amendments
-
జీఎస్టీలో కొత్త సవరణలు..
పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది. ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు. -
చట్టాల కోరలు తీశారు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది. -
18 సవరణలు చేయాలి
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే 18 రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమవుతాయి. కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. దానికోసం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 325ని సవరించాల్సి ఉంటుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ‘ఆరి్టకల్ 324ఏ’కు సవరణ అవసరం. ఈ రెండు అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చేవి కాబట్టి రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాలు సమ్మతి తెలపాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ తెలిపింది. -
‘వక్ఫ్’ అధికారాల కట్టడి!
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేస్తూ వక్ఫ్ చట్టానికి సవరణలకు కసరత్తు పూర్తి చేసింది. మొత్తం 40 సవరణలకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ప్రాపరీ్టగా గుర్తించే వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడమే సవరణల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డు క్లెయిం చేసే ఆస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడం కూడా సవరణల్లో ఒకటి. బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ చర్యలను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా ఖండించింది. వక్ఫ్ బోర్డుల అధికారాలు తదితరాల్లో ఎలాంటి జోక్యాన్నీ సహించేది లేదని ప్రకటించింది. అవసరమైతే కోర్టుకు వెళ్లయినా వీటిని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులు సుమారు 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి. వక్ఫ్ చట్టం 1995కు యూపీఏ ప్రభుత్వం 2013లో కొన్ని సవరణలు చేసి బోర్డుల అధికారాన్ని పెంచింది. పుణ్య, మతపరమైన లేదా ధారి్మక ప్రయోజనాల కోసం ఆస్తిని ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులను నియంత్రించడానికి చట్టం స్థాపించబడింది.ఈ భూములపై వచ్చే ఆదాయం పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధారి్మక కార్యక్రమాల నిర్వహణ కొరకు వాడాలి. దాతలు యిచి్చన ఈ భూముల్ని అమ్మే అధికారం వక్ఫ్ బోర్డుకు సైతం లేదు. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు విస్తృతమైన హక్కులున్నాయి. ఇలాంటి ఆస్తులను సర్వే చేయడానికి ఆలస్యమవుతోందని ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆస్తుల దురి్వనియోగాన్ని నివారించడానికి, వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించడంలో జిల్లా మేజి్రస్టేట్లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. మత స్వేచ్ఛకు వ్యతిరేకం: ఒవైసీ వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసే ప్రతిపాదనను ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ‘‘దీని వెనుక బీజేపీ హిందూత్వ ఎజెండా ఉంది. మత స్వేచ్ఛను దెబ్బతీయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకే ఈ సవరణలు. ఇది మతస్వేచ్ఛకు విరుద్ధం’’ అని ఆరోపించారు. -
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కొన్నింటికి సంబంధించినిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తెచి్చంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), టైమ్ డిపాజిట్ల పథకాల నిబంధనల్లో మార్పులు చేసింది. నూతన నోటిఫికేషన్ ప్రకారం.. పదవీ విరమణ ప్రయోజనాలు (నిధులు) చేతికి అందిన రోజు నుంచి మూడు నెలల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతా ప్రారంభించడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఇది ఒక నెలగానే అమల్లో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటని వారికే ఇది వర్తిస్తుంది. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన అనంతరం రెన్యువల్ చేసుకునే వారికి అప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటును అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర, రాష్ట్ర) అయి, 50 ఏళ్లు నిండిన అనంతరం మరణించినట్టయితే, అప్పుడు వచ్చే ప్రయోజనాలను జీవిత భాగస్వామి ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్లో ఒక శాతాన్ని మినహాయిస్తారు. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ను ఐదేళ్లు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక నుంచి అలా ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ను నాలుగేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు అమలయ్యే వడ్డీ రేటునే చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే మూడేళ్ల కాలానికి అమలయ్యే రేటును ఇస్తున్నారు. -
One Nation, One Poll: జమిలి ఎన్నికలు...కోవింద్తో లా కమిషన్ భేటీ
న్యూఢిల్లీ: ‘ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్ను కమిటీ ముందు ఉంచింది. లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్ను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే పురమాయింది. వాటితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతను కోవింద్ కమిటీకి అప్పగించింది. ఈ అంశంపై లా కమిషన్ రూపొందిస్తున్న నివేదిక ఇంకా తుది రూపు సంతరించుకోవాల్సి ఉందని సమాచారం. ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు అంశంపై అభిప్రాయాలు, సూచనలు 3 నెలల్లో చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు కోవింద్ కమిటీ తాజాగా లేఖలు రాసింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల పదవీకాలాలను పొడిగించడం, తగ్గించడం వంటి చర్యల ద్వారా 2029లో వాటికి సైతం లోక్సభతో పాటే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో లా కమిషన్ ప్రస్తుతం తలమునకలైంది. -
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు... ► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి. ► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. ► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. ► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు. -
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల నిబంధనలు కఠినతరం
ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సవరణలను ప్రతిపాదించింది. రూ. 25 లక్షలకు పైన బాకీ పడి, స్థోమత ఉన్నా చెల్లించడానికి నిరాకరిస్తున్న వారిని ఈ పరిధిలోకి చేర్చేలా నిర్వచనాన్ని మార్చనున్నట్లు ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ కోవకు చెందిన డిఫాల్టర్లకి రుణ సదుపాయాన్ని పునర్వ్యవస్థీకరించుకునేందుకు అర్హత ఉండదు. అలాగే ఇతరత్రా ఏ కంపెనీ బోర్డులోనూ పదవులు చేపట్టే వీలుండదు. బాకీలను వేగవంతంగా రాబట్టుకునేందుకు అవసరాన్ని బట్టి సదరు రుణగ్రహీతలు, హామీదారులపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొండిబాకీగా వర్గీకరించిన పద్దుకు సంబంధించి ఆరు నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేత అవకాశాలను సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదాపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 31లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు.. రాజ్యాంగ సవాళ్లు ఇవే..
ఢిల్లీ:జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీని నియమించింది. దానికితోడు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను ప్రకటించిన నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సరిపడా పోలింగ్ సామాగ్రి మన వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగ పరంగా కూడా చిక్కులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘One Nation One Election’ possible, Constitutional amendment needed: say experts Read @ANI Story | https://t.co/QkRUL3m1Vf#OneNationOneElection #ParliamentSpecialSession pic.twitter.com/AwHG1QF3Gq — ANI Digital (@ani_digital) September 1, 2023 ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు.. జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ఈ ఆరు ఆర్టికల్లలో విధివిధానాలను సవరించాల్సి ఉంటుంది. ► ఆర్టికల్ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం లోక్సభ గడువు ఐదేళ్లు. ముందుగా కూడా రద్దు చేయవచ్చు. ► ఆర్టికల్ 85: లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ప్రస్తుత సభ రద్దు అయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ ఆరంభం అవుతుంది. ► ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానంతరవరకు ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. ► ఆర్టికల్ 174(2): కేబినేట్ సూచన మేరకు అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. మెజారిటీ సందిగ్ధంలో ఉన్నప్పుడు గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ► ఆర్టికల్ 356: ఈ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మాణం విపక్షాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఈ ఆర్టికల్ల సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడొంతుల్లో రెండోంతుల సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సగం రాష్ట్రాల అసెంబ్లీలు దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వనరుల కొరత.. లోక్సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించినా.. ఎన్నికల నిర్వహణకు భారీ వనరులు అవసరమవుతాయి. 25 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లు, 25 లక్షల VVPATలు (ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం కేవలం 12 లక్షల ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో సిబ్బంది కూడా అవసరమవుతారు. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. విదేశాల్లో ఇలా.. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్ (రిక్స్డాగ్), ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
అసైన్డ్ భూముల సవరణ చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఈ–ఫైల్ విధానంలో ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తి, అతను లేకపోతే అతని వారసుల ఆదీనంలో ఆ భూమి ఉంటేనే యాజమాన్య హక్కులు కల్పించాలని సూచించారు. ఆ భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ఆదేశించారు. లంక భూములు, నీటి వనరులకు సంబంధించిన భూములకు ఇందులో నుంచి మినహాయించాలని సూచించారు. ఇందుకోసం వీఆర్ఓలు, తహశీల్దార్లు, ఆర్డీఓలు–సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చేయాలనే అంశాలను నిర్దిష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీఆర్ఓలు ఇలా చేయాలి.. రికార్డులను సంస్కరించడంలో (పీఓఎల్ఆర్–ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భాగంగా తహశీల్దార్లు వ్యవసాయం, ఇళ్ల పట్టాల కోసం అసైన్ చేసిన భూములను గుర్తించారు. వాటిని బట్టి వీఆర్ఓలు ఆన్లైన్ అప్లికేషన్ కోసం వివరాలను సమకూర్చాలి. ఇప్పటికే గుర్తించిన సర్వే నంబర్ల ప్రకారం ఆ భూముల డీకేటీ రిజిష్టర్లు, 1బీ, అడంగల్, 22 (ఎ) జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో వంద శాతం తనిఖీలు నిర్వహించాలి. ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పట్టాను పరిశీలించి, ఆ పట్టాదారు.. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? (ఒరిజినల్ అసైనీనా లేక లీగల్ హైరా), సంబంధిత భూమి వారి ఆ«దీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అది లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను కచ్చితంగా సేకరించాలి. ఇందుకోసం అన్ని రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించాలి. తహశీల్దార్ల పాత్ర వీఆర్ఓలు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్వే నంబర్లను తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మండలంలోని అన్ని అసైన్డ్ భూముల వివరాలు ఆ జాబితాలో ఉన్నాయో.. లేదో.. చూడాలి. ఈ కసరత్తులో ఏ అసైన్డ్ భూమిని వదిలి వేయకూడదు. ఒకవేళ ఏదైనా భూమిని వదిలివేసినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వివరాలను సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ (కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్) సెక్షన్కు ఈ–ఫైల్ విధానంలో పంపి కసరత్తులో చేర్చాలి. పక్కాగా తనిఖీ చేసిన తర్వాత తహశీల్దార్ అసైన్డ్ భూముల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిక్ నోటీస్ బోర్డులో పెట్టాలి. సూచనలు, అభ్యంతరాల కోసం 7 రోజుల సమయం ఇవ్వాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం రికార్డుల్లో 5 శాతాన్ని ఆర్డీఓలు తనిఖీ చేయాలి. జాయింట్ కలెక్టర్ల పాత్ర ఆర్డీఓలు/సబ్ కలెక్టర్లు తనిఖీ చేసిన 5 శాతం రికార్డుల్లో 1 శాతం రికార్డులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడాలి. వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు జరిగిన కసరత్తును పూర్తిగా పర్యవేక్షిస్తూ అన్ని దశల్లోనూ పారదర్శకంగా జరిగిందో లేదో పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 22 (ఎ) జాబితా నుంచి ఎంపిక చేసిన సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్లకు ముసాయిదా లేఖ సిద్ధం చేయాలి. కలెక్టర్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్కు పంపాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే విధంగా నిబంధనల ప్రకారం 22 (ఎ) నుంచి తొలగించాల్సిన అసైన్డ్ భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. అసైన్డ్ భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం కసరత్తు పూర్తయిన తర్వాత కలెక్టర్.. జిల్లా రిజిస్ట్రార్కు 22 (ఎ) నుంచి తొలగించాల్సిన సర్వే నంబర్ల జాబితాను పంపి, తర్వాత దాన్ని జిల్లా గెజిట్లో ప్రచురించాలి. -
‘370’ అనంతర మార్పుల్ని కశ్మీర్ ఆమోదించింది: అమిత్ షా
శ్రీనగర్: 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతర మార్పులను జమ్మూకశ్మీర్ ప్రజలు ఆమోదించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాద చర్యలు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు 70% తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కొత్త జమ్మూకశ్మీర్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మంత్రి శుక్రవారం శ్రీనగర్లో జరిగిన ‘వితస్త కల్చరల్ ఫెస్టివల్’కు హాజరయ్యారు. గత 30–40 ఏళ్ల జమ్మూకశ్మీర్ చరిత్ర మాత్రమే తెలిసిన వారు ఇది ఒక సమస్య అని, దీనిని వివాదాస్పద ప్రాంతంగానే భావిస్తారన్నారు. అదే జమ్మూకశ్మీర్ ఇప్పుడు వితస్త ఉత్సవాలు జరుపుకుంటోందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదంతో బలైన 42 వేల మంది ప్రజల బాధ్యతను ఎవరు తీసుకుంటారని అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్(పీడీపీ)లను ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370తో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఆయన నివాళులర్పించారు. -
