Bengalur
-
పీవీఆర్ మల్టీప్లెక్స్ యాడ్స్పై ఫిర్యాదు.. కోర్టు జరిమానా
సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే వాణిజ్య ప్రకటనల పట్ల చాలామంది ప్రేక్షకులు విసిగిపోతున్నారు. పలు నగరాల్లోని లగ్జరీ మల్టీప్లెక్స్ల్లో సినిమా చూసేందుకు రూ. 300 పైగా డబ్బు చెల్లించి థియేటర్కు వెళ్తుంటారు. అయితే, ముందుగా ప్రకటించిన సమయానికి సినిమా ప్రదర్శన ఉండదు. దీంతో వారి సమయం వృధా కావడమే కాకుండా.. ఒక్కోసారి ముందుగా వారు నిర్ణయించుకున్న పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురౌతుంది. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్న బెంగళూరుకు చెందిన ఒకరు పీవీఆర్-ఐనాక్స్పై కేసు వేశాడు.తన సంతోషం కోసం టికెట్ కొని సినిమాకు వెళ్తే.. పీవీఆర్-ఐనాక్స్ వారు 25 నిమిషాల పాటు యాడ్స్ వేసి తన సమయాన్ని వృథా చేశారని బెంగళూరు కన్జ్యూమర్ కోర్టులో అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు పీవీఆర్ సినిమాస్ వారికి షాకింగ్ తీర్పును వెల్లడించింది. 2023లో బెంగళూరుకు చెందిన పీవీఆర్-ఐనాక్స్లో 'సామ్ బహదూర్' సినిమా చూసేందుకు వెళ్లినట్లు ఫిర్యాదులో అభిషేక్ పేర్కొన్నారు. సినిమాకి ప్రారంభానికి ముందే దాదాపు 25 నిమిషాల పాటు యాడ్స్ ప్లే చేశారని ఆయన అన్నారు. దీంతో సినిమా ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు. ఆ కారణం వల్ల సినిమా కూడా ఆలస్యంగానే పూర్తి అయ్యిందన్నారు. ఫలితంగా తాను అనుకున్న సమయానికి ఆఫీస్కు వెళ్లలేకపోయినట్లు కోర్టుకు ఆయన చెప్పుకొచ్చారు.డిసెంబర్ 26, 2023న సాయంత్రం 4:05 గంటలకు షో కోసం మూడు టిక్కెట్లను రూ.825.66 చెల్లించి అభిషేక్ బుక్ చేసుకున్నాడు. సినిమా సాయంత్రం 6:30 గంటలకు ముగిసేలా షెడ్యూల్ చేయబడింది. తద్వారా అతను సమయానికి ఆఫీస్కు వెళ్లొచ్చని అనుకున్నారు. అయితే, సాయంత్రం 4 గంటలకు హాలులోకి అడుగుపెట్టినా.. 4:05 నుంచి 4:28 గంటల వరకు ప్రకటనలు మాత్రమే ప్రదర్శించారు. గతంలో కూడా తాను ఈ ఇబ్బంది ఎదుర్కొవడంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రకటనలన్నీ తన ఫోన్లో చిత్రీకరించి వాటిని కోర్టుకు సమర్పించారు. షో టైమింగ్స్ను తప్పుగా చెప్పి, అక్రమంగా యాడ్స్ ప్లే చేసి లబ్ధిపొందేందుకు థియేటర్ యాజమాన్యం చూస్తుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో బుక్మైషోను కూడా చేర్చారు.పీవీఆర్- ఐనాక్స్పై కోర్టు సీరియస్ అయింది. వారిపై రూ. 1లక్ష జరిమానా విధిస్తూ బెంగళూరు కన్జ్యూమర్ కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుడి విలువైన సమయాన్ని వృథా చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ హెచ్చరించింది. ఆపై ఫిర్యాదుదారుడు అభిషేక్కు రూ. 50వేల నష్ట పరిహారం చెల్లించాలని తెలుపుతూ.. అతని మానసి క్షోభకు బదులుగా రూ. 8వేల పరిహారం ఆపై కేసు ఫైలింగ్ కోసం అతను చేసిన ఇతర ఖర్చులకు రూ. 10వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. టికెట్ మీద చూపిన సమయానికే సినిమా ప్రదర్శించాలని పీవీఆర్-ఐనాక్స్కు బెంగళూరు కన్జ్యూమర్ కోర్టు తెలిపింది. పీఎస్ఏ (పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్స్) కింద ఉన్న యాడ్స్ మాత్ర చట్ట పరిధిలోనే రన్ చేయాలని సూచించింది. -
పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!
ఎంత పెద్ద ఫేమస్ సింగర్ అయినా ఒక్కోసారి ఊహించని చేదు అనుభవాలు ఎదురవ్వుతుంటాయి. ముందుగా ప్లాన్ చేసుకుని, పర్మిషన్ తీసుకున్నా ఒక్కోసారి అవమానపాలుకాక తప్పదనేలా ఉంటాయి పరిస్థితులు. హుందాగా, నిజాయితీగా వ్యవహరించినా..అధికార దర్పం ముందు తలవంచక తప్పదేమో ఒక్కసారి. ఇదంతా ఎందుకంటే..నాలుగుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకుని, పాప్ ఐకాన్గా పేరుగాంచిన సింగర్కి బెంగళూరులో అనుకోని పరిణామాన్ని చవిచూశాడు. ఏం జరిగిందంటే.. బ్రిటిష్ గాయకుడు-గేయ రచయిత ఎడ్ షీరన్ బెంగళూరులో చర్చి స్ట్రీట్లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రదర్శన ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఒకటికి మించి రెండు పాటలతో అలరించబోతున్నా అంటూ మొదలు పెట్టారాయన. షీరన్ ముందుగా మొటి పాట అనగానే ఒక పోలీసు ఎంట్రీ ఇచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు.ఆయన ప్రదర్శన జరగకుండా స్పీకర్లను కూడా డిస్కనెక్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉండగా, ఎడ్ షీరన్ మాత్రం ముందుస్తు ప్రణాళికతోనే ఈ ప్రదర్శన ప్లాన్ చేశామన్నారు. ఇలా రోడ్డుపై ప్రదర్శన ఇచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తామేమి అకస్మాత్తుగా అప్పటికప్పుడూ ఇలా ప్రదర్శన ప్లాన్ చేయలేదంటూ ఇన్స్టాగ్రామ్లో వివరణ ఇచ్చారు. కాగా, షేప్ ఆఫ్ యు, థింకింగ్ అవుట్ లౌడ్, పర్ఫెక్ట్ అండ్ కాజిల్ ఆన్ ది హిల్ వంటి హిట్ పాటలకు పేరుగాంచిన పాప్ రాక్ ఐకాన్ ఎడ్ షీరన్. అతని ఆల్బమ్లు హాటకేక్లా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అమ్ముడైపోయాయి. ఆయన జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు భారత్లో పర్యటించనున్నారు.A police officer pulled the plug when Ed Sheeran surprised everyone on Church Street😂😭😭😭 pic.twitter.com/cMIRoLC7Mk— Naai sekar (@snehaplsstop) February 9, 2025 (చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్గా మార్చి..) -
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!
చీరకట్టు చిరాకేం కాదు... చక్కదనానికి కేరాఫ్ అడ్రస్ అని నిరూపిస్తూ బెంగళూరులో శారీరన్ను నిర్వహించింది టాటా కంపెనీ ఎత్నిక్వేర్ విభాగం తనైరా. 2,500 మంది మహిళలు పాలుపంచుకున్న ఈ శారీ రన్లో వయసు తారతమ్యాలేవీ లేకుండా రంగు రంగుల, రకరకాల చీరలు ధరించిన మహిళామణులు చీరకట్టులోని సొగసును, పొందికను చీరకట్టు అందాన్ని గర్వంగా, హుందాగా ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన టాటా కంపెనీ ఎత్నిక్వేర్ విభాగం తనైరా, జేజే యాక్టివ్ సంస్థలు ఆదివారం సంయుక్తంగా ఈ శారీరన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ...‘చీరను స్త్రీత్వానికి, స్త్రీసాధికారతకు ముఖ్యంగా భారతీయతకు బలమైన, చైతన్యవంతమైన భావనకు ప్రతీకగా తనైరా భావిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని చీరను డిజైన్ చేయడం మాకెంతో ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ శారీరన్ కార్యక్రమం కేవలం చీర, చీరకట్టు రమ్యతను గురించి తెలియజేసేందుకు మాత్రమే కాదు అధునిక జీవన విధానానికి అనుగుణంగా మా నిబద్ధతను పునర్నిర్వచించుకోవడం కోసం కూడా. సంప్రదాయ చీరకట్టులోనూ చైతన్యవంతంగా, చురుగ్గా కనిపించవచ్చుననీ, తమ అస్తిత్వాన్ని వదులుకోకుండానే మనసుకు నచ్చినట్లుగా కూడా జీవించవచ్చునన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలన్నదే ఈ శారీరన్ను నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అలాగే చీరకట్టు అనేది సాంస్కృతిక వారసత్వానికి, శక్తి సామర్థ్యాలకు వెన్నుదన్ను అని మా విశ్వాసం, నమ్మకం కూడా. చిన్న స్థాయిలో స్థానికంగా మొదలైన మా కార్యక్రమం నేడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారటం సంతోషంగా ఉంది’’ అన్నారు అంబుజ్ నారాయణ్. (చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
ఆటో డ్రైవర్గా మారిన మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుకంటే..?
