baby shower
-
'కాంచన 3' నటి సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం చేసిన కేజీఎఫ్ నటుడు (ఫోటోలు)
-
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం
హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.ఎవరీ హరిప్రియ?హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్కు పరిచయమైంది.(చదవండి: హీరోయిన్పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్పై మహిళా కమిషన్ ఆగ్రహం)తెలుగులోనూ హీరోయిన్గా..యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.కేజీఎఫ్ మూవీలో విలన్గా..వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.అలా మొదలైన ప్రేమకథఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్తో ఆ స్టెప్పులు! -
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్.. ఘనంగా భార్య సీమంతం (ఫొటోలు)
-
హీరోయిన్ హర్షిక బేబీ షవర్.. హోస్ట్ చేసింది స్టార్ హీరోనే (ఫొటోలు)
-
బిగ్బాస్ సుజాత సీమంతం 'ఫోటోలు' షేర్ చేసిన రాకింగ్ రాకేశ్ (ఫొటోలు)
-
ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోలు వైరల్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్కి త్వరలో మరో బుజ్జాయి
ప్రముఖ హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ వేడుకలు చేసుకుంది. బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే ఈమెకు పాప ఉండగా.. త్వరలో మరో బిడ్డ పుట్టనుంది.(ఇదీ చదవండి: కూతురికి రామ్చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్కు మగధీరతో లింక్!)కర్ణాటకకు చెందిన ప్రణీత సుభాష్.. 2010లో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం తదితర సినిమాల్లో నటించింది. మలయాళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2021లో నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాదికే అర్న అనే అమ్మాయి పుట్టింది. కొన్నాళ్ల క్రితం తాను మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించింది.ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న ప్రణీత.. తాజాగా తనకు బేబీ షవర్ వేడుకలు చేసినట్లు పేర్కొంది. అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్ బట్టి చూస్తే మరికొన్నిరోజుల్లో ప్రణీత మరో బిడ్డకి జన్మనివ్వనుంది. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సీరియల్ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లో ఉంటున్నారు. బుల్లితెర నటి సీమంతంఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.వేడుకల ఫోటోలు2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi) చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్ ఆఫర్ -
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
Maheshwari: వైభవంగా బుల్లితెర నటి సీమంతం (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఇది రెండోసారి!
బుల్లితెర నటి మహేశ్వరి త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. ఇప్పటికే మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్తో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ హంగామా అంతా ఎలా జరిగిందో కూడా వివరిస్తూ యూట్యూబ్లో వీడియోలు చేసింది. భార్య అంటే పంచప్రాణాలైన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు గత నెలలో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి సీమంతం మహేశ్వరికి మాటైనా చెప్పకుండా అన్నీ అరేంజ్ చేసి సీమంతం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకుని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది మహేశ్వరి. ఫ్యాన్స్ విషెస్ ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్లో నటించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్త శివనాగ్తో కలిసి పార్టిసిపేట్ చేసింది. వీరికి హరిణి అనే కూతురు ఉంది. చదవండి: మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్ మేనమామ కామెంట్లు వైరల్ -
Amala Paul Baby Shower: గ్రాండ్గా హీరోయిన్ అమలాపాల్ సీమంతం ఫోటోలు వైరల్
-
ప్రియుడితో పెళ్లి.. ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్కు జంటగా ఆడుజీవితం చిత్రంలో మెరిసింది. అయితే గతేడాది తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. తన ప్రియుడు జగత్ దేశాయ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకన్న అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. గుజరాత్లోని సూరత్లో ఈ ఫంక్షన్ను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది భామ. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో అమలాపాల్ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
గ్రాండ్గా బుల్లితెర నటి సీమంతం.. ఫోటోలు వైరల్!
యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి మోహెనా కుమారి సింగ్. ఆ తర్వాత నయా అక్బర్ బీర్బల్, సిల్సిలా ప్యార్ కా, ప్యార్ తునే క్యా కియా, కుబూల్ హై లాంటి సిరీస్ల్లో కనిపించింది. ఆ తర్వాత సుయేష్ రావత్ను 2019లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే అయాన్ష్ అనే బాబు కూడా ఉన్నారు . తాజాగా బుల్లితెర భామ మోహెనా సింగ్ రెండోసారి గర్భం ధరించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన భర్తతో కలిసి ఉన్న బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా మోహెనా కుమారి సింగ్కు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఆమె కేవలం నటిగా మాత్రమే కాదు.. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Mohena Kumari Singh (@mohenakumari) -
Mahishivan: జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్.. ఏడ్చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
సర్ప్రైజ్ సీమంతం.. ఏడ్చేసిన బుల్లితెర నటి
సీరియల్స్లో యాక్ట్ చేసినవారిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఒకవేళ వారు యాక్టింగ్కు దూరంగా ఉన్నా సరే ఫలానా సీరియల్లో ఈ పాత్ర చేశారు, ఆ పాత్రలో భలే కనిపించారు అంటూ ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అందుకనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. యూట్యూబ్లోనూ సొంతంగా ఛానల్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ విషయాలను వీడియోల ద్వారా జనాలతో షేర్ చేసుకుంటున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి కూడా అదే చేసింది. రెండోసారి ప్రెగ్నెంట్ వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది మహీశ్వరి. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్తతో కలిసి పాల్గొంది. ఆమె భర్త శివనాగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది. త్వరలో ఆమెతో ఆడుకోవడానికి ఓ బుజ్జి పాపాయి రానుంది. మహేశ్వరి ప్రస్తుతం ప్రెగ్నెంట్. దీంతో ఆమెకు ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు శివ. సర్ప్రైజ్ సీమంతం.. ఇంకేముంది, సీమంతం వేడుక ప్లాన్ చేశాడు. భార్యకు తెలియకుండానే సీమంతం వేడుకకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. భార్య, కూతురికి అవసరమయ్యే షాపింగ్ కూడా చేశాడు. బోటింగ్కు వెళ్తున్నాం.. అని చెప్పి వారిని నేరుగా ఓ ఈవెంట్ హాల్కు తీసుకెళ్లాడు. అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కనిపించడంతో షాకైంది నటి. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తనను రెడీ చేసి సీమంతం చేశారు. ఎమోషనలైన నటి ఈ సర్ప్రైజ్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి. ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనంతరం మహేశ్వరి- శివ కేక్ కట్ చేశారు. ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేయించారు. భార్య పొట్టకు ముద్దుపెడుతున్న భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలుచున్నట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు. కేక్ కట్ చేయడంతో పాటు పనిలో పనిగా ఫోటోషూట్ కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్కు సిద్దార్థ్వర్మ - విష్ణుప్రియ, ఇంద్ర- మేఘన దంపతులు, యాంకర్ రవి హాజరయ్యారు. చదవండి: తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్ -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్వుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్వుడ్కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