ఐటీ రూల్స్లో సవరణలు ఉపసంహరించండి
న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు కేఆర్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్ఎస్కు ఉందని గుర్తుచేశారు. మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్ రూల్స్లో ప్రస్తావించలేదని కేఆర్పీ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్ఎస్ సెక్రెటరీ జనరల్ మేరీ పాల్ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
‘దహీ’పై వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
చెన్నై/బెంగళూరు: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్ ‘కర్డ్’కు బదులుగా హిందీలోని ‘దహీ’ముద్రించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కి తగ్గింది. కర్డ్ను కొనసాగిస్తూనే పక్కనే సమానార్థం.. తెలుగులో అయితే పెరుగు, కన్నడలో మొసరు, తమిళమైతే తాయిర్ అని ప్రాంతీయ భాషను ముద్రించవచ్చని స్పష్టతనిస్తూ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్కు బదులుగా హిందీ సమానార్ధం ‘దహీ’ని ముద్రించాలంటూ ఈ నెల 10వ తేదీన ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తమిళనాడు కో ఆపరేటివ్ మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ ‘ఆవిన్’బ్రాండ్తో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) నంది బ్రాండ్తో పెరుగును విక్రయిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎప్పటిలాగానే తమిళ ‘తాయిర్’నే వాడుతామని, ‘దహీ’అని మాత్రం వాడబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐకి సమాధానమిచ్చింది. అధికార డీఎంకే పార్టీ ‘నహీ టు దహీ’అంటూ ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘దహీ’వివాదంపై తమిళనాడు బీజేపీ విభాగం అభ్యంతరం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్తో తీసుకువస్తున్న పెరుగు ప్యాకెట్లపై హిందీ దహీ పక్కన బ్రాకెట్లలో కన్నడ (మొసరు) ముద్రించాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన మార్గదర్శకాలపై రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఈ చర్య కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనన్నారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. -
రాజకీయాలతో ప్రమేయమున్నా పీఎంఎల్ఏ పరిధిలోకి..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను కూడా రిపోర్టింగ్ సంస్థలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి) తప్పనిసరిగా రికార్డు చేసేలా పీఎంఎల్ఏ చట్టానికి సవరణలు చేసింది. అలాగే, లాభాపేక్ష రహిత సంస్థల (ఎన్జీవో) ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు లేదా దేశాధినేతలు, సీనియర్ రాజకీయ నేతలు, సీనియర్ ప్రభుత్వ ..న్యాయ .. మిలిటరీ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, కీలకమైన రాజకీయ పార్టీల అధికారులు పాటు ఇతర దేశాల తరఫున ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీఈపీల పరిధిలోకి వస్తారని ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఆర్థిక సంస్థలు తమ ఎన్జీవో క్లయింట్ల వివరాలను నీతి ఆయోగ్కి చెందిన దర్పణ్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా క్లయింట్లతో వ్యాపార సంబంధాలు ముగిసిన తర్వాత కూడా అయిదేళ్ల పాటు రికార్డులను అట్టే పెట్టాల్సి ఉంటుంది. ఈ సవరణ కారణంగా పీఈపీలు, ఎన్జీవోల ఆర్థిక లావాదేవీల రికార్డులను రిపోర్టింగ్ సంస్థలు తమ దగ్గర అట్టే పెట్టుకోవడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినప్పుడు వాటిని అందించాల్సి ఉండనుంది. ఇప్పటివరకూ రిపోర్టింగ్ సంస్థలు తమ క్లయింట్ల గుర్తింపు ధృవీకరణ పత్రాలు, వ్యాపారపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, అకౌంటు ఫైళ్లూ, రూ. 10 లక్షల పైబడిన నగదు లావాదేవీలు మొదలైన వివరాలను రికార్డు చేయాల్సి ఉంటోంది. ఇకపై క్లయింట్ల రిజిస్టర్డ్ ఆఫీసు చిరునామా, కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రదేశం వంటి వివరాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. -
ఆన్లైన్ గేమింగ్కు స్వీయ నియంత్రణ సంస్థ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ఎంఈఐటీవై) విడుదల చేసింది.వీటి ప్రకారం ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసుకోవాల్సి రానుంది. అలాగే తప్పనిసరిగా ప్లేయర్ల ధ్రువీకరణ, భారత్లో భౌతిక చిరునామా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. గేమ్స్ ఫలితాలపై బెట్టింగ్ చేయడానికి ఉండదు. వీటిపై పరిశ్రమ వర్గాలు జనవరి 17లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని ఎంఈఐటీవై సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తుది నిబంధనలు ఫిబ్రవరి తొలి నాళ్లలో ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగం వృద్ధికి, నవకల్పనలకు ప్రోత్సాహమివ్వాలనేది నిబంధనల ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. 200 బిలియన్ డాలర్ల పైచిలుకు విలువ గల పరిశ్రమలో స్టార్టప్లు, పెట్టుబడులపరంగా ఎదిగేందుకు భారత్కు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 2021లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోసం రూపొందించిన కొత్త ఐటీ నిబంధనల పరిధిలో ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు పని చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. -
టికెట్ డౌన్గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించాలి
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికుల టికెట్లను ఇష్టానుసారంగా డౌన్గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించుకోవాల్సి రానుంది. పన్నులు సహా టికెట్ పూర్తి విలువను ప్యాసింజర్కి తిరిగి ఇవ్వడంతో పాటు సదరు ప్రయాణికులను తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రస్తుత నిబంధనలను సవరించే పనిలో ఉంది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు ముగిశాక తుది నిబంధనలను జారీ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక తరగతిలో బుక్ చేసుకున్న టికెట్లను విమానయాన సంస్థలు ఇష్టారీతిగా కింది తరగతికి డౌన్గ్రేడ్ చేస్తున్నాయంటూ తరచుగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు చర్యలు చేపట్టింది. విమాన సేవలను వేగవంతంగా విస్తరించాల్సి వస్తుండటం, ప్యాసింజర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో ఎయిర్లైన్స్ ఇలా చేయాల్సి వస్తోంది. ‘ఉదాహరణకు ప్రయాణికులు .. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీలో టికెట్ బుక్ చేసుకుని ఉండవచ్చు. అయితే, సీట్లు అందుబాటులో లేకపోవడం లేదా విమానాన్ని మార్చాల్సి రావడం వంటి కారణాల వల్ల చెకిన్ సమయంలో వారి టికెట్లను దిగువ తరగతికి డౌన్గ్రేడ్ చేసే పరిస్థితి ఉంటోంది. అయితే, ఇలా డౌన్గ్రేడ్ చేస్తే ప్రయాణికులకు ఎయిర్లైన్ టికెట్ పూర్తి విలువ రీఫండ్ చేయడంతో పాటు తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లేలా ప్రతిపాదిత సవరణ ఉపయోగపడుతుంది‘ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనలు ఇలా.. బోర్డింగ్ను నిరాకరించినా, ఫ్లయిట్ రద్దయినా విమాన ప్రయాణికులకు పరిహారం లభించేలా ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. బుకింగ్ కన్ఫర్మ్ అయినా బోర్డింగ్ను నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా సదరు విమానం బైల్దేరే షెడ్యూల్ తర్వాత గంట వ్యవధిలోగా మరో ఫ్లయిట్లో సీటు కల్పించగలిగితే ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు. అదే 24 గంటల వరకూ పడితే వన్ వే ఛార్జీ, ఇంధన చార్జీలకు 200 శాతం అధికంగా పరిహారం చెల్లించాలి. గరిష్టంగా రూ. 10,000 పరిమితి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటేశాక సీటు కల్పిస్తే రూ. 20,000 గరిష్ట పరిమితికి లోబడి 400 శాతం వరకూ పరిహారం చెల్లించాలి. వీటితో పాటు ఫ్లయిట్ రద్దవడం తదితర అంశాలకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి. -
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇలా... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
ఏవియేషన్కు రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
న్యూఢిల్లీ: కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్జీఎస్కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
కమోడిటీ డెరివేటివ్లలో ఎఫ్పీఐలకు సై
ముంబై: ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్(ఈటీసీడీ) విభాగంలో కార్యకలాపాలు చేపట్టేందుకు సెబీ తాజాగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో మరింత లిక్విడిటీ, గాఢత పెరిగేందుకు వీలుంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజర్ల పాలనా సంబంధ నిబంధనల సవరణలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా కార్పొరేట్ బాండ్లు, రెపో లావాదేవీలకు సంబంధించిన లిమిటెడ్ పర్పస్ క్లయరింగ్ కార్పొరేషన్(ఎల్పీసీసీ)కు చెందిన ఎస్ఈసీసీ నియంత్రణల ప్రొవిజన్ల సవరణలకు సైతం ఓకే చెప్పింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)కి వార్షిక నివేదికను బోర్డు ఆమోదించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయనుంది. వ్యవసాయేతర విభాగం అన్ని రకాల వ్యవసాయేతర కమోడిటీ డెరివేటివ్స్లోనూ ట్రేడింగ్ చేపట్టేందుకు ఎఫ్పీఐలను సెబీ బోర్డు అనుమతించింది. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన ప్రామాణిక ఇండెక్సులలోనూ లావాదేవీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో నగదు ద్వారా సెటిల్ చేసుకునే కాంట్రాక్టుల్లో ట్రేడింగ్కు మాత్రమే ఎఫ్పీఐలకు వీలుంటుంది. ఈటీసీడీలో విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడం ద్వారా మార్కెట్లలో గాఢతను పెంచడంతోపాటు మరింత లిక్విడిటీకి అవకాశముంటుందని బోర్డు సమావేశం అనంతరం సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో సరైన ధర నిర్ణయాని(ప్రైస్ డిస్కవరీ)కి సైతం వీలుంటుందని తెలియజేసింది. ఈ విభాగంలో ఇప్పటికే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్లు), పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) తదితర కేటగిరీ–3 పెట్టుబడిదారులకు అనుమతి ఉంది. అర్హతగల విదేశీ సంస్థ(ఈఎఫ్ఈ)లు మార్గంలో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశీ ఫిజికల్ కమోడిటీల ట్రేడింగ్ను రద్దు చేయనుంది. అయితే ఈటీసీడీలలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా భారీ కొనుగోలు శక్తి కలిగిన ఎఫ్పీఐలను అనుమతించరు. తాజా నిర్ణయాల అమలు తేదీలను తదుపరి ప్రకటించనుంది. ప్రస్తుతం 10,000 ఎఫ్పీఐలు రిజిస్టరై ఉన్నప్పటికీ, పదో వంతు పార్టిసిపేట్ చేసినప్పటికీ మార్కెట్లు భారీగా విస్తరించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
ఫిరాయింపుల చట్టంలో సవరణలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
బెంగళూరు: పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవి మూకుమ్మడి ఫిరాయింపులకు దోహదం చేస్తున్నాయన్నారు. చట్టంలో సవరణలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పార్టీ మారదలిచిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలన్నారు. ఫిరాయింపుల కేసులపై నిర్ణయాన్ని స్పీకర్లు, చైర్పర్సన్లు, న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం వెలువరించేందుకు కాలపరిమితి ఉండాలన్నారు. స్థానిక సంస్థలను బలో పేతం చేయాల్సిన అవసరముందన్నారు. మీడియా పాత్ర కీలకం దేశంలోని పెనుమార్పుల్లో మీడియా పాత్ర నిర్ణయాత్మకమని వెంకయ్య అన్నారు. కనిపించని వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. తన పదవీకాలం మూడు నెలల్లో ముగుస్తుందని, మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఖాళీగా మాత్రం ఉండనని, ఏదో వ్యాపకాన్ని చేపడతానని తెలిపారు. -
ఎల్ఐసీలో ఎఫ్డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఐపీవో నిధుల వినియోగానికి కళ్లెం
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ నిధుల వినియోగంసహా మ్యూచువల్ ఫండ్ తదితర పలు విభాగాలలో నిబంధనలను సవరించింది. మంగళవారం(28న) సమావేశమైన సెబీ బోర్డు ప్రిఫరెన్షియల్ షేర్లు, ఫండ్ పథకాల నిలిపివేత, సెటిల్మెంట్ విధానాలు, కంపెనీ ఎండీ పునర్నియామకం, ఒత్తిడిలోపడ్డ రుణాలలో పెట్టుబడులు వంటి పలు మార్గదర్శకాలలో మార్పులకు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. ముందస్తు అనుమతి... సెబీ తాజా సవరణలు అమలులోకి వచ్చాక కంపెనీ ఎండీ, హోల్టైమ్ డైరెక్టర్ లేదా మేనేజర్ ఎంపికకు ఇకపై వాటాదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సాధారణ వాటాదారుల సమావేశంలో తిరస్కారానికి గురైన అధికారుల ఎంపిక లేదా పునర్నియామకానికి ముందస్తు అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇక మార్కెట్లను ముంచెత్తుతున్న పబ్లిక్ ఇష్యూలపైనా సెబీ దృష్టి సారించింది. 2022లో మరిన్ని కంపెనీల ఐపీవోల నేపథ్యంలో ఇష్యూ నిధుల విని యోగంపై ఆంక్షలు విధించింది. స్పష్టతలేని కంపెనీయేతర వృద్ధి అవకాశాలకు వినియోగించదలచిన నిధులకు ఇవి వర్తించనున్నాయి. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు ఐపీవోలో విక్రయానికి ఉంచదలచిన షేర్ల సంఖ్యపైనా పరిమితులు అమలుకానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50%కి లాకిన్ పిరియడ్ 90 రోజులకు పెరగనుంది. మిగిలిన వాటాకు ప్రస్తుత 30 రోజుల గడువే అమలుకానుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించే నిధులపైనా సెబీ పర్యవేక్షణ ఉంటుంది. కొత్త టెక్ ఐపీవోలు.. ఇటీవల కొత్తతరహా టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ చేపడుతున్న నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగుకు వీలుగా ఐపీవోలకు వస్తున్న కంపెనీల ధరల శ్రేణి నిర్ణయంపై ఆంక్షలు ఉండబోవని సెబీ చైర్పర్సన్ అజయ్ త్యాగి స్పష్టం చేశారు. ప్రైస్ డిస్కవరీ(ధరల నిర్ణయం) అనేది మార్కెట్ ఆధారితమని, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. సెబీ తాజా నిర్ణయాలలో భాగంగా ఒత్తిడిలోఉన్న రుణాల(ఆస్తుల)లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యేక సిట్యుయేషన్ ఫండ్స్(ఎస్ఎస్ఎఫ్లు)కు తెరలేవనుంది. కేవలం మొండి రుణాలలో ఇన్వెస్ట్ చేసేందుకే వీటిని ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల(ఏఐఎఫ్లు)లో ఉపవిభాగం కింద అనుమతించనున్నారు. దివాలా చట్టంలో భాగంగా ఆర్బీఐ నిబంధనలు అనుమతించిన మొండి రుణాల కొనుగోలుకే ఎస్ఎస్ఎఫ్కు అవకాశముంటుంది. ఈ బాటలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు, ఒత్తిడిలోపడ్డ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలలోనూ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రిఫరెన్స్ షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే కంపెనీలకు ధరల నిర్ణయం, లాకిన్ వంటి అంశాలలోనూ సెబీ నిబంధలను సరళీకరించింది. వీటితోపాటు లాకిన్ పీరియడ్లో ఉన్నప్పటికీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో పొందిన షేర్లను ప్రమోటర్లు తనఖాలో ఉంచేందుకు నిబంధనలను సరళీకరించింది. ఇక లిక్విడిటీగల కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూకి ఫ్లోర్ ధరను 90–10 రోజుల సగటు ధర కంటే అధికంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇల్లిక్విడ్ సెక్యూరిటీ విషయంలో రిజిస్టర్డ్ స్వతంత్ర విలు వ మదింపు సంస్థ ఫ్లోర్ ధరను నిర్ణయించవచ్చు. ప్రస్తుతం 2 లేదా గత 26 వారాల్లో అత్యధిక ధరను ఫ్లోర్ ధరగా నిర్ణయిస్తుండటం తెలిసిందే. ఎంఎఫ్ ఇన్వెస్టర్లు.. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూ సెబీ నిబంధనలను సవరించింది. వీటి ప్రకారం ఎంఎఫ్లకు చెందిన మెజారిటీ ట్రస్టీలు ఏవైనా పథకాలను నిలిపివేయదలిస్తే యూనిట్ హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసు కోవలసి ఉంటుంది. అంతేకాకుండా 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచి ఎంఎఫ్లు తప్పనిసరిగా దేశీ ప్రమాణాల ప్రకారం ఖాతాలను నిర్వహించవలసి వస్తుంది. ఇక సెటిల్మెంట్ దరఖాస్తులను కంపెనీలు షోకాజ్ నోటీసు జారీ అయిన 60 రోజుల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. అంతర్గత కమిటీ సమావేశం తదుపరి సవరించిన సెటిల్మెంట్ షరతులను 15 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. తద్వారా సెటిల్మెంట్ ప్రక్రియల నిబంధనలను క్రమబద్ధీకరించింది. -
ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు
న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. -
టెల్కోల మౌలిక సదుపాయాల షేరింగ్కు ఓకే
న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్వర్క్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్వర్క్లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది. ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్వర్క్లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్వర్క్లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు. 5జీ వేలంపై ట్రాయ్తో సంప్రదింపులు.. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ని కోరింది. -
కంపెనీల ఏర్పాటు నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం 2013లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ సవరించింది. సవరించిన నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సెక్షన్ 16 కింద ప్రస్తుత కంపెనీకి నూతన పేరును కేటాయించే విషయంలో మార్పులను తీసుకొచ్చింది. ఇదే సెక్షన్ కింద ఒక కంపెనీ పేరు మరో కంపెనీతో పోలి ఉంటే.. మార్చుకోవాలంటూ కేంద్రం ఆదేశించొచ్చు. ఇలా ఆదేశిస్తే మూడు నెలల్లోగా కంపెనీ పేరును మార్చుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల కింద నిర్ణీత గడువులోపు పేరు మార్పును అమల్లోకి తీసుకురాకపోతే.. అప్పుడు కంపెనీ పేరు చివర్లో ‘ఓఆర్డీసీ’ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేరుస్తుంది. -
భూమి పాస్బుక్లో తప్పులా? ఇలా సవరించుకోండి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లేకపోగా, అందులో కొన్నింటి పరిష్కారానికి ఆప్షన్లిచ్చింది. ఆధార్ నమోదులో తప్పులు, ఆధార్ వివరాలు సమర్పించకపోవడం, తండ్రి లేదా భర్త పేరులో తప్పులు, కులం మార్పు, సర్వే నంబర్ మిస్సింగ్, పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి అంశాలకు ఆప్షన్లు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలోని మీ–సేవ కేంద్రాలకు వెళ్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ల పరిశీలన అనంతరం.. మీ-సేవ కేంద్రాల్లో ఈ మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు నేరుగా కలెక్టర్లకు వెళ్తాయని, వారు పరిశీలించిన అనంతరం దరఖాస్తును ఆమోదిం చడం లేదా తిరస్కరించడం జరుగుతుందని సీసీఎల్ఏ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుల విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియ జేసి తదుపరి చర్యలు వివరిస్తారని తెలిపారు. కాగా, వీటితో పాటు ధరణిలో రిజిస్ట్రేషన్ల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే కొలిక్కి తేవాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అమల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, కంపెనీలకు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ, లీజు బదిలీ, రద్దు, సరెండర్, అమ్మకపు సర్టిఫికెట్లు, కన్వేయన్స్ డీడ్ విస్తీర్ణంలో తేడాలు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లకు, మైనర్లకు పాసు పుస్తకాల్లాంటివి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, 10 రోజుల్లో ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో గాడిలో పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
బ్యాంకుల ప్రైవేటీకరణకు చట్ట సవరణలు
న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే దిశగా రెండు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణలు చేయనుంది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం (సంస్థల కొనుగోలు, ట్రాన్స్ఫర్) 1970, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980లో నిర్దిష్ట సవరణలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగానే పలు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారని, ప్రైవేటీకరణ చేయాలంటే వీటిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వివరించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2021–22 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పీఎస్బీల ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. చదవండి: (టాటా ‘బిగ్బాస్కెట్ ’డీల్!) -
సీఎస్ఆర్ విషయంలో కంపెనీలకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం విషయంలో కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పిస్తూ కంపెనీల చట్టంలోని నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సీఎస్ఆర్ కింద ఒకటికి మించి ఎక్కువ సంవత్సరాల పాటు పట్టే ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతించింది. అదే విధంగా నిబంధనలకు మించి చేసిన అదనపు ఖర్చును తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో చూపించుకుని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే విధంగా సీఎస్ఆర్ కింద లబ్ధిదారులు లేదా ప్రభుత్వం పేరిట మూలధన ఆస్తుల (క్యాపిటల్) కొనుగోలుకూ అనుమతించింది. కంపెనీల తరఫున సీఎస్ఆర్ కార్యక్రమాల అమలును చూసే ఏజెన్సీలకు 2021 ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ (నమోదును)ను తప్పనిసరి చేసింది. సీఎస్ఆర్ నిబంధనలను పాటించకపోవడాన్ని నేరపూరితం కాని చర్యగా మారుస్తూ.. దీని స్థానంలో పెనాల్టీని ప్రవేశపెట్టింది. ఒకవేళ సీఎస్ఆర్ కింద ఒక కంపెనీ చేయాల్సిన ఖర్చు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల్లోపు ఉన్నట్టయితే సీఎస్ఆర్ కమిటీ ఏర్పాటు నుంచి మినహాయింపునిచ్చింది. వ్యాపార సులభ నిర్వహణ విషయంలో భారత్ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. నిబంధనలను పాటించకపోవడాన్ని నేరంగా చూడకపోవడం, సీఎస్ఆర్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యాలతో తాజా సవరణలు చేపట్టినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీల చట్టం 2013 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖా సీఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లాభదాయక కంపెనీలు గడిచిన మూడేళ్ల కాల సగటు లాభంలో కనీసం 2% సీఎస్ఆర్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలకు అనుమతి.. సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల రూపకల్పన, పర్యవేక్షణ, విశ్లేషణ పనులను చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతించడం కూడా కేంద్రం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా ఉంది. కాకపోతే సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల అమలు బాధ్యతలను చూడ్డానికి వీల్లేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థలను అనుమతించడం వల్ల సీఎస్ఆర్ విభాగంలో అంతర్జాతీయంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలు, విధానాలను తీసుకొచ్చేందుకు వీలు పడుతుందని కార్పొరేట్ శాఖా తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నుంచి సీఎస్ఆర్ నిబంధనలు అమల్లోకి రాగా.. 2014–15లో రూ.10,066 కోట్లను కంపెనీలు ఖర్చు చేశాయి. ఇది 2018–19లో రూ.18,655 కోట్లకు విస్తరించింది. ఐదేళ్లలో రూ.79,000 కోట్లను కంపెనీలు వెచ్చించాయి. -
హెచ్1బీ లాటరీకి చెల్లుచీటి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి స్వస్తి పలికింది. హెచ్–1బీ వీసాల మంజూరు విషయంలో మంచి వేతనాలు, నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ను శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. నూతన ఎంపిక ప్రక్రియ 60 రోజుల్లో అమల్లోకి రానుంది. హెచ్–1బీ వీసాకు భారీ డిమాండ్ ఉంది. ఇది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసాతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాలోనే నియమించుకోవచ్చు. అమెరికా ఐటీ కంపెనీలు ప్రతిఏటా భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను ఈ వీసా ద్వారానే రప్పించుకుంటున్నాయి. తదుపరి హెచ్–1బీ వీసా ఫైలింగ్ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. అమెరికాలోకి వలసలను నిరోధించే దిశగా ఇది మరో ప్రయత్నమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో భారతదేశ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పునఃసమీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం నోటిఫికేషన్పై ఐటీ వర్గాలు స్పందించాల్సి ఉంది. -
‘కార్పొరేట్’ బ్యాంకులకు సై..!
ముంబై: దేశంలో అంబానీ, అదానీ వంటి దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది. స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ఒకటి ప్రతిపాదించింది. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. పటిష్ట నిఘా ఇక్కడ కీలకాంశమని స్పష్టం చేసింది. అంతర్గతంగా గ్రూప్ సంస్థలకు రుణాలు, పరస్పర ప్రయోజనాలకు విఘాతాలు వంటి పలు అంశాల నేపథ్యంలో ఒక భారీ స్థాయి కార్పొరేట్ సంస్థకు పూర్తిస్థాయి బ్యాంకింగ్ లైసెన్సు మంజూరు చేయడానికి ఆర్బీఐ ఇప్పటివరకూ వెనకడుగు వేస్తూ వస్తోంది. ఈ అడ్డంకులు తొలగాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ యాక్ట్కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాను ప్రస్తుత 15% నుంచి 26%కి పెంచవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు 15 సంవత్సరాల కాల వ్యవధిని సూచించింది. దీనివల్ల పెయిడ్ అప్ క్యాపిటల్కు సంబంధించి ఓటింగ్ హక్కులు పెరుగుతాయి. భారత ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించి కార్పొరేట్ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాల సమీ క్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. బ్యాంకులుగా పెద్ద ఎన్బీఎఫ్సీలు: రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 ఏళ్లకు పైగా చక్కటి నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులుగా మార్చే అంశాన్ని పరిశీలించవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ సూచించింది. కార్పొరేట్లు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకూ దీన్ని వర్తింపజేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై ఎన్బీఎఫ్సీలకు మరికొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించాలని సిఫారసు చేసింది. ఆదిత్య బిర్లా, బజాజ్, మహీంద్రా, టాటా గ్రూపులు ఇప్పటికే దశాబ్దానికి పైగా ఎన్బీఎఫ్సీలను నిర్వహిస్తున్నాయి. నిజానికి దేశంలో మధ్య మధ్య స్థాయి బ్యాంకులకన్నా ఈ ఎన్బీఎఫ్సీలు పెద్దవి కావడం గమనార్హం. కనీస ప్రారంభ మూలధనం పెంపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కనీస ప్రారంభ మూలధన్నాన్ని పెంచాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. బ్యాంకుల విషయంలో ఈ మొత్తాలను రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు... అలాగే చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచాలని పేర్కొంది. పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ వాటా... మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో ప్రైవేటు రంగం వాటా గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2000లో మొత్తం బిజినెస్లో ప్రైవేటు రంగం వాటా డిపాజిట్లకు సంబంధించి 12.63 శాతం ఉంటే, రుణాల విషయంలో ఈ రేటు 12.56 శాతంగా ఉండేదని వివరించింది. 2020లో ఈ శాతాలు వరుసగా 30.35 శాతం, 36.04 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులకు కోల్పోతున్నాయని తెలిపింది. మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న ప్రభుత్వ రంగ బ్యాలెన్స్ షీట్లే దీనికి కారణమని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగానికి మూలధనం కూడా పెద్ద సమస్యగా ఉండడం లేదని తెలిపింది. గడచిన ఐదేళ్లలో మార్కెట్ నుంచి ప్రైవేటు బ్యాంకులు రూ.1,15,328 కోట్లు సమీకరించగలిగితే, ప్రభుత్వ బ్యాంకుల విషయంలో ఈ మొత్తం రూ.70,823 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇందుకు అదనంగా ప్రభుత్వం నుంచి రూ.3,18,997 కోట్ల మూలధనం అందినట్లు వివరించింది. బ్యాంకింగ్ రంగంలో మార్పు! మొత్తంగా పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాలెన్స్ షీట్ల పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆరేడు బ్యాంకులతో విలీనం అయ్యాయి. దీనికితోడు ఇప్పటికే 3–4 బడా ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ బడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడమో లేక, వాటి ఎన్బీఎఫ్సీలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడమో చేస్తే అవి మరింత పోటీని ఇస్తాయి. దేశంలో పలు మధ్య తరహా బ్యాంకులకన్నా పెద్దవిగా మారతాయి. పెద్ద ఎన్బీఎఫ్సీల్లో ఏదైనా ఆర్థిక సమస్యలు తలెత్తితే అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం పడుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం, ఆర్బీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) వంటి సంస్థలు దివాలా తీయడం తెలిసిందే. -