ప్రముఖ కంపెనీలో టెక్కీలుగా పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆటో డ్రైవర్గా కెమెరా కంటికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదేంటీ టెక్కీ ఇలా డ్రైవర్గా పనిచేయడం ఏంటని అందరూ కంగుతిన్నారు. సోషల్ మీడియా ఎక్స్లో వేంకటేశ్ గుప్తా అనే వ్యక్తి కోరమంగళలోని మైకోసాఫ్ట్లో పనిచేస్తున్న వేంకటేశ్ గుప్తా అనే టెక్నీని కలిసినట్లు తెలిపాడు. వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న ఆ టెక్కీతో మాటలు కలిపినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో అతడి వివరాలు ఆరా తీయగా..ఆ టెక్కీ తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు. విచిత్ర ఏంటంటే ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీని కూడా ధరించాడు.. అయితే నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..అతడి ఒంటరితనం పట్ల సానూభూతి చూపగా, ఇంకొందరూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారాంతాల్లో ఇలా ఆటో డ్రైవర్లగా పనిచేయడం కొత్త విషయం ఏమీ కాదు. కొంతమంది టెక్కీలు కూడా ఇలా గిగ్ వర్కర్లుగా పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో కూడా బెంగుళూరులోని హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్)లో జావా డెవలపర్గా పనిచేస్తునన్న ఉద్యోగి రాపిడో బైక్ టాక్సీని నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతను తన మునుపటి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే అతను తన తోటి టెక్కీలను కనుగొనడానికి ఇలా బైక్ రైడర్గా మారినట్లు చెప్పడం గమనార్హం. Met a 35 year old staff software engineer at Microsoft in Kormangala driving Namma Yatri to combat loneliness on weekends pic.twitter.com/yesKDM9v2j— Venkatesh Gupta (@venkyHQ) July 21, 2024 (చదవండి: నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!) -
జీరో-వేస్ట్ వెడ్డింగ్: పర్యావరణ హితంగా పూర్వీ పరిణయ వేడుక
పెళ్లి అనంగానే ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అంతే రేంజ్లో వేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది. మంచినీళ్ల బాటిళ్ల దగ్గర నుంచి భోజనాల వరకు ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే వస్తుంది. అలాంటి వాటికి చోటివ్వకుండా శభాష్ అనేలా ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకుంది ఓ జంట. ఒకరకంగా చెప్పాలంటే 'జీరో వేస్ట్ వెడ్డింగ్'కి అసలైన నిర్వచనంగా నిలిచింది ఆ దంపతుల పెళ్లి.బెంగుళూరులోని వధువరులు అందరికీ ఆదర్శంగా నిలిచేలా జీరో వేస్ట్ వెడ్డింగ్ని జరుపుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వధువు డాక్టర్ పూర్వీ భట్ షేర్ చేసుకుంది. ఇది తన కల అని, కేవలం తన కుటుంబం సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించుకునేందుకే తాను ఇలాంటి వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తన తల్లి సహకారంతోనే ఇలా జీరో వేస్ట్ వివాహాన్ని చేసుకోగలిగానని అంటోంది. అంతేగాదు ఆ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో పెళ్లి మండపాన్ని చెరకు గడలతో నిర్మించారు. డెకరేషన్కి మామిడి ఆకులు, కొబ్బరి ఆకులను వినియోగించారు. భోజనాలను అరటి ఆకుల్లో వడ్డించగా, వధువరుల దండలను పువ్వులు, పత్తిదారలతో రూపొందించినవి ఉపయోగించారు. అలాగే రిటర్న్ గిఫ్ట్గా కూడా జ్యూట్ బ్యాగ్లను ఇచ్చారు. ఎక్కడ ఇసుమంత ప్లాస్టిక్ గానీ, పేపర్ని గాని వినియోగించలేదు. పైగా ఈ తంతు ముగిసిన వెంటనే ఆ పెళ్లి మండపానికి ఉపయోగించిన చెరుకుగడలను గోవులకు తినిపించగా, మిగతా ఆకుల వేస్ట్ అంతా పోలాలకు ఉపయోగపడేల కంపోస్ట్ ఎరువుగా మార్చారు. అలాగే పెళ్లిలో పెద్ద ఎత్తున వినియోగించే వాటర్ వేస్ట్ని చెట్లకు వెళ్లేలా మళ్లించారు. ఎక్కడా..నీళ్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు తిరిగి భూమిలోనే ఇంకిపోయేలా ఉండే ఎకోఫ్రెండ్లీ వస్తువులనే ఉపయోగించారు ఆ వధువరుల తల్లిదండ్రులు. ఇలాంటి వివాహాన్ని జరిపించినందుకు వధువు డాక్టర్ భట్ తన తల్లిని అభినందించి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి. View this post on Instagram A post shared by Dr.Poorvi Bhat | Nutrition & Wellness (@herbeshwari)(చదవండి: చింత వద్దిక.. చింత చిగురు ఉందిగా..) -
డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల
బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్లో జరిగిన రేవ్పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులెవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు. అయితే, పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను వారు విడుదల చేశారు. దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లుఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.86 మందికి పాజిటివ్డ్రగ్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్గా తేలిందని కర్ణాటక పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త నమూనా పరీక్షలో నిర్ధారణ అయిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుందన్నారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సెలింగ్కు పిలిచే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.పేరు మార్చుకున్న హేమబెంగుళూరు డ్రగ్స్ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ట్విస్ట్లు ఇచ్చింది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హేమా, చిరంజీవి, ఆశి రాయికి బెంగుళూరు సీసీబి పోలీసులు నోటిసులు ఇవ్వనున్నారు.రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్లో ఫాంహౌస్లో ఉన్నాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరొ వీడియోను విడుదల చేసింది. అయితే, తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్ కాలేదు. -
రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?
చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే.. చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్లో షిన్రిన్-యోకు అంటారు. దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు. (చదవండి: వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!) -
ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్: నలభైలలో ఆ మదర్స్..!
చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు.. నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్కి చెందిన మోనికా లధాలు.. ముగ్గుర మదర్స్లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్గా కెరీర్ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్. ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి. (చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!) -
ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!
ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే.. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు. ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా. (చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!) -
18 ఏళ్లుగా తలలో బుల్లెట్తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..
ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట దిగింది? ఎవరా వ్యక్తి అంటే..! యోమెన్కి చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్తోనే జీవించాడు. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్ కారణంగా చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది. ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్ కరెక్ట్గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్రే సాయంతో బుల్లెట్ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్ యెమెన్కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. (చదవండి: ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..) -
బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..
కొంతమంది ఆకలితో అలమటిస్తుంటే, మరోపక్క టన్నులకొద్దీ ఆహారం వివిధ రకాలుగా వ్యర్థాల రూపంలో మట్టిపాలవుతోంది. ఈ మధ్య కాస్త అవగాహన రావడంతో ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆశ్రమాలకు దానంగా ఇస్తున్నారు. అయితే వండిన ఆహారమే కాకుండా, కొన్నిరకాల పదార్థాలు, పానీయాలు తయారయ్యాక ఎన్నో పోషకాలున్న పదార్థాలు చెత్తలోకి వెళ్లి పోతున్నాయి. వీటిని మనం చక్కగా వినియోగించుకుంటే...బిస్కెట్లు, బ్రెడ్, రోటీలు చేసుకోవచ్చని చెబుతోంది ఎలిజబెత్ యార్క్. బీర్ తయారవగా మిగిలి పోయిన వ్యర్థాలతో చిక్కి, లడ్డు, నూడుల్స్ తయారు చేసి మరీ రుచి చూపెడుతోంది ఎలిజబెత్. బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ యార్క్ ఒక చెఫ్. మణిపాల్లో డిగ్రీ చేసిన ఎలిజబెత్ తరువాత మైసూర్లోని సెంట్రల్ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎన్నో రకాలుగా భారీ ఎత్తున ఆహార వృథా జరుగుతోందని గ్రహించింది. ఆహారం వ్యర్థం కాకుండా ఎలా ఆపాలా... అని ఆలోచించింది. ఈ క్రమంలోనే 2016లో కాలిఫోర్నియాలోని బ్రెడ్ స్పెషలిస్ట్, ఫుడ్ హిస్టోరియన్ విలియం రెబెల్ దగ్గర ఇంటర్న్గా చేరింది. రుబెల్ ద్వారా... ‘‘వందల ఏళ్ల నాడే పానీయాల తయారీ దారు, (బ్రీవర్స్), రొట్టె, బ్రెడ్స్ తయారీదార్లు (బేకర్స్) కలిసి పనిచేసే వారని తెలిసింది. కొన్నిసార్లు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్ను బ్రీవర్స్, గింజలు, ఈస్ట్ను బ్రీవర్స్ బేకర్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అలా వాళ్లు పదార్థాలు వృథా కాకుండా, తక్కువ ఖర్చులో ఆహారాన్ని తయారు చేసేవారు’’ అని ఎలిజబెత్ తెలుసుకుంది. భారత్లో కూడా ఇలా చేసి ఫుడ్ వేస్ట్ కాకుండా చూడవచ్చు అనుకుంది. సేవింగ్ గ్రెయిన్స్ లాక్డౌన్ సమయంలో కాస్త ఎక్కువ సమయం దొరకడంతో ఎలిజబెత్ వ్యర్థాల నుంచి ఫుడ్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. బీర్ తయారైన తరువాత పడేసే వ్యర్థాలను రుచికరమైన ఆహారంగా మార్చాలనుకుని 2021లో ‘సేవింగ్∙గ్రెయిన్స్’ ప్రారంభించింది. బీర్ తయారవగా మిగిలిన పిప్పిని పిండిగా మార్చి, తరువాత ఆ పిండితో బ్రెడ్, రోటీలు, గ్రనోలా, కుకీస్, టీ బిస్కెట్స్, లడ్డులు, చిక్కీలు తయారు చేసి విక్రయిస్తోంది. పిప్పినుంచి తయారు చేసినవే అయినా ఇవి ఎంతో రుచిగా ఉండడం విశేషం. సేవింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తులు ఆఫ్లైన్లోనేగాక, ఆన్లైన్లోకూడా లభ్యమవుతున్నాయి. స్థానిక బేకరీ భాగస్వామ్యంతో సేవింగ్ గ్రెయిన్స్ను విస్తరిస్తోంది ఎలిజబెత్. రోజుకి పన్నెండు వేల కేజీలు.. ‘‘రకరకాలుగా ఫుడ్ వేస్ట్ అవడం చాలా బాధగా అనిపించేది. రుబెల్ను కలిసాక ఈ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది. దాంతోనే ‘సేవింగ్ గ్రెయిన్స్’ను ప్రారంభించాను. బీర్, ఆల్కహాల్ను తయారు చేసేందుకు గోధుమలు, ఓట్స్, బార్లీలను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత, చక్కెరతో ఉడికి స్తారు. తరువాత మెత్తగా రుబ్బి రసాన్ని వేరు చేసి బీర్, ఆల్కహాల్స్ను తయారు చేస్తారు. పానీయం వేరు చెయ్యగా మిగిలిన పిప్పిని పశువులకు దాణాగా వేస్తుంటారు. పశువులు తిన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో వ్యర్థంగా పోతుంది. ఒక్క బెంగళూరులోనే రోజుకి పన్నెండు వేలకేజీల ధాన్యాలను పానీయాల తయారీలో వాడుతున్నారు. రోజుకి ఇంత అంటే ఇక ఏడాదికి చాలా ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రీవరీలు లక్షల కేజీల ధాన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఇలా ఉత్పన్నమయ్యే పిప్పిని ఫుడ్గా మార్చడం వల్ల ధాన్యాలు వ్యర్థంగా పోవు. సేవింగ్ గ్రెయిన్స్ ద్వారా ఎంతోమంది ఆకలి కూడా తీర్చవచ్చు’’ అని ఎలిజబెత్ చెబుతోంది. (చదవండి: బీర్ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బి) -
ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!
