Angelo Mathews
-
చండీమల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.తుది జట్లు..శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండోన్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్లకు నో ప్లేస్..! -
ఇంగ్లండ్తో టెస్టు.. ఎట్టకేలకు లంక పేసర్ అరంగేట్రం!
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. పేసర్ మిలన్ రత్నాయకేకు ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. మిలన్ ఆగమనం మినహా.. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్తో తలపడ్డ జట్టుతోనే ఇంగ్లండ్తో టెస్టులోనూ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.కాగా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆగష్టు 21న మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించగా.. మంగళవారం శ్రీలంక సైతం తమ ప్లేయింగ్ ఎలెవన్ను వెల్లడించింది.ధనంజయ డి సిల్వ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నె.. యువ క్రికెటర్ నిషాన్ మదుష్కతో కలిపి లంక ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక మిడిలార్డర్లో కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్ ఆడనుండగా.. కెప్టెన్ ధనంజయ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.అతడి తర్వాతి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ రానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండోతో పాటు కొత్తగా రత్నాయకే కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికి రెండు సార్లు జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నా తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. అయితే, ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా ఆ లోటు తీరనుంది.కాగా 28 ఏళ్ల మిలన్ రత్నాయకే ఫస్ట్క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఇందులో మూడు నాలుగు వికెట్ల హాల్స్, ఒక ఐదు వికెట్ల హాల్ ఉంది. ఇక 45 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన మిలన్ రత్నాయకే 47 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20లలో 24 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు మాత్రమే చోటు దక్కింది. ఇక పాతుమ్ నిసాంక, సదీర సమరవిక్రమ, రమేశ్ మెండిస్, నిసాల తారక, లాహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రే వాండర్సె బెంచ్కే పరిమితం కానున్నారు. కాగా 2016లో చివరగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక 0-2తో ఓటమిని చవిచూసింది. గత మూడు సందర్భాల్లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమి(ఎనిమిది టెస్టుల్లో ఏడు పరాజయం, ఒకటి డ్రా) పాలైంది.ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు:తుదిజట్లుఇంగ్లండ్డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.శ్రీలంకదిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే. -
సిక్సర్ల మోత మోగించిన ఫ్లెచర్, మాథ్యూస్
లంక ప్రీమియర్ లీగ్లో భాగంగా డంబుల్లా సిక్సర్స్తో ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్లో క్యాండీ ఫాల్కన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఐదుగురు బ్యాటర్లు కలిసి ఏకంగా 17 సిక్సర్లు బాదారు. వీరిలో ఆండ్రీ ఫ్లెచర్ (7), ఏంజెలో మాథ్యూస్ (5) మాత్రమే 12 సిక్సర్లు కొట్టారు. కమిందు మెండిస్, మొహమ్మద్ హరీస్ తలో 2, చండీమల్ ఓ సిక్సర్ బాదారు. బ్యాటర్లంతా తలో చేయి వేసి సిక్సర్ల మోత మోగించడంతో ఫాల్కన్స్ భారీ స్కోర్ చేసింది.ఫ్లెచర్, మెండిస్ అర్ద సెంచరీలుఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ ఫాల్కన్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (34 బంతుల్లో 60; ఫోర్, 7 సిక్సర్లు), కమిందు మెండిస్ (24 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 44 నాటౌట్; 5 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. డంబుల్లా బౌలర్లలో దుషన్ హేమంత ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. సోనల్ దినుషకు ఓ వికెట్ దక్కింది.హసరంగ మాయాజాలం223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిక్సర్స్.. హసరంగ (4-0-35-4), దసున్ షకన (4-0-29-3) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు (9 వికెట్ల నష్టానికి) మాత్రమే చేసి, 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్లో కుశాల్ పెరీరా (74) ఒక్కడే రాణించాడు. -
శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య కొనసాగుతున్న "రివెంజ్ వార్"
ఇటీవలికాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య ప్రతీకార చర్యలు ఎక్కువై పోయాయి. ఈ ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ఎప్పుడు ఎదురుపడ్డా కొట్టుకున్నంత పని చేస్తున్నారు. వన్డే వరల్డ్కప్ 2023 సందర్భంగా మొదలైన ఈ రివెంజ్ వార్.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ అనంతరం పతాక స్థాయి చేరింది. THE CINEMA OF WORLD CRICKET. - The Nagin Rivalry. 😄💪 pic.twitter.com/hiNpdUD0MD — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 వరల్డ్కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా హెల్మెట్ సమస్య కారణంగా లంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ను టైమ్డ్ అవుట్గా ప్రకటించారు. బంగ్లా ఆటగాళ్ల అనైతిక అప్పీల్ కారణంగా ఆ మ్యాచ్లో మాథ్యూస్ అరుదైన రీతిలో ఔటయ్యాడు. During World Cup - Mathews was timed out vs Bangladesh due to helmet issue. After the T20I series - Sri Lanka celebrated the win with a timed-out move. Now after the ODI series - Mushfiqur bought his helmet to celebrate the win. This is Cinema. 😁👌pic.twitter.com/qgDXgY6FmN — Johns. (@CricCrazyJohns) March 18, 2024 అప్పట్లో బంగ్లా ఆటగాళ్ల అనైతికతను బహిరంగంగా ఎండగట్టిన లంక ఆటగాళ్లు తాజాగా జరిగిన ఓ సిరీస్ సందర్భంగా వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ నెగ్గిన లంకేయులు.. అనంతరం జరిగిన గెలుపు సంబురాల్లో "టైమ్డ్ అవుట్" అంశాన్ని సూచిస్తూ ఓవరాక్షన్ చేశారు. The Lanka-Bangla encounters never fail to impress us🦁🐯 📸: Fan Code pic.twitter.com/1EIlBcoQ5o — CricTracker (@Cricketracker) March 18, 2024 ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం బంగ్లాదేశ్కు ఇవాళ (మార్చి 18) వచ్చింది. వన్డే సిరీస్లో శ్రీలంకను 2-1 తేడాతో చిత్తు చేసిన అనంతరం బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం హెల్మట్ను పట్టుకుని శ్రీలంక టైమ్డ్ అవుట్ యాక్షన్కు రీకౌంటర్ ఇచ్చాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార చర్యల యుద్దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశానికి నెటిజన్లు "నాగిన్ రైవల్రీ" అని నామకరణం చేశారు. కాగా, శ్రీలంకతో ఇవాళ జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్తో పాటు సిరీస్ను చేతిక్కించుకుంది. -
దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో సమరవిక్రమ(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మాథ్యూస్(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 4సిక్స్లు), హసరంగా(9 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నవీన్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. లంక బౌలర్ల దాటికి 17 ఓవర్లలో కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో మాథ్యూస్, బినార ఫెర్నాండో, హసరంగా,థీక్షణ, పతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్ ఇన్నింగ్స్లో కరీం జనత్(28) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 దంబుల్లా వేదికగా బుధవారం జరగనుంది. కాగా లంక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రాణించిన సమరవిక్రమ.. చెలరేగిన హసరంగ, మాథ్యూస్
డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (1), ఇబ్రహీం జద్రాన్ (10) ఔట్ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (9), గుల్బదిన్ నైబ్ (1) క్రీజ్లో ఉన్నారు. బ్యాటింగ్లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో శ్రీలంక తొలి మ్యాచ్లో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ఏంటి అన్న నీకే ఎందుకు ఇలా.. ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు!
కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో శ్రీలంక వెటరన్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేసిన మాథ్యూస్(141)ఊహించని విధంగా ఔటయ్యాడు. హిట్వికెట్గా మథ్యూస్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 102 ఓవర్లో స్పిన్నర్ కైస్ అహ్మద్ రెండో బంతిని మథ్యూస్కు లెగ్ సైడ్ బాగా వైడ్ వేశాడు. అయితే షాట్ ఆఫర్ ఉండడంతో మథ్యూస్ కూడా కొంచెం లెగ్ సైడ్ జరిగి స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగ్గా కనక్ట్ చేసిన మథ్యూస్ ఆ డెలివరినీ ఫోర్గా మలిచాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని బౌండరీకి తరిలించే క్రమంలో మథ్యూస్ సమన్వయం కోల్పోయి తన బ్యాట్తో స్టంప్స్ను పడగొట్టాడు. దీని ఫలితంగా మాథ్యూస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో నీకే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో కూడా మథ్యూస్ టైమ్డ్ ఔట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది వరల్డ్ క్రికెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! బ్యాటర్ మైండ్ బ్లాంక్ Angelo Mathew’s with a four and bowled pic.twitter.com/IZITIq1Pmy — Jarrod Kimber (@ajarrodkimber) February 3, 2024 -
SL Vs ZIM, 3rd T20I: హసరంగ మ్యాజిక్.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్ సెన్సేషన్, ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కమున్హుకామ్వే (12), బ్రియన్ బెన్నెట్ (29), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్ నిస్సంక (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (33) రాణించగా.. ధనంజయ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్ వికెట్ సీన్ విలియమ్స్కు దక్కింది. ఈ సిరీస్లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
ఏంజెలో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకకు ఊహించని పరాభవం
కొలొంబో: పసికూన జింబాబ్వే.. తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జనవరి 16) జరిగిన రెండో మ్యాచ్లో లంకేయులు ఓ మోస్తరు స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ (1.5-0-35-0) చివరి ఓవర్లో 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. లూక్ జాంగ్వే.. మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, బౌండరీ బాది జింబాబ్వేకు అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే 1-1తో సిరీస్ను సమం చేసింది. తొలి మ్యాచ్లో శ్రీలంక గెలువగా.. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక, మాథ్యూస్ మినహా అంతా విఫలమయ్యారు. నిస్సంక 1, కుశాల్ మెండిస్ 4, కుశాల్ పెరీరా 0, సమరవిక్రమ 16, షనక 9 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నగరవ, మసకద్జ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆఖరి ఓవర్లో జాంగ్వే మెరుపులు (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అంతకుముందు క్రెయిగ్ ఎర్విన్ (70) జింబాబ్వే ఇన్నింగ్స్కు పునాది వేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సికందర్ రజా (8) ఐదు మ్యాచ్ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఆఖర్లో జాంగ్వే.. క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హసరంగ భారీ పరుగులు (4 ఓవర్లలో 41) సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. -
రాణించిన మాథ్యూస్, హసరంగ.. సికందర్ రజా ఆల్రౌండ్ షో వృధా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కమున్హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది. -
మాథ్యూస్ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్
వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్ టైమ్డ్ ఔట్తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయం లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా ఔట్గా మాథ్యూస్ వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్గా మాథ్యూస్ నిలిచాడు. ఇది జరిగి దాదాపు ఐదు రోజులు అవుతున్నప్పటకీ ఇంకా చర్చ జరగుతూనే ఉంది. కొంత మంది బంగ్లా కెప్టెన్ షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్ను తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. మాథ్యూస్ కనీసం ఒక్క బంతినైనా ఎదుర్కొని హెల్మెట్ను మార్చకోవాల్సందని కార్తీక్ అన్నాడు. "హెల్మెట్ మార్చమని అభ్యర్థించడానికి ముందు మాథ్యూస్ కనీసం ఒక బంతిని ఫేస్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఎటువంటి సమస్య ఉండకపోయేది. అయితే ఆ సమయంలో అతడికి ఆ ఆలోచిన వచ్చి ఉండదు. ఆ దిశగా అతడు అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే టైమ్డ్ ఔట్కు ప్రత్యర్ధి జట్టు అప్పీలు చేస్తారని మాథ్యూస్ ఊహించి ఉండడు. అదే ఇక్కడ కీలకమైన అంశమని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్క్రిస్ట్ రికార్డు సమం! -
అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అలా చేయొద్దు! బదులుగా..
