Affordable
-
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఐదు బెస్ట్ కార్లు: తక్కువ ధర & ఎక్కువ సేఫ్టీ!
ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్బ్యాగ్లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్బ్యాగ్లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్బాక్స్ ఎంపికలను పొందుతుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్బ్యాగ్లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)ఇటీవల ఫేస్లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్బ్యాగ్లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.మారుతి స్విఫ్ట్ (Maruti Swift)మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్బ్యాగ్లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్.. ఆరు ఎయిర్బ్యాగ్లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.సిట్రోయెన్ సీ3 (Citroen C3)రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్బ్యాగ్లు పొందుతుంది. ఆరు ఎయిర్బ్యాగ్లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్బ్యాగ్లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి. -
ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.హోండా షైన్ (Honda Shine)రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.బజాజ్ ప్లాటినా (Bajaj Platina)సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదేయమహా ఎఫ్జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)యమహా కంపెనీకి చెందిన ఎఫ్జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్
ఎస్యూవీలు, ఎంపీవీలు, సెడాన్లు, హ్యాచ్బ్యాక్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశీయ విఫణిలో ఉన్న కార్ మోడల్స్ కోకొల్లలు. మార్కెట్లో ఎన్నెన్ని కార్లున్నా బడ్జెట్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బడ్జెట్ కార్ల విభాగంలో కూడా లెక్కకు మించిన కార్లు ఉండటం వల్ల.. ఇందులో బెస్ట్ కార్లు ఏవి అనేది కొందరికి అంతుచిక్కని ప్రశ్న. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో 800భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న, ఎక్కువ మంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందిన కార్లలో 'మారుతి సుజుకి ఆల్టో 800' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ.3.25 లక్షల నుంచి రూ.5.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. పనితీరు ఉత్తమంగానే ఉంటుంది.మారుతి సుజుకి స్విఫ్ట్మారుతి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. మంచి పర్ఫామెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైల్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ స్విచ్, మల్టీ-కలర్ ఇన్ఫర్మేషన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి ఎన్ని ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పాపులర్ బడ్జెట్ కారు. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అప్డేటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది రీడిజైన్ హెడ్ల్యాంప్లు, ఫ్రంట్ గ్రిల్ వంటివి పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా టియాగోదేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా సరసమైన ధర వద్ద లభించే కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి టియాగో. 2016లో పరిచయమైన ఈ కారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 242 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీటు, రియర్వ్యూ కెమెరా, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర రూ.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలుమారుతి సుజుకి వ్యాగన్ ఆర్రూ.5.41 లక్షల నుంచి రూ.7.12 లక్షల మధ్య లభించే 'మారుతి సుజుకి వ్యాగన్ ఆర్' మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. 2400 మిమీ వీల్బేస్ కలిగి ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ కారు పెద్ద క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ పొందిన క్యాబిన్లోని డ్యాష్బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్తో తయారైంది. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. -
2025లో ఆ కార్లకే డిమాండ్!
భారతదేశంలో ప్రతి ఒక్కరూ సొంతంగా కారు కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సరసమైన చిన్న కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉంటుందని.. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 'నోమురా' తన నివేదికలో పేర్కొంది.డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అమెరికా, జపాన్ కంపెనీలు చిన్న కార్లను విరివిగా తయారు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మార్కెట్లో చిన్న కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఎస్యూవీలు, ప్రీమియం కార్ల ధరలు పెరగడంతో.. వాహన కొనుగోలుదారుల చూపు చిన్న కార్ల మీద పడింది. సీఎన్జీ కార్ల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.చిన్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నోమురా తన నివేదికలో వెల్లడించింది. ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండేది కాదు.. అయితే నేడు ఎక్కువమంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.కరోనా మహమ్మారి సమయంలో గ్లోబల్ మార్కెట్లో వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గింది. ఆ తరువాత ఆటోమొబైల్ కంపెనీలు కోలుకున్నప్పటికీ.. డిమాండుకు తగ్గ సరఫరా చేయడంలో కొంత విఫలమయ్యాయి. ప్రస్తుతం కార్ల ఉత్పత్తి వేగవంతమైంది. వచ్చే ఏడాది డిమాండుకు తగిన విధంగా డెలివరీ ఉంటుందని సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్పై.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రభావం కూడా ఉంటుంది. అంతే కాకుండా.. ఐరోపాలో ఉద్యోగ నష్టాలు.. ఫ్రాన్స్ & జర్మనీలలో రాజకీయ గందరగోళం వంటివి ఐరోపాలో మొత్తం డిమాండ్ రికవరీని ప్రభావితం చేసిందని నోమురా నివేదిక ద్వారా తెలిసింది. యూఎస్ ట్యాక్స్, అధిక ధరలు వంటివి కూడా కార్ల అమ్మకాల మీద ప్రభావం చూపినట్లు సమాచారం. -
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