కూతురితో కలిసి వేడుకలో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నవిష్క అనే కూతురు ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే కల్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటున్న కల్యాణ్ దేవ్ గతంలో తన తల్లి బర్త్డే జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు. అలాగే తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫోటోలను కల్యాణ్ దేవ్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వేడుకలో తన కూతురు నవిష్కతో కలిసి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతోంది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
Pearle Maaney Baby Shower Function: నటి సీమంతం.. భర్తతో కలిసి సందడి చేసిన అమలాపాల్ (ఫోటోలు)
-
హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్లో సీమంతం వేడుకలు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. సోమవారం రాగానే హౌస్లో నామినేషన్ల పర్వం మొదలవుుతంది. నామినేషన్ల మొదటి రోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సారి కాస్తా ప్రత్యేకంగా మహారాజ్యంలో జరుగుతాయని తెలిపారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ కాస్తా ఆసక్తిని పెంచింది. అలా ఈ వారంలో జరిగిన నామినేషన్స్లో ఏర్పాటు చేసిన రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి.. మిగిలిన వారిలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. అయితే ఈ వారంలో భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్స్లో నిలిచారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో బిగ్ బాస్ హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశారు. ఈ వారంలో కంటెస్టెంట్స్కు ఊహించని సర్ప్రైజ్లతో ముందుకొచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో శివాజీ కుమారుడిని డాక్టర్గా పంపించి హౌస్లో ఎమోషన్ పండించారు. శివాజీకి సర్ప్రైజ్ తాజాగా రిలీజైన ప్రోమోలో మరో కంటెస్టెంట్ అంబటి అర్జున్కు బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన భార్య సురేఖ హౌస్లోకి తీసుకొచ్చారు. దీంతో తన భార్యను చూసిన అర్జున్ ఫుల్ ఎమోషనలయ్యాడు. భార్య, భర్తల అనుబంధం ఏంటనేది వీళ్లిద్దరి చూస్తే తెలిసిపోతుంది. హౌస్లో అడుగుపెట్టిన అర్జున్ భార్య.. భర్తకు గోరుముద్దలు తినిపించింది. నీ ఎమోషన్స్ను బయటపెట్టు.. నువ్వు సరిగా రియాక్ట్ అవ్వట్లేదంటూ తన భర్తకు సలహాలు కూడా ఇచ్చింది. ఇది చూసిన శివాజీ.. దిస్ ఇజ్ లైఫ్ అంటూ కొటేషన్ ఇచ్చేశాడు. అర్జున్ భార్యకు సీమంతం అయితే ప్రస్తుతం అర్జున్ భార్య గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. హోస్లో అడుగుపెట్టిన ఆమెకు కంటెస్టెంట్స్ అందరూ కలిసి సీమంతం వేడుక నిర్వహించారు. హౌస్మేట్స్ ఎంతో సంతోషంగా ఆమెకు సీమంతం నిర్వహించడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య సీమంతం చూసి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆమె హౌస్ నుంచి బయటకెళ్తుండగా ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ ప్రోమోలు చూస్తే మొత్తానికి బిగ్ బాస్ హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశారు. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
హీరోయిన్ సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. సమాజ్వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమెపై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లైన కొన్ని నెలలకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చింది. అప్పట్లో ఆమెపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్వరభాస్కర్కు ఆమె భర్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..) ఆమె భర్త ఫాహద్ అహ్మద్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్వరభాస్కర్ సోషల్ మీడియాలో పంచకున్నారు. ఈ సందర్బంగా సీమంతానికి హాజరైన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు తెలియకుండా ప్లాన్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో వివాహం చేసుకున్నారు ఈ జంట. మార్చిలో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత స్వరా భాస్కర్ గర్భం ధరించినట్లు జూన్నెలలో వెల్లడించింది. బేబీ బంప్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. గతంలో స్వరా భాస్కర్పై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలయ్యాయి. కాగా.. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
హీరో భార్యకు సీమంతం.. ఏకంగా సమాధి వద్దే శుభకార్యం!
శాండల్వుడ్ హీరో ధృవ సర్జా కన్నడనాట పరిచయం అక్కర్లేని పేరు. 2012లో విడుదలైన 'అద్దురి' అనే సినిమా ద్వారా ఎంట్రీ వచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన ధృవ సర్జాకు కన్నడ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకి తమ్ముడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పనికి సర్వత్రా చర్చ మొదలైంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) చిరంజీవి సర్జా కోసం.. తన అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్లో నిర్వహించడం విశేషం. శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ధృవ సర్జా తన సోదరుడు చిరంజీవి సర్జా మరణంతో ఆయన కుటుంబం ఇప్పటికీ బాధలో ఉంది. ధృవ సర్జా ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో చిరు జ్ఞాపకంగా ఉండేలా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకతో చిరును ప్రత్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!) కాగా.. ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు. ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్లో ఆడబిడ్డకు జన్మించింది. ప్రస్తుతం ఈ జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధృవ సర్జా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ధృవ సర్జా ప్రస్తుతం కేడి, మార్టిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. -
ముక్కు అవినాశ్ భార్య సీమంతం ఫంక్షన్లో సోహైల్ రచ్చ..
బిగ్బాస్ షోతో బడా క్రేజ్ సంపాదించుకున్న నటుడు సయ్యద్ సోహైల్ రియాన్. అప్పటిదాకా చిన్నాచితకా పాత్రలు చేసిన సోహైల్ ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించగా మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్లో భాగంగా సోహైల్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఇంట జరిగిన ఫంక్షన్కు వెళ్లాడు. అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుక జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకకు వెళ్లిన సోహైల్ తనకూ సీమంతం చేయాలని పట్టుపట్టాడు. తాను కూడా ప్రెగ్నెంటేనని, తనకెందుకు ఫంక్షన్ చేయరని అడిగాడు. మగవాళ్లకు గర్భం రావడం ఏంటి? అని తిడుతూనే అవినాశ్ అతడిని కూర్చోబెట్టి పట్టు బట్టలు పెట్టి నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. చివర్లో ఆగస్టు 18 డెలివరీ డేట్.. మిస్టర్ ప్రెగ్నెంట్ థియేటర్లలో చూడండి అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చేశాక సోహైల్పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే అతడిని ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని లైట్ తీసుకున్నాడు. అంతదాకా ఎందుకు, ఈ సినిమా గురించి అతడి తల్లి కూడా మొదట్లో నెగిటివ్గా మాట్లాడింది. కానీ సినిమా చూశాక గర్వంగా ఫీలైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావంటూ సోహైల్ను మెచ్చుకుంది. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ జైలర్లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
Lahari Baby Shower Photos : బుల్లితెర నటి లహరి సీమంతం.. ఫోటోలు వైరల్
-
ఆసీస్ ఆల్రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత..
