truck
-
రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి ట్రక్కు.. ఇంతలో వేగంగా రైలు రావడంతో..
జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్లో రైలు ప్రమాదం(Train accident) చోటుచేసుకుంది. జల్గావ్ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోధుమల బస్తాలతో నిండిన ఒక ట్రక్కు కాపలా లేని రైల్వే గేటును ఢీకొని, పట్టాలపైకి చేరుకుంది. ఇంతలో అదే ట్రక్పైకి అంబా ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చింది. అది ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో టక్కు తునాతునకలయ్యింది. ఆ ట్రక్కులోని కొంతభాగం రైలు ఇంజిన్లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అయితే రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో మధ్య రైల్వేకు చెందిన ముంబై-కోల్కతా మార్గం(Mumbai-Kolkata route)లోని ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైరు తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం ఈ మార్గంలో మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు డ్రైవర్ రైల్వే నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే క్రాసింగ్ను దాటే ప్రయత్నం చేశాడు. ఫలితంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.ఇది కూడా చదవండి: Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ.. -
నిద్రిస్తున్న కూలీలపై ఇసుక అన్లోడ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్.. ఇసుకను అన్లోడ్ చేశాడు.ఇసుక అన్లోడ్ చేసే సమయంలో షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. శనివారం తెల్లవారుజామున జాఫ్రాబాద్ తహసీల్లోని పసోడి-చందోల్లోని వంతెన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!
ట్రక్లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే..నాగ్పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్. తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్. (చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..) -
మెక్సికో ప్రమాదంలో 41 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
దేశవ్యాప్తంగా పెరిగిన ట్రక్ అద్దెలు
ముంబై: దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ట్రక్ల అద్దెలు జనవరిలో గణనీయంగా కోలుకున్నాయి. శీతాకాలంలో పండ్లు, కూరగాయల దిగుబడులు ఇందుకు మద్దతుగా నిలిచాయి. కొన్ని మార్గాల్లో ట్రక్ల అద్దెలు 2024 డిసెంబర్తో పోలి్చతే జనవరిలో 4 శాతం వరకు పెరిగినట్టు శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ బులెటిన్ వెల్లడించింది. ‘‘సాధారణంగా జనవరి–మార్చి కాలం రద్దీగా ఉంటుంది. రబీ పంట తర్వాత వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పలు రంగాల్లోనూ తయారీ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి’’అని శ్రీరామ్ ఫైనాన్స్ తెలిపింది. వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు, వ్యవసాయ ట్రైలర్ల అమ్మకాలు గత నెలలో గణనీయంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఢిల్లీ–ముంబై–ఢిల్లీ మార్గంలో ట్రక్ల అద్దెల ధరలు 4 శాతం పెరిగాయి. ముంబై–కోల్కతా–ముంబై మార్గంలో 3.7 శాతం మేర ధరలు అధికమయ్యాయి. ఢిల్లీ–హైదరాబాద్–ఢిల్లీ మార్గం, కోల్కతా–గువహటి–కోల్కతా మార్గంలో అద్దెలు 3.3 శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ‘‘లాజిస్టిక్స్ రంగంలో ట్రక్ల అద్దె రేట్లు పెరగడం సానుకూల సంకేతం. శీతాకాల పండ్లు, కూరగాయల దిగుబడులతో రవాణా, స్టోరేజీ వసతులకు డిమాండ్ పెరిగింది’’అని శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో వైఎస్ చక్రవర్తి తెలిపారు. -
ఇథియోపియాలో ఘోర ప్రమాదం..
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు. మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. వీకెండ్సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. — SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024 -
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
అడ్వెంచర్స్ కోసం అద్భుతమైన వాహనం: ఫియర్స్ ఫోర్డ్ సూపర్ డ్యూటీ క్యాంపర్ ట్రక్ (ఫోటోలు)
-
టమాటాలకు పోలీసు బందోబస్తు
పట్నా: ఉత్తరప్రదేశ్లోని ఒక వింత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్న ఆ దృశ్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. టమాటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.వివరాల్లోకి వెళితే ఒక లారీలో 1,800 కిలోల టమోటాలను ఢిల్లీకి తరలిస్తుండగా దారిలో ఆ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే సదరు టమాటాల యజమాని టమాటాల భద్రత కోసం పోలీసులకు సమాచారం అందించారు. అర్జున్ అనే వ్యక్తి ఈ లారీని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నాడు.ఝాన్సీ-గ్వాలియర్ హైవేలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల సమయంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ వెనుకే స్కూటీపై వస్తున్న ఒక మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. టమాటాలు ఎవరూ ఎత్తుకెళ్లకుండా చూసేందుకు ముగ్గురు పోలీసులు ఘటనా స్థలంలో కాపలాగా నిలిచారు. ఉదయాన్నే క్రేన్ రాగానే, లారీని సరిచేసి మళ్లీ టమాటాలను లారీలోకి ఎక్కించారు. అంత వరకూ పోలీసులు అక్కడే కాపలాగా ఉన్నారు. ప్రస్తుతం టమోటాల ధర మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 వరకు ఉంది. పలు చోట్ల భారీ వర్షాలకు టమాటా పంట నాశనమైంది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. बंगलुरू से 1800 किलो टमाटर लेकर दिल्ली जा रहा ट्रक झांसी, यूपी में पलट गया। टमाटर की लूट न हो जाए, इसलिए रातभर पुलिस तैनात रही। मार्केट में टमाटर का रेट 80 से 120 रुपए किलो तक है।@RajuSha98211687 pic.twitter.com/g19jkVgOSs— Sachin Gupta (@SachinGuptaUP) October 18, 2024ఇది కూడా చదవండి: గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పది మంది మృతి
లక్నో:ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో శుక్రవారం(అక్టోబర్4) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి ప్రయాగ్రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో ట్రాక్టర్ను ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు.ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి అభినందన్ తెలిపారు.ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడని చెప్పారు. ఇదీ చదవండి: వైవాహిక అత్యాచారం నేరం కాదు -
Rajasthan: రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
సిరోహి: రాజస్థాన్లోని సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జీపు రాంగ్ డైరెక్షన్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపు ప్రయాణికులతో నిండివుంది.జీపులో ప్రయాణిస్తున్నవారంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీపు ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతిచెందారని పిండ్వారా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి హమీర్ సింగ్ తెలిపారు. మృతులు, గాయపడినవారు ఉదయపూర్ జిల్లాలోని గోగుండా, ఝడోల్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి -
పెరిగిన ట్రక్ అద్దెలు
పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
ఇలాంటి సైబర్ ట్రక్ ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
Madhya Pradesh: కావడియాత్రలో విషాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్లోని గంగా ఘాట్కు ట్రాక్టర్లో తరలివెళ్తున్నారు.డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టమాటా ట్రక్కు బోల్తా.. పండుగ చేసుకున్న జనం
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ. 100ను దాటింది. దీంతో సామాన్యులు టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్లో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్లోని సాగర్ నుండి టమోటాలతో ఢిల్లీ వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటన బంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజువా గ్రామం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టమాటాలతో నిండిన ట్రక్కు బోల్తా పడిందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు టమాటాలను ఏరుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ట్రక్కు నుంచి బయటపడిన టమాటాలు సంచులలోకి ఎత్తి తీసుకువెళ్లగా, మరికొందరు దర్జాగా ట్రక్కు లోనికివెళ్లి, టమోటాలను దక్కించుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గుమిగూడిన జనాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 15 క్వింటాళ్లకు పైగా టమాటను జనం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ట్రక్కులోని టమాటాలను మరో వాహనంలోని ఎక్కించి, అది వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించేందుకు డ్రైవర్కు సహకరించారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి 13 మంది..
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేరి జిల్లా నేషనల్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ మినీవ్యాన్ కొట్టడంతో 13 మంది మృతి చెందారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్లని, దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.బ్యాడ్గి మండలం పుణేబెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును శుక్రవారం వేకువ జామున ఓ మినీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులోని 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాద తీవ్రతకు ట్రక్కులోకి మినీ వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో అతికష్టం మీద మృతదేహాల్ని పోలీసులు బయటకు తీయగలిగారు. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం ఎమ్మిహట్టి గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. బెలగావి సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో శుక్రవారం పొద్దున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రెండు ముక్కలైన ట్రక్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్తో కలిసి ట్రక్కులో కాశ్మీర్కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
గుడిసెపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి గుడిసెలో ఆదమరచి నిద్రిస్తున్నవారిపైకి అకస్మాత్తుగా ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రక్కు హర్దోయ్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.భల్లా కంజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. మెహందీఘాట్, కన్నౌజ్ నుంచి హర్దోయ్కు వెళ్తున్న ఇసుకతో కూడిన ట్రక్కు ఈ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇసుకలో కూరుకుపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
కెన్వర్త్ సూపర్ట్రక్2 అదిరిపోయే ఫొటోలు
-
డీజిల్ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు
సరుకు రవాణా ధరలు మార్చి 2024లో ఫ్లాట్గా ఉన్నాయని శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ లాజిస్టిక్స్ పరిశోధన నివేదిక శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. గౌహతి-ముంబై ట్రిప్ మినహా మెజారిటీ రూట్లలో పెరుగుదల కనిపించలేదని చెప్పింది. ఈ మార్గంలో రవాణా ధరలు 1.1 శాతం పెరిగాయని పేర్కొంది. మరోవైపు దిల్లీ-కోల్కతా, దిల్లీ-చెన్నై, దిల్లీ-బెంగళూరు, ముంబై-కోల్కతా ట్రిప్ల్లో రవాణా ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీ-కోల్కతా మార్గంలో గరిష్టంగా 1.4 శాతం ధరలు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అందులోని వివరాల ప్రకారం..ఆల్ ఇండియా వెహికల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 20.29 మిలియన్ యూనిట్లతో పోలిస్తే మార్చిలో 21.27 మిలియన్ యూనిట్లు పెరిగాయి. ఈ విభాగంలో 4.81 శాతం వృద్ధి నమోదైంది. ఇది మార్చి 2023లో నమోదైన 20.62 మిలియన్లతో పోలిస్తే 3.14 శాతం ఎక్కువ. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నెల కావడంతో కార్పొరేట్ సంస్థలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త అధికంగా సరుకు రవాణా చేయడంతో ట్రక్కుల అద్దెలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి చివరి వరకు ఇంధన ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 28న దిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.89.62 ఉండగా, మార్చి 31న లీటరుకు రూ.87.62 పడిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 15న లీటరుకు రూ.2 చొప్పున ఇంధన ధరలను తగ్గించాయి. అయినా ట్రక్కు అద్దె ధరలు, రవాణా ధరల్లో ఎలాంటి మార్పు లేదని నివేదిక ద్వారా తెలిసింది. -
పెళ్లి వేడుకలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి!
మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు రాంగ్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసి, వివాహ వేడుకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. సుల్తాన్పూర్ ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు ప్రమాదం బారినపడ్డారని సుల్తాన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ఖమారియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైసెన్ కలెక్టర్ అరవింద్ దూబే తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వైద్య చికిత్స అందించేందుకు భోపాల్కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. -
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి!
బీహార్లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్ను ఢీకొని, మరో లేన్లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్ 2లోని దేవ్కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్ను ఢీకొని, డివైడర్ను దాటి.. మరో లేన్లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు. -
అరెస్ట్ చేయండి!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎక్స్కవేటర్ ట్రక్కును పార్ట్స్.. పార్ట్స్గా విడదీయడం చూడవచ్చు. ఇది ఓ ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ట్రక్ హత్యగా పేర్కొంటూ.. దీనికి కారణమైన ఎక్స్కవేటర్ను అరెస్ట్ చేయండంటూ పేర్కొన్నారు. ఒక ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ, కృషి అవసరమో మాకు తెలుసు. కానీ అలాంటి ట్రక్కును కనికరం లేకుండా ముక్కలు చేయడం చాలా బాధాకరంగా ఉందని, రీ సైక్లింగ్ ద్వారా అవి మళ్ళీ ఎప్పటికైనా జీవిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆ ఎక్స్కవేటర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదీ చదవండి: 50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే! Someone arrest that claw-excavator for ‘truck homicide!’ As manufacturers, we know how much technology & effort goes into producing trucks. Hurts to see them so mercilessly torn apart. But I suppose through recycling they’ll live ‘forever.’ 🙂pic.twitter.com/vvhMDKF6MI — anand mahindra (@anandmahindra) February 22, 2024 -
ట్రక్కునే మొబైల్ హౌస్గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
హైవేను దిగ్భంధించిన ఆందోళనకారులు..!
-
ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్లపై ఎగబడుతున్న జనం
ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్లపై ఎగబడుతున్నారు. థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. ఛత్తీస్గఢ్లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్, రాజ్నంద్గావ్లోని బస్ స్టేషన్లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
మార్కెట్లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..
సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్షిప్ల్లో ఈ వాహనాల బుకింగ్లు ప్రారంభమయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు. ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అదిరిపోయే లుక్స్తో టెస్లా ‘సైబర్ట్రక్’ (ఫోటోలు)
-
సీఎం జగన్ పారిశ్రామిక విధానాలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు. ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు. సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
రాజస్తాన్లో రోడ్డు ప్రమాదం...ఆరుగురు పోలీసుల దుర్మరణం
చురు: రాజస్తాన్లో చురు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల నిమిత్తం వెళ్తున్న ఆరుగురు పోలీసు సిబ్బంది ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారంతా నగౌర్ నుంచి ఎన్నికల ర్యాలీ జరగనున్న ఝుంఝును వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దాంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
మస్క్కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్ట్రక్ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
వలసదారుల ట్రక్కు బోల్తా.. 10 మంది దుర్మరణం
దక్షిణ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కు హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది వలసదారులు మరణించారు 25 మందికి పైగా వలసదారులు గాయాలపాలయ్యారు. మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు 18 ఏళ్లలోపు వయస్సు గలవారున్నారన్నారు. గ్వాటెమాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలో వలసదారులకు సంబంధించి ఇది రెండవ ప్రమాదం అని తెలుస్తోంది. ప్రమాద బాధితులంతా క్యూబన్లు అని ఒక అధికారి వార్తాసంస్థకు వెల్లడించారు. దక్షిణ రాష్ట్రమైన చియాపాస్లోని పిజ్జియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు 27 మంది క్యూబా వలసదారులను తీసుకువెళుతున్నారు. పిజిజియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. లారీ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు తునాతునకలయ్యింది. వలసదారులు తరచూ రష్యా నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా వలసదారులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత గురువారం తెల్లవారుజామున చియాపాస్ రాష్ట్రంలోని మెజ్కలాపా మున్సిపాలిటీ పరిధిలో ఒక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలసదారులు మరణించారు. అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది వలసదారులు మెక్సికో నుంచి బస్సులు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లలో సైతం ప్రయాణిస్తుంటారు. 2021లో జరిగిన ఇటువంటి ప్రమాదంలో 55 మంది వలసదారులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జపనీస్ కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకోరు? -
ఎలక్ట్రిక్ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్గా వినోద్ దాసరి
బెంగళూరుకు చెందిన మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ ట్రెసా మోటర్స్ బోర్డు ఛైర్మన్గా వినోద్ కె దాసరిని నియమించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో వినోద్కు ఉన్న విశేష అనుభవం తమ కంపెనీ దేశీయ మార్కెట్లో పట్టు సాధించడంతోపాటు అంతర్జాతీయ వ్యాపార అవకాశాల అన్వేషణకు తోడ్పడుతుందని ట్రెసా మోటార్స్ విశ్వసిస్తోంది. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? వినోద్ దాసరి గతంలో రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓగా, అశోక్ లేలాండ్ సీఈవో, ఎండీగా పనిచేశారు. అపెక్స్ ఇండస్ట్రీ బాడీ ఎస్ఐఏఎంకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో ఆటోకార్ ప్రొఫెషనల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ట్రెసా మోటర్స్ చైర్మన్గా వినోద్ దాసరి నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ట్రెసా మోటర్స్లో కీలక బాధ్యతలను చేపట్టనున్న ఆయన కంపెనీ వ్యూహాత్మక దిశానిర్దేశం, ఆవిష్కరణలను నడపడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ట్రెసా మోటార్స్ కుటుంబానికి వినోద్ కె దాసరిని స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రోహన్ శ్రవణ్ అన్నారు. ఆటోమోటివ్ రంగంలో వినోద్ విశేష అనుభవం, అద్భుతమైన విజయాలు తమ కంపెనీ వృద్ధి ప్రయాణానికి కీలక వనరులుగా మారుతాయని, ఆయన నాయకత్వంలో ట్రెసా మోటర్స్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రెసా మోటర్స్ ఛైర్మన్గా తన నియామకంపై వినోద్ కె దాసరి మాట్లాడుతూ, ట్రెసా మోటార్స్లో చేరడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ట్రెసా మోటర్స్ కంపెనీని 2022లో రోహన్ శ్రవణ్, రవి మచాని స్థాపించారు. పారిశ్రామిక డిజైన్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్, బ్యాటరీ సంబంధిత టెక్నాలజీలో ఈ కంపెనీకి విశేష సామర్థ్యం ఉంది. ఇది ప్రస్తుతం 18T-55T GVW విభాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. దాని మొదటి వాహనం మోడల్ V0.1ని ఇటీవలె ఆవిష్కరించింది. అధికారిక ఉత్పత్తి లాంచ్ 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జరగనుంది. -
లండన్లో బర్గర్లు పంచిన ప్రిన్స్ విలియం.. దీనికి భారత్తో సంబంధం ఇదే..