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్ అవుట్’ విషయంలో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఘాటు విమర్శలు చేశాడు. చేసిన తప్పునకు అతడికి తగిన శాస్తే జరిగిందంటూ కుండబద్దలు కొట్టాడు. అయితే, ఇలాంటి నిబంధన మాత్రం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. క్రీజులోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం(2 నిమిషాల్లో)లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా పెవిలియన్కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఆటగాడిగా హెల్మెట్ విషయంలో జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో మాథ్యూస్ మైదానాన్ని వీడక తప్పలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలుతో ఏకీభవించిన అంపైర్లు అతడిని టైమ్డ్ అవుట్గా ప్రకటించారు. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ విషయంపై క్రికెట్ వర్గాలు రెండు చీలిపోయి చర్చలు సాగిస్తున్నాయి. మాథ్యూస్ పట్ల షకీబ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాల్సిందని కొంతమంది అంటుండగా.. నిబంధనల ప్రకారం షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్ను తప్పుబడుతున్నారు. అందుకు సంసిద్ధంగా లేరనే అర్థం ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం ఈ విషయంలో షకీబ్ వైపే నిలిచాడు. ‘‘బ్యాటర్లుకు సమయం చాలా ముఖ్యమైంది. ఒకవేళ టైమ్కి రాకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఏంజెలో మాథ్యూస్ దేనికైతే అర్హుడో అదే జరిగింది. మీకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వికెట్ పడిన వెంటనే క్రీజులోకి వెళ్లి రెండు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. ఒకవేళ మీరలా చేయలేదంటే బ్యాటింగ్కు చేసేందుకు మీరు సంసిద్ధులు కాలేదనే అర్థం కదా!’’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. 12 పరుగులు పెనాల్టీ విధించాలి మాథ్యూస్ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్తో పాటు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించాని బ్రాడ్ హాగ్ పరోక్షంగా వారిని సమర్థించాడు. అయితే, ఇలా బ్యాటర్ను టైమ్డ్ అవుట్ చేయడం తనకు నచ్చలేదన్న ఈ మాజీ బౌలర్ ఓ పరిష్కారాన్ని సూచించాడు. ‘‘నాకు ఇలాంటి డిస్మిసల్ నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, మళ్లీ ఇలాంటివి జరగాలని నేను కోరుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్ను అవుట్గా ప్రకటించే బదులు.. బ్యాటింగ్ జట్టుకు 12 పరుగుల మేర కోత విధిస్తే బాగుంటుంది. అపుడైనా ఇలా ఆలస్యం చేసేవాళ్లు కాస్త తొందరగా రెడీ అవుతారు. వికెట్ పడగానే క్రీజులోకి పరిగెత్తుకుని వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Brad Hogg (@brad_hogg) -
అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్
Angelo Mathews- Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్కు శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ అవుట్’ విషయంలో షకీబ్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. క్రీడాస్ఫూర్తిని మరిచిన అతడు శ్రీలంకలో అడుగుపెడితే అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రెవిన్ పేర్కొన్నాడు. షకీబ్కు రాళ్లతో సన్మానం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య, అరుదైన రీతిలో అవుటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) ఆలస్యం చేశాడు.. అనుభవించకతప్పలేదు న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ అవుటయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్ 2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్లోకి మాథ్యూస్ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. తన హెల్మెట్ను సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా, చమిక మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్ను పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్ను ‘అవుట్’గా ప్రకటించారు. ఈ క్రమంలో తన హెల్మెట్ సమస్యను మాథ్యూస్ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు. బతిమిలాడినా మనసు కరగలేదు ఆ తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకోమని షకీబ్ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్ వెనుదిరగక తప్పలేదు. దీంతో.. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్గా మాథ్యూస్ నిలిచాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో జెంటిల్మన్ గేమ్లో షకీబ్ క్రీడాస్ఫూర్తిని విస్మరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాళ్లు విసరడం ఖాయం దక్కన్ క్రానికల్తో మాట్లాడుతూ.. ‘‘మేము నిరాశకు గురయ్యాం. బంగ్లాదేశీ కెప్టెన్కు క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. జెంటిల్మన్ గేమ్లో అతడు మానవతా దృక్పథం కనబరచకలేకపోయాడు. ఇకపై అతడికి శ్రీలంకలో ఎవరూ స్వాగతం పలకరు. ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ లేదంటే లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఇక్కడికి వస్తే.. అతడిపై రాళ్లు విసురుతారు. అభిమానుల నుంచి అతడు ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్కు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో భాగంగా బంగ్లాదేశ్ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అప్పటికి షకీబ్- మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఫోర్త్ అంపైర్ చెప్పిందిదే లంక ఇన్నింగ్స్ అనంతరం.. మాథ్యూస్ టైమ్డ్ అవుట్పై ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్స్టాక్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ‘మాథ్యూస్కు హెల్మెట్ సమస్య కూడా రెండు నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటికీ అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్లోకి వచ్చే ముందు ఎక్విప్మెంట్లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్దే బాధ్యత’ అని ఆయన చెప్పారు. దాంతో షకీబ్ క్రీడా స్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్ను అవుట్గా ప్రకటించడం సరైందే కదా అని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా షకీబ్ను అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ కూడా వాచీ చూసుకుంటున్నట్లుగా అభినయిస్తూ నీ టైమ్ అయిపోయిందిక అన్నట్లు సైగ చేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో లంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకపై తొలి విజయం నమోదు చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... అభిమానులకు బ్యాడ్న్యూస్! ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే.. -
WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్కు భారీ షాక్!
ICC WC 2023- Shakib Al Hasan: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి శ్రీలంకపై గెలిచి జోష్లో ఉన్న బంగ్లాదేశ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంకతో మ్యాచ్లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్కప్ ఈవెంట్లో తొలిసారి లంకపై పైచేయి సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే కూడా ‘టైమ్డ్ అవుట్’కు అప్పీలు చేసిన కారణంగానే బంగ్లా జట్టు వార్తల్లో నిలిచింది. టైమ్డ్ అవుట్ అప్పీలుతో చరిత్రకెక్కిన షకీబ్ లంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడనే కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలు చేశాడు. ఐసీసీ వరల్డ్కప్ నిబంధనల ప్రకారం అతడు రెండు నిమిషాల్లోపు బాల్ను ఫేస్ చేయలేదన్న విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్గా వెనుదిరిగిన తొలి బ్యాటర్గా మాథ్యూస్ చరిత్రకెక్కగా.. షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. క్రీడా వర్గాల్లో ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగానే.. బంగ్లాదేశ్కు ఓ షాక్ తగిలింది. చేతివేలికి గాయం శ్రీలంకతో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మధ్యవేలుకు తగిలిన గాయం తీవ్రతరం కావడంతో ఎక్స్రే తీయించగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్కు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం కోసం షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బేజెదుల్ ఇస్లాం ఖాన్ తెలిపినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘అవుట్’ కాగా శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో మాథ్యూస్ విషయంలో అప్పీలుతో మరోసారి వివాదాస్పద క్రికెటర్గా ముద్రపడ్డ షకీబ్.. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు 2 వికెట్లు కూడా కూల్చిన ఈ స్పిన్ ఆల్రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో షకీబ్ వికెట్ను మాథ్యూస్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే, మాథ్యూస్ విషయంలో బంగ్లా జట్టుకు వికెట్ దక్కినప్పటికీ.. అప్పటికి ఓవర్ కంటిన్యూ చేస్తున్న బౌలర్(షకీబ్ అల్ హసన్) ఖాతాలో మాత్రం జమకాదు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరకున్నా.. ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు కాగా ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్లో గెలిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశాలు బంగ్లాకు సజీవంగా ఉంటాయి. చదవండి: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
టైమ్డ్ ఔట్ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్.. అది కూడా ఈ ఏడాదిలోనే..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఔటైన ఆటగాడు మాథ్యూసే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఎక్కువగా ప్రచారం లేని మరో విధానంలో ఓ బ్యాటర్ ఇదే ఏడాది ఔటయ్యాడు. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం బ్యాటర్లు మొత్తం పది విధాలుగా ఔట్గా ప్రకటించబడతారు. వాటిలో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్కు అడ్డుతగలడం) వంటివి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. WATCH the only Hitting The Ball Twice dismissal in international cricket --- when Malta's Fanyan Mughal got out against Romania in the 2023 Men's Continental Cup on 20 August 2023 pic.twitter.com/PFerZJOM4u — Dhaarmik (@DhaarmikAi) November 6, 2023 అయితే పది విధానాల్లో మిగిలిన రెండు విధాల ఔట్లను మాత్రం క్రికెట్ ప్రపంచం ఈ ఏడాదికి ముందు చూసి ఎరుగదు. ఆ రెండు విధాల ఔట్లు ఏవంటే.. టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్కు దిగకపోవడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం). ఈ రెంటిలో టైమ్డ్ ఔట్ను నిన్నటి వరల్డ్కప్ మ్యాచ్లో తొలిసారిగా చూశాం. ఇందులో రెండోదైన హిట్ ట్వైస్ ఔట్ ఘటన కూడా ఇదే ఏడాది తొలిసారి జరిగిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. పురుషుల కాంటినెంటల్ కప్లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 20న రొమేనియాతో జరిగిన మ్యాచ్లో మాల్టా ఆటగాడు ఫన్యాన్ ముఘల్ ఓసారి బంతిని స్ట్రయిక్ చేసిన అనంతరం ఫీల్డర్ పట్టుకోకముందే మరోసారి బ్యాట్తో కొట్టి హిట్ ట్వైస్గా ఔటయ్యాడు. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయం వైరలైన నేపథ్యంలో హిట్ ట్వైస్కు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో సైతం ప్రస్తుతం వైరలవుతుంది. ఏ ఆటగాడు, ఎప్పుడు తొలిసారి ఔట్గా ప్రకటించబడ్డాడంటే.. క్యాచ్ ఔట్ (టామ్ హోరన్, 1877), బౌల్డ్ (నాట్ థామ్సన్, 1877), ఎల్బీడబ్ల్యూ (హ్యారీ జప్, 1877), రనౌట్ (డేవ్ గ్రెగరీ, 1877), స్టంపౌట్ (ఆల్ఫ్రెడ్ షా, 1877), హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం, జార్జ్ బొన్నర్, 1884), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం, రసెల్ ఎండీన్, 1957), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్కు అడ్డుతగలడం, లెన్ హటన్, 1951), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం, ఫన్యాన్ ముఘల్, 2023), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్కు దిగకపోవడం, ఏంజెలో మాథ్యూస్, 2023) -
క్రికెట్లో ఔట్లు ఎన్ని విధంబులు అనిన...???