ఇక అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల వ్యాపార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. వచ్చే కొద్ది నెలల్లో అందుబాటు ధరల్లో మరిన్ని మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.‘వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం చాలా సందడిగా ఉండబోతోంది. విడా శ్రేణికి సంబంధించి అందుబాటు ధరల్లో మోడల్స్ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో (రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలతో కలిపి) ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో విడా స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. 32 రోజుల పాటు సాగిన పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన కనిపించిందని, 11,600 యూనిట్లు విక్రయించామని గుప్తా వివరించారు.క్షేత్రస్థాయిలో భౌతికంగా సేల్స్, సర్వీస్ మౌలిక సదుపాయాలు ఉంటే కస్టమర్కి మరింత నమ్మకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉండటం తమకు కలిసి వచ్చే అంశమని వివరించారు. ఈవీల విభాగంలో ధర, కస్టమర్ సర్వీసు అంశాలే దీర్ఘకాలికంగా ఏ కంపెనీకైనా కీలకం అవుతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీఇక దేశీ మార్కెట్లో మొత్తం వాహన విక్రయాలపరంగా చూస్తే పట్టణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయని గుప్తా చెప్పారు. ఈ ఏడాది పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ విక్రయాలు గత సీజన్తో పోలిస్తే 13 శాతం పెరిగి 15.98 లక్షల యూనిట్లకు చేరాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లోకి కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
తగ్గుతున్న బిల్డర్ల ఆసక్తి - పరిమితమైన అందుబాటు ధరల ఇళ్లు
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్ల (రూ.40లక్షల్లోపు) ప్రాజెక్టుల పట్ల బిల్డర్లలో ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో, అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 18 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 40 శాతంగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. కరోనా ముందు 2018 జూలై - సెప్టెంబర్ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల వాటా మొత్తం సరఫరాలో 42 శాతంగా ఉండడం గమనించొచ్చు. దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై రీజియన్, కోల్కతా, పుణె పట్టణాల్లో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,16,220 యూనిట్ల ఇళ్ల సరఫరా నమోదైంది. ఇందులో రూ.40లక్షల్లోపున్న అందుబాటు ధరల ఇళ్లు 20,920 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, 2018 సెప్టెంబర్ క్వార్టర్లో అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 21,900 యూనిట్లుగా ఉంది. విలాస ప్రాజెక్టులకే మొగ్గు రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక రాబడుల కోసం ఎక్కువగా విలాసవంతమైన ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. లాభాల మార్జిన్లు తక్కువగా ఉండడం, భూముల ధరలు అధికంగా ఉండడంతో అందుబాటు ధరల ఇళ్లు వారికి లాభసాటిగా ఉండడం లేదని పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో లగ్జరీ ఇళ్ల వాటా (రూ.1.5 కోట్లపైన ధర ఉండేవి) రెండింతలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో 1,16,200 యూనిట్లను ప్రారంభించగా, ఇందులో 27 శాతం (31,180 యూనిట్లు) లగ్జరీ విభాగంలో ఉన్నట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో ఒక త్రైమాసికంలో అత్యధికంగా లగ్జరీ యూనిట్ల ప్రారంభం గత త్రైమాసికంలోనే నమోదైనట్టు అనరాక్ తెలిపింది. 2018లో మొత్తం నూతన ఇళ్ల సరఫరా 52,120 యూనిట్లలో లగ్జరీ ఇళ్ల వాటా 9 శాతంగానే (4,590) ఉన్నట్టు పేర్కొంది. ‘‘డెవలపర్లు లగ్జరీ ఇళ్ల విభాగం పట్ల బుల్లిష్గా ఉన్నారు. కరోనా తర్వాత ఈ విభాగంలో అద్భుతమైన పనితీరు చూపిస్తోంది. ఏడు పట్టణాల్లో వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి’’అని అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. -
ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు
Top 5 Hybrid Cars In India: భారతీయ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఈ విభాగంలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు రూ. 16.46 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ఒక లీటరుకు గరిష్టంగా 27.97 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ. 18.29 లక్షల నుంచి రూ. 19.79 లక్షల వరకు ఉంటుంది. ఇది 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. ఇది సిటీ అండ్ హైవే రెండింటిలోనూ 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగిన ఈ కారులో తక్కువ ఇతర మోడల్స్ కంటే కూడా తక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ రూ. 18.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య లభించే ఈ కారు కూడా మన జాబితాలో ఉత్తమ మైలేజ్ అందించే బెస్ట్ కారు. ఇది 23.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే సిటీ అండ్ హైవే వంటి వాటిని లోబడి కొంత వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉండవచ్చు. పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. ఇదీ చదవండి: ఫ్రెండ్షిప్డే రోజు మిత్రులకు గిఫ్ట్గా ఓ స్మార్ట్వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్! మారుతి సుజుకి ఇన్విక్టో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో హైబ్రిడ్ మోడల్ ఇన్విక్టో. దీని ప్రారంభ ధర రూ. 24.79 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 28.42 లక్షలు. మైలేజ్ విషయానికి వస్తే.. ఇది ఒక లీటరుకు గరిష్టంగా 23.24 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. మన జాబితాలో ఇది కొంత ఖరీదైన కారు అనే చెప్పాలి. అయితే ధరకు తగిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! టయోటా ఇన్నోవా హైక్రాస్ టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 25.30 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. ఇది 23.24 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఉత్తమ పనితీరుని అందించే ఈ కారు అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. -
JioBharat phone: సక్సెస్ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్లు, బ్లాక్బస్టర్ సినిమాలు, హెచ్బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆఫ్ రోడింగ్ అంటే ఈ కార్లు ఉండాల్సిందే - ఎందుకంటే?