అటు చూస్తే జవాన్ ఇటు చూస్తే ఆఫీస్...అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ... అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ బెంగుళూరు ఐ.టి ఉద్యోగికి కూడా సంకటం వచ్చింది. ఒకవైపు జవాన్ రిలీజ్. మరోవైపు సాఫ్ట్వేర్ డ్యూటీ. చివరకు అతను రెండూ చేశాడు. వైరల్ అయ్యాడు. బెంగళూరులోనే ఇటువంటివి జరుగుతుంటాయి. మొన్నా మధ్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ర్యాపిడో బైక్ వెనుక కూచుని ఆఫీస్కు వెళుతూ ట్రాఫిక్లో చిక్కుకుపోతే బైక్ మీదే ల్యాప్టాప్ తెరిచి లాగిన్ అయ్యి డ్యూటీ మొదలెట్టేశాడు. భారీ ట్రాఫిక్ వల్ల క్యాబుల్లో ఎక్కగానే ల్యాప్టాప్లు తెరిచే వాళ్లూ అక్కడ ఎక్కువే. ఇప్పుడు ఒక ఉద్యోగి ఏకంగా సినిమా హాల్లోనే ల్యాప్టాప్ తెరిచాడు. ఏం చేస్తాడు మరి? షారూక్ ఖాన్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో. సరిగ్గా ఆ టైమ్కే లాగిన్ అవ్వాలి. అందుకని థియేటర్లో ల్యాప్టాప్లో వేళ్లు టిక్కుటక్కుమంటుంటే కళ్లు సినిమాకు అంకితం అయ్యాయి. వెనుక కూచున్న ఒక వ్యక్తి ఇది ఫొటో తీసి ఇన్స్టాలో పెడితే లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘బెంగళూరులో ఇక పని చేయకుండా వదిలేసిన చోటు ఏదీ లేదు’ అని కామెంట్లు చేస్తూ ఏడవలేక నవ్వుతున్నారు. When #Jawan first day is important but life is #peakbengaluru. Observed at a #Bangalore INOX. No emails or Teams sessions were harmed in taking this pic.@peakbengaluru pic.twitter.com/z4BOxWSB5W — Neelangana Noopur (@neelangana) September 8, 2023 (చదవండి: కాలం కలిసి వస్తే డంప్యార్డ్ కూడా నందనవనం అవుతుంది!) -
ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తామంటే డాన్స్ చేయకుండా ఆగుతామా?
ఉచితంగా ఇస్తామంటే ఏ పని చేయడానికి వెనకాడరు కదా!. అందులోకి ఫుడ్కి సంబంధిచింది అంటే ఇంక జనాలు ఎలా ఎగబడతారో చెప్పనవసరం లేదు. అందుకు పెద్ద చిన్నా అనే తేడా లేదు. అలాంటి ఘటనే బెంగళూరు చోటు చేసుకుంది. ఓ ఐస్క్రీం ఫాపు వాళ్లు డ్యాన్స్ చేస్తే ఐస్క్రీం ఫ్రీ అని ఆఫర్ ఇచ్చింది. అంతే ఇక..ఆ ఉచిత ఐస్క్రీంల కోసం వృద్ధులు యువత అనే తేడా లేకుండా పోటాపోటీగా డ్యాన్సుల చేసి మరీ ఐస్క్రీంని ఆరగించి వెళ్తున్నారు. మాములుగా ఏదైన ఈవెంట్ పరంగా చేయాల్సి వస్తే డ్యాన్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటప్పుడూ మాత్రం డ్యాన్స్లు వచ్చినా రాకపోయినా రెండు స్టెప్లు ఏదోరకంగా వేసి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తారు. ఇలాంటి విచిత్రమైన ఆఫర్లు ఉంటే జనాల్లో దాగున్న అన్ని టాలెంట్లు బయటకు వచ్చేస్తాయి కూడా. అయితే ఎందుకిలా బెంగళూరుషాపు వాళ్లు ఈ ఆఫర్ పెట్టారంటే..ఐస్క్రీం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఔనా! అయితే ప్రతి జూలై మూడోవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఐస్క్రీం డేని జరుపుకుంటారు. ఈ ఏడాది అదికాస్త జూలై 16న వచ్చింది. ఆ సందర్భంగా బెంగళూరులోని ప్రఖ్యాతిగాంచిన ఓ ఐస్క్రీం షాపు ఏదైన వినూత్న రీతిలో కస్టమర్లకు ఐస్క్రీంని సర్వ్ చేయాలనుకుంది. అందులో భాగంగా ఇలాంటి వైరైటీ ఆఫర్ ఇచ్చింది కస్టమర్లకు. ఆ షాపు వాళ్లు కస్టమర్లు అదిరిపోయే డ్యాన్స్లు చేస్తే ఐసీక్రీం ఫ్రీ అని బోర్డు పెట్టింది. అంతే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జనాలు ఇలా ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ టాలెంట్ని చూపించారు. ఈ మేరకు సదరు ఐస్క్రీం షాపు అందుకు సంబందించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో నెటిజన్లతో పంచుకుంది. ఈ వేడుక మీ ప్రేమతో దిగ్విజయం జరిగింది అందుకు మా కస్టమర్లకు ధన్యావాదాలు అని ఇన్స్టాలో పేర్కొంది సదరు ఐస్క్రీం షాపు యాజమాన్యం. View this post on Instagram A post shared by Corner House Ice Creams (@cornerhouseicecreams) (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
వంచనకు పరిచయం.. సామాజిక మాధ్యమాల్లో వేదికగా..
అనంతపురంలోని పాతూరుకు చెందిన స్వాతి (పేరు మార్చాం) ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బెంగళూరుకు చెందిన అబ్బాయి వలలో పడింది. ఉన్నఫళంగా ఒకరోజు ఇంటినుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ‘దిశ’ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. చివరకు పోలీసుల జోక్యంతో అమ్మాయిని వెతికి ఇంటికి తెచ్చారు. ధర్మవరానికి చెందిన అమ్మాయి కావ్య (పేరు మార్చాం) అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఒకరోజు ఉన్నఫళంగా అబ్బాయితో వెళ్లిపోయింది. ఇరవై రోజుల తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా కనుక్కుని అమ్మాయిని తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అబ్బాయితో వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. వీరిద్దరే కాదు ఎంతోమంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల ద్వారా ముక్కూమొహం తెలీని వ్యక్తులు విసిరిన వలలో చిక్కుకుని మోసపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు కచ్చితంగా తమ పేరుపై ఖాతాలు తెరిచేస్తున్నారు. ప్రతిదీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయమవుతున్నారు. అలా చాటింగ్తో స్నేహం పెంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా వారిని చూడకపోయినా.. వారి గుణగణాలు, నేపథ్యం తెలియకపోయినా గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో అమ్మాయిలను కొందరు అబ్బాయిలు ట్రాప్లో పడేస్తున్నారు. క్రమక్రమంగా అమ్మాయిలు తమ కెరీర్ను పక్కనపెట్టి పోకిరీల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి మాధ్యమాల ద్వారా నష్టపోతున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొంపముంచుతున్న ఇన్స్టాగ్రామ్ ఇటీవలి కాలంలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులంటూ పరిచయమైన ఈ ఫోన్లు ఇప్పుడు పర్సనల్ ఖాతాల వరకూ వెళ్లాయి. ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా చాటింగ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామన్న కనీస అవగాహన కూడా లేకుండా అబ్బాయిలకు వ్యక్తిగత వివరాలు షేర్ చేస్తున్నట్టు వెల్లడైంది. దీన్ని కొందరు అబ్బాయిలు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. అమ్మాయిలు నష్టపోయే వరకూ వాస్తవ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిలు నష్టపోయాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని చదువు మాన్పిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది వ్యవధిలో 71 మంది అమ్మాయిలు ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అబ్బాయిల వలలో పడినట్టు తేలింది. బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ సామాజిక మాధ్యమాల బాధితుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఎక్కువయ్యాయి. నెలకు ఐదారు కేసులు వస్తున్నాయి. తల్లిదండ్రుల కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచి అబ్బాయిలను మందలించి పంపిస్తున్నాం. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు షేర్ చేయద్దు. –ఆళ్ల శ్రీనివాసులు, డీఎస్పీ, ‘దిశ’ పోలీస్ స్టేషన్ వ్యసనంగా మారింది రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షితులు కావడమనేది ‘ఎమోషనల్ డిపెండెన్సీ’ అంటారు. ఆ గ్రూపులో తిరిగే వారిని బట్టి కూడా ఉంటుంది. ముందుగా దీనిపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. నాలుగు రోజుల కిందట 8వ తరగతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కోసం ఏడుస్తోందని తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చారు. ఇలా అలవాటు చేయడం వల్ల వాళ్లు దానికి బానిసల్లా మారి నష్టపోతున్నారు. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం (చదవండి: ‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం.. యాజమాన్యం లెటర్ డ్రామా.. విద్యార్థికి సీరియస్!) -
జయలలిత ఆస్తులను వివరాలను ఇవ్వండి!
