర్క్షాప్నకు విశేష స్పందన లభించింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్కషాప్నకు పిల్లలు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రసాయనాలతో తలెత్తే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకునే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇందుకు సంబంధించి పలు వివరాలను అధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగం అధికారి అరుణ సబ్సిడీ కిట్ గురించి వివరించారు. ఈ కిట్లో కిచెన్ గార్డెనింగ్కు అవసరమైన పరికరాలు ఉన్నాయన్నారు. రూ.6 వేల విలువ కలిగిన ఈ కిట్ను సబ్సిడీ పోనూ రూ.3 వేలకే అందజేస్తున్నామని ఆమె తెలిపారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం నుంచి రిసోర్స్ పర్సన్గా వచ్చిన చంద్రశేఖర్ కిచెన్ గార్డెన్లో తలెత్తే ఇబ్బందులు వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందజేశారు. కిచెన్ గార్డెనింగ్ సబ్సిడీ కిట్ అందుకున్న వారికి ఫాలోఅప్ మీట్స్ నెలనెలా నిర్వహించి వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణీ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా జరిగే పేరెంట్స్ మీట్లో భాగంగా అదనపు గంట నిర్వహించిన ఈ వర్క్షాపునకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్ పిల్లల్లో కూడా కిచెన్ గార్డెనింగ్ అలవాటును పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. -
'సాక్షి మైత్రి' సెమినార్కు అద్భుత స్పందన
-
బుడ్డేడే కదా అనుకుంటే బుగ్గిచేశాడు
మూడేళ్ల బుజ్జిగాడు సిగరెట్ లైటర్ తో ఆడుకుంటూంటే ఎవరూ పట్టించుకోలేదు. అలా ఆడుతూ అడుతూ లైటర్ వెలిగించాడు. అక్కడ పడున్న స్పాంజి ముక్కలకు నిప్పంటించాడు. ఆ నిప్పు పెరిగి పెరిగి పెద్దదై ఒక పెద్ద దుస్తుల వర్క్ షాప్ నే బుగ్గి చేసింది. ఆ పిల్లవాడు వర్క్ షాపు యజమాని. మొత్తం మీద పిల్లవాడు ఏమీ కాకుండా బయటపడ్డాడు కానీ ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. మొత్తం వర్క్ షాపు బూడిదైపోయింది. ఈ సంఘటన చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రాంతం లోని జున్ బు లో జరిగింది. ఇప్పుడు చైనా పోలీసులు వర్క్ షాప్ యజమానిని అరెస్టు చేశారు. ఆయన వర్క్ షాప్ పలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించాడు. కనీస అనుమతులు సైతం లేవు. మరోవైపు ప్రమాదం వల్ల చనిపోయిన, గాయపడ్డ వారికి పరిహారం ఇవ్వడం జరిగిందని చైనా మీడియా వెల్లడించింది.