ఆధునిక కాలంలో భారతీయ మార్కెట్లో అనేక వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో కొంతమంది హ్యాచ్బ్యాక్ కార్లను కొనుగోలు చేస్తే, కొంతమంది ఎంపివిలను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామంది ఆఫ్ రోడింగ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే ఐదు ఆఫ్-రోడ్ కార్లను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Zimny) ఆఫ్ రోడింగ్ అనగానే గుర్తొచ్చే కార్ల జాబితాలో మారుతి కంపెనీకి చెందిన జిమ్నీ ఒకటి. దీని ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV 4x4 హార్డ్వేర్, దృఢమైన సస్పెన్షన్, లైట్ కర్బ్ వెయిట్, నారో ట్రాక్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. మహీంద్రా థార్ (Mahindra Thar) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న థార్ పర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ కారుని ఎగబడి మరి కొనుగోలు చేస్తుంటారు. దీని ధర రూ. 13.87 లక్షల నుంచి రూ. 16.78 లక్షల వరకు ఉంటుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ కలిగిన ఈ SUV ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) అమ్మకాల పరంగా థార్, జిమ్నీ అంత ఆదరణ పొందనప్పటికీ ఆఫ్ రోడింగ్ విషయం ఇది కూడా అద్భుతమైన చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 14.75 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా మన జాబితాలో అద్భుతమైన కారు. ఇది SUV అయినప్పటికీ ఆఫ్ రోడింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. కావున అద్భుతమైన ఆఫ్ రోడర్గా కూడా పనిచేస్తుంది. దీని ధర రూ. 17.69 లక్షల నుంచి రూ. 24.52 లక్షల మధ్య ఉంది. ఇది ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, లో లెవెల్ గేర్బాక్స్ అండ్ మెకానికల్ లాకింగ్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంలో రచ్చ రచ్చ చేసిన వామిక గబ్బి - వైరల్ వీడియో) ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ (Isuzu D-Max V-Cross) ఆఫ్ రోడింగ్ విభాగంలో అత్యంత ఖరీదైన కారు ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్. దీని ధర రూ. 23.50 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు ఉంది. ఇది సాధారణ ఆఫ్ రోడింగ్ వాహనాల మాదిరిగా కాకుండా లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో వెనుక ఒక చిన్న లగేజ్ స్పేస్ ఉంటుంది. అయినప్పటికీ ఇది మంచి పనితీరుని అందిస్తుంది. -
తక్కువ ధరలో లభించే బెస్ట్ గ్యాడ్జెట్స్!
Best Affordable Gadgets: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు సరసమైన ధర వద్ద లభించే వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలంటి వారి కోసం రూ. 500 కంటే తక్కువ ధర వద్ద లభించే 5 బెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ రూ. 399 వద్ద లభించే విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ చాలా మందికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్. ఇది మానిటర్లు, కీబోర్డులు, ఫోన్స్, ఎయిర్ పాడ్స్, ల్యాప్ టాప్ వంటి వాటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో క్లీనర్ కిట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్ మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో గ్యాడ్జెట్ 'వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ అండ్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్'. దీని ధర రూ. 200 కంటే తక్కువ కావడం గమనార్హం. QOCXRRIN వైర్లెస్ బ్లూటూత్ అనేది పేరుకు తగ్గట్టుగానే ఇది బ్లూటూత్ ట్రాకర్. అంతే కాకుండా దీనిని ఆండ్రాయిడ్ పరికరాలతో ఉపయోగించవచ్చు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, దీని పరిధి 25 మీటర్ల వరకు ఉంటుంది. 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్ దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ మోడల్ 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్. దీని ధర రూ. 333 మాత్రమే. ఇది దాదాపు చాలా పరికరాలకు ఉపయోగపడే విధంగా రూపుదిదుకున్న యూనివెర్సల్ ఛార్జింగ్ కేబుల్. ఈ కేబుల్ ద్వారా యాపిల్ పరికరాలకు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వంటి వాటికి ఛార్జింగ్ వేసుకోవచ్చు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా రూపొందించారు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ కీ చైన్ అనేది మహిళలు, పురుషులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం. ఈ కారణంగా కీ చైన్ల వినియోగం ఆధునిక కాలంలో కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రూ. 200 కంటే తక్కువ ధర వద్ద కీ చైన్ కావాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఈ మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ (Multi-function keychain light). ఇది కేవలం కీ చైన్ మాదిరిగా మాత్రమే కాకుండా లైట్గా కూడా పనికొస్తుంది.ఇందులో LED లైటింగ్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అయస్కాంతం ఉండటం వల్ల డోర్ లేదా హ్యాండిల్స్ వంటి వాటికి తగిలించుకోవచ్చు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) Hkaudio ఎమ్28 టిడబ్ల్యుఎస్ ఇన్-ఇయర్ ఇయర్బడ్స్ పవర్ బ్యాంక్తో కూడిన Hkaudio M28 TWS ఇన్-ఇయర్ ఇయర్బడ్స్ ధర కూడా రూ. 500 కంటే తక్కువ. ఇది USB టైప్ ఏ పోర్ట్ కలిగి బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో లభిస్తుంది. ఇది గేమింగ్ మోడ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఇయర్ఫోన్గా ఉపయోగపడుతుంది. -
తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?