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆపీసర్(పీఓఐ) ఉత్తర్వును సివిల్ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు. వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి. ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
రోడ్డు మధ్యలో...హఠాత్తుగా గొయ్యి! అటుగా వచ్చిన బైకర్..
సాక్షి, శివాజీనగర: బెంగళూరులో గుంతల రహదారులతో సతమతమవుతున్న నగరవాసులకు సింక్ హోల్ తరహా ముప్పు ఎదురైంది. ఆకస్మాత్తుగా రోడ్డు మధ్య భాగంలో నేల కుంగిపోగా, ఆ గుంతలోకి బైకిస్టు పడిపోయి గాయపడిన ఉదంతం గురువారం మధ్యాహ్నం సంభవించింది. గత మంగళవారం మెట్రో పిల్లర్ కడ్డీలు కూలిపడి తల్లీ కొడుకు మృతి చెందిన దుర్ఘటన మరువక ముందే ఈ తరహా సంఘటన కలకలం రేపుతోంది. ఏం జరిగిందంటే అశోకనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో జాన్సన్ మార్కెట్ రోడ్డులో రోజులాగానే వాహనాలు వెళ్తుండగా రోడ్డు హఠాత్తుగా కుంగిపోయి 3 అడుగుల వ్యాసం, 3 మీటర్ల లోతుతో గొయ్యి ఏర్పడింది. వేగంగా వెళ్తున్న ఒక బైకిస్టు అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు తగిలాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. నడి రోడ్డులో ఏర్పడిన ఈ సింక్ హోల్ అందరికీ ఆందోళన కలిగించింది. సమాచారం అందుకొన్న తూర్పు విభాగపు డీసీపీ కళా కృష్ణమూర్తి స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఈ రోడ్డు మొత్తాన్ని మూసివేసి ట్రాఫిక్ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. భూగర్భంలో మెట్రో రైల్ సొరంగ మార్గం పనుల వల్ల పైన రోడ్డు ఇలా కుంగిపోయిందని అనుమానం ఉంది. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన.. ప్రయాణికులను ఎక్కించుకోకుండా..
బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్లైన్ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు. ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్వర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్లైన్ను ఆదేశించింది. కాగా ప్రయాణికులకు బోర్డింగ్పాస్లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్లో ఇదే నా చివర ఫ్లైట్ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్ చేశారు. కాగా గోఫస్ట్ ఎయిర్వేస్ ఆయా ట్వీట్లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
భార్య నుంచి కాపాడాలని మొర
సాక్షి, బనశంకరి: భార్య వేధింపులు భరించలేక భర్త బెంగళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ. 5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడికి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసిన రామచంద్ర న్యాయం లభించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టరు నేను కట్టిన ఇంట్లో ఉండనివ్వరని వాపోయాడు. (చదవండి: పథకం ప్రకారమే లయస్మిత హత్య ?) -
పథకం ప్రకారమే లయస్మిత హత్య ?
సాక్షి, యశవంతపుర: బెంగళూరు ఉత్తర తాలూకా రాజనకుంట ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థిని లయస్మితను పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో పాటు సొంత అత్త కూతురు కావడంతో పవన్ ఆమె పేరును తన హృదయంపై ట్యాటూ వేసుకున్నాడు. ఎఫ్బీ, ఇన్స్టాలో స్మిత ఫొటోను వాల్పేపర్గా పెట్టుకున్నాడు. హత్యకు గంట ముందు సోషల్ మీడియాలో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను డిలిట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె హత్యకు గురైందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పవన్ కోలుకోగానే విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. గ్రామస్తులతో విద్యార్థుల గొడవలు రాజనకుంట సమీపంలోని దిబ్బూరు వద్దనున్న ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులతో స్థానిక గ్రామస్థులు ఇబ్బందు పడుతున్నారు. రోజూ విద్యార్థులు మద్యం తాగి గ్రామస్తులతో గొడవలు పడుతున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని దిబ్బూరు చుట్టు పక్కల గ్రామస్తులు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. గురువారం ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక పోలీసుల పనితీరు సరిగా లేదంటూ వినతిపత్రంలో ఆరోపించారు. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
పేరెంట్స్ మీటింగ్కి బాయ్ఫ్రెండ్ ..బిత్తరపోయిన ఉపాధ్యాయులు
సాక్షి, బనశంకరి: ఇటీవల రోజుల్లో విద్యార్థుల ప్రవర్తనతో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఓ బాలిక పేరెంట్స్ మీటింగ్కు తన బాయ్ ఫ్రెండ్ను తీసుకువచ్చి తన సోదరుడు అంటూ చెప్పిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చింది. మీటింగ్కు తల్లిదండ్రులకు బదులుగా విద్యార్థిని బాయ్ఫ్రెండ్ను తీసుకురావడంతో ఉపాధ్యాయులు బిత్తరపోయారు. ఇద్దరి వాలకాన్ని అనుమానించిన ఉపాధ్యాయులు వేర్వేరుగా విచారణ చేశారు. పదే పదే ప్రశ్నించగా తన కజిన్ బ్రదర్ అని, ఆ వ్యక్తిని అడగ్గా తన సిస్టర్ అంటూ చెప్పాడు. ఇద్దరి మాటలతో అయోమయానికి గురైన పాఠశాల పాలక మండలి విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలిపి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని క్యామ్స్ అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు) -
చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు
సాక్షి, బనశంకరి: చికెన్ రోల్ ఇవ్వలేదని హోటల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన బెంగళూరు హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి హనుమంతనగర కుమార్ హోటల్కు రౌడీషీటర్ దేవరాజ్, ఇద్దరు అనుచరులు వెళ్లారు. తినడానికి చికెన్రోల్ కావాలని సిబ్బందిని అడిగారు. సమయం ముగిసింది, హోటల్ మూసేస్తున్నాం, ఈ రోజు మెనులో చికెన్రోల్ లేదని వారు చెప్పారు. దీంతో దేవరాజ్, అతని అనుచరులు సిబ్బందితో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వారిని హోటల్ సిబ్బంది చితకబాది బయటికి గెంటేసి హోటల్ తలుపులు వేశారు. పెట్రోలు పోసి నిప్పు దేవరాజ్ అనుచరులు సమీప పెట్రోల్బంక్కు వెళ్లి రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి హోటల్ సిబ్బంది గది మీద పోసి నిప్పుపెట్టారు. మంటలు వ్యాపించగానే సిబ్బంది బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. తలుపు, కిటికీ కాలిపోయింది. హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవరాజ్, గణేశ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. (చదవండి: జికా వైరస్ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్) -
మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా...ప్రియుడితో కలిసి భార్యే
సాక్షి, బెంగళూరు: కనిపించకుండా పోయిన వ్యక్తి శవంగా లభ్యం కాగా అతనిని భార్యే హత్య చేయించిన విషయం పోలీసుల తనిఖీలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన తాలూకాలోని టీకల్ ఫిర్కా చంబె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ హత్యకు గురైన వ్యక్తి. నవంబర్ 21న కనిపించకుండా పోవడంపై తాలూకాలోని మాస్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెంగుళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకా భీమకరనహళ్లి గ్రామంలోని చెరువులో ఆనంద్ శవం లభ్యమైంది. దీనిపై నందగేడి పోలీస్ స్టేషన్లో అపరిచిత శవం లభ్యం కేసు నమోదైంది. తనిఖీ సమయంలో అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మారింది. చైత్ర, పృథ్వీరాజ్ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సరసానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలంచిన చైత్ర ప్రియుడితో కలిసి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు మాస్తి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఆనంద్ భార్య చైత్ర, పృథ్వీరాజ్, చలపతిలను అరెస్టు చేశారు. మరో నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడు. (చదవండి: జాగ్రత్తగా నడపమన్నందుకు... కారుతో ఢీకొట్టారు) -
బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు
బెంగళూరులో అర్థరాత్రి జరిగిన దారుణ హత్య పెద్ద కలకలం సృష్టించింది. ఒక వ్యక్తిపై కొంతమంది వ్యక్తుల గుంపు పెద్ద ఇటుక రాయితో దాడిచేసి తలపగల కొట్టి చంపేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బెంగళూరులోని కెపీ అగ్రహార ప్రాంతంలోని ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళల గుంపు ఒక చోట కూర్చొని ఉన్న వ్యక్తి వద్దకు సముహంగా వచ్చారు. కాసేపు అతనితో వాగ్వాదానికి దిగి అతడిపై దాడి చేశారు. ఇంతలో ఒక మహిళ ఒక రాయిని తీసుకువచ్చి అతడి తలపగలు కొట్టింది. మరోవైపు కొంతమంది భాదితుడిని కదలకుండ పట్టుకుని ఉండగా... ఒక వ్యక్తి రాయితో అదేపనిగా కొడుతూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఐతే బాధితుడి కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించి...పోలీసులకు సమాచారం అందించారు. కానీ సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బాదామి ప్రాంతానికి చెందినవాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Murder On CCTV In Bengaluru, Group Smashes Man's Head With Stones#Bengaluru #cctvfootage #Murder #Badami #argument #crimenews #KPAgrahara #attackers #killed #Karnataka #news #latestupdate #dailynews #IndianJourno pic.twitter.com/sF4eyTPFF0 — Indian Journo (@indianjournoapp) December 6, 2022 (చదవండి: వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు) -
భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని..