బిల్లులకు వ్యతిరేకం కాదంటూనే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ కమిషన్ బిల్లులపై శాసన మండలిలో మంగళవారం వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులను స్వాగతిస్తున్నామంటూనే.. విపక్ష సభ్యులు సవరణలు ప్రతిపాదించి ఓటింగ్కు పట్టుబట్టారు. దీంతో ఇంగ్లిష్ మీడియం బిల్లులో తెలుగు మీడియం ఆప్షన్ పెట్టాలని, ఎస్సీ కమిషన్ బిల్లులో వర్గీకరణ అంశాన్ని పెట్టాలన్న సవరణలతో బిల్లును మండలిలో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982కు సవరణ తెస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు మంత్రి ఆదిమూలపు సురేష్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలో పాల్గొన్న పి. అశోక్కుమార్(టీడీపీ), మాధవ్ (బీజేపీ), విఠపు బాలసుబ్రహ్మణ్యం(పీడీఎఫ్) ఇంగ్లిష్కు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థులకు తెలుగు మాధ్యమం కూడా ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని సవరణను ప్రతిపాదించారు. దీనిపై మంత్రి సురేష్ మాట్లాడుతూ.. పేదలు ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు సన్నాయి నొక్కులు నొక్కుతూ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. టీడీపీకి అనుకూలమైన నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకించని ప్రతిపక్షాలు.. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం పెడితే అడ్డుకోవడం సరికాదన్నారు. తెలుగును తాము నిర్లక్ష్యం చేయడంలేదని, తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేశామని వివరించారు. దార్శనికుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు బంగారు భవిత ఇవ్వబోతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సవరణకు పట్టుబట్టడంతో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. విపక్ష సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో వారు ప్రతిపాదించినట్లు తెలుగు మాధ్యమం ఉండాలనే సవరణతో బిల్లును ఆమోదించారు. ఎస్సీ కమిషన్ బిల్లుకు వర్గీకరణ మెలికపెట్టిన టీడీపీ ఎస్టీ కమిషన్ బిల్లుకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆమోదం తెలిపిన టీడీపీ సభ్యులు, ఎస్సీ కమిషన్ బిల్లులో మాత్రం వర్గీకరణ అంశాన్ని మెలికపెట్టారు. తమ ప్రతిపాదనను బిల్లులో చేర్చాలని టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్, పలువురు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ సుప్రీం కోర్టు రద్దు చేసిందని, అటువంటి అంశాన్ని ఎస్సీ కమిషన్ బిల్లుకు ముడిపెట్టి అసలు లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సరికాదని ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, మంత్రి పినిపే విశ్వరూప్, సభ్యులు జంగా కృష్ణమూర్తి, చల్లా రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. అయినా విపక్షం ఓటింగ్కు పట్టుబట్టడంతో వర్గీకరణ అంశాన్ని చేర్చి సవరణతో బిల్లును ఆమోదించారు. అసెంబ్లీ ఆమోదించిన 16 బిల్లుల్లో సవరణలు ప్రతిపాదించిన రెండు బిల్లులు మినహా మిగిలిన 14 బిల్లులను మండలి ఆమోదించింది. ఒక పార్టీకి రెండు వైఖరులా? ఒక పార్టీకి ఎక్కడైనా ఒకే విధానం ఉండటం చూశానని, కానీ టీడీపీకి శాసనసభలో ఒక మాట, శాసన మండలిలో మరొక మాట చెబుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఎస్సీ కమిషన్, ఇంగ్లిష్ మీడియం బిల్లులపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆమోదిస్తే.. ఆ పార్టీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ కమిషన్ బిల్లుతో పేదలకు మేలు చేసే కార్యక్రమానికి, విద్యా చట్టం సవరణ బిల్లుతో పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులను బొత్స కోరారు. -
దివాలా కోడ్కు మరిన్ని సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్బీఎఫ్సీలకు బాసట.. సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. ఎన్హెచ్ఏఐ ‘ఇన్విట్’... ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్ఫ్రా అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్లో కేంద్రం భారత్మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో చేర్చాలని వచ్చిన పిటిషన్పై స్టే విధించడం కుదరదని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్, తదుపరి వాదనలపై ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరమున్నందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలను వెంటనే నిలిపి వేయాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలపై ధర్మాసనం ఈమేరకు స్పందించింది. కాగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం–2018 కింద నిందితులకు ఎలాంటి ముందస్తు బెయిల్ నిరాకరించరాదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణల బిల్లుకు గతేడాది ఆగస్టు 9న ఆమోదం తెలిపింది. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు ససేమిరా
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేధింపుల కేసులో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల్లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. 2018 మార్చి 20వ తేదీన ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీంకోర్టు సవరణలు చేసింది. ఈ సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని పునర్ నియమించాలని సూచించింది. ఈ పిటిషన్లపై విచారణకు జస్టిస్ యూయూ లలిత్ను చేర్చి తిరిగి ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ భాగమైనందున ఆయనను ఇందులో చేర్చాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ అరెస్టులను నిలువరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
తలాక్ చట్టం తెచ్చి తీరుతాం
గాంధీనగర్: సంప్రదాయవాదులు, ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తమ ప్రభుత్వం తెచ్చి తీరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉద్ఘాటించారు. దేశంలో గత ప్రభుత్వాలు స్త్రీల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోలేదనీ, తమ ప్రభుత్వం వచ్చాకనే మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగిన బీజేపీ మహిళా విభాగం ఐదవ జాతీయ సదస్సులో మోదీ ప్రసంగించారు. ట్రిపుల్ తలాక్ను నిషేధించే బిల్లును గతంలోనే లోక్సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ మోకాలడ్డడంతో కేంద్ర బిల్లుకు పలు సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లుపై లోక్సభలో ఈ నెల 27న చర్చ జరిగే అవకాశం ఉంది. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే భర్తలు బెయిలు పొందే అవకాశం కూడా తాజాగా ప్రభుత్వం కల్పించింది. అలాగే స్త్రీలు హజ్ యాత్రకు వెళ్లాలంటే పురుషులు తోడు ఉండాల్సిందేనన్న నిబంధనను కూడా తమ ప్రభుత్వం తొలగించిందని మోదీ చెప్పారు. 60–70 ఏళ్లుగా గత ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన మహిళలు ఇప్పుడు బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల (గ్యాస్ సిలిండర్ల పంపిణీ), ‘బాలికలను రక్షించండి, చదివించండి’ తదితర పథకాలను మోదీ ప్రస్తావించారు. వైమానిక, నౌకా దళాల్లోకి కూడా తమ ప్రభుత్వం మహిళలను అనుమతించిందన్నారు. విభజన శక్తులతో జాగ్రత్త సమాజంలో విభజన శక్తులు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కులం పేరిట దోపిడీలకు దిగుతున్నాయనీ, వారితో జాగ్రత్తగా ఉండాలని మోదీ పోలీసులకు సూచించారు. గుజరాత్లోని కేవడియాలో జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించారు. కులం పేరిట జనాలను విడగొట్టే విభజన శక్తులను క్షేత్రస్థాయిలో ఏకాకులను చేయాలని ఆయన పోలీసులను కోరారు. దేశ సమగ్రత, ఐక్యతల కోసం పోలీసులు పనిచేయడాన్ని కొనసాగించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నందుకు పోలీసులను మోదీ ప్రశంసించారు. ప్రత్యేకించి ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ పోలీసులను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారన్నారు. కింది స్థాయిలో ప్రజల కోసం కష్టించే పోలీసులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సలహా ఇచ్చారు. పలువురు నిఘా విభాగం (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పతకాలను మోదీ బహూకరించారు. జాతీయ పోలీస్ స్మారకంతో కూడిన పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. సైబర్ సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు. -
రైల్వేలో ఆన్లైన్ టికెట్ మోసాలకు చెక్!
న్యూఢిల్లీ: రైల్వేలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆన్లైన్ టికెట్ల మోసాలను అరికట్టేందుకు ఆ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైల్వే చట్టం– 1989కు సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్రమాలకు పాల్పడే వ్యక్తికి ప్రస్తుతం గరిష్టంగా విధిస్తున్న రూ. 10 వేల జరిమానాను రూ.2 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రతిపాదించిన ఈ సవరణలను రైల్వే బోర్డు ఆమోదించాల్సి ఉందన్నారు. -
‘జమిలి’కి లా కమిషన్ ఓకే
న్యూఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ కమిషన్ మద్దతు తెలిపింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని సూచించింది. దేశంలో ఏడాది పొడవునా నెలకొంటున్న ఎన్నికల వాతావరణాన్ని నిరోధించాలంటే జమిలియే మార్గమని అభిప్రాయపడింది. లా కమిషన్ మూడేళ్ల గడువు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో ఒకరోజు ముందు జమిలి ఎన్నికలపై ముసాయిదా నివేదికను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసింది. ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిని సమర్పించింది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, కొన్ని సవరణలు అవసరమవుతాయని పేర్కొంది. ‘జమిలి ఎన్నికలతో ప్రజా ధనం ఆదా అవుతుంది. పాలనా, భద్రతా అధికారులపై భారం తగ్గుతుంది. ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలుచేయడానికి వీలవుతుంది’ అని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. లోక్సభ, అసెంబ్లీ(జమ్మూ కశ్మీర్ మినహా) ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న మూడు అవకాశాలను సూచించింది. మొదటి అవకాశం.. ► కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కుదించి, మరికొన్నింటి గడువును పొడిగిస్తే 2019లో లోక్సభతో పాటు 12 రాష్ట్రాల(తెలంగాణ, ఏపీ సహా) అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చు. ఇందుకోసం రాజ్యాంగంలోని నిబంధన 172కు సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఇక మిగిలిన పదహారు రాష్ట్రాలకు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి 2019లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదు. వాటన్నింటికి 2021 సంవత్సరంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది. ► అది సాకారం కావాలంటే బిహార్ అసెంబ్లీ గడువును 13 నెలలు పెంచాలి. కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితిని 17 నెలలు కుదించాల్సి వస్తుంది. ► 2021 ఎన్నికల్లో కొలువుదీరే అసెంబ్లీల గడువు 30 నెలలు లేదా జూన్ 2024 వరకు(ఏది ముందైతే అది) ఉంటుంది. ఇలా అయితేనే 2024లో అన్ని అసెంబ్లీలు, లోక్సభకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది. రెండో అవకాశం.. 2019లో లోక్సభ, 12 అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి, 2021లో మిగిలిన 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒకేసారి ఎన్నికలు చేపట్టాలి. దీంతో ఐదేళ్లకోసారి రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయి. మూడో అవకాశం.. పై రెండు మార్గాల్లో జమిలి సాధ్యంకాని పక్షంలో ఒక ఏడాదిలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని(అసెంబ్లీ, లోక్సభ) ఒకేసారి నిర్వహించాలి. -
సమాచారానికి సవరణలా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత సాకారమైన సామాన్యుల కల సమాచార హక్కు చట్టం. పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి, అవినీతిని అంతం చేయడానికి 2005, అక్టోబర్ 12న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఈ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రంగా మారింది. దీనివల్ల దేశంలోని ఎన్నో కుంభకోణాలు వెలుగుచూశాయి. అనేక సంచలన విషయాలు లోకానికి తెలిశాయి. కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదటి నుంచి శీతకన్ను వేసిందనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీఐ అమలు విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను సామాజిక ఉద్యమకారులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందితే.. సమాచార హక్కు చట్టం పూర్తిగా నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పౌరుల స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లేనని చెబుతున్నారు. ప్రధాన అభ్యంతరాలు ఇవే. 1. చట్టానికి సవరణలు జరిగితే.. కేంద్రం, రాష్ట్ర పరిధిలో పనిచేసే సమాచార కమిషనర్లను కేంద్రమే నియమిస్తుంది. వారి జీతభత్యాలు, పదవీకాలం కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని సామాజిక ఉద్యమకారులు వాదిస్తున్నారు. అలా జరిగితే.. సమాచార వెల్లడిలో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2. ప్రస్తుతం సమాచార కమిషనర్ల పదవీకాలం ఐదేళ్లుగా ఉంది. లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పనిచేయవచ్చు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రంలోని చీఫ్ సెక్రటరీ హోదాకు సమానంగా ఉంటుంది. ఇకపై వీటి ప్రకారం.. ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచార కమిషనర్ల నుంచే వ్యతిరేకత..: కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలపై సమాచార కమిషనర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదాస్పద బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. సవరించాలనుకుంటున్న నిబంధనలు అవినీతి అధికారులకు రక్షణ కల్పించేలా ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఇకపై ప్రభుత్వం చేపట్టే పనుల్లో అధికారి పనిని మూల్యాంకనం చేసేందుకు ప్రజలకున్న హక్కును కొత్త సవరణలు కాలరాస్తాయని, దీని ఆధారంగా అవినీతి అ«ధికారులు చెలరేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాప్రయోజనం లోపిస్తాయని సమాచార కమిషనర్ మాఢభూషి శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కేంద్రం సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను సవరించాలని ప్రయత్నిస్తే ఉద్యమాల ఎదుర్కొనక తప్పదని ఆర్టీఐ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. -
ఆర్టీఐకి గండం గడిచినట్టేనా?
