chateswar pujara
-
రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రపై గుజరాత్ ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర ప్లేయర్లు రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో చిరాగ్ జానీ (69), రెండో ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (54) మాత్రమే అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్లో 2 పరుగులకే ఔటయ్యాడు.కలిసికట్టుగా రాణించిన గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 216 పరుగులకే ఆలౌటైంది. చింతన్ గజా 4, జయ్మీత్ పటేల్, సిద్దార్థ్ దేశాయ్ తలో 2, నగస్వల్లా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జానీ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. హార్విక్ దేశాయ్ (22), పుజారా, షెల్డన్ జాక్సన్ (14), వసవద (39 నాటౌట్), ధర్మేంద్ర జడేజా (22), ఉనద్కత్ (14) రెండంకెల స్కోర్లు చేశారు.జయ్మీత్, ఉర్విల్ సెంచరీలుఅనంతరం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జయ్మీత్ పటేల్ (103), ఉర్విల్ పటేల్ (140) సెంచరీలతో కదంతొక్కగా.. మనన్ హింగ్రజియా (81) భారీ అర్ద సెంచరీతో రాణించాడు. వీరికి తోడు రవి బిష్ణోయ్ (45), చింతన్ గజా (39), విశాల్ జేస్వాల్ (28), ప్రియాంక్ పంచల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ 4, జయదేశ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు.295 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. ఈ ఇన్నింగ్స్లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. గుజరాత్ బౌలర్లు పి జడేజా (4 వికెట్లు), నగస్వల్లా (3), బిష్ణోయ్ (2), చింతన్ గజా (1) ధాటికి రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా గుజరాత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (54) టాప్ స్కోరర్గా నిలిచాడు. చిరాగ్ జానీ (26), షెల్డన్ జాక్సన్ (27), వసవద (11), డి జడేజా (19), ఉనద్కత్ (29) రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్లో ముంబై, హర్యానా.. విదర్భ, తమిళనాడు.. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. ఈ మ్యాచ్ల్లో రేపు ఫలితం తేలే అవకాశం ఉంది. -
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్తో సిరీస్లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ ప్రస్తుత సీజన్లో ససెక్స్ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్గా 65వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్షిన్ డివిజన్-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.పుజారాతో పాటు కెప్టెన్ జాన్ సింప్సన్ (167) శతక్కొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్లో టామ్ హెయిన్స్ (40), డానీ లాంబ్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్సెక్స్ బౌలర్లలో బాంబర్ 3, బ్రూక్స్, హోల్మన్ తలో 2, ర్యాన్ హిగ్గిన్స్, నాథన్ ఫెర్నాండెజ్ చెరో వికెట్ పడగొట్టారు. PUJARA SMASHED HIS 65th FIRST-CLASS HUNDRED 🤯 💥- An all time legend, Puj. pic.twitter.com/dXSbmUDvJb— Johns. (@CricCrazyJohns) May 25, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిడిల్సెక్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సామ్ రాబ్సన్ (40), మ్యాక్స్ హోల్డన్ (18) క్రీజ్లో ఉండగా.. మార్క్ స్టోన్మన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్సెక్స్ ససెక్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది. -
పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్న పుజారా.. మరో శతకం
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో సౌరాష్ట్ర ఆటగాడు, భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు (8 ఇన్నింగ్స్ల్లో 76.86 సగటున 522 పరుగులు) చేసిన పుజారా తాజాగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో మరో సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో పుజారా 199 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 62వ శతకం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (33/2) బరిలోకి దిగిన పుజారా.. షెల్డన్ జాక్సన్తో (70 నాటౌట్) కలిసి నాలుగో వికెట్కు భారీ భాగస్వామ్యం (150కి పైగా) నమోదు చేశాడు. తొలి రోజు ఆటలో 80 ఓవర్ల తర్వాత సౌరాష్ట్ర స్కోర్ 224/3గా ఉంది. పుజారా, షెల్డన్ జాక్సన్ క్రీజ్లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, మానవ్ సుతార్, అజయ్ కుక్నా తలో వికెట్ పడగొట్టారు. కాగా, పుజారా రంజీల్లో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే మిగతా మూడు టెస్ట్లకు భారత జట్టును ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో పుజారా మరో శతక్కొట్టి సెలక్టర్లను ఆకర్శించాడు. ఇప్పటికే కోహ్లి సేవలు దూరం కావడంతో సెలెక్టర్లు పుజారాను తప్పక ఎంపిక చేయవచ్చు. మరోవైపు మరో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడ్డాడని తెలుస్తుంది. ఒకవేళ కోహ్లి మిగతా సిరీస్కు అందుబాటులోకి వచ్చినా శ్రేయస్ స్థానంలో అయినా పుజారా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్తో మూడో టెస్ట్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు.. సునీల్ గవాస్కర్- 81 సచిన్ టెండూల్కర్- 81 రాహుల్ ద్రవిడ్- 68 చతేశ్వర్ పుజారా- 62 -
అరుదైన మైలురాయిని చేరుకున్న పుజారా
నయా వాల్గా పేరుగాంచిన టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టెస్ట్లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్లు ఆడిన పుజారా.. 61 శతకాలు, 77 అర్ధశతకాల సాయంతో 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. పుజారాకు ముందు సునీల్ గవాస్కర్ (25834), సచిన్ టెండూల్కర్ (25396), రాహుల్ ద్రవిడ్ (23794) మాత్రమే భారత్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో 20000 పరుగుల మార్కును తాకారు. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హాబ్స్ పేరిట ఉంది. హాబ్స్ 1905-34 మధ్యలో 61760 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 43 పరుగులు చేసిన పుజారా రెండో ఇన్నింగ్స్లో 66 పరుగులు చేసి వ్యక్తిగత మైలురాయిని దాటడంతో పాటు తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్లో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్లో విదర్భ గెలవాలంటే ఇంకా 298 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (4/56), హర్ష్ దూబే (2/15), సర్వటే (2/22), ఆధిత్య థాక్రే (1/51), యశ్ ఠాకూర్ (1/57) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (68) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన విదర్భను చిరాగ్ జానీ (4/14), ఉనద్కత్ (2/46), ప్రేరక్ మన్కడ్ (2/5), ఆదిత్య జడేజా (1/12) చావుదెబ్బ కొట్టారు. వీరి ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. పుజారాతో పాటు కెవిన్ జివ్రజనీ (57), విశ్వరాజ్ జడేజా (79) రాణించడంతో 244 పరుగులు చేసి ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్, ఆదిత్య తారే చెరో 3 వికెట్లు, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2 వికెట్లు తీశారు. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విదర్భ మూడో రోజు రెండో సెషన్ సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో 75 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అథర్వ తైడే (42), హర్ష్ దూబే (0) క్రీజ్లో ఉన్నారు. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో 2 వికెట్లు, ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు. -
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. వారి కెరీర్లు ముగిసినట్లేనా..?
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. టెస్ట్ జట్టులో వారికి తిరిగి స్థానం కల్పించారు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన భారత జట్టు ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ జట్టులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల పేర్లు కనిపించకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నయా వాల్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో లేకపోవడంతో వీరి కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడంతో సెలెక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. వీరిద్దరికి వయసు (35) కూడా సమస్యగా మారింది. వీరికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆటగాళ్లు మాంచి ఊపులో ఉండటం కూడా మైనస్ పాయింట్ అయ్యుండవచ్చు. ఇప్పటికిప్పటికీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పుజారా, రహానేలకు ప్రత్యామ్నాయాలు అని చెప్పలేనప్పటికీ.. భవిష్యత్తు మాత్రం వీరిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుజారా, రహానేలను దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపిక చేయకపోవడంతో వారి కెరీర్లు ఖతమైనట్లేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. దక్షిణాఫ్రికా సిరీస్లో శ్రేయస్, రాహుల్ విఫలమైతే తప్ప పుజారా, రహానేలు తిరిగి టెస్ట్ జట్టులోకి రాలేరన్నది కాదనలేని సత్యం. -
పుజారాపై సస్పెన్షన్ వేటు
భారత టెస్ట్ ఆటగాడు, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం జట్టు కెప్టెన్ అయిన పుజారాపై పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్షిప్ అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్లో ఓ జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్లో ససెక్స్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది. టోర్నీ తొలి లెగ్లో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో మరో రెండు పెనాల్టీలను పొంది, మొత్తంగా 12 డీమెరిట్ పాయింట్లను పొందింది. పుజారాపై సస్పెన్షన్ను ససెక్స్ అధికారులు ఎలాంటి వాదనలు లేకుండా స్వీకరించారు. ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ససెక్స్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో కెప్టెన్ పుజారా బాధ్యుడయ్యాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్ హెయిన్స్, జాక్ కార్సన్లపై ససెక్స్ అధికారులు తదుపరి మ్యాచ్కు వేటు వేశారు. విచారణ అనంతరం కార్వెలాస్పై కూడా చర్యలు ఉంటాయని వారు తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్షిప్లో ససెక్స్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కౌంటీ డివిజన్ 2 పోటీల్లో భాగంగా ససెక్స్ సెప్టెంబర్ 19-22 వరకు డెర్బీషైర్తో తలపడాల్సి ఉంది. అనంతరం సెప్టెంబర్ 26న గ్లోసెస్టర్షైర్ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లతో ప్రస్తుత సీజన్ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డర్హమ్ లీడింగ్లో ఉంది. ఆ జట్టు 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్లో ససెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్షైర్ ఇన్నింగ్స్లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్లో. మరోవైపు ఇంగ్లండ్లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్షైర్తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్తో జరిగిన తన రెండో మ్యాచ్లోనూ తక్కువ స్కోర్కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్తో మ్యాచ్లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్ను అందించాడు. ఈ ఇన్నింగ్స్లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఉండటం లేదు. బీసీసీఐ లోకల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ (వెస్ట్ జోన్), చతేశ్వర్ పుజారా (వెస్ట్ జోన్) లాంటి అంతర్జాతీయ స్టార్లు, రింకూ సింగ్ (సెంట్రల్ జోన్), తిలక్ వర్మ (సౌత్ జోన్), సాయి సుదర్శన్ (సౌత్) లాంటి ఐపీఎల్ స్టార్లు ఉండటంతో ఈ మ్యాచ్లపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్ (వెస్ట్) దులీప్ ట్రోఫీ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలువనున్నాడు. కాగా, దులీప్ ట్రోఫీలో ఇవాళ సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ KSCA క్రికెట్ గ్రౌండ్లో, ఆలుర్ (కర్ణాటక), రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి. ఈస్ట్ జోన్తో మ్యాచ్లో సెంట్రల్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్తో మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. -
ఇద్దరు అంతే వెలగబెట్టారు.. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై ఎందుకో..?
వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో నయా వాల్ పుజారా పేరు గల్లంతు కావడంపై అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారితో కొందరు టీమిండియా మాజీలు, విశ్లేషకులు గొంతు కలుపుతున్నారు. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై మాత్రం ఎందుకోనని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఒకేలా చెత్త ప్రదర్శనలు చేసినప్పడు కోహ్లిపై సెలెక్టర్లకు ప్రత్యేక ప్రేమ ఎందుకోనని నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా రుజువు చేస్తూ సెలెక్టర్ల తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 2020 నుంచి పుజారా 28 టెస్ట్లు ఆడి 29.69 సగటున పరుగులు చేస్తే, కోహ్లి సైతం అదే యావరేజ్తో (25 మ్యాచ్ల్లో) పరుగులు చేశాడని, ఇద్దరూ ఒకేలా వెలగబెట్టినప్పుడు కోహ్లిపై మాత్రమే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. పుజారాతో పాటు కోహ్లిని కూడా తప్పిస్తే అతనికీ తెలుసొచ్చేది, అలాగే మిడిలార్డర్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లూ ఉండేదని అంటున్నారు. పుజారా, కోహ్లిలను పక్కకు పెడితే 2020 నుంచి టెస్ట్ల్లో గిల్ (16 మ్యాచ్ల్లో 32.89 సగటు), రహానే (20 మ్యాచ్ల్లో 26.50)లు కూడా అడపాదడపా ప్రదర్శనలే చేశారని, వీరితో పోలిస్తే రోహిత్ శర్మ (18 మ్యాచ్ల్లో 43.2) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడని గణాంకాలతో సహా సోషల్మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. అందరూ ఓపెనర్లే.. మిడిలార్డర్లో ఎవరు..? వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టుపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్ డౌన్ ఆటగాడు పుజారాను పక్కకు పెట్టారు సరే.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ జట్టుకు కొత్తగా ఎంపికైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు ఓపెనర్ బ్యాటర్లేనని, అలాంటప్పుడు పుజారా స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరని నిలదీస్తున్నారు. జట్టులో ఆల్రెడీ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఓపెనర్లుగా ఉన్నప్పుడు కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్ను తీసుకుని ఉంటే జట్టు సమతూకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు తీసుకోలేదు..? ఓ మిడిలార్డర్ బ్యాటర్పై (పుజారా) వేటు వేసినప్పుడు అతని స్థానాన్ని మరో మిడిలార్డర్ ఆటగాడితోనే భర్తీ చేయాలన్న లాజిక్ను సెలెక్టర్లు ఎలా మిస్ అయ్యారని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో అందరూ ఓపెనర్లనే ఎంపిక చేయకపోతే, దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడిని తీసుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. -
WTC Final 2023: కోహ్లి కాదు.. ఓవల్లో రోహిత్ శర్మనే కింగ్..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్యలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. జట్ల బలాబలాలు, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న విషయాలు పక్కన పెడితే.. ఓవల్ మైదానంలో ఇరు జట్ల ట్రాక్ రికార్డు ఏమంత బాగోలేదు. ఈ వేదికపై ఆసీస్ ఆడిన 38 మ్యాచ్ల్లో ఏడింటిలో విజయం సాధించగా.. భారత జట్టు ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే గెలుపొందింది. కోహ్లి, పుజారా, రహానేల చెత్త రికార్డు.. ఓవల్లో హిట్మ్యానే కింగ్ ఓవల్లో భారత ఆటగాళ్లు కోహ్లి, రహానే, పుజారాలకు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లి ఆడిన 3 మ్యాచ్ల్లో 28.16 సగటున కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా ఓవల్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 19.50 సగటున 117 పరుగులు చేశాడు. రహానే ఇక్కడ ఆడిన 3 మ్యాచ్ల్లో 9.16 సగటున 55 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాకు అత్యంత కీలకమైన ముగ్గురు ఆటగాళ్లకు ఓవల్లో మెరుగైన రికార్డు లేకపోవడం ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు ఇక్కడ మెరుగైన రికార్డు ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రోహిత్ శర్మ ఓవల్ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 127 పరుగులు చేశాడు. 2021 పర్యటనలో హిట్మ్యాన్ సెంచరీ చేశాడు. జడేజా ఇక్కడ 2 మ్యాచ్ల్లో 42 సగటున 126 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టును కూడా పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఇరు జట్ల సభ్యుల్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు ఓవల్లో మెరుగైన రికార్డు ఉంది. స్టీవ్ స్మిత్ ఇక్కడ రెండు శతకాలు బాదాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్ల్లో 2 సెంచరీలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు భారత టెస్ట్ జట్టు సభ్యుడు, నయా వాల్ చతేశ్వర్ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న పుజారా.. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు బాది ఆసీస్ బౌలర్లు తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్లోసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా తొలి ఇన్నింగ్స్లో 238 పరుగులు ఎదుర్కొని 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. అంతకుముందు డర్హమ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లోనూ (115) పుజారా సెంచరీతో కదంతొక్కాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2, 2023లో ప్రస్తుతం పుజారా లీడింగ్ రన్ స్కోరర్గా (5 ఇన్నింగ్స్ల్లో 332) కొనసాగుతున్నాడు. తాజా శతకంతో పుజారా ఓ మైలురాయిని అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి (58 సెంచరీలు) ఎగబాకాడు. ఈ క్రమంలో అతను వసీం జాఫర్ (57)ను ఓవర్టేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ చెరి 81 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆతర్వాత రాహుల్ ద్రవిడ్ 68 సెంచరీలతో రెండో ప్లేస్లో.. విజయ్ హజారే మూడో స్థానంలో నిలిచారు. కాగా, లండన్లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పుజారా కీలక సభ్యుడు. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు (24 మ్యాచ్ల్లో 50.82 సగటున 203 పరుగులు) కలిగిన పుజారా.. ఇదివరకే తాను చాలాసార్లు సత్తా చాటిన ఓవల్ మైదానంలో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ససెక్స్ తొలి ఇన్నింగ్స్- 455/5 డిక్లేర్ గ్లోసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్-198/9 (మూడో రోజు ఆట ముగిసే సమయానికి) -