యశవంతపుర: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భార్యను భర్త అతి క్రూరంగా చంపిన ఘటన సోమవారం బెంగళూరు తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...శివమ్మ (50), శంకరప్ప భార్యభర్తలు. శంకరప్ప తుహళ్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి శివమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నాడు. శివమ్మను ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. పిల్లలు పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం సెల్లార్లోని నీటి ట్యాంకులోకి ఆమెను తీసుకువచ్చి పడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొడుకు, కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తండ్రిని నిలదీశారు. తనకు తెలియదని శంకరప్ప చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కొడుకు అనుమానంతో సెల్లార్లోని నీటి ట్యాంకులో చూడగా శివమ్మ శవమై కనిపించింది. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: కొడుకు హత్యకు తండ్రి సుపారీ) -
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
ఫొటోలు లీక్..ప్రియురాలు రౌద్రరూపం.. ప్రియుడు ఖతం
బొమ్మనహళ్లి: ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడనే ఆగ్రహంతో ప్రియురాలు రౌద్రరూపం దాల్చింది. ముగ్గురు మగ స్నేహితులతో కలిసి ప్రియున్ని ఇష్టానుసారం కొట్టడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన బెంగళూరులో బేగూరు పరిధిలో చోటుచేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్లో చదివి వచ్చి వివరాలు... చెన్నై నగరానికి చెందిన వికాస్ (27), ప్రతిభ ప్రేయసీ ప్రియులు. ఉక్రెయిన్లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్ చెన్నైలో డాక్టర్గా పని చేసేవాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభతో వికాస్కు రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. వికాస్ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేసుకుందామని జంట అనుకుంది. ఇన్ స్టాలో ఫొటోల పోస్టింగ్తో గొడవ ప్రతిభ నగ్న చిత్రాలను వికాస్ ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేశాడు. అది ఆమె కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. (చదవండి: మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు) -
యడ్డి, తనయుడిపై లోకాయుక్తలో కేసు
శివాజీనగర: బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డి, ఆయన తనయుడు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన బీ.వై.విజయేంద్రలపై కేసు నమోదైంది. వివరాలు.. యడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) పనుల కాంట్రాక్టు మంజూరులో భారీగా ముడుపులు తీసుకున్నారని టీజే అబ్రహాం అనే సామాజిక కార్యకర్త కోర్టులో ప్రైవేట్ కేసు వేయగా కోర్టు తిరస్కరించింది. అబ్రహాం హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన పిటిషన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవాలనీ యడ్డి అన్నారు. (చదవండి: IRTC Scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి) -
పెళ్లి అనుకుంటే లొల్లి
బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమైన యువతి మాయలో పడిన ఓ యువకుడు సుమారు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు దక్షిణ పరిధిలో చోటుచేసుకుంది. హనుమగిరి నివాసి అజయ్కుమార్ బాధితుడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అజయ్కుమార్ గత నెల 29వ తేదీన వెబ్సైట్లో వధువు కావాలని తన ఫొటో వివరాలను అప్లోడ్ చేశాడు. తరువాత ఉత్తర భారతదేశానికి చెందిన యువతి అతనికి మెసేజ్ పంపించగా ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. భారీగా వసూళ్లు మీరంటే ఇష్టమని, మిమ్మల్ని చూడడానికి వస్తానని యువతి చెప్పింది. దీంతో యువకుడు ఆమె బ్యాంకు అకౌంట్కు కొంత డబ్బు జమచేశాడు. అప్పటినుంచి యువతి పలు కారణాలు చెబుతూ అతన్నుంచి నగదు పిండుకోసాగింది. మొత్తం రూ.9.95 లక్షలు ఆమె ఖాతాలోకి జమచేశాడు. తరువాత యువతి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అడ్రస్ లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన యువకుడు బెంగళూరు దక్షిణ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఐటీసీటీలో అతిపెద్ద సమస్య... అక్రమ సంబంధాలతో 981 జంటలు) -
ఆగస్టు 31న మాంసం విక్రయాలు, జంతు వధ నిషేధం
కర్ణాటక: బెంగళూరులో ఆగస్టు 31న మాంస విక్రయాలను, జంతు వధను నిషేధించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆగస్టు 31న గణేష్ చతుర్థి సంధర్భంగా ఈ నిషేధాన్ని విధించినట్లు పేర్కొంది. అంతేకాదు నిషేధం విధిస్తూ పౌరసరఫరాల సంస్థ సర్యులర్ కూడా జారీ చేసింది. పైగా మరింత సమాచారం కోసం నిషేధం కాఫీని కూడా జత చేసింది. పశుసంవర్ధక శాఖ జాయింట డైరెక్టర్ బృహత్ బెంగళూరు మహానగర కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో జంతువులను వధించడం మాంసం విక్రయించడం నిషేధమని తెలియజేశారు. ఇంతకమునుపు ఈ నెల ప్రారంభంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా మాంసం అమ్మకాలను, జంతువులను చంపడాన్ని నిషేధిస్తూ పౌర సరఫరాల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. (చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు) -
ఫిర్యాదు చేసిందని బాలిక హత్య
దొడ్డబళ్లాపురం: ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తండ్రితో చెప్పుకోవడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. ఆ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా జిందాల్ క్వార్టర్స్లో చోటుచేసుకుంది. వీరందరూ వలస కార్మికులే. జిందాల్ అల్యూమినియం కంపెనీ ఉద్యోగి లక్ష్మణ్సింగ్.. జిందాల్ క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. ఇతడి కుమార్తె ఖుషి (11)ని ఇదే క్వార్టర్స్లో ఉండే నందకిశోర్ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. క్వార్టర్స్లో ఖుషి కుటుంబం రెండవ అంతస్తులో నివసిస్తుంటే మొదటి అంతస్తులో నందకిశోర్ ఉంటున్నాడు. ఖుషి కిందకు వస్తున్నప్పుడు నందకిశోర్ అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఈ విషయం ఖుషి తన తండ్రితో చెప్పడంతో నందకిశోర్తో గొడవపడ్డాడు. అసోసియేషన్ ముందు పంచాయతీ పెట్టి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పించాడు. ఇదే ఆక్రోశంతో నందకిశోర్ సోమవారం ఖుషిని టెర్రస్పైనే కత్తితో పొడిచి అనంతరం తానూ కత్తితో పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ నందకిశోర్ను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందాడు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..) -
‘హష్’ రవాణాతో సిటీకి లింకులు!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు ఇటీవల చిక్కిన హష్ ఆయిల్ అక్రమ రవాణా గ్యాంగ్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బెంగళూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబైలకు సరఫరా చేస్తోందని గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా మొత్తం నెల్లూరు కేంద్రంగా సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు. ఈ గ్యాంగ్ అరెస్టుపై ఇక్కడి అధికారులకు సమాచారం ఇచి్చన సీసీబీ నెల్లూరు కోణంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. బెంగళూరులోని వివిధ పబ్బుల్లో పని చేసే డిస్కో జాకీలకు (డీజే) పెద్ద ఎత్తున గంజాయి, హష్ ఆయిల్ సరఫరా అవుతున్నాయి. వీళ్లే తమ పబ్స్కు వచ్చే కస్టమర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అక్కడి సీసీబీ అధికారులకు గత నెల్లో సమాచారం అందింది. దీంతో వరుసపెట్టి దాడులు చేసిన అధికారులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీరికి ఈ మాదకద్రవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై సీసీబీ దృష్టి పెట్టింది. తమ దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముఠా అరకు లోయ నుంచి తీసుకువచ్చి అందిస్తున్నట్లు గుర్తించింది. దీంతో నిఘా కొనసాగించిన సీసీబీ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని, తొలిసారిగా పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అరకు ప్రాంతానికి చెందిన వీరిని శ్రీనివాస్, ప్రహ్లాద్, సత్యవతి, మల్లీశ్వరిగా వీరిని గుర్తించారు. ఈ నలుగురినీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సీసీబీ లోతుగా విచారించింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోణం వెలుగులోకి వచి్చంది. ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతానికి చెందినదే. గంజాయి పండేది, హష్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది సైతం ఆ ఏరియాలోనే. అయితే తమకు మాత్రం ఈ మాదకద్రవ్యాలను నెల్లూరులో ఓ వ్యక్తి అందించారంటూ ఈ నలుగురూ బయటపెట్టారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రేగా అనే వ్యక్తి ఆదేశాల మేరకు తాము అక్కడకు వెళ్లామని సీసీబీ విచారణలో చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తి గతంలోనూ తమకు గంజాయి, హష్ ఆయిల్ ఇచ్చాడని, వాటిని హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాలకు తీసుకువెళ్లి డెలివరీ చేసి వచ్చాయని అంగీకరించారు. డెలివరీ ఎవరికి ఇవ్వాలనేది ముందుగా చెప్పరని ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే వాట్సాప్ కాల్ ద్వారా తమకు సమాచారం ఇస్తారని ఈ నలుగురూ సీసీబీ విచారణలో వెల్లడించారు. ఈ ముఠాకు హైదరాబాద్లోనూ పెడ్లర్లు ఉన్నారని తెలియడంతో సీసీబీ పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. నలుగురి వివరాలు, ఫోన్ నెంబర్లు అందించి స్థానిక లింకులపై ఆరా తీయాల్సిందిగా కోరారు. ఈ ముఠాకు, నెల్లూరులోని సరఫరాదారుడికి ఉన్న సంబంధాన్నీ తెలుసుకున ప్రయత్నాలు చేయాలని కోరారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ కోణంలో ఆరా తీయడం మొదలెట్టారు. (చదవండి: డిస్క్ంకు ఉరితాళ్లు!) -