బ్రిటన్లోని కొందరికి మొన్నటి ఆదివారం మరపురానిదిగా మిగిలిపోతుంది. ప్రిన్స్ విలియం లండన్లో ఒక ఫుడ్ ట్రక్ నుంచి పర్యావరణానికి హాని చేయని బర్గర్లను కొందరికి పంచిపెట్టారు. ఇది చూపరులను ఎంతగానో ఆశ్ఛర్యపరిచింది. వార్షిక ఎర్త్షాట్ పురస్కారాల పంపిణీలో భాగంగా గత ఏడాది విజేతలకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘ఎర్త్షాట్ బర్గర్ల’ను అందించారు. ఈ పురస్కారాలను పర్యావరణానికి విశేషమైన సేవలు అందించిన ఐదుగురికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ చానల్ సార్టెడ్ ఫుడ్లో షేర్ చేశారు. ఈ చానల్లో పర్యావరణ అనుకూలమైన వంటగది పరికరాలు, రకరకాల వంటకాల తయారీ విధానాలు కనిపిస్తాయి. వీడియో ప్రారంభంలో ప్రిన్స్ విలియం సార్టెడ్ ఫుడ్కు సంబంధించిన స్టూడియోకి చేరుకుంటారు. గత ఏడాది ఎర్త్షాట్ పురస్కార విజేతలు రూపొందించిన వాటిని ఒక వ్యక్తి పట్టుకుని ఉంటాడు. తరువాత బర్గర్ తయారు చేస్తుంటారు. ప్రిన్ ఆ డిష్ తీసుకుని జనం మధ్యలోకి చేరుకుంటారు. వీడియోలో ఫుడ్ ట్రక్ దగ్గర ప్రిన్స్ విలియం నిలుచుని, మీరు తినబోయే కంటైనర్ను నోట్ప్లా అనే కంపెనీ తయారు చేసిందని, దీనిలో ఎలాంటి ప్లాస్టిక్ను ఉపయోగించలేనది వినియోగదారులకు ఆయన చెప్పడాన్ని వినవచ్చు. ఈ కంటైనర్లకు సముద్రపు పాచితో తయారు చేస్తారు. బర్గర్లోని పదార్థాలను భారతదేశంలోని ఖేతీ అనే సంస్థ గ్రీన్హౌస్లలో ఉత్పత్తి చేసిందని ప్రిన్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. ముకూరు క్లీన్ స్టవ్పై బర్గర్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కెన్యాకు చెందిన ఓ మహిళ ఈ స్టవ్ను డిజైన్ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ఉత్పాదన లక్ష్యం. ఇది కూడా చదవండి: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం -
ట్రెసా నుంచి వీ0.1 ఎలక్ట్రిక్ ట్రక్
హైదరాబాద్: ట్రెసా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’ మోడల్ను ఆవిష్కరించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్ ఫామ్: ఫ్లక్స్350పై దీన్ని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్ కోసం డిజైన్ చేసినట్టు తెలిపింది. భవిష్యత్ కోసం ఉద్దేశించిన సుస్థిర రవాణా పరిష్కారాలను అందించాలన్న సంస్థ అంకిత భావానికి ఈ ఉత్పత్తి నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’లో 350 కిలోవాట్ పవర్ను అందించే మోటార్ ఉంటుంది. ఈ తరహా పవర్ను అందించే తొలి భారత ఓఈఎం తమదేనని ట్రెసా మోటార్స్ ప్రకటించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ను పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘‘దేశంలో 28 లక్షల ట్రక్కులు ఉన్నాయి. ఇవి 60 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. కనుక మధ్య స్థాయి నుంచి, భారీ తరహా ట్రక్కులు సున్నా ఉద్గార ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. 2024లో రానున్న వాహన తుక్కు విధానం, పెరుగుతున్న ఇంధన ధరలు ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుకూలించనున్నాయి. సురక్షిత, వినూత్న, పర్యావరణ పరిష్కారాలతో ఈ పరివర్తనాన్ని ట్రెసా ముందుండి నడిపిస్తుంది’’అని సంస్థ పేర్కొంది. -
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం..
-
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్హౌస్పై దాడి
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు. (చదవండి: నమ్మకమే పునాది) -
రాహుల్ గాంధీ నైటవుట్, ఈసారి ఇలా..!
ఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో జోష్ మీద ఉన్న ఆ పార్టీ శ్రేణులు.. ఆ విక్టరీలో రాహుల్ గాంధీకి కూడా కొంత క్రెడిట్ కట్టబెట్టాయి. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ గెలుపులో తన వంతు పోషించారాయన. ఇదే ఊపులో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అధికారం దిశగా ప్రయత్నిస్తామని ఆయన ప్రకటించుకున్నారు కూడా. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సోషల్మీడియా హాట్ టాపిక్గా మారారు. హర్యానా అంబాలా వద్ద సోమవారం అర్ధరాత్రి సందడి చేశారాయన. ట్రక్కులో ఆయన పర్యటించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఛండీగఢ్ వెళ్లే క్రమంలో.. ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. హెవీ వెహికల్స్ డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు.. వాళ్లతో కలిసి ప్రయాణించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అంబాలా వద్ద ఆగి.. కాసేపు ఆయన ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన మార్గం మధ్యలో ఓ గురుద్వారాను దర్శించుకున్నారు. यूनिवर्सिटी के छात्रों से खिलाड़ियों से सिविल सर्विस की तैयारी कर रहे युवाओं से किसानों से डिलीवरी पार्टनरों से बस में आम नागरिकों से और अब आधी रात को ट्रक के ड्राइवर से आख़िर क्यों मुलाक़ात कर रहे हैं राहुल गांधी? क्योंकि वो इस देश लोगों की बात सुनना चाहते हैं,… pic.twitter.com/HBxavsUv4f — Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023 Country needs such a leader#RahulGandhi pic.twitter.com/WOfCga0V7J — Kavish Aziz (@azizkavish) May 23, 2023 This is Rahul Gandhi, INC ex MP. Late night, he met with truck drivers, have a chat with them, asked them their problems. He travelled in one of the trucks too, enjoyed the desi music of truck driver. How many political leaders have you seen now doing this without any media… pic.twitter.com/HQFhjs7qR9 — Dr Nimo Yadav (@niiravmodi) May 23, 2023 -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. బుల్లితెర నటి స్పాట్ డెడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బెంగాలీకి చెందిన ప్రముఖ బుల్లితెర నటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న టీవీ నటి సుచంద్ర దాస్గుప్తా బైక్ టాక్సీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరానగర్లో జరిగింది. (ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్) ఎలా జరిగిందంటే.. షూటింగ్ ముగించుకున్న సుచంద్ర దాస్ గుప్తా సోదేపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకోవడానికి ఓ యాప్ ద్వారా బైక్ను బుక్ చేసుకున్నారు. బైక్పై ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు ఓ సైక్లిస్ట్ వారికి ఎదురుగా వచ్చాడు. దీంతో బైక్ రైడర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనకాల కూర్చున్న నటి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ సమయంలో వెనకాలే వస్తున్న ట్రక్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె హెల్మెట్ ధరించినా కూడా ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్నబారానగర్ పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా.. సుచంద్ర దాస్గుప్తా ప్రముఖ బెంగాలీ టీవీ షోలలో కనిపించారు. గౌరీ షోలో సపోర్టింగ్ రోల్ పోషించి పాపులర్ అయ్యారు. (ఇది చదవండి: హైదరాబాద్లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్ జిల్లాలోని ఖైర్ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్పూర్-కాశీపూర్ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్ వ్యాన్ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు. చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం -
నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్..
ముంబై: మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ధూమ్ సినిమాను తలపించేలా ఓ దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ కారు వచ్చింది. ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్గా ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మొదట ఈ చోరీ ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్లో జరిగిందని ప్రచారం జరిగింది. దీంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్పురి-ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कानपुर उन्नाव हाइवे पे ट्रक से बकरे चोरी करने वाला गिरोह जो लग्जरी कार से चोरी कर रहा.... वीडियो गौर से देखिए........@Uppolice pic.twitter.com/ytC6m6owgI — Mohit Sharma (@Mohit_Casual_) April 30, 2023 ఈ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు. అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడని జోకులు పేల్చారు. చదవండి: బైక్ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్ -
ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్ పంపు
పెట్రోల్ బంక్లో ప్రవేశిస్తుండగా ట్రక్ అదుపుతప్పడంతో ఘోర ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటనలో పెట్రోల్ పంపు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన ఏప్రిల్ 22న ఉదయం 9.3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ట్యాంక్ ఫిల్ చేసుకునేందుకు మహారాష్ట్రలోని పూణే సతారా హైవే సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రావడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సరిగ్గా పెట్రోల్ బంక్ ఎంట్రెన్స్లోకి వస్తుండగా ట్రక్కు అదుపుతప్పడంతో.. బంక్ వద్ద ఆగి ఉన్న కారుని ఢీకొట్టి పెంట్రోల్ బంక్ పంపు వైపుకి దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Video: Truck Hits Car At Pune Highway Petrol Pump, Uproots Fuel Dispenser Read here: https://t.co/w643tyKGZS pic.twitter.com/sVSq4qcZEU — NDTV Videos (@ndtvvideos) April 25, 2023 (చదవండి: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో) -
కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం..
జమ్మూ కశ్మీర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయపట్టడారు. . ఈ ఘటనలో కిరణ్ రిజిజుతో సహా ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని. విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #BREAKING Law Minister @KirenRijiju survived an accident when his Bullet proof car was hit by a full loaded truck near Banihal in Jammu and Kashmir. The car got little damaged but fortunately no one was hurt..@ABPNews pic.twitter.com/tMvkTUVI4e — Ashish Kumar Singh (ABP News) (@AshishSinghLIVE) April 8, 2023 కాగా కేంద్రమంత్రి కిరణ్ రిజుజు శనివారం జమ్మూ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజకీయ కెరీర్ను మెరుగుపరచేందుకే ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. . కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిని ప్రభుత్వం చూస్తూ ఉండదని వార్నింగ్ ఇచ్చారు. చదవండి: కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్! -
ఏందిరబ్బీ..ఈ యవ్వారం..తిక్క కుదిరిండ్లా!
-
స్కూటీని గుద్ది, 2 కి.మీ. లాక్కెళ్లి...
మహోబా(యూపీ): తాత, మనవడు వెళ్తున్న స్కూటీని ఓ ట్రక్కు ఢీకొట్టి, వారిని రెండు కిలోమీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో తాత, మనవడు ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని మహోబా జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. ఉదిత్ నారాయణ్ చౌరాసియా(66) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆయన ఆరేళ్ల మనవడు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్థానిక బిజనగర్ మలుపులో ప్రమాదం జరిగిందని సీఐ రామ్ పర్వేశ్ రాయ్ చెప్పారు. తాత, మనవడు సహా ట్రక్కు కింద ఇరుక్కుపోయిన స్కూటీని ట్రక్కు రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. స్థానికులు ట్రక్కును అడ్డగించి ఆపేశారు. చిద్రమైన తాత, మనవడి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. -
ఫంక్షన్ నుంచి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ బలోదా బజార్ జిల్లా ఖమారియా గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో వీరిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల సిఫార్సు మేరకు క్షతగాత్రుల్లో కొందరిని రాయ్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పికప్ వాహనంలో ఉన్నవారంతా ఓ పంక్షన్కు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అసరమైన సాయం అందించాలని సూచించారు. రెండు వారాల క్రితం కంకేర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరొక చిన్నారితో పాటు ఆటో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
-
షాకింగ్ దృశ్యాలు: కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వేగంగా దూసుకొచ్చిన 22 చక్రాల భారీ కంటైనర్ ట్రక్.. కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కారును మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో ట్రక్ మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన మీరట్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారును ట్రక్ ముందు భాగంతో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అయితే అదృష్టం బాగుండి కారులో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఎవరికి కూడా తీవ్రమైన గాయాలేవి అవ్వలేదు. కారును టక్కు లాక్కెళ్తుండటం చూసి రోడ్డుమీదున్న జనాలు, వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వాహనం ఆపమని ఆరిచినా పట్టించుకోకుండా ట్రక్ డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో స్థానికులు వెంటనే సమాచారంనిచ్చారు. పోలీసులకు రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్ను వెంబడించి అడ్డగించే వరకు కంటైనర్ను ఆపలేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఉన్నవారికి, ట్రక్కు డ్రైవర్కు మధ్య జరిగిన ఓ వాగ్వాదంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు.. That's #Meerut neighbour of #Ghaziabad. Real life action in #UttarPradeshpic.twitter.com/xxazsrOREV — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 13, 2023 -
ఘోర ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లా కోరార్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: Cow Hug Day On Valentines Day: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..! -
ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు.. భారత్లో తొలి ఎలక్ట్రిక్ ట్రక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్లో తొలి ఎలక్ట్రిక్ ట్రక్ను ఆవిష్కరించింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్–2023లో ఈ వాహనం తన సత్తా చాటింది. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయడం టిప్పర్ ప్రత్యేకత. రెండు గంటల్లోనే చార్జింగ్ 100 శాతం అవుతుంది. ఈ–ట్రక్ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్లో ట్రయల్స్ ప్రారంభించింది. ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణా రెడ్డి, హైడ్రోకార్బన్స్ ప్రెసిడెంట్ రాజేశ్ రెడ్డి, డైరెక్టర్ దొరయ్య ఈ సదస్సుకు హాజరయ్యారు. ఎనర్జీ వీక్–2023లో మేఘా అనుబంధ కంపెనీలు డ్రిల్మెక్ ఇంటర్నేషనల్, పెట్రివెన్ ఎస్పిఏ, మేఘా గ్యాస్, ఐకామ్ పాలుపంచుకున్నాయి. -
పాపం పాకిస్తానీలు.. గోధుమ పిండి కోసం ట్రక్కు వెనకాల పరుగులు...