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్గా ప్రకటించబడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అసలు క్రికెట్లో ఓ బ్యాటర్ ఎన్ని రకాలుగా ఔట్గా ప్రకటించబడతారని అభిమానులు గూగుల్ చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానం పది. ఇందులో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్కు దిగకపోవడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్కు అడ్డుతగలడం) వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. వీటిలో బ్యాటర్లు దాదాపు అన్ని విధాల్లో ఒకటి అంత కంటే ఎక్కువసార్లు ఔట్ కాగా.. నిన్నటి మ్యాచ్లో (శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్) ఓ బ్యాటర్ (ఏంజెలో మాథ్యూస్) తొలిసారి టైమ్డ్ ఔట్గా ప్రకటించబడ్డాడు. మాథ్యూస్ను టైమ్ ఔట్గా ప్రకటించే విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదిఏమైనా రూల్ కాబట్టి, అంతిమంగా ఫలితం అతనికి అనుకూలంగానే వచ్చింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి ఎలిమినేట్ (సెమీస్కు అర్హత సాధించలేదు) అయ్యింది. తాజా ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్తో పాటు ఎలిమినేషన్కు గురైంది. ప్రస్తుత వరల్డ్కప్లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్లో ఉన్నదే చేశా: షకీబ్ -
మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్లో ఉన్నదే చేశా: షకీబ్
ఏంజెలో మాథ్యూస్ను టైమ్ ఔట్గా ప్రకటించే విషయంలో క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఈ విషయమై మ్యాచ్ అనంతరం స్పందించాడు. మాథ్యూస్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మా ఫీల్డర్లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్ ఔట్ అవుతాడని తెలిపాడు. అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్గా అప్పీల్ చేస్తున్నానా లేదా అని అడిగారు. అవునని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్లో ఉంది కాబట్టి అప్పీల్ చేశాను. యుద్ధంలో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనంటూ కామెంట్స్ చేశాడు. పైగా మాథ్యూస్తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని అన్నాడు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్కు వచ్చి టైమ్ ఔట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్'.. క్లారిటీ ఇచ్చిన అంపైర్ -
ప్రపంచ క్రికెట్కు చీకటి రోజు.. అది బంగ్లాదేశ్ కాబట్టే అలా జరిగింది..!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చి టైమ్ ఔట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. Even Aasif Sheikh from Nepal has a 1000 time better Sportsmanship then Shakib Al Hasan. Today, Cricket 🏏 has seen a Dark Day that too in a World Cup Match😞 Follow 🙏#BANvsSL #AngeloMatthews #ShakibAlHasan #CWC23 #AngeloMathews #ThugLife #timedout pic.twitter.com/EHL9X3lsW6 — Richard Kettleborough (@RichKettle07) November 6, 2023 మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. నెటిజన్లు సోషల్మీడియామ వేదికగా షకీబ్ను ఏకి పారేస్తున్నారు. Angelo Mathews speaks in Press conference and is whole fired up 🤣🔥#SLvBAN pic.twitter.com/GKXg8kf8UH— Div🦁 (@div_yumm) November 6, 2023 మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మాథ్యూస్ స్వయంగా స్పందించాడు. షకీబ్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి అలా జరిగింది, మరే ఇతర జట్టు ఇలా స్పందిస్తుందని అనుకోను అంటూ కామెంట్స్ చేశాడు. మాథ్యూస్ను టైమ్ ఔట్గా ప్రకటించడంపై ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో కూడా స్పందించాడు. Angelo Mathews said, "it was Bangladesh that's why it happened, I don't think any other team would've done it". pic.twitter.com/cTzI9UM9SL — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023 ప్రపంచ క్రికెట్కు ఇది చీకటి రోజు. ఇలాంటి ఘటన ప్రపంచకప్లో జరగడం విచారకరం అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు ఓ వీడియోను జోడిస్తూ.. క్రీడాస్పూర్తిని చాటుకోవడంలో నేపాల్కు చెందిన ఆసిఫ్ షేక్ షకీబ్ కంటే వెయ్యి రెట్లు నయమని కామెంట్ జోడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఓ ఆటగాడు టైమ్ ఔట్ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్ను ఔట్గా ప్రకటించాలని అంపైర్పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్ టైమ్ ఔట్ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్-సౌతాఫ్రికా మధ్య కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్ ఔట్ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టైమ్ ఔట్ విషయంలో బ్యాటర్ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్ స్మిత్ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్ స్మిత్ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొట్టింది. అయితే నిన్నటి మ్యాచ్లో షకీబ్.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్ ఔట్గా ప్రకటించాలని అంపైర్పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు. On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5 — Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023 నిన్నటి మ్యాచ్లో ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్వైపు కొత్త హెల్మెట్ కోసం సైగలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వెంటనే సబ్స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ ఔట్కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్ను ఔట్గా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదివరకే ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్లా సెమీస్కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు చేరుకున్నాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్లో ఉన్నదే చేశా: షకీబ్ -
మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్'.. క్లారిటీ ఇచ్చిన అంపైర్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్ ఔటైన విధానం తీవ్ర వివాదస్పదమైంది. ఈ మ్యాచ్లో మాథ్యూస్ దురదృష్టకర రీతిలో 'టైమ్డ్ ఔట్'గా పెవిలియన్కు చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 'టైమ్డ్ ఔట్'గా వెనుదిరిగిన తొలి క్రికెటర్గా మాథ్యూస్ నిలిచాడు. నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ టైమ్డ్ ఔట్కు అప్పీల్ చేశాడు. దీంతో రూల్స్ ప్రకారం మాథ్యూస్ను అంపైర్లు ఔట్గా ప్రకటించారు. ఏంటి టైమ్డ్ ఔట్.. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ ఔటైనా లేదా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ 3 నిమిషాల్లోపు(180 సెకన్లు) బంతిని ఎదుర్కొవాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇన్కమింగ్ బ్యాటర్ను టైమ్డ్ ఔట్ రూల్ కింద ఔట్గా ప్రకటిస్తారు. క్లారిటీ ఇచ్చిన ఫోర్త్ అంపైర్.. ఇక ఈ వివాదంపై ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్స్టాక్ క్లారిటీ ఇచ్చాడు. "ఐసీసీ వరల్డ్కప్ రూల్స్ మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ చట్టాల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదంటే, బ్యాటర్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగితే ఇన్కమింగ్ బ్యాటర్ రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి. ప్లేయింగ్ కంట్రోల్ రూమ్లో ఉన్న మేము కొన్ని ప్రోటోకాల్లను అనుసరిస్తాము. వికెట్ పడిన వెంటనే టీవీ అంపైర్(థర్డ్ అంపైర్) ప్రాథమికంగా రెండు నిమిషాలు ఎదురుచూసి.. అప్పటికి ఆట తిరిగి ప్రారంభం కాకపోతే ఆన్ఫీల్డ్ అంపైర్లతో సంప్రదింపులు జరుపుతాడు. ఉదాహరణకు ఈ మ్యాచ్లో జరిగిన సంఘటను తీసుకుంటే.. బ్యాటర్కు తన హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిందనే గమనించే సమయానికే రెండు నిమిషాలు దాటిపోయింది. నిర్ణీత సమయానికి అతడు బంతిని ఎదుర్కొనుందుకు సిద్దంగా లేడు. హోల్డ్స్టాక్ చెప్పుకొచ్చాడు. ఎవరు ముందుగా అప్పీలు చేశారు? ఈ మ్యాచ్లో ముందుగా ఫీల్డింగ్ కెప్టెన్ షకీబుల్ హసన్.. స్టాండింగ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్కి అప్పీల్ చేశాడు. అప్పటికే సమయం ముగియడంతో షకీబుల్ అప్పీల్ చేయాలనుకున్నాడని ఆయన వెల్లడించాడు. ముందే చెక్ చేసుకోవాలి.. ఇక బ్యాటర్గా మనం క్రీజులోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నప్పుడు ముందే మనం చెక్ చేసుకోవాలి. మనకు సంబంధించిన హెల్మెట్, ప్యాడ్స్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని ఫీల్డ్లోకి రావాలి. ఎందుకంటే ప్లేయర్ రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. బ్యాటర్లు తమకు సంబంధించిన కిట్స్(హెల్మెట్, ప్యాడ్స్, గ్లావ్స్) సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి 50 సెకన్లలోపు క్రీజులోకి చేరుకోవాలి. లేదంటే ఇటువంటి పరిస్ధితులు ఎదురవతాయి అని హోల్డ్స్టాక్ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు! మరి రూల్స్?
#BanvsSL- #Angelo Mathews- #ShakibAlHasan: వన్డే వరల్డ్కప్-2023.. ఢిల్లీ.. అరుణ్జైట్లీ స్టేడియం.. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్.. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్ల మధ్య పోటీ.. ఇందులో గెలిచినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం లేదు.. కానీ.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించాలంటే మాత్రం ఇరు జట్లకు ఈ మ్యాచ్లో గెలుపు అత్యవసరం... పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీ బరిలో నిలవాంటే... అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో ఎలాగైనా పైచేయి సాధించాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను 4 పరుగులకే పెవిలియన్కు పంపి బంగ్లాకు శుభారంభం అందించాడు పేసర్ షోరిఫుల్ ఇస్లాం. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(19)ను షకీబ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(41), సదీర సమరవిక్రమతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిసాంక అవుటైన తర్వాత చరిత్ అసలంక సమరవిక్రమకు తోడయ్యాడు. అయితే.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి.. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. సమరవిక్రమ షకీబ్ బౌలింగ్లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హైడ్రామా మొదలైంది అప్పుడే దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక వ్యూహాత్మకంగా ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ను బరిలోకి దింపింది. కానీ దురదృష్టవశాత్తూ మాథ్యూస్ రాంగ్ హెల్మెట్ వెంట తెచ్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ పొజిషన్ తీసుకోకముందే ఈ విషయాన్ని గమనించిన అతడు.. వేరే హెల్మెట్ కావాలంటూ డ్రెస్సింగ్రూం వైపు సైగ చేశాడు. సబ్స్టిట్యూట్ కరుణరత్నె వెంటనే హెల్మెట్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది! ఇదంతా జరగడానికి రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పుడే షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా.. మాథ్యూస్ విషయంలో ‘టైమ్డ్ అవుట్’కి అప్పీలు చేశాడు. అంతేకాదు ఈ నిబంధన అమలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ప్రయత్నం చేయకుండానే వికెట్ దీంతో అంపైర్లు ఏంజెలో మాథ్యూస్ అవుటైనట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వికెట్ దొరికిన సంబరంలో బంగ్లాదేశ్ మునిగిపోగా.. ఈ అనూహ్య ఘటనతో శ్రీలంక శిబిరంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. బంగ్లా సంబరం.. శ్రీలంక అయోమయం ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఓ బ్యాటర్ ‘టైమ్డ్ అవుట్’గా వెనుదిరగడం ఇదే తొలిసారి. అలా.. నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున ఏంజెలో మాథ్యూస్ ఈ ‘శిక్ష’ అనుభవించకతప్పలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) బతిమిలాడినా కరుణించలేదు హెల్మెట్ కారణంగా జరిగిన తాత్సారం మూలంగా అతడు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంపైర్లు, షకీబ్ దగ్గరికి వెళ్లి మరీ విషయం ఏమిటో వివరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మాథ్యూస్ బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నట్లు షకీబ్ నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పీలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగిపోయాడు. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ సైతం బంగ్లాదేశ్ కోచ్ చండిక హతుర్సింఘతో ఈ విషయం గురించి చర్చించాడు. ఫోర్త్ అంపైర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లారు. తప్పు ఎవరిది? కానీ అప్పటికే కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడం బ్యాటింగ్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అంతగా ఆసక్తి కలిగించదనుకున్న మ్యాచ్ కాస్తా ఈ అనూహ్య ఘటన మూలంగా.. క్రీడా వర్గాల్లో హాట్టాపిక్గా మారిపోయింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ ఘటనపై చర్చిస్తున్నారు నెటిజన్లు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్లో క్రీడాస్ఫూర్తి కొరవడిందని చాలా మంది ట్రోల్ చేస్తుంటే.. ఇదంతా నిబంధనలకు అనుగుణమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎంసీసీ నిబంధన ప్రకారం.. ఓ జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే ఆటగాడు.. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. లేదంటే బ్యాటర్ను టైమ్డ్ అవుట్గా పరిగణిస్తారు. ఇక ఐసీసీ వరల్డ్కప్ నిబంధనల ప్రకారం.. రెండు నిమిషాల్లోపే బ్యాటర్ బాల్ను ఫేస్ చేయాలి. ఈ నిబంధనను ఆధారం చేసుకునే షకీబ్ అల్ హసన్ ఏంజెలో మాథ్యూస్ విషయంలో అప్పీలుకు వెళ్లి సఫలమయ్యాడు. అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు అయితే, దీని మూలంగా.. జెంటిల్మన్గేమ్లో క్రీడాస్ఫూర్తిని మరచిన ఆటగాడిగా అతడు చరిత్రలో మిగిలిపోతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి గతంలో.. తమకు(స్థానిక లీగ్ మ్యాచ్) ప్రతికూల ఫలితం వచ్చినపుడు అంపైర్ల పట్ల షకీబ్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి వ్యక్తి నుంచి స్పోర్ట్స్మెన్షిప్ ఆశించినవాళ్లదే తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. షకీబ్ తీరే అంత అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టైమ్బ్యాడ్ అని సరిపెట్టుకోకతప్పదంటూ మాథ్యూస్కు హితవు పలుకుతున్నారు. సమయం వృథా చేయడం వల్ల మూల్యం చెల్లించావంటూనే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్లో.. మాథ్యూస్లాగే మహ్మద్ రిజ్వాన్ టైమ్ వేస్ట్ చేసినపుడు విరాట్ కోహ్లి చేతిగడియారం చూసుకుంటున్నట్లు అభినయించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎటువైపు ఉంటారు?! చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! #BANvSL "Angelo Mathews" what is this? pic.twitter.com/JIsQo6cPut — Ankur Jain 🇮🇳 (@aankjain) November 6, 2023 Angelo Mathews becomes the first cricketer in history to be out on 'timed out' If you Expect sportsmanship from Shakib-al-hasan then it's your Mistake He didn't even respect Umpires 🤮#SLvBAN #ODIWorldCup2023 #ICCWorldCup2023 #SLvsBAN pic.twitter.com/PGqQfM9HFQ — Troll Mafia (@offl_trollmafia) November 6, 2023 -
బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. నిర్ణీత సమయంలో క్రీజులో గార్డ్ తీసుకుపోనుందున మాథ్యూస్ టైమ్డ్ అవుట్ పెవిలియన్కు చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలి సారి. ఏమి జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్వైపు కొత్త హెల్మెట్ కోసం మాథ్యూస్ సైగలు చేశాడు. వెంటనే సబ్స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్డ్ అవుట్కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్ను ఔట్గా ప్రకటించారు. టైమ్డ్ అవుట్ అంటే ఏంటి? ఎంసీసీ నిబంధన ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే బ్యాటర్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బాల్ను ఫేస్ చేయాలి. లేదంటే బ్యాటర్ను టైమ్డ్ అవుట్గా పరిగణిస్తారు. మాథ్యూస్ విషయంలో ఇదే జరిగింది. అయితే క్రీడా స్పూర్తిని మరిచి ఇలా చేసిన బంగ్లాదేశ్ను నెటిజన్లు తప్పబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా! లంక దెబ్బకు..
WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టోక్స్ 43 పరుగులతో వన్డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్లు కూడా లంకతో మ్యాచ్లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్తో మ్యాచ్కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. స్టార్ పేసర్కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
వరల్డ్కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్..
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. పతిరానా ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలో తప్పకున్నాడు. ఇక పతిరానా స్ధానాన్ని సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. ఇప్పటికే భారత్కు చేరుకున్న మాథ్యూస్.. ఇంగ్లండ్తో మ్యాచ్ జట్టు సెలక్షన్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మెగా టోర్నీలో ఆక్టోబర్ 26న బెంగళూరు వేదికగా ఇంగ్లండ్తో శ్రీలంక తలపడనుంది. కాగా ఇప్పటికే గాయం కారణంగా లంక కెప్టెన్ దసన్ శనక టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పతిరానా కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్ -
లంక ప్రీమియర్ లీగ్ 2023 విజేత బి లవ్ క్యాండీ.. ఫైనల్లో డంబుల్లా చిత్తు
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ విజేతగా బి లవ్ క్యాండీ అవతరించింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో క్యాండీ టీమ్.. డంబుల్లా ఔరాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. కెప్టెన్ హసరంగ లేకుండానే ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన క్యాండీ.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విజేతగా నిలిచింది. తాత్కాలిక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (21 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో ఎంతో ఓర్పుగా బ్యాటింగ్ చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు మాథ్యూస్ బంతితోనూ (2-0-11-0) పర్వాలేదనిపించాడు. గాయం కారణంగా చాలాకాలంగా బంతి పట్టని మాథ్యూస్ రెగ్యులర్ కెప్టెన్ హసరంగ గైర్హాజరీలో తప్పనిసరి పరిస్థితుల్లో బౌలింగ్ చేసి మెప్పించాడు. ఫలితంగా అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (10 బంతుల్లో 5), విఫలం కాగా, కుశాల్ మెండిస్ (22), సమరవిక్రమ (36), కుశాల్ పెరీరా (31 నాటౌట్), ధనంజయ డిసిల్వ (40) రాణించారు. క్యాండీ బౌలర్లలో చతురంగ డిసిల్వ 2, నువాన్ ప్రదీప్, మహ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బి లవ్ క్యాండీ మరో బంతి మిగిలుండగా (19.5 ఓవర్లలో) 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్యాండీ ఇన్నింగ్స్లో మహ్మద్ హరీస్ (26), కమిందు మెండిస్ (44), దినేశ్ చండీమల్ (24), ఏంజెలో మాథ్యూస్ (25 నాటౌట్), ఆసిఫ్ అలీ (19) రాణించగా.. చతురంగ డిసిల్వ డకౌటయ్యారు. డంబుల్లా బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. బినుర ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నాడు. సిరీస్ ఆధ్యాంతరం అద్భుతంగా రాణించిన క్యాండీ కెప్టెన్ హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్లో హసరంగ లీడింగ్ రన్ స్కోరర్గా (10 మ్యాచ్ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్గా (10 మ్యాచ్ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా (10 మ్యాచ్ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. -
SL VS PAK 1st Test: ధనంజయ డిసిల్వ సూపర్ సెంచరీ
స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో శ్రీలంక జట్టు ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. గాలే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సూపర్ సెంచరీతో మెరవగా.. ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీతో రాణించాడు. వీరు మినహా మిగతా వారెవ్వరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు లంచ్ సమయానికి లంక ఇన్నింగ్స్ ముగిసింది. 10వ సెంచరీ పూర్తి చేసిన ధనంజయ.. కష్ట సమయంలో (54/4) క్రీజ్లోకి వచ్చిన ధనంజయ బాధ్యతాయుతంగా ఆడి, జట్టు స్కోర్ 300 దాటించడంతో పాటు కెరీర్లో 10వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ధనంజయ, టెయిలెండర్లతో కలిసి మరిన్ని పరుగులు జోడించాడు. 31 ఏళ్ల ధనంజయకు పాక్పై ఇది మూడో సెంచరీ కాగా.. తన 50వ టెస్ట్ మ్యాచ్లో అతను సెంచరీ చేయడం విశేషం. కెరీర్తో 88 టెస్ట్ ఇన్నింగ్స్లు ఆడిన ధనంజయ.. 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3152 పరుగులు చేశాడు. -
రాణించిన మాథ్యూస్, డిసిల్వ.. దిగ్గజాల సరసన చేరిన లంక క్రికెటర్
2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్.. గాలే వేదికగా ఇవాళ (జులై 16) ప్రారంభమైన తొలి టెస్ట్లో ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. వెటరన్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (64), ధనంజయ డిసిల్వ (94 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. లంక ఇన్నింగ్స్లో నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. వంద వికెట్ల క్లబ్లో అఫ్రిది.. తొలి రోజు ఆటలో 3 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది టెస్ట్ల్లో 100 వికెట్ల క్లబ్లో చేరాడు. 23 ఏళ్ల అఫ్రిది 26 టెస్ట్ల్లో 102 వికెట్లు పడగొట్టాడు. దిగ్గజాల సరసన ఏంజెలో.. లంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. పాక్-శ్రీలంక మధ్య టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర (2911) టాప్లో ఉండగా.. యూనిస్ ఖాన్ (2286), జయవర్ధనే (1687), ఇంజమామ్ ఉల్ హాక్ (1559) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత మాథ్యూస్ 1522 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. జయవర్ధనే, సంగక్కర తర్వాత.. వెటరన్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ శ్రీలంక తరఫున టెస్ట్ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్.. తన 105 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 15029 పరుగులు ఎదుర్కొనగా.. లంక తరఫున అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా మహేళ జయవర్ధనే (22959) ముందువరుసలో ఉన్నాడు. జయవర్ధనే తర్వాత కుమార సంగక్కర (22882) ఉన్నాడు. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన కరుణరత్నే
శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టెస్ట్ల్లో 15వ సెంచరీ బాదాడు. స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్లో కరుణరత్నే ఈ ఫీట్ను సాధించాడు. 139 బంతులను ఎదుర్కొన్న కరుణరత్నే..12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అతను లంక దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్య, స్టార్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్లు తమ టెస్ట్ కెరీర్లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్టేక్ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకు కెరీర్లో 85 టెస్ట్లు ఆడిన కరుణరత్నే 15 సెంచరీలు, 34 అర్ధసెంచరీల సాయంతో 40.66 సగటున 6344 పరుగులు సాధించాడు. కాగా, కరుణరత్నే (114 నాటౌట్)కు జతగా కుశాల్ మెండిస్ (94 నాటౌట్) కూడా రాణించడంతో టీ సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రీలంక కోల్పోయిన నిషాన్ మదుష్క (29) వికెట్ కర్టిస్ క్యాంపర్ ఖాతాలోకి వెళ్లింది. ఐర్లాండ్.. ప్రస్తుత లంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. -
శెభాష్.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే!
New Zealand vs Sri Lanka, 1st Test: న్యూజిలాండ్ గడ్డ మీద కివీస్ను ఓడించడం అంత తేలికేమీ కాదు! టీమిండియాతో ఫైనల్ రేసులో ముందంజ వేయాలని శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది! పటిష్ట కివీస్ను 2-0తో వైట్వాష్ చేయడం సాధ్యమమ్యే పనేనా!? లంకేయులు మరీ ఎక్కువగా ఆశపడుతున్నారేమో! న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో లంక జట్టు గురించి వినిపించిన మాటలు! న్యూజిలాండ్లో న్యూజిలాండ్ను ఓడించడం కఠినతరమే కానీ అసాధ్యం కాదు! లంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఒక్కడిలోనే కాదు దిముత్ కరుణరత్నె బృందం అందరిలోనూ అదే ఆత్మవిశ్వాసం.. అందుకు తగ్గట్లే తొలి టెస్టులో కివీస్ను అల్లల్లాడించింది శ్రీలంక జట్టు.. ఆఖరి బంతి వరకు అసాధారణ పోరాటం కనబరిచింది.. అయితే, అదృష్టం మాత్రం కివీస్ వైపు ఉంది. కేన్ విలియమ్సన్ అద్భుత డైవ్తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బంతికి న్యూజిలాండ్కు విజయం అందించాడు. ఆశలు ఆవిరి దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలన్న లంక ఆశలు ఆవిరైపోయాయి. వెరసి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అభిమానులు భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే శ్రీలంక అద్భుత పోరాటాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఓడించినంత పనిచేశారు ‘‘దేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన వేళ ధైర్యంగా ముందడుగు వేసి ఆసియా కప్ గెలిచారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ గడ్డపై అసాధారణ పోరాటం చేశారు. కివీస్తో తొలి టెస్టులో తృటిలో గెలుపు చేజారింది. అంతమాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటలో గెలుపోటములు సహజం. విజయం కోసం ఆఖరి బంతి వరకు మీరు పోరాడిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టెస్టు క్రికెట్లో అసలైన మజా అందించారు’’ అంటూ లంక ఆటగాళ్లను కొనియాడుతున్నారు. ‘‘ఓడినా మనసులు గెలిచారు.. మరేం పర్లేదు’’ అంటూ నిరాశలో మునిగిపోయిన కరుణరత్నె బృందానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతి ప్రకటిస్తున్నారు. కేన్ మామ వల్లే కాగా మార్చి 9-13 వరకు క్రైస్ట్చర్చ్లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లంక తొలి ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్లో ఏంజెలో మాథ్యూస్ సెంచరీతో మెరిశాడు. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడిన వేళ న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ 121 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆటను ఐదో రోజు వరకు తీసుకువచ్చిన మరో సెంచరీ వీరుడు డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మార్చి 17 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశ్విన్కూ సాధ్యం కానిది.. Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ BGT 2023: గత నాలుగు సిరీస్ల్లో ఆసీస్కు ఇదే గతి..! Test cricket, you beauty! ❤️#WTC23 | #NZvSL pic.twitter.com/7l7Yjmzraz — ICC (@ICC) March 13, 2023 -
WTC Final: ఏంజెలో మాథ్యూస్ సెంచరీ! టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక
New Zealand vs Sri Lanka, 1st Test Day 4- WTC Final Scenario: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు శ్రీలంక టీమిండియాతో పోటీ పడుతోంది. తుదిపోరుకు అర్హత సాధించే రేసులో తాము కూడా ఉన్నామంటూ దూసుకొస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. అంచనాలు తలకిందులు చేస్తూ కివీస్తో తొలి టెస్టులో హోరాహోరీ తలపడుతోంది. కాగా ఓవర్నైట్ స్కోరు 162/5తో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంకపై 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. డారైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో ఈ మేర ఆధిక్యం సాధ్యమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. ఏంజెలో మాథ్యూస్ సెంచరీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఏంజెలో మాథ్యూస్ పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో చండీమాల్ 42, ధనంజయ డి సిల్వ 47(నాటౌట్) రాణించారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్ను 302 పరుగుల వద్ద ముగించింది. 279 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ అద్భుతం చేస్తుందా? ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే(5)ను స్వల్ప స్కోరుకే అవుట్ చేసి కసున్ రజిత దెబ్బకొట్టాడు. టామ్ లాథమ్ 11, వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సరికి కివీస్ విజయానికి 257 పరుగుల దూరంలో ఉండగా.. ఆఖరి రోజు లంక తొమ్మిది వికెట్లు తీస్తే గెలుస్తుంది. ఇంకా 90 ఓవర్ల ఆట మిగిలి ఉన్న క్రమంలో ఈ పరిణామాలు కివీస్- లంక మ్యాచ్ టీమిండియా ఫ్యాన్స్ను మరింత ఉత్కంఠలోనికి నెట్టాయి. టీమిండియా, శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?! ►స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టును టీమిండియా గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ►ఒకవేళ న్యూజిలాండ్ లంకను తొలి టెస్టులో ఓడించినా, కనీసం ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా రోహిత్ సేన తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ►ఇక లంక.. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడాలంటే న్యూజిలాండ్ను 2-0తో వైట్వాష్ చేయడం సహా టీమిండియాపై ఆఖరి టెస్టులో ఆసీస్ విజయం సాధించాలి. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన ఏంజెలో మాథ్యూస్