ఉద్యోగం పేరుతో రూ.కోటి టోపీ
కృష్ణరాజపురం: దావణగెరె జిల్లాలోని జగళూరు తాలూకా విద్యాశాఖ బసవనగౌడ పాటిల్, అతని సోదరుడు బళ్లారి వెంకటరెడ్డిలు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.2 కోట్లు వసూలు చేసి మోసగించారని బెంగళూరు కృష్ణరాజపురానికి చెందిన వ్యాపారి నాగేంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు పరిచయం అయ్యారని, తమకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని చెప్పారన్నారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని అడిగితే ఇద్దరూ కలిసి రూ.1.02 కోట్లు తీసుకున్నారని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు తెలిపాడు. (చదవండి: ప్రపంచ శాంతి కోసం యోగా.. మైసూర్ ప్యాలెస్లో ప్రధాని మోదీ యోగాసనాలు) -
చిన్న ఫోటోగ్రాఫర్...అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతికే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా
పావగడ: తాలూకాలోని ఓబుళాపుర గ్రామంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన కృష్ణమూర్తి, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు వై కే లోకనాథ్ ఫొటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. చిన్నపాటి ఫొటోగ్రాఫర్గా వృత్తిని ప్రారంభించిన ఆయన నేడు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వ్యక్తిగత ఫొటో గ్రాఫర్గా ఎదిగాడు. బెంగుళూరులో కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న అతని చిన్నాన్న ఎంసీ గిరీశ్ ప్రేరణతో ప్రభుత్వ చలనచిత్ర, జయచామరాజేంద్ర పాలిటెక్నిక్లో చేరారు. 1989లో డిప్లొమా పూర్తి చేశాడు. ప్రసార భారతి ఛానల్లో విధులు నిర్వహించాడు. తదనంతరం ఢిల్లీలో అడుగు పెట్టి ఛాయాగ్రహ వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛాయాగ్రాహకుడిగా ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాల పాటు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఎదుగుదల పట్ల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు హర్షం ప్రకటించారు. (చదవండి: ‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’) -
తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?
Matrimonial sites are platforms designed to match: ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఒకటైన జంటలు కోకొల్లలు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? వివరాల్లోకెళ్తే....ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన మంచి సంబంధాలను వెతికి తీసుకువ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తులను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. పాపం బెంగుళూరులోని ఓ తండ్రి అలానే భావిస్తాడు. ఈ మేరకు అతను తన కూతురుకి తగిన వరుడుని మాట్రిమోనియల్ సైట్లలో వెతికి మరీ అతని వివరాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఐతే ఆమె తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. మాట్రిమోనియల్ సైట్లలో ప్రోఫెల్లో సదరు వ్యక్తుల పూర్తి సమాచారం ఉండటం సహజం. ఆమె అతని ప్రోఫెల్ చూసి ముచ్చటపడి ఉద్యోగం ఇచ్చింది. ఇంతకీ ఆమె బెంగళూరులోని స్టార్ట్ అప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్. అంతేకాకుండా తన తండ్రికి ఆ వ్యక్తికి లావదేవీలను సులభతరం చేసే ఫిన్టెక్లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని అందువల్ల తనను క్షమించమని తండ్రికి సందేశం పంపింది. వాస్తవానికి చూసిన ప్రతీ సంబంధం కుదరకపోవచ్చు గానీ ఇలా ఆమె ఆ వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ ఇచ్చిన తీరు ఆమెకు తన కెరీయర్ పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తోంది. ఈ మేరకు ఉదితా పాల్ తనకు తన తండ్రికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సంభాషణ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq — Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022 (చదవండి: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్లో బంధువులు) -
కరోనా మిగిల్చిన విషాదం...ఆ చిన్నారిని ఆదుకునేవారెవరు ?
విజయపుర (బెంగళూరు గ్రామీణ): మహమ్మారి కరోనా వైరస్ వల్ల వేలాది మంది మృత్యువాత పడగా, వారిపై ఆధారపడిన పిల్లలు, పెద్దలూ ఎందరో రోడ్డు పాలయ్యారు. విజయపుర పట్టణంలో సోనియా (12) అనే చిన్నారి పరిస్థితి కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు కరోనాతో మరణించగా, తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలం లేక పెద్దమ్మ వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తోంది. పట్టణంలోని చిక్కబళ్లాపుర రోడ్డులో ఉన్న చెరువు కట్ట వద్ద ఉంటూ ద్రాక్ష తోటలపై పక్షులు వాలకుండా పరిచే వలలను అల్లే పని చేస్తోంది. మొదటి వేవ్కు కన్నవారు బలి చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన అన్సార్ బాషా కొన్నేళ్ల క్రితం ఇదే వలలు అల్లే పని కోసం విజయపురకు వచ్చాడు. తనతో పనిచేసే కె.సరిత అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారి బిడ్డ సోనియా. కరోనా మొదటి వేవ్లో బాషా, సరితలు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బలయ్యారు. దాంతో చిన్నారి అనాథ అయ్యింది. పట్టణంలోనే పెద్దమ్మ వద్ద ఉంటూ ఆమెతో కూలీ పనులకు వెళ్తోంది. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చినప్పుడల్లా విలపిస్తుంది. తనకు కూడా చదువుకోవాలని ఉందని, ప్రభుత్వం కానీ, దాతలు కానీ సహాయం చేయాలని బాలిక వేడుకుంది. (చదవండి: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ ) -
లగ్జరీ కార్లే టార్గెట్! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు
బంజారాహిల్స్: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో 61 లగ్జరీ కార్లు చోరీ చేశాడు.... నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు... అయినా ప్రవర్తన మార్చుకోకుండా ఈ సారి హైదరాబాద్పై కన్నేసిన అతను రెండు నెలల్లో అయిదు లగ్జరీ కార్లు తస్కరించి నగర పోలీసులకు సవాల్గా మారాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు ఇటీవల ఈ సింగిల్ హ్యాండ్ కార్ల దొంగను పట్టుకోవడంతో గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ను బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడ జరిగిన ఓ కారు దొంగతనం కేసులో కస్టడీకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జనవరి 26న షెకావత్ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్హయాత్ హోటల్లో కన్నడ నిర్మాత మేఘనాథ్ ఫార్చునర్ కారును దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దుండిగల్పోలీ స్ స్టేషన్ పరిధిలో ఒకటి, నాచా రం పీఎస్ పరిధిలో ఒక కారు, పేట్బషీరాబాద్ పరిధిలో రెండు కార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరు గుతున్నాడు. ఏడాది వ్యవధిలోనే బెంగళూరు, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, తదితర ప్రధాన నగరాల్లో 21 లగ్జరీ కార్లను చోరీ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో హైదరాబాద్లో దొంగిలించిన అయిదు కార్లు కూడా ఉన్నాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన డివైస్ను ఉపయోగించి కారు డోర్లు తెరుస్తూ కేబుల్ కనెక్ట్ చేసి ఎంచక్కా వాటిలో దూసుకెళ్లేవాడు. దొంగిలించిన కార్లను తక్కువ ధరకు అమ్మేస్తూ జల్సా చేసేవాడు. పార్క్హయత్లో కారు దొంగతనం చేసేందుకు అతను విమానంలో వచ్చాడు. అలాగే పేట్బషీరాబాద్లో కార్ల చోరీ సమయంలోనూ విమానంలోనే వచ్చిన షెకావత్ లగ్జరీ కార్ కొట్టేసి అందులోనే పరారయ్యాడు. కార్లు దొంగిలించేందుకు కేవలం జేబులో ఓ డివైస్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి రయ్మంటూ వస్తాడు. కర్ణాటకలో 14, రాజస్థాన్లో 1, తమిళనాడులో 1, హైదరాబాద్లో అయిదు దొంగతనాలు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకు మొత్తం 61 కార్లు దొంగిలించి విక్రయించినట్లు తెలిపాడు. (చదవండి: రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత) -
భార్య చికెన్ ఫ్రై వండలేదని భర్త నిరాశ.. తట్టుకోలేక..
బెంగళూరు: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్య చికెన్ ఫ్రై వండలేదని ఆగ్రహంతో ఆమెను ఓ చెక్కతో బలంగా కొట్టగా తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో నివసిస్తున్న ముబారక్ పాషాకు భార్య షిరాను బాను, ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే) ఆగస్టు 18వ తేదీన చికెన్ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి ఎంతో ఆశగా చూస్తే ఇంట్లో చికెన్ ఫ్రై వండలేదు. దీంతో అతడు నిరాశకు గురయ్యాడు. ఈ సమయంలో భార్యతో గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన భర్త ఆమె తలపై ఓ చెక్కతో బలంగా బాదాడు. ఆ తర్వాత పాషా ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు. అయితే కొన్ని గంటలుగా ఆమె కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కదలికలపై నిఘా వేశారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసుల విచారణ తీవ్రమవడంతో చివరకు ఆగస్టు చివరకు సోమవారం (ఆగస్ట్ 23) నేరుగా పోలీస్స్టేషన్కు చేరుకుని లొంగిపోయాడు. తర్వాత జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. కొట్టిన దెబ్బతో తీవ్ర గాయాలపాలైన భార్య ఇంట్లోనే మృతి చెందింది. పిల్లలు రాత్రి నిద్రిస్తుండగా భార్య మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బయటకు వచ్చాడు. బైక్పై చిక్కబనవర సరస్సుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సరస్సులో మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్న్యూస్ -
శభాష్ వలంటీర్లు: రాష్ట్రాలను దాటి మరీ పింఛన్ల పంపిణీ
ఓడీ చెరువు/ మడకశిర రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి తీసుకువచ్చింది. లబ్ధిదారుల ఇంటికే నేరుగా పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పింఛన్దారులు ఇంట్లో ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండగా అక్కడికి వెళ్లి మరీ ఇస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ నగదు వారి చేయికి అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు పింఛన్ అందజేసి వలంటీర్ ప్రశంసలు అందుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గోవిందమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మూడు నెలల నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో పింఛన్ పొందలేకపోయింది. మంగళవారం వలంటీర్ సురేశ్బాబు సొంత ఖర్చులతో బెంగళూరు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని 3 నెలల పింఛన్ రూ.6,750 అందజేశాడు. మడకశిర మండలం వైబీహళ్లి సచివాలయం పరిధిలోని గ్రామ వలంటీర్ హనుమంతేగౌడ్ తెలంగాణకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేశారు. హైదరాబాద్లో ఉంటున్న దివ్యాంగురాలు లక్ష్మీదేవికి మంగళవారం మూడు నెలల పింఛన్ డబ్బు అందించారు. హైదరాబాద్లోని నేత్ర విద్యాలయం కళాశాలలో లక్ష్మీదేవి డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఆమె రెండు నెలల పింఛన్ తీసుకోలేదు. ఇది తెలుసుకున్న వలంటీర్ వెళ్లి పింఛన్ డబ్బు అందజేసినట్లు కార్యదర్శి పెద్దన్న తెలిపారు. -
బెంగళూరు గ్యాంగ్రేప్ కేసు: 12 మంది నిందితుల అరెస్టు
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతిని 12 మంది యువకులు సాముహిక అత్యాచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ ఏడాది మే నెలలో, అత్యాచార ఘటన జరిగిందని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. ఈ కేసును కేవలం ఐదు వారాల వ్యవధిలోనే పూర్తి చేసి, కోర్ట్లో చార్జ్షిట్ దాఖలు చేశామని ఈరోజు (గురువారం) ట్వీట్ చేశారు. అదే విధంగా, ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు, దీనిలో పాల్గోన్న అధికారులకు 1 లక్ష రూపాలయలను రివార్డుగా ప్రకటించారు. అయితే, నిందితులంతా బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్యాంగ్, బంగ్లాదేశ్కు చెందిన యువతిని, మూడేళ్ల క్రితం అక్రమంగా తీసుకోచ్చి అస్సాం, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటకలో తిప్పుతూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిమధ్య డబ్బుల విషయంలో గొడవ రావడంతో, మిగతావార ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. వీరంతా ఒకే గ్రూప్కు చెందినవారుగా భావిస్తున్నారు. అయితే, 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్లో ఇద్దరు యువతులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడ్డారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. -
మృత్యు ప్రకోపం: ఒక్కరోజే 530 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కిల్లర్ కరోనా కేసులు బాగా అదుపులోకి వచ్చాయి. ఈ నెల 10 నుంచి మొదలైన లాక్డౌన్ ఇందుకు దోహదం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 26,811 మంది కరోనా బారిన పడ్డారు. అంతకుమించి 40,741 మంది కోలుకున్నారు. అయితే మృత్యు ప్రకోపం కొనసాగుతోంది. మరో 530 మంది విగతజీవులయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,99,784కు పెరిగింది. అందులో 20,62,910 మంది కోలుకున్నారు. ప్రాణనష్టం 26,929కి ఎగబాకింది. ప్రస్తుతం 4,09,924 మంది చికిత్స పొందుతున్నారు. బెంగళూరులో 6,433 కేసులు.. సిలికాన్ సిటీలో కరోనా తీవ్రత బాగా తగ్గింది. కొత్తగా 6,433 కేసులు, 18,342 డిశ్చార్జిలు, 285 మరణాలు సంభవించాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,37,929కు పెరిగింది. అందులో 9,18,423 మంది కోలుకున్నారు. 12,148 మంది మృతిచెందారు. ఇంకా 2,07,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1.27 లక్షల మందికి టీకా.. 1,27,317 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. మొత్తం టీకాలు 1.25 కోట్లను దాటాయి. మరో 1,37,584 కరోనా పరీక్షించగా మొత్తం టెస్టులు 2,90,61,302 కు పెరిగాయి. -
దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్’ రైలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. మహిళా పైలెట్లే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్ టాటానగర్ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బెంగళూరు చేరుకుందని తెలిపారు. -
కొత్త ట్విస్ట్: ‘ఆ పని ఆయనే చేయమన్నాడు..’
బెంగళూరు: రాసలీలల కేసులో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ఉన్న బాధిత యువతి సంచలన ఆరోపణలు చేసింది. ‘ఆ పని ఆయన ఒత్తిడి వల్లనే చేశాను’ అని బాధిత యువతి ఆరోపించారు. దీంతో కర్నాటకలో కలకలం రేపింది. ఆమె ఆరోపణలు చేసింది ఎవరిపైనే కాదు ట్రబుల్ షూటర్గా పేరొందిన కాంగ్రెస్ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్పై. ఆయన ఒత్తిడి మేరకు తమ కుమార్తె ఆ పని చేసిందని సోమవారం ఆ యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. రమేశ్ జర్కిహోలీని ఇరికించేందుకు శివకుమార్ కథ అంతా నడిపించాడని బాధిత యువతితో పాటు ఆమె ఇద్దరు సోదరులు, కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. అలా చేస్తే కొంత ముట్టజెప్తామని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ ఆరోపణలతో బీజేపీ కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడింది. డీకే శివకుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలు వచ్చిన తెల్లారి మంగళవారం డీకే శివకుమార్ స్పందించారు. ‘నేరం చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి వెనుక ప్రభుత్వం ఉందనే విషయం అందరికీ తెలసు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు’ అని శివకుమార్ మండిపడ్డారు. ‘ఈ పరిణామం జరిగినప్పటి నుంచి మీరు చూస్తునే ఉన్నారు. ప్రభుత్వం నిందితుడికి అండగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా. ఆ కేసుతో నాకేం సంబంధం లేదు. చూద్దాం. విచారణ జరుగుతోంది కదా!’ అని శివకుమార్ పేర్కొన్నారు. ‘నేను వారిపై ఒత్తిడి చేశా అంటున్నారు దానికి సాక్ష్యాలు బహిర్గతం చేయండి’ అని సవాల్ విసిరారు. -
రేషన్ కార్డులపై మంత్రి యూటర్న్
బెంగళూరు: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం, ఐదెకరాల భూమి ఉంటే రేషన్ కట్ చేస్తామని చేసిన ప్రకటనపై కర్ణాటక ఆహార, పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వెనక్కు తగ్గారు. విలాస వస్తువులుంటే రేషన్ కార్డులు వదులుకోవాలని చేసిన ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. రేషన్ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. టీవీ, ఫ్రిజ్, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్న రేషన్ కార్డుదారులు తమ కార్డులు వదులుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉమేశ్ కత్తి హెచ్చరించడంతో కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మరుసటి రోజే ఆ మంత్రి యూటర్న్ తీసుకున్నారు. ‘ఢిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నా’ అని మంగళవారం మంత్రి ఉమేశ్ వివరణ ఇచ్చారు. టీవీ, ఫ్రిజ్లాంటి పరిమితులపై తాను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని మంత్రి ఉమేశ్ తెలిపారు. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు రాగి, మొక్కజొన్న, బియ్యం వంటి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్కార్డు కట్! -
ఫిబ్రవరి 14: లవర్స్కు శ్రీరామ్ సేన హెచ్చరిక