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. తనడానికి తిండి కూడా సరిగా లేక ప్రజలకు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ దయనీయ పరిస్థితులకు అద్దం పట్టే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ టక్కు వెనకాల పరుగెత్తుతున్నారు పాకిస్తానీలు. బైక్లు వేసుకుని ర్యాలీగా దాన్ని ఫాలో అవుతున్నారు. తమకు ఓ పిండి బస్తా ఇవ్వమని చేతిలో డబ్బులు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు. This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing a truck carrying wheat flour, hoping to buy just 1 bag. Ppl of #JammuAndKashmir should open their eyes. Lucky not to be #Pakistani & still free to take decision about our future. Do we have any future with🇵🇰? pic.twitter.com/xOywDwKoiP — Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 14, 2023 ఈ వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్ముకశ్మీర్ గిల్గిత్ బాల్టిస్తాన్ అండ్ లద్దాఖ్ (జేకేజీబీఎల్) ఛైర్మన్ ప్రొఫెసర్ సజ్జాద్ రాజా ట్విట్టర్లో షేర్ చేశారు. ఒక్క పిండి బస్తా కోసం పాకిస్తాన్లో ప్రజలు ఎలా ట్రక్కు వెనకాల పరుగెత్తుతున్నారో చూడండి. దీన్ని చూసైనా జమ్ముకశ్మీర్ ప్రజలు కళ్లు తెరవాలి. వాళ్లు పాకిస్తాన్లో లేనందుకు అదృష్టవంతులు. మన భవిష్యత్పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇంకా ఉంది. పాకిస్తాన్లో అసలు మనకు భవిష్యత్ ఉందా? అని ప్రశ్నించారు. లాహోర్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 15 కిలోల గోధుమ పండి బస్తా ధర రూ.2,050 ఉంది. జనవరి 6నే బస్తాపై రూ.150 పెంచారు. ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చదవండి: ప్రపంచాన్ని చుట్టివచ్చిన వీరుడు.. వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు.. -
బోలెడు ప్రత్యేకతలు ఉన్న బాహుబలి ట్రక్కు.. ఏడేళ్ల పాటు
ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ట్రక్కు. అత్యంత శక్తిమంతమైన రిగ్ కలిగి ఉన్న ఈ ట్రక్కుకు రెండు డీజిల్ ఇంజిన్లు, 24 సిలిండర్లు ఉండటం విశేషం. దీని రిగ్ 3,974 హార్స్పవర్ శక్తితో పనిచేస్తుంది. ఇంత భారీగా ఉన్నప్పటికీ ఈ ట్రక్కు గంటకు 209 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో దూసుకుపోగలదు. అమెరికన్ ఆటోమొబైల్ ఇంజినీరు మైకేల్ హర్రా ఏడేళ్ల పాటు శ్రమించి, ‘థోర్–24’ పేరిట ఈ ట్రక్కును రూపొందించాడు. దీని నిర్మాణానికి 70 లక్షల డాలర్లు (రూ.58.03 కోట్లు) ఖర్చయింది. ఇందులో 40 అంగుళాల టీవీ, 1500 వాట్ ఆడియో సిస్టమ్ వంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి. చదవండి: సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం! -
ఘెరం: కారు ట్రక్కు ఢీ..మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి
పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందగా, ఒక మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. వారంతో కారులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు, ట్రక్కు ఘెరంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడికి తలకు తీవ్రగాయాలయ్యాయని, ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన పంజాబ్లోని బటాలాలో చోటు చేసుకుంది. వారు చాహల్ కలాన్లోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం బారిన పడ్డారని చెప్పారు. పంజాబ్లోని బటాలాకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య ) -
ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్
ఇంతవరకు ఎన్నో ఘోర ప్రమాదాలు చూసి ఉంటాం. చచ్చిపోతారు నోడౌట్ అనేంత దారుణమైన ప్రమాదాల బారినపడినవారు సైతం బతికిన ఉదంతాలు చూశాం. ఇవన్నీ ఒకత్తైతే ఇక్కడ జరిగిన ప్రమాదం చూస్తో వామ్మో అని బిగిసుకుపోతాం. ఎందుకంటే కచ్చితంగా బయటపడే ఛాన్స్లేదు అనేంత దారుణమైన ప్రమాదం. వివరాల్లోకెళ్తే...ఒక టూవీలర్ వాహనదారుడు రాత్రిపూటా రద్దీ లేకపోవడంతో రోడ్డును క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో సడెన్గా ట్రక్కు వచ్చింది. ఐతే రెండు కూడా చాలా వేగంగానే వస్తున్నాయి. ఇద్దరూ ఓ రేంజ్ స్పీడ్లో వచ్చారు. కచ్చితం దారుణం ఢీ కొట్టారు. ఎవ్వరూ బతికే అవకాశం లేదనిపించేలా గగ్గుర్పాటుకు గురి చేసే ఘటన. అలాంటిది ఊహించని విధంగా ప్రమాదం జరగదు. చివర్లో భలే గమత్తుగా బైకర్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అసలు అదేలా సాధ్యం అనిపిస్తుంది. మిరాకిల్ ఘటన అంటే ఇదేనేమో అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా వారిద్దరికీ భూమ్మీద నూకలు ఉండబట్టి..ప్రమాదం నుంచి సునాయాసంగా బయటపడ్డారు అని అనాలో అర్థంకాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఊపిరాగిపోతుందేమో అన్నంత రేంజ్లో ఉంటుంది ఆ ఘటన. ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय, औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD — Dipanshu Kabra (@ipskabra) January 5, 2023 (చదవండి: నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్సన్ బైక్తో.. ) -
ఢిల్లీ తరహా దారుణం.. బైక్ని ఢీ కొట్టి లాక్కెళ్లిన ట్రక్కు..విద్యార్థి మృతి
సాక్షి, భోపాల్: ఢిల్లీ మహిళను కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే అచ్చం అలాంటి తరహ మరోక ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బాధితురాలు మధ్యప్రదేశ్లోని షాదోల్ నివాసి రూబీ థాకూర్. ఆమె జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీస్ చదువుతోంది. ఆమె తన క్లాస్మేట్ సౌరవ్ ఓజా అనే అబ్బాయితో కలసి జబల్పూర్కి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న భేదాఘాట్ జలపాతాన్ని చూసేందుకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఒక పెద్ద ట్రక్కు వారిని దారుణంగా ఢీ కొట్టింది. ఐతే బాధితురాలు రూబీ వెనుక కూర్చొని (పిలియన్ రైడర్)వెనుక కూర్చొని ఉండగా, బైక్ని అతని క్లాస్మేట్ సౌరవ్ డ్రైవ్ చేశాడు. ఈ ఘటనలో సౌరవ్ 20 మీటర్ల దూరంలో పడిపోగా, రూబీ శరీరం ట్రక్లో చిక్కుకుపోవడంతో.. సుమారు 100 మీటర్లు ఈడ్చకుని పోయింది. దీంతో శరీరం నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గాయపడిని సౌరవ్ని ప్రభుత్వా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కానీ అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే దర్యాప్తులో హెవీలోడ్ ట్రక్కు వారి బైక్ని వెనుక నుంచి ఢీ కొట్టినట్లు తేలిందని, ఆ ట్రక్కుని కూడా గుర్తించమని వెల్లడించారు. తాము నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా!) -
రద్దీగా ఉన్న రైల్వే ప్లాట్ఫామ్పైకి లారీ.. వీడియో వైరల్
లఖ్నవూ: రైల్వే స్టేషన్ లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీగా ఉండి కలుపెట్టే సంధు సైతం ఉండని పరిస్థితులు ఉంటాయి. అయితే, అలాంటి ఓ రద్దీ ప్లాట్ఫామ్పై భారీ ట్రక్కు కనిపించటం అక్కడి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్ప్రదేశ్లోని జరిగిన సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ ఆటో రిక్షా ఏవిధంగా అయితే ప్లాట్ఫామ్పైకి వచ్చిందో.. అదే విధంగా ప్లాట్ఫామ్పై నుంచి లారీని నడపటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్లాట్ఫామ్పై ప్రయాణికులు భారీగానే ఉన్నారు. అయితే, ఏ రైల్వే స్టేషన్ అనేది స్పష్టత లేదు కానీ, ప్లాట్ఫామ్ నంబర్ 9 అని వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్స్పైకి వాహనాలను తీసుకురావటమేంటని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. #UttarPradesh pic.twitter.com/gsfMhakbZJ — HP Live News (@hplivenews1) December 21, 2022 ఇదీ చదవండి: హ్యాట్సాఫ్ యశోధరా.. ‘ఎంబీబీఎస్’ చదువుతూనే ‘సర్పంచ్’గా ఎన్నిక -
పాముని కాపాడేందుకు బ్రేక్ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు
బెంగళూరు: పాముని రక్షించేందకని బ్రేక్ వేయడంతో వరసగా ఐదు వాహనాలు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు కంటైనర్ ట్రక్కు డ్రైవర్ బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి పాము ఒక్కసారిగా రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న మరోట్రక్కు టాటా ఏస్, ఒక టిప్పర్, బండరాళ్లను తరలిస్తున్న మరో మినీ టిప్పర్ ఒక్కసారిగా ఒకదాని వెనుక ఒకటి ఘోరంగా ఢీ కొన్నాయి. ఐతే ఈ ప్రమాదంలో పలువురు డ్రైవర్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఆ పాము ట్రక్కు చక్రం కిందకు వచ్చినప్పటికీ హైవే పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. (చదవండి: యూఎస్లో అతి పిన్న వయస్కుడైన మేయర్గా 18 ఏళ్ల యువకుడు) -
రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ బహ్రాయిచ్లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పే సిపా సమీపంలో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు జైపూర్ నుంచి బహ్రాయిచ్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది దుర్మరణం
పాట్నా: బిహార్లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. నయా గావ్ టోలి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భూయాన్ బాబా పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వచినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాజిపూర్లోన సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు సహాయంగా అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు -
వైరల్ వీడియో.. ట్రక్కుపై డాన్స్ చేస్తూ చనిపోయిన యువకుడు
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్లోని హ్యూస్టన్లో 25 ఏళ్ల యువకుడు అతిచేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ చనిపోయాడు. నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో యువకుడు 18 చక్రాల ట్రక్కు ఎక్కి కాసేపు డాన్స్ చేశాడు. అయితే వెనకాల చూసుకోకపోవడంతో ఓ బ్రిడ్జి తాకి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశాడు. యువకుడు కిందపడిపోయినప్పుడు అతని మెడ విరిగిందని, ఆ ప్రాంతమంతా రక్తం ఉందని వెనకాల కారులో వెళ్లిన ఓ మహిళ చెప్పింది. ఆ దృశ్యాలు చూసి వెన్నులో వణుకుపుట్టిందని భయాందోళన వ్యక్తం చేసింది. తన రోజును ఇలా ప్రారంభించాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పింది. చదవండి: వైరల్ వీడియో.. రష్యా క్షిపణులను పేల్చేసిన ఉక్రెయిన్ -
రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం...ఆటోని ఢీ కొట్టిన ట్రక్కు
లక్నో: మితిమీరిన వేగంతో దూసుకు వస్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘనట ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ట్రక్ అతి వేగంతో ఆటోని ఢీకొట్టి, అక్కడే ఉన్న డివైడర్ని, కరెంట్ స్థంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఐతే ఆ ఆటోలోని ప్రయాణికులంతా విద్యాంచల్ నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటిక వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన క్షతగ్రాతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా..) -
అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు...అందర్నీ బకరాలు చేశాయిగా!
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉండే వైరల్ వీడియో. అందరికీ మేకలు ఎలా ఉంటాయో తెలుసు. ఐతే ఈ వీడియోలో కొన్ని మేకలు చాల మాత్రం భలే చేశాయి. అవన్న ఒక చోట గడ్డి మేస్తు ఉన్నాయి. ఇంతలో అటుగా ఒక పార్సిల్ ట్రక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటుండి మేకలన్ని కింద పడిపోతాయి. వాస్తవానికి ఆ ట్రక్కు వాటి పక్క నుంచి వెళ్తుందే తప్ప వాటిని ఢీ కొట్టలేదు. ఈ మేకలు మాత్రం ఆ ట్రక్కు రావడమే తరువాయి ఒకేసారి అన్ని మేకలు చనిపోయినట్టుగా కింద పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ మేకలు చూసి ఫిదా అవుతూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వే సన్నివేశం అంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. Fainting Goats Meet UPS Truck 😆🐐🚚#viralhog #faintinggoats #pets #humor pic.twitter.com/cxqLWZZKjx — ViralHog (@ViralHog) October 19, 2022 (చదవండి: బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ) -
భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్కి ఊహించని షాక్
ఒక ఖడ్గమృగం రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద చోటు చేసుకుంది. వాస్తవానికి వాహనం వేగంగా వెళ్తుంటే ఖడ్గమృగం నాదారికే అడ్డుగా వస్తావా అన్నట్లుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ జంతువుకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అయితే సదరు వాహనాన్ని పోలీసులు ఆపి జరిమాన విధించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఈ రహదారిలో ఆ జంతువులకు ఇబ్బంది కలిగిస్తే ప్రయాణించేందుకు అనుమతించం అని ట్వీట్ చేశారు. తాము ఈ కజిరంగా వద్ద జంతువులను రక్షించాలనే ఉద్దేశంతో సుమారు 32 కి.మీ ఎలివేటర్ కారిడర్ని అధికారులు చేత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ రహదారిలో వాహనాలు వేగంగా వెళ్తే చెట్లకు, జంతువులకు ఇబ్బంది కలగవచ్చని కొందరూ, మరికొందరూ నుమాలిగర్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న వంతెన పూర్తి అయితే వాహనాలను అటు మళ్లించే ఏర్పాట్లు చేయడమే కాకుండా అంతవరకు ఈ రహదారిలో వాహనాలు తక్కువ వేగంతో వెళ్లేలా చూడాలంటూ సలహలిస్తూ...ట్వీట్ చేశారు. Rhinos are our special friends; we’ll not allow any infringement on their space. In this unfortunate incident at Haldibari the Rhino survived; vehicle intercepted & fined. Meanwhile in our resolve to save animals at Kaziranga we’re working on a special 32-km elevated corridor. pic.twitter.com/z2aOPKgHsx — Himanta Biswa Sarma (@himantabiswa) October 9, 2022 (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్ను, ఆపై కార్గో వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి. మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు. -
ప్రజల పైకి దూసుకొచ్చిన ట్రక్...నలుగురు మృతి
జార్ఖండ్: దసరా వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బోగ్గుతో కూడిన ట్రక్ ప్రజలపైకి దూసుకురావడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్లో చోటు చేసుకుంది. ఈ ట్రక్ అతి వేగంగా వస్తూ ఇద్దరు వాహనదారులను ఢీ కొట్టి మరికొంతమంది ప్రజలపైకి దూసుకొచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా, మరికొంతమందికి తీవ్ర గాయలపాలైనట్లు తెలిపారు. దసరా సందర్భండా ఆ కుటుంబం హాయిగా గడిపేందుకు బయటకు రావడంతో ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు సదరు ట్రక్ని సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రమాదవశాత్తు రైఫిల్ కాల్పుల్లో వ్యక్తి మృతి) -
దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టివేత!
న్యూఢిల్లీ: నారింజ పండ్లను తీసుకువెళ్లే ట్రక్లో దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను గుర్తించారు అధికారులు. ముంబైలోని నారింజ పండ్లను దిగుమతి చేసే ట్రక్లో సుమారు రూ. 1476 కోట్ల విలువైన మెథాంఫేటమిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకువెళ్తున్నట్లు కనుగొన్నారు. ఆ ట్రక్కును డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఆపీ తనీఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. వాలెన్సియా ఆరెంజ్ డబ్బాల్లో 198 కిలోల హైప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కిలోల కొకైన్ ఉందని అదికారులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్న వ్యక్తులను కూడా విచారించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: శానిటరీ ప్యాడ్స్ ప్రశ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ) -
ఆ షాట్ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా..
Jr NTR Truck Scene In RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. అలాగే అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీలను పొగిడేలా చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఓటీటీలో కూడా రచ్చ చేస్తున్న ఈ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీ మాములుగా ఉండదు. థియేటర్లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు నోరు వెళ్లబెట్టేలా చేసింది ఈ సీన్. ఇప్పుడు ఈ ఎంట్రీ సీన్ నెట్టింట్లో సందడి చేస్తుంది. ఓ విదేశీ యూజర్ ఈ సీన్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అతి తక్కువ సమయంలోనే 12 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సీన్ను షేర్ చేస్తూ ఆ యూజర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడేలా ఉన్నాయి. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. I’ve watched 29 MCU movies. I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7 — Nate Offord (@NateOfford) July 17, 2022 'నేను ఇప్పటివరకు 29 ఎమ్సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు' అని ఆ యూజర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీంతో ఇటు తారక్ ఫ్యాన్స్, అటు సినీ లవర్స్ తెలుగు సినిమా గొప్పతనం గురించి ఎంతో సంతోషిస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య NTR is the clear winner in RRR multi-starrer with domestic as well as Global accolades. First Indian movie video with 10 Million+ Views!#NTRGoesGlobal @tarak9999 https://t.co/FZgkZG4BvW — BingedHelp (@BingedHelps) July 19, 2022 First Ever Indian Video to Cross 10M Views on Twitter & still going strong (nearing 12M now) 🔥@tarak9999 #NTRGoesGlobal #NTR #RRRMovie https://t.co/SV08izQCIK — Kaushik LM (@LMKMovieManiac) July 19, 2022 -
హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్కు ఫిదా అవుతున్న నెటిజన్స్
Woman Driving Truck Video Viral: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. మగవారికి సమానంగా తాము సత్తా చాటగలమని నిరూపిస్తున్నారురు. భూమినుంచి అంతరిక్షం వరకు ఎందులోనూ తీసిపోమంటూని ముందుకు సాగుతున్నారు. ఆటో, బస్సు డ్రైవర్లుగానూ రాణిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ లారీ డ్రైవర్ అవతారమెత్తింది. ముఖంపై చిరునవ్వు చిందిస్తూ మహిళ లారీ డ్రైవ్ చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ పెద్ద లారీని మహిళ హైవేపై ఎంతో కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ చేస్తోంది. ఆమె మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఆ వాహనంలోని వ్యక్తి మహిళను చూసి ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్ చేశారు. ఈ సమయంలో మహిళ సరదాగా నవ్వడం కెమెరా కంటికి చిక్కింది. అలా నవ్వుతూ ఆమె ఏమాత్రం బెదురు లేకుండా లారీ నడుపుతూ దూసుకెళ్లింది. దీనిని అవినాష్ శరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p — Awanish Sharan (@AwanishSharan) July 17, 2022 సోషల్ మీడియోలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.94లక్షల మంది వీక్షించారు. దాదాపుగా 11వేలకు పైగా లైకులు వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్స్ మహిళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె ఇప్పుడు మహిళలకు రోల్ మోడల్ అంటున్నారు నెటిజన్లు.. ‘ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆ చిరునవ్వు అద్భుతం, ఇన్సిరేషనల్, మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్! -
స్పీడ్గా వెళ్తున్న ట్రక్కుపై 'శక్తిమాన్' స్టైల్లో ఫీట్లు.. పట్టుతప్పటంతో..!