Affordable Cars in 2023: భారతదేశంలో ప్రస్తుతం చాలామంది సొంతవాహనాలను కలిగి ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ సొంతంగా కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కొంతమంది ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తే మరి కొందరు వారి రేంజ్ కి తగ్గట్టుగా తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. నిజానికి ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కంటే సరసమైన ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే టాప్ అండ్ బెస్ట్ 10 కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బజాజ్ క్యూట్ భారతదేశంలో అతి తక్కువ ధరకు లభించే సరసమైన కారు బజాజ్ కంపెనీకి చెందిన క్యూట్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 2.64 లక్షల నుంచి రూ. 2.84 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకుల ధర కంటే చాలా తక్కువ. ఇది 216 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 35 కిమీ నుంచి 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది మంచి డిజైన్, మంచి ఫీచర్స్ పొందుతుంది. డాట్సన్ రెడీ గో అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ కంపెనీకి చెందిన డాట్సన్ రెడీ గో కూడా మన జాబితాలో తక్కువ ధరకు లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 3.8 లక్షల నుంచి రూ. 4.96 లక్షల వరకు ఉంది. ఇది 799 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 20.7 కిమీ నుంచి 22 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2017లో NDtv స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న ఈ కారు ప్రొడక్షన్ ఇప్పుడు ఇండియాలో ఆగిపోయింది. కానీ విక్రయాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) రెనాల్ట్ క్విడ్ మన జాబితాలో చెప్పుకోదగ్గ సరసమైన కారు మాత్రమే కాదు, అత్యంత సురక్షితమైన కారు కూడా. దీని ధర రూ. 4.7 లక్షల నుంచి రూ. 6.33 లక్షల మధ్య ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ డిజైన్ పరంగా ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులోని 799 ఇంజిన్ ఒక లీటరుకు 22 కిమీ నుంచి 23 కిమీ మధ్య మైలేజ్ అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కువ అమమకాలు పొందుతున్న కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. (ఇదీ చదవండి: రూ. 5.1 కోట్ల మెక్లారెన్ కొత్త సూపర్కార్ ఇదే - పూర్తి వివరాలు) మారుతి ఆల్టో 800 ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మారుతి ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ఆధునిక కాలంలో మాత్రమే కాకుండా ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంది. ఇది ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్లో అందుబాటులో ఉంది. కావున మునుపటికంటే మంచి డిజైన్, ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 796 సిసి ఇంజిన్ లీటరుకు 24.7 కిమీ నుంచి 31.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందిస్తున్న కారణంగా కూడా ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?) మారుతి ఎస్ ప్రెస్సో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో కారు ఎస్-ప్రెస్సో. ఇది కూడా తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 6.1 లక్షల మధ్య ఉంటుంది. ఇందులోని కె10బి పెట్రోల్ ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది లీటరుకు 24.8 కిమీ నుంచి 32.7 కిమీ మైలేజ్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. -
భారత్లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు, ఇవే!
2023 ఏప్రిల్ 01 నుంచి బిఎస్-6 ఫేజ్ 2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయడానికి సన్నద్ధమైపోతున్నాయి. మరి కొన్ని సంస్థలు ఉన్న కార్లను సరసమైన ధరలతో విక్రయించడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది మార్కెట్లో సరసమైన ధర వద్ద లభించే డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz): భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభిస్తున్న పాపులర్ డీజిల్ కారు. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10.40 లక్షల మధ్య ఉంది. ఈ హ్యాచ్బ్యాక్ 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్తో 90 హెచ్పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ దేశంలో మిగిలి ఉన్న ఏకైక డీజిల్ హ్యాచ్బ్యాక్. మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo): మహీంద్రా బొలెరో నియో కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ కారణంగా తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 9.62 లక్షల నుంచి రూ. 12.14 లక్షలు. ఈ కారు 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ కలిగి 100 హెచ్పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ పొందుతుంది. మహీంద్రా బొలెరో (Mahindra Bolero): మహీంద్రా బొలెరో మన జాబితాలో తక్కువ ధరలో లభించే ఉత్తమైన డీజిల్ కారు. ఇది రూ. 9.78 లక్షల నుంచి రూ. 10.79 లక్షల మధ్య లభిస్తుంది. ఇది 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్తో 76 హెచ్పి పవర్ 210 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ మైలేజ్ అందిస్తుంది. మహీంద్రా ఎక్స్యువి300 (Mahindra XUV300): ఎక్స్యువి300 మహీంద్రా కంపెనీకి చెందిన బెస్ట్ డీజిల్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 9.90 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్య ఉంది. మహీంద్రా ఎక్స్యువి300 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ద్వారా 117 హెచ్పి పవర్ 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్బాక్స్ పొందుతుంది. కియా సోనెట్ (Kia Sonet): దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ దేశీయ విఫణిలో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తున్న SUV లలో ఒకటి సోనెట్. ఈ డీజిల్ కారు ధర రూ. 9.95 లక్షల నుంచి రూ. 14.89 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్ అనే మూడు ఇంజిన్ ఎంపికలతో విక్రయిస్తోంది. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. టాటా నెక్సాన్ (Tata Nexon): భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్లలో ఒకటి టాటా నెక్సాన్. టాటా నెక్సాన్ డీజిల్ మోడల్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13.70 లక్షల మధ్య ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ద్వారా 115 హెచ్పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మంచి మైలేజ్ అందించే వాహనాల్లో కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. -
తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!