బెంగళూరు: వాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజు అని ఫిబ్రవరి 14వ తేదీన యువత ఒక ఉత్సవం మాదిరి చేసుకుంటుంది. ఏడాది పొడవునా యువతీయువకులకు అనడం బదులు ప్రేమికులకు ఉండే ఒకే ఒకరోజు. ఈరోజు జీవితంలో మరచిపోని విధంగా చేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వారికి హిందూ సంఘాలు అడ్డంకిగా మారడం సహజం. సహజంగానే ఈసారి కూడా హిందూత్వ సంఘాలు ప్రేమికులకు హెచ్చరిక జారీ చేశాయి. లవర్స్ డే పాశ్చాత్య సంస్కృతి అని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డేని ‘మాతా పిత పూజా దినోత్సవం’గా తాము పాటిస్తామని ప్రకటించారు. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ పేరిట కర్ణాటకలో వివిధ చోట్ల జరిగే అసభ్య కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికోసం తమ వలంటీర్లను నియమిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది తాము రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజును మాతా పిత దినోత్సవంగా నిర్వహిస్తాం.. తల్లిదండ్రులను గౌరవించే రోజుగా పరిగణిస్తామని వివరించారు. కర్ణాటకలో 60 నుంచి 70 చోట్ల ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రమోద్ వెల్లడించారు. ఫిబ్రవరి 14వ తేదీ రోజు పబ్లు, బార్లు , ఐస్క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటివాటిపై తమ సభ్యుల నిఘా ఉంటుందని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. అయితే అసభ్యకర కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. 2009లో బెంగళూరులో శ్రీరామ్ సేన ప్రతినిధుల వైఖరి తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు మంగుళూరులోని ఓ పబ్ లోడ్యాన్స్లు చేస్తున్న యువతీయువకులపై దాడికి పాల్పడ్డారు. 2018లో కూడా ఈ విధమైన ఘటన చోటుచేసుకోగా దానికి కారకుడిగా పేర్కొంటూ ప్రమోద్ ముతాలిక్ను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా పోలీసులకు తాము సహకరిస్తామని శ్రీరామ్ సేన ప్రకటించింది. -
చెన్నై చేరుకున్న చిన్నమ్మ
చెన్నై: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని ఎంజీఆర్ నివాసానికి చేరుకుని జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు తన అనుచరులతో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించారు. కర్నాటక రాజధాని బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించి జనవరి 27న విడుదల అయ్యారు. అయితే ఆమె ఇటీవల కరోనా బారినపడడంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తీసుకున్న అనంతరం క్వారంటైన్ కాలం పూర్తి చేసుకుని సోమవారం బెంగళూరు నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శశికళకు పెద్ద ఎత్తున అభిమానులు, ఆమె అనుచరులు భారీ స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కాన్వాయ్లు బారులు తీరాయి. వేలాది మంది అభిమానులు ఆమె వెంట ఉన్నారు. అయితే శశికళ జైలు నుంచి విడుదల కాకముందే అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కేసు వేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఇంకా తన పార్టీగా పేర్కొంటూ శశికళ రెండాకుల పార్టీ పతాకాన్ని ఆమె తన వాహనానికి వినియోగించుకున్నారు. తాజాగా తమిళనాడుకు చేరుకున్న సమయంలో కూడా అదే గుర్తు ఉన్న జెండాలు కనిపించాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాలతో శశికళ బిజీ కానున్నారు. దీంతో తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే శశికళ రాకపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. జయలలిత సమాధి, స్మారక మందిరం మూసివేయగా.. శశికళ పోస్టర్లు అతికించవద్దని నిషేదాజ్ఞలు విధించింది. దీంతోపాటు రెండాకుల గుర్తు వాడకంపై ఇప్పటికే అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 కేసులు నమోదు చేయించిన విషయం తెలిసిందే. -
సీఎం కుర్చీ నుంచి నన్నెవరూ దింపలేరు
బెంగళూరు: తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. సీఎం మార్పుపై కర్నాటకలో సాగుతున్న ప్రచారంపై శనివారం యడియూరప్ప స్పందించారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత ఏప్రిల్ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల ప్రకటన చేశాడు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు తనపై విశ్వాసం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప సవాళ్లతో సహవాసం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది. -
ర్యాంప్ వాక్ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి
సాక్షి, బెంగళూరు : ర్యాంప్ వాక్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరాని చెందిన షాలిని(21) ఓ ప్రముఖ కాలేజీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తమ కాలేజీలో నిర్వహించనున్న ఫ్రెషర్ డే కోసం స్నేహితులతో కలిసి ర్యాంప్ వాక్ ప్రాక్టీసు చేస్తోంది. శనివారం కాలేజీలో నిర్వహించిన ర్యాంప్ వాక్లో పాల్గొన్న షాలిని ర్యాంప్ మీదనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అయితే అంత చిన్నవయస్సులో గుండెపోటు అంటే నమ్మశక్యంగా లేదని ఆమె కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాలిని మృత దేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. -
కుక్కల దెబ్బకు చిరుత పరార్
సాక్షి, బెంగళూరు : ఎక్కడైనా చిరుతపులిని చూసి కుక్కలు, మనుషులు పరుగులు తీస్తారు. అయితే కుక్కలే చిరుతను తరిమిన ఘటన బెంగళూరులో జరిగింది. మాగడి రోడ్డులోని తావరెకెరె వద్ద కవితా అనే మహిళకు చెందిన ద్వారక ఫామ్ ఉంది. అక్కడ రక్షణ కోసం ఆమె కుక్కలను పోషిస్తున్నారు. ఫామ్లోకి మంగళవారం రాత్రి కుక్కలను వేటాడటానికి చిరుతపులి ఎక్కడి నుంచో చొరబడింది. దీనిని గమనించిన కుక్కలు జోరుగా అరిచి చిరుతను తరిమేశాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అదే చిరుత మళ్లీ నెలరోజుల క్రితం ఇదే తోటలోకి వచ్చిన చిరుత ముధోల్ జాతికి చెందిన కుక్కను కరిచి వెళ్లింది. దీనితో జాగ్రత్త పడిన కవిత రక్షణ కోసం ఆరు కుక్కలను ఫాంహౌస్లో ఉంచారు. అదే చిరుత మంగళవారం అర్ధరాత్రి సమయంలో చొరబడి వరండా అంత తిరిగింది. కుక్కలు ఉంటున్న గది వద్దకు వెళ్లింది. చిరుతను చూసిన కుక్కలు జోరుగా అరుస్తూ చిరుత వెంట పడ్డాయి. చిరుత కుక్కల బారినుండి తప్పించుకొని పారిపోయిందని కవిత తెలిపారు. చుట్టుపక్కల ఉన్న అడవులు, సావనదుర్గ నుండి చిరుత వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతలను తరిమేయాలని అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదని కవిత తెలిపారు. -
ట్రాఫిక్ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు
బెంగళూరు : కొత్త మోటారు వాహన సవరణ చట్టంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చినప్పటి నుంచి వాహనాలను రోడ్డు మీదకు తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే మిగతా దేశంతో పోల్చితే రెండు రోజులు ఆలస్యంగా ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిన కర్ణాటక రాష్ట్రం జరిమానాలలో మాత్రం దూసుకుపోతోంది. ఒక్క బెంగళూరులోనే కేవలం ఒక్క వారానికి రూ.72,49,900 వసూలు చేసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఔరా అనిపించారు. మొత్తం 6,813 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను రిజిస్టర్ చేసి వాహనదారుల వద్ద నుంచి అంత మొత్తాన్ని రాబట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ఉండటం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వన్వే రూట్లో రావడం తదితరాల నుంచి జరిమానాలు ఎక్కువగా వసూలు అయ్యాయి. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి నుంచి ట్రాఫిక్ పోలీసులు కఠినంగా జరిమానా విధించడం పట్ల పాదచారులు, ప్రజా రవాణా వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. ఈ భారీ జరిమానాలు మార్పును తెస్తాయని బస్సులో ప్రయాణించే ఓ ప్రయాణికుడు హర్షం వ్యక్తం చేయగా.. ఈ జరిమానాలు ఎక్కువగా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని మరో వ్యక్తి వాపోయాడు. ‘ప్రభుత్వం లైసెన్సులను సక్రమంగా జారీ చేయదు, అలాగే ట్రాఫిక్ పోలీసులు మేం చెప్పేది వినడానికి ఇష్టపడరు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చదవండి : ట్రక్ డ్రైవర్కు భారీ జరిమానా.. తొలి వ్యక్తిగా రికార్డ్ -
పరిటాల అనుచరుల రౌడీరాజ్యం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే సయ్యద్ పాషాను పరిటాల వర్గం కిడ్నాప్ చేసి, మంత్రి స్వగ్రామమైన వెంకటాపురానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించి, బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 30 లక్షలు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. దీంతో సయ్యద్ పాషా కర్ణాటకలోని బాగేపల్లిలో పోలీసులును అశ్రయించాడు. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు భాస్కర్ నాయుడు సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు ఈ కేసును అనంతపురం ఫోర్త్ టౌన్ పీఎస్కు బదిలీ చేశారు. పరిటాల వర్గీయులు ఆగడాలు పెచ్చుమీరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిటాల వర్గీయుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. -
పరిటాల అనుచరుల దౌర్జన్యం..
-
రూ. 1000 కోట్ల విలువైన భూమి స్వాధీనం
బొమ్మనహళ్లి : నకిలీ దాఖలాలను సృష్టించి రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి యత్నిస్తున్న వారిపై దాడులు జరిపి సదరు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ శంకర్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని కెంగేరీ పరిధిలో ఉన్న మాళిగొండనహళ్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి తార్ ప్లాంటేషన్ ఇండస్ట్రీ పేరుతో సంస్థకు 55 ఎకరాల భూమిని మంజూరు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రెవెన్యూ అధికారులకు అక్కడికి చేరుకుని రెండు జేసీబీ యంత్రాలు, నాలుగు టిప్పర్లు, సంస్థకు చెందిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కరోజే రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉద్యోగాలకు 25మంది ఎంపిక
కడప కోటిరెడ్డి సర్కిల్ : మెడ్ప్లస్ కంపెనీలో ఫార్మశిస్ట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలకు 25 మంది ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.వెంకటరమణ తెలిపారు. శనివారం జరిగిన ఇంటర్వ్యూలకు మొత్తం 85 శాతం హాజరయ్యారన్నారు. ఎంపికైన అభ్యర్థులు 24వ తేదీన బెంగుళూరులో రిపోర్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ హెచ్ఆర్ శ్రావణ్కుమార్, జే ఈవో దోనప్ప, గంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.