లక్నో: రోడ్డుపై వేగంగా వెళ్తున్న చెత్త తీసుకెళ్లే ట్రక్కుపై ఓ వ్యక్తి పుషప్స్ చేస్తూ సూపర్ హీరోలా రెచ్చిపోయాడు. ట్రక్కుపై ఎలాంటి ఆధారంలేకుండా నిలబడి పోజులిచ్చాడు. కొద్ది సేపటికే పట్టు కోల్పోయి.. కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో కుయ్యో ముర్రో అంటూ మూలుగుతున్నాడు. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సీనియర్ పోలీస్ అధికారి శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్లా కాదు.. బుద్ధిమాన్లా ఉండు అంటూ ట్యాగ్ జత చేశారు. ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ట్రక్కుపై నుంచి కిందపడిపోవటం వల్ల ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భుజాలు, కాళ్లు, వీపుపై గాయాలతో బెడ్పై పడుకున్న దృశ్యాలు సైతం ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य- बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान! चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ — Shweta Srivastava (@CopShweta) July 17, 2022 'అతడు శక్తిమాన్లా మారేందుకు ప్రయత్నించాడు. కానీ, బొక్కబోర్లాపడి కనీసం కూర్చోలేకపోతున్నాడు. దయచేసి అలాంటి ప్రమాదకర స్టంట్లు చేయవద్దు.' అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు అదనపు డిప్యూటీ కమిషనర్ శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్ సూపర్ హిట్ సూపర్ హీరో టీవీ షో. అది 1997 నుంచి 2005 వరకు డీడీ నేషనల్ ఛానల్లో ప్రసారమైంది. శక్తిమాన్గా ముకేశ్ ఖన్నా అభిమానులను మెప్పించారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
ఫుట్ పాత్ పైకి వచ్చిన ట్రక్.... రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం: వీడియో వైరల్
ఎప్పడూ ఎలాంటి ఘోరం జరుగుతుందో చెప్పలేం. మనం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటకీ విధిరాత బాగోకపోతే ఏదైన జరగవచ్చు. మనకి భూమ్మీద ఆయుషు ఉంటే ఎంతటి ఘోరమైన ప్రమాదం నుంచే అయినా బయటపడవచ్చు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా అనుహ్యంగా ఒక ట్రక్ అతనిపైకి దూసుకుపోతుంది. ఆ ట్రక్ చాలా ప్రమాదకరంగా అతని పైకి దూసుకుపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏం కాలేదు. ఆ వ్యక్తి ట్రక్కు గేట్ మధ్య ఇరుక్కుపోయాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ఈ వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఐతే ఈ వీడియో పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74 — Dipanshu Kabra (@ipskabra) July 7, 2022 (చదవండి: రెస్టారెంట్పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
Viral Video : ఒక్క అడుగూ.. ఆ ఒక్క అడుగు తేడా వస్తే శాల్తీ ఔట్!
భూమిపై నూకలు బాకీ ఉంటే పెను ప్రమాదాల నుంచి సైతం ప్రాణాలతో బయటపడొచ్చు అంటారు. ఇక్కడ వీడియోలో రోడ్డు పక్కన ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం చూస్తే నిజమే అనిపిస్తుంది. లేదంటే అంత భారీ వాహనం ఒక్కసారిగా ఎగిరిపడి.. ఆ వ్యక్తి వైపునకు దూసుకెళ్లడం.. అతని దగ్గరగా వెళ్లి ఢీకొని రాసుకుంటూ ముందుకుసాగడం.. అతను గోడ, ట్రక్కు మధ్యగా ఇరుక్కుపోయి బయటపడటం.. ఇవన్నీ భయంగొలిపే దృశ్యాలే! చదవండి👉 యువతి చేతిలో ఫోటో చూడగానే.. కారు ఆపిన ప్రధాని మోదీ! ఈ ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చేతిలో హెల్మెట్, కొన్ని పత్రాలతో ఓ వ్యక్తి నిలుచున్నాడు. అటుగా వస్తున్న ఓ ట్రక్కు చెట్టు కొమ్మలకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఎగిరిపడింది. వేగంగా కుడివైపునకు దూసుకెళ్లింది. అమాంతం పైకిలేచి ఫుట్పాత్మీదుగా పరుగులు పెట్టింది. అక్కడే ఫుట్పాత్పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. చచ్చాన్రా దేవుడో అనుకుంటూ కొద్దిగా వెనక్కి అడుగేశాడు. అప్పటికే అతన్ని సమీపించిన ట్రక్కు ముందుభాగం అతనికి టచ్ ఇచ్చింది. ఆ దెబ్బతో అతను గోడవైపునకు మరింత కదిలాడు. అతన్ని రాసుకుంటూ వెళ్లిన ట్రక్కు అడుగుల దూరంలో ఆగిపోయింది. ఊహించని ప్రమాదంతో అటు బాధితుడు, ఇటు ట్రక్కు డ్రైవర్ కంగారెత్తిపోయారు. అయితే, అదృష్టం కొద్దీ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. 56 సెకండ్లు ఉన్న ఈ వీడియో తాజాగా వైరల్గా మారింది. చదవండి👉🏾 Viral Video: అటు చూడు బే! -
Viral Video: వీడి అదృష్టం బాగుండి.. బతికి బట్ట కట్టాడు..!!
-
జహీరాబాద్ రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీ ఒకరు సజీవ దహనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఉదగిర్ వెళ్తున్న టాటా ఏస్ ట్రక్ను, ఆ వైపుగా ముంబయి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమాదవశాత్తు ట్రక్కు, బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ సజీవ దహనం కాగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో పెను పెను ప్రమాదం తప్పింది. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో..
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. తనకంటే పిల్లల కోసం ఆలోచించే మాతృమూర్తి అమ్మ. పేగు బంధాన్ని రక్షించేందుకు తల్లి ఎంతవరకైనా పోరాడుతుందనే విషయం మరోసారి రుజువైంది. తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా బిడ్డ గురించి ఆలోచించింది ఓ మహిళ. ట్రక్ కింద పడిపోతుండగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. అయితే ఇది 2019లో జరగ్గా.. క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ తాజాగా తన ట్విట్టర్లో షేర్ చెయ్యడంతో ఇది మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నామ్ దిన్హా ప్రాంతంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు వీరిని తాకుతూ ఓవర్ టేక్ చూస్తూ వెళ్లింది. దీంతో బైక్ వెనక కూర్చున్న తల్లి, చేతిలోని పిల్లాడు కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. వేగంగా స్పందించి చక్రాల కింద పడిపోబోతున్న తన బిడ్డను చాకచక్యంగా వెనక్కి లాగింది. పెను ప్రమాదం నుంచి కుమారుడిని కాపాడుకుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ ఘటనలో తల్లీ, కొడుకులు వెంట్రుకవాసిలో తల్లి, క్షేమంగా భయటపడ్డారు. చదవండి👉 ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి. తల్లి చాకచక్య తెలివితేటలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 5 మిలియన్ల మంది వీక్షించారు. 'తల్లి ప్రేమకు మించింది ఏది లేదు', 'కన్నపేగుబంధం అంటే ఇదే మరి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Mother of the year https://t.co/qIZlz1PYEZ — Jofra Archer (@JofraArcher) April 25, 2022 -
పైన చూస్తే చింతపండు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
మల్కన్గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ–31 గ్రామం వద్ద మల్కన్గిరి ఎస్డీపీఓ సువేందుకుమార్ పాత్రొ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. చింతపండు లోడ్తో ట్రక్ను తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. డ్రైవర్ కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతామ్ పాత్రొను అరెస్ట్ చేశారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్పై అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. 63 బస్తాల్లో నింపి, చింతపండు లోడ్ మధ్య తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎస్డీపీఓ గురువారం ప్రకటించారు. నిందితులపై కేసు నమోదు చేసి, మల్కన్గిరి కోర్టులో హాజర్ పరిచారు. గంజాయిని మోటు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. చదవండి: చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే.. -
ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు
లక్నో: వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన ఈవీఎంలను తరలిస్తున్న ఓ ట్రక్కును వారణాసి వద్ద అడ్డగించినట్లు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ తెలిపారు. మరో రెండు ట్రక్కులు తప్పించుకున్నాయన్నారు. అధికార బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వారణాసి ఎన్నికల అధికారులు మాత్రం.. ఆ ఈవీఎంలు శిక్షణ కోసం వాడేవని స్పష్టంచేశారు. అఖిలేశ్ ఆరోపణలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునేందుకు వీలుగా అభ్యర్ధులందరికీ ఈసీ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. (చదవండి: మేయరైన ఆటోవాలా) -
సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో
A truck carrying United States Postal Service (USPS) mail: చాలా భయంకరమైన ప్రమాదాలు గురించి విన్నాం. పైగా అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ త్రుటిలో బయట పడ్డ మృత్యుంజయులను చూశాం. బతికే అవకాశం లేదనే ప్రమాదంలో గాయాలు పాలుకాకుండా బయటపడి అందర్నీ ఆశ్చర్య పరిచని ఘటనలు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్పీఎస్) మెయిల్ను తీసుకువెళ్తున్న ట్రక్కు 50 అడుగుల వంతెన పై నుంచి బోస్టన్ సమీపంలోని మంచుతో నిండిన నదిలో పడింది. అయితే డ్రైవర్ మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ డ్రైవర్కి ఈత రాకపోవడంతో పాక్షికంగా నీట మునిగిన ట్రక్ పై ఉన్నాడు. అంతేకాదు అతనికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే దగ్గరలోనే అగ్నిమాపక సిబ్బంది ఉన్నందును సత్వరమే స్పందించి ఆ డ్రైవర్ని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అతన్ని బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు తరలించారు. ఈ మేరకు ఈ ఘటన ఆ నదికి సమీపంలో ఉన్న సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. EXCLUSIVE FOOTAGE: Never before seen video of the major TT crash Saturday in Weston Click here for more:https://t.co/CRRpYWhfAS (@MassStatePolice, @WESTON_FIRE, @NewtonFireDept, @SPAMPresident, @wbz, @WCVB, @7News, @NBC10Boston, @boston25, @bostonherald, @LiveBoston617) pic.twitter.com/ZUmJJbXF6Z — State Police Association of Massachusetts (@MSPTroopers) February 27, 2022 (చదవండి: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్ని ఆపాడు! వైరల్ వీడియా) -
గన్తో బెదిరించి దోపిడీలు.. వాళ్ల టార్గెట్ తెలిస్తే ఆశ్చ ర్యపోతారు!
నాగోలు: టైర్ల లోడ్తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి.. తుపాకితో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పహడీషరీఫ్ పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44,77,760 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం..హర్యానా రాష్ట్రం, మేనాత్ జిల్లాకు చెందిన జంషీద్ ఖాన్, రహెల్ ఖాన్, ఆజాద్లు ముఠాగా ఏర్పడ్డారు. లోడ్ చేసిన కంటైనర్లతో వెళ్లే లారీలను దోచుకోవాలని పథకం వేశారు. జనవరి 18న అపోలో లారీ టైర్లు (220) దోచుకున్నారు. లిఫ్ట్ అడిగి..లారీలోకి ఎక్కి గన్తో బెదిరించి..డ్రైవర్, క్లీనర్ను కట్టివేసి టైర్లు చోరీ చేశారు. ఈ నెల 15వ తేదీన తమిళనాడు నుంచి బయలుదేరిన కంటైనర్ నుంచి మరో కంపెనీ టైర్లను ఇదే పద్ధతిలో చోచుకున్నారు. లిఫ్ట్ అడిగి కంటైనర్ ఎక్కిన వీరు...ఈ నెల 17న నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలోకి కంటైనర్ రాగానే జంషీద్ ఖాన్, రహీల్ ఖాన్లు క్లీనర్ను గన్తో బెదిరించి కంటైనర్ను రోడ్డు పక్కన ఆపి, డ్రైవర్, క్లీనర్లను తాడుతో కట్టి క్యాబిన్లో పడివేశారు. హైదరాబాద్కు చెందిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ ఆలీ ఖాన్ల సాయంతో కాటేదాన్లో ఉన్న కమల్ కబ్రా టైర్ల గోదాములో దోచుకున్న టైర్లను తక్కువ ధరకు అమ్మివేసి తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై కంటైనర్ వదిలేసి పారిపోయారు. కంటైనర్ రోడ్డుపై ఎక్కవ సేపు ఆగి ఉండడంతో స్థానికులు గమనించి లారీ క్యాబిన్లో కట్టిపడేసి ఉన్న డ్రైవర్, క్లీనర్లను రక్షించారు. లారీ డ్రైవర్ పహడీషరీష్ పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల ఆటకట్టించారు. జంషీద్ ఖాన్ ఇటీవల ఢిల్లీకి విమానంలో వెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకుని అక్కడి పోలీస్లకు సమాచారం ఇచ్చి, సీఐఎస్ఎఫ్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. చోరీకి సహకరించిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ అలీఖాన్, టైర్లు కొనుగోలు చేసిన కమల్ కబ్రాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 152 టైర్లు, రూ.20 వేల నగదు, కారు, బైకు, నాలుగు మొబైల్ ఫోన్లు, 8ఎంఎం లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. రహీల్ ఖాన్, ఆజాద్ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీలు సన్ప్రీత్సింగ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
లాంఛ్కు ముందే బుకింగ్కు టయోటా బ్రేకులు!
భారత్లో లాంచ్ చేయడానికి కంటే ముందే హైలక్స్ ట్రక్ బుకింగ్ను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించుకుంది. ఈ మేరకు జపనీస్ ఆటోమేకర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోస్ట్ అవెయిటింగ్ మోడల్గా ఉన్న ‘హైలక్స్’ కోసం కిందటి నెలలోనే బుకింగ్స్ను ప్రారంభించింది. మార్చ్లో లాంఛింగ్కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు డీలర్షిప్స్ వద్ద లక్ష రూ., కంపెనీ ఆన్లైన్ పోర్టల్లో రూ. 50వేలతో బుకింగ్స్ కొనసాగించింది. అయితే ఉన్నపళంగా ఆ బుక్సింగ్ను ఆపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ, ఇది తాత్కాలికమే అని పేర్కొంది. వాస్తవానికి బుకింగ్కు మంచి స్పందన వచ్చింది. ఇది సప్లయ్కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకే బుకింగ్ను టెంపరరీగా ఆపేశామని, త్వరలో మళ్లీ బుక్సింగ్స్ను కొనసాగిస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. Hilux టయోటా ఫార్చ్యూనర్ SUV వలె.. సేమ్ ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది, అయితే ప్రస్తుతం ఇక్కడ మైక్రోస్కోపిక్గా ఉన్న విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని చూస్తోంది. హైలక్స్కు సమీప ప్రత్యర్థిగా ఇసుజు V-క్రాస్ను భావిస్తున్నారు. -
జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్!
సాధారణంగా వర్షా కాలంలో రోడ్లన్నీ తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు ఎదురైన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయాల్లో రోడ్లపై బండి టైర్లకు పట్టులేని కారణంగా వాహనాలు అదుపు తప్పి పడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనదారునికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. జస్ట్ మిస్ లేదంటే.. ఆ వీడియోలో.. వర్షం పడతుండడంతో రోడ్డంతా తడిసిపోయి తేమగా ఉంది. అంతలో ఓ బైకర్ వేగంగా దూసుకువచ్చాడు. అంతకు ముందే వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో ఆ వాహనదారుడు జారిపడ్డాడు. అయితే వెనకనుంచి అదే లేన్లో ఓ ట్రక్ వస్తోంది. ఇది గమనించిన ఆ బైకర్ తేరుకుని వెంటనే ఆ ట్రక్కు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఖాళీగా ఉన్న పక్క లేన్ వైపు లేచి పరిగెత్తాడు. కేవలం సెకన్ల వ్యవధిలో ఆ బైకర్ ట్రక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 24న జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాబు చాలా లక్కీ’, ‘జస్ట్ మిస్ లేదంటే’.. అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ -
సంచలన ఆఫర్.. అధిక మైలేజీ గ్యారెంటీ.. లేదంటే బండి వాపస్!