RCB Star Maxwell Wife Vini RamanTamil Baby Shower: ఆస్ట్రేలియా ఆల్రౌండర్, ఆర్సీబీ స్టార్ గ్లెన్ మాక్స్వెల్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు. భార్య వినీ రామన్తో కలిసి ఈ ఏడాది మేలో ఈ శుభవార్తను పంచుకున్నాడు మాక్సీ. రెయిన్ బో బేబీ రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారీ దంపతులు. ఈ క్రమంలో మాక్సీ సతీమణి వినీ రామన్ తాజాగా తన సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ‘వలైకాప్పు’ వేడుకకు సంబంధించిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. సంప్రదాయ పద్ధతిలో ఇందులో.. నిండైన చీరకట్టులో.. చేతులకు గాజులు, మెడలో నగలు వేసుకుని.. నుదుటిన కుంకుమ బొట్టు ధరించి.. భర్తను ఆప్యాయంగా హత్తుకున్న వినీ ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. విదేశాల్లో ఉన్నా సరే మన సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా పుట్టబోయే బిడ్డకోసం ఇంత అందమైన వేడుక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ పలువురు వినీ మాక్స్వెల్ను అభినందిస్తున్నారు. ఆ విషాదం తర్వాత కాగా తమిళనాడు మూలాలున్న వినీ రామన్.. గ్లెన్ మాక్స్వెల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది మార్చి 18న వీరి పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది. ఇక ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో మాక్సీ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మేలో ముగిసిన తాజా ఎడిషన్లో ఈ విధ్వంసకర ఆల్రౌండర్ 14 ఇన్నింగ్స్ ఆడి 400 పరుగులు సాధించాడు. కాగా గతంలోనూ వినీ రామన్ గర్భవతి అయినప్పటికీ ఆ బిడ్డ ఈ భూమ్మీదకు రాకుండానే వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె గర్భం దాల్చడంతో రెయిన్బో బేబీ(గర్భస్రావం లేదంటే తల్లి కడుపులోనే శిశువు చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డ) అంటూ మాక్సీ దంపతులు గుడ్న్యూస్ షేర్ చేయడం విశేషం. చదవండి: 'మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు' -
బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్: కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్బ్రాండ్, హీరోయిన్ కంగనా రనౌత్ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఆమె ఇంట్లో త్వరలో బుల్లి రనౌత్ రాబోతోంది. అవును, నిజమే.. కంగనా సోదరుడు అక్షత్ రనౌత్- రీతూ రనౌత్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో రీతూ సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్కు సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ క్వీన్ పింక్ కలర్ చీరలో, బంగారు ఆభరణాలతో ధగధగ మెరిసిపోయింది. చేతులకు మెహందీ కూడా వేసుకుంది. అక్టోబర్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న వదినకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది. 'రీతూ రనౌత్ సీమంతం సెలబ్రేషన్స్లోని కొన్ని అద్భుతమైన క్షణాలను పంచుకుంటున్నాను. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. బేబీ రనౌత్ రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది కంగనా. ఈ ఫోటోలో కంగనా తల్లి ఆశా, సోదరి రంగోలి, అన్నావదిన ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అనుపమ్ ఖేర్, మహిమ చౌదరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Rangoli Chandel (@rangoli_r_chandel) చదవండి: కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్, మొన్ననే తల్లికి గుండెపోటు, అప్పుడే కారు కొన్నావా? ఓపెన్ హైమర్ చిత్రంలో ఆ సీన్ తొలగించండి -
Ishita Dutta Latest Photos: దృశ్యం నటి ఇషితా దత్తా సీమంతం.. సందడి చేసిన హెబ్బా పటేల్! (ఫొటోలు)
-
దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇషితా దత్తా తెలుగు సినిమా చాణక్యుడుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కువగా కనిపించిన భామ హిందీలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రంలోనూ నటించింది. జార్ఖండ్కు చెందిన ముద్దుగుమ్మ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి బేబీ షవర్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది. తాను బెంగాలీ కావడంతో వారి సంప్రదాయంలో సీమంతం జరుపుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇషితా తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇషితా తన ఇన్స్టాలో రాస్తూ..'షాద్ వేడుక' మా అమ్మ నా కోసం నిర్వహించిన బెంగాలీ బేబీ షవర్…నాకు ఇది ఎంతో స్పెషల్. అంతే కాదు నా జీవితంలో ఉత్తమమైనది. ఇది మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వేడుకలో సన్నిహితులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఇషితాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా బేబీ షవర్లో సందడి చేసింది. సీమంతంలో పాల్గొన్న పలువురు తారలు ఇషితా దత్తాను ఆశీర్వదించారు. కాగా.. ప్రస్తుతం ఇషితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా అనే షోలో నటిస్తోంది. (ఇది చదవండి: లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి తెలుగువారి సుపరిచితమే. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న లహరి సీమంతం వేడుక ఇటీవలే ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్న సీమంతానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. లహరి సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్) -
బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!
టాలీవుడ్లో నమ్రతా శిరోద్కర్- మహేశ్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహేశ్ బాబు సతీమణిగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించారు. ఈ జంటకు సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేశ్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సితార భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు నమ్రత వెల్లడించింది. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) అయితే చాలా రోజుల తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీ ఓ పార్టీకి హాజరైంది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోలను నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ పార్టీలో నమ్రత శిరోద్కర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. రూ.4 లక్షల కుర్తా? అయితే ఈ పార్టీలో నమ్రత ధరించిన ప్రత్యేకమైన కుర్తా ధరపై నెట్టింట చర్చ మొదలైంది. గ్రాఫిక్ డిజైన్తో కూడిన కుర్తా దాదాపుగా రూ.4 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ప్రత్యేకమైన జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా శిరోద్కర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరవవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: చిన్న సూట్కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
దృశ్యం నటి సీమంతం వేడుక.. మదర్స్ డే సందర్బంగా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటి ఇషితా దత్తా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చాణక్యుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో దృశ్యం సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే 2017లో వాత్సల్ షేత్ను వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ గర్భం ధరించినట్లు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇషితా దత్తా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మదర్స్ డే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. ఎందుకంటే ఈరోజే తన సీమంతం వేడుకలు జరుపుకోవడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేసింది. ఇషితా మాట్లాడుతూ..'ఈ ఏడాది మదర్స్ డే నాకు చాలా ప్రత్యేకం. నా బేబీ షవర్ ఈ రోజున జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా అమ్మ, అత్తతో కలిసి మదర్స్ డేని జరుపుకుంటున్నా. నా చిన్నప్పుడు మా అమ్మను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసేదాన్ని. ఏది ఏమైనా ఆమె నా కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని' వివరించింది. కాగా.. మార్చి 2023లో గర్భం దాల్చినట్లు ప్రకటించింది ఇషితా. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) -
ఘనంగా నటి గౌహర్ ఖాన్ సీమంతం
-
గ్రాండ్గా బాలీవుడ్ నటి సీమంతం, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి, బిగ్బాస్ బ్యూటీ గౌహర్ ఖాన్ త్వరలో తల్లి కాబోతోంది. డిసెంబర్లో ఈ గుడ్ న్యూస్ను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాం అంటూ గౌహర్, ఆమె భర్త జైద్ దర్బార్.. ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు. ఆదివారం నటి సీమంతం ఘనంగా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను గౌహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్రత్యేకమైన వ్యక్తుల మధ్య, రుచికరమైన భోజనంతో, అమితమైన ప్రేమాభిమానాల మధ్య నా సీమంతం వేడుక సంతోషంగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్లో గౌహర్ మల్టీకలర్ లెహంగా ధరించగా జైద్ అందుకు మ్యాచింగ్ షర్ట్ వేసుకున్నాడు. ఫ్రెండ్స్తో, అలాగే బోలెడన్ని కేక్స్ మధ్య వీరు దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా గౌహర్ ఖాన్ రాకెట్ సింగ్: సేల్స్మెన్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది., గేమ్, 14 ఫెరే.. వంటి పలు చిత్రాల్లో నటించింది. ఝలక్ దిఖ్ లాజా 3, బిగ్బాస్ 7, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 5 వంటి రియాలిటీ షోలలనూ పాల్గొంది. తాండవ్, సాల్ట్ సిటీ, శిక్షా మండల్ వెబ్ సిరీస్లలో నటించింది. ఇటీవలే నెట్ప్లిక్స్లో ప్రసారమైన ఇన్ రియల్ లవ్ షోలో రణ్విజయ్ సింగ్తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రముఖ గాయకుడు, కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన జైద్ దర్బార్ను 2020 డిసెంబర్లో పెళ్లాడింది. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) చదవండి: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: ధనుస్ సోదరుడు అల్లరి నరేశ్ ఉగ్రం ట్విటర్ రివ్యూ -
బేబీ షవర్ ఈవెంట్ లో బావ,బమరిది సందడి ...!