శ్రీలంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఆ దేశ క్రికెట్కు సంబంధించి ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో 47 పరుగులు చేసిన మాథ్యూస్.. శ్రీలంక తరఫున టెస్ట్ల్లో 7000 పరుగుల మార్కును అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. Angelo Mathews goes past Sanath Jayasuriya and become the 3rd Sri Lankan player to reach 7️⃣0️⃣0️⃣0️⃣ Test runs 🙌 #NZvSL pic.twitter.com/Y56YdYctaj — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 9, 2023 ఈ క్రమంలో అతను ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు. జయసూర్య 110 టెస్ట్ల్లో 6973 పరుగులు చేస్తే.. మాథ్యూస్ 101 టెస్ట్ల్లోనే 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. లంక తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (134 టెస్ట్ల్లో 12400 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్ధనే (149 టెస్ట్ల్లో 11814 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. A landmark achievement 👏 🇱🇰 Angelo Mathews becomes the third after @KumarSanga2 and @MahelaJay to 7000 Test runs for Sri Lanka pic.twitter.com/LYWnxSceVd — ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2023 లంక తరఫున టెస్ట్ల్లో 6000 అంతకంటే ఎక్కువ పరుగులు (ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో) చేసిన ఆటగాళ్లలో మాథ్యూస్ తర్వాత దిముత్ కరుణరత్నే (83 టెస్ట్ల్లో 6073) మాత్రమే ఉన్నాడు. ఇదిలా ఉంటే, క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్లో తొలుత బ్యాటంగ్కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన ఉండటంతో శ్రీలంక ఈ మ్యాచ్ను డూ ఆర్ డై అన్నట్లుగా తీసుకుంది. ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొంది. Who will join the Aussies in the World Test Championship 2023 final? 🤔 India🇮🇳 or Sri Lanka 🇱🇰? pic.twitter.com/KqBQQgYWRG — CricTracker (@Cricketracker) March 8, 2023 భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే.. ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్తో జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్కు చేరుకుంటుంది. -
NZ Vs SL: డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే అదొక్కటే మార్గం: లంక ఆల్రౌండర్
New Zealand vs Sri Lanka Test Series 2023: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా తొలి విజయం నేపథ్యంలో శ్రీలంక జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ చేరే మార్గం సుగమం చేసుకునేందుకు గొప్ప అవకాశం లభించిందంటూ లంక క్రికెటర్లు సంబరపడిపోతున్నారు. అయితే, అదే సమయంలో.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే అదృష్టం కలిసిరావడంతో పాటు కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందంటున్నారు. స్వదేశంలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. మూడో మ్యాచ్లో మాత్రం ఆసీస్ చేతిలో పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. నాగ్పూర్, ఢిల్లీ టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించిన భారత జట్టు.. ఇండోర్లో అదే రీతిలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో.. ఆస్ట్రేలియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టగా.. టీమిండియా మరికొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి. అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ.. న్యూజిలాండ్- శ్రీలంక టెస్టు ఫలితం తేలిన తర్వాతే ఇంగ్లండ్లో ఆసీస్ను ఫైనల్లో ఢీకొట్టే జట్టు గురించి అధికారిక ప్రకటన వస్తుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో పదింట 5 టెస్టులు గెలిచిన శ్రీలంక.. 53.33 విజయశాతంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ లంక ఫైనల్ చేరాలంటే ఆసీస్ చేతిలో టీమిండియా ఓడటం సహా న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్య జట్టును లంక 2-0తో క్లీన్స్వీప్ చేయాల్సి ఉంటుంది. అయితే, అదేమీ అంత తేలికైన విషయం కాదు. శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఫైనల్ చేరాలంటే అదే ఏకైక మార్గం.. కాబట్టి ‘‘న్యూజిలాండ్లో న్యూజిలాండ్ను ఓడించడం అంటే అత్యంత కష్టంతో కూడుకున్న పని. అయితే, గత పర్యటనలో మేము మెరుగైన ప్రదర్శన కనబరచడం సానుకూలాంశం. ఏదేమైనా ఇక్కడ గెలవాలంటే వాళ్లెలాంటి వ్యూహాలు అమలు చేస్తారో మేము కూడా అలాంటి ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. వాళ్లు మాకు కఠిన సవాలు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లండ్ దూకుడైన ఆటతో టెస్టులకు సరికొత్త నిర్వచనం చెబుతోంది. వాళ్ల శైలి వాళ్లది.. మా ఆట తీరు మాది. అయితే, మేమేమీ ఒత్తిడికి లోనుకావడం లేదు. అయితే.. ఫైనల్ చేరాలంటే మా ముందున్న ఏకైక మార్గం రెండు మ్యాచ్లు గెలవడమే. అందుకోసం మేము అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది’’ అని మాథ్యూస్ పేర్కొన్నాడు. కాగా మార్చి 9 నుంచి కివీస్- లంక జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక స్వదేశంలో ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓడిన సౌథీ బృందం.. రెండో టెస్టులో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సిరీస్ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పటిష్ట జట్టు, డబ్ల్యూటీసీ టైటిల్ తొలి విజేత న్యూజిలాండ్ను ఓడించాలంటే లంక అద్భుతం చేయాల్సి ఉంటుంది! చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? LSG New Jersey: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే అదే నయం! -
కివీస్తో సిరీస్కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో ఫైనల్లో!
New Zealand Vs Sri Lanka 2023- Test Series: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. దిముత్ కరుణరత్నె సారథ్యంలోని ఈ జట్టులో లాహిరు కుమార, చమిక కరుణరత్నె, కసున్ రజిత, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తదితరులకు చోటు దక్కింది. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే క్రమంలో కివీస్తో సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం లంక పాలిట వరంలా మారింది. రోహిత్ సేన అదే జోరులో ఆసీస్ను క్లీన్స్వీప్ చేయడం సహా కివీస్ను గనుక లంక వైట్వాష్ చేస్తే.. సౌతాఫ్రికా- వెస్టిండీస్ ఫలితం తమకు అనుకూలంగా వస్తే టీమిండియాతో పాటు ఫైనల్ చేరే అవకాశాలు లేకపోలేదు. అయితే, న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంకకు ఇది కత్తిమీద సాములాంటిదే. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. టాప్లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా అంత ఈజీ కాదు గత రికార్డులు పరిశీలిస్తే కివీస్తో ముఖాముఖి తలపడిన 19 సందర్భాల్లో శ్రీలంక కేవలం రెండు టెస్టులు మాత్రమే గెలిచింది. అయితే, ప్రస్తుత కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ మార్గదర్శనంలో లంక జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రతిభకు అదృష్టం తోడైతే కరుణరత్నె బృందం ఫైనల్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, గత డబ్ల్యూటీసీ విన్నర్ కివీస్ను ఓడించడం అది కూడా సొంత గడ్డపై వైట్వాష్ చేయడం అంటే ఆషామాషీ కాదు! మార్చి9 - ఏప్రిల్ 8 వరకు టూర్ ఇందుకోసం లంక సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్ను న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించిన కేన్ విలియమ్సన్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. కాగా మార్చి 9- ఏప్రిల్ 8 వరకు కివీస్- లంక మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. న్యూజిలాండ్తో సిరీస్కు లంక జట్టు: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, నిషాన్ మదుష్క, రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, చమిక కరుణరత్నె, కసున్ రజిత, లాహిరు కుమార, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్ననాయకె. చదవండి: T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్తో.. Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ -
టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్రౌండర్
టెస్ట్ క్రికెట్లో శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గాలే వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా మాథ్యూస్ వంద టెస్ట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో లంక తరఫున 100 టెస్ట్లు ఆడిన ఆరో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్కు ముందు మహేళ జయవర్ధనే (149), సంగక్కర (134), మురళీథరన్ (133), చమింద వాస్ (111), జయసూర్య (110) మాత్రమే లంక తరఫున వంద టెస్ట్ మ్యాచ్లు ఆడారు. Angelo Mathews becomes the sixth Sri Lankan player to feature in 100 Tests!#SLvPAK #SriLanka pic.twitter.com/8vtyeLZoNL — CRICKETNMORE (@cricketnmore) July 24, 2022 పాక్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్ ఇప్పటివరకు ఆడిన 100 టెస్ట్ల్లో 45.2 సగటున 13 సెంచరీలు, 38 అర్ధసెంచరీల సాయంతో 6918 పరుగులు చేశాడు. భుజం గాయం కారణంగా టెస్ట్ల్లో బౌలింగ్ చేయడం మానేసిన మాథ్యూస్.. టెస్ట్ కెరీర్లో 33 వికెట్లు పడగొట్టాడు. 35 ఏళ్ల మాథ్యూస్ ఇప్పటికీ వన్డేల్లో, టీ20ల్లో లంక జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, పాక్తో రెండో టెస్ట్ ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్న మాథ్యూస్.. దీంతో పాటు పలు అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న వారిలో 100 టెస్ట్ల మార్కును అందుకున్న ఏడో ప్లేయర్గా రికార్డుల్లో నిలిచాడు. జేమ్స్ అండర్సన్ (172), స్టువర్ట్ బ్రాడ్ (156), జో రూట్ (121), నాథన్ లయన్ (110), ఇషాంత్ శర్మ (105), విరాట్ కోహ్లి (102) మాథ్యూస్కు ముందు 100 టెస్ట్లు ఆడారు. 2009లో పాకిస్తాన్పై టెస్ట్ ఆరంగ్రేటం చేసిన మాథ్యూస్.. తన 25వ, 50వ, 100వ టెస్ట్ మ్యాచ్లను అదే ప్రత్యర్థిపై ఆడాడు కెరీర్లో తొలి టెస్ట్, 100వ టెస్ట్ ఒకే వేదికపై (గాలే), ఒకే ప్రత్యర్ధిపై (పాక్) ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్కు ముందు ఈ ఫీట్ను విండీస్ ఆటగాడు కార్ల్ హూపర్ సాధించాడు. హూపర్.. భారత్పై ముంబై వేదికగా తొలి, 100వ టెస్ట్లను ఆడాడు. చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్లలో భారత క్రికెటర్లు..? -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్కు కొవిడ్ పాజిటివ్..!
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కొవిడ్ బారిన పడడంతో టెస్టు మధ్యలో తప్పుకున్నాడు. అతడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. ఇక మాథ్యూస్ స్థానంలో ఓషద ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మాథ్యూస్ 71 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఏంజెలో మాథ్యూస్కు కోవిడ్ పాజిటివ్గా నిర్దారణైంది. "గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీ-జెన్ పరీక్షలో అతడికి పాజిటివ్గా తేలింది. మిగిలిన ఆటగాళ్లకు నెగిటివ్గా తేలింది. మాథ్యూస్ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 109 పరుగుల అధిక్యం లభించింది. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైంది. చదవండి: SL vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..! 🔴 Angelo Mathews tested positive for Covid-19. He was found to be positive during a Rapid Anti-Gen Test Conducted on the player. The test was done, as the player was feeling unwell. He has been isolated from the rest of the team members and is following covid-19 protocols. pic.twitter.com/6fUBT7D04z — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 1, 2022 -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ICC Players of the Month- May: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్ విభాగంలో మే నెలకుగానూ శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్.. మహిళల విభాగంలో పాకిస్తాన్ స్పిన్ సంచలనం తుబా హసన్ ఈ అవార్డు గెలుచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీ మీడియా ప్రకటన విడుదల చేసింది. తొలి ఆటగాడిగా కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఏంజెలో మాథ్యూస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక.. బంగ్లాదేశ్లో పర్యటనలో భాగంగా చట్టోగ్రామ్, మీర్పూర్ టెస్టుల్లో కలిపి అతడు 344(వరుసగా 199, 145) పరుగులు సాధించాడు. తద్వారా లంక సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికై ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచిన తొలి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసి మాథ్యూస్.. తనకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, సిబ్బంది.. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మనపై మనకు నమ్మకం ఉంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదని, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి.. ఇక తుబా విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ శ్రీలంకతో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఈ సిరీస్లో మొత్తంగా 5 వికెట్లు పడగొట్టిన ఆమె.. పాక్ ఏకపక్ష విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన తుబాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Ind Vs SA 3rd T20: వైజాగ్లో గ్రౌండ్ చిన్నది.. అతడిని తప్పక ఆడించండి.. లేదంటే! Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లెవరంటే?
ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ఈ అవార్డు కోసం ముగ్గురు ఆసియా క్రికెటర్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. వారిలో శ్రీలంక సీనియర్ ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్, వెటరన్ బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్, శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి పాకిస్తాన్ యువ క్రికెటర్ తుబా హసన్, పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్, జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ నామినేట్ చేసింది. ఇక బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఏంజెలో మాథ్యూస్ అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో మాథ్యూస్ 344 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఇదే టెస్టు సిరీస్లో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్బుతంగా రాణించాడు. ఈ సిరీస్లో 303 పరుగులు రహీమ్ సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 5వేల పరుగుల సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ టెస్టు సిరీస్లో శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్,తుబా హసన్.. ఇటీవల ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్లో అదరగొట్టారు. అదే విధంగా జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ అరంగేట్ర మ్యాచ్లోనే ఫ్రాన్స్పై దుమ్మురేపింది. చదవండి: '10 వేల పరుగులు పూర్తి చేయడం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే' -
క్యాచ్ పడతానని ఊహించి ఉండడు.. అందుకే ఆ రియాక్షన్
శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు సీనియర్ బ్యాటర్ మాథ్యూస్ 14 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. తైజూల్ ఇస్లామ్ బౌలింగ్లో మాథ్యూస్ కాట్ అండ్ బౌల్డ్గా ఔటయ్యాడు. తైజూల్ వేసిన బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో బంతి ఫుల్టాస్ అయి బ్యాడ్ ఎడ్జ్ను తాకి వేగంగా వచ్చింది. క్యాచ్ కాష్టతరంగానే అనిపించినప్పటికి తైజూల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ను అందుకున్నాడు. ఆ తర్వాత అతనిచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది. క్యాచ్ పడతానని తైజూల్ ఊహించి ఉండడు.. అందుకే అలాంటి రియాక్షన్ ఇచ్చాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో మాథ్యూస్ తొలి ఇన్నింగ్స్లో 199 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. 397 బంతులెదుర్కొని 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 199 పరుగులు చేశాడు. అయితే 199 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్ ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 99, 199 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన తొలి బ్యాట్స్మన్గా మాథ్యూస్ నిలిచాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి లంక 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నిరోషన్ డిక్వెల్లా 61 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కరుణరత్నే 52, దినేష్ చండిమల్ 39, ధనుంజయ డిసిల్వా 33,కుషాల్ మెండిస్ 48 పరుగులు చేశారు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్లో 397 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మాథ్యూస్ నిలిచాడు. చదవండి: KKR VS LSG: కెమెరాకు చిక్కిన మిస్టరీ గర్ల్.. తన అందంతో కట్టిపడేసింది 🇧🇩v🇱🇰 Kya pakde ho!🤩 Two absolute stunners! Safe to say the Tigers were alert and ready to pounce! Speaking of catches, catch all the action from the @BCBtigers vs @OfficialSLC Test match, LIVE on #FanCode! 👉 https://t.co/UBuoElYSnG#BANvSL #TaijulIslam #MominulHaque pic.twitter.com/SPVBFiB83H — FanCode (@FanCode) May 19, 2022 -
డబుల్ చేజార్చుకున్న లంక క్రికెటర్.. టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022 సీజన్ రంజుగా సాగుతున్న వేళ టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య చట్టోగ్రామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక వెటరన్ ఆల్రౌండర్ ఏంజలో మాథ్యూస్ ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 153 ఓవర్లలో 397 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (54), దినేశ్ చండీమాల్ (66) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఏంజలో మాథ్యూస్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో 397 బంతులను ఎదుర్కొన్న మాథ్యూస్.. 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 199 పరుగులు చేసి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. నయీమ్ బౌలింగ్లో అనవసర షాట్ ఆడిన మాథ్యూస్ తృటిలో కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న 12వ ఆటగాడిగా, మూడో లంక క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. 1984లో పాక్ ఆటగాడు ముదస్సర్ నాజర్ భారత్పై, 1986లో మహ్మద్ అజహారుద్దీన్ శ్రీలంకపై, 1997లో మాథ్యూ ఇలియట్ (ఆసీస్) ఇంగ్లండ్పై, అదే ఏడాది సనత్ జయసూర్య భారత్పై, 1999లో స్టీవ్ వా వెస్టిండీస్పై, 2006లో యూనిస్ ఖాన్ భారత్పై, 2008లో ఇయాన్ బెల్ సౌతాఫ్రికాపై, 2015లో స్టీవ్ స్మిత్ వెస్టిండీస్పై, 2016లో కేఎల్ రాహుల్ ఇంగ్లండ్పై, 2017లో డీన్ ఎల్గర్ బంగ్లాదేశ్పై, 2020లో డెప్లెసిస్ శ్రీలంకపై డబుల్ చేసే అవకాశాన్ని పరుగు తేడాతో కోల్పోయారు. అంతకుముందు మాథ్యూస్ 2009లో భారత్తో జరిగిన మ్యాచ్లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ, డబుల్ సెంచరీని పరుగు తేడాతో మిస్ ఏకైక క్రికెటర్గా మాథ్యూస్ రికార్డు సాధించాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. హసన్ రాయ్ (31), తమీమ్ ఇక్బాల్ (35) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 397 పరుగులకు ఆలౌటైంది. నయీమ్ 6 వికెట్లతో సత్తా చాటగా, వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఇంగ్లండ్ పర్యటనకు రహానే దూరం -
భారత్తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక.. సీనియర్ ఆటగాడు రీ ఎంట్రీ
భారత్తో జరిగే రెండు టెస్టుల కోసం 18 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టును శ్రీలంక సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు దిముత్ కరుణరత్నే నాయకత్వం వహించనున్నాడు.దాదాపు ఐదు ఏళ్ల తర్వాత భారత్లో శ్రీలంకకు ఇది మొదటి టెస్ట్ సిరీస్. 2017లో చివర సారిగా భారత్లో శ్రీలంక టెస్ట్ సిరీస్లో తలపడింది. ఇక టెస్ట్ సిరీస్కు కూడా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా దూరమయ్యాడు. అదే విధంగా సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక సీనియర్ బౌలర్ సురంగ లక్మల్కు ఇదే చివరి టెస్ట్ సిరీస్. భారత్తో టెస్ట్ సిరీస్ అనంతరం టెస్టుల నుంచి లక్మల్ తప్పుకోనున్నాడు. ఇక శ్రీలంకతో టెస్ట్లకు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటన చేసింది. కాగా భారత్-శ్రీలంక తొలి టెస్ట్ మోహాలి వేదికగా మార్చి 4నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక టెస్టు జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, లహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా (వైస్ కెప్టెన్), కుసాల్ మెండిస్ ), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా, చమిక కరుణరత్నే, రమేష్ మెండిస్, లాహిరు కుమార, సురంగ లక్మల్, దుష్మంత చమీర, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్దేనియా చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్గా రోహిత్! -
లంక క్రికెట్లో పెను సంక్షోభం.. రిటైర్మెంట్ యోచనలో స్టార్ క్రికెటర్
కొలంబో: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాశించిన శ్రీలంక క్రికెట్ జటు,ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్ద కాలం కిందటితో పోలిస్తే ఇప్పుడు జట్టు పూర్తి బలహీనంగా మారడం, వరుస ఓటములు, బోర్డుతో క్రికెటర్ల విభేదాలు.. శ్రీలంక క్రికెట్ను కష్టాల్లోకి నెట్టాయి. కాంట్రాక్ట్పై సంతకం చేసేందుకు లంక క్రికెటర్లు నో అంటున్నారన్న వార్తల నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ ఏంజలో మాథ్యూస్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నారన్న వార్త సంచలనంగా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని అతను శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, వన్డేలు, టీ20ల నుంచి తనను తప్పించడంపై మాథ్యూస్ అసంతృప్తితో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు ఛాన్సిచ్చే పేరుతో లంక సెలక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. అయితే దశాబ్ద కాలంగా శ్రీలంక క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న చాలా తక్కువ మంది క్రికెటర్లలో మాథ్యూస్ ఒకడు. 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని సగటు 63 కాగా, 2018లో 52గా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్లో లంక జట్టు తరఫున బెస్ట్ బ్యాట్స్మన్ కూడా అతడే. అయితే తాజాగా లంక బోర్డు కాంట్రాక్ట్ను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ప్లేయర్స్కు నాయకత్వం వహించిన మాథ్యూస్.. అనూహ్యంగా కాంట్రాక్ట్పై సంతకం చేయడానికి అంగీకరించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన మాథ్యూస్ లంక తరఫున 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మొత్తం 13,219 పరుగులు, 218 వికెట్లు పడగొట్టాడు. -
మాథ్యూస్ డబుల్ సెంచరీ
హరారే: ఎంజెలో మాథ్యూస్ టెస్టు కెరీర్లో తొలిసారి డబుల్ సెంచరీ (200 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్స్లు)తో కదం తొక్కడంతో... జింబాబ్వేతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 519 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో శ్రీలంక 157 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే బుధవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ప్రిన్స్ మస్వౌరే (15 బ్యాటింగ్; 2 ఫోర్లు), బ్రియాన్ ముద్జింగన్యమ (14 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 295/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన శ్రీలంకను మాథ్యూస్ ముందుకు నడిపించాడు. అతడు ధనంజయ డిసిల్వా (63; 7 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్కు 98 పరుగులు... డిక్వెల్లా (63; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 136 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే మాథ్యూస్ 272 బంతుల్లో శతకాన్ని, 468 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. -
టి20 జట్టులో మాథ్యూస్ రీఎంట్రీ
కొలంబో: దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్రౌండర్ ఎంజెలో మాథ్యూస్ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు. భారత్తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్ షనక, కుశాల్ పెరీరా, డిక్వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, సందకన్, కసున్ రజిత. -
భారత్ విజయ లక్ష్యం 265
-
మాథ్యూస్కు భారత్పైనే ‘మూడు’
లీడ్స్: వన్డే ప్రపంచకప్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్(113; 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని మాథ్యూస్ శతకంతో సత్తా చాటాడు. శ్రీలంక స్వల్ప వ్యవధిలో ప్రధాన వికెట్లు కష్టాల్లో పడ్డ సమయంలో మాథ్యూస్ ఆదుకున్నాడు. లహిరు తిరిమన్నే(53; 68 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తిరిమన్నేను ఐదో వికెట్గా కుల్దీప్ ఔట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై ధనంజయ డిసిల్వాతో కలిసి మరోసారి ఇన్నింగ్స్ను నిర్మించే యత్నం చేశాడు. ఈ జోడి 74 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలోనే 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది మాథ్యూస్కు మూడో వన్డే సెంచరీ కాగా, ఆ మూడు సెంచరీలు భారత్పైనే చేయడం ఇక్కడ విశేషం. డిసిల్వా(29 నాటౌట్) చివరి వరకూ క్రీజ్లో ఉండటంతో శ్రీలంక 265 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన లంకేయులు ఆదిలోనే షాక్ తగలింది. లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే(10) నిరాశపరచగా, కాసేపటకి కుశాల్ పెరీరా(18) కూడా పెవిలియన్ చేరాడు. దాంతో లంక 40 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను జస్ప్రీత్ బుమ్రా సాధించాడు. కొద్ది సేపటి తర్వాత అవిష్కా ఫెర్నాండో(20)ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించగా,కుశాల్ మెండిస్ను జడేజా ఔట్ చేశాడు. దాంతో 55 పరుగులకే లంకేయులు నాలుగు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తర్వాత తనకు భారత్పై ఉన్న మంచి రికార్డును కొనసాగిస్తూ మాథ్యూస్ సమయోచితంగా ఆడాడు. వంద పరుగులకు పైగా భాగస్వామ్యంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా సెంచరీ సాధించాడు. దాంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్లు తలో వికెట్ తీశారు. -
8 నెలల తర్వాత బౌలింగ్.. తొలి బంతికే.!