హైవేలపై పోలిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాల్లో ఆటోమాటిక్ కార్లను డ్రైవ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారణంగా మార్కెట్లో ఆటోమాటిక్ కార్ల వినియోగం మునుపటి కంటే ఎక్కువగా ఉంది, ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ 5 ఆటోమాటిక్ కార్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం. రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'క్విడ్' లాంచ్ చేసిన తరువాత విపరీతమైన అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఈ కారుకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. క్విడ్ RXT 1.0 EASY-R వేరియంట్ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి, 67 బీహెచ్పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కె10: భారతీయ మార్కెట్లో సరసమైన ధరలకు లభించే ఆటోమాటిక్ కార్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 ఒకటి. ఇందులో VXI AGS మోడల్ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 65.7 బీహెచ్పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: మారుతి ఎస్-ప్రెస్సో దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన, ఎక్కువ మంది కొనుగోలు చేసే కారు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో VXI (O) AGS ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 5.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది కూడా మారుతి ఆల్టో కె10 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ అందిస్తుంది. మారుతి సుజుకి సెలెరియో: మారుతి సుజుకి సెలెరియో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే హ్యాచ్బ్యాక్. సెలెరియో ఆటోమేటిక్ వెర్షన్ ప్రారంభ ధరలు రూ. 6.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 1.0-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 65.7 బీహెచ్పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కూడా తక్కువ ధరలు లభించే బెస్ట్ ఆటోమాటిక్ కారు. దీని ప్రారంభ ధర రూ. 6.53 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో బీహెచ్పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. -
హరిత గృహ రుణాలపై ఐఐఎఫ్ఎల్: వారికి ప్రత్యేక డిస్కౌంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణానికి అనుకూలమైన, హరిత గృహాల ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ జోనల్ హెడ్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు) శ్రీనివాసరావు రేకపల్లి తెలిపారు. నిర్దిష్ట నిబంధనలను పాటించే డెవలపర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నట్లు వివరించారు. అటు కీలక వ్యాపార విభాగమైన అఫోర్డబుల్ ఇళ్లకు సంబంధించి మరిన్ని రుణాలు అందించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25,300 కుటుంబాలకు రుణాలు అందించామని .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 50, తెలంగాణలో 35శాఖలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏపీలో మరో 10, తెలంగాణలో 15 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. -
ఎయిర్టెల్ 5జీ టారిఫ్ ధరలు, 4జీ తో పోలిస్తే
దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ టారిఫ్ ధరల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ మరికొన్ని రోజుల్లో 5జీ ప్లాన్స్ ధరల్ని ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..5జీ వినియోగదారులు తక్కువగా ఉండి, టారిఫ్ ధరలు ఎక్కువగా ఉంటే..ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెరగదని తెలిపారు. అదే సమయంలో థాయిల్యాండ్లో 5జీ నెట్ వర్క్ను వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉందని, అందుకు కారణం ఈ ఫాస్టెస్ట్ నెట్ వర్క్ టారిఫ్ ధరలు ఎక్కువగా ఉండడమేనని అన్నారు. కాబట్టే భారత్లో 4జీ తో పోలిస్తే 5జీ ధరలు ఎక్కువగా ఉండవని చెప్పారు. ‘టెలికం రంగంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ) కేవలం 7శాతం మాత్రమే ఉంది. ఆర్ఓఐ పెరిగలంటే అది ఏఆర్పీయూతోనే సాధ్యమని పేర్కొన్నారు. చదవండి👉ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
దేశంలో చైనా ఫోన్లను ‘బ్యాన్’ చేయం: కేంద్రం!
గత కొద్ది రోజులుగా చైనా స్మార్ట్ఫోన్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయనుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకోనుందని నివేదికలు హైలెట్ చేశాయి. చైనాకు చెందిన షావోమీ, రియల్మీ, వివో, ఒప్పోకు చెందిన రూ.12వేల లోపు బడ్జెట్ ఫోన్లను బ్యాన్ చేయనుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేస్తున్నారా? లేదా? అనే అంశంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. బడ్జెట్ ఫోన్లను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేయాలని చైనా ఫోన్ల తయారీ సంస్థల్ని కోరామని అన్నారు. అంతే తప్పా దేశంలో చైనా ఫోన్లను బ్యాన్ చేయాలనే ప్రతిపాదనలేదని తేల్చి చెప్పారు. దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచడమే ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే సహించం. సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. -
అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..!