-
ఘనంగా ఉపాసన సీమంతం.. ఫోటోలు వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ఉపాసన టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో ఒకరు. మొదటి నుంచీ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న జంట. ఆమె గురించి అతను ఎక్కడ మాట్లాడినా ఆప్యాయత కురిసినట్లే ఉంటుంది. మిస్టర్ సీ అంటూ అతని కోసం ఆమె ఏం రాసినా అద్భుతంగానే అనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని.. కలిసిమెలిసి ఉండాల్సిన దంపతులకు బెస్ట్ ఎగ్జాంపుల్గా అనిపిస్తుంటారు ఇద్దరూ. వారి మధ్య అన్యోన్యతకు మన దగ్గరివారే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఆనందించారు. ఆస్కార్కి రెడీ అవుతున్న ఈ దంపతుల మీద ఆ మధ్య వేనిటీ ఫెయిర్ ఓ వీడియో రికార్డ్ చేసింది. వేనిటీ ఫెయిర్ ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన అన్నీ వీడియోల రికార్డులనూ బద్ధలు కొట్టేశారు ఉపాసన- రామ్చరణ్ దంపతులు. గర్భవతి అయిన తన భార్యను రామ్చరణ్ అపురూపంగా చూసుకుంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్లో జరిగిన సీమంతం ఫొటోలు కూడా చాలా వేగంగా వైరలయ్యాయి. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్లో మరో రెండు వేడుకలు కూడా వైభవంగా జరిగాయి. ఒక వేడుకలో ఉపాసన పింక్ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. మరో చోట బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్తో తళుక్కుమన్నారు. ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్, అల్లు అర్జున్తోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు. అలాగే కుటుంబసభ్యులు చిరంజీవి కొణిదెల, సురేఖ, చెల్లెళ్లు సుష్మిత, శ్రీజతో పాటు ఉపాసన తల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి, సుష్మిత, శ్రీజ కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందోత్సాహంలో మునిగిపోయారు. కాబోయే అమ్మ ఉపాసనను తమ ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కాబోతున్న క్షణాల కోసం వేచిచూస్తున్నామని అంటున్నారు సన్నిహితులు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. -
బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?
టాలీవుడ్ మెగా హీరో రామ్చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. తన జీవితంలో ఒక ముఖ్యమైన విశేషం గురించి ఉపాసన గత ఏడాది డిసెంబరులో ప్రకటించి నప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. దీనికి తగ్గట్టుగానే లగ్జరీ మెటర్నిటీ ఫ్యాషన్ స్టయిల్స్తో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సన్నిహితులు, ఫ్రెండ్స్తో సమక్షంలో ఘనంగా నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు వైరల్గా మారాయి. రామ్చరణ్, ఉపాసన స్నేహితులు, స్మితారెడ్డి, సరిన్ కట్టా త్వరలో కాబోయే మమ్మీకి ఇంటిమేట్ బేబీ షవర్ను నిర్వహించారు. ఈ బేబీ షవర్కి అల్లు అర్జున్, సానియా మీర్జా, కనికా కపూర్ , వారి ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం, ఉపాసన గులాబీ రంగు గౌన్లో, తన బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పింక్ గౌన్ ధరే ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపాసన కామినేని పింక్ డ్రెస్ రూ. 90 వేలు ఉపాసన కామినేని యొక్క పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్లో అందంగా ముస్తాబయ్యారు. డీప్ వీనెక్తో ,షార్ట్ స్లీవ్స్తో ఉన్న గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్కు చెందింది. దీని ధర 1102 డాలర్లు. అంటే మన కరెన్సీలో (టాక్స్లు అన్ని కలిపి) అక్షరాలా రూ. 90,471. ఏప్రిల్ 19, 2023న త్వరలో కాబోతున్న మమ్మీ ఉపాసన కామినేనికి రామ్ చరణ్ కుటుంబం బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుక కోసం, ఉపాసన జపనీస్ బ్రాండ్ ఇస్సీ మియాకే నుండి బ్లూ కలర్ ప్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్లో అలరించింది. ప్లీటెడ్ హాఫ్-స్లీవ్ ట్యూనిక్ బాడీ ఫిట్, ఫ్లేర్ ప్లీట్స్, సైడ్ గస్సెట్, ఫ్లేర్డ్ షేప్ హై నెక్ ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో, ట్యూనిక్ ధర 430 డాలర్లు అంటే రూ. 35,352 అన్నమాట. వైట్ ఫ్లవర్ డ్రెస్ 1.12 లక్షలు ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి కాబోయే మమ్మీ ఉపాసన గ్లామరస్ ప్రెగ్నెన్సీ స్టైల్లో తన ఫ్యాన్స్ను కట్టిపడేస్తున్నారు. మొదటి మూడు నెలల్లో ఒకసారి తెల్లటి-రంగు పూల డ్రెస్లో బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మెర్మాన్కు చెందినది. దీని ధర సుమారు రూ. 1,11,651. -
చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్లోనూ యాక్టివ్గా పాల్గొంటుంది. తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. రామ్ చరణ్- ఉపాసన త్వరలోనే తల్లిదండ్రలు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసనకు డెలివరీ సమయం దగ్గరపడుతోంది. తాజాగా ఉపాసన తన ఇన్స్టాలో బేబీ షవర్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు తన ఇన్స్టాలో స్టోరీస్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా చిరంజీవి నివాసంలో నిర్వహించిన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్స్టాలో షేర్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అల్లు అర్జున్ అన్నయ్య భార్య అల్లు నీలు షాతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఉపాసన బేబీ షవర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే వెకేషన్కు వెళ్లిన ఈ జంట దుబాయ్లోనూ సన్నిహితులు, స్నేహితుల మధ్య సీమంతం వేడుక జరుపుకున్నారు. ఆ తర్వాత మాల్దీవుస్ చేరుకున్న చెర్రీ-ఉపాసన హైదరాబాద్కు తిరిగొచ్చారు. జూలైలో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు మెగాకుటుంబంతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మెగా కోడలు ఉపాసన బేబీ షవర్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్స్ రామ్చరణ్–ఉపాసన. ప్రస్తుతం ఈ జంట దుబాయ్ వేకేషన్లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ తల్లి దండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ జంట పేరేంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా దుబాయ్లోని నమ్మోస్ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాసన తన ఇన్స్టా రాస్తూ.. 'మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వేడుకలో రామ్చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఉపాసన తాజాగా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఉపాసన-రామ్ చరమ్ జంటపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కొన్నాళ్లు దుబాయ్లో వెకేషన్ని ఎంజాయ్ చేసిన తర్వాత చరణ్–ఉపాసన ఇండియా చేరుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్లో చరణ్ పాల్గొనే అవకాశముంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
దుబాయ్లో బేబీ షవర్
రామ్చరణ్–ఉపాసన ఫుల్ జోష్లో ఉన్నారు. తల్లి దండ్రులు కాబోతున్న ఆనందం అది. ఇటీవల లాస్ ఏంజిల్స్లో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకకు హాజరైన ఈ దంపతులు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. అక్కడి నమ్మోస్ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ జరిగింది. ఈ వేడుకలో రామ్చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారని సమాచారం. కొన్ని ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. వేడుకలో తెలుపు రంగు గౌనులో ఆమె మెరిసిపోయారు. కొన్నాళ్లు దుబాయ్లో వెకేషన్ని ఎంజాయ్ చేసి, చరణ్–ఉపాసన ఇండియా చేరుకుంటారట. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూట్లో పాల్గొంటారు చరణ్. -
ఉపాసనకు సీమంతం జరిపిన ఫ్రెండ్స్, ఫోటోలు వైరల్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో రామ్చరణ్-ఉపాసన జంటకు ప్రత్యేక స్థానం ఉంది. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో ఆమె స్నేహితులు చరణ్ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి సీమంతం చేశారు. అందులో భాగంగా ఆమె మెడలో పూలదండ వేసి తనకు గిఫ్టులు బహుకరించారు. ఈ ఫోటోలను బేబీ కమింగ్ సూన్ అంటూ చరణ్ సతీమణి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది. ఈ పిక్స్లో ఉపాసన గ్లోతో మెరిసిపోతుండగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవలే ఘనంగా జరిగాయి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్కు సద్గురు, ఆయన కుమార్తె హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఇద్దరు కూతుర్లతో సద్గురు.. ఒకరు సొంత బిడ్డ అయితే మరొకరు దత్తపుత్రిక అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: రెండుసార్లు జైలుకెళ్లా.. నటుడు -
తల్లి కాబోతున్న యాంకర్ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్
నటి, యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్బై చెప్పింది. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్న్యూస్ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య View this post on Instagram A post shared by ✨Ashwini sharma✨🧿 (@ashwinisharma_official) -
ఘనంగా ‘స్వామిరారా’ నటి సీమంతం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
ప్రముఖ నటి పూజా రామాచంద్రన్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కనుల పండుగగా జరిగిన ఈ సీమంత వేడుకలో పూజా దంపతుల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా భర్త జాన్ కూడా నటుడనే విషయం తెలిసిందే. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ వన్.. నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో అతడు విలన్ పాత్రలు పోషించాడు. కాగా పూజా తెలుగులో స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. కాగా పూజా రామ చంద్రన్- జాన్ కొకెన్ల వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందు 2017లో విజె క్రెగ్తో పూజా వివాహం జరిగింది. చదవండి: ‘యశోద’ లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం.. పిక్స్ వైరల్
చిన్నారి పెళ్లికూతురు ఫేం నేహా మర్దా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. పదేళ్ల క్రితం ఆయుష్మాన్ అగర్వాల్ను పెళ్లి చేసుకుంది. గతంలోనే తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది నేహా. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్తో ఈ శుభవార్త పంచుకుంది. ఇటీవల జరిగిన సీమంతం వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకుంది చిన్నారి పెళ్లికూతురు. ఈ వేడుకల్లో బంధువులతో పాటు పలువురు బుల్లితెర నటులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్లో షోలో పాల్గొంది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) -
పెళ్లైన 10 ఏళ్లకు తల్లి కాబోతున్న బుల్లితెర నటి
బుల్లితెర నటి నేహా మాద్ర త్వరలో తల్లి కాబోతుంది. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో ఆమె ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా నటి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నా కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ప్రేమ కురిపించారు. ఈ సీమంతం అంతా ఒక కలలా అనిపిస్తోంది. నా అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది. ఈ ఫోటోల్లో దంపతులిద్దరూ లావెండర్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయారు. కాగా నేహా మాద్ర బిజినెస్మెన్ ఆయుష్మాన్ను 2012లో పెళ్లాడింది. గతేడాది నవంబర్ 24న తను గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా మెటర్నిటీ షూట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. ఇకపోతే నేహా బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)లో గెహనాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్యో రిష్తా మే కత్తి బత్తి, డోలీ అర్మానోకీ వంటి సీరియల్స్లో నటించింది. అలాగే జలక్ దిక్లాజా డ్యాన్స్ షో 8వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) చదవండి: ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం -
ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ అవును సినిమాతో మంచి క్రేజ్ను దక్కించుకుంది. ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్లో బిజిగా ఉన్న సమయంలోనే గతేడాది దుబాయ్కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు చెప్పి గుడ్న్యూస్ చెప్పింది. తాజాగా పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా పూర్ణ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడంతో పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం వేడుక, ఫొటోలు వైరల్
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్తో షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను మరోసారి గర్భవతి అయినట్లు భర్త మంజునాథ్తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లాస్య సీమంతం వేడుకలో బిగ్బాస్ ఫేం గీతూ రాయల్, టీవీ నటి సుష్మ ఇతర బుల్లితెర నటీనటులు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) -
ఘనంగా ఆలియా భట్ సీమంతం, ఫొటోలు వైరల్
ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో ఆమెకు సీమంతం జరిపారు. ముంబైలోని రణ్బీర్ ఇంట్లో బుధవారం నాడు ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సీమంతం ఫంక్షన్లో ఆలియా భర్త రణ్బీర్తో పాటు తల్లిదండ్రులు సోని రజ్దాన్- మహేశ్ భట్, అత్త నీతూ కపూర్తో ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే తన బంధువులు, చెల్లెల్లు, స్నేహితులతో కలిసి ఫొటోలు దిగింది. ఈ సెలబ్రేషన్కు శ్వేత బచ్చన్, నిఖిల్ నందా, రీమా జైన్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ 'జస్ట్ లవ్' అని రాసుకొచ్చింది. కాగా రణ్బీర్, ఆలియా 2017లో బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలో ప్రేమించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన బ్రహ్మాస్త్ర గత నెలలో రిలీజైంది. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) చదవండి: మూడుసార్లు కోమాలోకి గీతూ, డాక్టర్లు కూడా కష్టమన్నారు బస్టాండ్లో అపస్మారక స్థితిలో నటుడు, చివరికి మృత్యు ఒడిలోకి -
లండన్లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
రెండోసారి గ్రాండ్గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
హీరోయిన్ సంజనా గల్రానీ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్ గత నెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో సీమంతం జరుపుకుంది. అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. తాజాగా అందరి సమక్షంలో మరోసారి గ్రాండ్గా సీమంతం చేసుకుంది సంజనా. ఈసారి ముస్లిం పద్ధతిలో ఈ వేడుక చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన యోగక్షేమాలను పట్టించుకునేవారిని మాత్రమే ఈ శుభకార్యానికి ఆహ్వానించానని తెలిపింది. అలా ఓ 300 మందికి ఆహ్వానం పంపామంది. ఈ ఫంక్షన్కు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫంక్షన్లోని మెనూలో మటన్ బిర్యానీ హైలైట్ అని చెప్పింది. మరో 20 రోజుల్లో చిన్నారి బుజ్జాయి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి: సమంత 'ఊ అంటావా మావా' పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో అక్కడికి ఎందుకు వెళ్లాలి? బాలీవుడ్పై మహేశ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు -
ఘనంగా హీరోయిన్ కాజల్ సీమంతం.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal Baby Shower Photos Viral: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ ప్రెగ్నెన్సీని అఫీషియల్గా అనౌన్స్ చేసిన కాజల్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక రీసెంట్గానే కాజల్ కూడా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
గోమాతకు ఘనంగా సీమంతం
-
ఘనంగా ‘సావిత్రి’కి సీమంతం
యడ్లపాడు(గుంటూరు): ఉమ్మడి కుటుంబాలే కాదు.. రక్తసం‘బంధం’ బలం తగ్గిపోతున్న కాలమిది. కన్నవారే కాదు..కట్టుకున్న ఆలిని సైతం మరిచిపోతున్న రోజులివి. మానవత్వాని మించి ‘మనీ’కే మనిషి విలువిస్తున్న కలియుగం ఇది. తొలి చూలాలైన గోవుకు సంప్రదాయ బద్దంగా ‘సీమంతం’ చేసి సమానత్వాన్ని చాటాడో యువకుడు. పశువులపై మనిషికున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆదినుంచే ప్రకృతిలోని ప్రతిజీవితో అనుబంధం ఉందన్న విషయాన్ని తెలియజేశాడు. పశువు రూపాన ఉన్న పరమాత్మ స్వరూపమని, గోవుని మించి దైవం లేదని నిరూపించారు. ఎక్కడంటే... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంటుపల్లి వెంకటేశ్వరబాబు ‘లా’ పూర్తిచేసినా వ్యాపార రంగంవైపే మొగ్గుచూపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి గోసేవ, గోపూజను వారసత్వంగా పొందాడు. పట్టణంలోని పురుషోత్తమపట్నం షిరిడిసాయి మందిరంలో గోశాల, సుబ్బయ్యతోట గోశాల, ఆవులదొడ్డిగా పిలిచే గుండయ్యతోట గోశాలను సందర్శిస్తాడు. ఉదయాన్నే వెళ్లి మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కూరగాయలు శుభ్రపరిచి గోవులకు తినిపిస్తాడు. వాటిచుట్టూ ప్రదక్షిణలు చేసి నమ్కరించాక దినచర్యలు ప్రారంభం అవుతాయి. శుభకార్యనికి...శుభముహూర్తం ఆవులదొడ్డిలోని గోవులన్నింటికీ ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. వీటిలో పూజ అనేగోవుకు పుట్టిన సావిత్రి ఇటీవల కాలంలో గర్భం దాల్చింది. అక్కడి పనివార్ల ద్వారా బాబుకు ఆ విషయం తెలిసి ఆనందపడ్డాడు. తమ ఇంటి ఆడపడుచు గర్భం దాల్చిన విధంగా పొంగిపోయారు. తమ ఇంట ఆడపడుచుకు ఎలా శుభకార్యం చేసేవారో అలాగే చేయాలని బాబు కుటుంబం నిర్ణయించింది. గోవుకు సీమంతం చేస్తున్నామంటూ బంధుమిత్రులకు ఆహ్వానం పలికాడు. వేద పండితుడి వద్దకెళ్లి ముహుర్తం ఖరారు చేయించాడు. కదిలొచ్చిన నాలుగు కుటుంబాలు సావిత్రి సీమంత ఆహ్వానం అందుకున్న వెంకటేశ్వరబాబు అక్కాబావలు ఉదయ్శంకర్, మహాలక్ష్మి దంపతులు, ఆక శేషసాయి, శాంతిలక్ష్మికుమారి దంపతులు, మిత్రులైన విప్రొ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి ఏఎస్వీఎస్ శాస్త్రి, విజయ దంపతులు, మిత్రబ్యాంక్ ఫీల్డ్ఆఫీసర్ ప్రసాదరావు, శ్యామలా దంపతులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సేవలోనూ, పూజలోనూ తమవంతు భాగస్వామ్యాన్ని సంతోషంగా స్వీకరించారు. ఘనంగా సావిత్రికి సీమంతం 9నెలల నిండు గర్భిణీ సావిత్రిని గోవును పూలతో చక్కగా ముస్తాబు చేశారు. పసుపు, కుంకుమను పూసి కొమ్ములకు రంగురంగుల గాజుల్ని తొడిగారు. కాళ్లకు గజ్జెలు కట్టారు. స్వయంగా వండి తెచ్చిన చలిమిడి, పిండివంటల్ని తృప్తిగా తినిపించారు. నూతన వస్త్రాలను సమర్పించారు. పండితుల వేదమంత్రాలతో ముత్తయిదువులచే మంగళ హారతులు ఇచ్చారు. ఈ శుభకార్యానికి హాజరైన బంధుమిత్రులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మనఃపూర్వకంగా ఆవును ఆశీర్వదించారు. తమ ప్రేమను చాటుకున్నారు. చివరిగా గోశాలలోని పనివార్లకు తాంబూలాలు, స్వీట్లను పంపిణీ చేశారు. మనుషుల కంటే గోవు సీమంతానికి ఎక్కువమంది హాజరు కావడం విశేషం. కన్నతల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో ఓ ఆవుకు ఇలా సీమంతం చేయడం గొప్ప విషయమని పట్టణ వాసులు కార్యక్రమం నిర్వహించిన దంపతులను అభినందించారు. వినిగానే విశేషంగా అనిపించింది...శ్యామలా, గృహిణి సావిత్రికి సీమంతం చేయడం ఎంతో విశేషంగా అనిపించింది. ఆవు యొక్క విశిష్టత, పవిత్రత నేటì తరానికి తెలీదు. తొలిసారిగా చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయడం వలన భావితరాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ శుభకార్యంలో మేము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. -
వైభవంగా అలీ రెజా సతీమణి సీమంతం వేడుక
బుల్లితెర నటుడు అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న అలీ ఫిజికల్ టాస్కుల్లో మిగతావారికి గట్టిపోటీనిస్తూ తనేంటో నిరూపించుకున్నాడు. బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్తో ఏకంగా నాగార్జునతో కలిసి 'వైల్డ్డాగ్' సినిమాలోనూ నటించాడు. కాగా ఈ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసుమ్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్ కపుల్గా అభివర్ణిస్తున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే! -
భార్యకు నటుడి సర్ప్రైజ్; థాంక్యూ అంటూ భావోద్వేగం
లండన్: ‘అమ్మా’ అనే పిలుపు కోసం మహిళలు పరితపించడం సహజం. ముఖ్యంగా గర్భవతైన తర్వాత పుట్టబోయే బిడ్డ గురించి అనేక కలలు కంటారు కాబోయే తల్లులు. తమ పాపాయి ఎలా ఉండబోతుంది, తను ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తుందా.. తనను ఎలా పెంచాలి.. ఇలాంటి ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడతాయి. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి ఎంత ప్రేమను కురిపిస్తే వారి మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు ప్రముఖ రియాలిటీ షో స్ల్పిట్స్విల్లా హోస్ట్, నటుడు రన్విజయ్ సింఘా భార్య ప్రియాంక సింఘా. 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే ఓ కూతురు కనియత్ సింఘా ఉండగా.. త్వరలోనే మరో చిన్నారి వారి జీవితాల్లోకి రాబోతోంది. ఈ సంతోషకర సమయంలో భార్యకు మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు రన్విజయ్. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైనప్పటికీ.. ఇంటి ఆవరణలోనే అందంగా డెకరేట్ చేయించి భార్య సీమంతం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక సింఘా.. ‘‘ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం కదా. కాబట్టి మనం బద్దకస్తులుగా మారటం సహజం. ఇతరులకు దూరంగా ఉండక తప్పదు. కానీ అక్కడితోనే అంతా ముగిసిపోదు. పద పద త్వరగా రెడీ అవ్వు అంటూ తను తొందరపెట్టేశాడు. బయటకు రాగానే గార్డెన్లో చూస్తే ఆశ్చర్యం. నా జీవితంలోని బెస్ట్ సర్ప్రైజ్ ఇది. థాంక్యూ.. బేబీ షవర్ను ఇంత అందమైన మధురజ్ఞాపకంగా మలిచిన రన్కు, తనకు సహకరించిన సిబ్బందికి రుణపడి ఉంటాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా స్ల్పిట్స్విల్లా, రోడీస్ వంటి షోలకు హోస్ట్గా వ్యవహరించిన రన్విజయ్.. టాస్, లండన్ డ్రీమ్స్, యాక్షన్ రిప్లే వంటి సినిమాలతో పాటు వెబ్సిరీస్లలోనూ నటించాడు. చదవండి: గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి రిస్క్ వద్దు.. పెంట పెట్టుకోవద్దుని హెచ్చరించారు: ఆమిర్ ఖాన్ View this post on Instagram A post shared by Prianka Singha (@priankasingha) View this post on Instagram A post shared by Prianka Singha (@priankasingha) -
నటి సీమంతం వేడుక.. బేబీ బంప్తో డ్యాన్స్
హైదరాబాద్: నటి, యాంకర్, బిగ్బాస్ కంటెస్టెంట్ హరితేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు హరితేజ. కొద్ది రోజుల క్రితం తాను ప్రెగ్నెంట్ అని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక నేడు నటి సీమంతం వేడుక జరిగింది. బంధువులు, స్నేహితులు, కొందరు ఇండస్ట్రీ స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా వేడకల్లో హరితేజ తన స్నేహితురాలు హిమజతో కలిసి సందడి చేశారు. అంతేకాక బేబీ బంప్తో డ్యాన్స్ చేసి అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ హిమజ తన ఫేస్ బుక్లో హరితేజ సీమంతం వేడుకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. (చదవండి: మా ఇంటికి సంతోషం వచ్చింది) 2016లో దీపక్ రావుని వివాహమాడిన హరితేజ.. కెరియర్ పరంగా బిజీ అయ్యింది. తొలుత సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువై.. 2017లో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్గా అలరించి టాప్ 3 కంటెస్టెంట్గా నిలిచింది. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంది. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. -
భర్త కటౌట్తో నటి సీమంతం
హీరో అర్జున్ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా కొద్ది నెలల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. మరణించే నాటికే అతడి భార్య గర్భవతి. ఈ క్రమంలో చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న మేఘన చిరంజీవి స్టైల్గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మేఘన సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!) ఈసందర్భంగా ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపైనా జరుగుతుంది. ఐ లవ్ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు. మేఘన షేర్ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి కటౌట్ చూస్తుంటే ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సర్జా కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయన నటి మేఘనా రాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తన భర్త సజీవంగా లేకపోయినా... ఆయన జ్ఞాపకాలు తనతోనే జీవితాంతం ఉంటాయని మేఘన పేర్కొన్నారు. -
స్నేహ సీమంతం వేడుక...
నటి స్నేహా రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సీమంతం వేడుక ఇటీవల చెన్నైలో కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల సమక్షంలో జరిగింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు స్నేహ. వీరికి ఇప్పటికే కుమారుడు నిహాస్ ఉన్నాడు. సీమంతం వేడుక ఫోటోలను స్నేహా షేర్ చేయడంతో ...ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాహం అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె... ఓ బిడ్డకు జన్మినిచ్చారు. ఆ తర్వాత స్నేహా నటనలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
సీమంతం వేడుక..స్టెప్పులతో అదరగొట్టారు!
-
తన సీమంతంలో డ్యాన్స్తో అదరగొట్టిన నటి
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు రంభ. వీటితో పాటు హిందీ, భోజ్పురి చిత్రాల్లో కూడా మెరిశారు. కెనడా బిజినెస్మ్యాన్ ఇంద్రన్ పద్మనాభన్తో వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. కాగా తను మూడో బేబికి జన్మనివ్వబోతున్నానే శుభవార్తను రంభ ఇటీవలే తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భర్త, బంధువుల సమక్షంలో రంభ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రంభ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్గా మారడంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1990ల్లో హీరోలతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసిన రంభ.. తన సీమంతం వేడుకలోనూ స్టెప్పులతో అదరగొట్టారు. -
ముద్దుగుమ్మ సీమంతం
చెన్నై: హోమ్లీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ సీమంతం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ విషయాన్ని స్నేహ భర్త, నటుడు ప్రసన్న ట్విట్టర్లో తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి సినీ పరిశ్రమ పెద్దలు హాజరై ఆమెకు ఆశీస్సులు అందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. కాంజీవరం చీరలో స్నేహ వెలిగిపోయింది. బంగారు నగలతో ఆమె మొహం కాంతులీనింది. 'చాలా తక్కువ సమయంలో ఉండటం వల్ల ఈ ఫంక్షన్కు అందర్నీ ఆహ్వానించలేకపోయాను, క్షమించాలి... మీ అందరి ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. అది నాకు తెలుసు' అంటూ స్నేహ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు , తమిళం భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన నటి స్నేహ. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో శ్రీరామదాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్నేహి తెలుగులో నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. కాగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా చలామణి అవుతున్న రోజుల్లో తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2012 మే 11న వీరి వివాహం జరిగింది. అంటే సంసార జీవితంలోకి అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ తొలిసారి అమ్మకాబోతుంది. -
బేబీ షవర్!
సృష్టిలో ప్రాణికి మూలం అమ్మ. ఆ అమ్మతనానికి పండుగ.. సీమంతం. చేతి నిండా గోరింట పూసి.. గాజులు వేసి.. కడుపులో ఉన్న బిడ్డకు సంగీతాన్ని పరిచయం చేసి.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ అతిథులు మనసారా దీవించే వేడుక. ఆ సంప్రదాయ సీమంతం కాస్తా నగరంలో ‘బేబీ షవర్’ అయ్యింది. ప్రపంచంలోకి అడుగిడబోయే బేబీకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఆత్మీయులు మోడరన్గా చేస్తున్న సెలబ్రేషన్.. బేబీ షవర్! సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆడంబరంగా జరిపే ఈ వేడుకను గ్రాండ్గా కాబోయే తల్లి ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తున్నారిప్పుడు. సీమంతానికయితే బొట్టు పెట్టి పిలుస్తారు. కానీ ఇన్విటేషన్ కార్డ్తోనే ఈ ఈవెంట్ కొత్తదనం మొదలవుతుంది. ఓ పెళ్లి పత్రికలా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయిస్తున్నారు. తొలిసారి అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నవారు మాత్రం ఆత్మీయులతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి చాలా ప్లాన్లు వేసుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్స్ ఇప్పుడు బేబీ షవర్ కోసం రకరకాల థీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన థీమ్ను ఎంచుకుని చెబితే సరి.. పెళ్లికి పందిరి డెకరేట్ చేసినట్టుగా ఇంటిని లేదా బంకిట్ హాల్ను పూర్తిగా డెకరేట్ చే సేవాళ్లున్నారు. వేడుకలో టేస్ట్ను బట్టి థీమ్ ఉంటుండగా.. ఆ డెకరేషన్స్లో అధికశాతం రంగులు మాత్రం రెండే ఉంటున్నాయి. అవి నీలం... గులాబీ! అవును ప్లజెంట్గా కనిపించే బ్లూ, పింక్కే ఓటేస్తున్నారు కాబోయే తల్లిదండ్రులు. ఇక కాబోయే తల్లిని ఊహల్లో తేలియాడించే బెలూన్స్ అయితే కంపల్సరీ. అట్రాక్టివ్ కేక్స్ ఈ బేబీ షవర్స్లో మరో ప్రత్యేక ఆకర్షణ కేక్స్. మీకు అభిరుచి ఉండాలే కానీ, ఐడియా చెబితే చాలు.. మీ ఆలోచనలకు తగ్గ కేక్ అందంగాతయారవుతుంది. ప్రెగ్నెంట్ లేడీ బొమ్మతో ఉన్న కేక్ ఒకటయితే..పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో? అని ఊహిస్తూ ఉండే కేక్ మరొకటి. ఇక ట్విన్స్ కోసం ప్రత్యేక కేక్. బేబీ బోయ్, బేబీ గర్ల్ కోసం డిఫరెంట్ కేక్స్. ఇలా అన్నీ ఇన్నోవేటివ్. ఈ బేబీ షవర్లో ఫుడ్ అయితే ఉంటుంది కానీ.. ఇది పూర్తి స్థాయి విందులా ఉండదు. స్పెషల్ గేమ్స్ కాబోయే తల్లిని బిడ్డతో ఆడేందుకు సంసిద్ధం చేసేందుకు గేమ్స్ కూడా ఉంటాయి బేబీ షవర్లో. అయితే అవి బేబీ పుట్టుకకు సంబంధించినవి మాత్రమే. ఉదాహరణకు పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా? టమ్మీ సైజ్ ఎంత? డైపర్ చేతికిచ్చి బేబీ అని పలకకుండా ఆ డైపర్ను ఎలా ఉపయోగిస్తారో చెప్పడం. ఒక నోట్ బుక్ తీసుకుని వచ్చిన అతిథులందరూ డెలివరీ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు రాయమని అడగడం. వేడుకకు వచ్చిన అతిథులందరూ కూర్చుని మధ్యలో బాల్తో మ్యూజిక్ అండ్ డ్యాన్స్, మ్యూజికల్ చైర్, పుట్టబోయే బిడ్డకు పది సెకన్లలో పేరు సూచించడంలాంటి ఆటలన్నమాట. ఇన్నోవేటివ్ గిఫ్ట్స్ బేబీ షవర్కు వెళ్లేవాళ్లు ఏ కానుక తీసుకెళ్లాలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో రకరకాల గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. బేబీకి ఉపయోగపడే డైపర్స్ నుంచి బ్లాంకెట్స్, బేబీ బాటిల్స్, క్లాత్స్, బొమ్మలు, బుక్స్, మొక్కలు, డెలివరీ కిట్, బేబీ బాత్కి అవసరమయ్యే రకరకాల వస్తువులు.. ఇలా కానుకలకు కొదవే లేదు. అయితే ఆయా వస్తువులు పార్టీలోనే ఓపెన్ చేయాలన్న రూల్ ఉంది. ఆహ్వానం మహిళలకు మాత్రమే అనే రూల్ ఉన్నా.. ఇంతమందితో, ఇలాంటి చోట, ఈ సమయంలోనే చేయాలన్న నిబంధన మాత్రం లేదు. ..:: ప్రత్యూష