చెస్టర్ లీ స్ట్రీట్ : ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యుస్ మరోసారి నిరూపించాడు. సోమవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడెప్పుడో బౌలింగ్ చేసిన మాథ్యుస్ సరిగ్గా 8 నెలల తర్వాత క్లిష్ట సమయంలో బంతిని అందుకొని తొలి బంతికే కీలక వికట్ పడగొట్టి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ను వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత శతకంతో గెలుపు దిశగా తీసుకెళ్లాడు. విండీస్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులో సెంచరీ హీరో పూరన్తో షెల్డాన్ కాట్రెల్లు ఉన్నారు. పూరన్ దూకుడు చూసి విండీస్ విజయం ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా బంతిని అందుకున్న మాథ్యుస్ తొలి బంతికే అతడిని పెవిలియన్ చేర్చాడు. ఆఫ్స్టంప్ దిశగా వేసిన బంతిని పూరన్ కవర్స్ దిశగా ఆడాలని ప్రయత్నించగా.. అది కాస్త బ్యాట్కు ఎడ్జై కీపర్ కుసాల్ పెరెరా చేతిలో పడింది. అంతే శ్రీలంక ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. అయితే మ్యాచ్ అనంతరం ఈ వికెట్పై మాథ్యూస్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ గత 8 నెలలుగా నేను బౌలింగ్ చేయని విషయం మీకు తెలిసిందే. ఇది నేను 8 నెలల తర్వాత వేసిన తొలి బంతి. మేం గెలవాలంటే రెండు ఓవర్లు జాగ్రత్తగా వేయాలి. విధ్వంసకరంగా ఆడుతున్న పూరన్ ఉండగా స్పిన్నర్లతో వేయించలేం. ఇలాంటి క్లిష్టసమయంలో నేను మా కెప్టెన్ దగ్గరకు వెళ్లి.. నాకు ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తానని చెప్పాను. దీనికి సానుకూలంగా స్పందించిన కెప్టెన్ నాకు అవకాశం ఇచ్చాడు’ అని మాథ్యూస్ చెప్పుకొచ్చాడు. ఇక రెండు ఓవర్లు వేసిన మాథ్యుస్ కేవలం 6 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి : లంక విజయం -
మాథ్యూస్కు వెల్కమ్.. చండిమల్కు బైబై
కొలంబో: వచ్చే నెలలో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇప్పటికే లసిత్ మలింగాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించి దిముత్ కరుణరత్నేను సారథిగా నియమించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. తాజాగా పూర్తి జట్టును ప్రకటించింది. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ను తిరిగి జట్టులోకి తీసుకోగా, గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న చండిమల్కు ఉద్వాసన పలికింది. అదే సమయంలో మలింగాను సైతం జట్టులో ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా మోచేతి గాయం కారణంగా జట్టుకు దూరమైన మాథ్యూస్.. తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. వరల్డ్కప్ సెలక్షన్ ట్రయల్లో భాగంగా దంబుల్లా తరఫున కాంపిటేటివ్ క్రికెట్ ఆడిన మాథ్యూస్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 227 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉన్నాయి. దాంతో మాథ్యూస్ ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. మరొకవైపు చండిమల్ పేలవమైన ఫామ్తో వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శ్రీలంక వరల్డ్కప్ జట్టు ఇదే.. దిముత్ కరుణరత్నే(కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, లహిరు తిరుమన్నే, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వ, జీవన్ మెండిస్, మిలింద్ సిరివర్దనా, ఏంజెలో మాథ్యూస్, తిషారా పెరీరా, ఇసురు ఉదానా, లసిత్ మలింగా, సురంగా లక్మల్, జెఫ్రీ వాండర్సే, నువాన్ ప్రదీప్ స్టాండ్బై ఆటగాళ్లు.. ఒషాదా ఫెర్నాండో, కసున్ రజితా, హసరంగా, ఏంజెలో పెరీరా -
కెప్టెన్సీ నుంచి మాథ్యూస్కు ఉద్వాసన
కొలంబో: ఆసియా కప్లో పేలవ ప్రదర్శన కనబరిచిన శ్రీలంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్పై వేటు పడింది. వన్డే, టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి మాథ్యూస్ను తప్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. దుబాయ్, అబుదాబిల్లో జరుగుతున్న ఆసియా కప్లో లంక అనూహ్యంగా తక్కువ ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన కోసం అతని స్థానంలో దినేశ్ చండిమాల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే అతను టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఇక మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత రెండేళ్లలోనే లంక బోర్డు వన్డేల్లో ఆరు మంది కెప్టెన్లను మార్చింది. టెస్టుల్లో, టి20ల్లో నలుగురు చొప్పున కెప్టెన్లను మార్చింది. వన్డేల్లో అసలు స్థిరమైన నాయకత్వమే లేకుండా తరంగ, మాథ్యూస్, కపుగెడెర, మలింగ, తిసారా పెరీరా, చండిమాల్లను తరచూ మార్చేసింది. బలిపశువును చేశారు... ఆసియా కప్ వైఫల్యానికి తనను ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ బలిపశువును చేయడం అన్యాయమని మాథ్యూస్ ఆరోపించాడు. ఆ టోర్నీలో అంతా విఫలమైనపుడు తాను మాత్రం చేయగలిగేదేమి లేదని అన్నాడు. తాజా పరిస్థితులపై కలత చెందానని రిటైర్మెంట్ ప్రకటిస్తానని బోర్డును ఉద్దేశించి హెచ్చరించాడు. -
నన్ను బలి పశువును చేశారు: మాథ్యూస్
కొలంబో: తనను శ్రీలంక వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై ఏంజెలో మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో తమ జట్టు లీగ్ దశ నుంచే నిష్ర్కమించడాన్ని సాకుగా చూపుతూ వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. శ్రీలంక జట్టు ఓవరాల్ ప్రదర్శనకు తనను బలి పశువును చేశారని మాథ్యూస్ విమర్శించాడు. ‘ఆసియాకప్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లపై శ్రీలంక పేలవ ప్రదర్శనకు నన్ను బలి పశువును చేశారు. నన్ను కెప్టెన్సీ నుంచి ఉన్నపళంగా తప్పించారు. ఈ విషయంలో నన్ను ఒక్కడ్నే బాధ్యున్ని చేయడం సబబేనా’ అని శ్రీలంక క్రికెట్ బోర్డుకు మాథ్యూస్ లేఖ రాశాడు. అయితే దీన్ని లంక బోర్డు సమర్ధించుకుంది. దినేశ్ చండీమాల్కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే క్రమంలోనే మాథ్యూస్ను తప్పించినట్లు పేర్కొంది. త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న సందర్భంలో కెప్టెన్ను మార్చినట్లు బోర్డు తెలిపింది. -
ట్రై సిరీస్కు మాథ్యూస్ దూరం
కొలంబో:వచ్చే నెల మొదటి వారంలో భారత్, బంగ్లాదేశ్ జట్లతో ఆరంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక కీలక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మాథ్యూస్కు కాలిపిక్క గాయం కావడంతో అతను ట్రైసిరీస్కు దూరమవుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ప్రకటించింది. ట్రై సిరీస్ నుంచి మాథ్యూస్ ఉన్నపళంగా తప్పుకోవడం నిరాశకు గురి చేసిందని లంక మేనేజ్మెంట్ పేర్కొంది. గత నెల్లో శ్రీలంక వన్డే జట్టుకు కెప్టెన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన మాథ్యూస్.. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే మాథ్యూస్కు గాయం పెద్దది కాకపోయినా, ఎస్ఎల్సీ వైద్య బృందం నుంచి క్లియరెన్స్ లభించలేదు. ఫలితంగా సిరీస్కు మాథ్యూస్ దూరం కానున్నాడు. మార్చి 6 వ తేదీ నుంచి శ్రీలంకలో ట్రై సిరీస్ ఆరంభం కానుంది. -
'అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు'
కొలంబో:శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్గా ఏంజెలో మాథ్యూస్ను తిరిగి ఎంపిక చేశారు. ఈ మేరకు మాథ్యూస్ను 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ సారథిగా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) మంగళవారం ప్రకటించింది. గతేడాది జూలై నెలలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పిన మాథ్యూస్ను మళ్లీ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.అయితే దీనిపై స్పందించిన మాథ్యూస్..' గతంలో సారథిగా తప్పుకున్నప్పుడే ఇక ఎప్పుడూ ఆ బాధ్యతల్ని మీద వేసుకోవాలని అనుకోలేదు. కాకపోతే ఎస్ఎల్సీ, ప్రధాన కోచ్, శ్రీలంక సెలక్టర్లు నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పట్టుబట్టారు. అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నా. వచ్చే వరల్డ్ కప్కు సమతుకంతో కూడిన జట్టును తయారు చేయాల్సి ఉంది. ఆ మెగా ఈవెంట్కు 18 నెలలు కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. నేను తిరిగి కెప్టెన్సీ చేపట్టడంలో మెంటర్ చందికా హతురసింఘా పాత్ర కీలకం. అతని ప్రేరణతోనే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించా'అని మాథ్యూస్ తెలిపాడు. -
నాలుగో వికెట్ పడగొట్టిన బర్త్డేబాయ్
న్యూఢిల్లీ: భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 31/3 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన లంకను ఆరంభంలోనే బర్త్డే బాయ్ రవీంద్ర జడేజా దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన ఏంజెలో మాథ్యూస్(1)ను అద్భుత బంతితో పెవిలియన్కు చేర్చాడు. మాథ్యూస్ బ్యాట్కు తగిలిన బంతి స్లిప్ వైపు దూసుకురాగా రహానే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ చండిమాల్తో డిసిల్వా(24) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇక (డిసెంబర్ 6) నేడు 29వ బర్త్డే జరుపుకుంటున్న జడేజా.. నాలుగో రోజు చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు విడగొట్టారు..
ఢిల్లీ: భారత్తో మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాథ్యూస్-చండిమాల్ సుదీర్ఘ భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు ఆటలో రెండు సెషన్లు పాటు భారత్ జట్టుకు పరీక్ష పెట్టిన ఈ జోడిని చివరకు అశ్విన్ విడగొట్టాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 98 ఓవర్ చివరి బంతికి సాహాకు క్యాచ్ ఇచ్చిన మాథ్యూస్(111) పెవిలియన్ చేరాడు. దాంతో వీరి 181 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆపై మరో నాలుగు ఓవర్లు వేసిన తరువాత టీ బ్రేక్ ఇచ్చాడు. మూడో రోజు టీ విరామానికి లంక జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ప్రస్తుతం చండిమాల్(98 బ్యాటింగ్), సదీరా(4 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. మాథ్యూస్-చండిమాల్ దాదాపు 50 ఓవర్లకు పైగా ఆడటంతో లంకేయలు గాడిలో పడ్డారు. 131/3 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ ను ఆరంభించిన వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే మాథ్యూస్ 231 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. -
మాథ్యూస్ శతక్కొట్టుడు..
ఢిల్లీ: భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ శతకం సాధించాడు. సోమవారం మూడో రోజు ఆటలో మాథ్యూస్ సెంచరీ నమోదు చేశాడు. 231 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. 57 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన మాథ్యూస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది మాథ్యూస్కు ఎనిమిదో టెస్టు సెంచరీ. మరొకవైపు మరో ఓవర్ నైట్ ఆటగాడు చండిమాల్ హాఫ్ సెంచరీతో మాథ్యూస్కు చక్కటి సహకారం అందిండంతో లంకేయులు తిరిగి తేరుకున్నారు. 131/3 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ ను ఆరంభించిన వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాథ్యూస్ శతకాన్ని, చండిమాల్ హాఫ్ సెంచరీని సాధించారు. ఈ జోడి 136 అజేయ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో లంక జట్టు 81.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో దాదాపు 35 ఓవర్లు బౌలింగ్ వేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్ను కూడా సాధించలేకపోయారు. -
మాథ్యూస్ చేసింది సరైంది కాదు..