ప్రముఖ లగ్జరీ బైక్ల తయారీదారు ట్రయంఫ్ మోటార్స్ సరికొత్త బైక్ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ట్రయంఫ్ టైగర్ లైనప్లో భాగంగా ‘టైగర్ స్పోర్ట్ 660'ను మార్చి 29, 2022న భారత్లో విడుదల చేయనుంది. టైగర్ లైనప్లో ఎంట్రీ లెవల్, అత్యంత సరసమైన ధరలో ‘ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్స్ 660’ నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత వారం ట్రయంఫ్ మోటార్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొత్త బైక్ టీజర్ లాంచ్ చేసింది. భారత్లోని తమ టైగర్ లైనప్లో 850 స్పోర్ట్, టైగర్ 900 బైక్స్ ఉన్నాయి. వీటితోపాటుగా హై-పెర్ఫార్మెన్స్ టైగర్ 1200ని త్వరలోనే లాంచ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. డిజైన్ పరంగా...రాబోయే టైగర్ స్పోర్ట్ 660..LED హెడ్ల్యాంప్తో ఎయిర్ వెంట్, బైక్కు ముందు భాగంలో పొడవైన విండ్స్క్రీన్తో స్పోర్టీ లుక్ను పొందనుంది. రేడియేటర్ కౌల్ను కూడా కలిగి ఉంటుంది.ట్రయంఫ్ మోటార్స్ టైగర్ స్పోర్ట్ 660, మిడ్-సైజ్ స్పోర్ట్ టూరర్గా ఉండనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్లను కలిగి ఉండే అవకాశం ఉంది. బైక్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్తో రానుంది. టైగర్ స్పోర్ట్ 660 ఇంజన్ విషయానికి వస్తే...ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ఇంజన్ను పోలీ ఉండనుంది. 660cc ఇన్లైన్-త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 81 hp శక్తిని, 64 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ట్రెయిన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్తో 6-స్పీడ్ ట్రాన్స్మిషన్కు జత చేసే అవకాశం ఉంది. ఈ బైక్ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. రాబోయే ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 బైక్ ధర రూ. 8.5 లక్షలుగా ఉండవచ్చని అంచనా. కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్టి వంటి బైక్లకు పోటీగా నిలవనుంది. చదవండి: ఆర్ఆర్ఆర్ ఎంట్రీ..పీవీఆర్తో కొత్త దోస్తీ..ఊహించిన లాభాలు సొంతం...! -
బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్ట్లీ
సాక్షి, హైదరాబాద్: గృహాల ధరల్లో బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ. పదేళ్లలో రెండు నగరాల మధ్య నివాస ధరల్లో తేడాలొచ్చేశాయి. 2010లో బెంగళూరులో 48 శాతంగా ఉన్న అఫర్డబులిటీ హౌసింగ్ ఇండెక్స్.. 2020 నాటికి 28 శాతానికి తగ్గింది. అదే హైదరాబాద్లో దశాబ్ద క్రితం 47 శాతంగా ఉండగా.. ఇప్పుడది 31 శాతానికి తగ్గింది. ఇక దేశంలోనే అత్యంత సరసమైన గృహా నిర్మాణ మార్కెట్గా అహ్మదాబాద్ నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్ 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని నైట్ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని అఫర్డబులిటీ హౌసింగ్ ఇండెక్స్–2020ని విడుదల చేసింది. అఫర్డబులిటీ ఇండెక్స్ అనేది సగటు గృహానికి సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐ), ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. దీన్ని నగరాల్లోని గృహాల ధరలు, వడ్డీ రేట్లు, ఆదాయంలో వృద్ధి, కొనుగోలుదారుని సామర్థ్యం వంటి విభాగాల్లో కదలికలను బట్టి అంచనా వేశారు. గృహాల ధరలలో క్షీణత, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా హౌసింగ్ అఫర్డబులిటీ మెరుగవ్వటానికి ప్రధాన కారణాలని నైట్ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. అఫర్డబులిటీ నిష్పత్తి 50 శాతానికి మించితే.. బ్యాంక్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి గృహ రుణాలు పొందటం కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇతర నగరాల్లో.. ముంబై అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్ 61 శాతంగా ఉంది. పదేళ్ల క్రితం ఇక్కడ రేషియో 93 శాతంగా ఉంది. ఎన్సీఆర్లో 53 శాతం నుంచి 38 శాతానికి, పుణేలో 39 శాతం నుంచి 26 శాతానికి, చెన్నైలో 51 శాతం నుంచి 39 శాతానికి, కోల్కతాలో 45 శాతం నుంచి 30 శాతానికి అఫర్డబులిటీ హౌసింగ్ రేషియో తగ్గాయి. చదవండి: బంగారం కొనే వారికి గుడ్న్యూస్ ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త! -
రిలయన్స్ నుంచి 'సస్టైనబుల్ ఫ్యాషన్'