పదమూడేళ్లక్రితం పుట్టి, అడుగడుగునా గండాలే ఎదుర్కొంటున్న సమాచార హక్కు చట్టం మరో సారి త్రుటిలో ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నట్టు కనబడుతోంది. ఆ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టదల్చుకున్న బిల్లు నిలిచిపోయింది. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లును సభ ముందుంచాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు మీడియాలో వెలువడిన కథనాలే నిజమైతే పౌర సమాజ కార్యకర్తలు, ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పుడున్న చట్టాన్ని నీరుగార్చడానికే సవరణ బిల్లు తెస్తున్నారని విమర్శలు నలుమూలలా వెల్లువెత్తుతున్నా ఇన్నాళ్లూ ప్రభుత్వం మౌనముద్ర దాల్చింది. దీని వెనకున్న ఉద్దేశమేమిటో చెప్పాలని రెండు నెలలుగా పౌర సమాజ కార్యకర్తలు డిమాండు చేస్తున్నా జవాబు లేదు. విమర్శలు, ఆరోప ణలు వెల్లువెత్తుతున్నా అందులోని అంశాలను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఎకా యెకీ సభలో బిల్లు తీసుకొచ్చి, అంతగా దానిపై రభస జరిగితే ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపా లన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ ఎవరితో చర్చించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా రూపొందించిన ఈ బిల్లును అడ్డుకుంటామని విపక్షాలు గట్టిగా చెప్పడం వల్ల కావొచ్చు... చివరి నిమిషంలో సవరణ బిల్లు ప్రతిపాదనను వాయిదా వేశారు. జాతీయ స్థాయిలోని సమాచార ముఖ్య కమిషనర్(సీఐసీ), ఇతర సమాచార కమిషనర్లు... రాష్ట్రాల స్థాయిలోని సమాచార ముఖ్య కమిష నర్లు, ఇతర సమాచార కమిషనర్ల హోదాలు, జీతభత్యాలు, పదవీకాలం వగైరా నిబంధనలకు మార్పులు తీసుకొస్తూ వివిధ సెక్షన్లకు ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించారు. ప్రస్తుత చట్టం ప్రకారం సీఐసీకి ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదా, ఇతర కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల హోదా కల్పించారు. అలాగే రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్ల హోదాను, ఇతర కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాను ఇచ్చారు. జీతభత్యాలు కూడా వారి వారి హోదాలకు తగ్గట్టు నిర్ణయించారు. సమాచార హక్కు కమిషన్లో బాధ్యతలు నిర్వ ర్తిస్తున్నవారు ప్రభుత్వాల ఒత్తిళ్లకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఇవి దోహదపడ తాయని భావించారు. ఎన్నికల సంఘంలో పనిచేసేవారి విధులు... సమాచార హక్కు కమిషన్లో పనిచేసేవారి విధులు వేర్వేరు గనుక హేతుబద్ధం చేసేందుకు ఈ సవరణల తలపెట్టామని ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఎవరినీ నమ్మించలేదు. ఈ సవరణలు సమాచార హక్కు కమిషన్లోని కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ మొదలుకొని రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల వరకూ అంద రినీ అనిశ్చితిలో పడేస్తాయి. సర్కారు దయాదాక్షిణ్యాలకు విడిచిపెడతాయి. వారి బాధ్యతల నిర్వ హణలో అడుగడుగునా అడ్డం పడతాయి. 2004లో ఆర్టీఐ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ లకూ, వాటికి ముందు పార్లమెంటరీ స్థాయీ సంఘంలో వ్యక్తమైన అభిప్రాయాల స్ఫూర్తికీ ప్రస్తు తం తలపెట్టిన సవరణలు విరుద్ధమైనవి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే డిప్యూటీ కమిషన ర్లుండాలని ఆ బిల్లు ప్రతిపాదించగా, అది కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తుందని భావించి స్థాయీ సంఘం దాన్ని తొలగించింది. ఇప్పుడు ప్రభుత్వం వేరే రూపంలో ఆ పనే చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. అమెరికా, వివిధ యూరప్ దేశాలు పారదర్శకత విస్తృతిని నానాటికీ పెంచుకుంటున్నాయి. ఆసియా ఖండంలోని పలు దేశాలు కూడా ఆ దిశగానే కదులుతున్నాయి. ప్రజాస్వామ్య మూలాలు పటిష్టంగా ఉండాలంటే ఏ మినహాయింపూ లేకుండా పాలనా సంస్థలు పారదర్శకంగా పనిచేయా లని, చేసే ప్రతి చర్యకూ అవి జవాబుదారీ వహించాలని అన్ని సమాజాలూ భావిస్తున్నాయి. ప్రజల నుంచి ఒత్తిళ్లు నానాటికీ పెరగడంతో అన్నిచోట్లా ప్రభుత్వాలు దిగొస్తున్నాయి. పాలనలో దాపరికం లేనప్పుడే నిజాయితీ పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని జనం బలంగా విశ్వసి స్తున్నారు. కానీ అదేం దురదృష్టమో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో పాలకులు అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని, నీతినిజాయితీ లతో పాలిస్తామని హామీ ఇచ్చినవారే అధికారంలోకొచ్చాక అది తమ జాగీరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నిలదీసినవారి నోరు మూయించాలని చూస్తున్నారు. చిత్రమేమంటే 2005లో అమల్లోకొచ్చిన సమా చార హక్కు చట్టానికి మూలాలు 1976లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులోనే ఉన్నాయి. సమా చారం కోరడం పౌరుల ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాలుగు దశాబ్దాలనాడు సమాచార హక్కుపై చైతన్యం వచ్చిన దేశంలో ఆర్టీఐ చట్టానికి అడుగడుగునా ఇలా అడ్డంకులు ఎదురవుతుండటం దిగ్భ్రాంతికరం. ఈ చట్టానికి నారూ నీరూ పోసిన యూపీఏ ప్రభుత్వమే అది తనకు కంట్లో నలుసుగా మారుతున్నదని గ్రహించి ఏడాది తిరగకుండా దాన్ని నీరుగార్చాలని చూసింది. ఆ తర్వాత కూడా పలు ప్రయత్నాలు చేసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న తేడా లేకుండా దాదాపు అన్ని ప్రభుత్వాలూ సమాచార హక్కుకు నిరంతరం అడ్డం పడుతూనే ఉన్నాయి. కేంద్ర సమాచార కమిషన్లో నాలుగు స్థానాలు చాన్నాళ్లనుంచి ఖాళీగా పడి ఉన్నా భర్తీ చేయలేదు. దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈమధ్యే ముగ్గురు సమాచార కమిషనర్ల పేర్లను ఖరారు చేసింది. కేంద్ర సమాచార కమిషన్లోనూ, వివిధ రాష్ట్రాల్లోని సమాచార కమిషన్లలోనూ గుట్టగుట్టలుగా దరఖాస్తులు పడి ఉంటున్నాయి. ఫలితంగా పాలనలో పారదర్శకత తీసుకురావాలన్న ఆర్టీఐ చట్టం మౌలిక ఉద్దేశమే దెబ్బతింటోంది. ఈ పరి స్థితిని చూసి ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలను మందలించింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోదల్చుకున్నదో ఎక్కడా వెల్లడి కాలేదు. కానీ సభా ప్రవేశం చేయబోయి ఆగిన ఈ సవరణ బిల్లు ఆర్టీఐ చట్టాన్ని మరింత భ్రష్టు పట్టించేలా ఉంది. దీన్ని ఉప సంహరించుకోవడం తక్షణావసరం. -
జీఎస్టీ చట్టానికి 46 సవరణలు!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాలకు– సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, కాంపన్షేన్ ఆఫ్ స్టేట్స్ యాక్స్కు దాదాపు 46 సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రతిపాదిత సవరణలకు పార్లమెంటు ఆమోదం పొందితే ఉద్యోగులకు ఆహారం, రవాణా, బీమా వంటి సదుపాయాల కల్పనకు సంబంధించి యాజమాన్యాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని పొందగలుగుతారు. రివర్స్ చార్జ్ యంత్రాంగంలో మార్పులు, వివిధ వ్యాపార కార్యకలాపాలు ఉన్న కంపెనీలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ రద్దు, రిటర్న్ ఫైలింగ్లో నూతన నిబంధనలు, బహుళ ఇన్వాయిస్లను కలిపి కన్సాలిడేటెడ్ డెబిట్/క్రెడిట్ నోట్లు వంటి పలు అంశాలు జీఎస్టీ సవరణల ప్రతిపాదన కింద ఉన్నాయి. వీటికి కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 15వ తేదీలోపు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత వర్గాలను కోరింది. ఈ సవరణలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర పడితే, తదుపరి అనుమతికి జీఎస్టీ మండలికి వెళతాయి. తర్వాత సవరణలకు ఆమోదం నిమిత్తం పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల ముందు ప్రవేశపెడతారు. -
పోక్సో చట్టంతో బాలురకూ రక్షణ!
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు గురవుతున్న బాలురకూ రక్షణ కల్పించేలా పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కఠువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి గరిష్టంగా మరణశిక్ష విధించేలా కేంద్రం ప్రతిపాదించిన పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఇటీవల రాష్ట్రపతి ఓకే చెప్పడం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోక్సోకు తాజాగా మరో సవరణ తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులను పట్టించుకోవడం లేదని నిర్మాత, సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా ఆన్లైన్లో చేసిన ఫిర్యాదుకు మంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. -
నియమావళిని సవరిస్తాం
న్యూఢిల్లీ: ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలో సవరణలు చేపడతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. బాల్ ట్యాంపరింగ్, శ్రుతిమించిన స్లెడ్జింగ్లాంటి వ్యవహారాలను సీరియస్గా తీసుకుంటామని, కఠిన చర్యలకు ఊతమిచ్చేలా నియమావళిని మారుస్తామని ఆయన చెప్పారు. ‘త్వరలోనే మార్పులకు శ్రీకారం చుడతాం. నియమావళికి చెప్పుకోదగ్గ సవరణలు తీసుకొస్తాం. దీని వల్ల జరిగిన తప్పిదాలకు తగిన శిక్షలు వేసే ఆస్కారం ఉంటుంది. దీంతో తీవ్రమైన తప్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని అన్నారు. ఫుట్బాల్లో ఉన్నట్లు ఎల్లో, రెడ్ కార్డులను క్రికెట్లోనూ ప్రవేశపెడితే వచ్చే ప్రయోజనమేమీ తనకు కనబడటం లేదన్నారు. ‘ఇదివరకే దీనిపై ఐసీసీ చర్చించింది కూడా! మళ్లీ మరోసారి చర్చించాల్సిన అవసరముంది. అయితే ఈ కార్డులతో పరిస్థితిలో మార్పుంటుందని నేననుకోవడం లేదు’ అని రిచర్డ్సన్ తెలిపారు. -
‘చట్టం’తో కొత్త పట్నం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 63 నగర పంచాయతీలు, 5 మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణతో పనిలేకుండా.. నేరుగా చట్ట సవరణ ద్వారా పురపాలికలను ఏర్పాటు చేసేదిశగా కసరత్తు చేస్తోంది. కొత్త, పాత పురపాలక సంస్థల్లో 350 గ్రామ పంచాయతీలు, ఆవాసాలను విలీనం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం, రాష్ట్ర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ చట్టాలను సవరిస్తూ ముసాయిదా బిల్లులు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తోంది. 141కి చేరనున్న పురపాలికలు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 68 కొత్త పురపాలికలు ఏర్పాటైతే.. రాష్ట్రంలో మొత్తం పురపాలికల సంఖ్య 141కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1,24,90,739 కాగా.. కొత్త పురపాలికలతో ఈ సంఖ్య 1,46,47,857కు పెరగనుంది. శాతాల వారీగా చూస్తే.. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 శాతం నుంచి 45 శాతానికి పెరగనుంది. ఇప్పుడున్న చట్టాలకే సవరణలు! కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పేర్లతో పాటు ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేసే గ్రామ పంచాయతీల పేర్లను చేర్చుతూ రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని సవరించనున్నారు. అటు జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమయ్యే గ్రామాల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చుతూ సవరణలు చేయనున్నారు. సంబంధిత గ్రామ పంచాయతీల ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే.. వాటికి మున్సిపాలిటీ/నగర పంచాయతీ హోదా అమల్లోకి రానుంది. తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే.. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్, పురపాలక చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడం, లేదా ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ముందు ఆయా స్థానిక సంస్థల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై సంబంధిత గ్రామ ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను పరిష్కరించి రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. అనంతరం గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాలి. అప్పుడు సంబంధిత గ్రామానికి పంచాయతీ హోదాను ఉపసంహరిస్తూ.. పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అదే సమయంలో ఆ గ్రామాని మున్సిపాలిటీ హోదా/మున్సిపాలిటీలో విలీనం చేస్తూ పురపాలక శాఖ జీవో జారీ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకుండానే కొత్త పురపాలికల ఏర్పాటుకు ముందుకు వెళ్లడం, దానిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో కొత్త పురపాలికల ఏర్పాటు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రక్రియలేమీ లేకుండా నేరుగా పురపాలికల ఏర్పాటు కోసం ప్రభుత్వం చట్టాల సవరణకు నిర్ణయం తీసుకుంది. -
హిజ్రాల హక్కులను హరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: శతాబ్దం కిందట (1919) నిజాం కాలంలో హిజ్రాలకు సంబంధించి తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్ చట్టంలోని కొన్ని నిబంధనలు అత్యంత దారుణంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిబంధనలను తాము కొట్టేయడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలంది. రాజ్యాంగం అమల్లోకి రాక ముందు తీసుకొచ్చిన ఈ చట్టంపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. 15–16 ఏళ్ల బాలుడిని హిజ్రాలు తమ వద్ద ఉంచుకోవడం నేరమన్న ఈ చట్ట నిబంధనలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సమాజంలో పిల్లలపై అనేక రకాలుగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వీటిని కేవలం హిజ్రాలకే ఆపాదించడం ఎంత మాత్రం సరికాదంది. అలాగే హిజ్రాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని.. నాట్యం, సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నా అరెస్ట్ చేయవచ్చునన్న నిబంధనలు సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘి క సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ యూనక్స్ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దానిని కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన వి.వసంత, కేఎంవీ మోనాలీసా, మరొకరు హైకోర్టులో పిల్ వేశారు. హిజ్రాలపై ఇష్టానుసారం కేసులు.. విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 1919లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్ చట్టం నిబంధనలను అడ్డం పెట్టుకుని హిజ్రాలపై పోలీసులు ఇష్టానుసారం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. కర్ణాటకలో న్యాయపోరాటం చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం యూనక్ (నపుంసకుడు) అన్న పదాన్ని తొలగించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తెలంగాణ యూనక్స్ చట్టం అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 99 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టం కింద రాష్ట్రంలో కేసులెన్ని నమోదయ్యాయో పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ అన్నారు. గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