కెప్టెన్గా చతేశ్వర్ పుజారా
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా కెప్టెన్ అయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2లో అతను ససెక్స్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో ససెక్స్కు సారథ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది.. లెట్స్ గో అంటూ ట్వీట్కు క్యాప్షన్ జోడించాడు. Thrilled to lead @sussexccc in the County Championship! Let's go 💪🏻 pic.twitter.com/iW4Ihstk1p — Cheteshwar Pujara (@cheteshwar1) April 5, 2023 ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ గత సీజన్ సందర్భంగా గాయపడటంతో ఆ జట్టు మేనేజ్మెంట్ నాటి నుంచి పుజారాను తాత్కాలిక కెప్టెన్గా కొనసాగిస్తుంది. కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2 సీజన్లో భాగంగా ససెక్స్ ప్రస్థానం ఇవాల్టి (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతోంది. ససెక్స్.. ఇవాళ డర్హమ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా, ఇంగ్లండ్ ఫస్ట్క్లాస్ టోర్నీల్లో పుజారాకు ఇది వరుసగా రెండో సీజన్. 2022లో అతను ససెక్స్ తరఫున 13 ఇన్నింగ్స్ల్లో 109.40 సగటున 1094 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పుజారా గతేడాది రాయల్ లండన్ వన్డే కప్లో కూడా ఆడాడు. అందులోనూ నయా వాల్ సత్తా చాటాడు. పుజారా చివరిసారిగా టీమిండియా తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఈ సిరీస్లో అతను 6 ఇన్నింగ్స్ల్లో 28 సగటున కేవలం 140 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇదే సిరీస్లోనే పుజారా తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
IND VS AUS 4th Test Day 4: సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజైన రేపు (మార్యి 13) భారత బౌలర్లు ఆసీస్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసి, ఆ తర్వాత నిర్ధేశించబడిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలిగితే సిరీస్తో (3-1) పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు కూడా భారత్ వశమవుతుంది. నాలుగో రోజు చివర్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాల కారణంగా, ఆసీస్పై ఇవాల్టి నుంచే పట్టుబిగించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఆ జట్టు తాత్కాలిక ఓపెనర్ మాథ్యూ కుహ్నేమన్ (0) ఇచ్చిన క్యాచ్లను తొలుత కేఎస్ భరత్, ఆతర్వాత పుజారా జారవిడిచారు. ఒకవేళ ఈ రెండు అవకాశాల్లో భారత్కు ఒక్క వికెట్ లభించినా ఆసీస్ను పూర్తిగా ఒత్తిడిలోని నెట్టే అవకాశం ఉండేది. అందులోనే ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఈ సమీకరణలన్నీ భారత్కు కలిసొచ్చి ఉండేవి. భరత్, పుజారాలు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఉండినా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్కు గెలుపుపై ధీమా పెరిగేది. ఇప్పటికైన మించిపోయిందేమీ లేదు. ఆఖరి రోజు తొలి బంతిని నుంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి తేగలిగితే, టీమిండియా గెలుపుకు ఢోకా ఉండదు. ఆసీస్ను 150 పరుగుల లోపు ఆలౌట్ చేసి, ఆతర్వాత 60, 70 పరుగుల టార్గెట్ను ఛేదించడం టీమిండియాకు అంత కష్టం కాకపోవచ్చు. అయితే ఇదంతా సాధ్యపడాలంటే భారత స్పిన్నర్లు రేపు తొలి బంతి నుంచే చెలరేగాల్సి ఉంటుంది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇది అంత ఈజీ కూడా కాకపోవచ్చు. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కోహ్లి (186)తో పాటు శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
వందో టెస్ట్కు ముందు మనసులో మాట బయటపెట్టిన పుజారా
BGT 2023: కెరీర్లో వందో టెస్ట్ ఆడే ముందు టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా తన మనసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్కు ముందు పుజారా చాలా విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. 13 ఏళ్ల తన కెరీర్లో అనుభవాలను వివరిస్తూ వచ్చిన నయా వాల్.. తన అత్యుత్తమమైన ప్రదర్శనలు, ధీటైన ప్రత్యర్ధి, కఠినమైన బౌలర్, తన చిరకాల కోరిక.. ఇలా చాలా విషయాలను పంచుకున్నాడు. టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడమే తన కల అని మనసులో మాటను బయటపెట్టిన పుజారా.. ధీటైన ముగ్గురు ప్రత్యర్ధుల్లో మొదటిది ఆసీస్, రెండో జట్టు ఇంగ్లండ్, మూడో టీమ్ న్యూజిలాండ్ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో జిమ్మీ ఆండర్సన్ పేరును తొలుత ప్రస్తావించిన పుజారా.. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, పాట్ కమిన్స్ల పేర్ల చెప్పాడు. తన అత్యుత్తమ ప్రదర్శన గురించి పుజారా మాట్లాడుతూ.. అరంగేట్రంలో ఆసీస్పై చేసిన 72 పరుగులకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. ఆతర్వాత చెన్నైలో ఆసీస్పై చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్కు, ఆతర్వాత జొహన్నెస్బర్గ్లో సౌతాఫ్రికాపై చేసిన 123 పరుగుల ఇన్నింగ్స్కు, అలాగే గత ఆసీస్ పర్యటనలో గబ్బా టెస్ట్లో ఆడిన ఇన్నింగ్స్లు అత్యుత్తమమైనవిగా చెప్పుకొచ్చాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్లో వందో టెస్ట్ కానున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్తో రెండో టెస్ట్లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్లో చేరే 13వ భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. -
అరుదైన క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్న పుజారా.. కోహ్లి తర్వాత..!
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా అరుదైన క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్తో రెండో టెస్ట్లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్లో చేరే 13వ భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అంత ఆశాజనకంగా సాగని పుజారా కెరీర్.. ఐపీఎల్ లాంటి పావులర్ లీగ్ల్లోనూ అంతంతమాత్రంగానే సాగింది. క్యాష్ రిచ్ లీగ్లో పుజారా ఇప్పటివరకు కేవలం 30 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో 99.74 స్ట్రయిక్ రేట్ కలిగిన పుజారా.. హాఫ్ సెంచరీ సాయంతో 390 పరుగులు చేశాడు. ఇటీవలకాలంలో టెస్ట్ క్రికెటర్ అన్న ముద్ర తొలగించుకనే ప్రయత్నం చేస్తున్న నయా వాల్.. తాజాగా జరిగిన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కౌంటీ సీజన్లో అదరగొట్టాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్లో గేర్ మార్చిన పుజారా.. తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2010లో ఆస్ట్రేలియాపైనే టెస్ట్ అరంగేట్రం చేసిన పుజారా అదే ఆస్ట్రేలియాపై తన వందో టెస్ట్ కూడా ఆడటం యాదృచ్చికంగా జరుగనుంది. ఆసీస్పై ఘనమైన రికార్డు కలిగిన పుజారా తన వందో టెస్ట్లో శతకం బాదాలని ఆశిద్దాం. పుజారా ఆసీస్పై 21 మ్యాచ్ల్లో 52.77 సగటున 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. -
విజృంభించిన ఉనద్కత్, జడేజా.. 79 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్రాజ్సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్రాజ్సిన్హ్ దోడియా బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. -
బంగ్లాతో రెండో టెస్ట్.. భారీ రికార్డులపై కన్నేసిన పుజారా, అక్షర్
IND VS BAN 2nd Test: మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును ఊడ్చేయాలని భావిస్తుంది. బంగ్లాను క్లీన్స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ను చాలా సీరియస్గా తీసుకోనుంది. గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ నవ్దీప్ సైనీ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండరని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ను సైతం గాయాల బెడద వేధిస్తుంది. వారి కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లా తుది జట్లు కూర్పు ఎలా ఉన్నా.. రాహుల్ సేన మాత్రం ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్కు ముందు టీమిండియా కీలక ఆటగాళ్లను భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. తొలి టెస్ట్లో అదరగొట్టిన చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ భారీ మైల్స్టోన్స్పై కన్నేశారు. రెండో టెస్ట్లో నయా వాల్ పుజారా మరో 16 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్గా, అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ఆరో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. పుజారా ఇప్పటి వరకు 97 టెస్ట్ల్లో 44.43 సగటున 6984 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో టెస్ట్లో అక్షర్ మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్.. 9 టెస్ట్ల్లో ఈ ఘనత సాధించగా.. అక్షర్కు 8వ టెస్ట్లోనే అశ్విన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్షర్ ఖాతాలో 44 వికెట్లు (7 టెస్ట్ల్లో 13 సగటున) ఉన్నాయి. పుజారా, అక్షర్లతో పాటు ఇదే మ్యాచ్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టినా.. బుమ్రా పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమిస్తాడు. ఈ ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలో కలిపి 39 వికెట్లు పడగొట్టి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా కొనసాగుతుండగా.. అన్నే వికెట్లు పడగొట్టిన సిరాజ్ బంగ్లాతో రెండో టెస్ట్లో మరో వికెట్ పడగొడితే బుమ్రా రికార్డును బద్దలు కొడతాడు. -
బంగ్లాతో తొలి టెస్ట్.. పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..!
IND VS BAN 1st Test: డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు టీమిండియా యువ వికెట్కీపర్ రిషబ్ పంత్కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. తొలుత ప్రకటించిన భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న పంత్ను తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో చతేశ్వర్ పుజారాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న పంత్కు ఇది భారీ షాక్ అనే చెప్పాలి. టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పంత్కు టెస్ట్ జట్టులో కూడా స్థానం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. తొలి టెస్ట్లో పంత్ స్థానంలో వికెట్కీపర్గా శ్రీకర్ భరత్ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదనపు బౌలర్ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే శ్రీకర్ భరత్ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉండదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ బాధ్యతలు కూడా మోసే అవకాశం ఉంది. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన పంత్ను టీమిండియా యాజమాన్యం గాయాం సాకుగా చూపి అఖరి నిమిషంలో వన్డే జట్టు (బంగ్లాతో సిరీస్) నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా పంత్ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఇషాన్ కిషన్లా రెచ్చిపోతే, టెస్ట్ల్లో కూడా పంత్ స్థానం గల్లంతైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. రోహిత్తో పాటు షమీ, జడేజాలు కూడా గాయాల బారిన పడటంతో బంగ్లా టూర్కు తొలుత ఎంపిక చేసిన జట్టులో భారీ మార్పులు జరిగాయి. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరగా.. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కొత్తగా వచ్చాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు.. శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్దీప్ సైనీ -
Royal London One-Day Cup: పుజారా ప్రతాపం
లండన్: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్ లండన్ వన్డే కప్’లో ససెక్స్ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్షైర్తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు. దీంతో ససెక్స్ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించింది. ఓపెనర్లు హారిసన్ (5), అలీ అర్ (4) విఫలమవగా... కెప్టెన్ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ క్లార్క్ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్ అవుటయ్యాక అస్లాప్ (22), రాలిన్స్ (15), ఇబ్రహీం (15 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రియాన్ పటేల్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లవెస్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. కార్వెలస్ నాలుగు, రాలిన్స్ మూడు వికెట్లు తీశారు. -
పుజారా రీ ఎంట్రీ.. ఇంగ్లండ్తో ఏకైక టెస్ట్కు టీమిండియా ప్రకటన
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్లో భాగంగా జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. గత ఏడాది ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్లు జరిగిన అనంతరం కరోనా వైరస్ కారణంగా ఐదో టెస్టు అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు అదే టెస్టు మ్యాచ్ను జూలై 1 నుంచి 5 వరకు ఎడ్జ్బాస్టన్లో నిర్వహిస్తారు. సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్లో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఈ టెస్టు కోసం మళ్లీ జట్టులోకి రాగా, మయాంక్ అగర్వాల్ను తప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్లోనే ఉంటూ కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా అద్భుత ఫామ్లో ఉన్నాడు. ససెక్స్ తరఫున అతను నాలుగు సెంచరీలు సహా 720 పరుగులు చేశాడు. ఇలాంటి ఫామ్తో అతను భారత జట్టుకు కీలకం కాగలడని భావించిన సెలక్టర్లు మరో మాట లేకుండా పుజారాను ఎంపిక చేశారు. లంకతో సిరీస్లో పుజారాతో పాటు చోటు కోల్పోయిన రహానే ప్రస్తుతం గాయంతో ఆటకు దూరం కావడంతో అతని పేరును పరిశీలించలేదు. 17 మంది సభ్యుల బృందంలో ఎలాంటి అనూహ్య ఎంపికలు లేవు. సిరీస్లో ప్రస్తుతం భారత్ 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో (రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్) ఈ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాయి. భారత టెస్టు జట్టు: రోహిత్ (కెప్టెన్), రాహుల్, గిల్, కోహ్లి, శ్రేయస్, విహారి, పుజారా, పంత్, షమీ, జడేజా, సిరాజ్, శార్దుల్, శ్రీకర్ భరత్, అశ్విన్, బుమ్రా, ఉమేశ్, ప్రసిధ్ కృష్ణ. -
ఐపీఎల్ హంగామా నడుస్తున్నా నేనున్నానని గుర్తు చేస్తున్న పుజారా..!
ఇంగ్లండ్ కౌంటీల్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు బాది కెరీర్ అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన గొప్ప ఆటగాళ్లెప్పుడూ పుజారాలా బ్యాట్తోనే సమాధానం చెబుతారని.. సెంచరీలు, డబుల్ సెంచరీలతోనే వారు సెలెక్టర్లకు సవాలు విసురుతారని అన్నాడు. ఓ పక్క ఐపీఎల్ హంగామా నడుస్తున్నా, పుజారా నేనున్నానని సెలెక్టర్లకు గుర్తు చేశాడని పేర్కొన్నాడు. What do great players do when out of India team? Knock the selectors' doors with 100s and 200s like Pujara. Away from IPL glamour, a simple 'forget me not' message. @cheteshwar1 — Mohammad Kaif (@MohammadKaif) May 8, 2022 కాగా, పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో నాలుగు శతకాలు (డెర్బీషైర్పై 201*, వోర్సెస్టర్షైర్పై 109, డర్హమ్పై 203, మిడిల్సెక్స్పై 170*) బాదాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. Make yourselves comfortable and watch every ball of Shaheen Afridi 🆚 Cheteshwar Pujara 🤩 #LVCountyChamp pic.twitter.com/E6uVJopBQr — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 తాజాగా మిడిల్సెక్స్తో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 197 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 170 పరుగులు సాధించిన పుజారా తన జట్టును మాత్రం ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పుజారా డబుల్ సెంచరీతో పాటు మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ససెక్స్ 335/4 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఫలితం అనుభవించింది. ససెక్స్ నిర్ధేశించిన 370 పరుగుల టార్గెట్ను మిడిల్సెక్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మిడిల్సెక్స్ ఓపెనర్ సామ్ రాబ్సన్ (149) సెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్ (79), మ్యాక్స్ హోల్డన్ (80 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకముందు ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 392 పరుగులకు ఆలౌట్ కాగా.. మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో పుజారా.. ప్రత్యర్ధి బౌలర్ (మిడిల్సెక్స్), పాక్ ఆటగాడు షాహీన్ అఫ్రిది మధ్య బ్యాటిల్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. పుజారా.. షాహిన్ అఫ్రిది బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది చుక్కలు చూపించాడు. చదవండి: IPL 2022: కోహ్లి గోల్డెన్ డక్.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్ -
చతేశ్వర్ పుజారా అజేయ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా సస్సెక్స్ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే భారత ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్లో పుజారా (201 నాటౌట్; 23 ఫోర్లు), టామ్ హైన్స్ (243; 22 ఫోర్లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సస్సెక్స్ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. -
టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా!
Ranji Trophy 2022- న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర తాజా సీజన్ తొలి మ్యాచ్లో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబైతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17న మొదలవుతుంది. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి భారత టెస్టు జట్టులో స్థానం కోసం పోరాడుతున్న పుజారా (సౌరాష్ట్ర), రహానే (ముంబై) ఈ పోరులో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనుండటం విశేషం. తొలి మ్యాచ్ కు వారం రోజుల ముందు ఆయా జట్లు తమ మ్యాచ్ల వేదిక వద్ద చేరుకొని ఐదు రోజులు క్వారంటైన్లో గడుపుతాయి. ఒక్కో జట్టులో గరిష్టంగా 20 మంది ఆటగాళ్లు, 10 మంది సహాయక సిబ్బంది ఉండవచ్చు. 38 జట్లు తలపడే రంజీ ట్రోఫీలో మొత్తం 64 మ్యాచ్లు జరగనుండగా... రాజ్కోట్, కటక్, అహ్మదాబాద్, చెన్నై, తిరువనంతపురం, ఢిల్లీ, హరియాణా, గువ హటి, కోల్కతాలలో మ్యాచ్లు నిర్వహిస్తారు. చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
డ్యాన్స్లతో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు 113 పరుగుల భారీ విజయం దక్కింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్ విజయం అనంతరం హోటల్ రూమ్కు వెళ్లే సమయంలో టీమిండియా ఆటగాళ్ల సంబురాలు మాములుగా జరగలేదు. హోటల్ రూంకు వెళ్లే దారిలో పుజారా, సిరాజ్, ఇతర ఆటగాళ్లు తమ డ్యాన్స్లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా లెగ్ షేకింగ్ డ్యాన్స్తో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. చదవండి: Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్.. తొలి ఆసియా కెప్టెన్గా ''మ్యాచ్ విజయం అనంతరం మా సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలు బోరింగ్గా అనిపించాయి. అయితే అప్పుడు పుజారా మాయ చేశాడు. మేము ఇంతవరకు పుజారా డ్యాన్స్ చేయడం చూడలేదు. మా కోరిక మేరకు పుజారా తొలిసారి మాతో కలిసి డ్యాన్స్ చేశాడు. పుజారా డ్యాన్స్లో సిరాజ్ది అగ్రభాగం.. నిజంగా ఇది గొప్ప విజయం'' అని క్యాప్షన్ జత చేశాడు. చదవండి: విజయంతోనే 'ప్రారంభం.. ముగింపు'; సూపర్ టీమిండియా ఇక మ్యాచ్లో పుజారా బ్యాటింగ్లో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్, రెండో ఇన్నింగ్స్లో 16 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్లో సిరాజ్ మూడు వికెట్లు తీస్తే.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో ఆఖర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3-7 వరకు జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది. View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) -
విహారయాత్రలో టీమిండియా క్రికెటర్లు.. ఫోటో వైరల్
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా తన సహచరులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. మూడు టెస్టులు.. మూడు వన్డేలు ఆడేందుకు భారత్ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు చిన్నపాటి టూర్కు వెళ్లినట్లు పుజారా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి పుజారా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలో పుజారాతో పాటు అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్లు ఉన్నారు. ''మాకు బుధవారం ఒక ఆదివారంలా అనిపించింది..'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంతవరకు టెస్టు సిరీస్ను గెలవలేకపోయింది. ప్రతీసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక 2018లో చివరిసారి సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్ 2-1 తేడాతో టెస్టు సిరీస్ను కోల్పోయింది. 1991 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, భారత్ల మధ్య ఇప్పటివరకు 39 టెస్టు మ్యాచ్లు జరగ్గా.. ఇందులో టీమిండియా 14 విజయాలు నమోదు చేయగా.. సౌతాఫ్రికా 15 విజయాలు అందుకుంది. View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) -
అందుకే నా ఆటతీరులో మార్పు: చతేశ్వర్ పుజారా
కాన్పూర్: ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం వల్లే తన ఆటతీరులో మార్పు వచ్చిందని, అంతే తప్ప బ్యాటింగ్ టెక్నిక్ మార్చలేదని భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం లోటే అయినా అదేం పెద్ద సమస్య కాదని అన్నాడు. జట్టు విజయాలకు తాను చేసే 80, 90 పరుగులు దోహదం చేసినపుడు ఏ బెంగా ఉండబోదని చెప్పాడు. విమర్శల తాకిడి తర్వాత ఇంగ్లండ్లో తాను బ్యాటింగ్లో దూకుడు పెంచిన మాట వాస్తవమేనని పుజారా అన్నాడు. ‘నా బ్యాటింగ్లో వేగం పెరిగింది. ఇది నా ఆటతీరుకు భిన్నమే, కానీ... టెక్నిక్ విషయంలో నేను ఏమాత్రం మారలేదు. ఆ అవసరం కూడా లేదనే అనుకుంటున్నాను. నేను ధాటిగా ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటన దోహదం చేసింది’ అని అన్నాడు. లీడ్స్, ఓవల్ వేదికలపై వరుసగా 91 పరుగులు, 61 పరుగులతో పుజారా రాణించాడు. ‘ఇంగ్లండ్తో సిరీస్లో ఒత్తిడి లేకుండా ఆడాలనుకున్నాను. ఈ మైండ్సెట్తోనే మైదానంలో దిగాను. స్వేచ్ఛగా నా ఆట నేను ఆడుకున్నాను. సమయమొచ్చినపుడు సెంచరీ కూడా సాధిస్తాను. దాని గురించి ఏ బాధ లేదు. జట్టుకు అవసరమైన సమయంలో పరుగులైతే చేస్తూనే ఉన్నాను’ అని అన్నాడు. కొత్తగా వైస్ కెప్టెన్సీని బాధ్యతగా భావిస్తానని చెప్పాడు. వైస్ కెప్టెన్ కానప్పుడే జూనియర్లతో ఎప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నానని... ఇకమీదటా అంతేనని తెలిపాడు. రహానే అద్భుతంగా ఆడుతున్నాడని, భారీ స్కోరుకు ఒక ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని సహచరుడిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. కొత్త కోచ్ ద్రవిడ్ రాకతో కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పాడు. ‘ఎ’ జట్ల మధ్య జరిగిన సిరీస్ సమయం లో ద్రవిడ్తో పనిచేసిన అనుభవం ఉందన్నాడు. -
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు: ఇప్పటికైతే మొగ్గు మనవైపే!
లండన్: నాలుగో టెస్టులో తొలిసారి భారత్ ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, 1 సిక్స్) నిలబడి శతకంతో కదంతొక్కితే... చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెపె్టన్ విరాట్ కోహ్లి (22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లి, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరుకుంటుంది. రోహిత్ అదుర్స్... ఓవర్నైట్ స్కోరు 43/0తో శనివారం ఆటను కొనసాగించిన భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ నిలకడగా ఆడారు. బంతి కూడా పాతబడటంతో మన ఓపెనర్లను ఇంగ్లండ్ పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే అండర్సన్ ఇంగ్లండ్కు తొలి బ్రేక్ను అందించాడు. అర్ధ సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్... అండర్సన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. మొదట అంపైర్ నాటౌట్గా ప్రకటించినా... రివ్యూకు వెళ్లిన ఇంగ్లండ్ వికెట్ సాధించుకుంది. ఈ దశలో క్రీజులోకి వచి్చన పుజారాతో కలిసి రోహిత్ భారత ఇన్నింగ్స్ను నిల బెట్టాడు. ముఖ్యంగా రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్తో అలరించాడు. మొయిన్ అలీ బౌలింగ్లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన రోహిత్ 204 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో విదేశీ గడ్డపై రోహిత్కిదే తొలి సెంచరీ కాగా... ఓవరాల్గా టెస్టుల్లో అతడికిది ఎనిమిదో శతకం. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ టెస్టుల్లో 3000 పరుగులను పూర్తి చేశాడు. మరో పక్క పుజారా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 153 పరుగులు జోడించారు. అయితే కొత్త బంతిని తీసుకున్న రూట్... రాబిన్సన్ను బౌలింగ్కు పిలిచాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న రాబిన్సన్... 81వ ఓవర్లో రోహిత్, పుజారాలను అవుట్ చేసి ఇంగ్లండ్కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. దాంతో భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగింది. కానీ కోహ్లి, జడేజా సంయమనంతో ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వెలుతురు మందగించడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) క్రిస్ వోక్స్ (బి) రాబిన్సన్ 127; కేఎల్ రాహుల్ (సి) బెయిర్స్టో (బి) జేమ్స్ అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 22; జడేజా (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 5; మొత్తం (92 ఓవర్లలో 3 వికెట్లకు) 270. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237. బౌలింగ్: జేమ్స్ అండర్సన్ 23–8–49–1, రాబిన్సన్ 21–4–67–2, క్రిస్ వోక్స్ 19–5–43–0, ఒవర్టన్ 10–0–38–0, మొయిన్ అలీ 15–0–63–0, జో రూట్ 4–1–7–0. -
ఎందాక ఈ ఎదురీత!
లీడ్స్: తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్లో భారత్ కోలుకునే అవకాశం ఉంది. 9 పరుగులే చేసి... మూడో రోజు ఇంగ్లండ్ ఎక్కువ సేపు ఏమీ ఆడలేదు. ఓవర్నైట్ స్కోరు 423/8తో శుక్రవారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు చేసి 432 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఓవర్టన్ (32; 6 ఫోర్లు)ను షమీ ఎల్బీగా పంపించగా... రాబిన్సన్ (0)ను బుమ్రా క్లీన్బౌల్డ్ చేశాడు. షమీ 4 వికెట్లను పడగొట్టగా, బుమ్రా, సిరాజ్, స్పిన్నర్ జడేజా తలా 2 వికెట్లు తీశారు. అయితే ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 354 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ ఇద్దరు నిలబడ్డారు... ప్రత్యర్థి కొండంత ఆధిక్యంలో ఉంది. దీన్ని కరిగించాలంటే క్రీజులో పాతుకుపోవాలి. ఇంకో దారేం లేదు. ఇలాంటి స్థితితో రోహిత్, రాహుల్ అదే పని చేశారు. 16వ ఓవర్లో రాబిన్సన్ వేసిన బౌన్సర్ను రోహిత్ థర్డ్మ్యాన్ దిశగా సిక్సర్ బాదాడు. గంటన్నరపాటు క్రీజులో నిలిచిన రాహుల్ (54 బంతుల్లో 8) చివరకు ఓవర్టన్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అప్పుడే 34/1 స్కోరు వద్ద భారత్ లంచ్కు వెళ్లింది. తర్వాత పుజారా క్రీజులోకి రాగా ఇంగ్లండ్ బౌలర్లకు ఇంకో వికెట్ కోసం సుదీర్ఘ శ్రమ తప్పలేదు. రోహిత్ 125 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ పేస్ వాడిపోగా... భారత బ్యాట్స్మెన్లో ధీమా పెరిగింది. కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన పుజారా ఈ మ్యాచ్లో రోహిత్తో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఈ సెషన్లో అలసటే తప్ప వికెట్లు రాలేదు. ఆఖరి సెషన్లో రోహిత్ ఔటైనప్పటికీ పుజారా... కెప్టెన్ కోహ్లి అండతో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 మార్క్ను దాటించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 78; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్ 59; కేఎల్ రాహుల్ (సి) బెయిర్స్టో (బి) ఓవర్టన్ 8; పుజారా (బ్యాటింగ్) 91; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 45; ఎక్స్ట్రాలు 12; మొత్తం (80 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–34, 2–116. బౌలింగ్: అండర్సన్ 19–8–51–0, రాబిన్సన్, 18–4–40–1, ఓవర్టన్ 17–6–35–1, స్యామ్ కరన్ 9–1–40–0, మొయిన్ అలీ 11–1–28–0, రూట్ 6–1–15–0. -
టీమిండియా క్రికెటర్ల పెద్ద మనసు.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం
ముంబై: కరోనా మహమ్మారితో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కరోనా బారీన పడుతుండగా.. మరికొంతమంది ప్రాణాలు వదులతున్నారు. ఆ కోవకు చెందినవారే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రుచిర్ మిశ్రా. మిశ్రా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పదేళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఆయన టీమిండియా స్వదేశంలో ఆడిన ప్రతీ మ్యాచ్తో పాటు డొమస్టిక్ లీగ్లను కవర్ చేసేవాడు. మంచి స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పేరు సంపాదించిన మిశ్రాకు పలువురు టీమిండియా క్రికెటర్లు పరిచయమయ్యారు. ఇలా ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో కరోనా పెను విషాదం నింపింది. కొన్ని రోజుల కిందట రుచిర్ మిశ్రా కరోనా బారీన పడి మే4న నాగ్పూర్లో కన్నుమూశారు. దీంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రుచిర్ మిశ్రా ఒక ఫండ్ రైజర్ను స్థాపించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, టీమిండియా వుమెన్స్ కోచ్ రమేశ్ పొవార్లు స్పందించారు. ఉమేశ్ రూ. లక్ష విరాళం ఇవ్వగా.. అశ్విన్, పుజారా, పొవార్లు రూ. 50 వేలు విరాళంగా ఇచ్చి పెద్ద మనుసు చాటుకున్నారు. మీ ఇంటి పెద్దని మేం తీసుకురాలేకపోవచ్చు.. కానీ మేమిచ్చే ఈ డబ్బు మీ ఆర్థిక పరిస్థితి బాగుండేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.. అంటూ క్రికెటర్లు పేర్కొన్నారు. కాగా మిశ్రా కుటుంబానికి క్రికెటర్లు చేసిన సాయం తెలుసుకొని వసీం జాఫర్ సహా మరికొందరు సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక కరోనా సెగతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. కివీస్తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు సమాయత్తమవుతున్న టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్కు బయల్దేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు టీమిండియా కివీస్తో ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో పాల్గొననుంది. చదవండి: క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో విషాదం I just contributed to this family! If you are from the cricket fraternity and would like to donate. Please do so🙏🙏 https://t.co/3P8q7tht2d pic.twitter.com/12LfO51Dx8 — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 20, 2021 -
ఆ సమయం నాకు బ్యాడ్లక్.. అందుకే ఏడ్చేశా: పుజారా
ముంబై: చతేశ్వర్ పుజారా.. సమకాలీన క్రికెట్లో అత్యున్నత టెస్టు ఆటగాడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తన అసాధారణ బ్యాటింగ్తో ఎన్నోసార్లు టీమిండియాను గట్టెక్కించాడు. అలాంటి పుజారా తన కెరీర్లోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన సమయాన్ని ఎలా అధిగమించాననే విషయాన్ని ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ‘నా కెరీర్లో తొలిసారి నేను గాయపడినప్పుడు దాని నుంచి బయట పడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇంజ్యురీ నుంచి రికవర్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుందని టీమ్ ఫిజియో చెప్పారు. దీంతో నేను చాలా నిరాశ, ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేశా. అప్పుడు నేను నెగిటివ్ మైండ్సెట్తో ఉన్నా. మళ్లీ క్రికెట్ ఆడగలనా? ఒకవేళ ఆడినా అంతర్జాతీయ స్థాయిలో రాణించగలనా అనే సందేహాలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఒకానొక సమయంలో నా తల్లి దగ్గరకు వెళ్లి ఏడ్చాశా. అయితే నా తల్లి నాకు అండగా నిలబడి.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని.. వాటికి సిద్ధంగా ఉండాలంటూ దైర్యం చెప్పింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా మద్దతుగా నిలబడ్డారు. దీంతో నా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపేసి, వర్తమానంపై దృష్టి పెట్టా’ అంటూ పుజారా చెప్పుకొచ్చాడు. పాజిటివ్ మైండ్సెట్తో ఉండటానికి యోగా, మెడిటేషన్, ప్రార్థన తనకు చాలా ఉపయోగపడ్డాయని పుజారా వివరించాడు. ఇక టెస్టు క్రికెటర్గా తనదైన ముద్ర వేసిన పుజారా ఐపీఎల్లో ఆడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో సీఎస్కే రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో సీఎస్కే ఆడిన 7 మ్యాచ్ల్లోనూ పుజారాకు అవకాశం రాలేదు. తుది జట్టు పటిష్టంగా ఉండడంతో పుజారా బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ కరోనా సెగ తగలడంతో ఐపీఎల్ 14వ సీజన్ రద్దు అయింది. దీంతో పుజారాకు నిరాశే మిగిలింది. ఐపీఎల్ సీజన్ పూర్తిగా జరిగింటే కనీసం ఒకటి.. రెండు మ్యాచ్లైనా ఆడే అవకాశం వచ్చి ఉండేది. ఇక సీఎస్కే గతేడాది ఐపీఎల్ సీజన్ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: అందరూ సేఫ్గా వెళ్లాకే నేను ఇంటికి పోతా! -
'అతన్ని చూస్తే బాధేస్తోంది.. ఐపీఎల్ ఆడితే బాగుండేది'
ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎప్పుడెప్పుడు ఐపీఎల్లో ఆడాలా అని ఎదురుచూస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడనున్న పుజారాను ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రాక్టీస్ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో చూపించాడు. అయితే అతనికి సీఎస్కే అవకాశాలు ఇస్తుందా అన్న అనుమానం ఉన్నా.. పుజారాకు చాన్స్ ఇస్తే మాత్రం తన విలువేంటో చూపించేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పుజారా తన సహచర ఆటగాడు హనుమ విహారి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమ విహారిని ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ''మనం టీమిండియా తరపున ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం.. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో.. నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. గత కొన్నేళ్లలో టీమింయాలో ఉన్న సహచరుల్లో ఐపీఎల్ మిస్సయ్యింది నేను మాత్రమే అనుకుంటా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నా. తాజాగా హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు. 2018 తర్వాత అతన్ని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది..'' అని చెప్పుకొచ్చాడు. కాగా హనుమ విహారి గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఎస్ఆర్హెచ్ హనుమ విహారిని రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఎవరు అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇక ఐపీఎల్లో 30 మ్యాచ్లు ఆడిన పుజారా 390 పరుగులు సాధించాడు. గతంలో కేకేఆర్, ఆర్సీబీలకు ఆడిన పుజారా తాజాగా సీఎస్కే తరపున ఆడనున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్కు కరోనా సెగ పట్టుకుంది. వరుసగా ఆటగాళ్లంతా కరోనా బారిన పడుతుండడంతో ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది. చదవండి: 'మేం సీఎస్కేకు ఆడలేం'.. కారణం అదేనట నేను కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు: సంజూ -
అతను దూరమవడానికి పుజారా కారణమా!
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తాను ఐపీఎల్లో ఆడడం లేదంటూ సీఎస్కే జట్టుకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ బయోబబుల్లో ఉండడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాజిల్వుడ్ తెలిపాడు. గత 10 నెలల నుంచి బయోబబుల్, క్వారంటైన్లోనే ఎక్కువగా ఉంటూ ఫ్యామిలీకి దూరమవుతుండడంతో వారితో సరదాగా గడిపేందుకు ఐపీఎల్కు దూరమవుతున్నట్లుగా మరో కారణం కూడా చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ ఐపీఎల్ ఆడడం లేదని ప్రకటించిన క్షణం నుంచే సోషల్ మీడియాలో అతనిపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు. చతేశ్వర్ పుజారాను నెట్స్లో ఎదుర్కొలేకనే హాజిల్వుడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి .. ఏంటి జోష్.. పుజారాకు భయపడ్డావా.. మీ ఇద్దరు ఒకే జట్టులో ఉన్నారన్న విషయం మరిచిపోయావా ఏంటి?.. అంటూ ట్రోల్ చేశారు. నెటిజన్ల మీమ్స్ను చూసిన సీఎస్కే కూడా తమ ట్విటర్లో పుజారా ఫోటోను షేర్ చేస్తూ.. ''చెపు జోష్, ఏమైంది...'' అంటూ కామెంట్ చేసింది. సీఎస్కే చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కాగా ఈ సీజన్కు దూరమైన జోష్ హాజిల్వుడ్ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకోవాలనేదానిపై సీఎస్కే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హాజిల్వుడ్ ఇలాంటి నిర్ణయం తీసకుంటాడని ఊహించలేదు. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై ఏ నిర్ణయానికి రాలేదు. హాజిల్వుడ్ లేకున్నా ప్రస్తుతం జట్టు సమతుల్యంగానే ఉంది. ఒకవేళ మేనేజ్మెంట్ వద్దు అనుకుంటే ఎవరిని తీసుకునే అవకాశం లేదు అని సీఎస్కే ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను ముంబై వేదికగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. చదవండి: ఐపీఎల్ 2021: వాంఖడేలో కరోనా కలకలం పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్ ChePu Josh, what happened? 🤔😉 #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gOBR7PPfRW — Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2021 -
అప్పుడు పుజారా.. ఇప్పుడు సిబ్లీ.. అదే తరహాలో
అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ సిబ్లీ అవుట్ అయిన విధానం అతన్ని నిరాశ పరిచింది. విషయంలోకి వెళితే.. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి బంతిని సిబ్లీ స్వీప్ షాట్కు యత్నించాడు. అయితే అతను కొట్టిన బంతి టీమిండియా ఫీల్డర్ గిల్ ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. అప్పటికే క్యాచ్ అందుకునేందుకు ముందుకు వచ్చిన పంత్ బంతిని ఒడిసి పట్టాడు. అయితే అంపైర్ ఔట్ ఇచ్చిన అనుమానం ఉండడంతో థర్డ్ అంపైర్ను ఆశ్రయించాడు. రిప్లేలో సిబ్లీ అవుట్ అని రావడంతో ఆశ్చర్యపోయిన సిబ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే సిబ్లీ అవుటైన విధానంలోనే పుజారా కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో చతేశ్వర్ పుజారా అచ్చం సిబ్లీ తరహాలోనే వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్లో చతేశ్వర్ పుజారా (73 పరుగులు) స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని ఫుల్ చేశాడు. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ అయ్యింది. కానీ.. బంతి నేరుగా వెళ్లి షార్ట్ లెగ్లో ఉన్న ఫీల్డర్ భుజానికి తాకి మిడాన్లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఉన్న రోరీ బర్న్స్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పుజారాకు ఏం చేయాలో అర్థం కాక కోపంతో బ్యాట్ను నేలకేసి కొడుతూ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ రెండు యాదృశ్చికంగా ఒకే సిరీస్లో జరగడం విశేషం. సిబ్లీ అవుటైన వీడియోనూ పుజారా వీడియోతో షేర్ చేసి నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఏం బాధపడకు సిబ్లీ.. అప్పట్లో మా పుజారా కూడా ఇలాగే ఔటయ్యాడు. అప్పుడు పుజారా.. ఇప్పుడు సిబ్లీ అంటూ పేర్కొన్నారు. ఇక టీమిండియా నాలుగో టెస్టులో మరింత పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ నాలుగు కీలక వికెట్లు తీసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 119 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: పాపం.. దురదృష్టం అంటే పుజారాదే The Gill+Pant relay catch https://t.co/IIHUMWzNCN — Bhavana.Gunda (@GundaBhavana) March 6, 2021 -
‘పింక్’ గురించి అతిగా ఆలోచించడం అనవసరం: పుజారా
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఏడేళ్ల విరామం తర్వాత చతేశ్వర్ పుజారాకు అవకాశం లభించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తగినన్ని మ్యాచ్లు లభించే అవకాశం లేదు కాబట్టి ఐపీఎల్ జరిగే సమయంలో అతను ఇంగ్లండ్లో కౌంటీల్లో ఆడితేనే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. దీనిపై పుజారా స్పందించాడు. లీగ్ తర్వాత కూడా ఇంగ్లండ్ గడ్డపై జరగబోయే సిరీస్కు తమ వద్ద తగినంత సమయం ఉంటుదని అతను అన్నాడు. ‘ఐపీఎల్లో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. నన్ను ఎంచుకున్న చెన్నైకి కృతజ్ఞతలు. అయితే ముందుగా ఐపీఎల్పైనే దృష్టి పెడతా. అది ముగిసిన తర్వాతే మరోదాని గురించి ఆలోచిస్తా. నాకు తెలిసి ఇంగ్లండ్తో ఆ దేశంలో జరిగే సిరీస్కు ముందు కచ్చితంగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు సమయం లభిస్తుంది. అది నాకు సరిపోతుంది’ అని పుజారా స్పష్టం చేశాడు. మరో వైపు ఎస్జీ పింక్ బంతులు టెస్టు మ్యాచ్ ఎలా స్పందిస్తాయో సరిగ్గా చెప్పలేమని పుజారా అభిప్రాయ పడ్డాడు. రెండే డే అండ్ నైట్ టెస్టులు ఆడిన భారత్కు సహజంగానే దానిపై అవగాహన తక్కువగా ఉందని అతను అన్నాడు. ‘మూడో టెస్టులో బంతి ఎంత వరకు స్వింగ్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఆరంభంలో కొంత వరకు బాగా స్పందిస్తుందని చెబుతున్నారు కానీ గులాబీ బంతిని అంచనా వేయడం అంత సులువు కాదు. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం అనవసరం. నా ఆటపై నాకు నమ్మకముంది’ అని పుజారా వ్యాఖ్యానించాడు. -
ధోనీపై పుజారా కుమార్తె కమెంట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సమరానికి కీలక అంకం ముగిసింది. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆయా జట్లు సభ్యులు ఖరారైపోయారు. దీంతో రేసు గుర్రాలాంటి జట్టు సభ్యుల ఆనంతోద్సాహాల మధ్య క్రికెట్ అభిమానుల్లో కూడా ఐపీఎల్ సందడి షురూ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు బ్యాట్స్మెన్ పుజారా ముద్దుల తనయ అదితి మరోసారి ట్రెండింగ్లో నిలిచింది. అదితి వ్యాఖ్యలు క్రీడాభిమానులను ఇపుడు తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ అయితే ఫిదా! రూ. 50 లక్షలతో చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు ఎంపికైన చతేశ్వర్ పుజారా తిరిగి ఐపీఎల్ సమరంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్లో అడనున్న సందర్భంగా ఐపీఎల్లో చేరడం సంతోషంగా ఉందంటూ పుజారీ ఒక వీడియో విడుదల చేశారు. చెన్నై యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోలో "మహీబాయ్ కెప్టెన్సీలో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషం... ధోనీ నాయకత్వంలోనే టెస్ట్ మ్యాచ్ ఆరంగేట్రం చేశాను. ధోనీ భాయ్తో మంచి అనుభవాలు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మళ్లీ అతనితో కలిసి యెల్లో జెర్సీతో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. సాధ్యమైనంత తొందరగా టెస్ట్ ఫార్మాట్ నుంచి ఐపీఎల్ లాంటి క్విక్ ఫార్మాట్లోకి మారేందుకు మానసికంగా చాలా సిద్దం కావాలి.. విజిల్ పోడు’’ అంటూ పుజారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూతురు 'ఉంగ తలా సుపరూ'( మీ కెప్టెన్ సూపర్బ్) అంటూ కమెంట్ చేయడం విశేషంగా నిలిచింది.అంతేకాదు పెద్ద ఆరిందాలా. వాళ్ల డాడీ చెప్పిందానికి తన చిన్ని తల ఊపుతూ ఆస్వాదించడం మరో విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తన అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పుజారీ తమజట్టులో చేరడంపై ఫ్రాంచైజీ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్ 2021 లో ధోని చెన్నై సూపర్ కింగ్స్తో మరో సీజన్కు సిద్ధమవుతున్నాడు. దీంతో ఐపీఎల్లో రూ.150 కోట్లకు పైగా ఆర్జించిన తొలి క్రికెటర్గా సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సాధించాడు. 2020 వరకు అతడు లీగ్ ద్వారా రూ.137 కోట్ల ఆదాయం పొందగా,చెన్నై ఫ్రాంచైజీ ఈ ఏడాది సీజన్కు కూడా కొనసాగించడంతో ధోనీ సంపాదన రూ.152 కోట్లకు చేరింది. -
నాన్న.. 'ఉంగ తలా సూపర్'
ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్గా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో అడుగుపెట్టనున్నాడు. గురువారం జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో పుజారాను చెన్నై సూపర్కింగ్స్ కనీస మద్దతు ధర రూ.50 లక్షలకు దక్కించుకుంది.ఐపీఎల్లో ఆడాలని తనకు ఉంటుందని.. కానీ తనను గతంలో జరిగిన వేలంలో కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని ఆసీస్ పర్యటన అనంతరం పుజారా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోని నాయకత్వంలోని సీఎస్కే అతని బాధను అర్థం చేసుకుందో లేక అతనికున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వేలంలో కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా పుజారాకు వెల్కమ్ చెబుతూ అతని సంతోషాన్ని వీడియో రూపంలో పంచుకుంది. ఆ వీడియోలో పుజారా మహీబాయ్ సారధ్యంలో ఆడేందుకు మళ్లీ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. పుజారా మాట్లాడుతున్న సమయంలో అతని కూతురు 'ఉంగ తలా సుపరూ'( మీ బాస్ సూపర్) అంటూ ధోనినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వేలంలో సీఎస్కే కొనుగోలు అనంతరం పుజారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎల్లో జెర్సీలో బరిలోకి దిగడంతో పాటు మహీ బాయ్ సారధ్యంలో మళ్లీ ఆడుతుండడం కొత్తగా ఉంది. ఇంతకముందు నేను అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం సమయంలో ధోనినే కెప్టెన్గా ఉన్నాడు. ఆ సమయంలో టెస్టు క్రికెట్లో కీలకమైన 3వ స్థానంలో నన్ను ఆడమని ప్రోత్సహించాడు. అతని కారణంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత ధోని సారధ్యంలోనే సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించడం ఆనందాన్ని కలిగిస్తుంది. మహీ నాయకత్వంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. ఇక ఈసారి ఐపీఎల్లో నా గేర్ను మార్చనున్నా.. అది ఎలా ఉంటుందనేది మీరు ఐపీఎల్లో చూస్తారు..అప్పటివరకు వేచి చూడండి.ఇప్పటికైతే నేను సెలెక్ట్ అయినందుకు విజిల్ పోడూ.. ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పుజారా 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్( ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)తరపున చివరిసారి ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధం: పుజారా కేదార్ జాదవ్ని పెట్టుకొని ఏం చేస్తారు! A cute yellovely message from the legend of Che Pu to make your day super! @cheteshwar1 💛💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/eZZ4CXDevA — Chennai Super Kings (@ChennaiIPL) February 19, 2021 -
పాపం పుజారా.. ఎంత పని జరిగిపోయింది
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో చతేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్లో రనౌట్ అయిన సంగతి తెలిసిందే. అతను రనౌట్ అయిన తీరు మాత్రం దురదృష్టకరం అని చెప్పొచ్చు. టీమిండియా ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చిన పుజారా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్కి కాకుండా ఫ్యాడ్ను తాకి షార్ట్ లెగ్లోని ఫీల్డర్ ఓలీ పోప్ చేతుల్లో పడింది. అప్పటికే పుజారా క్రీజులో లేకపోవడంతో ఓలీ పోప్ బంతిని కీపర్ బెన్ ఫోక్స్కి త్రో చేశాడు. రనౌట్ అవకాశముందని ఊహించిన పుజారా క్రీజులో బ్యాట్ని ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ క్రీజు లైన్పైనే చిక్కుకోవడం.. అదే సమయంలో అతని చేతి నుంచి బ్యాట్ కూడా జారిపోయింది. అయితే ఆఖరి క్షణంలో తన పాదాన్ని ఉంచేందుకు పుజారా ప్రయత్నించగా అప్పటికే ఫోక్స్ బంతితో బెయిల్స్ను కిందపడేశాడు. దీంతో పుజారా రనౌట్ అయినట్లు ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. పుజారా రనౌట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రెండో ఇన్నింగ్స్లో 7 పరుగులు చేసిన పుజారా మొదటి ఇన్నింగ్స్లో 21 పరుగులు చేశాడు. ఇక టీమిండియా రెండో టెస్టులో విజయం దిశగా సాగుతుంది. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 53 పరుగులు చేసింది. లారెన్స్ 12, రూట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. చదవండి: చెన్నపట్నం చిన్నోడు... నైట్వాచ్మన్గా వచ్చి..గోల్డెన్ డక్ Bad Luck Bad Luck Pro Pujara Run-out#INDvENG @cheteshwar1 pic.twitter.com/fcJ0BYjuOI — Chikmaya Kumar Dash (@ckdash045) February 15, 2021 -
పుజారాకు గాయం.. రెండో ఇన్నింగ్స్కు డౌటే!
చెన్నై: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట చతేశ్వర్ పుజారా గాయపడినట్లు తెలుస్తుంది. రెండో టెస్టు తొలిరోజు టీమిండియా బ్యాటింగ్ సమయంలో పుజారా చేతికి బంతి తగిలి గాయమైంది. దీనిలో భాగంగానే రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఇన్సింగ్స్ సమయంలో పుజారా ఆన్ఫీల్డ్లో కనిపించలేదు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వ్యవహరించాడు. గాయం తీవ్రత గురించి తెలియదు కానీ.. గాయం పెద్దదైతే మాత్రం పుజారా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాగా పుజారా తొలి ఇన్నింగ్స్లో 21 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ వరకు పుజారా ఫీల్డింగ్కు వచ్చే అవకాశం లేదని జట్టు మేనుజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రోహిత్ సెంచరీతో మెరవడంతో టీమిండియా తొలిరోజు 300 పరుగులు ప్కోరును దాటింది. రెండో రోజు మాత్రం క్రితం రోజు స్కోరుకు కేవలం 29 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ కాగా.. రిషబ్ పంత్ 58 నాటౌట్ మెరిశాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో తడబడుతుంది. లంచ్ విరామం సమయానికి 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
కష్టాల్లో టీమిండియా...
ఇది భారత గడ్డపై జరుగుతున్న టెస్టు. కానీ... ఇంగ్లండ్లో సాగుతున్నట్లుగా అనిపిస్తోంది! రోజు గడిచే కొద్దీ ప్రత్యర్థి పైచేయి పెరిగిపోతోంది. మూడో రోజైతే ఆఖరి వరుసదాకా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్... బౌలింగ్కు దిగేసరికి మన సేనను ఆఖరి వరుస బ్యాట్స్మెన్ దాకా ఔట్ చేసుకొచ్చింది. పంత్, పుజారా మెరిసినా భారత్ను ఇంకా ఫాలోఆన్ ప్రమాదం వెంటాడుతోంది. నాలుగోరోజు వాషింగ్టన్ సుందర్, అశ్విన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే తప్ప భారత్ గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. చెన్నై: ఒకటి... రెండు... మూడు... ఇన్ని రోజులైనా టెస్టు ఇంగ్లండ్ చేతిలోనే ఉంది. ప్రత్యర్థి చేతిలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ తేలిపోతోంది. తొలి టెస్టులో భారత్ కష్టాల నావతో ఏటికి ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 74 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 321 పరుగుల దూరంలో ఉంది. చతేశ్వర్ పుజారా (143 బంతుల్లో 73; 11 ఫోర్లు) కొంతవరకు గోడ కట్టేసినా... యువ సంచలనం రిషభ్ పంత్ (88 బంతుల్లో 91; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ధనాధన్ మెరిపించినా... అది ఊరడించింది. కానీ ఒడ్డున పడేసేదాకా సాగలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ (4/55) చెపాక్లో తిప్పేశాడు. పేసర్ ఆర్చర్ (2/52) భారత ఓపెనింగ్ను చెదరగొట్టాడు. ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ మిగిలున్న 4 వికెట్లతో 122 పరుగులు చేయాలి. వాషింగ్టన్ సుందర్ (33 బ్యాటింగ్), అశ్విన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకొన్ని చేసి ఆలౌటైంది అంతకుముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ మూడో రోజు కూడా సాగింది. ఓవర్నైట్ స్కోరు 555/8తో ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ మరో 23 పరుగులు చేసి 578 పరుగుల వద్ద ఆలౌటైంది. బెస్ (34; 6 ఫోర్లు)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేయగా... అండర్సన్ (1)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. దీంతో బుమ్రా, అశ్విన్లకు చెరో 3 వికెట్లు దక్కాయి. ఆరంభంపై ఆర్చర్ పిడుగు ప్రత్యర్థి ఆధిక్యం చూస్తే కొండంత... దీంతో భారత్కు శుభారంభం చాలా అవసరం. కానీ జోఫ్రా ఆర్చర్ ఆ అవకాశం ఇవ్వనేలేదు. తన రెండో ఓవర్లోనే (ఇన్నింగ్స్ 4వ) రోహిత్ శర్మ (9 బంతుల్లో 6; 1 ఫోర్)ను బోల్తా కొట్టించాడు. లెంత్ బాల్ను డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... అది బ్యాట్ అంచును తాకి నేరుగా కీపర్ బట్లర్ చేతుల్లో పడింది. పూజారా క్రీజులోకి రాగా... మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ చూడచక్కని స్ట్రోక్ ప్లేతో బంతుల్ని బౌండరీలకు తరలించాడు. కానీ ఆర్చర్... గిల్ ఆటను ఎంతోసేపు సాగనివ్వలేదు. అతను అడిన షాట్ను మిడాన్లో అండర్సన్ డైవ్ చేస్తూ అందుకోవడంతో గిల్ (28 బంతుల్లో 29; 5 ఫోర్లు) దూకుడు ముగిసింది. 44 పరుగులకే భారత ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. స్పిన్ ఉచ్చులో కోహ్లి, రహానే పూజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ వెంటే 59/2 స్కోరు వద్ద లంచ్కు వెళ్లింది. తర్వాత ఆట మొదలైన కాసేపటికే భారత టాప్ బ్యాట్స్మెన్, ఇప్పుడున్న జట్టులో అనుభవజ్ఞులైన కెప్టెన్ కోహ్లి (48 బంతుల్లో 11), వైస్ కెప్టెన్ రహానే (6 బంతుల్లో 1) స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఆఫ్ స్పిన్నర్ బెస్ తన 5వ ఓవర్లో (ఇన్నింగ్స్ 25వ) కోహ్లిని, మరుసటి ఓవర్లో రహానేని పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 73/4. దీంతో ఇన్నింగ్స్ వెన్నెముక విరిగినంత పనైంది. ఈ దశలో రిషభ్ పంత్ వచ్చాడు. సిక్సర్ల పంత్... జట్టు స్కోరు చూసినా... రాలిన వికెట్లు (టాప్–4 బ్యాట్స్మెన్) చూసినా... భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రిషభ్ పంత్ తన శైలి మార్చుకోలేదు. షరామామూలుగా ధనాధన్ ఆట ఆడేశాడు. కానీ జాగ్రత్త వహించాడు. స్పిన్తో చెలరేగుతున్న బెస్ను గౌరవించాడు. మరో స్పిన్నర్ లీచ్ను చితగ్గొట్టాడు. రిషభ్ పంత్ కొట్టిన ఐదు సిక్సర్లలు లీచ్ బౌలింగ్లోనే బాదేయడం విశేషం. దీంతో 32వ ఓవర్లో వంద పరుగులకు చేరిన భారత్ 150 మార్క్ను 39.5వ ఓవర్లోనే అందుకుంది. చిత్రంగా ఈ 40వ ఓవర్లోనే కుదరుగా ఆడుతున్న పుజారా (106 బంతుల్లో; 7 ఫోర్లతో), ధాటిగా సాగుతున్న రిషభ్ (40 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లతో) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. 154/4 వద్ద భారత్ టీ విరామానికెళ్లింది. ఆఖరి సెషన్లోనూ వీరిద్దరి భాగస్వామ్యం పరుగులతో సాగిపోయింది. పూజారా కూడా గేర్ మార్చి చకచకా పరుగులు జతచేశాడు. ఆదుకున్న భాగస్వామ్యం పంత్–పుజారా పార్ట్నర్షిప్ సాఫీగా సాగిపోవడంతో 121 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. వడివడిగా జట్టు 200 పరుగులు చేరే క్రమంలో పుజారాను బెస్ బోల్తా కొట్టించి మరో దెబ్బ తీశాడు. దీంతో ఐదో వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వాషింగ్టన్ సుందర్ జతవ్వగా... 52వ ఓవర్లో పంత్ సిక్సర్తో జట్టు స్కోరు 200 మైలురాయిని దాటింది. ధాటిగా ఆడుతున్న రిషభ్ పంత్ సెంచరీకి సమీపించాడు. కానీ బెస్ ఈ దూకుడుకూ కళ్లెం వేసి మళ్లీ భారత్ను కష్టాల్లోకి నెట్టేశాడు. పంత్ ఆడిన లాఫ్టెడ్ షాట్ డీప్ కవర్లో గాల్లోకి లేవగా లీచ్ అందుకున్నాడు. 225 స్కోరు వద్ద ఆరో వికెట్గా పంత్ నిష్క్రమించాడు. ఈ 30 రోజుల్లోనే గత మూడు టెస్టుల వ్యవధిలో 3 సెంచరీల్ని పంత్ చేజార్చుకున్నాడు. సిడ్నీలో 97 పరుగులు చేసిన పంత్ బ్రిస్బేన్లో 89 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తర్వాత సుందర్, అశ్విన్ ప్రత్యర్థి బౌలర్లకు ఇంకో అవకాశం ఇవ్వకుండా 18 ఓవర్లు ఓపిగ్గా ఆడుకున్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 578; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; శుబ్మన్ గిల్ (సి) అండర్సన్ (బి) ఆర్చర్ 29; పుజారా (సి) బర్న్స్ (బి) బెస్ 73; విరాట్ కోహ్లి (సి) పోప్ (బి) బెస్ 11; రహానే (సి) రూట్ (బి) బెస్ 1; రిషభ్ పంత్ (సి) లీచ్ (బి) బెస్ 91; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 33; అశ్విన్ (బ్యాటింగ్) 8; ఎక్స్ట్రాలు 5; మొత్తం (74 ఓవర్లలో 6 వికెట్లకు) 257. వికెట్ల పతనం: 1–19, 2–44, 3–71, 4–73, 5–192, 6–225. బౌలింగ్: అండర్సన్ 11–3–34–0, ఆర్చర్ 16–3–52–2, స్టోక్స్ 6–1–16–0, లీచ్ 17–2–94–0, బెస్ 23–5–55–4, రూట్ 1–0–1–0. మా వికెట్లు పడినా... పిచ్ అయితే బ్యాటింగ్కే అనుకూలంగా ఉంది. కాబట్టి నాలుగో రోజు అశ్విన్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో నిలబడితే మా పరిస్థితి మెరుగవుతుంది. కీలకమైన భాగస్వామ్యం నమోదైతే మ్యాచ్ చేజారకుండా చూసుకోవచ్చు. –పూజారా, భారత బ్యాట్స్మన్ భారత కెప్టెన్ కోహ్లిని అవుట్ చేసిన బెస్కు సహచరుల అభినందన -
పాపం.. దురదృష్టం అంటే పుజారాదే
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా అవుటైన తీరు చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేం. 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో పంత్తో కలిసి పుజారా టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.దాదాపు ఇద్దరి మధ్య 5వ వికెట్కు 119 పరుగులు భాగస్వామ్యం ఏర్పడింది. టీమిండియా కోలుకుంటున్న దశలో పుజారా అవుట్ అవడంతో పెద్ద దెబ్బ పడింది. ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్లో చతేశ్వర్ పుజారా (73 పరుగులు) స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని ఫుల్ చేశాడు. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ అయ్యింది. కానీ.. బంతి నేరుగా వెళ్లి షార్ట్ లెగ్లో ఉన్న ఫీల్డర్ భుజానికి తాకి మిడాన్లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఉన్న రోరీ బర్న్స్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పుజారాకు ఏం చేయాలో అర్థం కాక కోపంతో బ్యాట్ను నేలకేసి కొడుతూ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కోహ్లి కూడా పుజారా అవుట్పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పుజారా అవుట్కు సంబంధించిన వీడియోనూ రితేష్ మహాతో అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. పుజారాది నిజంగా దురదృష్టం.. మంచిగా ఆడుతున్న సమయంలో ఊహించని రీతిలో అవుట్ కావడం నిరాశకు గురిచేసింది. అవుట్ విషయంలో పుజారాకు న్యాయం జరగాలి అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆసీస్తో సిరీస్లో ఎక్కువ బంతులు ఆడిన పుజారా ఇంగ్లండ్తో మాత్రం తన శైలికి విరుద్ధంగా ఆడాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతని స్ట్రైక్రేట్ 51కి పైగా కొనసాగడం విశేషం. ఈ మధ్యనే తనకు ఐపీఎల్లో ఆడాలని ఉందని పుజారా తన ఇష్టాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పుజారా అవుటైన కాసేపటికే సెంచరీకి చేరువగా వచ్చిన పంత్ కూడా ఔటవడంతో టీమిండియాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (33), అశ్విన్ (8) ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా ఫాలోఆన్ గండం నుంచి బయటపడాలంటే మరో 200 పరుగులు చేయాల్సి ఉంది. అశ్విన్, సుందర్ల తర్వాత మిగిలినవారు టెయిలెండర్లు కావడంతో టీమిండియా ఫాలోఆన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: రూట్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన రహానే ఏంటి పంత్.. ఈసారి కూడా అలాగేనా! Pujara was very unlucky. He got out like this after playing so well. 😭😭😞 Yes, we all want #JusticeForPujara . #INDvENG pic.twitter.com/3UyjOfdrMm — Ritesh Mahato (@Ritesh_7l) February 7, 2021 -
ముగిసిన మూడోరోజు ఆట.. ఫాలోఆన్ తప్పదా!
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఫాలోఆన్ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (33), అశ్విన్ (8) ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు ఆటలో అశ్విన్, సుందర్లు కనీసం రెండు సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను నిలువరిస్తేనే ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఒక దశలో 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ను పంత్ (91), పుజారా (73) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్కు 119 పరుగులు జోడించారు. ముఖ్యంగా పంత్ టీ20 ఇన్నింగ్స్ను తలపిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈసారి సెంచరీ చేసేలా కనిపించినా 91 పరుగులు దగ్గర పంత్ ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కొత్త స్పిన్నర్ డోమ్ బెస్ 4, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నారు. -
భారత్కు ఫాలోఆన్ గండం తప్పేనా!
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఫాలోఆన్ గండం తప్పేలా లేదు. నిలకడగా ఆడుతున్న చతేశ్వర్ పుజారా(73 పరుగులు) డామ్ బెస్ బౌలింగ్లో రోరీ బర్న్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 192 పరుగుల వద్ద ఐదో వికెట్ను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం పంత్ 76 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు, సుందర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఇంకా 357 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా ఫాలోఆన్ గండం తప్పించుకోవాలంటే కనీసం 300 పరుగులు దాటాల్సి ఉంటుంది. రిషబ్ పంత్ వన్డే తరహాలో ఆడుతున్న అతని తర్వాత మరో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. బౌలింగ్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అశ్విన్లు ఉన్నా వారు ఏ మేరకు ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొంటారనేది సందేహంగా మారింది. ఇక 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, రిషబ్ పంత్లు కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 5వ వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సీనియర్ ఆటగాడు పుజారా నుంచి పూర్తి సహకారం అందడంతో పంత్ బౌండరీలతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుజారా సైతం బాధ్యతాయుతంగా ఆడుతూ 29వ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా 154/4 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది. కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్మెన్స్లో రూట్ 218, సిబ్లీ 87, స్టోక్స్ 82 పరుగులు పోప్ 34, డొమినిక్ 34, బర్న్స్ 33, బట్లర్ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్ నదీమ్కు తలో 2 వికెట్లు దక్కాయి. -
దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే
దుబాయ్: ఐసీసీ శనివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో టాప్10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చోటు సంపాదించారు. బ్యాటింగ్ విభాగానికి వస్తే.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 862 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా.. టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఒకస్థానం ఎగబాకి 760 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే 748 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఒక కివీస్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్(891), మార్నస్ లబుషేన్(878) ఉన్నారు. జో రూట్ 823 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విషయానికి వస్తే.. ఆసీస్ స్టార్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో టాప్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్టువర్ట్ బ్రాడ్(839), నీల్ వాగ్నర్(825), జోష్ హాజిల్వుడ్(816), టిమ్ సౌథీ(811) పాయింట్లతో వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా నుంచి అశ్విన్(760) పాయింట్లతో 8వస్థానం,పేసర్ జస్ప్రీత్ బుమ్రా (757) పాయింట్లతో 9వ స్థానంలో నిలిచారు. ఇక ఆల్రౌండ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్స్టోక్స్ అగ్రస్థానంలో ఉండగా.. విండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ రెండు, టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు నేను సిద్ధం -
ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధం: పుజారా
ముంబై: 'అవకాశమిస్తే ఐపీఎల్లో ఆడేందుకు నేను సిద్ధం.. నా ఆటతీరుపై నాకు నమ్మకముంది.. చాన్స్ ఇస్తే మాత్రం నిరూపించుకుంటా.' అంటూ టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి పుజారా అరంగేట్రం చేసిన కొత్తలో టెస్టులతో పాటు వన్డేల్లోనూ ఆడాడు. అయితే కాస్త నెమ్మదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించిన పుజారా రానురాను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమయి టెస్ట్ స్పెషలిస్ట్గా ముద్రవేయించుకున్నాడు. ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో పుజారా పాత్ర మరువలేనిది. ఆసీస్ పేసర్ల బౌన్సర్లు అతని శరీరాన్ని గాయపరిచినా వాటిని లెక్కచేయకుండా ఇన్నింగ్స్లు ఆడడం పుజారాకే సొంతమైంది. ముఖ్యంగా చివరి టెస్టులో పుజారా రెండో ఇన్నింగ్స్లో దాదాపు 200కు పైగా బంతులను ఎదుర్కొని 65 పరుగులే చేసినా.. అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాను విజయంవైపు నడిపించాయంటే అతిశయోక్తి కాదు. ఆసీస్పై టెస్టు సిరీస్ విజయానంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పుజారాను ఎన్డీటీవీ ఇంటర్యూ చేసింది. చదవండి: అది జాతీయ జంతువు.. అందుకే కట్ చేయలేదు ఈ సందర్భంగా పుజారా స్పందించాడు. 'ఒక గొప్ప దేశంతో క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. నిజానికి ఆస్ట్రేలియా గొప్ప పోటీతత్వం ఉన్న జట్టు. అడిలైడ్లో ఘోర ఓటమి తర్వాత మేము కోలుకున్న తీరు ఆశ్చర్యపరిచింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనే ఆసీస్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి విజయం సాధించి ఫుంజుకున్నాం. దీంతో సిరీస్ను 1-1తో సమం చేశాం. రెండో టెస్టు విజయంతో పొందిన ఆత్మవిశ్వాసంతో మిగిలిన మూడు, నాలుగు టెస్టులు గెలవడానికి ప్రయత్నించాం.' అంటూ వివరించాడు. చదవండి: 'ఆరోజు బ్యాట్ పట్టుకోవడమే ఇబ్బందిగా మారింది' కాగా ఆసీస్తో జరిగిన సిరీస్లో రన్స్ కంటే గాయాలు ఎక్కువగా తగలడం ఇబ్బంది అనిపించలేదా అన్న ప్రశ్నకు పుజారా ఆసక్తికర సమాధానమిచ్చాడు.' ఆటలో గాయాలనేవి సహజం.. అయితే ఈసారి ఆసీస్ పర్యటనలో కాస్త ఎక్కువ దెబ్బలు తగిలాయి. నిజానికి మెల్బోర్న్ టెస్టు నుంచే నాకు గాయాలయ్యాయి. మెల్బోర్న్ టెస్టు తర్వాత ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్ సందర్భంగా నా చేతి వేలికి గాయమైంది. ఆ నొప్పితోనే సిడ్నీ టెస్టులో ఆడాను. కానీ బ్రిస్బేన్ టెస్టులో మళ్లీ అదే చేతికి గాయమైంది.. ఈసారి మాత్రం నొప్పితో విలవిలలాడాను.. ఎంతలా అంటే ఆ నొప్పితో నాలుగు వేళ్లు ఉపయోగించి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఆసీస్ పేసర్లు వేసిన బంతులు పదేపదే నా శరీరానికి గాయాలుగా మార్చాయి. అయితే వీటిని తట్టుకొని మ్యాచ్ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అంటూ పేర్కొన్నాడు. రానున్న ఇంగ్లండ్ సిరీస్ను తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని పుజారా పేర్కొన్నాడు. ఈ టెస్ట్ సిరీస్ను ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో ఏ జట్టు మొదట ఫైనల్ చేరుతుందనేది ఈ సిరీస్తో తేలిపోనుంది. పైగా ఇంగ్లండ్ జట్టు మంచి ఫామ్లో ఉంది. లంకను వారి స్వదేశంలో క్లీన్స్వీప్ చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. వారికి మనదేశంలో కూడా మంచి రికార్డు ఉంది. అందుకే ఫిబ్రవరి 5వ తేదీన మొదలవనున్న తొలి టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం' అవకాశమిస్తే ఐపీఎల్ ఆడతారా అన్న ప్రశ్నకు పుజారా స్పందిస్తూ.. 'కచ్చితంగా.. ఐపీఎల్లో ఆడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఐపీఎల్ ఆడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఈసారి జరిగే వేలంలో నన్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా వారికి పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా.టెస్ట్ క్రికెటర్గా ముద్రపడిన నాకు ఏ ఫార్మాట్లో ఎంత వేగంగా ఆడాలన్నదానిపై ఒక క్లారిటీ ఉంది. ఒక అవకాశమిస్తే నన్ను నేను నిరూపించకుంటా.. నాకు ఆ నమ్మకముంది.'అంటూ వెల్లడించాడు. యార్క్షైర్లో స్టీవ్ అన్న పేరుతో వివక్షకు గురైనట్లు షేన్ వార్న్ కామెంట్స్ చేశారు .. దీనిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. 'నేను యార్క్షైర్కు ఆడేటప్పుడు నేను ఎలాంటి వివక్షకు గురి కాలేదు. యార్క్షైర్కు ప్రాతినిధ్యం వహించినన్ని రోజులు సంతోషంగా గడిపా. స్టీవ్ అనే పదాన్ని నేను పెద్దగా పట్టించుకోను.. నా పేరు పలకడం వారికి కష్టమై అలా పిలిచి ఉంటారు. దానిని నేను అంత సీరీయస్గా తీసుకోలేదు 'అని తెలిపాడు. -
'ఆరోజు బ్యాట్ పట్టుకోవడమే ఇబ్బందిగా మారింది'
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్లో 89* పరుగులు ఇన్నింగ్స్తో రిషబ్ పంత్ హీరో అవ్వగా.. అంతకుముందు 91 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్మన్ గిల్ విజయంలో కీలకంగా మారాడు. కానీ వీరిద్దరి మధ్య మరో కీలక ఆటగాడు ఉన్నాడు.. అతనే చతేశ్వర్ పుజారా. అతడు చేసింది 56 పరుగులే అయినా.. అవే భారత జట్టు మ్యాచ్ను గెలిచేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు సెషన్ల పాటు ఆసీస్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ వారినే అలసి పోయేలా చేశాడు. పదునైన బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 211 బంతులు ఆడాడు. ఈ క్రమంలో అతని శరీరం మొత్తం గాయాలయ్యాయి. అతను చూపిన తెగువకు టీమిండియా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తన వేలికి గాయం కూడా అయింది. తాజాగా పుజారా బ్రిస్బేన్లో బ్యాటింగ్ ఆడిన తీరు గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. చదవండి: గంగూలీకి సర్జరీ.. అదనంగా రెండు స్టెంట్లు 'మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా వేలికి గాయమైంది. దీని కారణంగా సిడ్నీ, బ్రిస్బేన్లలో బ్యాటింగ్ చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. బ్రిస్బేన్లో మళ్లీ అక్కడే దెబ్బ తగలడంతో గాయం మరింత తీవ్రమైంది. ఆ తర్వాత కనీసం బ్యాట్ పట్టుకోవడానికి కూడా రాలేదు. నాలుగు వేళ్లతోనే బ్యాట్ను గ్రిప్ చేయాల్సి వచ్చింది. జట్టును ఓటమినుంచి కాపాడాలనే ప్రయత్నంలో బాధనంతా దిగమింగుకొని ఎలాగోలా ఆడానంటూ' పుజారా చెప్పుకొచ్చాడు. చదవండి: క్రికెటర్ శిఖర్ ధావన్పై చార్జ్షీట్ -
పుజారా గురించి మీకు ఈ విషయాలు తెలుసా!?
హైదరాబాద్: టీమిండియా నయా ‘వాల్’, మిస్టర్ డిపెండబుల్ ఛతేశ్వర్ పుజారా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు పుజ్జీని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హనుమ విహారి సహా హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్ తదితరులు అతడిని విష్ చేయగా, బీసీసీఐ, ఐసీసీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా.. సౌరాష్ట్ర జట్టు తరఫున క్రికెట్ కెరీర్ ఆరంభించిన టెస్టు స్పెషలిస్టు పుజ్జీ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం. ►ఛతేశ్వర్ పుజారా 1988, జనవరి 25న గుజరాత్లోని రాజ్కోట్లో జన్మించాడు. ►అతడి పూర్తి పేరు ఛతేశ్వర్ అరవింద్ పుజారా. చే, పుజీ, పూజ్, స్టీవ్ అనే ముద్దుపేర్లు కూడా ఉన్నాయి ►పుజారా తండ్రి అరవింద్, అంకుల్ బిపిన్ సౌరాష్ట్ర తరఫున రంజీ మ్యాచ్లు ఆడారు. ►పుజారా బీబీఏ చదువుకున్నాడు. చిన్ననాటి నుంచే క్రికెట్ పట్ల మక్కువ గల అతడు.. అండర్-19 కేటగిరీలో 2005లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ►అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్-2006లో మూడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ►భారత్- ఆస్ట్రేలియా మధ్య 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో టెస్టుతో పుజారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. యువరాజ్సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు తొలి ఇన్నింగ్స్లో కేవలం 4(బౌండరీ) పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో 72 పరుగులతో సత్తా చాటాడు. ►2012లో తిరిగి జట్టులోకి వచ్చిన పుజారా.. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. క్రమంగా అవకాశాలు దక్కించుకుంటూ మిస్టర్ డిపెంబుల్, వాల్ రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఎదిగాడు. ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 81 టెస్టులు ఆడిన పుజారా, 13572 బంతులు ఎదుర్కొని 6111 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు చేశాడు. చివరిగా బ్రిస్బేన్ టెస్టు(జనవరి 15, 2021) ఆడాడు. ►టెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు పుజారా పేరిట ఉన్నాయి. అత్యధిక స్కోరు 206 ►ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో 8 ఇన్నింగ్స్లు కలిపి 271 పరుగులు చేసిన పుజారా జట్టు చరిత్రాత్మక విజయంలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ►ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే... 2010లో దక్కన్ చార్జర్స్ తరఫున బరిలోకి దిగిన పుజారా, 2014లో ముంబై ఇండియన్స్ తరఫున వాంఖడే స్టేడియంలో చివరి ఐపీల్ మ్యాచ్ ఆడాడు. ►పుజారాకు 2013లో పూజా పబరీతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు అతిథి ఉంది. చదవండి: మిస్టర్ డిపెండబుల్.. హ్యాపీ బర్త్డే పుజ్జీ..! -
'నాన్నకు దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ముద్దిస్తా'
ముంబై: ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా చతేశ్వర్ పుజారా వరుసగా రెండోసారి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌన్సీ పిచ్లపై అంత సేపు క్రీజులో ఉండటం అంటే మాటలు కాదు. పేసర్ల నుంచి వేగంగా దూసుకొచ్చే బంతులు.. ఎక్కడ గాయాలు చేస్తాయోనన్న ఆందోళన బ్యాట్స్మెన్లలో కనిపిస్తుంది. కానీ పుజారా మాత్రం ఆ గాయాలకు తాను అలవాటు పడ్డట్లుగా కనిపించాడు. ముఖ్యంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. మ్యాచ్ను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో వికెట్ కాపాడుకుంటూ ఒంటికి ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకున్నాడు. కమిన్స్, హాజిల్వుడ్ వేసిన బంతులు ఒళ్లంతా గాయాలు చేస్తున్నా చెక్కు చెదరని ఏకాగ్రతతో బ్యాటింగ్ కొనసాగించాడు. కాగా చివరి రోజు ఆటలో కనీసం12సార్లయినా బంతి పుజారా శరీరాన్ని బలంగా తాకింది. తాజాగా ఆసీస్పై టెస్టు సిరీస్ విజయం తర్వాత టీమిండియాకు స్వదేశంలో ఘనమైన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ఎవరు ఇంటికి వారు వెళ్లిపోయాకా.. ఇంట్లోవారు కూడా వారికి ఘనమైన స్వాగతం పలికారు. చదవండి: సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు అలా పుజారా రెండేళ్ల ముద్దుల కూతురు అతిధి కూడా ఆమె తండ్రికి ఘనస్వాగతం పలికింది. 'మా నాన్నకు అయిన గాయాలు మాన్పించడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎక్కడ దెబ్బలు తగిలాయో అక్కడ ముద్దిస్తా.. దీంతో మా నాన్నకు గాయాల నొప్పి తగ్గిపోతుంది' అంటూ ముసిముసి మాటలు పలికింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదే విషయమై పుజారా స్పందిస్తూ.. తన కూతురు ఎప్పుడు కింద పడినా తానూ అలాగే చేస్తానని తెలిపాడు. అందుకే ఆసీస్ సిరీస్తో గాయాలతో ఇంటికి వచ్చానని తెలుసుకున్న నా కూతురు నాకు అలాగే చేసింది. ముద్దు ఏ గాయాన్ని అయినా మాన్పుతుందని తన కూతురు అనుకుంటున్నట్లు సంతోషంతో పేర్కొన్నాడు. కాగా పుజారా ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో 8 ఇన్నింగ్స్లు కలిపి 271 పరుగులు చేశాడు. -
తొలి పరుగు.. 30 బంతులు.. నాలుగు మెయిడిన్లు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ వికెట్లను కోల్పోయింది. గిల్ ఏడు పరుగులకే ఔట్ కాగా, రోహిత్ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. గిల్ ఔటైన తర్వాత క్రీజ్లోకి పుజారా రాగా, రోహిత్ ఔటైన తర్వాత రహానే బ్యాటింగ్కు దిగాడు. వీరిద్దరూ మెల్లగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళుతున్నారు. క్రీజ్లో పాతుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ జోడి పరుగు సాధించడానికి 30 బంతులు తీసుకుంది. దాంతో వరుసగా నాలుగు మెయిడిన్లు పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. (లంచ్కు ముందే ఆసీస్ ఆలౌట్) అంతకుముందు ఆసీస్ 369 పరుగులకు తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. 274/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్కు ముందే ఆసీస్ను ఆలౌట్ చేశారు. ఓవరనైట్ ఆటగాళ్లు పైన్, కామెరూన్ గ్రీన్లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్గా పైన్ ఔటైన తర్వాత ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్కు వికెట్ దక్కింది.(అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం..) -
పుజారా ఆడకపోయుంటే...
100 బంతుల్లో 16 పరుగులు... 133 బంతుల్లో 40... 174 బంతుల్లో అర్ధ సెంచరీ... తొలి వంద బంతుల్లో ఒక్క ఫోర్ కూడా లేదు... శనివారం చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ సాగిన తీరు ఇది. దీనిపైనే పలువురు మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. రికీ పాంటింగ్ కూడా ‘ఇది సరైన పద్ధతి కాదు. స్కోరింగ్ వేగం మరింత ఎక్కువగా ఉండాల్సింది. ఈ తరహా ఆట ఇతర బ్యాట్స్మెన్పై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇలా ఆడటం ఇదేమీ మొదటిసారి కాదు! నిజానికి ఇదే అతని బలం కూడా. పరుగులు చేయడంలో అతని శైలే ఇది. పుజారా విషయంలో ఇలాంటిది బ్రహ్మాండంగా పని చేస్తుంది కూడా. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి, గతి తప్పి పేలవ బంతులు వేసే వరకు వేచి చూడటం... ఆపై పరుగులు రాబట్టడం అతనికి తెలిసిన విద్య. 2018లో జొహన్నెస్బర్గ్ టెస్టులో 50వ బంతికి తొలి పరుగు తీసిన రోజు కూడా పుజారా శైలిపై విమర్శలు రాలేదు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచినప్పుడు పుజారా ఇదే మంత్రం పఠించాడు. సిరీస్ మొత్తంలో అసాధారణంగా సుమారు 30 గంటల పాటు అతను బ్యాటింగ్ చేసిన విషయం మరచిపోవద్దు. అతనిలో ‘దూకుడు’ లోపించిందని చెప్పడంలో అర్థం లేదు. సాధారణంగా అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత షాట్లు ఆడుతూ లెక్క సరి చేయడం అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ చేస్తుంటారు. అడిలైడ్ టెస్టులో కోహ్లి తన తొలి 80 బంతుల్లో 29 పరుగులే చేసి ఆపై కొంత జోరు పెంచాడు. అయితే పుజారాకు అలాంటి షాట్ల ‘రిస్క్’ విలువేమిటో బాగా తెలుసు. శనివారం భారత జట్టు ఉన్న స్థితిలో అలాంటి రిస్క్లు కూడా అనవసరమని అతను భావించినట్లున్నాడు. అన్నింటికి మించి ఫామ్లో ఉన్న ముగ్గురు అత్యుత్తమ పేసర్లను అతను ఎదుర్కొంటున్నాడు. పిచ్ భిన్నంగా స్పందిస్తోంది. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం తనకు పెరుగుతుందని అతను అనుకున్నాడు. అన్నింటికి మించి తన సహచరుల బ్యాటింగ్ బలంపై కూడా అతనికి అంచనా ఉంది. టెస్టు క్రికెట్లో సుమారు 31 వేల బంతులు ఆడిన పుజారాకు తనకు ఏది బాగా పని చేస్తుందో తెలీదా! చివరకు అతను భయపడినట్లే జరిగింది. కమిన్స్ వేసిన ఒక అద్భుత బంతికి పుజారా వెనుదిరిగాక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూడా పట్టుదలగా నిలబడకుండా వేగంగా ఆడితే చాలనే భావనలో వెళితే అసలు ఈ మాత్రం స్కోరైనా వచ్చేదా! జట్టు పేలవ ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఎదుర్కోగలిగిన బ్యాట్స్మెన్ అని చూడకుండా రహానేపై ఒత్తిడి పెరిగి అవుట్ కావడానికి కారణమయ్యాడని, అతని ఆట శైలి కారణంగానే విహారి కూడా రనౌట్ అయ్యాడని విమర్శించడంలో ఏమాత్రం అర్థం లేదు. నేను బాగా ఆడుతున్న సమయంలో ఒక మంచి బంతికి అవుటయ్యాను. నాకు తెలిసిన శైలిలోనే నేను బ్యాటింగ్ చేస్తాను. అంతకంటే మెరుగ్గా నేను ఏమీ చేయలేను. కమిన్స్ వేసిన ఆ బంతి ఈ సిరీస్లోనే అత్యుత్తమమైంది. నేను ఆడక తప్పని పరిస్థితి. మనది కాని రోజు చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. పుజారా, భారత బ్యాట్స్మన్ -
పైన్ అద్భుత క్యాచ్కు పుజారా బలి
మెల్బోర్న్ : ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే 17 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కూడా కమిన్స్ బౌలింగ్లో పైన్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాల్సి వచ్చింది. (చదవండి : సిరాజ్... ఇప్పుడే వద్దులే!) కమిన్స్ వేసిన గుడ్లెంగ్త్ బంతి పుజారా బ్యాట్ను ఎడ్జ్లో తాకుతూ కీపర్ వైపు వెళ్లింది. ఫైన్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే మరోవికెట్ పడకుండా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 21 పరుగులు చేసిన హనుమ విహారి లయన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో 116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 57 ఓవర్లలో 166 పరుగులు చేసింది. రహానే 43, పంత్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) A pearler of a pluck from Paine! And it's the big wicket of Pujara too!@hcltech | #AUSvIND pic.twitter.com/q4rFhCb7Yj — cricket.com.au (@cricketcomau) December 27, 2020 -
ఈసారి పుజారా ఎవరో చూడాలి : ద్రవిడ్
సిడ్నీ : ఆసీస్తో జరగబోయే నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఈసారి పుజారా ఎవరు కానున్నారనేది చూడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ను ఉద్దేశించి ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : బుమ్రా షాట్.. ఆసీస్ బౌలర్కు గాయం) 'ఈసారి ఆసీస్తో జరగబోయే టెస్టు సిరీస్లో ఎవరు చతేశ్వర్ పుజారా కానున్నారో చూడాలి. ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం ఆసీస్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో పుజారా అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. మూడు సెంచరీలు కలుపుకొని 521 పరుగులు సాధించాడు. మరి ఈసారి వేరే బ్యాట్స్మెన్ ఆ పరుగులు సాధిస్తారా లేక మళ్లీ పుజారానే దానిని రిపీట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అదే విధంగా టీమిండియా బౌలింగ్పై పూర్తి నమ్మకం ఉంది. ఐదు రోజుల్లో టీమిండియా బౌలర్లకు 20 వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు.. బ్యాట్స్మన్లకు అలా వీలు పడదు. ప్రతీసారి ఒక సిరీస్లో బ్యాట్స్మన్కు 500 పరుగులు చేయడం సాధ్యం కాదు. కానీ బ్యాట్స్మన్ లయ అందుకుంటే బౌలర్లకు మాత్రం కష్టమే' అంటూ ద్రవిడ్ తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్ ఎన్సీఏ క్రికెట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. (చదవండి : సిక్స్తో బుమ్రా హాఫ్ సెంచరీ.. వీడియో వైరల్) -
పుజారా,రహానేలు కీలకం
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరిస్లో కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్ట్కు మాత్రమే అందుబాటులో ఉండడంపై మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. డిసెంబర్ 17న అడిలైడ్లో తొలి టెస్ట్ తరువాత కోహ్లి స్వదేశానికి రానున్న నేపథ్యంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా ,మరో సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ భారాన్ని మోయాలని సూచించారు. తన భార్య అనుష్క శర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తుండటంతో కోహ్లి భారత్కు తిరిగి రావడం తెలిసిందే. టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. పూజారాతో పాటు అదనపు బాధ్యతలను భరించాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "కెప్టెన్ లేకపోవడంతో మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని,అతని గైర్హాజరు కనపడకుండా ఆడాలని సూచించారు. రహానే , చేతేశ్వర్ పుజారాకు ఇది కఠినమైన సవాల్. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ చెమట చిందించాల్సి ఉంటుందని"అని గవాస్కర్ అన్నారు పుజారానే ఉత్తమం. గవాస్కర్ కూడా పూజారాను బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించాడు, 2018-19లో భారతదేశం చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో పుజారా అత్యధిక పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూ 74.42 సగటుతో మూడు సెంచరీలు,ఒక హఫ్ సెంచరీ సహాయంతో 521 పరుగులు చేశాడు. భారతదేశపు చారిత్రాత్మక 2-1 విజయానికి సౌరాష్ట్ర బ్యాట్స్ మాన్ సహనం, శాస్త్రీయ శైలి ఒక ప్రధాన కారణం. అతను దాదాపు 30 గంటలు బ్యాటింగ్ చేశాడు 1258 బంతులను ఎదుర్కొన్నాడు, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. పరుగుల గురించి పెద్దగా చింతించకుండా ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం ద్వారా బౌలర్లను ఎదుర్కొవటం పుజారాకు ఇష్టం. మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్వుడ్ మరియు నాథన్ లియోన్లాంటి ప్రఖ్యాత ఆసీస్ దాడి అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పుజారా బ్యాటింగ్ శైలి గురించి చిన్న ఆధారం కూడా లభించకపోవటంతో అలసిపోయినట్లు అనిపించింది, అందుకే దాదాపు రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగానే పూజారాను తన సహజమైన ఆట ఆడటానికి మేనేజ్మెంట్ ప్రోత్సహించాలని గవాస్కర్ చెప్పాడు. సెంచరీలు వస్తున్నంత కాలం పరుగులు ఎలా పొందాలో ఎవరూ అతనికి చెప్పకూడదు అని అన్నారు. పుజారాని స్వేచ్ఛగా,ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడనివ్వాలి. అది టీమ్ కి అనుకూలంగా మారుతుంది. అతను స్థిరంగా ఉంటాడు.దానివల్ల తన చుట్టూ ఉన్న బ్యాట్స్మెన్ కూడా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారని 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్ అయిన లిటిల్ చాంప్ వ్యాఖ్యానించాడు. -
భారత టెస్టు స్పెషలిస్ట్లు దుబాయ్కి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టు స్పెషలిస్ట్లు, కోచింగ్ బృందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్లో ఆడని చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలతోపాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందిని నేరుగా ఆస్ట్రేలియా పంపించకుండా సహచరులతో కలిసి దుబాయ్ నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వీరందరినీ బోర్డు ఈ నెలాఖరులో దుబాయ్కు పంపించనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం వీరంతా అక్కడే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. వారంలో మొదటి, మూడో, ఆరో రోజున కోవిడ్–19 పరీక్షలకు హాజరవుతారు. అంతా ఓకే అనుకుంటే బయో బబుల్లో అక్కడే ఉన్న భారత జట్టు ఆటగాళ్లతో కలుస్తారు. వీరంతా ఒకే చార్టెర్డ్ ఫ్లయిట్లో ఆస్ట్రేలియా బయల్దేరతారు. ఆస్ట్రేలియా సిరీస్ పూర్తిగా బయో బబుల్ వాతావరణంలో జరగనున్న నేపథ్యంలో భారత బృందమంతా ఒకే తరహా వాతావరణం నుంచి వెళితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఒక బయో బబుల్ రక్షణ కవచం నుంచి మరో బయో బబుల్ (ఆస్ట్రేలియాలో)లోకి వెళ్లడం సులువవుతుందని, అందుకే అందరూ కలిసి వెళ్లడం మంచిదని తాము భావించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు నేరుగా ఏ నగరానికి వెళుతుందో, ఎక్కడ మ్యాచ్లు ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఉండే కరోనా పరిస్థితిని బట్టి మార్పులు జరగవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రెండు వారాలు క్వారంటీన్ కావాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటి వర కు ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. -
'ఐపీఎల్లో ఆడనందుకు నాకు బాధ లేదు'
ముంబై : చటేశ్వర్ పుజార.. పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఇప్పటితరంలో అద్భుతమైన స్ట్రోక్ ప్లే కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న పుజార పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టీ20 పనికిరాడంటూ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అంశమే అతన్ని టీ20తో పాటు ఐపీఎల్కు దూరం చేసింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో పుజారను ఏ ఐపీఎల్ జట్టు కూడా కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. తాజాగా ఐపీఎల్ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంపై చటేశ్వర్ పుజార మరోసారి స్పందించాడు. 'నేను ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోనందుకు ఏం బాధ లేదు. ఐపీఎల్కు ఆడలేకపోతున్నా అనే ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే టీ20ల్లో నాకంటే బాగా ఆడేవాళ్లు చాలా మందే ఉన్నారని.. అందులో వరల్డ్ క్లాస్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్న హషీమ్ ఆమ్లా లాంటి ఆటగాడు కూడా అమ్ముడుపోని ఆటగాడిగానే మిగిలాడు. ఆమ్లాలా ఇంకా ఎందరో ఉన్నారు.. అందులో నేను ఒకడిని. మేము ఐపీఎల్లో ఆడడం లేదన్న ఈగో ఫీలింగ్ లేదు. నా ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నా. ఇప్పటికి అవకాశమొస్తే అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ నన్ను ఒక టెస్టు ప్లేయర్గా మాత్రమే గుర్తించారు. దానికి నేను కూడా ఏం చేయలేను. టీమిండియాలో నాతో పాటు ఆడే ఆటగాళ్లు ప్రతీసారి ఐపీఎల్లో బిజీగా ఉంటే బీసీసీఐ అనుమతితో నేను మాత్రం ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్లో పాల్గొనేవాడిని. కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కౌంటీలో ఆడడం లేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా. టీమిండియా తరపున టెస్టుల్లో జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టా. అశేషమైన భారత అభిమానుల మద్దతుతో మ్యాచ్లు గెలవడం కన్నా ఇంకా గొప్ప అనుభూతి ఏం ఉంటుంది చెప్పండి. టెస్టుల ద్వారా ఇప్పటికే చాలాసార్లు చూశా. ఐపీఎల్లో సాధించే విజయం కన్నా దేశంకోసం సాధించే విజయంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు' అంటూ చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పుజార 77 టెస్టులాడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం 18 సెంచరీలు ఉన్నాయి. -
'సెంచరీ కంటే భార్య చేసే హెయిర్కట్ కష్టంగా ఉంది'
ముంబై : మ్యాచ్ ఆడేటప్పుడు సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతామో భార్యతో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజార అంటున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో సెలూన్ షాపులు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన జట్టును కొంతమంది తామే కట్ చేసుకుంటే మరికొందరు ఆ పనిని వారి జీవిత భాగస్వాములకు అప్పగిస్తున్నారు. తాజాగా పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు.(అఫ్రిది వ్యాఖ్యలకు రైనా స్ట్రాంగ్ కౌంటర్) 'సెంచరీకి ఒక్క పరుగు (99*) దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మన్ను ఎంతగా నమ్ముతాము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అదే జీవిత భాగస్వామితో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అదే నమ్మకం ఉంటుందని దైర్యంగా చెప్పడం మాత్రం చాలా కష్టం.' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సౌరాష్ట్ర సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ మంకీతో కూడిన ఒక ఎమోజీని పెట్టి పుజారతో నేను కూడా ఏకీభవిస్తా అంటూ కామెంట్ చేశాడు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజార 48.86 సగటుతో 5840 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 25 అర్థ సెంచరీలున్నాయి. (మాటలతో జవాబివ్వకు అన్నాడు: కోహ్లి) -
పుజార.. బంతి కోసం పరిగెత్తాల్సి ఉంటుంది
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆటగాళ్లంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ సమయాన్ని తమకు తోచిన విధంగా గడిపేస్తున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చటేశ్వర్ పుజారను ఉద్దేశించి ట్విటర్లో ట్రోల్ చేస్తూ పెట్టిన కామెంట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.2018-19 ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్కు సంబంధించిన ఫోటోను కోహ్లి తన ట్విటర్లో షేర్ చేశాడు. ' చటేశ్వర్ పుజార.. లాక్డౌన్ తర్వాత మొదటి సెషన్ ఇలాగే ఉంటుంది. బంతి కోసం నువ్వు పరిగెత్తాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నా' అంటూ క్యాప్షన్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత పేస్ బౌలర్ షమీ దీనికి స్పందిస్తూ.. 'నో చాన్స్.. హాహాహ' అంటూ కోహ్లి, పుజారలనుద్దేశించి నవ్వుతూ పేర్కొన్నాడు. కరోనా మహమ్మారితో ఐపీఎల్తో పాటు ఇతర క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్పై కూడా సందేహాలు నెలకొన్నాయి. 'అందుకే రైనాను పక్కన పెట్టాం' ధోని, కోహ్లిలపై యోగ్రాజ్ సంచలన వ్యాఖ్యలు First session after lockdown be like 👀 @cheteshwar1 I hope you will go for the ball pujji 😜😜 pic.twitter.com/5DAGgpzbbw — Virat Kohli (@imVkohli) May 5, 2020 -
'ఫైనల్లో బంగ్లాదేశ్ను కుమ్మేయండి'
ఆక్లాండ్ : అండర్ 19 ప్రపంచకప్లో ఈ ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పాచెఫ్స్ట్రూమ్ లో సేన్వెస్ పార్క్లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఐదోసారి కప్పును ఒడిసి పట్టాలని భారత కుర్రాళ్లు భావిస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజార, అజింక్యా రహానే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహాలు భారత కుర్రాళ్ల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ముందుగా ఫైనల్ చేరినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఓటమనేది ఎరుగకుండా జైత్రయాత్ర కొనసాగించారు. ఫైనల్లోనూ ఇదే తరహాలో ఆడి బంగ్లాదేశ్ను కుమ్మేయండి. ఈసారి కూడా కప్పు మనదే అవ్వాలి' అంటూ పేర్కొన్నారు. (ఇదే రోజు పాకిస్తాన్పై అద్భుతం..) కాగా సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను టీమిండియా కుర్రాళ్లు 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఏడవ సారి ఫైనల్కు చేరుకుంది. ప్రసుత్తం టీమిండియా సీనియర్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కివీస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆడేందుకు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఇప్పటికే న్యూజిలాండ్కు చేరుకున్నారు. చటేశ్వర్ పుజారా 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్లో 349 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు. అప్పటి ప్రపంచకప్ ఫైనల్ పాకిస్తాన్- ఇండియా మధ్య జరగ్గా, పాక్ 38 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. (బంగ్లాదేశ్ వచ్చేసింది ) -
బంగ్లాదేశ్ను కుమ్మేయండి
-
పుజారాను ట్రోల్ చేసిన ధావన్
రాజ్కోట్: టీమిండియా టెస్టు బ్యాట్స్మన్ చతేశ్వర పుజారాను శిఖర్ ధావన్ ట్రోల్ చేశాడు. ఇప్పటివరకు టెస్టు బ్యాట్స్మన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న చటేశ్వర పుజారా.. తాజాగా తనలో దాగున్న మరో కోణాన్ని మైదానంలో మరోసారి ప్రదర్శించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర సారథి పుజారా బంతితో మెరిశాడు. యూపీ బ్యాట్స్మన్ మోహిత్ జంగ్రాను పుజారా తన లెగ్ స్పిన్తో అవుట్ చేయడం రెండో రోజు ఆటకే హైలెట్గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోను పుజారా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. అంతేకాకుండా తాను బ్యాట్స్మన్ నుంచి ఆల్రౌండర్గా ఎదిగానని సరదాగా కామెంట్ చేశాడు. అయితే పుజారా వికెట్ తీయడం పట్ల సహచర క్రికెటర్లు, అభిమానులు ఆనందంవ్యక్తం చూస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా ఓపెనర్ శిఖర్ ధావన్ పుజారాను ఆటపట్టించాడు. ‘అద్భుతంగా బౌలింగ్ చేశావు. నీ పరుగుల వేగానికి స్ర్పింటర్ కూడా తట్టుకోలేక చచ్చిపోతాడు’అంటూ ట్రోల్ చేశాడు. ‘అసాధారణం, ఇక మరింతగా బౌలింగ్ చేసే సమయం వచ్చింది’అంటూ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పుజారాను ఉద్దేశిస్తూ ధావన్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాకుండా ధావన్ హాస్యచతురతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక పుజారా ఇప్పటివరకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. View this post on Instagram The day when I changed my Batsman status to an All-rounder 😂😂 A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on Dec 27, 2019 at 6:32am PST -
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
-
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అటు తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. మార్కస్ హారిస్ (5 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 215/2 ఓవర్నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. ఓవర్నైట్ ఆటగాళ్లు కోహ్లి, పుజారాలు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. కాగా, ఈ జోడి 170 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లి (82; 204 బంతుల్లో 9 ఫోర్లు) మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శతకం సాధించిన పుజారా(106; 319 బంతుల్లో 10 ఫోర్లు) నాల్గో వికెట్గా ఔటయ్యాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 17వ సెంచరీ కాగా, ఆసీస్పై నాల్గోది. ఆ తరుణంలో అజింక్యా రహానే(34), రోహిత్ శర్మ(63 నాటౌట్)ల జోడి నిలకడగా ఆడింది. దాంతో భారత్ స్కోరు మూడొందల మార్కును అవలీలగా చేరింది. ఇక రోహిత్ శర్మ-రిషబ్ పంత్(39)లు జంట కూడా మరో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ నాల్గొందల మార్కును దాటింది. స్కోరును పెంచే క్రమ్లో రిషభ్ పంత్ ఔటైన స్వల్ప వ్యవధిలో రవీంద్ర జడేజా సైతం ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76) హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు సాధించగా, మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు లభించాయి. హజల్వుడ్, లయన్లకు తలో వికెట్ దక్కింది. -
ఆధిక్యం దిశగా టీమిండియా
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకపోతోంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లి, పరుగుల యంత్రం పుజారాలు అర్థసెంచరీలతో చెలరేగారు. మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 124/2తో ఆట ఆరంభించిన భారత్ బ్యాట్స్మెన్ కోహ్లి-పుజారా బ్రిటీష్ బౌలర్లకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. మూడో రోజు లంచ్ విరామం వరకు టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కోహ్లి సేన ఇప్పటివరకు 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం పుజారా (56 నాటౌట్; 7 ఫోర్లు), కోహ్లి(54 నాటౌట్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కోహ్లి-పుజారాల క్లాస్ ఇన్నింగ్స్ మూడో రోజు ఆట కోనసాగించిన టీమిండియా బ్యాట్స్మెన్ కోహ్లి-పుజారాలు ఆచితూచి ఆడుతున్నారు. పదేపదే ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్ బౌలింగ్ మారుస్తూ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. టీమిండియా సారథి తన ఫామ్ను కొనసాగిస్తూ రెండో ఇన్నింగ్స్లోనూ అర్థసెంచరీ సాధించాడు. గత కొద్ది రోజులుగా ఫామ్లో లేక నానాతంటాలు పడుతున్న పుజారా తిరిగి పునర్వైభవం అందుకున్నాడు. తన దైన క్లాస్ షాట్లతో ఆకట్టుకున్నాడు. -
దుమ్మురేపిన పూజారా.. చరిత్ర సృష్టించే దిశగా స్మిత్!
దుబాయ్: శ్రీలంకతో టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన చటేశ్వర పుజారా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో దుమ్మురేపాడు. తాజాగా వెలువడిన టెస్టు ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఇది పూజారా కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్. యాషెస్లో అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 945 పాయింట్లతో మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతడు మరో 16 పాయింట్లు సాధిస్తే.. బ్యాటింగ్ దిగ్గజం బ్రాడ్మన్ ఆల్ టైమ్ రికార్డ్ను అందుకుంటాడు. ప్రస్తుత ఫామ్ను కొనసాగిస్తే అంత కష్టం కాకపోవచ్చు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 863పాయింట్లతో రెండో ర్యాంకు సాధించాడు. ఇక, టెస్టు బౌలర్లలో యాషెస్ సిరీస్లో ఫామ్ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్, రబాడాను వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. భారత బౌలర్లలో స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలు మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా రెండో స్థానంలో, అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. యాషెస్ సిరీస్లో ప్రధానంగా రాణిస్తున్న ఆటగాళ్ల ర్యాంకింగ్స్లోనూ మార్పులు జరిగాయి. -
పుజారా... ఓ అరుదైన రికార్డ్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా (న్యూ) మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర పుజారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్లో ఐదురోజులపాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరిపోయాడు. శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న టెస్ట్లో పుజారా ఈ ఘనత సాధించాడు. మొత్తం ఐదు రోజులపాటు పుజారా క్రీజులో బంతులను ఎదుర్కున్నాడు. తద్వారా ఈ రికార్డు సాధించిన 9వ ఆటగాడిగా పుజారా రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు అయ్యాడు. అంతకు ముందు జయసింహా, రవిశాస్త్రి ఇలా ఐదురోజులపాటు బ్యాటింగ్ చేశారు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో చివరి ఆటగాడిగా బరిలోకి దిగిన హైదరాబాదీ ఆటగాడు ఎంఎల్ జయసింహా ఆపద సమయంలో భారత్ను ఆదుకుని మ్యాచ్ను డ్రాగా ముగించాడు. ఇక రవిశాస్త్రి 1984లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఐదు రోజులపాటు ఆడాడు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ ముగ్గురు కూడా ఈడెన్ గార్డెన్స్లోనే ఈ ఫీట్ సాధించటం. ఈ ఘనత సాధించిన మరికొందరు ఆటగాళ్లు... జే బాయ్కాట్(ఇంగ్లాండ్), కేజే హ్యూస్(ఆస్ట్రేలియా), అలన్ లాంబ్(ఇంగ్లాండ్), ఏఎఫ్జీ గ్రిఫ్ఫిత్(వెస్టిండీస్), ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లాడ్), ఏఎన్ పీటర్సన్(సౌతాఫ్రికా) Cheteshwar Pujara becomes the third Indian cricketer, after Ravi Shastri and ML Jaisimha to have batted on all 5 days of a Test match. pic.twitter.com/1ERgsi6p9r — BCCI (@BCCI) November 20, 2017 -
టెస్టుల్లో పుజారానే బెస్ట్
శ్రీలంకతో టెస్టులో మూడు రోజులు ఆధిపత్యం వహించి.. నాలుగో రోజు ఒక్క సెషన్లో చెత్త బ్యాటింగ్తో మ్యాచ్ను అప్పగించేసింది భారత జట్టు. నాలుగో రోజు 9 వికెట్లు చేతిలో ఉంచుకొని 153 పరుగులు చేయలేకపోయింది. 176 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ను మొదలుపెట్టి 112 పరుగులకే ఆలౌటై 63 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్తో టీమిండియా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి.. పుజారాకే చాన్స్ ఇవ్వాల్సింది టీమిండియా ఈ టెస్టులో నెగ్గితే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. అనూహ్య ఫలితం రావడంతో అందరి దృష్టి ఎక్కువగా నిలిచింది వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన రోహిత్ శర్మపైనే. సీనియర్లు, క్రీడా పండితుల మాటలు కూడా వినకుండా టెస్టు స్పెషలిస్ట్ పుజారాను పక్కన పెట్టి మరీ రోహిత్ను జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ మాత్రం మ్యాచ్లో ఘోరమైన ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 13 పరుగులే చేశాడు. కీలకమైన మూడోస్థానంలో వచ్చి కనీసం టెయిలెండర్ల స్థాయి ఆటతీరు కూడా కనబర్చలేదు. జట్టులో కచ్చితంగా ఐదుగురు బౌలర్లను తీసుకుంటే, బ్యాటింగ్ విభాగంలో పుజారాకు బదులు రోహిత్ను తప్పిస్తేనే బెటర్. ఒకవేళ నలుగురు బౌలర్లతో ఆడితే ఎలాగూ వీరిద్దరికి అవకాశం వస్తుంది. ఆరుగురు సరిపోతారా.. కోహ్లి ఎంచుకున్న ఐదుగురు బౌలర్ల వ్యూహాం ఈ మ్యాచ్లో పనిచేసింది. అయితే కొంపముంచింది కూడా అదే వ్యూహాం. ఒక స్పెషలిస్టు బ్యాట్స్మెన్ తక్కువ కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. పైగా తుదిజట్టులోకి తీసుకున్న బౌలర్లలో హర్భజన్ సింగ్ విఫలమయ్యాడు. తోటి స్పిన్నర్లు ఇరగదీసిన చోట రెండు ఇన్నింగ్స్ల్లో కలసి కేవలం ఒకే వికెట్ తీశాడు. పైగా బంగ్లా టూర్, జింబాబ్వే పర్యటనలో కూడా భజ్జీ గొప్పగా రాణించింది లేదు. ఎలాగూ ఆఫ్స్పిన్నర్ అశ్విన్ ఉన్నాడు కాబట్టి భజ్జీ స్థానంలో మరో బౌలర్కు అవకాశమిస్తే బాగుంటుంది. లేదా నలుగురు బౌలర్లతో ఆడితే ఒక బ్యాట్స్మెన్కు అవకాశం లభిస్తుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లు సైతం నలుగురు బౌలర్లతోనే ఆడతాయి. కోహ్లి ఈ విషయంపై మరోసారి ఆలోచిస్తే మంచిదేమో. 16వ ఆటగాడిగా బిన్నీ శ్రీలంకలో పర్యటిస్తున్న భారత టెస్టు జట్టుతో ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ చేరనున్నాడు. అతణ్ని జట్టులో 16వ సభ్యుడిగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జట్టులో సమతుల్యం కోసం ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్టు కొలంబోలో ఈనెల 20న మొదలవుతుంది. డీఆర్ఎస్పై మళ్లీ మొదటికి.. మ్యాచ్లో హీరో నిస్సందేహంగా చండీమలే. అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్లో కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేని జట్టుని నెగ్గే వరకు తీసుకొచ్చాడు. భారత బౌలర్లను ఆటాడుకొని 169 బంతుల్లోనే 162 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే చండీమల్ 5 పరుగుల వద్దే అవుటయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో బంతి అతని ప్యాడ్, బ్యాట్ను తగిలి ఫీల్డర్ రాహుల్ చేతిలో పడింది. బంతి ప్యాడ్ను మాత్రమే తగిలిందని భావించిన అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఒకవేళ డీఆర్ఎస్ ఉంటే భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించినా ఆశ్చర్యంగా లేకపోయేది. మ్యాచ్ అనంతరం కోహ్లి సైతం ఈ విషయంపై నోరు విప్పాడు. సిరీస్ అయిపోయాక డీఆర్ఎస్ గురించి ఆలోచిస్తామని తెలిపాడు. నిజానికి డీఆర్ఎస్ను అన్ని దేశాలు వాడుతున్నా బీసీసీఐ మొండివైఖరి వల్ల భారత్ మాత్రమే దాన్ని సమర్ధించడం లేదు. ఇప్పటికైనా డీఆర్ఎస్పై పునరాలోచించాలి. -
సురేష్ రైనాకు షాక్
ముంబై: ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సురేష్ రైనాకు భారత క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. వన్డే జట్టు నుంచి అతడిని తొలగించింది. ఆసియా కప్కు అతడిని పక్కనపెట్టింది. వికెట్ల వేటలో వెనుకబడిన ఇషాంత్ శర్మపై కూడా వేటు వేసింది. ఆసియా కప్, టీ-20 వరల్డ్ కప్ ఆడే జట్టును సెలక్షన్ కమిటీ ఈ రోజు ప్రకటించింది. ఇషాంత్ శర్మను ఈ సిరీస్లకు ఎంపిక చేయలేదు. వన్డే జట్టు నుంచి తప్పించిన రైనాకు టీ-20 వరల్డ్ కప్లో ఆడే అవకాశం కల్పించారు. యువరాజ్ సింగ్ను టీ-20 వరల్డ్ కప్కు ఎంపిక చేశారు. వన్డేలో రైనా స్థానంలో ఛతేశ్వర్ పూజారాను తీసుకున్నారు. -
టాప్టెన్ లో కొనసాగుతున్న పూజారా, అశ్విన్
దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాకింగ్ లో భారత ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అశ్విన్ లు టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో పూజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా, బౌలింగ్ విభాగంలో అశ్విన్ ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్నాడు. కాగా ఈ వీరివురూ ఆటగాళ్లు గత ర్యాంకులను కోల్పోయినా టాప్ టెన్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదు స్థానాలు దిగజారి 33వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు. ఈ సిరీస్ లో పేలవమైన ఆటను కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ కోహ్లి మాత్రం తిరిగి 11 వ స్థానం నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీం ఇండియా 40 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. -
విజయ్, రహానేలకు కెరీర్ బెస్ట్ ర్యాంకులు
దుబాయ్: భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాలు నిలుపుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో బ్యాటింగ్ విభాగంలో పూజారా ఏడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్లో అశ్విన్ కూడా ఏడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. భారత్ తరపున వీరిద్దరివే అత్యుత్తమ ర్యాంకులు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన మురళీ విజయ్, అజింక్య రహానే ర్యాంకింగ్స్లో పైకి ఎగబాకారు. విజయ్ ఆరు స్థానాలు ముందుకు వచ్చి 38వ ర్యాంకులో నిలిచాడు. రహానే 65 నుంచి 63 స్థానానికి ప్రమోటయ్యాడు. వీరిద్దరికీ కెరీర్ బెస్ట్ ర్యాంకులు కావడం విశేషం. దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు 12వ ర్యాంకులో రిటైరయ్యాడు. -
గంభీర్, పుజారా సెంచరీలు
హుబ్లీ: పేలవ ఫామ్తో పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్న ఓపెనర్ గౌతం గంభీర్ (236 బంతుల్లో 123; 11 ఫోర్లు) దాదాపు రెండేళ్ల అనంతరం చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ చతేశ్వర్ పుజారా (228 బంతుల్లో 139 బ్యాటింగ్; 15 ఫోర్లు)సైతం అజేయ శతకంతో రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. వెస్టిండీస్ ‘ఎ’తో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. ప్రస్తుతం 66 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెహ్వాగ్ (49 బంతుల్లో 38; 2 ఫోర్లు; 1 సిక్స్) ఓ మోస్తరుగా ఆడాడు. క్రీజులో పుజారాతో పాటు నాయర్ (18 బంతుల్లో 10 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 10 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్లో గంభీర్, పుజారా విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడి రెండో వికెట్కు 207 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.