దేశీ ఆటోమొబైల్ కంపెనీల్లో మహీంద్రాకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎస్యూవీ కేటరిగిలో ఇప్పటికే పాతుకుపోయిన మహీంద్రా తాజాగా హెవీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ మార్కెట్పై కన్నేసింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సంచలన ఆఫర్ ప్రకటించింది. మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రక్ బస్ (ఎంటీబీ) ఇటీవల ప్రకటించిన ఆఫర్ ఆటోమొబైల్ సెక్టార్లో సంచలనంగా మారింది. ఎంబీటీ నుంచి వచ్చే కమర్షియల్ వెహికల్స్లో 3.50 టన్నుల నుంచి 55 టన్నుల లోడు వరకు ఉండే లైట్, మీడియం, హెవీవెహికల్స్ మైలేజీపై ఛాలెంజ్ విసిరింది. బీఎస్ 6 టెక్నాలజీతో వస్తున్న ఈ వాహనాలు అధిక మైలేజీని అందిస్తాయని హామీ ఇస్తోంది. ఎవరైన మైలేజీపై అసంతృప్తి చెందితే వాహనాన్ని వెనక్కి తీసుకుంటామంటూ ప్రకటించింది. ఎంబీటీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో హెచ్సీవీ బ్లాజో ఎక్స్, ఐవీసీ ఫురియో, ఎస్సీవీ ఫురియో 7 , జయో రేంజ్ వాహనాలు ఉన్నాయి. అధిక మైలేజీ వచ్చేందుకు వీలుగా ఈ వాహనాల్లో 7.2ఎల్ ఎం పవర్ ఇంజన్, ఎండీఐ టెక్ ఇంజన్, ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ, కటిండ్ ఎడ్జ్ ఐమాక్స్ టెలిమాటిక్ సొల్యూషన్ తదితర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. కమర్షియల్ వాహనాలకు సంబంధించి 60 శాతం ఖర్చు ఫ్యూయల్కే అవుతుంది. తాజాగా పెరిగిన ధరలు మరింత ఇబ్బందిగా మారాయి. దీంతో అధిక మైలేజీకి మహీంద్రా ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో గెట్ మోర్ మైలేజ్ ఆర్ గీవ్ బ్యాక్ ట్రక్ పాలసీని హెచ్సీవీ బ్లాజో ట్రక్ విషయంలో మహీంద్రా ప్రకటించింది. 2016లో ఈ ఆఫర్ తేగా ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేదు. దీంతో ఇప్పుడు కమర్షియల్ సెగ్మెంట్లో బీఎస్ 6 ఇంజన్లు అన్నింటికీ దీన్ని వర్తింప చేయాలని మహీంద్రా నిర్ణయం తీసుకుంది. -
రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్ మాదిరిగా ఉంది!
Karnataka Farmer Was Humiliated At Mahindra Car Showroomఒక మనిషి ఆహార్యాన్ని బట్టి లేదా వేషధారణ చూసో తక్కువగా అంచనా వేయకూడదు. కొంతమంది ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడటమే కాక అవమానించాలనుకుంటారు. నిజానికి ఆ విధంగా చేస్తున్న వాళ్లే అందరిలోనూ నవ్వులు పాలవ్వడమే కాక క్షమాపణ కోరే పరిస్థితిని తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..కర్ణాటకలో తుమకూరులోని మహీంద్రా షోరూమ్కి కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. ఆ రైతు ఆ షోరూమ్లోని సేల్స్మేన్ చేత అవమానింపబడ్డాడు. అతని వేషధారణ చూసిన సేల్స్మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని వెటకారంగా చెప్పాడు. పైగా నీ జేబులో కనీసం రూ. 10 కూడా ఉండకపోవచ్చు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కెంపె గౌడని చాలా అవమానించి మాట్లాడాడు. Karnataka farmer's sweet revenge on the Mahindra showroom: దీంతో ఆ సేల్స్మేన్కి రైతు కెంపెగౌడకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువస్తే గనుక నువ్వు ఎస్యూవీ కారుని ఈ రోజే డెలివరీ చేయాలి" అని సేల్స్మేన్కి ఒక చాలెంజ్ కూడా విసిరాడు. ఈ క్రమంలో రైతు సినిమాలోని హీరో మాదిరిగా ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువచ్చి సేల్స్మేన్కి చూపించాడు. దీంతో సేల్స్మేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ సేల్స్మేన్ వెంటనే డెలీవరీ చేయడంలో విఫలమయ్యాడు, ఎందుకంటే వెయిటింగ్ లిస్టింగ్ ఉంటుంది కదా. దీంతో రైతు కెంపెగౌడ ఒక్కసారిగా ఆ సేల్స్మేన్ పై మండిపడటమే కాక అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకు ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ వీడియోని విస్తృతంగా ట్వీట్ చేశారు. (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
ఘనాలో భారీ పేలుడు.. 17 మంది మృతి
అక్రా: పశ్చిమ ఘనాలో భారీ పేలుడు సంభవించింది. బోగోసో ప్రాంతం సమీపంలో ట్రక్, మోటర్ బైక్ను ఢీకొని పేలుడు చోటుచేసుకుంది. అధికారుల ప్రకారం.. మైనింగ్ కంపెనీకి పేలుడు పదార్థాలు తరలిస్తున్న ట్రక్ ప్రమాదానికి గురైంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం వలన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని మేఘాలు అలుముకున్నాయి. పేలుడు బీభత్సానికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు.. 17 మంది మృతి చెందగా, మరో 59 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షత గాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అధికారులు సంఘటన స్థలానికి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై ఘనా అధ్యక్షుడు నానా అక్రూఫో అడ్డో స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ 59 మందిలో.. 42 మందిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
పగటి పూట బొమ్మ.. రాత్రి కాగానే ‘దెయ్యం’లా హైవేపై..
దెయ్యం కథలు.. నమ్మకం ఉన్నా.. ‘ఛస్’ అని ఛీదరించుకున్నా వీటి గురించి ఆసక్తి కలగక మానదు. ఎందుకంటే ఆ కథల్లోని నేరేషన్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చెప్పుకోబోయే యూకే ‘బెట్టీ బైపాస్’ కొంత క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం!. ఎందుకంటే ఈ దెయ్యం ఈమధ్యే పదేళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి!. బర్మింగ్హమ్-వోర్సెయిస్టర్ సరిహద్దు. హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే!. చెక్పోస్ట్కి దగ్గర్లో ఒక శాండ్విచ్ ట్రక్ ఉంటుంది. ఆ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెంచ్ మీద కనిపించే ఒక రూపాన్ని చూసి ఎవరైనా వణికిపోతుంటారు. కారణం.. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్’ అని పేరొచ్చింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తుంటాయి. బెట్టీ మీద సింపథీ ఉన్నా.. దెయ్యం అనే ఊహ మాత్రం చాలామందిని వణికించేది. దీంతో ఈ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఘోస్ట్ లేడీ వ్యవహారాన్ని ఎవరూ తేల్చలేకపోయారు. ఈలోపు ఆ నోటా ఈ నోటా పాకి ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్ దృష్టికి చేరింది. ఎవరికి వాళ్లు ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్ జోక్ కాబట్టి! బెట్టీ ఒక షోకేజ్ బొమ్మ. దానిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి పేరు నిక్ హజ్బెండ్. ఆయన ఆ శాండ్విచ్ ట్రక్ యజమాని. ఓ ఛారిటీ షాప్ నుంచి ఆ షోకేజ్ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్లో అక్కడి బెంచ్ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది. పాపం అనుకున్నారట.. ప్రాక్టికల్ జోక్స్తో ఇంట్లో వాళ్లను ఫూల్స్ చేసే నిక్.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు రకరకాల కథలు చెప్పేవాడు. ఆమె భర్త చేతిలో మోసపోయినా ఒక అనాథ అని, అందుకే బిడ్డతో అక్కడ అలా కూర్చుంటుందని(సజీవంగా ఉందని నమ్మించాడు కూడా!) చెప్పడంతో చాలామంది ‘పాపం’ అని సాయం చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లట. తీరా అదొక బొమ్మ అని తెలిశాక నిక్ను తిట్టుకుంటూ.. సరదాగా ఫొటోలు తీసుకుని వెళ్లిపోయేవాళ్లట. కొన్నాళ్ల తర్వాత నిక్, ఆ ప్రమ్(తిప్పే ఊయల)ని మాయం చేయడంతో బిడ్డ గురించి ఆరా తీసేవాళ్లట. వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్కు వెళ్తోందని చెప్పేవాడట. ఇలా జనాలందరికీ ఒక్కో రకమైన కథ చెప్పి బురిడీ కొట్టించేవాడు ఆ ట్రక్కు యజమాని. ఒకానొక టైంలో కౌన్సిల్ ఆఫీసర్లు సైతం ఆ అనాథ మహిళకు సాయం చేయాలని ముందుకొచ్చారట. కానీ, అదొక బొమ్మ అని తెలిశాక.. నిక్కు వార్నింగ్ఇచ్చి మరీ బెట్టీతో ఫొటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి బెట్టీ తన కుటుంబంలో ఒక భాగం అయ్యిందని, ఆ బొమ్మకు చేసిన 20 పౌండ్ల ఖర్చు తన వ్యాపారానికి ఎంతో సాయం ఇప్పుడు చేస్తోందని సంతోషపడుతున్నాడు నిక్. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన. -
తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..
కుక్కలు విశ్వాసం గలివి అని అందరికి తెలుసు. అవి మనుషుల కంటే కూడా గొప్ప నమ్మకాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. అందువల్లే కాబోలు చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడొక కుక్క తన యజమాని కారుకి యాక్సిడెంట్ అయితే అది ఎంత తెలివిగా వ్యవహరించి తన యజమానిని కాపాడుకుందో చూడండి. (చదవండి: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!) అసలు విషయంలోకెళ్లితే....న్యూ హాంప్షైర్లోని షెపర్డ్ జాతికి చెందిన టిన్స్లీ అనే కుక్క న్యూహాప్షైర్, వెర్మోంట్ సరిహద్దు ప్రాంతంలో తన యజమాని కారుకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దీంతో ఆ కుక్క ఒక్కసారిగా హైవే పై పరుగెడుతుంది. ఈ మేరకు అది వాహనదారులన, హైవే పై ఉండే ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పోలీసులు ఆ కుక్కున పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎటో చూపిస్తు పరిగెడుతుంది. అంతే పోలీసులు కాస్త అనుమానం కలిగి అది చూపి స్తున్నా వైపుగా పరిగెడతారు. అయితే అది వెర్మోంట్ ప్రాంతంలోకి తీసుకువెళ్లింది. అక్కడ రైల్వే పట్టాలపై బోల్తా పడి ఉన్న కారు కనిపించింది. అంతేకాదు అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకరు కుక్క యజమాని కామ్ లాండ్రీ. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ క్కుక్క మాత్రం పోలీసులు వచ్చి రెస్క్యూ చర్యలు ప్రారంభించడంతో తన యజమాని లాండ్రీ పక్కన ప్రశాంతంగా కుర్చుంది. పోలీసు అధికారి బాల్దాస్రే మాట్లాడుతూ...ఆ కుక్క హైవేపై ఏదో చూపిస్తున్నట్లుగా పరిగెడుతుంటే అనుమానం వచ్చి అనుసరిస్తూ వెళ్లాం. ఇది నిజంగా చాలా తెలివిగా మమ్మల్నీ తన యజమాని వద్దకు తీసుకువెళ్లటమే కాక ఆయన ప్రాణాలను కాపాడుకుందంటూ ప్రశంసించారు. (చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!) -
శ్రీరామ్ ఆటోమాల్.. ఎక్సేంజీలో భారత్ బెంజ్ ట్రక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో ఉన్న దైమ్లర్ ఇండియా కమర్షియల్వెహికిల్స్ తాజాగా పాత వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదార్లు తమ పాత ట్రక్స్ను ఎక్సే్ంజ్ కింద భారత్ బెంజ్ శ్రేణి కొత్త, పాత వెహికిల్స్ను కొనుగోలు చేయవచ్చు. శ్రీరామ్ ఆటోమాల్ వేదికగా భారత్ బెంజ్, ఇతర ఓఈఎంల వాహనాలను విక్రయిస్తారు. -
రైలు ఢీకొట్టడంతో రెండు ముక్కలైన వ్యాన్.. పుట్టినరోజునే పునర్జన్మ
ఫొటో చూడగానే సీన్ అర్థమైపోతోంది కదూ! రైలు ఢీకొట్టడంతో అమెజాన్ డెలివరీ వ్యాన్ రెండు ముక్కలైంది. మరి ఇందులో ఉన్నవారి పరిస్థితేంటి? బతికి బట్టకట్టే అవకాశం కొంచెం కూడా లేదనే అనిపిస్తోంది కదా?. కానీ, ఈ వ్యాన్ డ్రైవర్ అలెగ్జాండర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద తీవ్రతకు వ్యాన్ రెండు ముక్కలైనా.. అతడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. అమెరికాలోని విస్కాన్సిన్లో ఈ ప్రమాదం జరిగింది. చదవండి: కామెడీ వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ: చెవులు పిండేస్తూ.. ఫ్లూటు ఊదేస్తూ.. ‘‘రెడ్లైట్ లేకపోవడంతో మామూలుగా వెళ్లిపోయాను. ట్రాక్పైకి వెళ్లేసరికి ఒక్కసారిగా రైలు శబ్దం. వెంటనే తేరుకుని వేగం పెంచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వ్యాన్ రెండు ముక్కలైంది. నేను మాత్రం బతికే ఉన్నాను. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే’’అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు. అన్నట్టు.. ఆ రోజునే అతడు 33వ ఏట అడుగుపెట్టాడు. చదవండి: ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..! -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 14 మందికి గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. భీంద్ జిల్లాలోని వీర్ఖాది గ్రామం వద్ద బస్సు కంటైనర్లారీ ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనాస్థలం నుంచి 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాలియర్లోని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు గ్వాలియర్ నుంచి మధ్యప్రదేశ్లోని బరేలీపై పట్టణానికి ప్రయాణిస్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అరెస్ట్ చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి మనోజ్ సింగ్ చెప్పారు. చదవండి: ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’ -
‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’
మన కళ్ల ముందే కొన్నిసార్లు వింత సంఘటనలు జరగడం చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉండొచ్చు. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ లారీ రోడ్డు ప్రమాదానికి గురై రెండు ముక్కలైనప్పటికీ.. లారీ ఇంజన్ భాగం మాత్రం ఆగకుండా ముందుకు వెళ్లిపోయిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ, 14 సెకండ్ల వీడియోలో ఇద్దరు వ్యక్తులు బురద రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు. వారి వెనకవైపునే ఓ లారీ భారీ లోడ్తో వస్తూ మూల మలుపు వద్ద టర్న్ అయ్యింది. రోడ్డు బురదగా ఉండటం, ఒక్క సారిగా టర్న్ కావడంతో అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే లారీ పైభాగం మొత్తం పడిపోయినా.. చక్రాలతోపాటు కింది భాగం అలాగే ఉండి రోడ్డుపై పరుగులు పెట్టింది. లారీలో నుంచి క్షేమంగా బయటపడిన డ్రైవర్కు ఇదంతా అయోమయంగా అనిపించింది. అతను లారీ ఇంజన్ భాగం వెంట పరుగెడుతున్న దృశ్యాలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. లారీ రెండుగా విడిపోయి రోడ్డుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు లేదంటే వారు ప్రమాదం బారినపడేవారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఫన్నీగా ఉన్న ఈ దృశ్యాలపై కొందరు భిన్నంగా స్పందించారు. లారీకి దెయ్యం పట్టిందని అందుకే ఇలా రెండుగా చీలి పరుగులు పెట్టిందని కామెంట్లు చేశారు. మరికొందరేమో అతి అన్నిటికీ అనర్థమే.. భారీ లోడ్ కారణంగా లారీ రెండుగా విరిగిపోయిందని అంటున్నారు. చదవండి: వైరల్: అంతా మ్యాచ్లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో.. కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc — Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021 -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. కొన్ని కంపెనీలు కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్కులను కూడా తయారుచేయాలని నిర్ణయించుకున్నాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులపై దిగ్గజ కంపెనీలు మెర్సిడెజ్ బెంజ్, వోల్వో వంటి కంపెనీలు దృష్టిసారించాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో యూరప్కు చెందిన ఫ్యూచరికం కంపెనీ సంచలనాన్ని నమోదు చేసింది. ఒక్కసారి ఛార్జింగ్తో ఏకంగా 1,099కి.మీ మేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్..! డిపీడీ స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్స్ భాగస్వామ్యంతో వోల్వో ట్రక్ యూనిట్ను మాడిఫై చేసి ఫ్యూచరికం ట్రక్ను డెవలప్ చేసింది. కంపెనీ నిర్వహించిన రేంజ్ టెస్ట్లో సుమారు ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నారు. ఓవల్ టెస్ట్ ట్రాక్ మీద ట్రక్ సుమారు 23 గంటల్లో 392 ల్యాప్లను పూర్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ట్రక్ సరాసరి గంటకు 50కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. డీపీడీ స్విట్జర్లాండ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ డైరక్టర్ మార్క్ ఫ్రాంక్ మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఇదొక సంచలన విజయమని పేర్కొన్నారు. ఫ్యూచరికం కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్లో సుమారు 680కేడబ్య్లూహెచ్ బ్యాటరీను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ట్రక్ పూర్తి బరువు 19 టన్నులు. 680కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సుమారు 680హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేయనుంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ బైక్ ధర మరింత ప్రియం..! కొత్త ధర ఏంతంటే -
ట్రక్కులకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవ దహనం
డిస్పూర్: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. హసావోలో కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(గురువారం) అర్ధరాత్రి హాసావోలోని ఉమ్రాంగ్సోలోని డిస్మావో గ్రామంలో కొంత మంది దుండగులు ఏడు ట్రక్కులను తగులబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు గుర్తించారు. వారి మృత దేహలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బస్తీ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బైటపడినప్పటికీ, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. లక్నో నుండి జార్ఖండ్కు వెళుతున్నప్పుడు పురైనా క్రాసింగ్ వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న కంటైనర్ టక్కును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కు కింద నుండి కారును బయటకు తీయడానికి రెస్క్యూ అధికారులు క్రేన్ను ఉపయోగించాల్సి వచ్చిందంటేనే ప్రమాద తీవ్రను అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు స్పాట్లోనే మరణించారు. కారు డ్రైవర్, మరో అయిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామనీ, అయితే బాలిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, డ్రైవర్ అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారిని తెలిపారు. చనిపోయిన వారిని అబ్దుల్ నజీజ్, నర్గీస్, ఆనం, సిజ్రా, టుబాగా గుర్తించారు. మరోవైపు ఈ విషాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
మీరాబాయి గొప్ప మనసు, నెటిజన్లు ఫిదా, వైరల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం విజేతలకు పెట్టని అభరణం. దీన్ని 2020 టోక్యో ఒలింపిక్స్ ఇండియాకు తొలి పతకాన్ని అందించిన ఘనతను చాటుకున్న వెయిల్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ మాటను మరోసారి నిరూపించారు. మహిళల విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత, మీరాబాయి తన కల నెరవేరడానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అరుదైన బహుమతిని అందించింది. అకాడమీకి వెళ్లేటపుడు సహకరించిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని భావించారు. అలా మరోసారి మీరాబాయి నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఆమె గెల్చుకున్నది వెండి పతకం అయినా ఆమె మనకు మాత్రం 24 క్యారెట్ బంగారం. జీవితంలో సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ నెటిజనులు ఫిదా అవుతున్నారు. తాజాగా మళ్లీ ప్రాక్టీస్ షురూ చేసిన ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్కి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు. 2022 ఆసియా గేమ్స్, 2024 ఒలింపిక్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయంటూ ఇంకొకరు వ్యాఖ్యానించడం విశేషం. ఉచితంగా లిప్ట్ ఇచ్చి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ట్రక్ డ్రైవర్లకు గిఫ్ట్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది మీరాబాయి చాను. దాదాపు150 మంది డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అంతేకాదు వారికి ఒక షర్ట్, మణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్గా లిఫ్ట్ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా ప్రకటించింది. కష్ట సమయంలో వారంతా ఆదుకున్నారు. అందుకే భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ మేకర్ నౌరెం మోహెన్ ట్విటర్ వేదికగా ఫ్యాన్స్తో పంచుకున్నారు. కాగా మణిపూర్లోని తూర్పు ఇంఫాల్లోని మారుమూల గ్రామానికి చెందిన మీరాబాయి తన ఇంటి నుండి శిక్షణా అకాడమీకి 30 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అటు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం, ఇటు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేని మీరాబాయి ఇంపాల్కు ఇసుకను తీసుకెళ్తున్న ట్రక్కుల ద్వారానే లిఫ్ట్ తీసుకునేది. అలా కఠోర సాధనతో టోక్యో ఒలింపిక్స్లో తన కలను సాకారం చేసుకోవడమే కాదు, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. pic.twitter.com/mrYZRXHtlK — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 6, 2021 Olympiad @mirabai_chanu home was more than 25 km from the Sport Academy. No means of transport during those days, except trucks which carried river sands to the City. These truck drivers gave her lift everyday. Today she rewarded these truck drivers. pic.twitter.com/9WegUkwjkz — Naorem Mohen (@laimacha) August 5, 2021 -
ఢిల్లీ రోడ్లా..? మజాకా..!
అది దేశ రాజధాని ఢిల్లీ. పైగా నిత్యం లక్షల వాహనాలు తిరిగే రద్దీ రోడ్లు. మరి అక్కడి రోడ్డు ఎలా ఉండాలి? చాలా భద్రంగా, పటిష్టంగా ఉండాలి. కానీ ఓ చినుకు పడితేనే నీళ్లు నిలిచి పోయి, రోడ్లు కుంగిపోతే. రోడ్డు వేసిన కాంట్రాక్టర్, దాని నాణ్యతను గాలికి వదిలేసిన ప్రభుత్వానిదే బాధ్యత. ఇది దేశ రాజధాని పరిస్థితి మాత్రమే కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితుల వల్ల వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా చేరింది. అయితే నాణ్యత లేని రోడ్ల వలన వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వాహనం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ద్వారకాలోని అతుల్యా చౌక్ వద్ద రోడ్డులో కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవకూ గాయపడలేదు. కాగా ప్రమాదం జరిగిన కొద్దిసేపటి హైడ్రో క్రేన్ సహాయంతో కారును బయటకు తీసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అంతేకాకుండా వజీరాబాద్ ప్రాంతంలో వ్యాన్పై ట్రక్కు బోల్తా పడిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ‘‘ఢిల్లీ రోడ్ల పనితనం అంటే.. మజాకా!’’ అంటూ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక గడిచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 70 మి.మీ. వర్ష పాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. 15 మిమీ కంటే తక్కువ వర్షపాతం తేలికపాటి వర్షంగా, 15-64.5 మిమీ ఓ మోస్తరుగా, 65.5-115.5 మిమీ ‘హెవీ’గా, 115.6-204.4 మిమీ భారీ వర్షపాతంగా, 204.4 మిమీ పైన అతిభారీ వర్షపాతంగా పరిగణిస్తారు. -
బస్సు ట్రక్కు ఢీ .. 31 మంది దుర్మరణం
లాహోర్: పాకిస్తాన్లో సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది చనిపోగా మరో 60 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్సులోని ఇండస్ హైవేపై సియాల్కోట్ నుంచి రాజన్పూర్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని అత్యధికులు బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే 18 మంది మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు పాక్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌధరీ ఓ సంతాప ట్వీట్ చేశారు. ప్రజావాహనాలను నడిపేవారు జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా అత్యవసర విధుల అధికారి డాక్టర్ నయ్యర్ ఆలం చెప్పారు. Chief Minister Inspection Team has been directed by CM @UsmanAKBuzdar to submit a fact finding inquiry report of DG Khan Bus Incident within 3 days. pic.twitter.com/YNdDTBVObN — Azhar Mashwani (@MashwaniAzhar) July 19, 2021 -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 గురు మృతి..
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-లక్నో హైవేపై ఒక ప్రైవేటు బస్సు, ఆగి ఉన్న డీసీఎం ట్రక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ఒక్కసారిగి బోల్తాపడింది. అయితే, బస్సులో ఉన్న 6 గురు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం... ఒక ప్రైవేటు బస్ పంజాబ్ నుంచి పిల్భీత్కు 50-60 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో లక్నో హైవేపై ప్రయాణికులను ఎక్కించువడానికి ఆగి ఉన్న డీసీఎం ట్రక్ను ముందు నుంచి వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. డీసీఎం ట్రక్లో కూడా 25 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. స్థానికుల సహయంతో, రెండు వాహనాల్లోని క్షతగాత్రులను మొరాదాబాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మృతిచెందిన వారిలో ఆశీశ్, సురేష్, నాన్హేలుగా గుర్తించారు. వీరందరు డీసీఎం ప్రయాణికులని సమాచారం. తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటనకు కారణాలు తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మొరాదాబాద్ ఎస్పీ అమిత్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: రైడ్లో పట్టుబడ్డ దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు -
షాకింగ్: రోడ్డు పక్కన రూ.8 కోట్ల విలువైన టీకాలు
భోపాల్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం టీకా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నేడు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. టీకాల కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్లో దాదాపు రెండున్నర లక్షల టీకా డోసులు ఉన్న లారీని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన నర్సింగపూర్ కరేలి బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. 2.40 లక్షల కోవాగ్జిన్ టీకా డోసులు ఉన్న లారీని కరేలి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. డ్రైవర్, క్లీనర్ ఎక్కడ ఉన్నారో అర్థం కాలేదు. చాలా సేపటి నుంచి ఆ ట్రక్కు అక్కడే ఆగి ఉంది. ఇది గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. ట్రక్కులో భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన 2,40,000 కోవాగ్జిన్ టీకాలున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ వదిలేసి వెళ్లిన టీకాల ఖరీదు సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తూ.. అతడి మొబైల్ నంబర్ని ట్రాక్ చేశాం. అది హైవేకు సమీపంలో తుప్పల్లో పడి ఉంది. టైర్లు కూడా పంచర్ కాలేదు. ట్రక్ కండీషన్ చాలా బాగుంది. ప్రస్తుతానికి టీకాలు సేఫ్. డ్రైవర్, క్లీనర్ గురించి దర్యాప్తు చేస్తున్నాం. వారీ ఆచూకీ కోసం గాలిస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు -
కారుపై పడ్డ కంటైనర్: నలుగురు దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పాలరాతి లోడ్తో వెళుతున్న కంటైనర్ కారుపై పడడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుడా ఆండ్లా పోలీస్స్టేషన్ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం ఈ విషాదంచోటు చేసుకుంది. (ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి) స్థానికులసమాచారం ప్రకారం పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్తో వెళ్తున్న కంటైనర్ పడింది. ట్యాంకర్ను క్రేన్ సహాయంతో వేరు చేశారు. దీంతో కారులో ఉన్న దంపతులతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని అజ్మీర్ మెడికల్ కాలేజీకి ఆర్థిక సలహాదారుగా మనోజ్ కుమార్ శర్మగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టంమీద మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుండోజ్లోని ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం
సాక్షి, పట్నా: బిహార్లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెహానాబాద్ జిల్లా నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నలందా జిల్లాలోని తెలహాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన ట్రక్కు అదుపుతప్పి టెల్హడా ప్రాంతంలోని హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలకు తరలిస్తున్న క్రమంలో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. పోలీసులు, అధికారులు, వాహనాలపై కూడా రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలన్నారు. -
మందు బాబుల తెలివి.. వైరలవుతోన్న వీడియో
-
మేం ఇంకా ఇంత ఎదగలేదురా బాబు: ఆనంద్ మహీంద్రా
ముంబై: ఇళ్లలో భూగర్భంలో గదులుండటం సహజం. కానీ వాహనాల్లో ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ స్టోరేజీ గదులను చూశారా.. లేదా. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే.. మీకు వాహనాల్లో కూడా అండర్గ్రౌండ్ గదులను ఎలా నిర్మించాలో ఓ ఐడియా వస్తుంది. ట్రక్కులో అండర్ గ్రౌండ్ స్టోరేజీ ఓకే కానీ.. దాన్ని ఇలాంటి పనులకు వినియోగించడం కాస్త నిరాశపరుస్తుంది. వీడియోతో షేర్ చేయడంతో పాటు ‘‘నేను, నా కంపెనీ ఇంకా ఇంత ఎదగలేదురా బాబు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేయమంటున్నారు’’ ఆనంద్ మహీంద్రా. ఆ వివరాలు.. వీడియోలో ముందు ఓ పికప్ ట్రక్కు కనిపిస్తుంది. చూడ్డానికే అంతా బాగానే ఉంది.. సమస్య ఏంటి.. పోలీసులు ఏం గాలిస్తున్నరబ్బా అనిపిస్తుంది. ఆ తర్వాత వారు ట్రక్కు కింద భాగంలో ఓ డ్రా బయపడింది. బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా వీరి అతి తెలివికి కళ్లు తేలేస్తారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. తమ పికప్ ట్రక్ డిజైనింగ్లో ఇది భాగం కాదని.. భవిష్యత్లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు. ‘భయంకరమైన తెలివైనవాడు. సరుకు రవాణాకు కొత్త అర్థం ఇచ్చాడు! మా పరిశోధనా కేంద్రంలో పికప్ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు. ఎప్పటికీ ఉండదు’ అంటూ దాన్ని ఉపయోగించిన తీరును మహీంద్రా వ్యతిరేకించారు. అయితే ఆ ట్రక్కు, అందులోని మందు బాటిళ్లను సీజ్ చేసిన ప్రాంతం వివరాల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. -
ఫుడ్ ట్రక్.. కుక్కలకు మాత్రమే
కరోనా మహమ్మారి తర్వాత ఇంకా రెస్టారెంట్లకు వెళ్ళని వ్యక్తులు ఉన్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఉండటం ఎందుకని హోటల్స్కు వెళ్లడం లేదు. అలాంటి వారు రోడ్డు పక్కన ఉండే ఫుడ్ ట్రక్ మెనూని మాత్రం ఇష్టంగా ఎంచుకుంటున్నారు. అయితే, మిగతా దేశాల మాటెలా ఉన్నా న్యూయార్క్ నగరంలోని ఈ ఫుడ్ ట్రక్ మాత్రం కుక్కలకు మాత్రమే ఆహారాన్ని అందిస్తోంది. ఈ ట్రక్కును 2017లో వాడుకలోకి తీసుకువచ్చారు. దీని పేరు ‘వూఫ్ బౌల్.’ ఇక్కడ వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్ను కుక్కలకు యమాటేస్టీగా వండి వడ్డిస్తారు. కుక్కకి స్నేహపూర్వక, ఆరోగ్యకరమైన ఆహారాన్ని వూఫ్ బౌల్ ద్వారా అందించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ ట్రక్ యజమాని ఇక్కడ కుక్కల కోసం సేంద్రీయ ఆహారాన్ని మాత్రమే తయారు చేస్తుందని, ఎలాంటి హానికారక రసాయనాలు ఉపయోగించరని ముందే తమ నోట్లో పేర్కొంటారు. ఇక్కడ తయారు చేసిన ప్రతిదీ కుక్కలు లొట్టలు వేసుకొని మరీ టేస్ట్ చేస్తుంటాయి. -
ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కారులో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశారు. క్షతగాత్రులను తరలించారు. ట్రక్కు నాగాలాండ్కు చెందినది కాగా.. కారు జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. -
ఈ ప్రమాదం హైదరాబాద్లో జరిగిందా?
సాక్షి, హైదరాబాద్: నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుందంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యాన ఊరేంటి, ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తోంది. తాజాగా నెట్టింట మరో ఫేక్ వార్త హైదరాబాదీయులను ఆగమాగం చేసింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్కు నిప్పంటుకుని పేలిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ట్యాంకర్ ఆనవాళ్లు లేకుండా అగ్నికి ఆహుతవగా దాని పొగలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రమాదం నిజంగానే జరిగింది. కానీ భాగ్యనగరంలో కాదు. పుణెలో! (చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!) ఓ నెల క్రితం పుణెలోని వార్జే బ్రిడ్జి మీద ఆహారపదార్థాలను మోసుకువెళ్తున్న సాధారణ ట్రక్కు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న డ్రైవరు వాహనంలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డిసెంబర్ 5న జరిగిన ఈ ఘటన తాజాగా హైదరాబాద్లో జరిగిందంటూ లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు సైతం దీనిపై స్పందించి ఇది మనదగ్గర జరగలేదని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు నగరంలో చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అయినా సరే కొందరు ఈ ఫేక్ న్యూస్ను గుడ్డిగా నమ్మేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అసత్య వార్తలను విశ్వసించకండి, వాటిని ప్రోత్సహించకండి. (చదవండి: వ్యాక్సిన్తో జాంబీలుగా మారిపోతున్నారా?) ఒక్కమాటలో: సాధారణ ట్రక్కులో మంటలు చెలరేగిన ఘటన పుణెలో జరిగింది, హైదరాబాద్లో కాదు. This viral video is not of Gachibowli flyover. It is a FALSE news. It had happened on the Warje bridge, Pune a few days back. No such incidents have occurred in Hyderabad. Warning : Persons spreading rumours/misinformation leading to public fear will be dealt as per law. pic.twitter.com/ViOYlpxJDA — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) January 14, 2021 -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రక్ దూసుకెళ్లినా బతికింది
చెన్నై: మనిషి ప్రాణం గాల్లో దీపం వంటిది. దీన్ని హరించేందుకు ప్రమాదాలు ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తాయన్నది ఎవరూ ఊహించలేరు. కానీ ఇక్కడ చెప్పుకునే మహిళ కూడా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడి అదృష్టవంతురాలని నిరూపించుకుంది. తమిళనాడులోని తిరుచెంగోడ్కు చెందిన ఓ మహిళ చేతిలో సంచితో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో వెనకనుంచి ఓ పెద్ద ట్రక్కు ఆమెపై దూసుకుంటూ వెళ్లింది. ఓ క్షణంపాటు ఆమె పై ప్రాణాలు పైనే పోయినా ఎలాంటి చిన్న గాయాలు కూడా కాకుండా ప్రమాదం నుంచి బయటపడింది. మహిళను గమనించకుండా ఆమె పై నుంచి ట్రక్కు పోనిచ్చిన డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఎన్నడు జరిగిందన్న వివరాలు పూర్తిగా తెలియరాలేదు. (చదవండి: ఇంత భారీ అనకొండా.. నిజమేనా?!) ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం మామూలు విషయం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహిళను చూడకుండా ఆమెపై వాహనాన్ని పోనిచ్చిన ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని నిందిస్తున్నారు. అసలు రోడ్డు మీద నడుచుకుంటూ రావడం ఆమె తప్పని మరికొందరు సదరు మహిళను తప్పుపడుతున్నారు. ఏదేమైనా మహిళ ఓ క్షణం చచ్చి బతికిందని కామెంట్లు చేస్తున్నారు. దేవుడున్నాడని, అతడే ఆమెను ఈ ప్రమాదం నుంచి రక్షించాడని మరికొందరు అంటున్నారు. (చదవండి: 10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? ) -
వైట్హౌస్ నుంచి వెళ్లిపోతున్న ట్రంప్..?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ (77) మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన గెలుపు ఇక లాంఛనమే కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్నకు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రవారం వెలువడిన ఫలితాలను బట్టి ఇక్కడ బైడెన్ది పైచేయిగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ట్రంప్ మీద ట్రోలింగ్ ఓ రేంజ్లో నడుస్తుంది. ఎన్నికల గురించి ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తుండటంతో విమర్శకులు సోషల్ మీడియా వేదికగా ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది. అధ్యక్షభవనం బయట ఉన్న ఓ మూవింగ్ ట్రక్కు నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమైన పత్రాలు, హర్డ్ డిస్క్లను తీసుకెళ్తున్నారని.. వెండి వస్తువులను తరలించడానికి ట్రంప్ ట్రక్కు మాట్లాడుకున్నారని కామెంట్ చేస్తున్నారు. వివరాలు.. ఈ వీడియోలో ఓ పసుపు రంగు ట్రక్కు అధ్యక్ష భవన ప్రధాన ద్వారం ఎదురుగా ఉంది. ట్రక్కు మీద ఉన్న అక్షరాలు సరిగా కనబడటం లేదు. నెటిజనులు మాత్రం ఈ ట్రక్కును పెస్న్కే కంపెనీకి చెందినదిగా భావిస్తున్నారు. (చదవండి: ‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్కు గట్టి కౌంటర్) ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయినప్పటి నుంచి దీని మీద బోలేడు జోకులు, వ్యంగ్య వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలిసింది కదా. అందుకే ట్రంప్ వైట్హౌస్ నుంచి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారనుకుంటాను అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ చాలామంది నెటిజనులు మాత్రం ‘ట్రంప్ వైట్హౌస్లోని పెయింటింగ్స్, పురాతన వస్తువులను తరలిస్తున్నాడో ఏమో.. ఎవరికి తెలుసు’.. ‘తను చేసిన స్కాములకు సంబంధించిన హార్డ్డిస్క్, ఫైల్స్ని తీసుకెళ్లడానికి ట్రక్కు మాట్లాడుకున్నాడేమో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఇది నిజమేనా.. వైట్హౌస్ బయట ట్రక్కు ఉండటం వింతగా ఉంది’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్తరప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం..