కొలంబో:గత నెలలో శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెబుతూ ఏంజెలో మాథ్యూస్ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదని ఆ దేశ దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెబితే శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఎలా అనుమతి ఇచ్చిందని రణతుంగ ప్రశ్నించాడు. అతను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందన్నాడు. జట్టు అవసరాల దృష్ట్యా అతన్ని మరికొంత కాలం కెప్టెన్ గా కొనసాగమని ఎస్ఎల్సీ పెద్దలు కోరి ఉండాల్సిందన్నాడు. ఒకవేళ కెప్టెన్సీ విషయంలో తనను మాథ్యూస్ అడిగితే అనుమతి ఇచ్చేవాడిని కాదన్నాడు. అందుకు ఇది తగిన సమయం కాదని చెప్పేవాడినని రణతుంగ పేర్కొన్నాడు. 'నేను చూసిన లంక కెప్టెన్లలో మాథ్యూస్ ఒక అత్యుత్తమ కెప్టెన్. రంజన్ మదుగలే తరువాత ఆ స్థాయి ఉన్న కెప్టెన్ మాథ్యూస్. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని బోర్డుకు చెప్పినప్పుడు అందుకు అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. నీ నిర్ణయాన్ని కొన్నాళ్లు అలా ఉంచుకోమని బోర్డు చెప్పి ఉండాల్సింది. అది చేయకపోవడంతో లంక జట్టు పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. గతేడాది ఆసీస్ వంటి నంబర్ వన్ జట్టును మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక వైట్ వాష్ చేసింది. ఆ క్రెడిట్ మాథ్యూస్ తో పాటు యావత్ జట్టుకు దక్కింది. అయితే జట్టు ఓటములకే మాథ్యూస్ ను బలి పశువును చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. ఈ కారణం చేత మాథ్యూస్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బె చెప్పాడు. మాథ్యూస్ సానుకూల ధోరణి గల కెప్టెన్. అతను ఆత్మవిశ్వాసం సడలడానికి మా క్రికెట్ బోర్డే కారణం'అని రణతుంగా తెలిపాడు. -
లంక కెప్టెన్సీకి మాథ్యూస్ బైబై
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ సారథ్యానికి గుడ్బై చెప్పాడు. టెస్టు, వన్డే, టి20 ఈ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బలహీనమైన జింబాబ్వేతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ను లంక జట్టు కోల్పోవడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2–3తో జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పుకొచ్చిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను లంక క్లీన్స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్లో అతను గాయంతో కీలకమైన సిరీస్లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లకు అతను గైర్హాజరయ్యాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా లంక తరఫున యువ కెప్టెన్గా మాథ్యూస్ ఘనతకెక్కాడు. -
లేటు వయసులో కెప్టెన్సీ
శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ కు లేటు వయసులో కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. టెస్టు టీమ్ కెప్టెన్ గా అతడు ఎంపికయ్యాడు. జింబాబ్వే జరగనున్న రెండు టెస్టుల సిరీస్ లో జట్టుకు అతడు నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, వైస్ కెప్టెన్ దినేశ్ చందిమాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో హెరాత్ కు అవకాశం వచ్చింది. టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన 17 ఏళ్ల తర్వాత అతడికి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం దక్కడం విశేషం. 38 ఏళ్ల హెరాత్ పెద్ద వయసులో కెప్టెన్ ఛాన్స్ దక్కించున్న శ్రీలంక ప్లేయర్ గా ఘనత సాధించనున్నాడు. సోమచంద్ర డిసిల్వా తర్వాత టెస్టు జట్టుకు నాయకుడిగా ఎంపికైన బౌలర్ హెరాత్ ఒక్కడే. 1999లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన అతడు ఇప్పటివరకు 73 టెస్టులు, 71 వన్డేలు, 17 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 332 వికెట్లు పడగొట్టాడు. -
రెండో వన్డేలో 'కంగారు' పడ్డారు!
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో 82 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 47.2ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కీపర్ మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీతో(88 బంతుల్లో 76 పరుగులు; 4 ఫోర్లు) ఆకట్టుకున్నా ఇతర బ్యాట్స్ మన్ నుంచి సహకారం లేకపోవడంతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో ఓటమిపాలైన లంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన శ్రీలంక 48.5ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. లంక తన చివరి 5 వికెట్లను 17 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో సాధారణ స్కోరుకు పరిమితమైంది. లంక ఇన్నింగ్స్: ఆరంభంలో కాస్త తడబడిన లంక కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు), చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్ కు సెంచరీ(125 పరుగుల) భాగస్వామ్యంతో కోలుకుంది. వీరిద్దరిని ఆసీస్ బౌలర్ జంపా స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ఫలితంగా 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంకకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆరో వికెట్ కు కుశాల్ పెరీరా(53 బంతుల్లో 54 పరుగులు: 5 ఫోర్లు, 1 సిక్స్), లంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్(60 బంతుల్లో 57 పరుగులు: 1 ఫోర్, 1 సిక్స్) రాణించి సెంచరీ భాగస్వామ్యాన్ని (103పరుగులు) జతచేశారు. చివర్లో ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం, ఒకే ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో 300 స్కోరు దాటేలా కనిపించిన లంక 288 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జంపా, ఫాల్కనర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ ఒక్క వికెట్ తీశాడు. ఆసీస్ ఇన్నింగ్స్: ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ స్మిత్(30), బెయిలీ(27) పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా లంక బౌలర్లు విజృంభించడంతో ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. చివర్లో హెడ్(31) పరవాలేదనిపించాడు. చివరి రెండు వికెట్లను అపాన్సో తన ఖాతాలో వేసుకున్నాడు. 206 పరుగుల వద్ద ఫాల్కనర్(13) ను ఎల్బీడబ్ల్యూగా అపాన్సో వెనక్కి పంపడంతో ఆసీస్ ఆలౌటైంది. లంక బౌలర్లలో అపాన్సో నాలుగు వికెట్లు పడగొట్టాడు. తీశారా పెరీరా 3 వికెట్లు తీయగా, మాథ్యూస్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
'దిల్రువాన్ సైలెంట్ హీరో'
గాలె: ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరాను శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 'సైలెంట్ హీరో'గా వర్ణించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పెరీరా పది వికెట్లు తీయడంతో పాటు అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ గా నిలిచాడు. 11 టెస్టుల్లోనే అతడు ఈ ఫీట్ సాధించాడు. అజంతా మెండిస్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మెండిస్ 12 టెస్టుల్లో 50 వికెట్లు తీశాడు. 'రంగనా హిరాత్ గురించి మేమంతా ఎక్కువగా మాట్లాడుతున్నాం. దిల్రువాన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ అతడు వేగంగా 50 టెస్టు వికెట్లు సాధించాడు. అతడు నినాదంగా తన పని తాను చేశాడు. దిల్రువాన్ సైలెంట్ హీరో. గత మ్యాచ్ లో బౌలింగ్ చేసే అవకాశం అతడికి ఇవ్వలేదు. అతడు చురుకైన బౌలర్. గాలె మైదానంలో ఎలా బౌలింగ్ చేయాలో దిల్రువాన్ కు తెలుసు. శిక్షణా శిబిరంలో చాలా కష్టపడతాడు. రాబోయే రోజుల్లో అతడి బౌలింగ్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటామ'ని మ్యాచ్ ముగిసిన తర్వాత మాథ్యూస్ అన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ను శ్రీలంక మరో టెస్టు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మూడో టెస్టు 13 నుంచి జరుగుతుంది. -
'కంగారు'లకు హెరాత్ గండం!
గాలే(శ్రీలంక): ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత విజయం సాధించిన శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్ ను నెగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి లంక గెలిచినప్పుడు తాను చిన్న పిల్లాడినని కెప్టెన్ మాథ్యూస్ పేర్కొన్నాడు. గాలేలో చివరి టెస్టులో హెరాత్ 10 వికెట్లతో చెలరేగిన విషయాన్ని గుర్తుచేశాడు. బ్యాటింగ్ లో చాలా లోపాలున్నా, గత మ్యాచ్ విజయంతో అదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. స్పిన్నర్ రంగన హెరాత్ (9/103) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పాటు యువ సంచలనం కుశాల్ మెండిస్ తొలి టెస్టు భారీ సెంచరీ(176 పరుగులు) లంకకు విజయాన్ని అందించాయి. ఆడుతున్నటి తొలి టెస్టు అయినా లక్షణ్ సందకన్ 7 వికెట్లు తీసి ఆసీస్ పై ఒత్తిడి పెంచాడు. గత మ్యాచులో ఆసీస్ భరతం పట్టిన హెరాత్.. 1999లో ఆసీస్ పై శ్రీలంక గెలిచిన తొలి మ్యాచ్ లోనే టెస్టు అరంగేట్రం చేయడం గమనార్హం. ఆ లెక్కన చూస్తే ఆసీస్ పై నెగ్గిన రెండు పర్యాయాలు జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు హెరాత్. గాలేలో తొలి రెండు రోజులు స్పిన్ కు అనుకూలిస్తుందని, ఉపఖండంలో ఎలాగూ స్పిన్నర్లదే హవా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆసీస్ కూడా బ్యాటింగ్ లో చాలా బలహీనంగా ఉంది. తొలి టెస్టులో కేవలం స్టీవెన్ స్మిత్ ఒక్కడు మాత్రమే హాప్ సెంచరీ చేశాడు. -
'మా బ్యాటింగ్ చాలా హేళనగా ఉంది'
హమిల్టన్: న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఘోరంగా విఫలం కావడంతో ఆటగాళ్లపై కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తీవ్రంగా మండిపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించి కూడా మ్యాచ్ ను కోల్పోవడం చాలా అసంతృప్తిగా ఉందన్నాడు. తమ బ్యాటింగ్ చాలా హేళనగా ఉందంటూ విమర్శించాడు. 'మ్యా బాటింగ్ చాలా హేళనగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో పైచేయి సాధించి కూడా టెస్టు మ్యాచ్ ను నాలుగు రోజుల్లోపే కివీస్ కు సమర్పించాం.రెండో ఇన్నింగ్స్ లో మా బ్యాటింగ్ చాలా ఘోరంగా ఉంది. కనీసం బౌలర్లు పోరాడాలంటే బోర్డుపై సాధ్యమైనన్ని పరుగులుండాలి. దాన్ని చేరుకోలేకపోయాం. మ్యాచ్ ముగిసిన తీరు తీవ్రంగా కలిచివేసింది. కివీస్ బౌలింగ్-బ్యాటింగ్ అద్భుతంగా ఉంది' అని మాథ్యూస్ పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో లంచ్ కు ముందు వరకూ శ్రీలంక 71 పరుగులు చేసి వికెట్ కూడా కోల్పోలేదు. అప్పటికి లంకేయులు 126 పరుగులు ఆధిక్యంలో ఉండటంతో పాటు చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు, మరో 56 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో మాథ్యూస్ (77) ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్ లో(2) నిరాశపరిచాడు. చివరి టెస్టులో శ్రీలంక నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా 142/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ మరో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.న్యూజిలాండ్ ఆటగాళ్లలో విలియమ్సన్(108 నాటౌట్;164 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో రాణించి జట్టు ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ రోజు ఆటలో న్యూజిలాండ్ లంచ్ లోపే విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. -
'వీళ్లేమీ సచిన్లు, ద్రావిడ్లు కారు'
కొలంబో: ప్రస్తుత టీమిండియా బ్యాట్స్మెన్.. సచిన్, ద్రావిడ్లు కారని, స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఈ దిగ్గజాలతో పోల్చరాదని శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ అన్నాడు. సచిన్, ద్రావిడ్ల మాదిరిగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్లో ఆడలేరని మాథ్యూస్ చెప్పాడు. తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యసాధనలో టీమిండియా బ్యాట్స్మెన్ స్పిన్కు తడబడి 63 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంకల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు జరగనుంది. మ్యాచ్ ముందు రోజు బుధవారం మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్లో ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. భారత జట్టులో ఏ క్రికెటర్నూ సచిన్, ద్రావిడ్లతో పోల్చరాదని చెప్పాడు. భారత యువ బ్యాట్స్మెన్ను సచిన్, ద్రావిడ్లతో ఎలా పోల్చరాదో.. తమ జట్టులోని యువ ఆటగాళ్లను మహేల జయవర్ధనె, సంగక్కరలతో పోల్చరాదని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. -
కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!
రాంచీ: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, ఎంజెలో మాథ్యూస్ సమాన స్కోర్లు సాధించారు. అంతేకాకుండా ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. మాథ్యూస్ 139, కోహ్లి 139 పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ అద్భుతంగా ఆడాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన మాథ్యూస్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 116 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 139 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన కోహ్లి కూడా సరిగ్గా 139 పరుగులే చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లి 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు సాధించాడు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్(మాథ్యూస్), మ్యాన్ ఆఫ్ ద సిరీస్(కోహ్లి)లు వీరిద్దరికే దక్కడం విశేషం. -
ఫైనల్లో శ్రీలంక
మిర్పూర్: అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న శ్రీలంక జట్టు ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్ ఆటగాడు కుమార సంగక్కర (102 బంతులో 76; 6 ఫోర్లు; 1 సిక్స్) తనదైన జోరును మరోసారి ప్రదర్శించడంతో... సోమవారం షేర్ ఎ బంగ్లా మైదానంలో అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో లంక 129 పరుగుల తేడాతో నెగ్గింది. బోనస్ పాయింట్తో మొత్తం 13 పాయింట్లకు చేరిన లంక ఫైనల్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 253 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (41 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు), కుషాల్ పెరీరా (49 బంతుల్లో 33; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. 83 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన లంకను చండిమాల్ (41 బంతుల్లో 26; 1 ఫోర్)తో కలిసి సంగ ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 74 పరుగులు జోడించారు. మాథ్యూస్ చెలరేగడంతో చివరి పది ఓవర్లలో లంక 129 పరుగులు సాధించింది. మిర్వాయిస్ అష్రాఫ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు బ్యాటింగ్కు దిగిన అఫ్ఘాన్ 38.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ నబీ (43 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఏడుగురు బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన అఫ్ఘాన్... చివర్లో మూడు పరుగుల వ్యవధిలో ఆఖరి ఐదు వికెట్లను కోల్పోయింది. పెరీరా, మెండిస్లు మూడేసి వికెట్లు.. లక్మల్, డి సిల్వలు రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంగక్కరకు లభించింది.