పక్కాగా మార్పులు, చేర్పులు
జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్చార్జి సీఈవో అనూప్సింగ్ సూచించారు. శుక్రవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో నూతన ఓటర్ల నమోదు, ఓట రు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి జనవరి 23వ తేదీ నుంచి ఈ నెల 14 వరకు చేపట్టే క్లెయిమ్, అభ్యంతరాల నమోదు ప్రక్రియ పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్చార్జి సీఈవో అనూప్సింగ్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఈ నెల 4, 11 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు, ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు. బూత్స్థాయి అధికారులు తప్పకుండా ఇంటింటికి వెళ్లేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఈ ఆర్వోలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 5న క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత మార్చి 15లోగా మొత్తం జాబితా అప్డేట్ చేయాలన్నారు. మార్చి 22న లోగా ఓటరు జాబితాను ముద్రించి 24న పబ్లికేషన్ చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా పర్యవేక్షణ అధికారిగా మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్ధ అదనపు డీడీ బూసాని వెంకటేశ్వర్రావును నియమించామన్నారు. ఓటరు జాబితా పర్యవేక్షకులు జిల్లాలో పర్యటించే తేదీలను నిర్ణయించి సమాచారం అందించాలన్నారు. పరిశీలకుల పర్యటన సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలన్నారు. అంతకు ముందే జిల్లా స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటరు జాబితా హార్డ్, సాఫ్ట్ కాపీలను వారి పరిశీలన కోసం అందజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు, జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో వినోద్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ జాన్సాంసన్, నియోజకవర్గ ఈఆర్వోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించాలి ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్చార్జి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ కార్యాలయంలోని ఆయా విభాగాలతో పాటు పరిసరాలను తిరిగి పరిశీలించారు. సెక్షన్ల వారీగా, కంప్యూటర్గది, డీఏవో, డీటీల గదులను పరిశీలించారు. రికార్డు గదికి వెళ్లి అక్కడ ఎన్నేళ్లకు సంబంధించిన రికార్డులున్నాయాని అడిగి తెలుసుకున్నారు. సంవత్సరం వారీగా రికార్డులను భద్రపర్చాలని ఆదేశించారు. కార్యాలయాలు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పనికి రాని పాత ఫర్నిచర్ ఉంటే తొలగించాలన్నారు. -
‘48 గంటల’ నిబంధన సమీక్షకు కమిటీ
న్యూఢిల్లీ: పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ఆపివేయాలనే నిబంధనపై సవరణలు సూచించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం ప్రచార పర్వాన్ని నిలిపివేస్తున్న పార్టీలు, అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇతర మార్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నట్లు సీఈసీ గుర్తించింది. ఇటీవలి గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిక్కి సమావేశం, టీవీల్లో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు, ప్రచారం ముగిశాక బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. వంటివి వివాదాస్పదంగా మారాయి. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు సమాచార, ప్రసార, న్యాయ, ఐటీ మంత్రిత్వ శాఖలతోపాటు నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్లు, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. -
రుణ ఎగవేతదారులకు చెక్
న్యూఢిల్లీ: రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడడమే తరువాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే, ఇందులో మార్పులు ఏంటన్నది ఆయన వెల్లడించలేదు. రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉన్నందున అప్పటి వరకు వివరాలు వెల్లడించడానికి లేదన్నారు. అయితే, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు... రుణ ఎగవేతదారుల ఆస్తులను (స్ట్రెస్డ్ అసెట్స్/ఎన్పీఏ) వేలం వేసినప్పుడు... వాటిని రుణ ఎగవేత చరిత్ర ఉన్న ప్రమోటర్లు, మోసపూరిత చరిత్ర కలిగిన ప్రమోటర్లు సొంతం చేసుకోకుండా నిరోధించడమే ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అలాగని, బ్యాంకులకు రుణ బకాయి పడిన కంపెనీల ప్రమోటర్లను వేలంలో పాల్గొనకుండా పూర్తి నిషేధం విధించడంగా దీన్ని చూడరాదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘కార్పొరేట్ పరిష్కార ప్రక్రియను అనుసరించేవారు, తమ బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకునే ప్రమోటర్లు కూడా ఉన్నారు. వీరిని ఐబీసీ కింద వేలం వేసే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంచడం లేదు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆర్డినెన్స్ స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వారి ఆస్తులు వారికే దక్కుకుండా..! ఐబీసీ కింద ఇప్పటికే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో 300 కేసులు పరిష్కారం కోసం దాఖలయ్యాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది జూన్లో 12 భారీ ఎన్పీఏ ఖాతాలను ఐబీసీ కింద పరిష్కారం కోసం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఈ 12 ఖాతాలకు సంబంధించిన రుణ ఎగవేతల మొత్తం రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఖాతాల్లో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, మోనెత్ ఇస్పాత్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎరా ఇన్ఫ్రా, జైపీ ఇన్ఫ్రాటెక్, ఏబీజీ షిప్యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిలో 11 కేసులు ఎన్సీఎల్టీలో దాఖలు కాగా, దివాళా ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్బీఐ 30 నుంచి 40 ఎన్పీఏ ఖాతాలతో ఐబీసీ కింద చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులకు మరో జాబితా కూడా పంపించింది. అయితే, ఐబీసీ కింద కంపెనీల ఆస్తులను వేలానికి ఉంచినప్పుడు బిడ్ వేసే వారి అర్హతలు ఏంటన్నది చట్టంలో నిర్దేశించలేదు. దీంతో రుణాలు ఏగవేసిన ప్రమోటర్లే తిరిగి ఆస్తులను తక్కువ ధరలకు సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇందుకు ఎస్సార్ స్టీల్ కేసే ఉదాహరణ. ఎస్సార్ స్టీల్ రూ.37,284 కోట్ల బకాయిలు బ్యాంకులకు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఐబీసీ పరిష్కార ప్రక్రియ కింద ఎస్సార్ స్టీల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎస్సార్ గ్రూపు ఆసక్తి వ్యక్తీకరించడం గమనార్హం. ‘‘ఈ విధమైన ఆందోళనల నేపథ్యంలో దివాళా చట్టం కింద ఆస్తులకు అర్హత కలిగిన వారే బిడ్ వేసే విధంగా చూసేందుకు చట్టంలో సవరణలు ప్రతిపాదించాల్సి వచ్చింది’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఇతర నిర్ణయాలు... 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆర్థిక సంఘం తన సిఫార్సులను సమర్పించేందుకు రెండేళ్ల సమయం తీసుకోవడం సాధారణం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉంటాయి. ఈబీఆర్డీలో సభ్యత్వం యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఈబీఆర్డీ)లో భారత సభ్యత్వం తీసుకునేందుకు కేబినెట్ ఇచ్చింది. దీంతో తయారీ, సేవలు సహా వివిధ రంగాలకు కావాల్సిన నిధుల సమీకరణ సులభం కానుంది. ఈబీఆర్డీలో సభ్యత్వం తీసుకునేందుకు అవసరమైన చర్యల్ని ఆర్థిక వ్యవహారాల విభాగం చేపడుతుందని జైట్లీ తెలిపారు. ఐఐసీఏకు రూ.18 కోట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ)కు రూ.18 కోట్ల సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకానికీ కేబినెట్ ఆమోదముద్ర పడింది. ఇక ఐటీ చట్టాల్లో భారీ మార్పులు! సమీక్ష కోసం అత్యున్నత స్థాయి కమిటీ న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్మోదీ కన్వీనర్గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది. -
భూసేకరణ చట్టానికి 3 సవరణలు
-
భూసేకరణ చట్టానికి 3 సవరణలు
- రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మూడు సవరణలు కోరింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సూచించిన ఈ సవరణలను కేంద్ర న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటనలో కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిసినప్పుడు ఈ అంశం చర్చకొచ్చింది. న్యాయశాఖ తరఫున క్లియరెన్స్ ఇచ్చేందుకు సూచనప్రాయంగా కేంద్ర మంత్రి అంగీకరించారు. కేంద్రం సూచించిన సవరణలు చేసేందుకు, కోరిన వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. అయితే ఏమేం సవరణలు చేయాలనే విషయంలో కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి వచ్చే ప్రతిపాదనల ప్రకారం తగిన మార్పులు చేయాల్సి ఉంటుందని, అవసరాన్ని బట్టి మరోసారి అసెంబ్లీలో సవరణలకు ఆమోదం తీసుకోవాలా లేదా ఆర్డినెన్స్ రూపంలో కేంద్రానికి పంపాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నాయి. ప్రధానంగా రాష్ట్రం పంపించిన బిల్లులో పొందుపరిచిన ప్రయోజనాలను 2014కు ముందున్న నిర్వాసితులకు సైతం అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సవరణ కోరినట్లు తెలిసింది. మిగతా రెండు సవరణలు బిల్లులోని పలు పదాల్లో మార్పులు తప్ప మరేమీ కాదని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును శాసనసభ ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపించింది. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
రిటర్నుల సవరణ పేరుతో మోసం చేస్తే చర్యలు
ఆదాయపన్ను శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను రిటర్నుల్లో పెద్ద ఎత్తున సవరణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను గత సంవత్సరపు ఆదాయంగా చూపించే చర్యలకు పాల్పడితే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం ఓ వ్యక్తి గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేసిన రిటర్నులకు సవరణలు చేయవచ్చు. తాజాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు కొందరు... లెక్కల్లో చూపని తమ సంపదను గత సంవత్సరం ఆదాయంగా చూపించే ప్రయత్నం చేస్తుండడంతో ఆదాయపన్ను శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు గత సంవత్సరపు ఆదాయంగా చూపిస్తే 30 శాతం పన్నుతోనే బయటపడేందుకు అవకాశం ఉంది. కానీ ఐటీ శాఖ నోటీసులిచ్చి, ఇలా సవరించినట్లు తేలిస్తే.. భారీ పన్ను, జరిమానానూ చెల్లించాల్సి ఉంటుంది. లోపాల సవరణకే పరిమితం... ‘‘సెక్షన్ 139(5) అన్నది రిటర్నుల్లో ఏదైనా తప్పిదం, పొరపాటు ఉంటే సవరణ పేర్కొనడానికి మాత్రమే. అంతేకానీ, లోగడ పేర్కొన్న ఆదాయానికి గణనీయంగా మార్పులు చేసేందుకు కాదు’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తన ప్రకటనలో స్పష్టం చేసింది. నవంబర్ 8 తర్వాత (పెద్ద నోట్ల రద్దు) కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. -
మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ, మేం పట్టుకుంటే..
-
మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ
మేం పట్టుకుంటే..85% డిపాజిట్లలో లెక్కతేలని సొమ్ముపై సర్కారు కన్ను ♦ స్వచ్ఛందంగా వెల్లడిస్తే పన్ను 50 శాతమే ♦ మిగిలిన 50 శాతంలో 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు ♦ మరో 25 శాతంపై నాలుగేళ్ల లాకిన్.. వడ్డీ ఉండదు ♦ దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం ♦ ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్ యోజన పేరుతో కొత్త పథకం ♦ స్వచ్ఛంద వెల్లడికి గడువు డిసెంబర్ 30 ♦ వెల్లడించకుండా అధికారుల సోదాల్లో దొరికితే 85% పన్ను ♦ ఆదాయ పన్ను చట్టంలో సవరణలకు పార్లమెంటులో బిల్లు ♦ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై పడింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న సొమ్ములో నల్లధనాన్ని బయటికి లాగేందుకు కఠిన చర్యలు ప్రకటించింది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికంటూ మరో అవకాశమిచ్చింది. ఇందుకోసం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సవరణలు చేస్తూ సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పెద్దనోట్లు రద్దయిన తర్వాత నుంచి బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లలో.. ఆదాయ వివరాలను వెల్లడించని మొత్తాన్ని ప్రజలు డిసెంబర్ 30లోగా స్వచ్ఛందంగా ప్రకటిస్తే... దానిపై 50 శాతం వరకూ పన్ను (జరిమానా, సర్చార్జీతో కలిపి) చెల్లించి బయటపడొచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు ఈ లెక్కచెప్పని ఆదాయంలో 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు (లాకిన్). ఈ వ్యవధికిగాను కేంద్రం ఎలాంటి వడ్డీ కూడా చెల్లించదు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక వివరాలు వెల్లడించని మొత్తాలను ఐటీ శాఖ గనుక తన సోదాలు, పరిశీలనలో పట్టుకుంటే దానిపై ఏకంగా 85 శాతం వరకూ పన్ను(జరిమానా, సర్చార్జితో కలిపి) కట్టాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా రూ.8 లక్షల కోట్ల జమ నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ(డీమోనిటైజేషన్) ఈ నెల 8 రాత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్దనున్న పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో రూ.4 వేల చొప్పున మార్చుకోవడానికి మొదట డిసెంబర్ 31 వరకు గడువిచ్చిన సర్కారు (ఆర్బీఐలో మార్చుకోవడానికి మార్చి చివరిదాకా) ఆ తర్వాత దాన్ని ఈ నెల 24తో నిలిపివేసింది. అయితే ప్రజలు తమ వద్దనున్న పెద్దనోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువిచ్చింది. కాగా డీమోనిటైజేషన్ తర్వాత ఇప్పటివరకూ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు జమైనట్లు అంచనా. పన్ను మీద పన్ను... జరిమానా! బ్యాంకుల్లో జమవుతున్న డిపాజిట్లలో (రూ.500; రూ.1,000 నోట్ల రూపంలో) నల్లధనాన్ని (ఆదాయ వివరాలు వెల్లడించని మొత్తం) స్వచ్ఛందగా వెల్లడించేలా ప్రభుత్వం ఐటీ చట్టాల సవరణ బిల్లులో ప్రతిపాదించింది. దీనికోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై)–2016 పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద డిపాజిట్లలో నల్లధనాన్ని ప్రకటించినవారికి ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 30 శాతం పన్ను విధిస్తారు. ఈ 30 శాతం పన్నుపై 33 శాతాన్ని పీఎంజీకే సెస్సు రూపంలో వసూలు చేస్తారు. ఇది మరో 10 శాతం పన్ను కింద లెక్క. అదనంగా మరో 10 శాతాన్ని జరిమానాగా కూడా చెల్లించాల్సి వస్తుంది. అంటే లెక్కచూపని మొత్తంపై 50 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. పీఎంజీఎస్కే స్కీమ్ ఇదీ... డీమోనిటైజేషన్ తర్వాత డిపాజిట్ చేస్తున్న సొమ్ములో నల్లధనం ఉన్నవారు దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించిన పక్షంలో అందులో 25 శాతాన్ని పీఎంజీఎస్కే స్కీమ్లో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ముపై నాలుగేళ్ల లాకిన్ వ్యవధిని విధిస్తారు. అంటే నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకునే వీలుండదు. అదేవిధంగా ఈ పథకంలో జమ చేసిన మొత్తంపై ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం వడ్డీని కూడా చెల్లించదు. రిజర్వ్ బ్యాంక్తో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం ఈ స్కీమ్ను నోటిఫై చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అంటే.. సాగునీరు, ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం ఇతరత్రా ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పక్కర్లేదు: అధియా పీఎంజీకేవై స్కీమ్ వర్తింపు ఈ నెల 10 నుంచి జమ అయిన డాపాజిట్లకే వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. చివరి తేదీని బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై చేయనున్నామని... దాదాపు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉండొచ్చని ఆయన చెప్పారు. ఫైనాన్స్ చట్టం–2016లో కొత్తగా చాప్టర్ 9 కింద పీఎంజీఎస్కేను చేర్చినట్లు వివరించారు. ‘పీఎంజీకేవై స్కీమ్ కింద వెల్లడించిన ఆదాయ వివరాలకు సంబంధించి ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ వివరాలు చెప్పాల్సిందిగా ఐటీ శాఖ ప్రశ్నించదు. సంపద పన్ను, సివిల్ చట్టాలు, ఇతరత్రా పన్ను చట్టాల నుంచి దీనికి రక్షణ ఉంటుంది. అయితే ఫెమా, పీఎంఎల్ఏ, నార్కోటిక్స్, బ్లాక్మనీ చట్టాల నుంచి మాత్రం దీనికి ఎలాంటి రక్షణ ఉండదు’ అని అధియా వివరించారు. ఐటీ శాఖ పట్టుకుంటే గుల్లే... డిపాజిట్లలో బ్లాక్ మనీ ఉండి.. దాన్ని గనక ఐటీ శాఖ పట్టుకుంటే పన్ను, జరిమానా భారీగా విధించేలా ఐటీ చట్టాల్లో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. దీనిప్రకారం పీఎంజీకేవై స్కీమ్ గడువు పూర్తయ్యాక ప్రజలు నల్లధనం వివరాలను వెల్లడించినా.. లేదంటే ఆ తర్వాత ఐటీ శాఖ బయటపెట్టినా.. సదరు నల్లధనంపై 60 శాతం పన్ను విధిస్తారు. ఈ పన్నుపై మరో 25 శాతం సర్చార్జి (అంటే 15 శాతం అదనపు పన్ను) ఉంటుంది. మొత్తం కలిపితే 75 శాతం పన్ను విధించనున్నారు. అంతేకాదు ఆదాయ పన్ను (ఐటీ) అసెసింగ్ అధికారి అవసరమైతే ఈ 75 శాతం పన్నుకు అదనంగా మరో 10 శాతం జరిమానాను కూడా విధించేలా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. అంటే పట్టుకున్న నల్లధనంలో 85 శాతం వరకూ ప్రభుత్వపరం అవుతుందన్నమాట. ప్రస్తుత నిబంధనలూ కొనసాగుతాయ్... ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం (అండర్ రిపోర్టింగ్), లెక్కలు తారుమారు చేయడం (మిస్రిపోర్టింగ్) వంటి సందర్భాల్లో ఐటీ శాఖ విధిస్తున్న ప్రస్తుత జరిమానా నిబంధనలు చట్టంలో యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం వెల్లడించింది. వీటికి ఎలాంటి సవరణలు చేయడం లేదని తేల్చిచెప్పింది. అండర్ రిపోర్టింగ్కు సంబంధిత పన్నుపై 50 శాతం జరిమానా, మిస్ రిపోర్టింగ్కు పన్నుపై 200 శాతం జరిమానా ప్రస్తుతం అమల్లో ఉంది. ఇక ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన పన్ను చట్టాల (రెండో సవరణ) బిల్లు–2016లో ఐటీ చట్టంలోని 115బీబీఈ సెక్షన్ను సవరించేందుకు ప్రతిపాదించారు. దీనిప్రకారం వివరాలు వెల్లడించని డిపాజిట్లు, పెట్టుబడులు, నగదు, ఇతరత్రా ఆస్తులపై శిక్షాపూరిత పన్ను, సర్చార్జి, జరిమానా విధింపునకు ఈ సవరణలతో ప్రభుత్వానికి వీలవుతుంది. ఇక ఐటీ శాఖ సోదాలు–జప్తులకు సంబంధించిన కేసుల్లో పెనాల్టీ నిబంధనలను కూడా సవరించేందుకు తాజా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. దీని ప్రకారం బయటపడిన ఆదాయాన్ని నల్లధనంగా అసెసీ అంగీకరించి.. పన్ను రిటర్నులు వేసి, పన్ను చెల్లించేందుకు ఒప్పుకుంటే ఆ మొత్తంపై జరిమానాను ఇప్పుడున్న 10 శాతం నుంచి 30 శాతానికి పెంచనున్నారు. ఇతర కేసుల విషయంలో ఇప్పుడున్నట్లుగానే 60 శాతం జరిమానా కొనసాగుతుంది. మరో ఐడీఎస్ లాంటిదే.. నల్లధనం వెల్లడికి కేంద్రం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) రెండు నెలల క్రితమే(సెప్టెంబర్ 30తో) ముగిసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం నల్లధనం ఉన్నవాళ్లు తమ సొమ్మును ఐటీ శాఖకు వెల్లడించి 45 శాతాన్ని పన్ను రూపంలో కట్టేస్తే చట్టబద్ధ నగదుగా మార్చుకోవడానికి వీలు కల్పించింది. ఈ స్కీమ్ కింద దాదాపు దాదాపు రూ.65,250 కోట్ల నల్లధనం బయటికొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన పీఎంజీకేవై స్కీమ్ కూడా ఒకరకంగా ఇలాంటిదే. అయితే, ఇప్పుడు డిపాజిట్ చేసిన మొత్తంలో ఆదాయ వివరాలు లెక్కచెప్పని డబ్బుకు 50 శాతం పన్నును విధించనున్నారు. 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయడం(నాలుగేళ్ల లాకిన్) దీనికి అదనం. -
చెబితే 50 %, దాస్తే 85 %
• నల్లధన కుబేరులు కట్టాల్సిన పన్నుమొత్తాలివి • స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను • దాడుల్లో స్వాధీనం చేసుకున్నదానిపై 85 శాతం • ఆదాయ పన్ను చట్టానికి భారీ సవరణలు • ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన జైట్లీ • నోట్ల రద్దుపై కొనసాగిన ఆందోళనలు • ప్రధాని సభకు వస్తారని ప్రకటించిన రాజ్నాథ్ న్యూఢిల్లీ: నల్లకుభేరులకు మోదీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. భారీగా జరిమానా చెల్లించి నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం ఆదాయపన్ను చట్టానికి భారీ సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. సభలు వారుుదా పడేముందు తొలుత లోక్సభలోను, ఆ తర్వాత రాజ్యసభలో ఆయన ఐటీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. బిల్లులోని ప్రధానాంశాలు.. తమ వద్ద ఉన్న లెక్కల్లో చూపని ఆదాయాన్ని వెల్లడిస్తే 50 శాతం పన్నుగా చెల్లించాలి. మిగిలిన 50 శాతం కేంద్రం వద్ద ఉంటుంది. ఈ 50 శాతంలో వెంటనే 25 శాతం, నాలుగేళ్ల తర్వాత మరో 25 శాతం తీసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. 30 శాతం పన్ను, పది శాతం పెనాల్టీలపై 33 శాతం సర్ఛార్జి విధిస్తే దాదాపు 50 శాతం పన్ను అవుతుంది. అధికారులు దాడుల్లో నల్లధనాన్ని వెలికితీస్తే దానిపై ఫ్లాట్ 60 శాతం పన్ను విధిస్తారు. ఇందులో 25 శాతానికి సర్చార్జి (15 శాతం) కలిపితే మొత్తం దాదాపు 75 శాతం వరకూ పోరుునట్లే. దీనికి తోడు పన్ను అంచనా వేసే అధికారి మరో 10 శాతం పెనాల్టీ వేయాలని నిర్ణరుుంచే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు మళ్లించి దేశంలో వివిధ పేదరిక నిర్మూలన పథకాలు చేపట్టనున్నారు. కొత్త చట్టసవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని పార్టీలతోనూ చర్చలు ప్రారంభించింది. స్వల్ప కాలంలోనే ఈ చట్టం కింద చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజ్యసభలోనూ వారుుదాలు.. పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభ కూడా అట్టుడికింది. ఈ అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని.. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేశారుు. సభ ప్రారంభమైనప్పటి నుంచే కార్యకలాపాలకు అడ్డుతగిలారుు. ఈ క్రమంలో పలుమార్లు సభను వారుుదా వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే సమాజ్వాదీ పార్టీ సభ్యుడు బీజేపీ సభ్యుడిని ఉద్దేశించి ‘దలాల్’ (దళారీ) అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళన పెద్దనోట్ల రద్దు అంశంపైకి మళ్లింది. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. పలువురు సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపించకపోవడంతో సభను రేపటికి వారుుదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. క్యాస్ట్రోకు ఉభయ సభల నివాళి గత రెండు రోజుల క్రితం కన్నుమూసిన క్యూబా విప్లవ వీరుడు, మాజీ అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రోకు ఉభయ సభలు నిమిషం పాటు నివాళులర్పించారుు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ క్యూబా నాయకుడి విజయాలను ప్రస్తుతించారు. ‘వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన విజేత క్యాస్ట్రో... ఆయన మరణం క్యూబా ప్రజలకు, ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. అనంతరం రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుండగానే... ప్రతిపక్ష సభ్యులు పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ అమరావతి: పెద్దనోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలను సూచించడానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి నేతృత్వం వహిస్తారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. రూ.500, రూ.1,000 వెరుు్యనోట్లను రద్దు చేయాలని కోరుతూ బాబు గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుుతే రూ.రెండు వేల నోటును ప్రవేశపెట్టడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో నోట్ల రద్దు రగడ పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లో వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆందోళనలు కొనసాగారుు. ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చిన పెద్దనోట్ల రద్దుపై చర్చలో పాల్గొనాలని విపక్షాలు డిమాండ్ చేశారుు. లోక్సభ సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళన చేపట్టారుు. సభకు ప్రధాని వచ్చి చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారుు. ఈ ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్లకార్డులు, పేపర్లు ప్రదర్శించొద్దని స్పీకర్ సభ్యులకు సూచించారు. అరుునప్పటికీ అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభను వారుుదా వేశారు. తిరిగి భేటీ అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగదు కోసం ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారని, ఇది వరకే 70 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇచ్చిన వారుుదా తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అనుమతివ్వాలని కాంగ్రెస్తోపాటు టీఎంసీ, ఎస్పీ సభ్యులు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకు పరిస్థితి సద్దుమణగబోదన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ సుదీర్ఘ చర్చోపచర్చల తరువాతే నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పేదలకు ఇది మేలు చేస్తుందన్నారు. విపక్షాలు కోరుకుంటే దీనిపై ప్రధాని సభకు వచ్చి మాట్లాడుతారని చెప్పారు. దీనిపై ఏ నిబంధన కింద చర్చ జరపాలనేది స్పీకరే నిర్ణరుుస్తారని స్పష్టం చేశారు. -
పారదర్శకత దిశ గా పరుగు!
స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు నిబంధనల్లో సవరణలు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు నిబంధనల్లో సవరణలు చేసింది. ఈ బిల్లు స్థిరాస్తి కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అమల్లోకి వస్తే డెవలపర్లు ఇక నుంచి ప్రతి ప్రాజెక్ట్ను ప్రణాళికల దగ్గర నుంచి పూర్తి చేసే వరకూ పక్కాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా జైలులో ఊచలు లెక్కపెట్టాల్సిందే. అంతేకాదు కొనుగోలుదారులూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. మధ్యవర్తులూ అంతే. ఏమాత్రం తేడా వచ్చినా వీరికీ శ్రీకృష్ణ జన్మస్థానమే. ప్రస్తుతమున్న నిర్మాణాలూ బిల్లు పరిధిలోకే వస్తాయి కాబట్టి వీటిని గడువులోగా పూర్తి చేయక తప్పదు. ⇔ తాజా బిల్లు పరిధిలోకి చిన్న బిల్డర్లనూ చేర్చారు. దాదాపు 600 గజాల విస్తీర్ణం లేదా 8 ఫ్లాట్లు కట్టే బిల్డర్లు దీని పరిధిలోకి వస్తారు. గతంలో ఇది 1,200 గజాలుండేది. ఫ్లాట్లు కొనుగోలుచేసిన వారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయిన రెండు నెలల్లోపు ఇంటిని సొంతం చేసుకోవాలి. ⇔ కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతం సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలన్న నిబంధన కారణ ంగా నిర్మాణదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. అంటే కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ము ఆయా ప్రాజెక్ట్ అవసరాల నిమిత్తమే వాడుతున్నారన్న భరోసా కొనుగోలుదారులకూ కలుగుతుంది. ⇔ ఒకసారి ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాక కొనుగోలుదారుల అనుమతి లేకుండా ప్లాన్లు లేదా డి జైన్లు మార్చడానికి వీల్లేదు. దీనివల్ల ఇక నుంచి డెవలపర్లు నిర్మాణ పనుల్ని జరపడం కంటే ప్రణాళికల్ని రచించడంలోనూ అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ⇔ ప్రతి ప్రాజెక్ట్ను స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ-రెరా) వద్ద నమోదు చేయించాలి. నమోదు రుసుంను సగానికి తగ్గించారు. స్థిరాస్తి ఏజెంట్ల నమోదుకు వ్యక్తులైతే రూ.10 వేలు, సంస్థ అయితే రూ.50 వేలు చెల్లించాలి. ⇔ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద భూ యజమాని, నిర్మాణదారు, లే-అవుట్, అనుమతి పత్రాలు, ప్లాన్, ఆర్కిటెక్ట్, గుత్తేదారు, ఇంజనీర్ల వివరాలూ సమర్పించాలి. రెగ్యులేటరీ వ్యవస్థ పరిధిలో ఉంటుంది కాబట్టి పారదర్శకత పెరుగుతుంది. ఇందుకు రాష్ర్ట స్థాయిలో రెరా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ⇔ నిర్మాణం పూర్తయిన ఐదేళ్ల వరకు నిర్మాణ పరమైన లోపాలకు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు రూ.1,000 చొప్పున, స్థిరాస్తి అప్పిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లేందుకు రూ.5 వేలు చొప్పున చెల్లించాలి. ట్రిబ్యునల్ 60 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుం ది. ఆదేశాలను ధిక్కరిస్తే ఫ్లాట్ రుసుంలో 10 శాతం చొప్పున డెవలపర్లు, కొనుగోలుదార్లూ చెల్లించాల్సి ఉంటుంది. జైలు శిక్ష కూడా విధించవచ్చు. ⇔ ప్రాజెక్ట్లో కొనుగోలుచేసిన వారికి రుసుము తిరిగి ఇవ్వాలన్నా, పరిహారం చెల్లించాల్సి వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రామాణిక వడ్డీరేటుకు అదనంగా 2 శాతం జత చేసి ప్రమోటర్లు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీ నుంచి 45 రోజుల్లోగా ఇది చెల్లించాలి. ⇔ అపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వివరాలు అంటే ఫ్లాట్ల సంఖ్య, వసతులు, పార్కింగ్, ఓపెన్ ఏరియా, కార్పెట్ ఏరియాతో సహా వెల్లడించాలి. ప్రాజెక్ట్ స్టేటస్ ఫొటోలతో సహా వెబ్సైట్లో పొందుపరచాలి. నిర్మాణ సంస్థ ప్రమోటర్లు తమ పాన్ నంబర్ను ఇవ్వాలి. వార్షిక నివేదిక, బ్యాలెన్స్ షీట్, క్యాష్ స్టేట్మెంట్స్, ఆడిటర్ రిపోర్ట్స్ వంటివన్నీ అందించాలి. ఇబ్రహీంపట్నంలో జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ పరిధిలో జేబీ ఇన్ఫ్రా కొత్త వెంచర్ను ప్రారంభించింది. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద 125 ఎకరాల్లో సెరెన్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్, 100, 80, 60, 40 ఫీట్ల అంతర్గత రోడ్లు, కృష్ణా వాటర్, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్తో ఈ వెంచర్ను రూపొందిస్తోంది. గతంలో జేబీ ఇన్ఫ్రా ఆదిభట్ల, బొంగ్లూరు, ఎలిమినేడు, మంగల్పల్లి గ్రామ పరిధిలో 8 వెంచర్లను పూర్తి చేసింది. బిజినెస్ డెస్క్, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్డు నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్-500 034. realty@sakshi.com -
ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం
- ఎర్రచందనం అక్రమరవాణాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా - ఆస్తులను జప్తు చేసే అధికారం, బెయిల్కు వీలుకాని విధంగా కేసులు - ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్లో సమూల సవరణలు.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి విజయవాడ: ఎర్రచందనం దొంగల తాటతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ -1967లో సమూల సవరణలు తీసుకువచ్చింది. చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న వారిపై ఈ సవరణలతో కొరఢా ఝుళిపించనుంది. ఎర్రచందనం దొంగలకు కళ్లెం వేసేందుకు సవరణలు తెచ్చిన ప్రభుత్వం ఎర్రచందనం చెట్ల నరికివేత, తొలగింపు, రవాణా, నిల్వ చేయడం, దొంగలకు సహకరించడం, వాహనాన్ని వినియోగించడం వంటి వాటిని తీవ్రనేరాలుగా పరిగణిస్తుంది. ఈ నేరాలలో పట్టుబడితే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, పది లక్షల రూపాయల జరిమానా విధించేలా సవరణలు తీసుకువచ్చింది. వీరికి బెయిల్ కూడా మంజూరు కాదు. తొలిసారి ఈ చట్టం కింద పట్టుబడితే 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష, 3 లక్షల రూపాయలు తగ్గకుండా జరిమానా విధిస్తారు. ఇదే నేరం కింద రెండోసారి పట్టుబడితే 7 ఏళ్లు తగ్గకుండా జైలు శిక్ష, 5 లక్షల రూపాయలకు పైబడి జరిమానా విధిస్తారు. స్మగ్లింగ్ కు వినియోగించే వాహనాల యజమానులకు ఇవే శిక్షలు అమలు చేస్తారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన నేరస్తుల ఆస్తులను జప్తు చేసేలా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. స్మగ్లర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితుల పేరున ఆస్తుల కూడబెట్టినా వాటిని కూడా జప్తు చేసే అధికారం వుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 సవరణలకు రాష్ట్రపతి ఇప్పటికే ఆమోదం తెలిపారు. 20 కేజీలకు మించి ఎర్రచందనం నిల్వ చేసిన ప్రతీవారిపై కొత్త సవరణ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఎవరైనా 20 కేజీలకు మించి ఎర్రచందనం కలప వుంటే వెంటనే తమ పరిధిలోని డీఎఫ్ఓకు సమాచారం అందించాల్సి వుంటుంది. ఎర్రచందనం కేసులను డీఎస్పీ స్థాయి అధికారి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విచారిస్తారు. ఇకపై ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన అన్ని కేసులను సివిల్ కోర్టుల్లో విచారించేందుకు వీలుకాకుండా సవరణలు చేయడంతో సంవత్సరాల తరబడి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. శుక్రవారం విజయవాడలోని సీఎంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలిసిన డీజీపీ శ్రీ జేవీ రాముడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్-1967లో సవరణలపై వివరించారు. ఇక నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు సాగకుండా కట్టడి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీజీపీ సూచించారు. స్మగ్లర్లు, వారికి సహకరించేవారిపైనా కఠినంగానే వ్యవహరించాలని చెప్పారు. -
చెప్పినదానికంటే ఎక్కువ పరిహారం
కొత్త భూసేకరణ చట్టానికి సర్కారు సవరణలు హైదరాబాద్: కొత్త భూసేకరణ చట్టంలో పేర్కొన్న దానికంటే నిర్వాసితులకు ఎక్కువ పరిహారం చెల్లించడానికి వీలుగా సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడం కోసం ఎక్కువ పరిహారం చెల్లించడానికి అంగీకరించాలంటూ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్(భూసేకరణ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ‘సవరణ’ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త చట్టంలో సూచించిన సూత్రీకరణకు మించి పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించారని, అందుకు అనుగుణంగా సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలు ► నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ చర్చించి, పరస్పర ఆమోదయోగ్యమైన హేతుబద్ధమైన ధర నిర్ణయించాలి. ► {పతిపాదిత ప్యాకేజీ నిర్ణయించడానికి గల కారణాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ నివేదిక పంపించాలి. ► ప్యాకేజీలో భూమి ధర, భూమి కోల్పోతున్న రైతుకు అదనంగా ఇచ్చే పరిహా రం కలిపి ఉండాలి. అందులో ఉండే నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తులకు వేరుగా ధర నిర్ణయించి చెల్లించాలి. ► ఆర్ అండ్ బీ, హార్టికల్చర్ తదితర శాఖలతో సంప్రదించి ప్రతిపాదిత ప్యాకేజీలో హేతుబద్ధతను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ప్రభుత్వం ఆమో దం తెలిపిన తర్వాత నిర్వాసితులతో కలెక్టర్ ఒప్పందం కుదుర్చుకోవాలి. -
న్యాయనిపుణులతో చర్చిస్తాం
బెంగళూరు: లోకాయుక్త న్యాయమూ ర్తి వై.భాస్కర్రావును పదవి నుంచి తొల గించే అంశంపై న్యాయనిపుణులతో చర్చిం చి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పీకర్ కాగో డు తిమ్మప్ప వెల్లడించారు. బెళగావిలోని సువర్ణసౌధలో సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. లోకాయుక్తను పదవి నుంచి తొలగించాలని ప్రతి పక్షాల ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఇవ్వడంపై ప్రస్తుతం తాను స్పందించలేనని కాగోడు తిమ్మప్ప తెలిపారు. లోకాయుక్తను పదవి నుంచి తొలగించే అంశంపై ఉన్నట్లుండి నిర్ణయం తీసుకోలేమని, ఈ విషయానికి సంబంధించి న్యాయపరమైన చిక్కుల గురించి సైతం ఆలోచించాల్సి ఉంటుందని స్పీకర్ కాగోడు తిమ్మప్ప వెల్లడించారు. సవరణలు చేసే వరకు సాధ్యం కాదు లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్రావును ఆ పదవి నుంచి తొలగించే అంశానికి సంబంధించి చట్టసభల్లో చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్న నేపథ్యం లో సోమవారం సాయంత్రం స్పీకర్ నేతృత్వంలో శాసనసభా సలహా సమితి సభ జరిగింది. లోకాయుక్తను పదవి నుంచి తొలగించేందుకుగాను చర్చ చేపట్టడానికి గల సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు స్పీకర్ కాగోడు తిమ్మప్ప, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్, న్యాయమూర్తుల తొలగింపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సవరణలు తీసుకొచ్చే వరకు చట్టసభల్లో ఈ అంశంపై చర్చించడం సాధ్యం కాదని సలహా సమితికి వివరించారు. ముందుగా న్యాయమూర్తుల తొలగింపు చట్టంలో సవరణలు తీసుకురావాలని, ఆ తర్వాత మాత్రమే లోకాయుక్తను ఆ పదవి నుంచి తొలగించే అంశంపై చట్టసభల్లో చర్చించేందుకు సాధ్యమవుతుందని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేయడంతో తదుపరి చర్యలపై పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నారు. -
బిల్లులో సవరణలకు సిద్ధం!
సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం న్యూఢిల్లీ: స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భూసేకరణ బిల్లులో రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ పలు మార్పులకు అవకాశముందని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. భూయజమానుల్లో 70% మంది ఆమోదంతో పాటు భూసేకరణలో సామాజిక ప్రభావ అంచనాను తప్పనిసరి చేయాలన్న రైతుల డిమాండ్పై ప్రభుత్వం మంగళవారం విసృ్తతంగా చర్చించింది. రైతుల ఆందోళనలకు సంబంధించిన అంశాలను బిల్లులో చేర్చే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు మంత్రులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ‘ఈ బిల్లు విషయంలో వెనక్కుపోయే ప్రసక్తి లేదు కానీ రైతు ప్రయోజనాలకు సంబంధించిన సూచనలను స్వాగతిద్దాం’ అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ బిల్లు రైతులకు మేలు చేసేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన డిమాండ్లు, సలహాల ఆధారంగానే ఈ చట్టంలో సవరణలు పొందుపరిచామని మోదీ పార్టీ ఎంపీలతో అన్నారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సవరించాల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు, రైతు సంఘాల నాయకులతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చలు కొనసాగిస్తున్నారు. -
విభజన చట్టంలో సవరణలు: వెంకయ్యనాయుడు
-
విభజన చట్టంలో సవరణలు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: పునర్విభజన చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వం కొన్ని లొసుగులు, అనాలోచిత నిర్ణయాలతో చట్టం తెచ్చిందని విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్షం సరిగా వ్యవహరించడంలేదన్నారు. శారదా స్కాంలో సీబీఐ తన పని తాను చేస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ కేంద్రంతో కలిసి పనిచేయాలనుకోవడం మంచి పరిణామం అన్నారు.టీడీపీ, టీఆర్ఎస్తో విభేదాలు ఉన్నా, రెండు కొత్త రాష్ట్రాలకు కేంద్రం సాయం అందుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు. ** -
బిల్లుకు బీజేపీ సవరణలు...
-
బిల్లుకు బీజేపీ సవరణలు...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలను బీజేపీ సిద్ధం చేసింది. సీమాంధ్ర నుంచే ప్రధానంగా సవరణల ప్రతిపాదనలు వెళ్లినట్టు ప్రచారం జరగడం పార్టీలో వివాదానికి దారి తీసింది. బీజేపీ తెలంగాణ ప్రాంత నేతలూ సవరణల్ని కొద్దిరోజులక్రితం అధినాయకత్వానికి అందజేశారు. దీంతో ఇరుప్రాంతాలనుంచి అందిన సవరణల ప్రతిపాదనల్ని క్రోడీకరించి, వాటి నుంచి 9 సవరణల్ని బిల్లులో చేర్చడానికి సిద్ధం చేశారు. 1. తెలంగాణ, సీమాంధ్రల్లో వేర్వేరుగా హైకోర్టులు ఉండాలి 2. పోలవరం, ప్రాణహిత, పాల మూరు సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి 3. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు ఉంటే.. దాని భర్తీ బాధ్యత కేంద్రానిదే. కేంద్రం ప్రత్యేకంగా నిధులిచ్చి ఆ లోటు పూరించాలి 4. విద్యుత్ కొనుగోళ్లకు ప్రస్తు తం అమల్లో ఉన్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. ఇరు రాష్ట్రాలకు కొత్తగా ఒప్పందాలను వేర్వేరుగా చేయాలి 5. ఇరు వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీలను ఏర్పాటు చేయాలి 6. బిల్లులో ప్రస్తావించిన కేంద్ర వర్సిటీలతోపాటు, ఇతర విశ్వవిద్యాలయా లు, సంస్థల్ని రెండేళ్ల వ్యవధిలో నిర్మించాలి 7. ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఎన్నికలు జరపాలి 8. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనే దానిపై 45 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక ప్యాకేజీలకు కేంద్రమే నిధులివ్వాలి 9. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్ ప్రాంతాల్లో ఆదాయ పన్ను, ఎకై్సజ్ పన్ను రాయితీ ఇచ్చినట్లే రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల్లోనూ కొన్నేళ్ల వరకు ఇవ్వాలి -
ప్రతి క్లాజునూ ‘తొలగించండి’
విభజన బిల్లుకు సవరణలు ప్రతిపాదించిన వైఎస్సార్ కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుగా పేర్కొన్న క్లాజును ‘తొలగించండి’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఇదే తరహాలో బిల్లులోని మిగతా క్లాజులనూ తొలగించాలంటూ సవరణలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లుతుంది కనుక తాము విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. అందుకే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుగా పేర్కొంటున్న క్లాజ్ ఒకటి నుంచి ఆరో క్లాజ్ వరకూ, ఆ తర్వాత ఏడో క్లాజ్ నుంచి 108వ క్లాజ్ వరకు ప్రతి క్లాజును తొలగించాలంటూ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్కు సవరణ ప్రతిపాదనలు అందజేశారు. బిల్లులోని 1 నుంచి 6, 7 నుంచి 108 క్లాజులకు మొత్తంగా సవరణలు ప్రతిపాదిస్తూ పార్టీ ఎమ్మెల్యేలందరూ విడివిడిగా.. నిర్దేశిత ఫార్మాట్లో అసెంబ్లీ స్పీకర్కు అందజేశారు. పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఇదేవిధమైన సవరణను ప్రతిపాదిస్తూ బిల్లులో పొందుపరిచిన ప్రతి క్లాజును ‘తొలగించాలి’ అని సవరించాల్సిందిగా శాసనమండలి చైర్మన్కు నివేదించారు. ఈ క్లాజులను తొలగించాలన్న ప్రతిపాదనకు కారణాలను వివరిస్తూ.. ‘‘రాజ్యాంగ సంప్రదాయాలను, నిబంధనలను పాటించకుండా, మన రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా పూనుకున్న రాష్ట్ర విభజనను నేను వ్యతిరేకిస్తున్నాను. విభజన జరిగితే మిగిలిపోయే మిగతా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. వనరుల రాబడిలో అన్యాయం జరుగుతుంది. నీటి జలాల్లో రావాల్సిన వాటాలో హాని జరుగుతుంది. యువకులు ఉపాధి అవకాశాలను కోల్పోతారు. అంతేకాదు.. సామాజిక, విద్యా, వైద్య మౌలిక సదుపాయాలు కూడా కోల్పోతాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న మెజారిటీ ప్రజల విశాల ప్రయోజనాలకు భంగం క లిగిస్తుంది. రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచడమే ఉత్తమమని చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా ఈ విభజన జరుగుతోంది కనుక వ్యతిరేకిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.