సాక్షి, ముంబై: టెలికాం రంగంలో ఇటీవల జియో సాధించిన విజయం నుంచి పొందిన స్ఫూర్తితో.... పర్యావరణహిత (సస్టెయినబుల్) దుస్తులను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ముందుకు వచ్చింది. 'సస్టైనబుల్ ఫ్యాషన్'కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్ఐఎల్ పెట్రోకెమికల్స్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ షా మాట్లాడుతూ పర్యావరణహిత నుంచి ఫ్యాషన్ ను తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామనీ, ఇదొక సుస్థిరదాయక కార్యక్రమని అన్నారు. తాము ఈ సస్టైనబుల్ ఫ్యాషన్ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని.. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందన్నారు. రిలయన్స్ పెట్రో ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచం మొత్తంలో తొలి కంపెనీ తమదే అన్నారు. భారతదేశంలో పెట్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసే ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమేనని, ఏటా రెండు బిలియన్ల మేరకు ఉపయోగించిన పెట్ బాటిల్స్ ను ప్రాసెస్ చేస్తోందన్నారు. ప్రకృతికి ఎలాంటి హాని కలగని రీతిలో అతి తక్కువ కర్బన పదార్ధాలతో ఉండే దుస్తులను యువతరం కోరుకుంటోంది. ప్రతీ సంవత్సరం దాదాపు రెండు బిలియన్ల బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్నామని షా తెలిపారు. దీనిని రాబోయే రెండేళ్లలో ఆరు బిలియన్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమని విపుల్ స్పష్టం చేశారు. ఈ విధానంలో తాము అనుసరించే విధానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.రానున్న రెండేళ్ళలో దాన్ని ఆరు బిలియన్లకు పెంచాలని భావిస్తోంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా అందుబాటు ధరల్లో ఉండేలా, అందరినీ చేరుకునేలా సుస్థిరదాయక ఫ్యాషన్ కు అవసరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమనం కంపెనీ చెబుతోంది. ఒక వ్యూహం ప్రకారం రిలయన్స్ సుస్థిరదాయక ఫైబర్ ను, దుస్తులకు అది అందించే విశిష్టతలను ఆధారంగా చేసుకొని, అవే విశిష్టతలను అందించే సుస్థిరేతర ఉత్పాదనలకంటే పోటీ ధరలకు అందించాలని యోచిస్తోంది. ఈత దుస్తులు మొదలుకొని చలికాలపు దుస్తులు, బ్యాక్ ప్యాక్స్ దాకా అన్నిటికీ అంతర్జాతీయ బ్రాండ్లు రీసైకిల్డ్ మెటీరియల్ తో తయారు చేయనుంది. వ్యర్థ పెట్ బాటిల్స్ సేకరణ, వాటిని పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ గా రెక్రాన్ గ్రీన్ గోల్డ్ గా మార్చడం, టెక్స్ టైల్ వాల్యూ చెయిన్ లో వాటిని మరింత దిగువకు తీసుకెళ్తూ, ఫైబర్స్ ను అధిక విలువ కలిగిన స్లీప్ ఉత్పాదనలుగా, ఆర్ఎలాన్ ఆధారిత ఫ్యాషన్ దుస్తులుగా మార్చడం దాకా ఒక వలయాకారంలో ఈ ప్రక్రియ ఉంటుంది. ఉపయోగించిన పెట్ బాటిల్స్ ద్వారా ఉత్పత్తి చేసే గ్రే ఫైబర్ రెక్రాన్ గ్రీన్ గోల్డ్, డోప్ డైడ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ అనేది రెక్రాన్ గ్రీన్ గోల్డ్ ఎకో డి బ్రాండ్గా గుర్తింపు పొందాయనీ, ఈ పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ రిలయన్స్ రేపటి తరపు ఫ్యాబ్రిక్ శ్రేణి బ్రాండ్ అయిన ఆర్ఎలాన్ ఫ్యాబ్రిక్ 2.0 కు సుస్థిరదాయకత శక్తిని అందిస్తాయని షా తెలిపారు. 'సాధారణంగా వాటర్ బాటిల్స్ను ఖాళీ చేసిన తర్వాత వాటినే పారేస్తాం. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. త్వరగా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ డబ్బాలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడతాయి' అని షా పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఉపయోగకరమైన ఉత్పాదనలుగా మార్చడం అనే భావనపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒక బాధ్యతాయుత కార్పొరెట్ గా రిలయన్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2000 సంవత్సరానికి పూర్వమే ఇది మొదలైందన్నారు. అంతర్గత చర్యలను పటిష్ఠం చేసుకోవడంతో పాటుగా, యార్న్, టెక్స్ టైల్ తయారీదారులు, అగ్రగామి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, రిటైలర్లు, ఫ్యాషన్ హౌస్ ప్రతినిధులతో కూడుకొని ఉన్నతన హబ్ ఎక్స్ లెన్స్ ప్రోగ్రామ్ ద్వారా యావత్ టెక్స్ టైల్ పరిశ్రమతో సన్నిహితంగా కలసి పని చేస్తోంది. ఈ క్రమంలో యార్న్, టెక్స్టైల్, దుస్తుల తయారీదారులతో తమకంపెనీ భాగస్వామిగా మారింది. కో-బ్రాండెడ్ వస్త్రాలు, దుస్తులు తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించింది. యారో, రాంగ్లర్, రేమండ్, లీ లతో సహా ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో అది ఇప్పటికే భాగస్వామిగా మారిందని షా పేర్కొన్నారు. -