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. రెండు స్టేట్ రోడ్వేస్ బస్సులు ఒకదానికితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 12 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. లక్నో నగర శివార్లలోని కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్వేస్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఇంతలో ఒక ట్రక్కు అదుపు తప్పి వాటి సమీపంలోకి వెళ్లడంతో దాని డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని కింగ్జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కకోరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ ఎం ఖాసి అబిది తెలిపారు. (చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లక్నో నుంచి వస్తున్న బస్సు, ట్రక్కును అధిగమించడానికి ప్రయత్నించింది. ఆ సయమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది’ అని తెలిపాడు. ప్రమాదం జరగినప్పుడు అక్కడే ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు కూడా గాయపడ్డాడు. రెండు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడం చూసి తనకు కళ్లు తిరగాయని.. నియంత్రణ కోల్పోవడంతో తనకు కూడా ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్ తెలిపాడు. -
రాకెట్ వేగంతో ట్రక్కు; కొంచెం అయ్యుంటే..
తిరువనంతపురం: 'అదృష్టం ఉన్నోడిని పాడు చేయలేం, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేం' అన్న సామెత ఇతని విషయంలో అక్షరాలా నిజమైంది. కేరళలోని కొల్లాం జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఎడమ పక్కనుంచి ఓ ట్రక్కు తుఫాను వేగంతో వెళ్లింది. కళ్లు తెరిసి మూసే లోపే అది రయ్మని వెళ్లిపోయింది. దీంతో అసలేం జరిగిందో అర్థమవని స్థితిలో తత్తరపాటుకు లోనైన అతనికి ముందు రాకెట్లా దూసుకుపోతున్న వాహనం చూసి గుండెలదిరిపోయాయి. పైగా ఆ బండి బ్యాలెన్స్ తప్పుతూ వంకరటింకర్లు తిరిగింది. (షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’) అది చూసి హడలిపోయిన ఆ బాటసారి చావు తన పక్కన నుంచే వెళ్లిందా అనుకుంటూ రోడ్డు దిగి ఊపిరి పీల్చుకున్నాడు. గుండెలదిరే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ట్రక్కుకు, సదరు వ్యక్తికి మధ్య కొన్ని ఇంచుల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో నెటిజన్లు ఆ వ్యక్తిని అదృష్టవంతుడు అని కొనియాడుతున్నారు. అయితే ఈ వీడియోలో అతివేగంతో వెళుతున్న డ్రైవర్ది తప్పని కొందరు, రోడ్డుపైనే ఎందుకు నడవడం?, పక్కన దారి ఉంది కదా! అని సదరు వ్యక్తిదే తప్పని మరికొందరు విమర్శిస్తున్నారు. (కన్నీళ్లు తుడుచుకో చెల్లి : సోనూసూద్) Luckiest man of the month award goes to this man. Chavara, Kollam District,Kerala. pic.twitter.com/dAGnteQpDe — Nisar നിസാർ (@nisarpari) August 22, 2020 -
మహారాష్ట్ర నుంచి కేరళకు ఏడాది పట్టింది!
తిరువనంతపురం: ఓ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఏకంగా ఏడాది పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. ఈ ట్రక్కు విక్రం సారాభాయి స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్ మాట్లాడుతూ.. ‘గత ఏడాది జూలై 8న మా ప్రయాణం ప్రారంభమయ్యింది. సంవత్సరం పాటు ప్రయాణించి.. నాలుగు రాష్ట్రాలు దాటి ఈ రోజు తిరువనంతపురం చేరాము. ఈ రోజే యంత్రాలను అక్కడికి చేరుస్తాం’ అన్నారు. ఈ ట్రక్కులో తేలికపాటి పదార్థాలను తయారు చేయడానికి వాడే ఏరోస్సేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్ని తీసుకొచ్చారు. గత ఏడాది మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ ట్రక్కు రోజుకు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసేది. దీనితో పాటు 32 మంది వర్కర్లు ఉన్నారు. (‘అనంత’ సంపద ఎన్నడు తెలిసేను?) ఈ మెషన్ బరువు సుమారు 70 టన్నులు ఉండగా.. ఎత్తు 7.5 మీటర్లు, వెడల్పు 2.65 మీటర్లుగా ఉంది. ఈ మెషన్ని నాసిక్లో తయారు చేశారు. అతి త్వరలోనే ఇది భారతీయ స్పేస్ రిసర్చ్ ప్రాజెక్ట్ల్లో పాలు పంచుకోనుంది. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘సరుకు బరువును మోయడానికి మేము తాళ్లను ఉపయోగించాము. ఈ ట్రక్కును లాగడానికి ముందు, వెనక రెండు ఇరుసులు ఉన్నాయి. రెండింటికి ఒక్కొక్కదానికి 32 చక్రాలు, పుల్లర్కు 10 చక్రాలు ఉన్నాయి. పుల్లర్ వీటన్నింటిని లాగుతుంది.. డ్రాప్ డెక్ 10 టన్నుల బరువు, సరుకు 78 టన్నుల బరువు ఉంటుంది. బరువు రెండు ఇరుసులపై పంపిణీ అవుతుంది’ అని ఓ అధికారి తెలిపారు. -
భయానకం : జమ్మూ హైవేపై సిలిండర్ల పేలుడు
-
భయానకం : హైవేపై సిలిండర్ల పేలుడు
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లో సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. దాదాపు 45 నిమిషాల పాటు ట్రక్కులో ఉన్న డజనుకు పైగా సిలిండర్లకు మంటలంటుకొని బారీ శబ్దంతో పేలుడు జరగడంతో అక్కడి స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అయింది. దీంతో పాటు రహదారికి ఇరువైపుల బారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉధంపూర్ ఎస్పీ రాజీవ్ పాండే మాట్లాడుతూ...' 300 సిలిండర్ల లోడుతో జమ్మూలోని బారీ బ్రాహ్మణ నుంచి నార్త్ కశ్మీర్లోని సోపోర్కు బయలుదేరింది. కాగా ట్రక్కు జమ్మూ కశ్మీర్ హైవేపై ఉన్న తిక్రి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా సిలిండర్లకు మంటలంటుకున్నాయి. కాగా 45 నిమిషాల పాటు 100 ఫీట్లకు పైగా సిలిండర్లు పైకి ఎగురుతూ కింద పడ్డాయి. ఈ సమయంలో దారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ట్రక్కు డ్రైవర్ ఉజ్జలసింగ్ సిలిండర్ల పేలుడు జరుగుతున్న సమయంలోనే ట్రక్కును వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.' అత్యధిక ఉష్ణోగ్రతతోనే ట్రక్కులో సిలిండర్ల పేలుడు జరిగిందేమోనన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాజీవ్ పాండే తెలిపారు. -
పంజాబ్లో ఘోర ప్రమాదం; 15మంది మృతి
-
పంజాబ్లో ఘోర ప్రమాదం; 15మంది మృతి
చంఢీగర్ : పంజాబ్లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో తీసుకెళుతున్న బాణాసంచా ప్రమాదావశాత్తు పేలడంతో 15 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. -
నాకు ఎదురొస్తే నీకే రిస్క్..
బెంగళూరు: ‘ఒకరు నాకు ఎదురొచ్చినా.. నేను ఒకరికెదురెళ్లినా వాళ్లకే రిస్కు’ బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ ఇక్కడ చెప్పుకునే ఏనుగుకు సరిగ్గా సరిపోతుందేమో. ఓ వ్యక్తి గురువారం ట్రక్ నడుపుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వీరావేశంతో ట్రక్వైపుకు పరుగెత్తుకుంటూ వచ్చింది. బాబోయ్.. ఇదేంటి, ఇలా తమవైపుకు దూసుకొస్తోందని భయపడిన ట్రక్ డ్రైవర్ ఉన్నపళంగా వాహనాన్ని వెనక్కు పోనిచ్చాడు. అయినప్పటికీ ఏనుగు ఆ ట్రక్ను వదల్లేదు. వెంబడించి మరీ ఆ వాహనాన్ని అందుకుంది. అంతే.. ఇక కసితీరా తొండంతో ట్రక్ ముందు భాగాన్ని ధ్వంసం చేసి తన కోపాన్ని తీర్చుకుంది. అనంతరం వచ్చిన దారినే దర్జాగా తిరిగి వెళ్లిపోయింది. కర్ణాటకలో నాగర్హోల్ జాతీయ పార్క్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. దీన్నంతటినీ ట్రక్కులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు జంకుతున్నారు. ఏనుగు దాడి తర్వాత దెబ్బతిన్న ట్రక్ ఫొటోను చూసి ఆ ఏనుగుకు అంత కోపం ఎందుకొచ్చిందబ్బా అని ఎవరికి వారే ఆలోచనలు చేస్తున్నారు. ట్రక్కు స్థానంలో మనుషులు ఉంటే ఆ ఏనుగు ఇంకేం చేసేదోనని నెటిజన్లు ఒకింత భయపడుతూనే కామెంట్లు చేస్తున్నారు. ఏనుగు చేతిలో చిత్తయిన ట్రక్కు -
మంటల్లో బస్సు
కన్నౌజ్(యూపీ): ఉత్తరప్రదేశ్లో శుక్రవారం బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఆ రెండు వాహనాలూ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది జాడ తెలియాల్సి ఉంది. బస్సుకు నిప్పంటుకుని 21 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్తో ఢీ కొనడంతో డీజిల్ ట్యాంక్ పేలిపోయి బస్సుకు నిప్పంటుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఫరుఖాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మొత్తం 45 మంది ప్రయాణీకులున్నారు. చిలోయి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. 21 మందిని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఐజీపీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. మంటలను అదుపుచేశామని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఎం ఆదిత్యనాథ్ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. -
రిఫ్రిజిరేటర్లో 41 మంది
తెస్సలోనికి: ట్రక్లో దాక్కొని గ్రీస్ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన 41 మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్ రిఫ్రిజిరేటర్లో వలసదారులు ఉండగా, జార్జియాకు చెందిన ట్రక్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. జాంతి, కొమొతిని నగరాల మధ్య ఈ ట్రక్కును కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాక్కున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన ఏడు మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అఫ్గానిస్తాన్ వాసులుగా భావిస్తున్నారు. -
ట్రక్కులో 39 మృతదేహాలు
లండన్: లండన్ దగ్గర్లో బుధవారం 39 మృతదేహాలున్న ఒక ట్రక్కు కనిపించి సంచలనానికి కారణమైంది. ఆ మృతదేహాలెవరివి, మరణాలకు కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ట్రక్ డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ దగ్గర్లో ఉన్న వాటర్గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో మృతదేహాలున్న ఒక ట్రక్కు ఉందని బుధవారం తమకు సమాచారం వచ్చిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు తెలిసిందని, వేల్స్లోని హోలీహెడ్ రేవు ద్వారా శనివారం యూకేలోకి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు. నార్త్ ఐర్లండ్కు చెందిన ట్రక్ డ్రైవర్ను అరెస్ట్ చేసి వివరాలు రాబడ్తున్నామని ఎసెక్స్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్య్రూ మారినర్ చెప్పారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్లోకి వచ్చే క్రమంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలున్న ట్రక్ వెనుకభాగంలో మైనస్ 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అందులో దాక్కుని హోలీహెడ్ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్లోకి వస్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇలాగే ఒక లారీ వెనుకభాగంలో దాక్కుని అక్రమంగా బ్రిటన్లోకి వస్తూ 58 మంది చైనీయులు చనిపోయారు. -
అప్పట్లోనే రూ.6.50 లక్షల చలానా
భువనేశ్వర్: గతంలో ట్రాఫిక్ చలానాలు వేలల్లో వస్తేనే వాహనదారులు గుండెలు బాదుకునేవారు. అలాంటిది ఇప్పుడు కొత్త మోటారు వాహన చట్టం-2019 అమల్లోకి వచ్చాక ట్రాఫిక్ చలానాలు ఏకంగా లక్షల్లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగలాండ్లో రిజస్టర్ అయిన ఓ ఒడిశా ట్రక్కుపై ఏకంగా రూ.6.50లక్షల చలానా విధించారు అధికారులు. అయితే కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాకముందు ఈ భారీ చలానాను విధించడం గమనార్హం. ఒడిశా సంబల్పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ట్రక్కుపై ఈ భారీ చలానా విధించారు. గత నెల 10న ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికింకా కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రాలేదు. నూతన చట్టం సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడుసార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించాడంటూ.. ఆ ప్రాంత ఆర్టీవో రూ. 6.53లక్షల చలానా విధించాడు. వీటిలో గత ఐదేళ్ల నుంచి రోడ్డు ట్యాక్స్ కట్టనందుకుగాను.. రూ.6,40,500 చలానా విధించగా.. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి ఇతర కాగితాలు లేకపోవడమే కాక, పర్మిట్ షరతులను ఉల్లంఘిచినందుకు గాను మిగతా మొత్తాన్ని విధించారు. (చదవండి: లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..) చనిపోయిన వ్యక్తి లైసెన్స్ క్యాన్సిల్ ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే సంఘటన ఒకటి రాజస్తాన్లో చోటు చేసుకుంది. జలవార్ జిల్లా ట్రాన్స్పోర్టు అధికారులు సీటు బెల్ట్ ధరించకపోవడమే కాక, అతివేగంతో వెళ్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఏ వ్యక్తి పేరు మీదనైతే నోటీసులు జారీ చేశారో.. అతడు ఏడాది క్రితమే మరణించడం గమనార్హం. -
చలానాల చితకబాదుడు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్రం తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం కింద జరిమానాలు భారీగా వసూలవుతున్నాయి. ఢిల్లీలోని ఓ ట్రక్కు యజమానికి ఏకంగా రూ. 2లక్షల జరిమానా పడిందని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. హరియాణ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ఈ ట్రక్కు డ్రైవరుకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, కాలుష్య పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవడం, అధికలోడు, సీటుబెల్టు ధరించకపోవడం వంటి పలు కారణాలతో రూ. 2లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ఆ లారీ ఓనర్ ఢిల్లీ కోర్టులో గురువారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వసూలైన అత్యధిక జరిమానా ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు ఓ రాజస్తాన్ ట్రక్కుకు రూ. 1.41లక్షల ఫైన్ విధించారు. -
ఈ చెత్త బండ్లతో స్వచ్ఛ నగరమెలా?
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు వివిధ అభివృద్ధి పథకాలతోముందుకెళ్తున్న బల్దియా చెత్త తరలింపు వాహనాల విషయంలో మాత్రం తగిన శ్రద్ధ చూపడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛ నగరం కోసం చెత్తను వేరు చేయడం, బహిరంగ వీధుల్లో వేయకపోవడం వంటి వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు, వివిధ వర్గాలతో సమావేశాలునిర్వహిస్తున్నప్పటికీ నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి చెత్తను తరలించే వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కాలం చెల్లిన వాహనాలతో, కనీసం పైకప్పు వంటివి లేకుండానే చెత్తను తరలిస్తుండటంతో ఆ వాహనాలు ప్రయాణించిన మేర రోడ్లపై వ్యర్థాలు పడుతున్నాయి. ప్రజల కళ్లల్లోనూ వ్యర్థాలుపడుతున్నాయి. అవి వెదజల్లే దుర్గంధంతో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఊడ్చిన రహదారులపై సదరు చెత్త పడుతూ పోవడంతో రోడ్లు చెత్తమయంగా మారుతున్నాయి. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల మేరకు చెత్తను తరలించే వాహనాల్లో చెత్త బయటకు కనిపించకుండా అన్ని వైపులా మూసివేసి ఉండాలి. తద్వారా దుర్గంధం వెలువడకుండా ఉండటంతోపాటు వ్యర్థాలు కింద పడవు. జీహెచ్ఎంసీ వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఏళ్లనాటి పాత డొక్కు వాహనాలనే నేటికీ వాడుతుండటంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడు అవుతుండటంతోపాటు స్వచ్ఛ నగరం సాధనకూ విఘాతంగా పరిణమిస్తోంది. అన్నింటిదీ అదే దారి.. జీహెచ్ఎంసీలో చెత్తను తరలించే వాహనాల్లో 25 టన్నుల సామర్ధ్యం కలిగిన పెద్దవి దాదాపుగా జీహెచ్ఎంసీవి 50, అద్దెకు నడిపిస్తున్నవి 100 ఉన్నాయి. 10 టన్నులు, 6 టన్నుల మేర సామర్ధ్యమున్నవి దాదాపు 140 ఉండగా వీటిల్లో 90 వరకు అద్దెవే. డంపర్ప్లేసర్లు జీహెచ్ఎంసీవి, అద్దెవి కలిసి దాదాపు 150 వరకున్నాయి. ఈ చెత్త తరలించే వాహనాలన్నీ జీహెచ్ఎంసీవి, ప్రైవేటువి కూడా నిబంధనల మేరకు చెత్తను తరలించడం లేవు. ఇంటింటి నుంచి చెత్త స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా సమీపంలోని చెత్త రవాణా కేంద్రాలకు చేరుతుండగా, అక్కడి నుంచి జవహర్నగర్ డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దాదాపు 30 కి.మీ.ల మేర చెత్తను తరలించే ఈ వాహనాలు ప్రయాణించిన మేర రహదారులు చెత్తమయంగా మారుతున్నాయి. డొక్కు వాహనాలు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఏ పార్ట్ ఎప్పుడు ఊడి పడుతుందో తెలియని వాహనాలున్నాయి. చెత్త తరలించే వాహనాలకు చెత్తను కప్పే పైమూతలు లేకపోవడంతో పైన కప్పేందుకు కవర్ల కోసం ఏటా దాదాపు రూ. 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ వాహనాలన్నింటికీ క్రమేపీ తొలగిస్తామని దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించి, 37 మాత్రం ఆర్ఎఫ్సీ వాహనాలు కొనుగోలు చేశారు. తిరిగి ఆ తర్వాత మళ్లీ కొనలేదు. దేశంలోని వివిధ నగరాల్లో చెత్త తరలించేందుకు ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలు కోసం చెత్త తరలించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఈ వాహనాల్లో వేసే చెత్త బయటకు కనిపించకుండా ఉండటమే కాకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు పార్టిషన్ కూడా ఉంటుంది. ఆ వాహనాలతో నిర్వహణవ్యయం తక్కువే కాక ఇంధనం కూడా ఆదా అవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం
నోయిడా : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. యమునా ఎక్స్ప్రెస్ వేపై రబూపుర వద్ద శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
జనంపైకి దూసుకొచ్చిన ట్రక్కు
గ్వాటెమాల సిటీ : గ్వాటెమాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రక్కు జనసమూహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతిచెందారు. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో రాత్రి సమయంలో ఓ కారు, పాదాచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అయితే రోడ్డుపై పడిపోయిన అతన్ని చూసేందుకు చుట్టుపక్కల వారందరూ గుంపుగా అక్కడికి వెళ్లారు. అయితే ట్రక్కు లైట్లు పనిచేయకపోవడం, చీకటి కూడా కావడంతో రోడ్డుపై ఉన్న జనసమూహాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో పెనుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు సమూహాన్ని ఢీకొట్టడంతో అక్కడున్న వారు చెల్లా చెదురుగా రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 32 మంది మృతిచెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు జిమ్మిమోరాలెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఈసీ కీలక నిర్ణయం.. టీఆర్ఎస్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ గుర్తు కారును పోలి ఉన్న ట్రక్కును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ట్రక్కు, ఇస్రీపెట్టె గుర్తులను ప్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు మేరకు సీఈసీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రక్కు గుర్తును ఎవ్వరికీ కేటాయించమని ఈసీ తెలిపింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు కారణంగా పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని కేసీఆర్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సత్తుపల్లి, ధర్మపురి నియోజకవర్గల్లో ఓట్లు తక్కువ రావడానికి ట్రక్కు గుర్తే కారణమని కేసీఆర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం టీఆర్ఎస్కు పెద్ద ఊరట కలిగించే అంశం. ఈసీ నిర్ణయంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం
హైదరాబాద్: తార్నాకలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దారి తప్పి ఇద్దరి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రద్దు చేయండి: కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నిర్వచన్ సదన్లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారు గుర్తును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈ సందర్భంగా అరోరాని కేసీఆర్ కోరారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల టీఆర్ఎస్కు నష్టం జరిగిందని, తొలగించిన ఓట్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలని కోరారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్లు కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ వినోద్ అన్నారు. 'ట్రక్కు, కెమెరా, ఇస్త్రీ పెట్టె, హ్యాట్ గుర్తులపై సునీల్ అరోరాతో కేసీఆర్ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తును పోలిన ట్రక్కుతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. వెయ్యి ఓట్ల వరకు చాలా నియోజక వర్గాల్లో నష్టం జరిగింది. అందువల్ల ట్రక్కు సింబల్ ఇకపై ఇవ్వొద్దని, ఎవరికీ కేటాయించవద్దని కేసీఆర్ సునీల్ అరోరాను కోరారు. ప్రజా స్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలి. ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా గుర్తులు ఉండకూడదని సీఎం కోరారు. ఎన్నికల ముందే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఎంపీలందరం ఫిర్యాదు చేశాము. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏమి చేయలేమని అన్నారు. మరో మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని, కారు గుర్తు సైతం పలుచని రంగులో ఉన్నందున ఆ రంగును పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం భేటి అయి నిర్ణయం తీసుకుంటామని సునిల్ అరోరా కేసీఆర్కు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా సాగినందుకు కేసీఆర్ కృతజ్ఙతలు తెలిపారు' అని ఎంపీ వినోద్ తెలిపారు. (కారుకు ట్రక్కు బ్రేకులు!) -
ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు
బీజింగ్ : చైనా పోలీసుల ముందుచూపుతో ఇద్దరు వ్యక్తులు మరణం అంచు నుంచి తప్పించుకోగలిగారు. దక్షిణ చైనాలోని యువాన్ ప్రావిన్స్లోని కున్మింగ్-మోహన్ రహదారి ఎత్తైన కొండల గుండా వెళుతుంది. ఎత్తైన కొండ నుంచి కింది వైపుకి ఉన్న కున్మో ఎక్స్ప్రెస్ హైవేలో దాదాపు 27 కిలో మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరమైంది. దీనికి స్లోప్ ఆఫ్ డెత్ గా పేరు కూడా ఉంది. తరుచూ ప్రమాదాలు జరిగే కొన్ని ప్రాంతాలను గుర్తించి, ఒక వేళ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఇంజినీర్ల సహాయంతో 2015లో స్థానిక పోలీసులు కొన్ని నిర్మాణాలను చేపట్టారు. వాహనాలు లోయలో పడిపోకుండా ఏటవాలుగా కొద్దిదూరం రోడ్డును నిర్మించి కంకరతో నింపారు. అంతేకాకుండా కొండపైన రోడ్డు అంచునుంచి కిందకి పడిపోకుండా భారీ వలను కూడా ఏర్పాటు చేశారు. అయితే సోమవారం ఓ భారీ లారీ కున్మో ఎక్స్ప్రెస్ హైవేపై ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పింది. భారీ వాహనం కావడం, అది కూడా అతివేగంగా వెళ్లడంతో కంకరను సైతం దాటుకొని రోడ్డు అంచున ఆగిపోయింది. లారీ వెనక భాగం రోడ్డుపైనే నిలిచిపోగా.. క్యాబిన్ రోడ్డు అంచును దాటుకొని ముందుకు వాలిపోయింది. దీంతో లారీ అద్దాల్లో నుంచి డ్రైవర్, క్లీనర్లో బయటివైపు పడిపోయారు. అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మించిన వల ఉండటంతో అందులో పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదాల నివారణ కోసం స్థానిక పోలీసులు 2015లో మూల మలుపు వద్ద చేపట్టిన నిర్మాణాకి అంచున వలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ నిర్మాణం వల్ల ఐదుగురు వ్యక్తులు ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆ భారీ వల లేకపోతే దాదాపు330 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయి, ఈ పాటికి చనిపోయి ఉండేవాళ్లమని, అధికారులకు డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపాడు. -
ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు
-
ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి
అజ్మీర్: రాజస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అజ్మీర్లో ఆదివారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు తుక్కై నామరూపాలు లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదా చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి
బీజింగ్: చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందాగా, మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చైనా రాజధాని బీజింగ్కు దక్షిణాన హునాన్ ప్రావిన్స్లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇరు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వీటిలో ఓ వాహనం డివైడర్ను దాటి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సుమారు 2.6 లక్షల మంది చైనీయులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని డబ్ల్యుహెచ్వో తెలిపింది. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడిలోకి..
సాక్షి ముంబై: 23 మందితో తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న మినీ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఉన్న ఇసుక ట్రక్కును ఢీ కొనడంతో బస్సులో ఉన్న 10 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన నాసిక్ జిల్లా చాంద్వడ్ తాలూకా సోగ్రాస్ గ్రామం వద్ద గురువారం వేకువ జామున 5.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఓ బాలుడున్నారు. మరణించిన వారందరూ కల్యాణ్, ఉల్లాస్నగర్తోపాటు నాసిక్ వాసులుగా గుర్తించారు. తెల్లవారు జామున.. సాయిట్రావెల్స్కు చెందిన మినీ బస్సులో డ్రైవర్తోపాటు మొత్తం 23 మంది సోమవారం తీర్థయాత్రలకు బయలుదేరారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజాము వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. తెల్లవారుతుండటంతో నిద్రలోనుంచి అçప్పుడప్పుడే కొందరు మేల్కొనసాగారు. అంతలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం.. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఆ పరిసరాలన్నీ రక్తపు మడుగులో ఎర్రగా మారిపోయాయి. క్షతగాత్రుల అర్తనాధాలతో ఆ పరిసరాలన్నీ మారుమోగాయి. ఇలా సూర్యోదయం చూడకముందే ఘటనా స్థలంలోనే ఐదుగురు విగత జీవులయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, ఇతర వాహన చోదకుల సహాయంతో గాయపడ్డ వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 13 మందిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నాసిక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఉల్లాస్నగర్కు చెందిన మినీ బస్సు డ్రైవర్ సంతోష్ పిఠలే (38)కూడా ఉన్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయాలైన వారిలో కాలిదాస్ వాసోదా (38) రాధీ రాఠోడ్ (40), జమునా చవాన్ (70), మంజూ గుజరాతీ (31), ప్రగతీ గుజరాతి (12, కాశిక్ ధావ్ (14), కల్యాణ్ గుజరాత్ (60), ధనూ పరమార్ (60), వసూదుమయా (54), బ్రిజేష్ మల్హోత్రా (20), అజయ్ మల్హోత్రా (45), డ్రైవర్ సంతోశ్ పిఠలేతోపాటు ట్రక్కు క్లీనర్ మాలీకిలు ఉన్నారు. టైర్ పగలడంతోనే....? మినీ బస్సు టైరు పగలడంతోనే ఈ సంఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రక్కు మొరాయించడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేయసాగారు. అయితే అంతలోనే వేగంగా వస్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీ కొట్టింది. టైర్ పగలడంతో మినీ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దీంతోనే ట్రక్కును ఢీ కొట్టిందని తెలిసింది. దీంతో దైవ దర్శనానికి వెళ్లి.. చివరికి మృత్యు ఒడిలోకే వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
-
నడిరోడ్డుపై స్టంట్ ట్రిక్..వీడియో వైరల్
-
గుండె ఆగినంత పనైంది..
మెదీనా, సౌదీ అరేబియా : రద్దీగా ఉన్న రోడ్డుపై స్టంట్ ట్రిక్ ప్లే చేసినందుకు ఓ వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు. వేగంగా వస్తున్న లారీని చూసిన వ్యక్తి కారు మీద నుంచి దూకి ఒక్కసారిగా ట్రక్కుకు ఎదురువెళ్లాడు. అతి దగ్గరకు వచ్చిన తర్వాత వేగంగా పక్కకు తప్పకున్నాడు. ఇందుకు సంబంధించి రికార్డు చేసిన వీడియోను అతను సోషల్మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మిగతా ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్లో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు, ట్రక్కు ఢీకొట్టడంతో 10 మంది మృతిచెందగా.. 47 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో బాందా నుంచి అహ్మదాబాద్ వెలుతున్న ఓ ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుతియాయ్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 10 మంది మరణించారు. ఏడు మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. మరో 47 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి
-
గుజరాత్లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి
-
గుజరాత్లో ఘోర దుర్ఘటన
భావ్నగర్: గుజరాత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో 25మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భావ్నగర్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు ట్రక్కులో వెళుతున్న వారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు. ఉదయం సమయం కావడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
నడిరోడ్డుపై బోల్తాపడ్డ గ్యాస్ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు!
చైనాలో నడిరోడ్డు మీద పెనుప్రమాదం సంభవించింది. సహజ వాయువు (గ్యాస్)ను తరలిస్తున్న ట్రక్కు ఎక్స్ప్రెస్ హైవే మీద బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ట్రక్కు సమీపంలో ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నడిరోడ్డు బోల్తాపడ్డ గ్యాస్ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు!
-
ట్రక్కులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పొగమంచు, వాయు కాలుష్యంపై నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న పర్యావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకూ సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే సీఎన్జీ వాహనాలకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన భారీ ట్రక్కులు, లారీల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి వాటికి మినమాయింపులను ప్రభుత్వం కల్పించింది. అప్పటికే ఢిల్లీ చెక్ పాయింట్ల వద్దకు చేరుకున్న ట్రక్కులను ఇతర నగరాలకు మళ్లిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు శాఖ.. ఢిల్లీకి వచ్చే అన్ని రహదారుల్లోనూ చెక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 15 వరకూ ట్రక్కులపై నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ అధికారులు తెలిపారు. -
షాకింగ్: వీడు నిజంగా లక్కున్నోడే!
-
షాకింగ్: వీడు నిజంగా లక్కున్నోడే!
బీజింగ్ : రద్దీ రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ బైక్ మీద నుంచి కింద పడిపోగా.. వెనకాలే వచ్చిన వాహనం వేగంగా దూసుకెళ్లింది. కానీ క్షణాల్లో అప్రమత్తమైన బాధితుడు ట్రక్కు భారీ నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని గియాంగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని గియాంగ్ లో రోడ్లు రద్దీగా ఉంటాయి. ఓ వ్యక్తి తన బైకుపై ఏదో పనిమీద వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ భారీ ట్రక్కు ఢీకొట్టడంతో అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయాడు. బైకును మాత్రం ట్రక్కు ఈడ్చుకుపోవడాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు బాధిత వ్యక్తి చనిపోయాడని భావించారు. కానీ అనూహ్యంగా అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తూ తనపై నుంచి దూసుకెళ్లేందుకు చూసిన ట్రక్కు ముందు చక్రాల నుంచి తప్పించుకుంటూ పక్కకు పొర్లుతూ ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'వీడు లక్కున్నోడు..' అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, ఆ వ్యక్తి బతికి బట్టకట్టడం నిజంగానే ఓ వింతలా ఉందని వీడియో చూసిన మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు.