Badvel ByPoll
-
సీఎం జగన్ను కలిసిన బద్వేలు ఎమ్మెల్యే సుధ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సుధతో పాటు ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను సీఎం అభినందించారు. అనంతరం డాక్టర్ సుధ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా భావించి.. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బద్వేలు చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాని గొప్ప మెజార్టీని అందించిన ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. సీఎం వైఎస్ జగన్ గతంలో బద్వేలు అభివృద్ధికి నిధులు ప్రకటించారని, ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు పూర్తి కాలేదన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు. తన విజయానికి కారకులైన ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
భవిష్యత్లో పోటీ చేస్తారా? లేదా? అనే మీమాంసతో టీడీపీ శ్రేణులున్నాయి
-
బద్వేల్ లో వైస్సార్సీపీ మెజారిటీ రికార్డు
-
బద్వేలు తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది
-
బద్వేల్ తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్: నందిగం సురేష్
సాక్షి, అమరావతి: విహార యాత్రకు వచ్చినట్టు చంద్రబాబు ఏపీకి వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు ఇళ్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. వీరంతా రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తులుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. చదవండి: బద్వేలు బ్లాక్ బస్టర్ ‘‘చంద్రబాబు ఫ్యామిలీ ఓట్లు కుప్పంలో లేవు. చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చే వారిని ప్రజలు నమ్మరు. అమరావతిలో ఇళ్ల పంపిణీని అడ్డుకుంది చంద్రబాబు కాదా?. బద్వేల్ తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. పాదయాత్ర పేరిట అమరావతి జనాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు తాపత్రయం అంతా కొంతమంది ప్రయోజనాల కోసమేనని’’ నందిగం సురేష్ దుయ్యబట్టారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ‘‘బద్వేల్లో ఓడింది టీడీపీ, జనసేన కూడా. బీజేపీకి 21 వేల ఓట్లు ఎలా వచ్చాయనేది ఆలోచించాలి. చంద్రబాబు పరోక్షంగా సహకరించి ఓట్లు వేయించాడు. ఎన్నికకు దూరం అంటూనే బీజేపీ మద్దతు పలికి తన బుద్ధి ఏమిటో స్పష్టం చేశాడు. సీఎం వైఎస్ జగన్ ఓటు పులివెందులలో ఉంటే.. చంద్రబాబు, లోకేశ్ ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయి. అమరావతిలో చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారు. తాను అనుకున్న బినామీ రాజధాని కోసం పేదలకు ఇళ్లు ఇస్తే మురికి కూపం అవుతుందన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్నింటితో పాటు అభివృద్ది చేస్తారు. అక్కడి వారిని రెచ్చగొట్టి చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారు. ఈ యాత్ర రాయలసీమ నుంచి కూడా వెళ్తుంది. వారికి ఏమి సమాధానం చెప్తారు’’ అంటూ సురేష్ ప్రశ్నించారు. -
ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారు : పెద్దిరెడ్డి
-
టీడీపీ గుర్తింపు రద్దుచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ దురుద్దేశపూర్వకంగా అవమానించే చర్యలకు పాల్పడితే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్, 1971 తరహాలో చట్టం తీసుకురావాలని కేంద్ర న్యాయమంత్రిని ఆదేశించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, పట్టాభిరామ్ తదితరులు వాడుతున్న అసభ్య, నీచమైన పదజాలాన్ని రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఎంపీలు మార్గాని భరత్రామ్, సంజీవ్కుమార్, తలారి రంగయ్య, రెడ్డెప్ప, బీవీ సత్యవతిలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు రాష్ట్రపతిని కలిసి టీడీపీ నేతలు వాడుతున్న భాష, ఆచరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వివరించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారో చెప్పాం. తప్పుచేసి చంద్రబాబు రాష్ట్రపతి దగ్గరకువెళ్తే.. చంద్రబాబు ఏ రకంగా తప్పుచేశారో వివరించడానికి మేం రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాం. రాష్ట్ర పరువు, ప్రతిష్ట, ప్రజల ఆత్మగౌరవం చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో రాష్ట్రపతికి వివరించాం. టీడీపీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా మాట్లాడుకునేది బూతు భాష. ఇతరులను సంబోధించేది కూడా బూతు భాషతోనే. అందుకే టీడీపీ అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అనడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్రపతికి బోషడీకే అనే పదాన్ని ఎలా వివరించాలో అర్థంగాక ఎంతో సతమతమయ్యాం. చివరకు ఆయన అర్థం చేసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అంటేనే సంస్కారవంతమైన పార్టీ. టీడీపీ సంస్కారహీనమైన పార్టీ. పట్టాభి వ్యాఖ్యలు ఖండించడం లేదంటే చంద్రబాబును సంస్కారహీనుడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. టీడీపీ అధికార ప్రతినిధి వాడిన పదం చంద్రబాబు రాష్ట్రపతికి చెప్పారా అని మరోసారి అడుగుతున్నాం. రెండున్నరేళ్లుగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అందుకే టీడీపీ నేతలు బూతు భాష వాడుతున్నారు. టీడీపీ అతి త్వరలోనే అంతర్థానం కాబోతోంది. అందుకే ఆ పార్టీ నేతలు యాంటీసోషల్ ఎలిమెంట్స్గా, టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రతిష్ట మంటగలుపుతున్నారు. టీడీపీ చేస్తున్న పిచ్చిపిచ్చి పనులన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం..’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. కాగా, బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సాధించిన విజయం రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతమని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం బద్వేలు విజయం అని ఆయన పేర్కొన్నారు. -
‘ఫ్యాన్’ హ్యాట్రిక్
సాక్షి, అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు విజయభేరి మోగించడం ద్వారా వైఎస్సార్సీపీ హ్యాట్రిక్ సాధించింది. తాజా ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బద్వేల్ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ బద్వేల్ శాసనసభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే నెగ్గారు. టీడీపీ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా.. లోపాయికారీగా జట్టు కట్టినా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం.. బద్వేల్ శాసనసభ స్థానానికి తొలిసారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ 17 సార్లు ఎన్నికలు (రెండు సార్లు ఉప ఎన్నికలు) నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత బద్వేల్ స్థానానికి 2014లో నిర్వహించిన ఎన్నికల్లో 50.66 శాతం ఓట్లను సాధించిన పార్టీ అభ్యర్థి జయరాములు 9,502 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఎన్డీ విజయజ్యోతిపై విజయం సాధించారు. 2019లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య 60.89 శాతం ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్పై 44,734 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. తాజాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ ఆధిక్యతంతో విజయబావుటా ఎగురవేశారు. ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ వైఎస్సార్ సీపీ బలం పెంచుకుని ఆధిక్యతను చాటుతోంది. -
ముగ్గురూ ఏకమైనా డిపాజిట్ గల్లంతు
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ, జనసేనలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా బద్వేలు ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి కేవలం 21,678 ఓట్లు మాత్రమే దక్కడంతో ఈ ఎన్నికల్లో నిర్విరామంగా పనిచేసిన 3 పార్టీల నేతల్లో అంతర్మథనం మొదలైంది. టీడీపీ క్యాడర్కు డబ్బులు పంచి తమవైపు తిప్పుకోవడంతోపాటు కేంద్ర బలగాలను దించినా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 32.36 శాతం ఓట్లు లభించగా ఈసారి జనసేన సైతం సహకరించినా బీజేపీ అభ్యర్థికి 14.73 శాతం ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు గత ఎన్నికల్లో 95,482 (60.89 శాతం) ఓట్లు వచ్చాయి. అప్పుడు 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ కాగా ఈసారి 1,47,166 (68.39 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 8 శాతం తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 1,12,211 (76.24 శాతం) ఓట్లు లభించడం గమనార్హం. సర్వశక్తులూ ఒడ్డినా.. బద్వేలులో బీజేపీకి నామమాత్రంగా కూడా క్యాడర్ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పోటీ చేయగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో బద్వేలు బరిలోకి దిగిన పణతల సురేష్ గత ఎన్నికల్లో రైల్వేకోడూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా 1,049 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ పాత పరిచయాలతో టీడీపీ నేతలతో మంతనాలు జరిపి తమ అభ్యర్థికి సహకరించాలని లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. బీజేపీ ఏజెంట్లుగా కూర్చునేలా ఒప్పించారు. మరోవైపు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రస్థాయి నేతలను బద్వేలుకు తరలించి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ఎన్నికల నాటికి పోలింగ్ వ్యూహాలను టీడీపీకి అప్పగించి చేతులెత్తేసింది. 281 పోలింగ్ బూత్లు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు కేవలం 10 కేంద్రాల్లో మాత్రమే ఏజెంట్లుగా ఉండగా మిగిలిన అన్నిచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలే ఏజెంట్లుగా ఉన్నారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచుల స్థాయి నేతలు సైతం ఏజెంట్లుగా కూర్చున్నా ప్రయోజనం దక్కలేదు. -
సీఎం పాలన వల్లే బంపర్ మెజారిటీ
బద్వేలు: సీఎం వైఎస్ జగన్ హామీలను విశ్వసించి ఇక్కడి ప్రజలు అప్పట్లో తన భర్తకు 45 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని.. ప్రస్తుత రెండున్నరేళ్ల పాలనలో సీఎం ఆ హామీలను అమలు చేయడం చూసి, ఇప్పుడు అంతకు రెట్టింపు మెజారిటీ ఇచ్చారని వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ దాసరి సుధ అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన అనంతరం ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు.. సాక్షి: రాజకీయాల్లోకి వస్తానని ఊహించారా? సుధ: మాకు రాజకీయాలు కొత్త. గతంలో కూడా మా కుటుంబీకులెవరూ ఎన్నికల్లో పోటీచేయలేదు. నా భర్త 2019లో వైఎస్సార్సీపీ తరఫున బద్వేలు నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన హఠాన్మరణంతో ఆయన సేవను కొనసాగించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా. సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి.. పోరాడడానికి స్ఫూర్తి ఎవరు? సుధ: సీఎం వైఎస్ జగన్ మాటలే నాకు స్ఫూర్తి. భర్త మరణం తరువాత సీఎంగారు పరామర్శకు వచ్చారు. జరిగిన విషాదాన్ని త్వరగా మర్చిపోవాలంటే ప్రజాసేవ ఒకటే మార్గం.. ప్రజలకు మంచి చేస్తే కలిగే సంతృప్తి ముందు విషాదం పెద్ద విషయం కాదు, మీరు పోటీచేయండి.. తోడ్పాటు అందిస్తామని ఉత్సాహపరిచారు. దీంతో తక్కువ సమయంలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్ధపడ్డా. సాక్షి: ఇంత మెజారిటీ వస్తుందని ఊహించారా? సుధ: తప్పకుండా వస్తుందని అనుకున్నాం. అనుకున్న దానికంటే 5 నుంచి 10 వేలు తక్కువే వచ్చాయి. వర్షాలు పడటంతో చాలామంది ఓటింగ్కు రాలేదు. బీజేపీకి 90% ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరనుకున్నాం. కానీ, టీడీపీతో కుమ్మక్కై ప్రలోభాలతో ఆ పార్టీ నేతలను ఏజెంట్లుగా కూర్చోబెట్టారు. బీజేపీకి ఓట్లు వేయాలని టీడీపీ ముఖ్య నేతలు చెప్పడంతోనే కొంత మెజారిటీ తగ్గింది. సాక్షి: బద్వేలుకు ఏం చేయాలనుకుంటున్నారు? సుధ: 4 నెలల కిందట సీఎం వైఎస్ జగన్ బద్వేలు అభివృద్ధికి రూ.700 కోట్లు పైగా నిధులు ప్రకటించారు. ఎన్నికల కోడ్తో ఈ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం త్వరితగతిన వీటన్నింటిని పూర్తిచేయడమే లక్ష్యం. బద్వేలు మున్సిపాలిటిలో రోడ్లు, డ్రైనేజీ పనుల పూర్తికి ప్రత్యేక కృషిచేస్తాం. సాక్షి: నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక ఉందా? సుధ: నియోజకవర్గంలో సాగునీటి వనరులు ఇప్పటికే వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో మెరుగయ్యాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేలా చూడాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు ఇతర ఉపాధి మార్గాలను అధ్యయనం చేస్తా. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలి. సాక్షి: డాక్టర్గా వైద్య సేవలను ఎలా మెరుగుపరుస్తారు? సుధ: నా భర్త డాక్టర్ కావడంతో ప్రజల ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించేవారు. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్సీ, సీమాంక్ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్యం అందేలా చూస్తా. డయాలసిస్ రోగులు దూరంగా ఉన్న కడపకు వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్నారు. డెల్ కంపెనీ సహకారంతో బద్వేల్లోనే డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషిచేస్తా. ఇది నా భర్త మొదలు పెట్టారు. దీన్ని పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నా. సాక్షి: మహిళాభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? సుధ: యువతకు వృత్తివిద్యా కోర్సులను నేర్పించి స్థానికంగా ఉపాధి లభించేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను ఉపయోగించుకునేలా చూస్తా. స్థానికంగానే ఉంటూ నిరంతరం యువత, మహిళలతో అనుబంధం పెంచుకుంటూ వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. అందరికీ కృతజ్ఞతలు నా విజయానికి తోడ్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేనిది. వీరంతా నా విజయానికి ఎంతో కష్టపడ్డారు. నా కుటుంబ సభ్యులు సైతం కష్టకాలంలో అండగా నిలిచారు. వీరందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తా. -
ఎన్నిక ఏదైనా ప్రజాతీర్పు ఒక్కటే
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనప్పటికీ వైఎస్సార్సీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మనసారా ఆశీర్వదిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న కుట్రలను ‘ఓట్లే’ అస్త్రాలుగా ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నారు. తాజాగా బద్వేల్ ఉప ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధను అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ స్థానానికి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహించింది. ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్నే తాము మరోసారి బరిలోకి దించుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సాంప్రదాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థిని పోటీకి దించడం లేదని చంద్రబాబు ప్రకటించారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారం కూడా చేసి చివరకు ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించినట్లు డ్రామా ఆడిన తరహాలోనే ఈ ఉప ఎన్నికలోనూ చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేశారు. బీజేపీ–జనసేన కూటమి తరఫున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సురేష్ తరఫున చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహరించారు. ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ టీడీపీ నేతలే పర్యవేక్షించారు. పోలింగ్ ఏజెంట్లుగానూ టీడీపీ నేతలే కూర్చున్నారు. అంటే బీజేపీ–జనసేన–టీడీపీ లోపాయికారీగా జట్టు కట్టినట్లు స్పష్టమవుతోంది. మూడు పార్టీలు లోపాయికారీగా జట్టుకట్టి బరిలోకి దిగినా సరే వైఎస్సార్సీపీ అభ్యర్థికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి చివరి వరకూ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బద్వేల్ ఎన్నికల చరిత్రలో ఇదే భారీ మెజార్టీ కావడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 1,47,166 ఓట్లు పోల్ కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థికి 1,12,211 (76.25 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీ లోపాయికారీగా మద్దతు ప్రకటించిన బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థి సురేష్కు 21,678 (14.73 శాతం) ఓట్లు వచ్చాయి. మూడు పార్టీలూ సహకారం అందించినా సురేష్ డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ 6,235 ఓట్లకు పరిమితమైంది. సుపరిపాలనకు ప్రజల మద్దతు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.26 శాతం), 22 ఎంపీ సీట్లతో (88 శాతం) వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి ఏడాదిలోనే 95 శాతానికిపైగా హామీలను అమలు చేశారు. తద్వారా దేశంలో సరికొత్త రాజకీయాలకు తెరతీశారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని రీతిలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. ఇది చూసి ఓర్చుకోలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిత్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తూ వస్తున్నారు. వాటిని ప్రజలు ఎప్పటికప్పుడు తమ తీర్పు ద్వారా తుత్తునియలు చేస్తూ సీఎం వైఎస్ జగన్కు అండగా నిలుస్తున్నారు. ► రాష్ట్రంలో 13,081 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 81 శాతం అంటే 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే గెలిపించడం ద్వారా ప్రజలు తమ మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించారు. ► 75 పురపాలక (మున్సిపాలిటీలు), 12 నగరపాలక(కార్పొరేషన్) సంస్థలకు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించుతూ చంద్రబాబే బీ–ఫారాలు జారీ చేశారు. పురపాలక, నగరపాలక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను అడ్డుపెట్టుకుని రోజుకో డ్రామా ఆడుతూ సీఎం వైఎస్ జగన్పై బురద చల్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించి డ్రామాను తుది అంకానికి చేర్చినా ఘోర పరాజయం తప్పలేదు. ► తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ–జనసేన, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డినా ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలతో పోల్చితే టీడీపీకి 5.57 శాతం ఓట్లు తక్కువగా వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 56.67 శాతం ఓట్లు, 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ప్రజలు అపూర్వ విజయాన్ని అందించి సీఎం జగన్ పాలనకు మద్దతు పలికారు. పరిషత్ ఎన్నికల్లో చారిత్రక విజయం.. రాష్ట్రంలో 9,583 ఎంపీటీసీ స్థానాలు, 638 జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని కుట్ర లేదు. వాటిని అడ్డుకున్న ప్రజలు ఏకంగా 8,249 ఎంపీటీసీ స్థానాల్లో (86 శాతం) వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. 638 జడ్పీటీసీ స్థానాల్లో 630 చోట్ల (98.75 శాతం) వైఎస్సార్సీపీ అభ్యర్థులనే గెలిపించడం ద్వారా చారిత్రక విజయాన్ని అందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అన్ని జిల్లా పరిషత్ల్లోనూ (13 జిల్లా పరిషత్లకునూగా 13) వైఎస్సార్సీపీని గెలిపించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను దీవించారు. సంక్షేమ, అభివృద్ధి పాలనకు జేజేలు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతానికిపైగా తొలి ఏడాదిలోనే అమలు చేసిన చరిత్ర ఇప్పటిదాకా లేదు. సీఎం జగన్ గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో సంస్కరణలు తెచ్చి వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పాలనను తీసుకెళ్లారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. సమతుల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేయడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. పేదలకు ఏమాత్రం కష్టం కలగనివ్వకుండా సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం తపిస్తూ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్కు ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. -
బద్వేలు బ్లాక్ బస్టర్
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత నెల 30న పోలింగ్ జరగ్గా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు రికార్డు స్థాయిలో 90,533 ఓట్ల మెజార్టీ లభించింది. డాక్టర్ సుధకు మొత్తం 1,12,211 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పణతల సురేష్కు 21,678 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు పడ్డాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు 3,389 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లని ఓట్లు పడ్డాయి. బద్వేలులో మొత్తం 2,15,240 మంది ఓటర్లకుగానూ 1,47,166 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లతో ఆధిక్యం ఆరంభం మంగళవారం ఉదయం 8.00 గంటలకు బద్వేలులోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం సాధించింది. 183 పోస్టల్ బ్యాలెట్లలో 139 ఓట్లు అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థికి లభించాయి. బీజేపీ అభ్యర్థికి 17, కాంగ్రెస్ అభ్యర్థికి 18 చొప్పున ఓట్లు వచ్చాయి. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా 9.00 గంటల ప్రాంతంలో తొలి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 8,790 ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తర్వాత వరుసగా 13 రౌండ్లలోనూ భారీ మెజార్టీ వచ్చింది. తొలుత 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావించినా ఒక ఈవీఎం మొరాయించడంతో దానికి సంబంధించి 13వ రౌండ్లో వీవీ ప్యాట్లను లెక్కించారు. దీంతో మొత్తం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ముగిసింది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్తోపాటు ఎన్నికల అబ్జర్వర్ల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రశాంతంగా పూర్తైంది. రెట్టింపు మెజార్టీతో విజయభేరి బద్వేలులో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్ల మెజార్టీ లభించింది. వెంకట సుబ్బయ్యకు 60.89 శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్కు 32.36 శాతం ఓట్లు వచ్చాయి. 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో 1,47,166 (68.39 శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 8 శాతం తక్కువగా పోలింగ్ నమోదైనా వైఎస్సార్ సీపీకి గతంలో కంటే రెట్టింపు మెజార్టీ లభించడం గమనార్హం. ఆనందోత్సాహాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ రికార్డు మెజార్టీతో విజయం సాధించడంతో బద్వేలు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నాయి. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజాదరణకు తాజా ఎన్నికల తీర్పు నిదర్శనమన్నారు. స్వచ్ఛమైన పాలనకు లభించిన విజయం ‘ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. నాడు బద్వేలు ప్రజలు నా భర్త, దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్యకు 44వేల మెజారిటీ ఇస్తే నేడు సీఎం జగన్ నిష్పక్ష పాలన, సామాజిక న్యాయం, మాట మీద నిలబడే తత్వం చూసి నాకు 90 వేల పైచిలుకు మెజారిటీతో విజయం చేకూర్చారు. నిధులు కేటాయించిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. నాకు టిక్కెట్ ఇచ్చి పోటీ చేసేందుకు ప్రోత్సాహం అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. నా విజయానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, నియోజకవర్గ ఇన్చార్జి డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా విజయం కోసం అక్క చెల్లెమ్మలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటా’ – డాక్టర్ దాసరి సుధ, బద్వేలు ఉప ఎన్నిక విజేత -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
-
ఓడిపోతామని ముందే తెలిసే ఇలా....
-
ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతుంది: సజ్జల రామకృష్ణా రెడ్డి
తాడేపల్లి: టీడీపీ నేతలు బీజేపీకి ఏజెంట్లుగా పనిచేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం.. బరిలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల పేర్కొన్నారు. సీఎం జగన్కు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్నారు. పోటీలో లేకపోయినా జనసేన, టీడీపీ ప్రచారం చేశాయని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రలను బద్వేలు ప్రజలు తిప్పికొట్టారన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
-
‘బద్వేలు తీర్పు సీఎం జగన్పై నమ్మకానికి నిదర్శనం’
తాడేపల్లి: బద్వేలు తీర్పు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకానికి నిదర్శనమని ప్రభుత్వవిప్ కోరుముట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, మేనిఫెస్టోను అమలు చేసి సీఎం జగన్ తన క్రెడిబిలిటీ నిరూపించుకున్నారని ప్రశంసించారు. టీడీపీ కుట్రలు చేసి అలజడి సృష్టించాలనుకున్నా ఏమిచేయలేకపోయారని కోరుముట్ల శ్రీనివాస్ విమర్శించారు. బద్వేల్లో ప్రజలు.. రికార్డు స్థాయిలో దాసరి సుధకు 90 వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు. ‘ప్రజలు నైతిక పాలనకు ప్రజలు దివేనలు అందించారు’ కర్నూలు: కరోనా విపత్తులోను.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కావాలనే వైఎస్ జగన్ పాలనపై పనిగట్టుకుని బురద జల్లుతున్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా ప్రతి పక్షనేతలు.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.బద్వేలు ఎన్నికల్లో టీడీపీ హైడ్రామాలు ఆడిందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ విమర్శించారు. నైతికంగా సుపరిపాలన అందిస్తున్న.. వైఎస్ జగన్ పాలనకు ప్రజలు దివెనలు అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. -
మూడు పార్టీలు కలిసినా కూడా డిపాజిట్ దక్కలేదు: ఎంపీ అవినాష్ రెడ్డి
కడప: బద్వేలు ఉప ఎన్నికలు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు రెఫరెండంగా భావించారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు దేశం మొత్తం గర్వించేలా సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అలుపెరగకుండా కష్టపడ్డారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేశారని తెలిపారు. టీడీపీ, బీజేపీకి పూర్తిగా సహకరించిందని విమర్శించారు. బీజేపీ,జనసేన, టీడీపీలు కలిసినా డిపాజిట్ కూడా దక్కలేదని పేర్కొన్నారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. మరింత మన్ననలు పొందేలా పనిచేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’
వైఎస్సార్ కడప: సీఎం వైఎస్ జగన్ పై అభిమానంతో గత ఎన్నికల్లో 45 వేలు మెజారిటీ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. బద్వేల్లో ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని అన్నారు. కుప్పంలో చంద్రబాబు వాగుడు చూశామని,. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రలు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. ఏ సెంటర్ అయినా. ఏమైనా సింగిల్ హ్యాండ్తో వైఎస్సార్సీపీని ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు రోజా పాదాభివందనం తెలిపారు. అదే విధంగా, టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. చదవండి: డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్ -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు’’ అన్నారు సీఎం జగన్. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను’’ అని సీఎం జగన్ తెలిపారు. (చదవండి: ‘బద్వేలు తీర్పు సీఎం జగన్పై నమ్మకానికి నిదర్శనం’) దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 బద్వేల్ ఉప ఎన్నికలో భారీ విజయం నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్ని కలిశారు. అలానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్ని కలిశారు. చదవండి: ‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’ చదవండి: అవార్డు గ్రహీత వీల్చైర్ ఫుట్స్టెప్స్ని సరి చేసిన సీఎం జగన్ -
చంద్రబాబు కుప్పంలో నీ డ్రామాలు చూసాం, బద్వేల్ ఎలెక్షన్ తో అయినా బుద్ధి తెచ్చుకో..
-
మూడు పార్టీలు కలిసి వచ్చినా డిపాజిట్లు కూడా సాధించలేకపోయారు
-
ఏపీలో ముందే వచ్చిన దీపావళి: టీజేఆర్ సుధాకర్ బాబు
-
సీఎం జగన్ సంక్షేమ పాలనకు పట్టం కట్టిన బద్వేల్ ప్రజలు
-
ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు
-
వయస్సు తక్కువ అనుభవం ఎక్కువ అనేదానికి నిదర్శనం బద్వేల్ తీర్పు
-
ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు
-
ఇది ప్రజా విజయం: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, అమరావతి: ఇది ప్రజా విజయమని.. ప్రజలను నమ్ముకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. బీజేపీ, టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయాయి. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘బద్వేల్ ఫలితం మరింత బాధ్యత పెంచింది. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇది. ఇది దళితులు, బీసీలు, సామాన్యుల విజయం. ప్రజలు మా వైపే నిలిచారు సీఎం జగన్ పారదర్శక పాలనకు ప్రజలు అండగా నిలిచారు. నిరంతరం దుష్ప్రచారం చేసే టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు విస్మరించినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని హామీలేవి బీజేపీ నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారని’’ శ్రీకాంత్రెడ్డి అన్నారు. -
బద్వేలు ఉప ఎన్నిక: బద్వేల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం
-
బద్వేల్లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ల గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 76.25 శాతం ఓట్లను వైఎస్సార్సీపీ సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్లోనూ వైఎస్సార్సీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది. డిపాజిట్లు గల్లంతు బద్వేల్లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయి. బద్వేల్ ప్రజలు, సీఎం జగన్ వెంటే ఉన్నారని డాక్టర్ సుధ అన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించారని.. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని డాక్టర్ సుధ పేర్కొన్నారు. (Badvel By Election: రౌండ్ల వారీగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలు) -
Badvel By Election: రౌండ్ల వారీగా బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు
రౌండ్ల వారీగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలు -అప్డేట్స్ ఓట్లు వైఎస్సార్సీపీ బీజేపీ కాంగ్రెస్ రౌండ్-12 483 54 14 రౌండ్- 11 5139 984 223 రౌండ్- 10 10052 1554 449 రౌండ్- 9 11354 2839 493 రౌండ్- 8 9691 1964 774 రౌండ్- 7 10726 1924 841 రౌండ్- 6 11383 1940 531 రౌండ్-5 11783 1797 575 రౌండ్- 4 9867 2241 491 రౌండ్- 3 10184 2305 598 రౌండ్-2 10570 2270 634 రౌండ్- 1 10,478 1688 580 సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బద్వేల్లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్ గల్లంతయ్యింది. మొదటి నుంచి ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యత ప్రదర్శించింది. -
బద్వేల్ ఉప ఎన్నిక: 90,533 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్సీపీ గెలుపు
Live Updates: Time: 12:45 PM: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 90,533ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. Time: 12:24 PM 13 వ రౌండ్లో వైఎస్సార్సీపీకి 362 ఓట్లు, బీజేపీకి 40 ఓట్లు, కాంగ్రెస్కు 12 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. Time: 12:20 PM 12వ రౌండ్లోనూ ‘ఫ్యాన్’ హవా కొనసాగింది. ఈ రౌండ్లో 483 ఓట్ల ఆధిక్యం సాధించిన వైఎస్సార్సీపీ మొత్తంగా 90,211 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుంది. అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్సీపీ 1,11,849 ఓట్లు, బీజేపీ 21,638 ఓట్లు, కాంగ్రెస్ 6,223 ఓట్లు సాధించాయి. Time: 12:00 PM ఇప్పటికే గెలుపు ఖాయం చేసుకున్న వైఎస్సార్సీపీ 11వ రౌండ్లోనూ సత్తా చాటింది. తాజా రౌండ్లో లభించిన 4584 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ 90,089 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ 1,11,710 ఓట్లు ,బీజేపీ 21,621 ఓట్లు, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించాయి. Time: 11:40 AM: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్సీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్ ఫలితం వెలువడాల్సి వుంది. Time: 11:31 AM: బద్వేల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. అధికారికంగా మరో మూడు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి వుంది. 8 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్సీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. Time: 11:25 AM: బద్వేల్లో ఎనిమిదో రౌండ్ ముగిసింది. 8వ రౌండ్లో వైఎస్సార్సీపీ 9691, బీజేపీ 1964, కాంగ్రెస్కు 774 ఓట్లు పోలయ్యాయి. 68,492 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 11:14 AM: బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్సీసీ 60,826 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ మెజార్టీ దిశగా డాక్టర్ దాసరి సుధ సాగుతున్నారు. Time: 11:7 AM: బద్వేల్లో ఏడో రౌండ్ ముగిసింది. ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్కు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్సీపీ 74991 ఓట్లు సాధించింది. Time: 11:01 AM: బద్వేలులో ఆరో రౌండ్ ముగిసింది. ఆరో రౌండ్లో వైఎస్సార్సీపీకి 11,383, బీజేపీకి 1940, కాంగ్రెస్కు 531 ఓట్లు పోలయ్యాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్ వైఎస్సార్సీపీ 64,265 ఓట్లు సాధించింది. Time: 10:45 AM: బద్వేల్లో ఆరో రౌండ్ ముగిసే సరికి 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీకి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు పోలయ్యాయి. Time: 10:45 AM: బద్వేల్లో భారీ విజయం దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్సీపీ ఆధిక్యత 50 వేలు దాటింది. Time: 10:38 AM: బద్వేల్లో ఆరో రౌండ్ ముగిసింది. 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 10:26 AM: భారీ విజయం దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. బద్వేల్లో ఐదో రౌండ్ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 10:06AM: బద్వేలులో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. భారీ విజయం దిశగా డాక్టర్ దాసరి సుధ సాగుతున్నారు. Time: 9:57 AM: నాలుగో రౌండ్ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 9:36 AM: బద్వేల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 9:30 AM: తొలి రౌండ్లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్కు 580 ఓట్లు లభించాయి. Time: 9:03 AM: తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. Time: 8:36 AM: బద్వేల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కలసపాడు మండలం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. Time: 8:24 AM: పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు.. Time: 8:00 AM: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 259 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. -
10 రౌండ్లలో బద్వేల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
-
బద్వేలు ఉప ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
వైఎస్సార్ జిల్లా: బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేపు(మంగళవారం) ఉదయం 8 కు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం 281 పోలింగ్ బూతుల కోసం నాలుగు హాల్స్ లో 28 టేబుల్స్ ఏర్పాటు.. మొత్తం 10 రౌండ్స్ లో లెక్కింపు చేస్తారు. మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం అభ్యర్థులు, ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తారు. అనంతరం మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.. ఇప్పటి వరకు 235 పోస్టల్ బ్యాలెట్ అందాయని, సర్వీస్ ఓటర్లకు రేపు ఉదయం వరకూ సమయం ఉందని రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఒకవేళ వర్షం పడినా ఎటువంటి అంతరాయం కలగకుండా కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
బద్వేల్ ఉపఎన్నికలో పచ్చ పార్టీ కుట్రలు
-
బీజేపీ కుయుక్తులు.. టీడీపీ కుట్రలు
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకులు కుయుక్తులుతో ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఉప ఎన్నికలో పోటీకి దూరమని ప్రకటించిన టీడీపీ కుట్రలతో ముందుకెళ్లిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం రాత్రి కడపలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి భయంతో వైఎస్సార్సీపీపై విమర్శలకు దిగుతోందని దుయ్యబట్టారు. గెలవలేమని తెలిసినా వైఎస్సార్సీపీకి మెజార్టీ తగ్గించాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు ఎక్కడికక్కడ బూత్ల వద్ద కుయుక్తులకు తెర లేపారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఐడీ కార్డులు, ఇతరత్రా కారణాలు చెబుతూ బూత్ల వద్దకు ఓటర్లు రాకుండా అడ్డుకునే కుట్ర చేయడం దారుణమన్నారు. బీజేపీ నాయకులు కోరిన విధంగానే 281 బూత్లలోనూ వెబ్ కాస్టింగ్తోపాటు లైవ్ కవరేజ్ చేశారన్నారు. అయినప్పటికీ ఓట్లు రావన్న కారణంతో బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏదో ఒక అరాచకం చేసి ఓటర్లను రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ అభ్యర్థి పోటీ చేయకపోయినా అన్ని బూత్లలో బీజేపీ తరఫున టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా కూర్చోవడం చూస్తే కుట్ర రాజకీయాలు ఏమేరకు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం చూసి బీజేపీకి ఓట్లేస్తారు బీజేపీకి ఏం చూసి ప్రజలు ఓట్లేస్తారని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బద్వేలులో అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగకపోయినా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఏదో జరిగినట్టు మాట్లాడటం తగదన్నారు. వారికి బలం లేనిచోట ఏజెంట్లను పెట్టుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన ఘటన ఒక్కటైనా చూపించాలన్నారు. -
బీజేపీ సేవలో టీడీపీ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ, టీడీపీలు కుమ్మక్కయ్యాయి. నామమాత్రంగా కూడా కార్యకర్తల బలంలేని కమలం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీకి దిగింది. పోలింగ్ జరిగిన శనివారం నాడు టీడీపీ నేతలు, కార్యకర్తలను ఏజెంట్లుగా పెట్టుకుని బీజేపీ కథ నడిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బద్వేలు ఉప ఎన్నికలో సంప్రదాయానికి లోబడి పోటీ నుంచి తప్పుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. జనసేన సైతం చంద్రబాబు బాటలో నడిచింది. బీజేపీ మాత్రం బరిలోకి దిగి స్థానికేతరుడు పణతల సురేష్ను అభ్యర్థిగా పోటీకి నిలిపింది. నామినేషన్ల రోజు నుంచే అటు టీడీపీ, ఇటు బీజేపీలు బద్వేలులో అక్రమ పొత్తుకు తెరలేపాయి. టీడీపీ పాత కాపులు, ప్రస్తుత బీజేపీ నేతలైన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి బద్వేలు నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో మంతనాలు సాగించారు. మద్దతు కోసం పలు దఫాలు చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం టీడీపీ నేతలు సమావేశమై బీజేపీకి ఓట్లు వేయాలని కార్యకర్తలకు చెప్పారు. దీంతో.. టీడీపీ నేతలు, కార్యకర్తలే శనివారం జరిగిన పోలింగ్లో ఏజెంట్ల అవతారం ఎత్తారు. బీజేపీ తరఫున ఏజెంటుగా ఉన్న గోపవరం ఎంపీపీ భర్త, టీడీపీ నేత కొండయ్య 10 బూత్లలోనే బీజేపీ ఏజెంట్లు బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల మండలాల పరిధిలో మొత్తం 281 పోలింగ్ బూత్లు ఉండగా, గోపవరం మండలంలో మూడు, బద్వేలు మండలంలోని 7 పోలింగ్ బూత్ల్లో మాత్రమే బీజేపీ కార్యకర్తలు ఏజెంట్లుగా కూర్చొన్నారు. మొత్తం 90 శాతం పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలే బీజేపీ ఏజెంట్ల పాత్ర పోషించారు. ► గోపవరం మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి సుధాకర్రెడ్డి ఎస్.రామాపురం పోలింగ్ బూత్ 268లో బీజేపీ ఏజెంటుగా కూర్చున్నారు. ► గోపవరం ఎంపీపీ గోపిదేశి ధనలక్ష్మి భర్త కొండయ్య ఎస్.రామాపురంలోని మరో బూత్లో బీజేపీ ఏజెంట్ అవతారమెత్తారు. ► చిన్నగోపవరం అంగన్వాడీ కార్యకర్త భర్త అదే గ్రామంలోని పోలింగ్ బూత్లో బీజేపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారు. కాలువపల్లెలో టీడీపీ సర్పంచ్ పసుపులేటి శ్రీనివాసులు అక్కడి బూత్లో బీజేపీ తరపున పనిచేశారు. ► బి.కోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి స్వయాన సోదరుడి కుమారుడు మున్నెళ్లిలో, గుంతపల్లిలో టీడీపీ నేత సుబ్బారెడ్డి తమ్ముడి కుమారుడు, చిన్నాన్న కొడుకులు గుంతపల్లి, బి.కోడూరులలో బీజేపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారు. ► కలసపాడు మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు గోపవరం వెంకట్రామిరెడ్డి చిన్నాన్న కుమారుడు రాజారెడ్డి కలసపాడు పోలింగ్ బూత్ 18లో ఏజెంటుగా పనిచేశారు. మొత్తంగా నియోజకవర్గంలోని 90 శాతం పోలింగ్ బూత్లలో టీడీపీ వారే బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం విమర్శలకు ఆస్కారం ఏర్పడింది. -
చంద్రబాబు SCలను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నాడు
-
ముగిసిన బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్
-
కాసేపట్లో ముగియనున్న బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్
-
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: దాసరి సుధ
-
బద్వేల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేల్లో టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తోంది. బద్వేల్లో చాలాచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మారారు. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోంది. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడంపై టీడీపీ దళిత నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
Badvel Bypoll: ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
బద్వేలు ఉపఎన్నికల్లో రాత్రి 7.00 గంటల వరకు 68.12 శాతం పోలింగ్ నమోదయ్యింది. Time: 7:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముసిగింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్ర ఐదు గంటల వరకు బద్వేల్లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. 281 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. Time: 5:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు బద్వేల్లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Time: 3:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బద్వేల్లో 44.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. Time: 12:40 PM:బద్వేల్ ఉప ఎన్నికను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు సీఈఓ విజాయనంద్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం అని విజయానంద్ తెలిపారు. Time: 1:14 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదు అవ్వగా, ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. Time: 11:24 AM: బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి సీఈవో విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. Time: 11:24 AM: బద్వేల్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ కొన్ని ఛానల్లో అవాస్తవ కథనాలు ప్రచారం అవుతున్నాయి. కథనాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ స్పందించారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధమని తెలిపారు. ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులేమీ అందలేదన్నారు. ఎక్కడా పోలింగ్ ఆగలేదని విజయానంద్ స్పష్టం చేశారు. Time: 11:17 AM: ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. Time: 9:32 AM: ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదైంది. Time: 9:22 AM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 8.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8:16 AM: బద్వేల్లో టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తోంది. బద్వేల్లో చాలాచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మారారు. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోంది. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడంపై టీడీపీ దళిత నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. Time: 8:00 AM: ►బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ►కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 తర్వాత ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ►బీసీ వెల్ఫేర్ కార్యాలయ పోలింగ్ స్టేషన్ను ఏఎస్పీ మహేష్కుమార్ పరిశీలించారు. Time: 7:56 AM: బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ►ఉప ఎన్నిక నేపథ్యంలో కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ►ప్రధానంగా రెండు డోసుల టీకా పూర్తయిన వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టారు. ►అంతేకాకుండా ఏజెంట్లు, సిబ్బంది కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. Time: 7:00 AM: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్తోపాటు వెబ్క్యాస్టింగ్ కూడా చేస్తునట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడించారు. 2019లో 77.64 శాతం పోలింగ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 22 మంది ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులతోపాటు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్యర్యంలో మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా లైవ్ వెబ్కాస్టింగ్, వీడియో కెమెరాల ద్వారా చిత్రీకరణ చేస్తున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 160 మంది ఎస్ఐలు, 320 మంది హెడ్కానిస్టేబుల్, ఏఎస్ఐలు, 980 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 300 మంది హోం గార్డులు, 15 ప్లాటూన్ల కేంద్ర బలగాలు (960 మంది), 72 రూట్ మొబైల్స్, 36 స్ట్రయికింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్లతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. -
బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధం
-
Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ కోసం పూర్తయిన ఏర్పాట్లు
-
Badvel Bypoll: బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధం..
సాక్షి, కడప: బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి పోలింగ్ సామగ్రి మొదలుకొని బారికేడ్ల ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే ప్రజాప్రతినిధుల ఎన్నికలో కీలక భాగస్వామ్యం ఓటరుదే కనుక ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు కూడా బద్వేలు ఎన్నికల్లో ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాయి. 2019 ఎన్నికల కంటే కూడా ఈసారి అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యేలా అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఓటర్లలో చైతన్యం తెస్తున్న అధికారులు బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందుకోసం కళాజాత ద్వారా పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, కాశినాయన, కలసపాడు ఇలా అన్ని మండలాల్లోనూ కళా రూపాల ద్వారా ఓటు విలువ తెలియజేస్తున్నారు. ఓటే వజ్రాయుధం కనుక ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. 2019లో 77.64 శాతం పోలింగ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 22 మంది ఉన్నారు. పోలింగ్కు సమాయత్తం బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి శనివారం జరిగే పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రి బద్వేలుకు తరలించారు. శుక్రవారం ఉద యం నుంచి ఎన్నికల సామగ్రిని సంబంధిత పోలింగ్ అధికారులకు అందజేసి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నికలకు విధులు కేటాయించిన పోలీసు యంత్రాంగమంతా బద్వేలు చేరుకుంది. ప్రశాంత పోలింగ్కు అటు పోలీసు అధికారులతోపాటు ఇటు ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు: కలెక్టర్ వి.విజయరామరాజు బద్వేలు అర్బన్: ఉప ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్వర్మ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ధ్యానచంద్ర, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో నిర్దేశించిన సమయానికి సామగ్రి అంతా పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి సౌకర్యం, భోజన ఏర్పాట్లు, శానిటేషన్ తదితర అంశాలపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం ఉప ఎన్నికల స్ట్రాంగ్రూమ్లను, వస్తు సామగ్రిని పరిశీలించి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బి ఎస్ఈ మహేశ్వర్రెడ్డి, విద్యుత్శాఖ ఎస్ఈ సౌభాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్లు మధుసూదన్రెడ్డి, రవిశంకర్రెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బద్వేలు అర్బన్: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో గురువారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్లోకి ఓటు వేసే వ్యక్తులు తప్ప ఇతరులు రాకుండా చూడాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్పెన్నులు, మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని పోలింగ్ బూత్లలోకి అనుమతించకూడదని తెలిపారు. పోలింగ్ బూత్ నుంచి 100 గజాల లోపు జనసందోహం లేకుండా చూసుకోవాలని కోరారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో 23 చెక్పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్పోస్టులో పది మందిని నియమించామని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీలు శ్రీనివాసులు, సుధాకర్, రవికుమార్, విజయకుమార్, సీఐలు, ఎస్ఐలు, సీఆర్పీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ భద్రత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!
సాక్షి ప్రతినిధి కడప/బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకోవడంపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. గత మూడు పర్యాయాలుగా అక్కడ పోటీ చేసినా పట్టుమని ఏడు వందల ఓట్లు కూడా రాకపోవడంతో లోపాయికారీగా టీడీపీ మద్దతు కూడగడుతున్నారు. ఈసారి టీడీపీ బరిలో లేనందున ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు బీజేపీలో చేరిన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి తదితరుల ద్వారా పావులు కదుపుతున్నారు. బీజేపీ నాయకులు వీరితో కలసి స్థానిక టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి ఆ పార్టీ క్యాడర్ తమకు మద్దతిచ్చేలా చూడాలని కోరుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఫోన్లు చేయిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్ బద్వేలులో బీజేపీకి క్యాడర్ లేకపోవడంతో అత్యధిక పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లు దొరకక టీడీపీ కార్యకర్తలను తమవైపు తిప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల డబ్బులు ఎర వేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వరుస పరాభవాలతో ఈ ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో స్థానికేతరుడైన పనతల సురేష్ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. వాస్తవానికి నియోజకవర్గంలో బీజేపీకి నామమాత్రంగా కూడా కార్యకర్తలు లేరు. ఈ నేపథ్యంలో కాశినాయన మండల కేంద్రమైన నరసాపురానికి చెందిన టీడీపీ నేత కర్నాటి వెంకటరెడ్డితో బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ స్వయంగా చర్చలు జరిపి తమకు అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పందాలు చేసుకున్నారు. పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితేష్రెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం అక్రమ పొత్తులను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పోటీ చేయరాదని పార్టీ నాయకత్వం నిర్ణయించినందున తమ అభీష్టం ప్రకారం ఓటు వేయనివ్వాలని సూచించినట్లు సమాచారం. -
బద్వేలు ఉపఎన్నికల పోలింగ్ కోసం పూర్తయిన ఏర్పాట్లు
-
స్వేచ్ఛగా బద్వేలు ఉప ఎన్నిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపేసినట్లు తెలిపారు. ఎన్నికకు 12 గంటల ముందుగానే నియోజకవర్గం సరిహద్దులన్నీ మూసేయాలని, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 7 నుంచి 30 వ తేదీ రాత్రి 10 గంటల వరకూ, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్2న మద్యం షాపులను మూసేయాలన్నారు. 30న నియోజకవర్గంలో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. హుజూరాబాద్లో ముగిసిన ప్రచార హోరు తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. 30న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది. -
బద్వేలు ఉప ఎన్నిక: ముగిసిన ప్రచారం
-
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్సైడే: ఎమ్మెల్యే రోజా
-
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్సైడే: ఎమ్మెల్యే రోజా
బద్వేలు (వైఎస్సార్జిల్లా): బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ దూసుకుపోతుందని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్సైడే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం తాము.. ప్రచారం చేస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని రోజా కోరారు. కాగా, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దొంగ నాటకాలాడిన ప్రజలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు. చదవండి: చంద్రబాబు బూతు పంచాంగం డ్రామా ఫెయిల్: సజ్జల -
చివరి రోజు కావడంతో ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ దూకుడు
-
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మేజార్టీతో గెలుస్తాం
-
బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం
-
కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు
-
బద్వేల్లో వైఎస్ఆర్సీపీ కి భారీ మెజారిటీ వస్తుంది
-
కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు
బద్వేలు (వైఎస్సార్ కడప): బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ విజయం ఖాయమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏ ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. గెలిచే ఎన్నిక అయినా.. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది.. అంతరించిపోతుంది. అదే విధంగా.. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.. ప్రస్తుతం దాని ఉనికే లేదని విమర్శించారు. కాంగ్రెస్ , బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండని తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీడీపీ, జనసేనలు పోటీలో నిలవకుండా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బద్వేలు బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న బద్వేలుకు ఉప ఎన్నిక జరగనుంది. చదవండి: ‘ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదు’ -
పవన్ కల్యాణ్ ఈ నీతిమాలిన రాజకీయమేంటి..?
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి బుధవారం ఆఖరి రోజు కావడంతో రాజకీయపార్టీలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బద్వేల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ ఎప్పుడో గెలిచారు. మెజారిటీ కోసమే ప్రచారం. టీడీపీ జనసేన లోపాయకారి కుట్రలు కొనసాగిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన అధినేతకు నిజాయితీ ఉందా?. చనిపోయిన అభ్యర్థి వెంకటసుబ్బయ్య కుటుంబంపై సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నాం అన్నారు కదా పవన్. ఇప్పుడేంటి ఈ నీతిమాలిన రాజకీయం?. అమిత్ షాపై రాళ్లు వేసిన ఘటన ఆయనకు గుర్తుండదా.. అందుకే చంద్రబాబుకి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం. మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా..? అంటూ చంద్రబాబుపై అంబటి మండిపడ్డారు. చదవండి: (అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు: విజయసాయిరెడ్డి) -
బద్వేలు ఉప ఎన్నిక: ముగిసిన ప్రచారం
సాక్షి, కడప: ఈనెల 30న జరగనున్న బద్వేలు ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో ఈనెల 27న బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి తెర పడింది. ఈనెల 30న బద్వేల్ పోలింగ్కు కొత్త నిబంధనలు ప్రకారం 72 గంటల ముందే ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. బద్వేల్ నియోజకవర్గంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నియోజకవర్గంలో నలువైపులా విస్తృతంగా పోలీస్ తనిఖీలు నిర్వహించారు. బయట వ్యక్తులు నియోజకవర్గం విడిచి వెళ్లాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న 2 లక్షల 15 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బద్వేల్ బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. బద్వేలులో త్రిముఖ పోరు నడుస్తోంది. వైఎస్సార్సీపీ తరపున డాక్టర్ సుధ, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, బీజేపీ తరపున పనతల సురేష్ పోటీలో ఉన్నారు. వీరుగాక మరో 12మంది వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున ఇప్పటికే పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. (చదవండి: Rain Alert: ఏపీలో రెండు రోజులు వర్షాలు) వైఎస్సార్సీపీ తరపున మం6తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు అంజద్బాషా, నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచారాన్ని వేడెక్కించారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత సాధించిన వైఎస్సార్సీపీ ఫుల్ జోష్లో ఉంది. బద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. (చదవండి: ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి) ఎత్తులు.. పై ఎత్తులు ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం 11న పరిశీలన, 13న ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించారు. బరిలో 15మంది అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల దాఖలు అనంతరం వ్యూహాలు, ఎన్నికల ఎత్తులు, ప్రచార పర్వంలో నేతలు నిమగ్నమయ్యారు. దాదాపు 20నుంచి 25 రోజులుగా ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వతంత్రులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు భారీ మెజార్టీ తీసుకొచ్చేందుకు పలువురు నేతలు ప్రణాళికలు రూపొందిస్తూ.. ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ వచ్చారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రాష్ట్ర నేతలు కూడా బద్వేలులో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. -
బద్వేల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు: ఆదిములపు సురేష్
-
అడవికి సింహం రారాజు ఆంధ్రాకి జగనన్న మహారాజు
-
బద్వేల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు: ఆదిములపు సురేష్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘‘వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సీఎం జగన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బద్వేల్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నాం. బద్వేల్ ఉపఎన్నికలో ప్రలు ఏకపక్ష తీర్పు ఇస్తారు’’ అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. బీజేపీ పరిధిలో లేని హామీలు ఇస్తున్నారు. బద్వేల్లో బీజేపీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తుందట. రాజ్యాంగం ప్రకారం పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి. బద్వేలు ఉప ఎన్నికలో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు’’ అని మంత్రి సురేష్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి) స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తా: గడికోట ‘‘నేను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు. ఈ ఆరోపణలు నిజమని స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తా. సోము వీర్రాజు అందుకు సిద్ధమా’’ అని ప్రశ్నించారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్నాం. సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైంది’’ అన్నారు. (చదవండి: బద్వేలులో టీడీపీ.. బీజేపీకి ఓట్లు వేస్తామంటోంది) ‘‘పోలవరం ప్రాజెక్ట్కు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేంద్రం బాధ్యత కాదా. సమస్యలపై వైసీపీ, బీజేపీ అభ్యర్థులు బహిరంగ చర్చకు సిద్ధమా. ఏపీకి ఇచ్చిన హామీలు అమలుకు బీజేపీ ప్రయత్నించాలి’’ అన్నారు. చదవండి: 'కాంగ్రెస్ చేసిన పాపం దేశంలోనే కనుమరుగయ్యేలా చేసింది' -
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు. వారు ప్రజల మన్ననలను పొందారని అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు సీఎంలుగా పనిచేశారు.. ఒకరు మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే, మరొక సీఎం(కిరణ్ కుమార్ రెడ్డి) రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చదవండి: పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని -
నేడు గోపవరంలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ
-
బద్వేలుకు రాలేకపోతున్నా: వైఎస్ జగన్ ఆత్మీయ లేఖ
సాక్షి కడప: బద్వేలు నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు..అందరికీ నిండు మనసుతో హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా, నా కుటుంబ సభ్యులైన మీతో బద్వేలు వచ్చి గడపాలని, ప్రత్యక్షంగా మిమ్మల్ని బహిరంగసభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను. కానీ కోవిడ్ నిబంధనలు, ఎన్నికల కమిషన్ నిబంధనల నేపథ్యంలో నేను ప్రత్యక్షంగా బద్వేలు రాలేకపోతున్నా. మిమ్మల్ని అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నా. నేను ప్రత్యక్షంగా అక్కడికి వస్తే.. భారీగా మన అక్కచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరికైనా కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాలను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకునే నా పర్యటన రద్దు చేసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నా భావాలను మీతో ప్రత్యక్షంగా పంచుకునేందుకు వీలుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. నా కుటుంబ సభ్యులైన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అవ్వాతాతలకు.. మీ ఇంటిలోని వారికి వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి,జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ (డ్వాక్రా) పథకాలు అందాయని తెలిసి సంతోషించాను. ప్రతి ఇంట్లో ప్రతి అవసరాన్ని మన అజెండాగా మార్చుకుని పాలన చేస్తున్నాం. మీ అవసరాలు తెలుసుకుని ఎన్నికల్లో వాగ్ధానం చేసినవే కాకుండా ఎన్నికల్లో వాగ్ధానం చేయని కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఇది మన ప్రభుత్వం. ఇది మనందరి ప్రభుత్వం. మనందరి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తు మీదే ఓటు వేసి మన అభ్యర్థి దాసరి సుధ గారికి తిరుగులేని మెజార్టీతో అఖండ విజయం అందించాలని సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను. 2019లో జరిగిన ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యగారు బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీమతి దాసరి సుధ గారిని, డాక్టరమ్మను మన అభ్యర్థిగా నిలబెట్టాం. గతంలో శ్రీ వెంకటసుబ్బయ్య గారికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో శ్రీమతి దాసరి సుధ గారిని గెలిపించాలని.. పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరుకుంటున్నాను. ముందుగా రైతన్నల కోసం ఏం చేశాం అన్నది మీ ముందుంచుతున్నాను ►రాష్ట్రంలో 18.70 లక్షల రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు ఇప్పటివరకు రూ. 18,000 కోట్ల మేరకు ఖర్చు చేశాం. ►ప్రతి రైతుకూ పెట్టుబడి భరోసా ఇస్తూ యేటా రూ. 13,500 వైఎస్సార్ రైతు భరోసాగా అందిస్తున్నాం. ►విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతుకు తోడుండే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) మన గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం. ►ఈ 28 నెలల కాలంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా అక్షరాలా 31.07 లక్షల రైతులకు రూ. 3,788 కోట్లు అందించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల రైతులకు మరో రూ. 1261 కోట్లు ఖర్చు చేశాం. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రనూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ►గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిల్ని, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 9,000 కోట్ల విద్యుత్ బకాయిల్ని, గత ప్రభుత్వం వదిలేసిన రూ. 384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా మనమే చిరునవ్వుతోనే మోశాం. కేవలం ఈ 28 నెలల్లోనే ఏం మార్పులు వచ్చాయో..ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి గమనించండి ►మన పిల్లల్లో నుంచి ప్రతి 2000 మందికి 12 శాశ్వత ఉద్యోగాలతో, అక్షరాలా 13 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించి...500కు పైగా సేవలతో ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు ద్వారా పౌర సేవల్లో దేశంలోనే సరికొత్త విప్లవం తీసుకు వచ్చాం. ►1వ తేదీ సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపుతట్టి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.7 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ కేవలం మనకే సొంతం. మన పిల్లల చదువుల కోసం ఏం చేశామో చూడండి ఈరోజు బడిలో ఉన్న ప్రతి పాప, ప్రతి బాబు..ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ లేదా ప్రొఫెషనల్ విద్యను ఒక హక్కుగా చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. ►గవర్నమెంటు స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దే విధంగా మన బడి నాడు–నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీల రూపురేఖల్ని మారుస్తున్నాం. ►జగనన్న విద్యా కానుక ద్వారా గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలకు కుట్టుకూలీతోసహా మూడు జతల యూనిఫాంలు, స్కూలు బ్యాగు, బైలింగ్యువల్ టెక్స్బుక్స్, నోట్ బుక్స్, వర్క్బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు వీటితోపాటు డిక్షనరీ...ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నాం. ►వైఎస్సార్–జగనన్న కాలనీల ద్వారా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది. ►దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పదవుల్లో... నామినేషన్ కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చే విధంగా ఏకంగా చట్టం చేశాం. ►అక్కచెల్లెమ్మల భద్రతకు టాప్ ప్రియారిటీ ఇస్తూ దిశ బిల్లు, దిశ పోలీసుస్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది. బద్వేలు ఉప ఎన్నికల్లో మన పార్టీ నిలబెట్టిన దాసరి సుధమ్మకు తిరుగులేని మద్దతు పలకాలని అభ్యర్థిస్తున్నాను. ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో నా చెల్లెమ్మను గెలిపించాలని సవినయంగా కోరుతున్నాను. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ... ►వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా రూ. 905 కోట్లు రెండు విడతలుగా అందించాం. ►మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తామన్న మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేసిన పాలన మనది. దేవుని దీవెనలు. మీ అందరి ఆశీస్సులతో గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మంచి చేసిన ప్రభుత్వం మనది. మరింతగా మీ అందరికీ మంచి చేసేందుకు దేవుని దయ, మీ చల్లని దీవెనలు కోరుతున్నాను. – వైఎస్ జగన్ (చదవండి: గెస్ట్ ‘హౌస్’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ) -
ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు
-
బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్ఆర్ సీపీ
-
బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి
-
బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, బద్వేలు(వైఎస్సార్ కడప): బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలని ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు. చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు -
ప్రచారంలో దూసుకుపోతున్న దాసరి సుధ
-
జోరుగా బద్వేల్ ఉపఎన్నిక ప్రచారం
-
అమిత్షాను కలిసి తిరుపతిలో రాళ్లు వేసిన సంగతి గుర్తు చేస్తారా?
సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'బద్వేల్ నీటి సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ట్యాంకర్లతో నీళ్లు తోలారు. మా ప్రభుత్వం వచ్చాక బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సమృద్ధిగా నీరు అందిస్తున్నాం. బద్వేల్ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో ఉంది. చదవండి: (చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల) బీజేపీకి ఓటు వేస్తే చెల్లని ఓటుగా మిగులుతుంది. వైఎస్సార్సీపీని విమర్శించడమే అజెండాగా బద్వేల్ ఎన్నికలను బీజేపీ వాడుకుంటోంది. కేంద్ర నిధులు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఉపఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఆరోపణలు చేసేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది. మీలాగా రోజుకో పార్టీతో కాదు. టీడీపీ వాళ్లపై ఆధారపడి ఎన్నికల్లో ఉనికిని కాపాడుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. చదవండి: (తినడానికి వీలుగా మా అల్లుడు తెర కట్టుకుని దీక్ష చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి) మరోవైపు చంద్రబాబు హైడ్రామా కొనసాగుతోంది. వ్యూహాత్మకంగా రాజకీయ కుట్రతో ముఖ్యమంత్రి ని తిట్టించడం.. గందరగోళం సృష్టించడం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ఉండటాన్ని వారు భరించలేకపోతున్నారు. ఢిల్లీకి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలడానికి వెళ్తున్నారా. అమిత్ షా ను కలిసి చంద్రబాబు ఏం చెప్తారు. తిరుపతిలో రాళ్లు వేసిన సంగతిని అమిత్ షాకు గుర్తు చేస్తారా..?. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి. ఎన్నికల కోడ్ వల్ల బద్వేల్ అభివృద్ధి తాత్కాలికంగా ఆగిపోయింది. బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది' అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. -
బద్వేలులో ఊపందుకున్న ప్రచారం
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రంలో మంగళవారం వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, వరప్రసాద్, సంజీవయ్య, ముస్తఫా, ద్వారకనాథరెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మాణిక్యవర›ప్రసాద్, కడప మేయర్ సురేష్బాబు, గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు చల్లా మధుసూదన్రెడ్డి, నవీన్ నిశ్చల్, పులి సునీల్కుమార్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బి.కోడూరు మండలంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కలసపాడులో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, అనంతపురం నేత మహాలక్ష్మి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు, అడా చైర్మన్ గురుమోహన్ ప్రచారం చేశారు. కాశినాయన మండలంలో మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కమలాపురం, రాజంపేట ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ భారీ మెజార్టీ కోసం కృషిచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రచారం అట్లూరు మండలంలోని కొండూరు, అట్లూరు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. కలసపాడు, పోరుమామిళ్ల, అట్లూరు మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.కమలమ్మ, ఎన్ఎస్యూఐ నాయకులు ప్రచారం చేశారు. -
Badvel Bypoll: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపఎన్నికల అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, ఎన్నికల ఇన్చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మండల నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందాయి
సాక్షి, అమరావతి: బద్వేల్ నియోజవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ అఖండ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బద్వేల్లో మంగళ, బుధవారాల్లో ప్రచారం నిర్వహించేందుకు ఆయన సోమవారం తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సీఎం సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైఎస్సార్ కుటుంబంతో బద్వేల్ ఓటర్లకు విడదీయరాని అనుబంధం ఉందని, ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబానికి అండగా ఉంటున్నారని సజ్జల చెప్పారు. -
బద్వేలులో టీడీపీ.. బీజేపీకి ఓట్లు వేస్తామంటోంది
కలసపాడు: బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ వారు బీజేపీకి ఓట్లు వేస్తామని ముం దుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణరెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ వారు తమకు సహకరిస్తారని ఇంతకుముందే చెప్పిన ఆయన వారు తమకు ఓట్లు వేస్తారని మరోసారి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్ కలిసి ఆదినారాయణరెడ్డి కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం రెడ్డిపల్లెలో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిం చింది. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల ఎంపీటీసీ సభ్యులతో తన అన్న నారాయణరెడ్డికి ఓట్లు వేయించుకున్నామని, గెలిచిన తర్వా త వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అని ప్రకటించుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014లో ఎందుకు సీఎం కాలేదని, వైజాగ్లో విజయమ్మ ఎంపీగా ఎందుకు గెలవలేదని అడిగారు. ఎంపీ అవి నాష్రెడ్డి రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వివేకా హత్యకేసును మాఫీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని, అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలు ఆపకపోతే శంకరగిరి మాన్యాలేనని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో దాదాపు 80 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులేనని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయకుంటే పింఛన్లు తీసేస్తామని వలంటీర్ల ద్వారా ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. కేం ద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి జాబ్కార్డులు, కేంద్రం నిర్మించిన రోడ్లలో తిరగొద్దు అని మేం అన్నామా.. ఇలా ఓటర్లను బెదిరించి ఓట్లు వేయిం చుకోవడం మంచి పద్ధతికాదు అని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయరాములు, బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ నేతతో బీజేపీ మంతనాలు
కాశినాయన/బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బద్వేలు బీజేపీ అభ్యర్థి పి.సురేష్ ఆదివారం మంతనాలు జరిపారు. వెంకటరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే బీజేపీలో చేరేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ ప్రచార రథాల ప్రారంభం బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ ప్రచార రథాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా గ్రామీణ రహదారులను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశారన్నారు. రాయలసీమ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లు, నాలుగు లేన్ల రహదారులు నిర్మించిందన్నారు. నికర జలాలు ఇచ్చేందుకు కూడా బాధ్యత తీసుకుంటామన్నారు. -
'కాంగ్రెస్ చేసిన పాపం దేశంలోనే కనుమరుగయ్యేలా చేసింది'
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాసరి సుధతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన పాపం వారిని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కనుమరుగయ్యేలా చేశాయి. బీజేపీ గురించి ఇక ఎవరికి తెలియదు. ఆ పార్టీకి ఎవరూ ఓటు కూడా వెయ్యరు. ప్రభుత్వం చేపట్టిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశాము. బద్వేలు నియోజకవర్గ పరిధిలో సాగు, తాగు నీరు కోసం చేస్తున్న కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేయలేదు. కేవలం అర్హతే కొలబద్దగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం ఫలాలను అందిస్తున్నాం. కరోనా పరిస్థితులు ఎదుర్కొంటూ సంక్షేమం కుంటుపడకుండా పాలన అందిస్తున్న సీఎం జగన్' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. ఉపఎన్నికలో ఎవ్వరూ ఊహించని భారీ ఆధిక్యత సాధించాలి. ప్రతి ఓటరు దగ్గరికీ వెళ్లి ప్రభుత్వ పాలన గురించి వివరించి ఓట్లు అడగండి' అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. -
‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’
సాక్షి, వైఎస్సార్ కడప: గత ప్రభుత్వం బద్వేల్ అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము బ్రహ్మంసాగర్ ద్వారా 7 మండలాలకు నీరు అందించామని తెలిపారు. బద్వేల్కు తాగు, సాగు నీటిని అందిస్తున్నామని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. -
వికృత రాజకీయాల కోసం కోర్టులను వేదికలుగా చేసుకుంటారా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కింద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ మహాయజ్ఞంలా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని.. అడ్డుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆపార్టీ నేతలు న్యాయస్థానాల్లో తప్పుడు పిటిషన్లు వేయించి కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తమ వికృత రాజకీయాలకు టీడీపీ నేతలు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకోవడం బాధాకరమన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్తో తలపడలేక.. న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని టీడీపీ వికృత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటమేరకు నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) నిబంధనల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో, మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీని ప్రజలు ఇప్పటికే చెత్తబుట్టలో వేశారని, దుర్భిద్ధితో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆపార్టీకి జనం పుట్టగతులు లేకుంండా చేస్తారని చెప్పారు. తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తామని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. భవిష్యత్ అవసరాలకు ఉపయోడపడేలా.. గతంలో మాదిరిగా ఇంటి స్థలం డీ–పట్టాగా కాకుండా, యాజమాన్య హక్కులు ఇచ్చి, తర్వాత అమ్ముకోవడానికి, మార్టిగేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం వీలు కల్పించింది. తమ ఆస్తిగా వాడుకోవడానికి వీలుకల్పిస్తూ, అందులోనూ మహిళల పేరుమీదే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గతంలో పిచ్చుకగూళ్ల తరహాలో ఊరికి దూరంగా, కనీస సదుపాయాలు కల్పించకుండా నిర్మించడంతో నివాసయోగ్యంగా ఉండేవి కావు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయని అప్పట్లో మీడియాలో వార్తలు చూశాం. ఇప్పుడు ఈ ఇళ్లను కాలనీలుగా కాకుండా.. 17 వేల ఊళ్లుగా నిర్మిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థతోపాటు అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం వంటి అన్ని సదుపాయాలు ఉండేలా ఆధునిక గ్రామాలుగా నిర్మిస్తున్నాం. ఈ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32 వేలకోట్లు కేటాయించి, ఇప్పటికే దాదాపు రూ.10 వేలకోట్లు ఖర్చుచేశాం. అనేక రాష్ట్రాలకన్నా ఎక్కువ విస్తీర్ణంలో.. చంద్రబాబు హయాంలో కేవలం 224 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే.. సీఎం వైఎస్ జగన్ 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అనేక రాష్ట్రాల్లో కన్నా ఎక్కువగా 31.725 చదరపు మీటర్లలో ఇళ్లు నిర్మిస్తున్నాం. ఎన్బీసీ నిబంధనలు పాటిస్తూనే జాతీయ ప్రమాణాలకు మించిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. అయినా పర్యావరణ కారణాలు చూపి టీడీపీ కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు మనుషులు ఉండటానికి పనికిరావు. ఆ ఇళ్లల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయా.. లేక ఇప్పటి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగతంగా నిర్మిస్తున్న ఇళ్లల్లో ప్రమాదాలు జరుగుతాయా? కేంద్ర ఆరోగ్య, పర్యావరణ, గృహనిర్మాణశాఖలు సమష్టిగా ఆమోదించిన తర్వాతే ఈ ఇళ్లు నిర్మిస్తున్నాం. అవాస్తవాలు చూపుతూ ప్రభుత్వాన్ని పలుచన చేయడం కోసం ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి టీడీపీ చేసిన ఈ కుట్రలను ప్రజలంతా గమనించాలి. మేధావులు, విజ్ఞులు కూడా ఖండించాలని కోరుతున్నాం. మత రాజకీయాలు చేయడం సరికాదు బద్వేల్ ఉప ఎన్నికలో ప్రజల తీర్పుపై మాకు సందేహం లేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో చేపట్టిన మంచిపనులు ప్రజల్లోకి వెళ్లాయి. దానివల్ల మంచి ఫలితమే వస్తుంది. టీడీపీ కూడా పోటీలో ఉంటే బాగుండేది. పోటీలో ఉన్న బీజేపీకి జనసేన మద్దతు ఇస్తోంది. రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగిపోతోందని బీజేపీ నేత సునీల్ధియోధర్ మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వానికి అన్ని మతాలు, కులాలు సమానమే. చేతనైతే సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఎత్తిచూపితే బాగుంటుందిగానీ మత రాజకీయాలు చేయడం, అప్పుల గురించి మాట్లాడటం సరికాదు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల మీద మాట్లాడరెందుకు? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలో ఆ పార్టీ వాళ్లను చెప్పమనండి. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. ధర పెరిగిపోయింది. అధికధరకు బొగ్గు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. పీక్ అవర్స్లో గృహ వినియోగదారులు విద్యుత్ వాడకాన్ని నియంత్రించుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. బొగ్గు కొరత లేదని కేంద్రమంత్రి చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి కొంత ఆలస్యమవుతోంది. ఆ పరిస్థితిని ఉద్యోగసంఘాలు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తొలిదశలో 15.60 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది సీఎం వైఎస్ జగనే. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. సొంతింటి కలలు సాకారమవుతాయనుకున్న సమయంలో.. ఆ ఆశలు ఆవిరయ్యేలా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పేదలు ఆందోళన చెందుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు వేసినవారు.. ఆ పిటిషన్లతో తమకు సంబంధం లేదని, తాము అసలు పిటిషన్లు వేయలేదని ముందుకు రావడం చూస్తుంటే.. కొన్ని రాజకీయ శక్తులు దుష్ట పన్నాగాలతో తెరవెనుక ఉండి వికృతక్రీడకు తెరతీసినట్లు భావించాల్సి వస్తోంది. టీడీపీ, ఆపార్టీ అధ్యక్షడు చంద్రబాబే ఈ కుట్ర వెనుక ఉన్నారని నమ్ముతున్నాం. -
బద్వేలులో 18 నామినేషన్ల ఆమోదం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దాఖలైన నామినేషన్లను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్ సోమవారం పరిశీలించారు. వివిధ పార్టీలకు చెందిన వారితోపాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 27 మంది 35 నామినేషన్లు దాఖలు చేశారు. అసంపూర్తి వివరాలు, అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో వీటిలో 9 మంది నామినేషన్లను తిరస్కరించారు. వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో సహా మొత్తం 18 నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఉపసంహరణకు బుధవారం సాయంత్రం వరకు గడువుంది. -
బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేల్ ఉప ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 9 నామినేషన్లను అధికారులు తిరస్కరించగా.. బద్వేల్ బరిలో 18 మంది నిలిచారు. కాగా నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 13 వరకు గడువుంది. చదవండి: Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..! మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 61 నామినేషన్లు దాఖలవ్వగా.. 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు దీంతో 42 మంది అభ్యర్థుల నామినేషన్లు ఒకే అయ్యాయి. ఈటల పేరుతో ఉన్న ముగ్గురు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువుంది. చదవండి: బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు: పెద్దిరెడ్డి -
బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్: కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి.. బీజేపీకి అడ్రెస్ లేదు.. ఇలాంటి పార్టీలు ఏ అర్హతతో ఓట్లు అడుగుతాయి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అనే బేధం చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించాము. తాగునీటి సమస్య శాశ్విత పరిష్కరం కోసం బ్రహ్మం సాగర్ ద్వారా పనులు చేస్తున్నాం నియోజకవర్గ పరిధిలో ఐదు వేల ఇళ్లు ఇచ్చాం. నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పెద్దిరెడ్డి తెలిపారు. (చదవండి: టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే) ‘‘సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మా ముఖ్యమంత్రి సమపాళ్లతో అభివృద్ధి చేస్తున్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. 75 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని అంటున్నారు.. 75 కాదు లక్ష కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఇచ్చాం. అప్పులు ఎక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు, కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచాము. నోబెల్ గ్రహీత అమర్థ్య సేన్ చెప్పినట్లు హెలికాప్టర్ మనీ ద్వారా కరోనా సంక్షోభంలో అందరిని ఆదుకున్నాం. కేంద్రం కంటే జీఎస్డీపీలో ముందున్నాం.. జీడీపీలో రాష్ట్రమే ముందుంది. (చదవండి: ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడడమా!) ‘‘ఎన్నికలు సాఫీగా జరుపుకోవాలని బీజేపీకి లేదు. దేవాలయాలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ దేవాదాయశాఖ మంత్రిగా ఉండి విజయవాడలో దేవాలయాలను విధ్వసం చేశారు. మాది సెక్యూలర్ పార్టీ.. మాకు కులాలు, మతాలు లేవు.. హిందు మతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. అన్ని మతాలకు సమంగా చూస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మతమార్పిడిలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఓట్లు లేవు కాబట్టి ఎదో ఒక రచ్చ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ ప్రయత్నం. దానిలో భాగంగానే బీజేపీ నేత సునీల్ థియోదర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు. చదవండి: సమగ్ర భూ సర్వే అమలుకు మంత్రుల కమిటీ -
బద్వేలు ఉపఎన్నిక: మొత్తం 35 నామినేషన్లు దాఖలు
సాక్షి, బద్వేలు అర్బన్: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్ధులు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్ తెలిపారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి డాక్టర్ సుధ,కాంగ్రెస్ నుంచి పి.ఎం.కమలమ్మ, జె.ప్రభాకర్ రావు, బీజేపీ నుంచి పనతలసురేష్, ఎం.శివకృష్ణ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్పార్టీ నుంచి ముత్యాలప్రసాద్రావు, హర్దమ్ మానవతవాది రాష్టీయదళ్పార్టీ నుంచి జి.విజయ కుమార్, సాంబశివరావు, నవరంగ్ కాంగ్రెస్పార్టీ నుంచి వెంకటేశ్వర్లు, జనసహాయకశక్తిపార్టీ నుంచి సగిలిసుదర్శనంలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా విజయకాంత్ గోపాలకాంత్, సి.బ్రహ్మయ్య, తిరుపాలుజయరాజు, ఆర్.ఇమ్మానియేల్, కోటపాటి నరసింహులు, కె.చిన్నమునెయ్య, రవి నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు కడప సిటీ : బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఇద్దరు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇందులో ఎన్నిక వ్యయ పరిశీలకులుగా షీల్ ఆసిస్ (ఐఆర్ఎస్), పోలీసు పరిశీలకులుగా పి.విజయన్ (ఐపీఎస్) వ్యవహరిస్తారని వివరించారు. చదవండి: (క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి) -
బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ పాల్గొన్నారు. ఉపఎన్నికల ప్రచారం, ప్రణాళికలపై బూతుస్థాయి నేతలతో సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది బద్వేలు ఎన్నికల్లో భారీ విజయం ఖాయమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది. నియోజకవర్గ పరిధిలోని అందరూ కలిసికట్టుగా కృషిచేసి భారీ మెజారిటీ అందించాలి. ఇప్పుడు వచ్చే మెజార్టీ రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్లను పెంచే స్థాయిలో ఉండాలి అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. -
జనసేన పోటీ నుంచి తప్పుకున్నా మేము బద్వేలులో పోటీచేస్తాం
సాక్షి, అమరావతి బ్యూరో: బద్వేలు ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలుపుతామని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవ, సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన గుంటూరులో పర్యటించారు. రక్తదాన శిబిరం, ప్రధాని మోదీ జీవిత విశేషాలు తెలిపే ఫొటో ఎగ్జిబిషన్, పోస్టుకార్డుల ద్వారా మోదీకి ధన్యవాదాలు తెలపటం, చర్మకారులకు ట్రంక్ పెట్టెలు అందజేసే కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మిత్రపక్షం జనసేన పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించినప్పటికి తాము పోటీ చేస్తామని, బద్వేలు పోరులో సహకరించమని జనసేన పార్టీని కోరతామన్నారు. ఉప పోరు తర్వాత తమ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది కదా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘ఓ పార్టీ తిరుపతిలో పోటీ చేస్తుంది.. జెడ్పీ ఎన్నికలు వచ్చేసరికి బహిష్కరిస్తున్నామని ప్రకటిస్తుంది. ఆ విధానమేంటో అర్థం కావట్లేదు’ అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. -
జగన్కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి
బద్వేలు అర్బన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు పవిత్రమైన కార్యక్రమమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్లు, ముఖ్యనేతల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ద్వారా అధికార, ప్రతిపక్షాలకు ప్రజల వద్దకు వెళ్లే అవకాశం వస్తుందన్నారు. అధికారంలో ఉన్న వారికైతే తాము ఏం చేశామో, ఇంకా ఏం చేయబోతున్నామో వివరించేందుకు, ప్రతిపక్షాలకైతే అధికారపక్షం లోటుపాట్లను ఎత్తిచూపి ఒకవేళ తాము అధికారంలో ఉంటే ఏం చేస్తామో చెప్పేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. పేదల జీవితాలు మెరుగుపడాలనే ఉన్నత ఆశయంతో ప్రతి పథకానికి ఒక సమగ్ర స్వరూపం రూపొందించి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలు ఇబ్బందులు పెడుతున్నా, మరోవైపు కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. తప్పుడు విషప్రచారాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉప ఎన్నికలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును వివరించాలని సూచించారు. పోటీలో ఎవరు ఉన్నా, లేకున్నా మన ప్రచారం, ఎన్నిక కార్యక్రమం సాగాలని చెప్పారు. సీఎం జగన్కు బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రతిఒక్కరు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పోలింగ్ శాతం పెరిగేందుకు ఓటర్లను చైతన్యపరచాలని కోరారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్బాషా, మంత్రి, ఉప ఎన్నిక బాధ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మేయర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పాల్గొన్నారు. -
బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్
సాక్షి, బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక నెల్లూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు వాహనాల్లో చేరుకుని అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయంలోని నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్గార్గ్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆమె వెంట ఉన్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అభ్యర్థి డాక్టర్ సుధ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు: సజ్జల -
బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు: సజ్జల
సాక్షి, వైఎస్సార్,కడప: బద్వేల్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్రమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ప్రతి ఎన్నిక విశ్వసనీయతను తెలిపే విధంగా ఉండాలని సూచించారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని స్పష్టం చేశారు. అందువల్లే తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చదవండి: 'గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు' నిబద్ధత, విశ్వసనీయతతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలే తమకు అధికారం అందించాయని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వ్యవస్థలో మార్పులు అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయని, ప్రజలకు నేరుగా సంక్షేమం అందిస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేవిధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని వర్గాలకు సమానంగా అన్ని విభాగాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వైద్యరంగంలో సమూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తీవ్ర ఆర్థికభారం, కోవిడ్ను కూడా అధిగమించి ప్రభుత్వం పనిచేసిన తీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. ‘ప్రతిపక్షాలు ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి జరిగిన ప్రయోజనం తెలియజెప్పే అవకాశం మనకు బద్వేలు ఉపఎన్నికల రూపంలో వచ్చింది. ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు చేసిన కార్యక్రమం గురించి వివరించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి. పోటీలో ఎవరు వున్నా మన ప్రచారం, ఎన్నికల కార్యక్రమం సాగాలి. ఓటు ఎందుకు వేయాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎందుకు అండగా ఉండాలి అన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి’ అని సూచించారు. -
టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే
సాక్షి, వైఎస్సార్జిల్లా: బద్వేల్ ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లతో పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ భేటీ అయ్యారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2019 ఎన్నిక తరహాలోనే ఉపఎన్నికల్లో కూడా డాక్టర్ సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు మద్దతుగా నిలవాలి. టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే. ప్రజాదరణ పొందుతున్న సీఎం జగన్మోహన్రెడ్డిపై బురదజల్లడమే. ఎన్నికలు కొత్త కాదు. పంచాయితీ, స్థానిక సంస్థల్లో విజయం సాధించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయి. ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఆదరణ లభిస్తోంది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దళితులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం' అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. 90 శాతానికి పైగా హామీలు అమలు చేసిన ఘనట సీఎం జగన్ది అని అన్నారు. చదవండి: (దేవదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం తెలియజేయాలి. గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కుందూ నది నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మం సాగర్కు నీటిని తరలించి కరవు పరిస్థితిలో కూడా బద్వేలు ప్రాంత రైతాంగానికి నీరు అందించబోతున్నాము. వ్యవసాయనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టబోతున్నాం. బద్వేలు చెరువుకు నీరు అందించేందుకు ఎల్ఎస్పీ కాలువ విస్తరణ చేపడుతున్నాం. బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేస్తున్నాం. సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న బద్వేలు రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం మంజూరు చేసింది. పెద్దఎత్తున బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్లో రూ.1,000 కోట్లతో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ రాబోతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేసి డాక్టర్ సుధాను భారీ మెజారిటీతో గెలిపించాలి' అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. -
‘బద్వేలు బరిలో బీజేపీ’
కడప కోటిరెడ్డి సర్కిల్: బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో పోటీచేయాలని జనసేనను అభ్యర్థించామని, ఆపార్టీ అధ్యక్షుడు పవన్ విముఖత చూపారని అందుకే బీజేపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు. అభ్యర్థి విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వానికి కొన్ని పేర్లు పంపించినట్లు్ల చెప్పారు. -
Badvel Bypoll: చరిత్రలో నిలిచేలా బద్వేలు మెజారిటీ
సాక్షి, బద్వేలు: బద్వేలు శాసనసభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ రానంత స్థాయిలో... చరిత్రలో నిలిచేలా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ మెజారిటీ సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అధ్యక్షతన నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అవినాష్రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, అభ్యర్థి డాక్టర్ సుధ పాల్గొన్నారు. ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నా రు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడంతోనే మెజారిటీ తగ్గిందని, ఈ దఫా అటువంటి తప్పిదం జరగకుండా పని చేయాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం వైఎస్ జగన్పై నిత్యం బురద జల్లుతూ, ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నా తిరుపతిలో 2.70 లక్షలకుపైగా మెజారిటీ వచ్చిందంటే ఇందుకు ప్రజలు ప్రభుత్వం వెంట ఉండటమే కారణమని చెప్పారు. ►సీఎం జగన్ బద్వేలు అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని చెప్పారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో నిరంతరం నీరు ఉండేలా తెలుగుగంగ కాలువను సున్నా నుంచి 18 కి.మీ. వరకు లైనింగ్ పనులు చేపట్టామని, దీంతో ఐదు వేల క్యూసెక్కులు ప్రవహించేలా అడ్డంకులు తొలగాయన్నారు. కుందూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తే సాగు,తాగు నీటికి ఇక్కట్లు తీరతాయని చెప్పారు. బద్వేలు పెద్ద చెరువు ఎప్పుడూ నీటితో నిండేలా ఎల్లెస్పీ ఎడమ కాలువ విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ►రెవెన్యూ డివిజన్ రాజంపేటలో ఉండటంతో నియోజకవర్గ ప్రజలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బద్వేలులోనే డివిజన్ ఏర్పాటు చేసే గెజిట్ ఇచ్చారని, మరో నెల రోజుల్లో అన్ని అంశాలు పూర్తి చేసి ఇక్కడే డివిజన్ సిబ్బంది పని చేసేలా కార్యాలయం ప్రారంభిస్తామని వివరించారు. ►గోపవరం మండల పరిధిలో రూ.వెయ్యి కోట్లతో సెంచూరీ ఫ్లై పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి గతంలో వచ్చిన 44వేల మెజారిటీ కంటే అధికంగా వచ్చేలా చూడాలని కోరారు. ►కార్యక్రమంలో మార్కెట్యార్డు కమిటీ వైఎస్ ఛైర్మన్ రమణారెడ్డి, బద్వేలు మున్సిపల్ ఛైర్మన్ వాకమళ్ల రాజగోపాల్రెడ్డి, అడా ఛైర్మన్ గురుమోహన్, నాయకులు నల్లేరు విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అంకన గురివిరెడ్డి, చిత్తా విజయప్రతాప్రెడ్డి, సీ బాష, బోడపాడు రామసుబ్బారెడ్డి, అందూరు రామక్రిష్ణారెడ్డి, గోపాలస్వామి, సాయిక్రిష్ణ, ప్రభాకర్రెడ్డి, శారదమ్మ, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన వివరాలు..) ఎన్ని ఇబ్బందులున్నా హామీల అమలు.. ఎన్ని ఇబ్బందులున్నా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీలను నెరవేరుస్తున్నారని, ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రభుత్వం ద్వారా వారికి జరిగిన మేలు, అందిన సంక్షేమ పథకాలను వివరించి వారితో పార్టీ అభ్యర్థి డాక్డర్ సుధకు ఓట్లు వేసేలా చూడాలన్నారు. అందరూ సహకారం అందించాలి.. బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధ మాట్లాడుతూ గతంలో తన భర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య పోటీ చేసిన సమయంలో నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేశారని, అలాంటి సహకారం తనకు అందించాలని విన్నవించారు. టీడీపీని ఛీ కొట్టినా... 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఛీ కొట్టినా ఎల్లోమీడియా అండతో తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కడప మేయర్ సురేష్బాబు పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 85 శాతం స్థానాలు సాధించినా... జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో 98 శాతం సాధించినా ... మున్సిపాలిటీ ఎన్నికల్లో 100 శాతం విజయాలు సాధించినా.. ప్రజలు ఎన్ని పర్యాయాలు వారికి బుద్ధి చెప్పినా వారి కుతంత్రాలు ఆగడం లేదన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి టీడీపీ కుట్రలకు అడ్డు వేసి ప్రజా కోర్టులో శిక్షిద్దామన్నారు. గోపవరంలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పథకాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి గోపవరం : బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మండల ఇన్చార్జి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దగోపవరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. చదవండి: (‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ –జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభం) ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటింగ్ శాతం పెరిగేలా చూసుకోవాలన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. శనివారం నుండి గ్రామ పంచాయతీల వారీగా ప్రచారం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గోపవరం మల్లికార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ సరస్వతి, సర్పంచ్లు వెంకటలక్షుమ్మ, నాగేంద్ర, మల్లెం కొండేశ్వరస్వామి చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు వెంకటసుబ్బయ్య, శివారెడ్డి, హరికృష్ణారెడ్డి, సుందర్రామిరెడ్డి, కామిరెడ్డి సుధాకర్రెడ్డి, రవికుమార్రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ తిరుపాల్, మాజీ సర్పంచ్ వెంకటసుబ్బయ్య, హనుమంతు రమణ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడర్ 01 October 2021
-
సినిమాల్లో లాగ కాదు ఇక్కడ...!: సజ్జల
-
పవన్ చీప్ పబ్లిసిటీ మానుకోవాలి: సజ్జల
అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు.. అసలు ఎన్నకల్లో పోటీ చేయడానికి పవన్కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు చెయ్యడం మానుకోవాలి. కెమెరా అన్ చేసి యాక్షన్ అనగానే చెయ్యడానికి ఇది సినిమా కాదు. గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదు’’ అన్నారు సజ్జల. (చదవండి: పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు) ‘‘రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,200 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నాం. చీప్ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం పవన్ కల్యాణ్ మానుకోవాలి. పవన్ స్థాయికి మేము దిగజారాల్సిన అవసరం లేదు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసిన నష్టం ఏమి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత’’ అని సజ్జల ప్రశ్నించారు. చదవండి: ఆత్మవిమర్శకు బదులు.. అపనిందలేస్తారా?: సజ్జల -
బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
-
బద్వేలు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా సబ్కలెక్టర్ కేతన్ గార్గ్ను ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వాప్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోవిడ్ నిబంధనల అమలు నేపథ్యంలో బహిరంగ సభకు 1,000 మందికి మించి అనుమతించబోమని ఎన్నికల అధికారులు తెలిపారు. బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది. చదవండి: (Badvel Bypoll: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...) -
బద్వేలు ఉపఎన్నిక: అధికార పార్టీ టీమ్ సిద్ధం
సాక్షి, కడప: బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల పోరుకు అధికార పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు కార్యాచరణను వేగవంతం చేసింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా, అక్టోబరు 1న శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబరు 30న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికను ఎదుర్కొనే విషయంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు. బద్వేలు ఉప ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈయనతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిలు కూడా ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. బద్వేలు మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతలను సమన్వయం చేసుకుని ఎన్నికల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోని మండలాలకు ఇన్చార్జిలుగా నియమించనున్నారు. బద్వేలు మున్సిపాలిటీతోపాటు మేజర్ పంచాయతీ అయిన పోరుమామిళ్లకు ఇద్దరేసి చొప్పున ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించనున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను మండలాలకు ఇన్చార్జిలుగా నియమించనున్నారు. శుక్రవారం నాటికి ఇన్చార్జిల జాబితా ఖరారు కానుంది. వీరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా మండల ఇన్చార్జిలు ఆయా మండలాల పరిధిలోని మండల, గ్రామస్థాయి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చదవండి: (బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...) తేలని బీజేపీ వ్యవహారం బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంలో బీజేపీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. గురువారం బద్వేలులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, జిల్లా ఇన్చార్జి అంకాల్రెడ్డి, కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యదర్శి సురేష్తోపాటు స్థానిక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈనెల 3వ తేదీన కడపలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలిపే పక్షంలో జనసేనకే మద్దతు పలకాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదవండి: (సంక్షేమాభివృద్ధే గెలుపునకు సోపానం) -
బద్వేలు ఉప ఎన్నికకు సహకరించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు. గురువారం ఆయన సచివాలయంలోని తన చాంబరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 28న షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. తద్వారా ఆ రోజు నుండి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుది గడువు అని, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు తుది గడువు అని చెప్పారు. అక్టోబర్ 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మొత్తంగా నవంబర్ 5వ తేదీ లోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి వర్ల రామయ్య, బీజేపీ నుంచి వెన్న హేమంత్ కుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ఇప్పటికి 2,16,154 మంది ఓటర్లు ► ఈ ఏడాది జనవరి 15న నాటికి ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. తర్వాత సెప్టెంబర్ 29 నాటికి నమోదు చేసుకున్న ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుని మొత్తం 2 లక్షల 16 వేల 154 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఈ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ► అయితే అక్టోబర్ 8వ తేదీలోగా ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్న వారు కూడా ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తాం. నియోజకవర్గం పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా మరో తొమ్మిది ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశాం. ► ఈ ఉప ఎన్నికలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఈ ఉప ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ► సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ యాంటిసిడెంట్స్ (నేర చరిత్ర)ను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ముందుగానే ప్రచురించాల్సి ఉంది. కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరి ► కోవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలి. ఈ మేరకు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ర్యాలీలు, ఉత్సవాలు నిషేధం. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు.. స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, డోర్ టు డోర్ ప్రచారానికి ఐదుగురు, మొత్తంగా 20 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ► రోడ్ షోలు నిర్వహించకూడదు. పోలింగ్కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలి. 2 డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలి. ఉప ఎన్నికల నిర్వహణలో వలంటీర్ల ప్రమేయం ఉండదు. -
సంక్షేమాభివృద్ధే గెలుపునకు సోపానం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపును సునాయాసం చేస్తాయని వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె సీఎం జగన్తో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తన భర్త, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య చనిపోయినప్పుడు పరామర్శ కోసం వచ్చిన సీఎం వైఎస్ జగన్.. తన కుటుంబ సభ్యులను ఓదార్చటమే కాకుండా, కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని చెప్పారన్నారు. ఆ సందర్భంలోనే.. డాక్టర్గా చాలా కాలంగా ప్రజా సేవ చేస్తున్నారు కాబట్టి, ఇష్టమైతే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేయొచ్చని సూచించారన్నారు. అలా ప్రజల్లో ఉంటే భర్తలేరన్న బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారని చెప్పారు. సీఎం జగన్ ఓదార్పు తమ కుటుంబ సభ్యులను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఆయన సారథ్యంలో బద్వేలు సమాగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నేతలు, కార్యకర్తలందరి సంపూర్ణ సహకారం తనకు ఉందని తెలిపారు. వైఎస్ జగన్ పాలన కారణంగా బద్వేలు ప్రజలు ఈ ఉప ఎన్నికలో తనకు మంచి మెజార్టీ కట్టబెడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ జగన్ కుటుంబం వెంటే నడుస్తానని చెప్పారు. కాగా, అంతకు ముందు ఆమె.. తనను బద్వేలు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తథ్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో బద్వేలులో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని మాజీ ఎమ్మెల్సీ దేవసాని చిన్న గోవిందరెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో డాక్టర్ దాసరి సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. ఎన్నికల వ్యూహంపై సీఎం తమకు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. సుధ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. గత 4 ఎన్నికల్లో వైఎస్సార్ కుటుంబానికి బద్వేలు నియోజకవర్గం మద్దతుగా నిలిచిందని చెప్పారు. సీఎం జగన్పై, వైఎస్సార్సీపీ మీద ప్రజలకు కొండంత విశ్వాసం ఉందని, అందుకే భారీ మెజార్టీతో గెలుపు తథ్యం అన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, పార్టీ నేతలు కరెంట్ రమణారెడ్డి, రొండా మాధవరెడ్డి పాల్గొన్నారు. -
Badvel By Election: ఓటింగ్ శాతం పెరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెరగాలని, ఓటు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. 2019లో 77 శాతం ఓటింగ్ జరిగిందని, ఇప్పుడు అంత కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం పెరగాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టర్ అని, మన పార్టీ తరఫున ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామని ప్రకటించారు. బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడున్న (సమావేశంలో పాల్గొన్న) వారందరిమీదా ఉన్నాయని స్పష్టం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. 2019లో వెంకసుబ్బయ్యకు వచ్చిన 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ కన్నా.. డాక్టర్ సుధకు ఇప్పుడు ఎక్కువ మెజార్టీ రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం ఏమన్నారంటే.. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి ► ఉప ఎన్నికలో ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి. ప్రతి మండలాన్ని బాధ్యులకు అప్పగించాలి. గ్రామ స్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించాలి. ► ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాలి. వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్య పరచాలి. నెల రోజుల పాటు మీ సమయాన్ని కేటాయించి, ఈ ఎన్నికపై దృష్టి పెట్టాలి. ► బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలి. ► ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్ బాషా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈ ఏడాది మార్చిలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం (నేడు) నోటిఫికేషన్ జారీ కాగానే, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి
-
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాం
-
వారందరికీ నా కృతజ్ఞతలు: దాసరి సుధ
-
‘బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాం’
సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయని తెలిపారు. 98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేశామని, ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ విజయలు దక్కాయని గుర్తుచేశారు. కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను తెరపైకి తెచ్చి లబ్ధిపొందే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. -
బద్వేలు ఎన్నిక మాకు నల్లేరు మీద నడక: డీసీ గోవిందరెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా బద్వేల్ నియోజకవర్గం నిలిచిందని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందని తెలిపారు. ఈ ఎన్నిక మాకు నల్లేరు మీద నడక అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చదవండి: నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు ‘దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. భారీ మెజారిటీతో డాక్టర్ సుధ గెలుస్తారు. దాని కోసం మేమంతా కృషి చేస్తాం. ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీ ఆలోచన ఏవిధంగా ఉందో తెలియదు’ అని గోవిందరెడ్డి వెల్లడించారు. ‘ఆ రోజే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లోకి రావాలని నన్ను కోరారు. ఆయన నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది’ అని అభ్యర్థి దాసరి సుధ తెలిపారు. చదవండి: ‘పవన్ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే -
బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక సమావేశం
సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని పేర్కొన్నారు. 2019లో 77శాతం ఓటింగ్ జరిగిందని, ఓటింగ్ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని అభ్యర్థించాలని సీఎం జగన్ అన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యపరచాలన్నారు. నెలరోజులపాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే... కాగా బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. -
బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...
బద్వేలు బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానాలు ఎంపిక చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ దాసరి సుధ (వైఎస్సార్సీపీ) పేరు : డాక్టర్ దాసరి సుధ పుట్టిన తేదీ : 09–02–1972 భర్త : దివంగత ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య తల్లిదండ్రులు : డాక్టర్ డి.ఓబులయ్య, డి.విక్టోరియా విద్యార్హత : ఎంబీబీఎస్ డి.జి.ఓ. (కర్నూలు) పుట్టినిళ్లు: పెద్దుళ్లపల్లె, బి.కోడూరు మండలం మెట్టినిళ్లు : వల్లెరవారిపల్లె, గోపవరం మండలం సంతానంః కుమార్తె హేమంత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, కుమారుడు తనయ్ ఇంటర్మీడియట్ రాజకీయ ప్రవేశం: 2014 నుంచి తన భర్త అయిన దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు ఆమె కూడా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఓబులాపురం రాజశేఖర్ (టీడీపీ) బద్వేలు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టీడీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటించారు. కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్ ఎంబీబీఎస్తోపాటు ఆర్థోపెడిక్లో ఎంఎస్ చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి గత సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి, దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధపై రాజశేఖర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. సాక్షి, కడప: బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీచేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్పై 44,834 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డాక్టర్ వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 50,748 ఓట్లు వచ్చాయి. సౌమ్యుడు, మంచి డాక్టర్గా సేవలందించి డాక్టర్ వెంకటసుబ్బయ్య నియోజకవర్గ ప్రజల మన్ననలందుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ‘డాక్టర్’ సుధ విస్తృత ప్రచారం బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో దివంగత డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సుధ తో కలిసి ఆగస్టు నెల 14 వ తేదీన కలసపాడు లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక విడత ఎన్నికల ప్రచారం ముగించారు. సందిగ్ధంలో టీడీపీ బద్వేలు ఉప ఉన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు టీడీపీ ఇక్కడ స్థబ్దుగానే ఉంది. ఈ నెలలో విజయవాడలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం బద్వేలు ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అభ్యర్థి పేరును వెల్లడించారు. ప్రచారం విషయంలో టీడీపీ పూర్తిగా వెనుకబడి ఉంది. బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రక్రియ వేగవంతం బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. మంగళవారం బద్వేలు నియోజకవర్గ పరిధిలోని అధికారులతో సమీక్షించారు. పటిష్టంగా ఎన్నికల కోడ్ అమలు: జేసీ గౌతమి కడప సిటీ: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి(రెవెన్యూ) తెలిపారు. జిల్లాలో ఎన్నికల మోడల్ కోడ్ పటిష్టంగా అమలు చేయాలని మండల అధికారులను, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు ఆదేశాల మేరకు జేసీలు సాయికాంత్వర్మ, హెచ్ఎం ధ్యానచంద్ర లతో కలిసి మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, జిల్లా నోడల్ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల అనంతరం నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర ప్రక్రియలు ముగిశాక నవంబర్ 5 వ తేదీ నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. 2021 జనవరి 1 తేదీ నాటికి ప్రచురించిన ఎలెక్ట్రోరల్ ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందు వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ప్రజా ప్రతినిధుల ఫొటోలను తీసి భద్ర పరచాలని, బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలకు ముసుగు వేయాలని, ప్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. అధికారులు ఎవరూ ప్రజా ప్రతినిధులను కలవరాదని సూచించారు. మోడల్ కోడ్ ఉన్నందున కొత్త పథకాల అమలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగించవచ్చని, కొత్త పథకాలు అమలు చేయరాదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ మాలోల, సబ్ కలెక్టర్ కేతన్గార్గ్, ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు,శిక్షణ కలెక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న జేసీ గౌతమి నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కడప కోటిరెడ్డిసర్కిల్: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చెక్పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లేవారు వాటికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. సరైన ఆధారాలు చూపకపోతే కేసు నమోదుతోపాటు వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయ పన్నుశాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామన్నారు. అలాగే అధిక మొత్తంలో మద్యం కలిగి ఉన్నా చర్యలు తప్పవన్నారు. ఉప ఎన్నికల్లో ఏమాత్రం చిన్న ఘటనకు కూడా తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు. -
ఉపఎన్నికల ప్రచారంలో ర్యాలీలు రోడ్ షో లపై నిషేధం
-
హుజూరాబాద్ ఫైట్
-
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
-
బద్వేలులో విజయం మాదే
సాక్షి, అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికలో ఆనవాయితీని గౌరవించి ప్రతిపక్షాలు పోటీపెట్టకపోతే ఆహ్వానిస్తామని.. ఒకవేళ పెట్టినా తమకెలాంటి అభ్యంతరంలేదని.. అదే జరిగితే విజయం వైఎస్సార్సీపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారన్నారు. పోటీ అనివార్యమైతే ఉప ఎన్నికను వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుని పనిచేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద, సీఎం వైఎస్ జగన్ మీద ప్రజల్లో అభిమానం తగ్గడానికి ఎలాంటి అవకాశం లేకపోగా.. మరింతగా పెరిగిందనడానికి 2019 నుంచి ఇప్పటివరకూ జరిగిన వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం తమకూ అవసరమని సజ్జల చెప్పారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు భయోత్పాతం సృష్టించి.. డబ్బుల్ని వెదజల్లారని.. ఇప్పుడూ అలాగే చేస్తే వారి ఆగడాలను అడ్డుకుంటామని తెలిపారు. రెండేళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. 95 శాతం హామీల అమలును ప్రజలకు వివరిస్తామన్నారు. ఆన్లైన్ టికెటింగ్ను అందరూ హర్షిస్తున్నారు ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్లైన్ టికెటింగ్ విధానంపై సినీ పరిశ్రమలోని అందరూ హర్షిస్తున్నారని సజ్జల చెప్పారు. ఈ విధానాన్ని అమలుచేయడానికి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. బాహుబలి సినిమాకు మొదటి వారంలో 50శాతమే టికెట్లు బుక్ అయినట్లు చెబుతున్నారని.. నిజంగా అదే జరిగితే ఇంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. తొలివారంలోనే ఆ సినిమాకు థియేటర్లు నిండలేదంటూ మోసం చేశారని.. లెక్కలు కూడా చూపలేదన్నారు. దీనివల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారని.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందన్నారు. ఈ అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తెస్తున్నామన్నారు. సినిమాకు ఏ రోజు వచ్చిన కలెక్షన్లో వాటాలు ఆ రోజే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్ యజమానుల ఖాతాల్లో ఆటోమేటిక్గా జమ అవుతాయని.. ప్రభుత్వం ఈ విషయంలో కేవలం ఫెసిలిటేటర్ పాత్ర మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టంచేశారు. అపోహలు సృష్టిస్తోంది దోపిడీదారులే ఒకప్పుడు ఎన్టీఆర్ నుంచి కాంతారావు, రాజబాబు వరకూ ఏ సినిమాకైనా టికెట్ ధర ఒకేలా ఉండేదని.. ఇటీవల కాలంలో సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.వంద టికెట్ను రూ.వెయ్యికి అమ్ముకుని.. అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తున్నారని.. అలాంటి వారే ఆన్లైన్ టికెటింగ్ విధానంపై అపోహలు సృష్టిస్తున్నారని వివరించారు. తక్కువ ఖర్చులో ప్రజలకు వినోదాన్ని అందించాలన్నదే తమ విధానమన్నారు. ఎవరైతే పారదర్శకంగా ఉండాలనుకుంటారో వారంతా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తారని.. దోపిడీదారులే వ్యతిరేకిస్తారని చెప్పారు. చంద్రబాబులా నలుగురు సినీ పెద్దలను పిలిపించి.. ఫొటోలకు ఫోజులిచ్చి జాతీయ మీడియాలో హైలెట్ అయ్యేలా సీఎం జగన్ షో చేయరని మరో ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు. ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ఎటువంటి అనుమానాలున్నా సినీ పెద్దలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవొచ్చునని చెప్పారు. స్వార్థం కోసమే పవన్ విమర్శలు ‘సినిమాలు, రాజకీయాల్లో రెండు గుర్రాలపై స్వారీచేస్తున్న పవన్ కల్యాణ్ తన స్వార్థం కోసమే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. కానీ, ఆ బురద ఆయనపైనే పడింది. పవన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ పెద్దలే వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. ఆయన పెద్ద గుదిబండగా మారారని వారు భావిస్తున్నారు’.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సజ్జల బదులిచ్చారు. -
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 1న జారీకానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీ. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరుగుతుంది. షెడ్యూల్ వెల్లడి కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందినందున ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితాతో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను విధించింది. హుజూరాబాద్లో కూడా.. మరోవైపు.. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా అదేరోజు ఉపఎన్నిక జరగనుంది. బద్దేలు, హుజూరాబాద్తో కలిపి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మధ్యప్రదేశ్లోని ఖంద్వా, హిమాచల్ప్రదేశ్లోని మండి, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ ఆంక్షలు ఇవే.. ► నామినేషన్ వేసే ముందుగానీ, తరువాతగానీ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం. ► రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బంది, అధికారులను మాత్రమే ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలి. ► సభ చుట్టూ వలయాలు, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును అభ్యర్థులు లేదా పార్టీ భరించాల్సి ఉంటుంది. బారికేడ్లు ఏర్పాటు చేయదగిన బహిరంగ స్థలాలను మాత్రమే సభలకు ఎంపిక చేయాలి. ► స్టార్ క్యాంపేయినర్స్ సంఖ్యపై కూడా పరిమితి ఉంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు 20 మంది, గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు 10 మంది మాత్రమే ఉండాలి. ► రోడ్డు షోలు, బైక్, కార్, సైకిల్ ర్యాలీలకు అనుమతిలేదు. ► ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు, వారి ప్రతినిధులు సహా మొత్తం ఐదుగురికి మాత్రమే అనుమతి. ► ఒక అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి గరిష్టంగా 20 వాహనాలు.. అందులోని సీట్ల సామర్థ్యంలో 50శాతం మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి. -
బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బద్వేలు ఉపఎన్నికను సీరియస్గా తీసుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేల్ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్ ఇవ్వడం మా సంప్రదాయం. సానుభూతిగా మిగిలిన వారు పోటీ ఉండకపోవడం సాంప్రదాయం. ఒకవేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్గా తీసుకోవాలో అలానే తీసుకుంటాం. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదు. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారు. రూ.100 కోట్ల వరకు పంచారు. పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలు మా ప్రభుత్వం గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకూ అవసరం. మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చు అని సజ్జల అన్నారు. చదవండి: (క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్)