దిగ్గజాలకు షాక్...అతి తక్కువ ధరకే టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్లో దిగ్గజాలు శాంసంగ్,ఎల్జీ, సోనీ, షావోమీలాంటి సంస్థలకు షాక్చిచేలా బడ్జెట్ ధరలో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. డీటెల్ సంస్థ ఇపుడిక టీవీల రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతి చవకైన ఎల్సీడీ టీవీని లాంచ్ చేసింది. డీ 1 పేరుతో తీసుకొచ్చిన 19 అంగుళాల టీవీని కేవలం రూ.3,999 లకే అందిస్తోంది. డీ1 ఎల్సీడీ టీవీని ధర మొదట్లో రూ.4,999 గా ఉన్నప్పటికీ, తాజాగా రూ.3,999కే అందిస్తున్నామని డీటెల్ ప్రకటించింది. 19 అంగుళాల ఏ ప్లస్గ్రేడ్ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చని, 1366x768 రిజల్యూషన్, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్లు , 12 వాట్స్ రెండు స్పీకర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే ఈ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు డీటెల్ అధికారిక వెబ్ సైట్ గాని, మొబైల్ యాప్ గాని సంప్రదించాలి. అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, పార్ట్నర్లు B2BAdda.com అనే వెబ్సైట్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడిచింది. నూతన ఆవిష్కరణలు కస్టమర్లను ఉత్సాహపరుస్తాయనే విశ్వాసాన్ని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా వ్యక్తం చేశారు. టీవీల రేట్లు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో ప్రతి ఇంటికి టీవీ అనే తమ మిషన్లో భాగంగా సరసమైన ధరలో టీవీలను వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో తమ టీవీ లక్షలాది మందిని ఆకట్టుకుంటుందన్నారు. కాగా గతంలో 299 రూపాయిలకే డీటెల్ ఒక ఫీచర్ ఫోన్ను లాంచ్ చేసింది. -
వోడాఫోన్ దూకుడు : మరో ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం సంస్థ వోడాఫోన్ రీచార్జ్ ప్లాన్లో పరిచయడం చేయడంలో దూకుడుగా ఉంది. ప్రత్యర్థులకు సవాల్గా అందుబాటు ధరలో మరో రీచార్జ్ ప్లాన్ను లాచ్ చేసింది. ముఖ్యంగా ఎక్కువ రోజుల వాలిడిటీతో రూ.200వందల లోపు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.189ల ప్రీపెయిడ్ ప్లాన్ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. రూ. 189ల ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, 2జీ డేటా ప్రయోజనాలను వోడాఫోన్ అందిస్తోంది. అయితే ఎస్ఎంఎస్ల ఆఫర్ లేదు. అలాగే కాల్స్ వినియోగంలో కూడా పరిమితులు విధించింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం రోజువారీ 250 నిమిషాలు, వారానికి 1,000 నిమిషాలు వాడుకునేలా నిబంధన విధించింది. అంటే వాయిస్ కాలింగ్లో ఈ పరిమితి దాటితే సెకనుకు పైసా చొప్పున చార్జ్ చేయనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. జియో, ఎయిర్టెల్, ఐడియా అందిస్తున్న ఈ తరహా ప్లాన్లు అన్నీ రూ.200కు పైనే వసూలు చేస్తున్నాయి. జియో 198 రూపాయల ప్లాన్లో 56జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. రోజుకు 100ఎంఎస్ఎస్లు ఆఫర్ చేస్తోంది. అయితే ప్లాన్ వాలిడిటీ మాత్రం రూ.28రోజులు. ఇటీవల రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. అన్లిమిటెడ్ కాల్స్, 4జీబీ 4జీ/3జీ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందులో కూడా ఎస్ఎంఎస్ ఆఫర్ లేదు. ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. మరోవైపు జియో అందిస్తున్న 84 రోజుల వాలిడిటీ ఉన్న రూ.399 ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ వినియోగించుకోవచ్చు. -
అద్భుత ఫీచర్లు..బడ్జెట్ ధర: కొత్త ట్యాబ్
సాక్షి, న్యూఢిల్లీ: స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో ట్యాబ్ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, 16జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ ప్రధాన ఫీచర్లుగా స్వైప్ స్లేట్ ప్రొ పేరుతో దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. రూ. 8499 ధరలో ఇది ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో లభించనుంది. స్వైప్ స్లేట్ ప్రొ ఫీచర్లు 10.1 హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ మార్షమిల్లౌ 1.1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 32 జీబా దాకా విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్కార్ట్ 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది.