coins
-
మార్కెట్లో రూ.20 నాణెం.. తికమక పడుతున్న జనం
సిరిసిల్లటౌన్: మార్కెట్లో రూ.20 నాణేలు చలామణి అవుతున్నాయి. కొత్తగా ఈ కాయిన్స్ వచ్చినట్లు చాలా మందికి తెలియక అయోమయానికి గురవుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వీటిని మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసంది. కాస్త చిన్న సైజులోనే రూ.5 కాయిన్స్ కూడా చలామణి అవుతున్నాయి. రెండు చిన్నపాటి మార్పులతో ఉండడంతో ప్రజలు తికమకపడుతున్నారని చర్చించుకుంటున్నారు. -
విజయవాడలో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో (ఫొటోలు)
-
పదిలమే.. ఆ నాణెం నాణ్యమైనదేనని ప్రచారం
గత కొంతకాలంగా నగరంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలు, మెడికల్ షాపులు ఇతర వ్యాపార వేదికల్లో ‘పది రూపాయల నాణెం చెల్లబడును, 10 రూపాయల కాయిన్ ఇవ్వబడును–తీసుకోబడును’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. పది రూపాయల నాణెం పదిలమే, నిత్య జీవన లావాదేవీల్లో భాగమే, ఈ కాయిన్ నకిలీ కాదు, బ్యాన్ చేయలేదు అని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ పది రూపాయల నాణెంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్ల ఫలితంగా పది రూపాయల కాయిన్ కనిపిస్తే చాలు.. ఇది చెల్లదు, ఇది బ్యాన్ అయ్యిందని నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది రూపాయల కాయిన్ నిషేధించలేదని, దీనిని నిరాకరించినవారు చట్ట రిత్యా చర్యార్హులని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. సదరు బ్యాంకులకు కూడా దీనిపై అవగాహన కల్పిపంచాలని సూచించింది. 2008 ముద్రణ నకిలీదని పుకార్లు.. దేశంలో 10 రూపాయల నాణేలను 2005లో మొదటిసారి ముద్రించారు. అయితే 2008లో రెండో సారి మళ్లీ ముద్రించిన నాణెం విషయంలోనే గందరగోళం ఏర్పడింది. అనుకోకుండా ఇవి నకిలీవని సోషల్ మీడియాలో వైరల్గా మారిన పుకార్లతో వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు ఈ 10 రూపాయల కాయిన్పై విముఖత ప్రదర్శించారు. 2016 జులైలో భారతదేశంలోని కొంతమంది దుకాణదారులు రూ.10 నాణేన్ని పూర్తిగా స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్లు నివేదించబడింది.2011లో మూడో సారి, చివరగా 2019లో మరో ముద్రణ చేపట్టినప్పటికీ 2008లో ముద్రించిన కాయిన్ పై వచి్చన వదంతులు మాత్రం తొలగట్లేడు. ఈ సమస్యపై ఆర్బీఐ ఇచి్చన సూచన మేరకు నగరంలోని పలు బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాయి. వీధుల్లోని దుకాణాలు మొదలు, షాపింగ్ మాల్స్ వరకూ అవగాహన కల్పిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం దీనిపై పాజిటీవ్గా ప్రచారం చేస్తున్నారు. -
క్రికెట్ గాడ్ సచిన్కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలి క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి లెజెండ్గా ఎదిగిన సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్, 24) ఈ రోజు. ఈ సందర్భంగా ఒక విషయం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరంగా మారింది.ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్ సమాధానం తెలుస్తే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్మాన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వీటిల్లో ఏది అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు "నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్. ఇంతకీ ఆ నాణేల కథ ఏంటి అంటే.‘క్రికెట్ దేవుడు'గా అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రాటుదేలేలా కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్ సెషన్లో కోచ్ అచ్రేకర్ అద్భుతమైన శిక్షణలో సచిన్ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్ ఒక ట్రిక్ వాడేవారట. క్రికెట్ స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట. ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్ కాకుండా ఆడాలని సచిన్కు సవాల్ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు సచిన్.'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను2023, జనవరిలో సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా కోచ్ అచ్రేకర్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు. ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్గా నేను లేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సచిన్.He taught me technique, discipline and most importantly, to respect the game.I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y— Sachin Tendulkar (@sachin_rt) January 2, 2023కాగా సచిన్ టెండూల్కర్కు తొలుత టెన్నిస్పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్ కూడా అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్కు పరిచయం చేయడంతో క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్దకు సచిన్ను తీసుకెళ్లాడు. సచిన్ ఆటతీరు చేసిన అచ్రేకర్ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్ ప్రపంచం, ఒక లెజెండ్ను మిస్ అయ్యేదేమో! -
ఆ చిల్లర విలువ ఎంత అంటే?
ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్ని సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్లో జమ అవుతున్నాయట. ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. ట్రెవీ ఫౌంటెన్ రోమ్లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు. పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్లో నాణెం విసురుతాడు. రోమ్ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్లో నాణేలు విసురుతారట. Tourists throw over €1 million into Italy's Trevi Fountain each year. pic.twitter.com/GVAIfciJSg — Historic Vids (@historyinmemes) March 24, 2024 కాగా ఈ పౌంటెన్లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్ దగ్గర సినిమా షూటింగ్లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్గా మారింది. . -
ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి డిపాజిట్ ఎలా కట్టాడో తెలుసా?
ప్రతి ఎన్నికలలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థులు చర్చనీయాంశం అవుతూ ఉంటారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జబల్పూర్ వ్యక్తి కూడా ఇలాగే వార్తల్లో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా జబల్పూర్లో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న వినయ్ చక్రవర్తి ఎన్నికల డిపాజిట్ను చిల్లర నాణేల రూపంలో చెల్లించారు. నామినేషన్ ఫారమ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించడానికి రూ. 25,000 నాణేలతో బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లారు. రూ. 10, రూ. 5, రూ. 2 నాణేల రూపంలో రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని, కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్, ఆన్లైన్ విధానంలో డిపాజిట్ చెల్లించే సౌకర్యం లేదని అందుకే తన వద్ద ఉన్న నాణేల రూపంలో డిపాజిట్ చెల్లించానని చక్రవర్తి తెలిపారు. దీనిపై జబల్పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా విలేకరులతో మాట్లాడుతూ, అభ్యర్థి నాణేలలో రూపంలో చెల్లించిన డిపాజిట్ను స్వీకరించి దానికి సంబంధించిన రశీదును అతనికి అందించినట్లు చెప్పారు. లోక్సభ తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లోని అరడజను స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!
ఈ వైరల్ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిహార్లోని రాజ్గిర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్’ అంటున్నారు నెటిజనులు. -
బ్రిటిష్ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇచ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..! మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ అండ్ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
రూ.కోటి పోర్షే లగ్జరీ కారు కొన్నాడు.. చిల్లర చూసి సిబ్బందికి ఫీజులు ఎగిరిపోయాయ్
Porsche 718 Boxster : ఇది సోషల్ మీడియా యుగం. ఏది చేసినా వినూత్నంగా చేయాలి. ఆ పని నలుగురిని ఆకట్టుకునేలా ఉండాలి. అలా అని అందరూ చేసే పని చేయకూడదు. ఇదిగో ఇలా ఆలోచించే వారి ధోరణి ఎక్కువైపోయింది. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం కోటి రూపాయి కాయినట్లను చెల్లించడం ఆసక్తికరంగా మారింది. క్రేజీ ఎక్స్వైజెడ్ అనే యూట్యూబర్ రూ.1 నాణేలను చెల్లించి రూ.1 కోటి విలువైన పోర్షే 718 బాక్స్స్టర్ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆయూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? తన ఇంటి వద్దే కాయిన్స్ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్తాడు. అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను. ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం షోరూం బయట ఉన్న తన కార్లో ఉన్న కాయిన్స్ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందిస్తాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్ను రాశులుగా పోసి లెక్కిస్తారు. కొన్ని గంటల పాటు లెక్కించిన అంనతరం.. పోర్షే కారును ఆ యూట్యూబర్కు అందిస్తారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యూట్యూబర్ కొనుగోలు చేసిన పోర్షే 718 బాక్స్స్టర్ కూపే జర్మన్ ఆటోమేకర్. మనదేశంలో విక్రయించే లగ్జరీ కార్లలో ఇదొకటి. బాక్స్స్టర్తో పాటు, 718 బ్యాడ్జ్ 718 కేమాన్, 718 కేమాన్ ఎడిషన్, 718 బాక్స్స్టర్ స్టైల్ ఎడిషన్, 718 కేమాన్ ఎస్, 718 బాక్స్స్టర్ ఎస్, 718 కేమాన్ జీటీఎస్ 4.0,718 బాక్స్స్టర్ జీటీఎస్ 4.0 వంటి వేరియంట్లలో లభిస్తుంది. పోర్షే 718 బాక్స్స్టర్ కన్వర్టిబుల్ రూఫ్టాప్తో వస్తుంది. 4-సిలిండర్ 2.0-లీటర్ ఇంజన్ను డిజైన్ చేయబడింది. పూర్తి సామర్థ్యంతో, ఇంజిన్ 220 కేడబ్ల్యూ శక్తిని 380 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కారు వేగం 5.1 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ నుండి వేగంగా వెళ్లగలదు. -
ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..
ఇంగ్లండ్లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మాంచెస్టర్లో ఇటీవల కొద్దిరోజులుగా నాణేల కలకలం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వీథుల్లోను, బస్టాపులు, పార్కుల్లోని బెంచీల మీద, పార్కింగ్ టికెట్ మెషిన్లు, వెండింగ్ మెషిన్లు, ఫుడ్ కోర్టులు సహా జన సమ్మర్దం గల ప్రదేశాల్లో కొద్దిరోజులుగా మిలమిలలాడే సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి చెల్లా చెదురుగా పడి ఉంటున్నాయి. జనాల్లో కొందరు వీటిని జేబులో వేసుకుని తీసుకుపోతుంటే, ఇంకొందరు మనకెందులే అన్నట్లుగా ఎక్కడివక్కడే వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. ఈ నాణేలు వీథుల్లో ఎక్కడపడితే అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయో, వాటిని ఎవరు పడేశారో, దీని వెనుక గల ఉద్దేశమేమిటో జనాలకు కొద్దిరోజుల వరకు అంతుచిక్కలేదు. అయితే, దీనివెనుక గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం చేపట్టిన ‘ది ఫైండ్’ అనే ఆర్ట్ ప్రాజెక్టులో భాగంగా మార్క్ గాండెర్ అనే కళాకారుడు ఈ నాణేలను రూపొందించాడు. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జూలై 16 నాటితో ముగుస్తోంది. ఫెస్టివల్ చివరి రోజు వరకు నగరంలోని వేర్వేరు చోట్ల ఇలా రెండు లక్షల నాణేలను ఉంచనున్నట్లు ఆర్ట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని కనుక్కోగలమనే దాన్ని ఈ నాణేలు గుర్తు చేస్తాయని, ఇవి నగరవాసులకు, సందర్శకులకు జ్ఞాపికలుగా మిగిలిపోతాయని మార్క్ గాండెర్ వెల్లడించారు. (చదవండి: భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక ఉండొచ్చట!) -
చిల్లర భరణం.. భర్తకు షాకిచ్చిన కోర్టు
జైపూర్: భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తెచ్చిన ఓ భర్తకు కోర్టు షాకిచ్చింది. వాటిని తీసుకోవాలని భార్యకు చెబుతూనే.. ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి ఇవ్వాలంటూ భర్తను ఆదేశించింది. రాజస్తాన్లోని జైపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్, భార్య సీమ విభేదాలు రావడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఈ కేసు పెండింగ్లో ఉంది. అప్పటి వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్ 17న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే.. దశరథ్ అరెస్ట్ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. 280 కేజీల దాకా బరువులు ఉన్నాయి ఆ సంచులు. అయితే.. ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారని ఆరోపించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: శివలింగంపై కరెన్సీ నోట్లు విసిరి.. -
త్వరలో విడుదల కానున్న రూ. 75 కాయిన్ - ప్రత్యేకతేంటంటే?
Rs 75 Special Coin: నూతన పార్లమెంట్ భవనం త్వరలో ప్రారంభం కానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 75 కాయిన్ విడుదల చేయడానికి సంకల్పించింది. త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న రూ. 75 కాయిన్ ప్రత్యేకతలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 75 నాణెం సాధారణ కాయిన్స్ మాదిరిగా కాకుండా.. భిన్నంగా ఉంటుంది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వరకు ఉంటుంది. దీనిని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలయికతో తయారు చేయనున్నారు. వ్యాసం 44 మిల్లీ మీటర్స్ వరకు ఉంటుంది. ప్రత్యేకతలు 75 రూపాయల నాణెం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఇందులో ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం, దాని కింద 'సత్యమేవ జయతే' అనే వాక్యం ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అనే పదం, కుడివైపున ఇంగ్లిష్లో ఇండియా అనే పదం ఉంటుంది. దీనికి మధ్య భాగంలో దాని విలువను తెలియజేయడానికి 75 అనే సంఖ్య, కాయిన్ ఎగువ అంచుపై 'సంసద్ సంకుల్' అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున 'పార్లమెంట్ కాంప్లెక్స్' ఉండనున్నాయి. ప్రస్తుతం 1, 2,5,10 రూపాయల నాణేలు అందుబాటులో ఉన్నాయి. అయితే 10 నాణెం వాడకం బాగా తగ్గింది. ఇక త్వరలో కాయిన్స్ జాబితాలోకి రూ. 75 నాణెం కూడా చేరనుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 100 నాణెం కూడా గతంలోనే వెల్లడించారు. ఇది మన్కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా విడుదల చేశారు. అయితే ఇది సాధారణ కాయిన్ మాదిరిగా వాడుకునే అవకాశం లేదు. ఇప్పుడు త్వరలో విడుదలకానున్న రూ. 75 కాయిన్ కూడా సాధారణ ప్రజలు వాడుకోవడానికి అందుబాటులో వస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
'షిర్డి ఆలయం నుంచి నాణేలను తీసుకోం'..! అంటున్న బ్యాంకులు
మహారాష్ట్రలో ప్రఖ్యాతి గాంచి షిర్డీ సాయిబాబా ఆలయం నాణేల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆలయానికి ప్రతి నెల నాణేల రూపంలో సుమారు రూ. 28 లక్షల వరకు విలువైన నగదు వస్తుంది. దీన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ సంస్థ ట్రస్ట్కి ప్రభుత్వ సంబంధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 13 శాఖల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంకులు షిర్డీలో ఉండగా, ఒకటి నాసిక్లో ఉంది. ట్రస్ట్ ఖాతా ఉన్న ప్రతి బ్యాంకు ఆలయం నుంచి విరాళాలను, డిపాజిట్లను సేకరించడానికి ప్రతి నెల తమ సిబ్బందిని పంపుతాయి. ఐతే నాణేల రూపంలో ఇప్పటికే సుమారు రూ. 11 కోట్లు షిర్డీ సంస్థాన్కి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ అయ్యింది. ఇక నాణేలను దాచేందుకు అక్కడ బ్యాంకుల వద్ద స్థలంలో లేదు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు ప్రతిరోజు లభించే నాణేలను ఉంచడానికి తమ వద్ద స్థలం లేదన్నారు. దీంతో షిర్డీ ట్రస్ట్ నాణేలను ఉంచడం ఒక సమస్యగా మారింది. దీంతో ఈ విషయంలో ఆర్బీఐని జోక్యం చేయయమంటూ..ట్రస్ట్ నేరుగా లేఖ రాయాలని యోచిస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల తోపాటు ఇతర బ్యాంకులు కూడా ఇదే మాదిరి నాణేలను దాచేందుకు స్థలం సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రస్ట్ సీఈవో మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి మళ్లీ నాణేల సమ్యస్య తెరపైకి వచ్చింది. ఆలయంలో సగటున రోజువారిగా 50 వేలకు పైగా నాణేలు పేరుకుపోయాయి. నాణేల సేకరణను నాలుగు బ్యాంకులు నిలిపేశాయి. దీంతోపాఏటు మిగిలిన బ్యాంకులు ఇదే సమస్యను ఎదుర్కొటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించమని షిర్డీ సంస్థాన్ అధికారులు తనని సంప్రదించినట్లు తెలిపారు. ఈ విషయమై అహ్మదాబాద్లో మిగతా బ్యాంకులను సంప్రదించి..అక్కడ ఖాతాలనుతెరిచే యోచన కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బ్యాంకుల మాత్రం తమ వద్ద నాణేలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయని చెబుతున్నాయి. అప్పట్లో ట్రస్ట్ నాణేలను నిల్వ చేయడానికి ఆలయ ప్రాంగణంలో బ్యాంకుల గదులను ఇచ్చింది. కాని కానీ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేనందున తిరస్కరించినట్లు చెప్పారు. (చదవండి: మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు) -
కోర్టులో భర్త చేసిన పనికి బిత్తర పోయిన భార్య.. అసలేం జరిగిందంటే?
సేలం(తమిళనాడు): అభిప్రాయబేధాల కారణంగా విడిపోయిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా భర్త తీసుకువచ్చిన సంఘటన తమిళనాడులోని సేలం కోర్టులో జరిగింది. సేలం జిల్లా దేవన్నక వుండనూరు కిడయూరు మెట్టూరుకి చెందిన రాజీ (57) ఓ ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాంతి. వీరు అభిప్రాయభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితిలో భరణం కోసం శాంతి సంగగిరి 2వ క్రిమినల్ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతి నెలా రూ.73,000 జీవన భృతిగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఆ మొత్తాన్ని రాజీ సరిగ్గా చెల్లించకపోవడంతో శాంతి సంగగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని (రూ.2.18 లక్షలు) వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్తో సహజీవనం చేసి.. దీంతో బుధవారం ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన భరణం సొమ్ము రూ.2.18 లక్షలను రూ.10 నాణేలుగా 11 బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చాడు. దీంతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కాగా, భార్యకు భరణం సొమ్మును చిల్లర రూపంలో ఇచ్చి ఆమెను భర్త అవమానించాడని కోర్టు సిబ్బంది మండిపడ్డారు. -
10వేల కాయిన్స్ తో నామినేషన్ వేసిన ఆప్ అభ్యర్థి
-
ఇదెక్కడి ‘చిల్లర’ నామినేషన్!.. 4 గంటలపాటు హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం: ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి.. చిల్లర లెక్కిస్తూ కొందరు కనిపిస్తున్నారు కదా..! ఇదేదో దేవాలయంలో హుండీ లెక్కింపునకు సంబంధించిన చిత్రం అనుకుంటే పొరపాటే. ఇది విశాఖపట్నం కలెక్టరేట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ కేంద్రం. అయితే ఇక్కడ చిల్లర ఏంటి అని అనుకుంటున్నారా?.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి పేరు.. ఎన్.రాజశేఖర్. ఈయన పట్టభద్రుడు. ప్రస్తుతం శ్రీముఖలింగం దేవాలయ ప్రధానార్చకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి తన వద్ద ఉన్న చిల్లర మొత్తాన్ని డిపాజిట్గా కట్టేందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిల్లరని అధికారులకు రూ.10 వేలు అని చెప్పి అందించారు. ఆ చిల్లర మొత్తం చూసి సిబ్బంది మొత్తం షాక్ అయ్యారు. చిల్లరంతా పోగేసి నలుగురైదుగురు సిబ్బంది లెక్కపెట్టారు ఇందుకు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రూపాయి, రూ.2, రూ.5 నాణేల్ని లెక్కించగా మొత్తం రూ.6 వేలే ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కాసేపు రాద్ధాంతం కూడా జరిగింది. మిగిలిన మొత్తాన్ని నోట్ల రూపంలో చెల్లించి.. చివరికి నాలుగు గంటల హైడ్రామా అనంతరం రాజశేఖర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఏదేమైనా.. ఈ చిల్లర మొత్తం లెక్కపెట్టి.. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి తలప్రాణం తోకకొచ్చిందని ఎన్నికల సిబ్బంది వాపోయారు. చదవండి: కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో -
RBI: నోట్లతో పనిలేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కాయిన్స్!
చిల్లర సమస్యకు చెక్ పెడుతూ ముఖ్యంగా నాణేల చలామణిని ప్రోత్సహిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త పరిష్కారాన్ని తీసుకొస్తోంది. కొన్ని ముఖ్యమైన బ్యాంకులతో కలిసి క్యూఆర్ కోడ్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా తెలియజేశారు. ఎంపిక చేసిన 12 నగరాల్లోని 19 ప్రాంతాల్లో ఈ మిషన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా కాయిన్ వెండింగ్ మిషన్లలో మనం నోట్లు పెడితే అందుకు తగినంత నగదు నాణేల రూపంలో వస్తుంది. కానీ నోట్లు లేకుండా నగదు నాణేల రూపంలో కావాల్సినవారు ఈ మిషన్ల ద్వారా పొందవచ్చు. ఇతర కాయిన్ వెండింగ్ మిషన్ల మాదిరిగా కాకుండా ఇది యూపీఐ వ్యవస్థ అనుసంధానంతో పనిచేస్తుంది. కాయిన్స్ కోసం నోట్లు ఇవ్వాల్సిన పనిలేదు. వినియోగదారులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమకు కావాల్సిన నాణేలు, అవసరమైన డినామినేషన్లో పొందవచ్చు. పైలట్ ప్రాజక్ట్ కింద మొదట ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ మిషన్ల పనితీరు, ఉపయోగాన్ని పరిశీలించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించి నాణేల విస్తృత చలామణికి సంబంధించి బ్యాంకులకు గైడ్లైన్స్ ఇవ్వనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఈ మిషన్లతో వినియోగదారులకు కాయిన్స్ కొరత తీరడమే కాకుండా నాణేల చలామణిని కూడా ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. (ఇదీ చదవండి: RBI: విదేశీయులూ యూపీఐ చెల్లింపులు చేయొచ్చు!) -
9 లక్షల నకిలీ నాణేలు పట్టివేత
ముంబయిలో 9 లక్షలకు పైగా నకిలీ నాణేలు పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ముంబయిలోని మలద్ ప్రాంతంలో నకిలీ నాణేలను చలామణి చేస్తున్న నిందితున్ని పట్టుకుని 9 లక్షలకుపైగా నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలో జరుగుతున్న నకిలీ నాణేల చలామణిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం తమకు సమాచారం అందించారని, వారితో కలిసి బుధవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టి నిందితుణ్ణి పట్టుకుని నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. పట్టుబడ్డవాటిలో రూపాయి, రూ.5, రూ.10 విలువ కలిగిన 9.46లక్షల పాత నకిలీ నాణేలు ఉన్నాయి. ఈ నకిలీ నాణేల తయారీ కేంద్రాన్ని హర్యానాలో నిర్వహిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అధికారులు ఇదివరకే దాడులు నిర్వహించి ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ నాణేలను ముంబయిలో చలామణి చేస్తున్నట్లు తెలిసిన సమాచారంతో ముంబయిలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాలే అడ్డా సాధారణంగా నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, పట్టివేత గురించి మనం తరచూ వింటుంటాం. అయితే ఇటీవల కాలంలో నకిలీ నాణేల చలామణి కూడా ఎక్కువైంది. భారీ మొత్తంలో తయారు చేసిన నకిలీ నాణేలను దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద చలామణి చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
మంచిర్యాల: చిల్లరతో కాస్ట్లీ బైక్ సొంతం
మంచిర్యాల: జిల్లా కేంద్రం పరిధిలోని కోల్బెల్ట్ ఏరియాలో నివసించే ఒక యువకుడు చేసిన పని.. ఓ బైక్ షోరూం నిర్వాహకులకు షాకిచ్చింది. ఏకంగా వందకు పైగా సంచుల్లో నాణేలు ఇవ్వడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తన కలల బైక్ను సొంతం చేసుకోవడానికే తాను ఈ డబ్బుతో వచ్చానని చెప్పడంతో వాళ్లు కంగుతిన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ తారకరామ కాలనీకి చెందిన వెంకటేశ్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేశాడు. స్పోర్ట్స్ బైక్పై తిరగాలన్నది అతని కోరిక అట. అందుకోసం దాచుకున్న చిల్లర డబ్బును తీసుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంకి వెళ్లాడు. 112 సంచు(సీల్డ్ కవర్లు)ల్లో తెచ్చిన చిల్లరను చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. అయితే.. చిల్లరంతా లెక్కించిన తర్వాతే బైక్ అందిస్తామని వాళ్లు తెలిపారు. ఆపై.. పదిహేను మంది సిబ్బంది గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నాణేలు లెక్కించారు. రూ.2.85 లక్షల రూపాయి విలువగా తేలడంతో.. విలువైన స్పోర్ట్స్ బైక్ను వెంకటేశ్కు అందించారు. పోగు చేసిన చిల్లరతో తన డ్రీమ్ స్పోర్ట్స్ బైక్ దక్కించుకోవడంతో వెంకటేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
వైద్యులు షాక్.. ఆ వృద్ధుడి కడుపులో ఏమున్నాయంటే?
యశవంతపుర(కర్ణాటక): మానసిక రోగి ఆయిన ఓ వృద్ధుడు తన చేతికి ఇచ్చే నాణేలను నిత్యం మింగేసేవాడు. రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన ద్యావప్ప (58) ఇలా 187 నాణేలను మింగాడు. అనారోగ్యానికి గురి కావటంతో కుటుంబ సభ్యులు బాగలకోట బసవేశ్వర సంఘం కుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్రే తీసి ఇక ఆలస్యం చేస్తే ప్రాణానికి పెను ప్రమాదమని వెంటనే శస్త్ర చికిత్స చేసి నాణేలను బయటకు తీశారు. ఐదు, రెండు రూపాయలు కాయిన్లు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఈశ్వర కలబురిగి, ప్రకాశ కట్టిమని, అర్చన, రూపలు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స తరువాత ద్యావప్ప ఆరోగ్యం కుదుటపడింది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? -
రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్ల మార్పు! విలువెంతంటే..
లండన్: బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేషన్స్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్స్, రాయల్ మింట్ నుంచి కాయిన్స్ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్లో బ్యాంక్ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది. రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్ అమెరికన్ డాలర్లు(ఒక బిలియన్ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. రాజు బొమ్మతో ఎలాగంటే.. కింగ్ ఛార్లెస్-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్ ఛార్లెస్-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది. ఇదీ చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
రూ.11 కోట్ల చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: రాజస్తాన్లో కరౌలీ జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మెహందీపూర్ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎస్బీఐ మెహందీపూర్ బ్రాంచ్లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. -
5 రూపాయల నాణేలతో అక్కకు తులాభారం
ఖమ్మం అర్బన్: ఖమ్మంలో ఓ సోదరుడు తన అక్కకు రూ.56 వేల విలువైన రూ.5 నాణేలతో తులాభారం వేసి కానుక అందజేయడం ద్వారా తన ప్రేమను చాటుకున్నాడు. భదాద్రి కొత్తగూడెం జిల్లా గార్ల బయ్యారానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బొలగాని బసవనారాయణ ఖమ్మంలో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె రణశ్రీకి గత ఏడాది వివాహం జరగ్గా, కుమారుడు త్రివేది పదో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా తనకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని రూ.5 నాణేలుగా మారుస్తున్న త్రివేదిని ఎవరడిగినా ఎందుకో చెప్పేవాడు కాదు. వివాహమయ్యాక తొలిసారి రాఖీ కట్టేందుకు వస్తున్న సోదరికి ఈ నాణేలతో తులాభారం వేసి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు త్రివేది.. తన తల్లిదండ్రులకు పండుగ ముందురోజు చెప్పాడు. దీంతో శుక్రవారం బంధువులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో తులాభారంపై ఒక వైపు అక్కను కూర్చోపెట్టి మరో వైపు అక్క బరువు ఎత్తు తాను సేకరించిన రూ.5 నాణేలను ఉంచి బహుమతిగా ఇవ్వడంతో ఆమె మురిసిపోయింది. (క్లిక్: ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం) పంచ పాండవుల పూలే రాఖీలు మార్కెట్లో దొరికే రెడీమేడ్ రాఖీలతో అందరూ రక్షాబంధన్ జరుపు కొంటారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య ఇంట్లో మాత్రం రాఖీ పండుగ వినూత్నంగా జరుగుతుంది. వీళ్ల ఇంట్లో పంచపాండవుల పూలతోనే రాఖీలు కట్టుకుంటారు. రాఖీల పోలికతో ఉండే ఈపంచపాండవుల పూలను రాఖీలుగా తయారు చేసి కట్టుకోవడం గొప్ప అనుభూతిని స్తున్నందని అయిలయ్య చెబుతున్నాడు. అయిలయ్య కొన్నే ళ్లుగా కూర గాయలు, పండ్లు, పూల నర్సరీలను పెంచుతుండటంతో కూర గాయల అయిలయ్యగా అందరికీ చిరపరిచితం. – హుస్నాబాద్ -
మన రూపాయి పవర్ ఏంటో చూపించాలి - ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలో భారతీయ బ్యాంకులను, కరెన్సీని కీలక భాగంగా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడంపై ఆర్థిక సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘మన దేశీ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నిర్వహణలో వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు. ఇదే సందర్భంగా ’జన్ సమర్థ్’ పోర్టల్ను కూడా ప్రధాని ప్రారంభించారు. 13 రకాల ప్రభుత్వ రుణాల స్కీములకు సంబంధించిన పోర్టల్గా ఇది పని చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు జన్ సమర్థ్ తోడ్పడుతుంది. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పడగలదు‘ అని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సర్వీసులను అందించేందుకు అనువైన అనేక ప్లాట్ఫామ్లను భారత్ అభివృద్ధి చేసిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక నాణేల సిరీస్ ఆవిష్కరణ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సిరీస్ నాణేలను ప్రధాని ఆవిష్కరించారు. రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఇవి ఉంటాయి. వీటిపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) డిజైన్ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, యథాప్రకారం చెలామణీలో ఉంటాయని ప్రధాని తెలిపారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించేందుకు కొత్త సిరీస్ నాణేలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు. -
ఉపాధి పనుల్లో బయటపడిన 229 రాగి నాణేలు
బాలానగర్: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మట్టికుండలో 229రాగి నాణేలు లభించాయి. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నందారంలోని లక్ష్మికి చెందిన భూమి (సర్వే నం.83) లో సోమవారం ఈజీఎస్ సిబ్బంది లెవలింగ్ పనులు చేపట్టారు. అడుగులోతు తవ్వగా మట్టికుండ కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి నరేష్ చేరుకుని దానిని విప్పిచూడగా 229 రాగి నాణేలు బయటపడ్డాయి. ఇవి నిజాం కాలం నాటివిగా గుర్తించి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు స్వాధీనపర్చారు. ఈ సంఘటనతో సదరు భూ యజమాని లెవలింగ్ పనులను నిలిపివేయించారు. -
గొంతులో ఏదైనా ఇరుక్కుపోయిందా? పొరబోయిందా?
పలకాబలపాలతో బడికి పోయే వయసులోనూ, అంతకంటే చిన్నప్పుడు ఆడుకునే ఈడులో తెలిసీతెలియక చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు... కొందరు చిన్నారులు ముక్కులో బలపం/చిన్నచాక్పీస్/చిన్న పెన్సిల్ వంటివి పెట్టుకుని, అది లోనికి వెళ్లేలా పీల్చడం లాంటి పనులు చేస్తుంటారు. మరికొందరు నాణేలను నోట్లో పెట్టుకుని మింగడం వల్ల అవి గొంతులో ఇరుక్కుని బాధపడుతుంటారు. గొంతులో ఇరుక్కునే చిన్నవస్తువులు ఇంకా ఎన్నో! ఆహారం అలా ఇరుక్కుంటే పొరబోయిందంటూ మన ఇళ్లలోని పెద్దలు అంటుంటారు. అలా జరిగినప్పుడు కాసేపు బాధగా ఉండి... అది బయటకు తన్నేసినట్లుగా ఒక్కోసారి ముక్కులోంచి కూడా వస్తుంటుంది. ఇలా గొంతులో బయటి వస్తువులు ఇరుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ప్రథమచికిత్సలను తెలుసుకుందాం. ముక్కు... నోరు... ఈ రెండింటికీ కొంత దూరం. కానీ గొంతులో రెండిటి మార్గం కాసేపు ఒకటే. ఆ తర్వాత గాలి... విండ్పైప్ ద్వారా ఊపిరితిత్తుల్లోకీ, ఆహారం ఫుడ్పైప్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. గొంతులో గ్లాటిస్ అనే చోట ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన విండ్పైప్, ఆహారం తీసుకెళ్లే ఈసోఫేగస్ ఈ రెండూ మార్గాలూ ఒకేచోట ఉంటాయి. అయితే... ఇక్కడే ఎపిగ్లాటిస్ అనే పొర ఉండి... మనం గాలిని పీల్చుకుంటున్న సమయంలో విండ్పైప్ మాత్రమే తెరచి ఉండేలా చూసి... ఆహారనాళాన్ని మూసి ఉంచుతుంది. అలాగే ఆహారాన్ని మింగుతున్నప్పుడు ఆహారనాళమే తెరచి ఉండేలా చూసి, విండ్పైప్ను మూసేస్తుంది. (చదవండి: బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం...) అయితే ఒక్కోసారి మనం ప్రధానంగా నీళ్లూ లేదా ద్రవాహారాలు (కొన్నిసార్లు అన్నం వంటి ఘనాహారాలు కూడా) తీసుకునే సమయంలో అవి పొరబాటున విండ్వైప్లోకి వెళ్లిపోతాయి. దాంతో ఓ రక్షణాత్మకమైన చర్యలా... ఊపిరితిత్తుల్లోంచి గాలి ఫోర్స్గా బయటకు చిమ్ముకొచ్చినట్లుగా వస్తూ... ఆ పదార్థాలను బలంగా బయటికి నెట్టేస్తుంది. అలాగే చిన్నపిల్లలు తమ గొంతులో ఉండే పైప్ కంటే పెద్ద సైజులో ఉండే వస్తువులను తీసుకున్నప్పుడు అవి గొంతులోకి ఇరుక్కుపోతాయి. అప్పుడూ బలంగా దగ్గు, గాలి వచ్చినా... ఆ ఘన పదార్థలు గట్టిగా ఉండటంతో బయటకు నెట్టలేకపోతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... గొంతులో ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► నాలుగేళ్ల లోపు పిల్లలకు పెద్ద క్యారట్ ముక్కలు, పెద్దగా ఉండే నట్స్, బాగా గట్టిగా ఉండే చాక్లెట్లు, పెద్ద గింజలుండే పండ్లను పెట్టకూడదు. ఒకవేళ తినిపిస్తే... వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాక మాత్రమే ఇవ్వాలి లేదా క్యారట్ వంటి వాటిని తురిమి ఇవ్వాలి. వాటిని మెత్తగా నమిలి తినమని పిల్లలకు చెప్పాలి. ► చిన్నపిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని పిల్లలు విరగొట్టడం చాలా సాధారణం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి. అంటే వాటి విడిభాగాలు నోట్లోకి దూరనంత పెద్దగా ఉండాలన్నమాట. చిన్న చిన్న పూసల్లాంటి విడిభాగాలతో ఉండే బొమ్మలను పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు తప్పకుండా పక్కనే ఉండాలి. (గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!) ► పిల్లల ఉయ్యాలపై వేలాడదీసే రంగులరాట్నం వంటి బొమ్మలు వాళ్ల చేతికి అందనంత ఎత్తులో అమర్చాలి. ► పిల్లలు బెలూన్ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► చిన్నారులు తమ మెడలోని చైన్లను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున... బాగా సన్నటి చైన్లను, నెక్లేస్లను పిల్లల మెడలో వేయకూడదు. ► చిన్న పిల్లలు ఆడుకోడానికి నాణేలు, కాసులు ఇవ్వడం సరికాదు. గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి.. ► ఏదైనా వస్తువు మింగిన చిన్నారి బాగా గట్టిగా దగ్గుతున్నా / గట్టిగా ఏడుస్తున్నా / మాట్లాడగలుగుతున్నా వారికి అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్లనే మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ► పిల్లలు చాలా బలహీనంగా దగ్గుతున్నా / ఊపిరితీస్తున్నప్పుడు సన్నటి శబ్దం వస్తున్నా / ఏడుపుగాని, మాటగాని, గొంతులోంచి వచ్చే శబ్దంగాని చాలా బలహీనంగా ఉన్నా... వారు మింగిన వస్తువు గొంతులో బలంగా ఇరుక్కుపోయిందని తెలుసుకోవాలి. వస్తువు మింగిన చిన్నారి వయసు ఏడాదికి పైబడి ఉన్నప్పుడు వారికి ‘హీమ్లిచ్ మెనోవర్’ అనే ప్రథమ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఏడాది లోపు పిల్లలకు... ► మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టిప్పుడు చిన్నారి తల కిందివైపునకు ఉండేలా చూడాలి. చేతులతో వీపుపై అకస్మాత్తుగా, బలంగా ఒత్తిడి కలిగించాలి. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను నడుము భాగం నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలించాలి. మన కాళ్ల ఒత్తిడికీ, చేతుల ఒత్తిడికీ పిల్లల పొట్ట ముడుచుకుపోవడం వల్ల... ఇరుక్కున్న వస్తువు పైకి ఎగబాకి, బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మనం కలిగించే ఒత్తిడి పిల్లలను గాయపరచనంత మృదువుగా మాత్రమే ఉండాలి. ► చిన్నారులు ఏదైనా వస్తువు మింగినప్పుడు వాళ్ల పొట్టపై రుద్దకూడదు. దానివల్ల పొట్టలోపల గాయాలయ్యే అవకాశం ఉంది. ► ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► మింగిన వస్తువు పిల్లల నోటి నుంచి బయటకు వచ్చే వరకు తినడానికి గాని, తాగడానికి గాని ఏమీ ఇవ్వవద్దు. తలపై తట్టకండి... ► గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికి వీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులోకి రాగానే ఊసేయమని చెప్పాలి. అంతే తప్ప తలపై తట్టకూడదు. ► గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని అనుమానించినప్పుడు పిల్లలు తమ నాలుకను బాగా చాపేలా ప్రోత్సహించి, వేళ్లను గొంతులోకి పోనిచ్చి మన స్పర్శకు ఏవైనా తగులుతున్నాయేమో చూడాలి. వేళ్లకు ఏదైనా తగులుతుంటే మునివేళ్లతో వాటిని బయటకు తీసేయాలి. ఎలా తీస్తారు? ► పిల్లలు సహకరిస్తే... డాక్టర్లు లారింగోస్కోప్తో గొంతులో ఇరుక్కున్న పదార్థాన్ని తీసివేస్తారు. ఒకవేళ సహకరించకపోతే వారికి అనస్థటిక్ డాక్టర్ సహకారంతో కొద్దిగా మత్తు ఇచ్చి తొలగివంచవచ్చు. ► లారింగోస్కోప్ చేసి బల్బ్ ఉన్న ఎండోట్రాకియల్ ట్యూబ్ అనే దాని సహాయంతోగానీ లేదా బ్రాంకోస్కోప్ అనే పరికరం సహాయంతగానీ ఇరుక్కున్నదాన్ని తీసివేయవచ్చు. హీమ్లిచ్ మెనోవర్ ఎలా? ► గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు చిన్నారి వెనకవైపున మనం నిల్చోవాలి. మన రెండు చేతులను పిల్లల పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా ఠక్కున కదిలించాలి. క్రమంగా ఆ పట్టును... పొట్టపై కింది భాగం నుంచి పై వైపునకు కదల్చాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది క్రమంగా పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్నే హీమ్లిచ్ మెనోవర్ అంటారు. - డాక్టర్ జి. గంగాధర్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, విజయవాడ. -
పాత నాణెం.. బంగారం!
నాణేలను సేకరించే అభిరుచి ఉన్న వారు అరుదుగా కనిపిస్తుంటారు. కానీ, నాణేల సేకరణ అన్నది ఒక చక్కని హాబీగా ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. నాణేల వినియోగానికి 2,800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం రాజుల కాలం నాటి నాణేలు, బ్రిటిష్ కాలంలో ముద్రించిన నాణేలను కోరుకున్నంత ఇచ్చి తీసుకునేవారు ఉన్నారు. బుద్ధుని రూపాన్ని కనిష్కకాలం నాటి నాణేల్లో చూడొచ్చు. ఇవే మన దేశంలో అత్యంత ఖరీదైన కాయిన్లు. గత కాలపు వైభవాలకు, పాలనకు సాక్షీభూతాలుగా నిలిచే కాయిన్లకు డిమాండ్ చెప్పలేనంత. ఒకప్పుడు అభిరుచిగా సాగిన నాణేల వేట.. నేడు కాసులు కురిపించే పెట్టుబడిగానూ మారిపోయింది. దీంతో గతంలో పాత కాయిన్లను కొనేవారు కొద్ది మందే ఉండగా.. ప్రస్తుతం కొనుగోలుదారులు, విక్రయదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. గొప్ప చిత్రకారులు వేసిన పెయింటింగ్లు కోట్ల రూపాయలు పలికినట్టే.. మీ బీరువాలోని పూర్వకాలపు నాణెం కూడా కాసులు కురిపించొచ్చు. నేటి కాలపు అరుదైన కాయిన్ కొన్ని తరాల తర్వాతి వారికి అపురూపంగాను అనిపించొచ్చు. అందుకే నాణేల సేకరణ వెనుకనున్న విలువైన కోణాన్ని తరచి చూసే కథనమే ఇది. మన తాతల కాలంలో అయితే నాణేల సేకరణకు పెట్టుబడి కోణం ఉండేది కాదు. ఇష్టంతో వివిధ రకాల కాయిన్లను పోగు చేసుకోవాలన్న అభిలాష కొందరిలో ఉంటే, తమకు ఇష్టమైన గొప్ప వ్యక్తుల చిత్రాలతో ఉండే నాణేల పట్ల కొందరు మక్కువ చూపించేవారు. శతాబ్దాల ఘనచరిత్రకు నిదర్శనంగా నిలిచే ఆ నాణేలకు ఊహించనంత విలువ, డిమాండ్ తోడయ్యాయి. నాణేల సేకరణ తొలుత అభిరుచితో మొదలైనా.. ఆ తర్వాత వాటిపై మరింత అధ్యయనానికి, చరిత్ర ఆధారాల అన్వేషణకు కీలకంగా మారిపోయింది. నాణేల సేకరణదారులు, అధ్యయనకారులను న్యూమిస్మ్యాటిస్ట్గా పేర్కొంటారు. ఇతరులతో పోలిస్తే నాణేల విషయంలో వీరు భారీగా సంపదను గడిస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాణేలు, అంతర్జాతీయంగా వాటి డిమాండ్పై వీరికి లోతైన అవగాహన ఉంటుంది. మన దేశంలో నాణేలను సేకరించడం అన్నది అలవాటు నుంచి పెట్టుబడిగా మారుతోంది. కానీ, ఇప్పటికీ ఇది ఆరంభ దశలోనే ఉందంటున్నారు నిపుణులు. ‘‘50 ఏళ్ల క్రితం నాణేలు, మెడల్స్, బ్యాంక్ నోట్లను కొనుగోలు చేసేవారు చాలా కొద్ది మందే ఉండేవారు. కాలక్రమేణా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 1990ల నుంచి ముంబైలో ఏటా కాయిన్షోను మేము నిర్వహిస్తూ వస్తున్నాం. దీంతో నాణేల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ’’ అని టోడీవాలా ఆక్షన్స్ అధినేత ఫారూక్ ఎస్ టోడీవాలా తెలిపారు. సురక్షితమైన పెట్టుబడి నాణేల సేకరణ నేడు సురక్షితమైన, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారిందంటున్నారు నిపుణులు. 2008–2012 కాలంలో నాణేల పెట్టుబడిపై రెట్టింపు రాబడులు వచ్చాయి. దీంతో నాణేలను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి ఏర్పడింది. దీంతో మరింత మంది కొత్తవారు ఈ దిశగా అడుగులు వేసేందుకు కారణమైంది. ‘‘నా వరకు అయితే కాయిన్ల సేకరణ అభిరుచిలో భాగమే. కానీ, కొనుగోలు చేస్తున్న నాణెం విలువ భవిష్యత్తులో పెరుగుతుందా, లేదా అని తెలుసుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాను. నా తదుపరి తరం వారికి నాణేలపై సరిపడా సమాచారం, విజ్ఞానం ఉండకపోవచ్చు. లేదంటే వారికి ఆసక్తి అయినా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నా సేకరణలు అన్నింటినీ విక్రయించేస్తాను’’ అని ముంబైకి చెందిన నాణేల సేకరణకర్త దిన్యర్ మదన్ చెప్పారు. అవగాహనతోనే అడుగు నాణేలను గుర్తించడం, వాటి చారిత్రక నేపథ్యం, విలువపై అవగాహన కల్పించే ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. నాణేలను సేకరించే వారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే కాకుండా, పరిజ్ఞానాన్ని పెంచుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ‘‘ఏ కాలం నాటిది, చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నదా తదితర విషయ పరిజ్ఙానం అవసరం. అప్పుడు సేకరించిన నాణేనికి కాలం గడుస్తున్న కొద్దీ అనూహ్యమైన విలువ తోడవుతుంది. గుప్తా గోల్డ్ కాయిన్లు, మొఘలుల నాటి కాయిన్లు, రాజ సంస్థానాల నాటివి, బ్రిటిష్ ఇండియా కాయిన్లకు దేశంలో ఎంతో ప్రాచుర్యం ఉంది. అంతర్జాతీయంగా వేరు.. అమెరికా, బ్రిటన్లో అయితే నాణేలకు సంఘటిత మార్కెట్ ఉంది. అక్కడ నియంత్రణల పరిధిలోకి వస్తుంది. బ్యాంకులు, కార్పొరేట్లు సైతం నాణేలపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. నాణేల దిగుమతిపై సుంకాలు, ఆంక్షలను కూడా చాలా దేశాలు అమలు చేయడం లేదు. ‘‘కానీ, మనదేశంలో పరిస్థితి వేరు. భారత్లో తయారైన భారత్కే చెందిన నాణేలు, మెడల్స్, బ్యాంకు నోట్ల దిగుమతికి కస్టమ్స్ విభాగం సులభంగా అనుమతించడం లేదు. వీటి దిగుమతి కోసం ఎన్నో గంటల సమయం వెచ్చించడమే కాకుండా.. విపరీతమైన సుంకాలు, జరిమానాలు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది’’ అని టోడీవాలా ఆక్షన్స్ అధినేతటోడీవాలా వివరించారు. వీటికి తోడు అసంఘటిత స్థాయిలోనే పరిశ్రమ ఉన్నట్టు పేర్కొన్నారు. విలువను నిర్ణయించే అంశాలు నాణేలకు విలువ కట్టడంలో కీలకంగా చూసేది నాణ్యతే. పాలిష్, గీతలు, ధరించడానికి అనుకూలంగా ఉంటుందా ఇలా ఎన్నో అంశాల ఆధారంగా విలువ నిర్ణయిస్తుంటారు. మంచి, ఎంతో మంచి, శ్రేష్టమైన, ఎంతో శ్రేష్టమైన, అత్యున్నత శ్రేష్టమైన, చెలామణిలోనివి ఇలా పలు విభాగాలుగా నాణేలను వేరు చేస్తారు. చెలామణిలో లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ఆ నాణేలపై చిత్రాలు, అక్షరాలు చెదిరిపోకుండా స్పష్టంగా ఉంటే అధిక విలువను చెల్లించేందుకు కొనుగోలుదారులు వెనుకాడరు. మంచి నాణెం అనుకున్నది చెత్తనాణెం కూడా కావచ్చన్నారు కోల్కతాకు చెందిన న్యూమిస్మ్యాటిస్ట్ అనింద్య జ్యోతి మజుందార్. ఉదాహరణకు 2,000 సంవత్సరాల కిత్రం నాటి గ్రీక్ కాయిన్ను చెక్కుచెదరని స్థితిలో (మింట్ కండీషన్)లో వేలానికి ఉంచితే ఊహించనంత విలువ లభిస్తుందని తెలిపారు. ప్రాచీన కాలం నాటి కాయిన్ల లభ్యత కొత్తగా పెరిగేది కాదంటూ.. అదే సమయంలో డిమాండ్ క్రమంగా పెరుగుతూనే వెళుతుందన్న విషయాన్ని టోడీవాలా ప్రస్తావించారు. అంటే పూర్వ కాలపు కాయిన్ల లభ్యత కొద్దిగా ఉన్నందున వాటికి విలువ క్రమంగా పెరుగుతూనే వెళుతుందని అర్థం చేసుకవోచ్చు. ‘‘అవగాహన పెరుగుతోంది. వ్యక్తుల దగ్గర మిగులు ధనంలోనూ వృద్ధి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు నాణేల ప్రదర్శనలతో కాయిన్లకు డిమాండ్ అనూహ్యంగా వృద్ధి చెందుతోంది’’ అని టోడీవాలా పేర్కొన్నారు. ఎన్నో వేదికలు వేలం కంపెనీలు, డీలర్షిప్లు ఉన్నందున ఈ పరిశ్రమ ఎంతో కాలం అసంఘటిత స్థాయిలోనే ఉండదన్నది టోడీవాలా అభిప్రాయం. నాణేల కొనుగోలు, విక్రయాలకు ఆన్లైన్లో ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి. విక్రయదారులు కోరుతున్నంత ధర పెట్టి కొనేవారు ముందుకు వచ్చినప్పుడే లావాదేవీ నమోదవు తుంది. లేదంటే ఆక్షన్ కంపెనీని సంప్రదించి నాణేన్ని ప్రదర్శనకు ఉంచుకోవచ్చని, లేదంటే ఆన్లైన్ పోర్టళ్లలో విక్రయించుకోవచ్చని టోడీవా లా సూచించారు. ఆన్లైన్లో అయితే విక్రయదారుల వివరాలు, పూర్వపరాలు తెలియడం కష్టం. మోసాలకూ అవకాశం ఉంటుంది. ఇటువంటి సందేహాలతో ఉండేవారికి వేలం కంపెనీలను, డీలర్లను ఆశ్రయించడం చక్కని మార్గం అవుతుంది. ‘‘గతంలో ఒక వేలానికి మూడు నెల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతీ నెలా 7–8 వేలాలు కొనసాగుతున్నాయి’’ అని ముంబై కాయిన్ సొసైటీ సభ్యుడు అజయ్గోయల్ తెలిపారు. కాయిన్ బజార్ మీ దగ్గర 1, 2, 5 రూపాయల అరుదైన నాణేలు, నోట్లు ఉంటే రూ.లక్షలు పెట్టికొనే వారు ఉన్నారు. కాయిన్బజార్ పోర్టల్లో ఇటువంటి వేలాలు కనిపిస్తుంటాయి. మాతా వైష్ణోదేవి చిత్రం ఉన్న రూ.10 నాణెం రూ.లక్షలు పలికిన సందర్భాలున్నాయి. 1977–79 మధ్యకాలం నాటి రూపాయి నోట్కు రూ.45,000 చెల్లించిన వారు కూడా ఉన్నారు. కాకపోతే ఆయా నోట్లు, నాణేలపై వివరాలు చెదిరిపోకుండా ఉండాలి. అంతేకాదు ఆర్బీఐ పరిధిలోని ముద్రణ శాల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన కాయిన్లను ముద్రిస్తూ ఉంటుంది. వాటికి సైతం మంచి డిమాండ్ ఉంటోంది. -
Viral Video: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో..
‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా’ అని ఏదో మాటవరసకి అంటాము. కానీ ఓ వ్యక్తి నిజంగానే తన పెరట్లో మొక్కల నుంచి రూపాయి కాయిన్లను కాయించాడు.. నమ్మకం కుదరట్లేదా.. ఈ వీడియో చూడండి. ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలు పెంచే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ వీడియోలో కనిపించే వ్యక్తి తన పెరట్లో కాసిన క్యాప్సికం కాయలను చీల్చితే లోపల రూపాయి బిళ్లలు ఉండటం కనిపిస్తుంది. అతను రెండు క్యాప్సికంలను కట్ చేస్తే రెండింటి నుంచి రూపాయి బిళ్లలు రావడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. దీనిని చూస్తే ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అవుతుంది. తర్వాత అతను చేసిన ట్రిక్ తెలిసి.. ఈమాత్రం మేము కూడా పండించగలం అనిపిస్తుంది. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! అవును.. అతను ముందుగానే క్యాప్సికం వెనుక భాగం కట్చేసి లోపల కాయిన్స్ పెట్టి, గమ్తో అతికించి ఉంటాడు. వీడియోలో నిజంగానే క్యాప్పికం లోపల కాయిన్స్ ఉన్నట్లు చూపించాడు. కానీ మన బ్రెయిన్లోపల చాలా విషయం ఉందని.. వెంటనే అతని ట్రిక్ కనిపెట్టేస్తామని అతను ఊహించి ఉండడు. సహజంగా చెట్లకు డబ్బులు కాయవని మనందరికీ తెలిసిందే!! ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చదవండి: Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత.. View this post on Instagram A post shared by FilmFlix (@filmflix3) -
బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు!
సోషల్మీడియాలో యూజర్ల సంఖ్య పెరిగినప్పటి నుంచి కాస్త డిఫెరెంట్గా ఎక్కడ ఏం జరిగినా అది వైరల్గా మారుతోంది. ఈ క్రమంలోనే పలు వీడియోలు, ఫోటోలతో కొందరు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం హోటల్కి వెళ్లడం, ఆర్డర్ ఇస్తే సర్వర్ పుడ్ తీసుకురావడం సహజమే. కానీ ఓ వ్యక్తి బిల్ వెరైటీగా కట్టడంతో అంతే వెరైటీగా ఆ హోటల్ సిబ్బంది ఆర్డర్ తెచ్చి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తికి ఆకలి వేయడంతో అతనికి సమీపంలోని రెస్టారెంట్కు వెళ్లి సాండ్విచ్ ఆర్డర్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది గానీ బిల్ దగ్గరకు వచ్చే సరికి.. అతని దగ్గర అన్నీ చిల్లర నాణేలే ఉన్నాయి. వాటిని ఇవ్వాలా వద్దా అనుకుంటూనే చివరికి బిల్గా చిల్లరనే ఇచ్చాడు. కాసేపటి తర్వాత సాండ్విచ్ ఆర్డర్ రానే వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ సాండ్విచ్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉన్నాయి. చిల్లర నాణేలను బిల్గా కట్టాడని ఆ రెస్టారెంట్ సిబ్బంది కూడా సాండ్విచ్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆర్డర్ను డెలివరీ చేశాడు. ఆ ఫోటోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. Had a message off one of the lads this morning says “Some lad who works in Jag paid for his scran with all 10p’s this morning. This is how his butty was when he opened it” 🤣🤣🤣 pic.twitter.com/qfsdgW8jP9 Darren Turley (@DarrenTurley5) September 23, 2021 చదవండి: Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..! -
ఈ అరుదైన రూ. 1 కాయిన్కు కోటి రూపాయలా..!
గత కొన్ని రోజులుగా పాత రూ. 2, రూ. 5, రూ.10, 25 పైసల కాయిన్స్ను భారీ మొత్తంలో ఆన్లైన్ మార్కెట్లో విక్రయించడం చూసే ఉంటారు. చాలా మంది తమ దగ్గరున్న అరుదైన పాత నాణేలను ఆన్లైన్లో విక్రయిస్తూ భారీ మొత్తంలో నగదును సంపాదిస్తున్నారు. కొంత మంది కాయిన్స్ను సేకరించే అభిరుచి ఉన్నవారు ఆన్లైన్లో వారికి నచ్చిన అరుదైన కాయిన్స్ను కొనుగోలు చేయడానికి ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ అరుదైన కాయిన్స్ను ఎక్కువగా ఇండియా మార్ట్లో విక్రయించడం గమనించవచ్చును. తాజాగా 1885 సంవత్సరానికి చెందిన రూ.1 కాయిన్ను కోటి రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ కాయిన్ ప్రత్యేకత ఏమిటంటే..ఈ కాయిన్పై విక్టోరియా మహారాణి చిత్రం ఉంది. దాంతో పాటుగా బ్రిటిష్ కింగ్ జార్జ్-5 చిత్రం కాయిన్ ఉన్న అరుదైన కాయిన్కు ఆన్లైన్లో కోటి రూపాయాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరుదైన కాయిన్ను ఇండియా మార్ట్లో కొనుగోలుదారులతో చర్చించడంతో భారీ మొత్తంలో నగదును పొందవచ్చును. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే ఇండియామార్ట్లో రిజిస్టరై కొనుగోలుదారులతో చర్చించి భారీ మొత్తాన్ని పొందవచ్చును. అరుదైన కాయిన్స్ను, నోట్లను సేకరించే వారిని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తారు. వీరు అరుదైన కాయిన్లను, నోట్లను సేకరించి అధ్యయనం చేస్తారు. -
మీ దగ్గర ఈ 25 పైసల నాణెం ఉంటే లక్షాధికారులే
న్యూఢిల్లీ: మీ దగ్గర పాత 25 పైసల నాణెం ఉందా.. ఒకవేళ ఉంటే మీరు లక్షాధికారులు కావచ్చు అంటుంది ఇండయామార్ట్ వెబ్సైట్. పావలా ఉంటే లక్షాధికారులు ఎలా అవుతారా అని ఆలోచిస్తున్నారా అయితే ఇది చదవండి. ఇండియామార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. మీ దగ్గర గనుక 1992 కాలం నాటి ఖడ్గ మృగం ఉన్న 25 పైసల కాయిన్ ఉంటే.. మీరు లక్షాధికారులే అని తెలిపింది. ఇందుకు గాను మీరు ఆ కాయిన్ను రెండు వైపులా ఫోటో తీసి.. ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అక్కడ దీన్ని వేలం వేస్తారు. ఎంత ఎక్కువ ధర పలుకుతుందనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పలకవచ్చని భావిస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది. ఇక మీ దగ్గర పాత 5,10 పైసల నాణేలు ఉంటే వాటిని ఇండియామార్ట్ వెబ్సైట్లో అమ్మి డబ్బు చేసుకోవచ్చు. అలానే ఎవరికైనా పాత నాణేల మీద ఆసక్తి ఉంటే ఇక్కడ కొనవచ్చు. ఇక ఇండియామార్ట్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద ఇ-కామర్స్ వెబ్సైట్లలో ఒకటి. "ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. మీరు రిటైలర్, తయారీదారు అయినా, ఆన్లైన్లో వ్యాపారం పెరగడానికి ఇండియామార్ట్ మంచి గమ్య స్థానం అని దాని వెబ్సైట్లో పేర్కొంది. ఇక ఇది ఎంత వాస్తవమనేది చూడాలి. చదవండి: రూ.5 కాయిన్కు రూ.5 లక్షలట! -
ఇదేం ఆచారం: అదృష్టం కోసం వ్యక్తి తింగరి పని
బీజింగ్: మనిషి ఆశా జీవి. తన జీవితం గురించి రకరకాల కలలు కంటాడు. ఆర్థికంగా బాగా ఎదగాలని.. లగ్జరీగా జీవించాలని ఆశపడతాడు. తమ కలలు సాకారం చేసుకోవడం కోసం కొందరు బాగా కష్టపడితే.. మరి కొందరు మాత్రం ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలపై ఆధారపడతారు. వీరిలో కొందరు లాటరీ టికెట్లు కొని అదృష్ట దేవత కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పిచ్చి పని చేసి ఎయిర్ పోర్ట్ అధికారుల్ని, పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. మనలో కొందరు ప్రయాణాలు చేసే సమయంలో రకరకాల ఆచారాలు, నమ్ముకాలు పాటిస్తుంటారు. వాటిలో బాగా ఫేమస్ కాయిన్ ట్రెడీషన్. అదేంటంటే ప్రయాణిస్తుండగా.. ఏదైనా నది తారసపడితే అందులోకి నాణేలు విసురాతారు. బస్సు, రైళ్లలో ప్రయాణం చేసే వారికే కాక.. విమానంలో ప్రయాణం చేసే వారు కూడా ఈ నమ్మకాన్ని పాటిస్తారు. వీరు ఏం చేస్తారు అంటే తాము ప్రయాణించబోయే విమానం ఇంజిన్లోకి కాయిన్స్ విసురుతారు. అలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. తాజాగా ఓ యువకుడు అలాగే చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. చైనాలోని వాంగ్ అనే యువకుడు వైఫాంగ్ నుండి హైకూకు వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఫాంగ్ ఎయిర్ పోర్ట్ నుంచి బీబు గల్ఫ్ ఎయిర్లైన్స్కు చెందిన జీఎక్స్ 8814 నెంబర్ గల ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అనుకున్న సమాయానికి విమానం ఎక్కాడు. 148 మంది ప్రయాణిస్తున్న విమానం రన్ వే మీద ఉండగా వాంగ్ తన దగ్గరున్న ఆరు కాయిన్స్ను ఎర్రటి పేపర్లో చుట్టి విమానం ఇంజిన్లోకి విసిరాడు. అవి కాస్త కిందపడిపోవడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. భద్రతా సమస్యల కారణంగా ఎయిర్ పోర్ట్ అధికారులు ఫ్లైట్ రద్దు చేశారు. ఈ సంఘటన తరువాత యువకుడు వాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అయితే ఇలా ఫ్లైయిట్ ఇంజిన్లోకి కాయిన్స్ విసరడం ఇది తొలిసారేం కాదు. గతేడాది 28 ఏళ్ల యువకుడు 'అదృష్టం' కోసం విమానం ఇంజిన్లోకి కాయిన్స్ విసిరాడు. దీంతో యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు 1,20,000 యువాన్ల (రూ. 12.36 లక్షలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చేసేదేం లేక సదరు యువకుడు ఆ మొత్తాన్ని కట్టాడు. చదవండి: కడుపులో 4.15 కిలోల బంగారం -
సంచీ తీసుకెళ్తేనే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు!
సాక్షి, ముంబై: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల వేతనంలో చిల్లర నాణేలు ఇవ్వాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) యాజమాన్యం నిర్ణయించింది. ప్రతీరోజు టికెట్ల విక్రయం ద్వారా వివిధ బస్ డిపోలలో రూ. లక్షల్లో చిల్లర నాణేలు పోగవుతున్నాయి. ఇలా రూ. 12 కోట్లకు పైనే చిల్లర డబ్బులు బెస్ట్ ప్రధాన కార్యాలయమైన కొలాబాలోని బస్ భవన్లో నిల్వ ఉన్నాయి. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేద్దామంటే ప్రతీరోజు పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను స్వీకరించడానికి బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బెస్ట్ యాజమాన్యం చిల్లర నాణేలకు ఉద్యోగుల జీతాలతో ముడిపెట్టింది. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో భాగంగా రూ. 15 వేల చిల్లర నాణేలు ఇవ్వాలని, మిగతా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని బెస్ట్ సమితి నిర్ణయించింది. దీంతో ఉద్యోగులు వేతనాలు చెల్లించే రోజున సంచి వెంట తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. చార్జీలు తగ్గడంతో.. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించాలంటే కనీస చార్జీలు రూ. 8, ఆ తరువాత రూ. 10, రూ. 12, రూ. 14, రూ. 16 ఇలా ఉండేవి. దీంతో చిల్లర విషయంలో తరచూ గొడవలు జరిగేవి. టికెట్కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చే విషయంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునేవి. కానీ యాప్ ఆధారిత ఓలా, ఊబర్, షేర్ ట్యాక్సీ, ఆటోల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు 2019 అక్టోబర్లో బెస్ట్ సంస్థ ప్రయాణ చార్జీలను పునర్ వ్యవస్థీకరించింది. బస్సుల్లో ప్రయాణించేందుకు జనాలను ఆకట్టుకునేలా, ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు వీలుగా టికెట్ రేట్లను తగ్గించింది. మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస చార్జీలు రూ. 5, ఆ తరువాత రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు మార్చింది. చార్జీలు తగ్గడంతో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి నుంచి చిల్లర నాణేలు వివిధ బస్ డిపోలలో కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. బ్యాంకులు నో.. ఉద్యోగులకు ముడి ఇలా 2021 జనవరి నుంచి భారీగా పోగవుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఓ కాంట్రాక్టర్ను నియమించాలనే ప్రతిపాదన సైతం తెరమీదకు వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు సిబ్బంది కూడా పెద్ద మొత్తంలో చిల్లర డబ్బులు స్వీకరించేందుకు నిరాకరించడంతో అవి దాదాపు రూ. 12–15 కోట్ల మేర పేరుకుపోయాయి. సంస్థలో 40 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి నెలనెలా వేతనాలు చెల్లించడం సంస్థకు కష్టతరంగా మారింది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న బెస్ట్ సంస్థ ఈ చిల్లర నాణేలను ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టింది. ఉద్యోగుల వేతనంలో చిల్లర నాణేలు చేతికివ్వాలని, మిగతావి వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. బెస్ట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే చిల్లర నాణేలు ఇంటికెలా తీసుకెళ్లమంటారని సంస్థను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు చిల్లర నాణేలు లెక్కపెట్టి ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పెద్దమొత్తంలో చిల్లర స్వీకరించేందుకు వ్యాపారులు కూడా నిరాకరిస్తారు. దీంతో ఉద్యోగులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. -
రూ.20 నాణెం చూశారా?!
సుభాష్నగర్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గతంలో విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణేలు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.1 నుంచి 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి. 2020లో విడుదలైన రూ.20 నాణేలు తాజాగా మార్కెట్లో చలామణిలోకి రావడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. బడ్జెట్ ప్రసంగానికి కరెంటు కష్టం కోల్సిటీ (రామగుండం): విద్యుత్ సరఫరాలో సమస్యలతో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశానికి అంతరాయం ఏర్పడింది. సమావేశం మధ్యలో ఏకంగా మూడుసార్లు కరెంటు పోవడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే నిర్వహించాల్సి వచ్చింది. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లోని కౌన్సిల్ హాల్లో మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్ అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. సమావేశంలో మేయర్ బడ్జెట్ సందేశం చదువుతుండగా కరెంటు మళ్లీ పోయింది. దీంతో సిబ్బంది సెల్ఫోన్ల ఫ్లాష్ లైట్లు ఆన్చేయడంతో మేయర్ ప్రసంగాన్ని కొనసాగించారు. సభకు హాజరైన కార్పొ రేటర్లు కూడా మొబైల్ ఫోన్ల వెలుగులోనే రిజిస్టర్లో సంతకాలు చేశారు. మల్యాలపల్లి సమీపంలోని 33 కేవీ విద్యుత్ వైర్లలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ విద్యుత్ సమస్యకు కారణమైనప్పటికీ.. కార్పొరేషన్ కార్యాలయంలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ బుల్ మళ్లీ రంకెలేసింది.. -
పిల్లల గొంతుల్లో ఏదైనా ఇరుక్కుంటే...
చిన్నపిల్లలు ఏదైనా తినేటప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఆహారపదార్థాలు గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు తల కిందికి ఉండేలా చూడాలి. వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవాలి. మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి... అది పైకి ఎగబాకి, అడ్డుపడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను పై వైపునకు... అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే, గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సూచనలు ఫలించకపోతే చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరం ద్వారా గొంతును పరీక్ష చేసి, అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు. -
రూ.5 కాయిన్కు రూ.5 లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు. నగదు చెల్లించిన తర్వాత అది మోసమని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాత కరెన్సీ నాణేలు, నోట్లు ఖరీదు చేస్తామని నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల ఓ బల్క్ సందేశం వచ్చింది. నాణెం వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన రూ.5 నాణేన్ని రూ.5 లక్షలకు, రూ.10 నాణేన్ని రూ.10 లక్షలకు ఖరీదు చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో తన వద్ద రూ.5 నాణేలు 4 ఉన్నాయంటూ నగరవాసి చెప్పడంతో నగదు బదిలీ చేయడానికి ముందుగా పన్నులు చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు. దీనికి నగరవాసి అంగీకరించడంతో జీఎస్టీ సహా వివిధ పేర్లు చెప్పి రూ.39 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో.. నగరానికి చెందిన మరో వ్యక్తి తన వద్ద ఉన్న పట్టు చీరలు విక్రయించేందుకు ఈ– యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్లో దాని ఫొటోతో ప్రకటన ఇచ్చారు. సదరు చీరను రూ.8300 విక్రయిస్తానంటూ అందులో పేర్కొన్నారు. ఆ చీరను తాను ఖరీదు చేస్తానని సైబర్ నేరగాడు చెప్పాడు. నగదు మొత్తాన్ని గూగుల్ పే రూపంలో పంపిస్తానని నమ్మబలికాడు. ఇలా ఓ క్యూఆర్ కోడ్ను పంపి స్కాన్ చేయాలంటూ చెప్పాడు. నగరవాసి అలాగే చేయడంతో ఇతడి ఖాతాలోకి నగదు రావడానికి బదులు.. ఖాతా నుంచి డబ్బు కట్ అయి సైబర్ నేరగాడికి చేరిపోయింది. ఇలా మొత్తం రూ.84 వేలు కాజేశాడు. బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్కాల్.. -
60 వేల నాణేలతో శ్రీరాముడు
సాక్షి బెంగళూరు: అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా రామ నామం మారుమోగుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ కళాకారుడు నాణేలతో శ్రీరాముని కళాకృతిని తయారు చేశాడు. రూపాయి, ఐదు రూపాయల విలువ కలిగిన అరవై వేల నాణేలను ఉపయోగించి శ్రీరాముని కళాకృతిని తీర్చిదిద్దారు. నాణేల విలువ సుమారు రూ.2 లక్షలు. రాజధాని బెంగళూరులోని లాల్బాగ్ పశ్చిమ ద్వారం వద్ద కళాకృతిని సిద్ధం చేశాడు. -
అంచనాలు తలకిందులు, అన్నీ నాణేల గుట్టలే!
వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా అక్వేరియం చాలా ఫేమస్. అక్కడికి రోజూ వేలాది మంది సందర్శకులు వస్తారు. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటేన్ నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్కు ఓ ప్రత్యేకత ఉంది. 30 అడుగుల లోతైన ఆ వాటర్ఫాల్స్లో నాణేలు వేసి ఏదైనా కోరుకుంటే అది తీరుతుందనే విశ్వాసం ఉంది. దాంతో సందర్శకులు ఆ వాటర్ఫాల్స్లో నాణేలు వేస్తుంటారు. సాధారణంగా జనాలతో కిక్కిరిసిపోయే ఆ అక్వేరియానికి ఆదాయానికి కూడా లోటు లేదు. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా దానిని మూసేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. రోజూవారి ఖర్చులు, జంతువుల సంరక్షణ కష్టమైంది. దాంతో అక్వేరియం నిర్వాహకులకు ఓ ఆలోచన తట్టింది. జనాల కోరికలు నెరవేరేందుకు వేసిన విషింగ్ కాయిన్స్ని బయటికి తీసేందుకు నిర్ణయించారు. అయితే, వారి అంచనాలు తప్పయ్యాయి. ఆ వాటర్ ఫాల్స్ ఫౌంటేన్లో జనాల కోరికలు రాశులుగా పోగుపడి దర్శనమిచ్చాయి. వారు ఊహించినదానికంటే చాలా ఎక్కువ.. అంటే దాదాపు 100 గాలన్ల నాణేలు ఆ ఫౌంటేన్లో లభించాయి. తమ అంచనాలు తలకిందులు చేసిన ఆ నాణేల రాశులకు సంబంధించిన ఫొటోలను అక్వేరియం నిర్వాహకులు ఫేస్బుక్లో ఫేర్ చేశారు. ఈ మొత్తం నాణేలు ఎంత విలువ చేస్తాయో చెప్పగలరా? అని నెటిజన్లకు క్విజ్ పెట్టారు. 48 వేల డాలర్లు అని ఒకరు, 64,427 డాలర్లు అని ఇంకొకరు తమ తోచిన మొత్తాన్ని చెప్పుకొచ్చారు. ఈ నాణేలన్నీ చలామణిలోకి వస్తే దేశంలో వాటి కొరత తీరుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. దేవుడు అందరి కోరికలు నెరవేర్చాలి అని మరొకరు ఆకాక్షించారు. ఈ పోస్టుకు లక్షా 80 వేల లైకులు రావడం విశేషం. కాగా, సరైన మొత్తం ఎంతో వచ్చేవారం జవాబు చెబుతామని అక్వేరియం నిర్వాహకులు వెల్లడించారు. -
ఎన్నికల్లో ‘చిల్లర’ డిపాజిట్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లాతూర్ స్థానం నుంచి స్వతంత్ర పోటీ చేస్తున్న ఓ యువ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. నామినేషన్ వేసేందుకు చెల్లించాల్సిన డిపాజిట్ రూ.10 వేల మొత్తాన్ని రూ. 10 రూపాయల నాణేలతో చెల్లించారు. సెంట్రల్ మహారాష్ట్రలోని లాతూర్ నుంచి పోటీ చేస్తున్న సంతోష్ సబ్డే (28) పట్టణంలో ఉన్న సమస్యను ఎత్తిచూపేందుకు, ఓ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో పలు దుకాణాల్లో రూ. 10 నాణేలను స్వీకరించడం లేదని, దీన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలిపారు. మొదట ఎన్నికల అధికారులు కూడా రూ. 10 నాణేలను వద్దన్నారని, విషయం మీడియాకు తెలియడంతో రూ. 1000 వరకూ రూ. 10 నాణేలు తీసుకుంటామని, మిగిలింది నోట్ల రూపంలో ఇవ్వాలని కోరారని తెలిపారు. అయితే తాను ససేమీరా అనడంతో చివరకు మొత్తాన్ని రూ. 10 నాణేల రూపంలో స్వీకరించారని తెలిపారు. -
నోట్లు మాకు.. చిల్లర మీకు
సాక్షి, ముంబై: ఇక నుంచి బస్ డిపోల్లో నోట్లు అందజేసి చిల్లర పట్టుకెళ్లండని బెస్ట్ సంస్థ కోరుతోంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్ బస్ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. ముంబై నగరంలోని వివిధ బస్ డిపోలలో నోట్లకు బదులుగా చిల్లర డబ్బులు మార్పిడి చేసుకునే సౌలభ్యం బెస్ట్ సంస్థ కల్పించింది. దీంతో వ్యాపార సంస్థలు చిల్లర కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు చిల్లర కోసం బస్ కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. బెస్ట్ సంస్థ బస్ చార్జీలు తగ్గించినప్పటికీ చిల్లర నాణేల బెడద పట్టి పీడించసాగింది. ప్రతీరోజు ముంబైలోని వివిధ బస్ డిపోలలో డ్యూటీ అయిపోగానే ఒక్కో కండక్టరు వేల రూపాయలు విలువచేసే చిల్లర నాణేలు జమ చేస్తున్నాడు. ఇలా నగరంలోని 24 బస్ డిపోలలో నిత్యం రూ.లక్షలు విలువచేసే చిల్లర నాణేలు బెస్ట్ ఖజానాలో పోగవుతున్నాయి. కొద్ది రోజులు ఇలాగే సాగితే వీటిని భద్రపరిచేందుకు కూడా స్థలం కొరత ఏర్పడనుంది. దీంతో వీటిని ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని లెక్కించి తీసుకునే ఓపిక బ్యాంకు సిబ్బందికి కూడా లేదు. దీంతో అవి డిపోలలోనే మూలుగుతున్నాయి. చివరకు షాపులకు, బిగ్ బజార్, టోల్ ప్లాజా కేంద్రాలకు చిల్లర డబ్బులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. నోట్లు తీసుకురండి, చిల్లర డబ్బులు పట్టుకెళ్లండని నినదించనుంది. షాపులకు పంపిణీ.. బెస్ట్ సంస్థ రెండు నెలల కిందట బస్ చార్జీలు తగ్గించింది. కనీస చార్జీలు రూ.8 నుంచి రూ.5కు తగ్గించింది. అంతేగాకుండా 8 కిలోమీటర్ల వరకు కనీస చార్జీలే వసూలు చేయడంతో బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీని ప్రభావం షేర్ ఆటో, ట్యాక్సీల వ్యాపారంపై తీవ్రంగా చూపింది. చార్జీలు తగ్గించకముందు ప్రతీరోజు సగటున 22–23 లక్షల మంది ప్రయాణించేవారు. చార్జీలు తగ్గించిన తరువాత ఈ సంఖ్య ఏకంగా 32 లక్షలకు పెరిగిపోయింది. భవిష్యత్తులో మరింత పెరగనుంది. దీంతో రూ.1,2,5,10 విలువచేసే నాణేలు కండక్టర్ క్యాష్ బ్యాగ్లో నిత్యం వేలల్లో పోగవుతున్నాయి. ప్రతీ కండక్టర్ డ్యూటీ దిగే ముందు డిపోలలో ఉన్న క్యాష్ కౌంటర్వద్ద వేలల్లో చిల్లర నాణేలు జమచేస్తున్నాడు. ఇలా ప్రతీరోజు 24 బస్ డిపోలలో రూ.11–12 లక్షల వరకు చిల్లర డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో వీటిని సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, షాపు యజమానులకు, బిగ్ బజార్, టోల్ ప్లాజా కేంద్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్ బస్ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. -
ఆమె పొట్టలో కిలోన్నర బంగారం..
కోల్కతా : ఇంత వరకూ ఇనుప వస్తువులు మింగిన వారి గురించే చదివాం. కానీ ఈ యువతి ఏకంగా బంగారాన్ని మింగేసింది. ఇలా ఇప్పటి వరకూ ఆమె కడుపులో దాదాపు కిలోన్నరకు పైగా బంగారం చేరింది. ఆ వివరాలు... పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి మతి స్థిమితం లేదు. దాంతో ఆకలేసినప్పుడల్లా చేతికి దొరికిన పదార్థాలను తినేది. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలను కూడా కడుపులో పడేసుకుంది. దాంతో గత కొద్ది రోజులుగా యువతి అనారోగ్యంతో బాధపడుతుంది. తిన్న వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేయగా ఆమె కడుపులో ఆభరణాలు, నాణాలు కనిపించాయి. ఆపరేషన్ చేసిన వైద్యుడు... యువతి కడుపులో నుంచి గొలుసులు, ముక్కు పుడకలు, చెవి పోగులు, గాజులు, బ్రాస్లెట్ తదితర ఆభరణాలతోపాటు రూ.5, రూ.10 నాణేలను వెలికితీశామని తెలిపాడు. వీటి బరువు సుమారు 1.5 కిలోగ్రాముల వరకూ ఉందన్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే కోలుకుంటుందని తెలిపారు. ఈ విషయం గురించి బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురికి మతిస్థిమితం లేదు. ఎప్పుడూ ఆమెను ఇంట్లో ఎవరో ఒకరు కనిపెట్టుకునే ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఆభరణాలను మింగి ఉంటుంది. ఇన్ని రోజులుగా ఇంట్లో ఆభరణాలు కనిపించకుండా పోతుంటే మాకు అర్థం కాలేదు. ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అని అనుమానం కలిగింది. దీని గురించి మా అమ్మాయిని అడిగితే ఏడ్చేదే తప్ప.. ఏం చెప్పేది కాదు. అయితే గత కొద్ది రోజులుగా భోజనం చేసిన వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఆస్పత్రికి తీసుకురావడంతో ఈ విషయం తెలిసింది’ అన్నారు. -
చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!
బీజింగ్ : ఓ మహిళా కస్టమర్ చేసిన పనికి కార్ల షోరూంలో పనిచేసే సిబ్బంది దిమ్మతిరిగిపోయింది. కారు కొనడానికి పెద్ద మొత్తంలో చిల్లర తేవటంతో వాటిని లెక్కపెట్టడానికి.. సిబ్బంది తల్లో ప్రాణం తోకలోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని కాన్జౌవ్కు చెందిన ఓ మహిళ తను దాచుకున్న డబ్బుతో ఫోక్స్వాగన్ కారు కొనాలనుకుంది. ఇందుకోసం తను 10సంత్సరాలుగా దాచుకున్న చిల్లరను 66 ప్లాస్టిక్ సంచుల్లో నింపి కార్ల షోరూంకు తీసుకెళ్లింది. ఫోక్స్వాగన్ కారును ఎంచుకున్న తర్వాత డబ్బు చెల్లించాల్సిన సమయంలో ప్లాస్టిక్ సంచుల్ని చూపించింది. దీంతో ఆశ్చర్యపోవటం అక్కడి సిబ్బంది వంతైంది. సంచుల్ని ఒక్కొక్కటిగా విప్పి చిల్లర లెక్కించటానికి.. 17 మంది సిబ్బంది మూడు రోజులు కష్టపడాల్సి వచ్చింది. చిల్లర లెక్కపెట్టిన వారి చేతులు సైతం నల్లగా మారిపోయాయి. పెద్దపెద్ద పెట్టెలలో వాటిని సర్దిపెట్టి భద్రంగా బ్యాంకుకు తరలించారు. చిల్లర లెక్కిస్తున్న దృశ్యాలను వీడియో తీసిన సిబ్బంది దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్గా మారింది. ఇలాంటి సంఘటనే కొద్ది నెలలక్రితం చైనాలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యుద్ధం గెలిస్తే.. నాణేలపై ముద్ర పడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోలాహలం.. గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.. అంతవరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలు మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలను నిలిపేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లకముందు రాచరిక వ్యవస్థలో ఏం జరిగేది..? బలమున్నోడిదే రాజ్యం. రాజ్యాల మీదకు దండెత్తి విజయం సాధించి ఆ ప్రాంతాన్ని తన ఏలుబడిలో కలిపేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేవారు. ఈ క్రమంలో ఆ రాజు వెంటనే చేసే పనేంటో తెలుసా? అంతవరకు చలా‘మణి’లో ఉన్న నాణేలపై తన ‘మార్కు’ముద్రించటమే.. ఆలస్యమవుతుందనే పునర్ ముద్రణ.. ఆనాడు నాణేలకు ఎంతో ప్రాధాన్యముండేది. ఏ రాజైన సరే తన రాజ వంశం, దైవం.. వంటి సొంత చిహ్నాలని నాణేలపై ముద్రించి చలామణి చేసేవారు. మరో రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, కొత్త ప్రాంతంలో తమ నాణేలు చలామణి చేసేందుకు కొంత సమయం పడుతుంది. నాణేల ముద్రణ, అందుకు సరిపడా ముద్రణాలయాల ఏర్పాటు, జనంలోకి తరలింపు.. ఇవన్నీ జరిగేందుకు సమయం అవసరం. కొత్త నాణేలు వచ్చే వరకు, పాత రాజులు అమలు చేసిన నాణేలనే కొనసాగించేవారు. అయితే వాటిపై తమ చిహ్నాలను ముద్రించేవారు. చలామణిలో ఉన్న పాత నాణేలను తెప్పించి వాటిపై తమ చిహ్నాలను ముద్రించి పంపేవారు. వీటికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రాంతాల తవ్వకాల్లో ఇలాంటి నాణేలు వెలుగు చూశాయి. వాటి వల్లనే నాటి సంఘటనలు వెలుగు చూశాయి. వెరసి చరిత్రకు అవి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి అరుదైన కొన్ని నాణేలు లభించాయి. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో... సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ స్తూపం, బౌద్ధ విహారాలు వెలుగు చూసిన చోట పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. వీటిల్లో కొత్త విహారాలు, నాటి వస్తువుల అవశేషాలు, నాణేలు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కొన్ని నాణేలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. సీసంతో తయారైన ఆ నాణేలు శాతవాహనకాలానికి చెందినవిగా తెలుస్తున్నాయి. శాతవాహన నాణేలకు వీటికి కొంత తేడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిపై శాతవాహన చిహ్నాలతో పాటు ఇతర కొన్ని చిహ్నాలున్నాయి. దీంతో.. శాతవాహనులు ఇతర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో, పాత రాజు చలామణి చేసిన నాణేలపై తమ చిహ్నాలను పునర్ ముద్రించి అమలులోకి తెచ్చినవిగా చరిత్రకారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వీటిపై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటి వివరాలు వెలుగులోకి వస్తే శాతవాహనుల కాలానికి సంబంధించి మరికొన్ని కొత్త వివరాలు వెలుగుచూస్తాయి. క్రీ.పూ.5వ శతాబ్దంలోనే.. దేశంలో నాణేల చలామణి క్రీ.పూ.5వ శతాబ్దంలో మొదలైంది. మగధ సామ్రాజ్యంలో 3.4 గ్రాముల బరువు తూగే వెండి నాణేల ముద్రణ మొదలైందప్పుడే. మగధ పాలకులు నాణేలపై సూర్యుడి గుర్తుతో పాటు 6 ఆయుధాల ఆకృతులను ముద్రించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వీటితోపాటు మరికొన్ని చిహ్నాలున్నా, అవి మారుతూ వచ్చాయి. తదనంతరం నంద సామ్రాజ్యాధీశులు దాన్ని కొనసాగించారు. క్రీ.పూ. 2, 3 శతాబ్దాల్లో రోమన్, గ్రీకుతో వాణిజ్యం పెరిగిన తర్వాత నాణేల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆ తర్వాత సీసం నాణేలు వచ్చాయి. కుషాన్స్ హయాంలో బంగారు నాణేలు మొదలయ్యాయి. తర్వాత మౌర్యులు, దక్షిణాదిన మౌర్యులను ఓడించి శాతవాహనులు నాణేలను ప్రారంభించారు. ఇందులో మౌర్యులను ఓడించి వారి నాణేలపై తమ చిహ్నాలను శాతవాహనులు వేసుకున్నారని ఆధారాలు లభించాయి. రెండు చోట్లనే వెలుగులోకి... మరో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాత నాణేలపై కొత్త రాజులు తమ చిహ్నాలను ముద్రించిన ఉదంతానికి సంబంధించి మన దగ్గర ఇప్పటికి 2 చోట్ల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 కూడా శాతవాహన కాలానికి సంబంధించినవే కావడం విశేషం. శాతవాహనుల తొలి రాజధానిగా పేర్కొంటున్న కోటిలింగాల వద్ద, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మస్కి (రాయచూరు సమీపం) వద్ద జరిపిన తవ్వకాల్లో ఇలాంటి నాణేలు లభించాయి. దక్షిణ భారతం కూడా మౌర్యుల పాలనలో ఉందనటానికి ఇవే ఆధారాలుగా మిగిలాయి. ఈ రెండు చోట్ల జరిపిన తవ్వకాల్లో మౌర్యులు చలామణి చేసి న వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి పంచ్ మార్క్డ్ నాణేలు. వీటికి మరోవైపు శాతవాహనులు ముద్రించిన ఏనుగు ఆకృతి కనిపించింది. మౌర్యులను ఓడించి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు తమ అధీనంలోకి తెచ్చుకుని మౌర్యుల నాణేలపై తమ గుర్తులను పునర్ముద్రించారని చరిత్రకారులు తేల్చారు. ఈ రెండు చోట్ల తప్ప అలాంటి నాణేలు వెలుగు చూడలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి కౌంటర్ మార్క్ డ్ నాణేలు వెలుగు చూడటంతో చరిత్రకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫణిగిరిలో లభించిన నాణేలు సీసం ముడిపదార్థంగా రూపొందినవి. దీంతో అవి కొంతమేర చెదిరిపోయి ఉండటంతో వాటిపై చిహ్నాలు అస్పష్టంగా కనిపిస్తున్నా యి. ప్రత్యేక పద్ధతుల్లో వాటిని పరిశోధించాల్సి ఉంది. -
కొత్త నాణేలు వచ్చేసాయ్...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం కొత్త సిరీస్ నాణేలను విడుదల చేసింది. రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రిలీజ్ చేశారు. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడేలా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశామని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద నిర్వహించిన నాణేల విడుదల కార్యక్రమానికి అంధవిద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొత్తగా చలామణిలోకి వచ్చిన నాణేలలోని వైవిధ్యపూరితమైన ఫీచర్లు దివ్యాంగులకు బాగా సహాయపడతాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 27 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన ఈ 20 రూపాయల కాయిన్.. డోడెకాగన్ రూపంలో ఉంటుంది. 10 రూపాయిల కాయిన్ లాగానే 20 రూపాయిల కాయిన్ కూడా రెండు రకాల రంగుతో ఉంటుంది. దీనికి 12 అంచులు ఉంటాయి. మిగతా నాణేలు రౌండ్ షేప్లోనే ఉండనున్నాయి. విలువ ఆధారంగా నాణేల పరిమాణం , బరువును డిజైన్ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం రూ.20 నాణేన్ని తీసుకురావడం ఇదే తొలిసారి. కాయిన్ ఔటర్ రింగ్ లో 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ ఉంటాయి. ఇన్నర్ డిస్క్ లో 75 శాతం కాపర్, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ ఉంటాయి. The Prime Minister, Shri Narendra Modi, today, released the new series Rs.1, Rs.2, Rs.5, Rs.10 and Rs.20 coins. These coins contain design features which will be of great assistance to visually impaired persons. — Arun Jaitley (@arunjaitley) March 7, 2019 -
రూపాయి నాణెం = రూ.1.11?
సాక్షి,ముంబై: రూపాయి నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.11. అవునా... అని ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఆర్బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటే దాని మార్కెట్ వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట. ఆర్టీఐ ద్వారా ఇండియా టుడే అడిగిన ప్రశ్నను వివిధ ప్రభుత్వ నాణేల ముద్రణా కార్యాలను పంపించింది రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా. అయితే నాణేల ఉత్పత్తి కయ్యే మొత్తం వ్యయం వివరాలను అందించేందుకు ఇండియన్ గవర్నమెంట్ మింట్ (ఐజీఎం) నిరాకరించింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 8 (1) (డీ) ప్రకారం వాణిజ్య రహస్యమని పేర్కొంది. మింట్ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవలకాలంలో భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో నాణేల తయారీని భారీగా తగ్గించి వేసింది మింట్. 2016-17లో 2201 మిలియన్ల నాణేలను తయారుచేసిన మింట్..2015-16లో 2151 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో రూపాయి నాణేల 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది. హైదరాబాద్ మింట్ కూడా గత నాలుగు సంవత్సరాల గణాంకాల సమాచారాన్ని అందించింది. ముంబైతోపాటు హైదరాబాద్లలో ఉన్న మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2. రూ.1 నాణేలు తయారవుతున్నాయని మింట్ తెలిపింది. ఖర్చులు పెరిగినప్పటికీ నాణేల తయారీని నిలిపివేసే అవకాశాలు లేవని మింట్ ప్రకటించింది. అయితే రూపాయి నాణెంతో పోలిస్తే మిగిలిన నాణేల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ. 2 నాణెం తయారవుతుండగా, 5 రూ. నాణేనికి రూ.3.69, 10 రూపాయల నాణేనికి రూ. 5.54 ఖర్చు అవుతోంది. -
350 కేజీల నాణేలతో ఐఫోన్
-
ఐఫోన్ @ 350 కేజీలు
సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర ఐఫోన్ లేదా ? లేకపోతే పెద్దగా వచ్చే నష్టమేమీ లేదేమో ! కానీ నా దగ్గర లేకపోతే ఒప్పుకునే సమస్యే లేదంటున్నాడు రష్యాలోని మాస్కోకి చెందిన ఓ యువకుడు. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్న వారి నుంచి రకరకాల పిచ్చి పనులను చేసిన వారిని చూశాము. అయితే తాజాగా వచ్చిన ఆపిల్ ఎక్స్ఎస్ని సొంతం చేసుకోవడానికి ఈ వ్యక్తి చేసిన పనిని చూస్తే నవ్వాగదు. ఈ ఐఫోన్ను కొనడానికి అతడు లక్ష రష్యన్ రూబెల్స్ను (రూ. 1,08,000) నాణేల రూపంలో సేకరించాడు. అలా సేకరించిన కాయిన్స్ అన్నింటినీ బాత్టబ్లో కుమ్మరించాడు. దీంతో ఆ బాత్టబ్ బరువు 350 కేజీలకు చేరింది. స్నేహితుల సాయంలో దాన్ని కారులో పెట్టించి ఆపిల్ ఉత్పత్తులను అమ్మే ప్రముఖ షాపింగ్ మాల్కు తీసుకెళ్లాడు. సాధారణంగా షాప్ నిర్వాహకులు ఇలాంటి విచిత్ర నగదు చెల్లింపును స్వీకరించరు. కానీ ఈ దుకాణాదారునికి బాగా సమయం, ఓపిక ఉన్నట్లుంది. ఆ కాయిన్స్ అన్నింటినీ లెక్కించి ఐఫోన్ ఎక్స్ఎస్ 256 జీబీ మోడల్ను అందించాడు. ఐపోన్ యూజర్లందు ఈ యూజరు వేరయా..! అంటూ నెటిజన్లు షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. -
నామినేషన్కు నాణేలు
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తొగరి రాములు డిపాజిట్ కోసం రూపాయి నాణేలు తీసుకొచ్చారు. ఒక్కో ప్లాస్టిక్ కవర్లో రూ.2,500 చొప్పున రెండు కవర్లకు బ్యాంకు సీల్ వేయించి నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్న ప్రజలు, సన్నిహితులు ఒక్కో రూపాయి చొప్పున పది వేల మంది రూ.10 వేల నాణేలు ఇచ్చారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాములు తెలిపారు. రూ.5 వేల నాణేలను నామినేషన్ డిపాజిట్ కింద రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. డిపాజిట్ కోసం నాణేలను తీసుకురావడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
మళ్లీ దొరుకుతాయో లేదో!
అనగనగా ఒక రాజు. న్యాయంగా, ధర్మంగా రాజ్యపాలన చేసేవాడు. నిత్యం దేవుణ్ణి పూజించేవాడు. అతని భక్తి శ్రద్ధలకు ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చాడు.‘‘రాజా, నీ భక్తికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో’’ అన్నాడు. దేవుడి మాటలకు రాజు ఇట్లా అన్నాడు– ‘‘స్వామీ నీ కృపవల్ల నాకు ఏ లోటూ లేనప్పటికీ మీరే అనుగ్రíß స్తానన్నారు కాబట్టి కోరుతున్నాను – మీరు నాకు కనిపించినట్టే, నా ప్రజలందరికీ కూడా మీ దర్శనమిచ్చి వారిని ధన్యులను చెయ్యండి’’ అన్నాడు. ‘‘అది కుదిరే పని కాదు, నా పట్ల నిజమైన ఆర్తి, ప్రేమ ఉన్నవారికి మాత్రమే నేను కనపడతాను’’ అన్నాడు దేవుడు. రాజు విడిచిపెట్టకుండా పదే పదే అడిగేసరికి ‘సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.’’ అన్నాడు దేవుడు. రాజు సంతోషంతో దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు ‘‘రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు రండి. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు’’ అని నగరంలో దండోరా వేయించాడు.దేవుణ్ణి చూడాలన్న ఆశతో ప్రజలందరూ పోగయ్యారు. రాజు అందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. వారలా నడుస్తుండగా దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. వద్దు వద్దని రాజు చెబుతున్నా వినకుండా కొంతమంది అక్కడే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్లిపోయారు. రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన వారిలో కొందరు ‘వెండి నాణేలు మళ్లీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మరెప్పుడైనా కనిపిస్తాడు అనుకుని అటువైపు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. చివరికి రాజు, రాణి మిగిలారు. కొంతదూరం వెళ్లాక వారికి వజ్రాల పర్వతం కనిపించింది. రాణి అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. రాజుకు ఇచ్చిన మాట మేరకు దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే ‘‘ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.’’ అని అన్నాడు. రాజు బాధతో తల దించుకున్నాడు. -
తిరుమలలో గుట్టలుగా పేరుకుపోయిన నాణేలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు నాణేల రూపంలో సమర్పించిన కానుకలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. టీటీడీ నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల విలువచేసే స్వదేశీ, విదేశీ నాణేలు చిల్లర పెంకులతో సమానమయ్యాయి. స్వదేశీ నాణేలు 35 టన్నులు, మలేషియాకు చెందిన నాణేలు(రింగిట్) 40 టన్నులు వృథాగా మిగిలిపోయాయి. దేశ విదేశాల్లోని భక్తులు ఎంతో భక్తితో పైసా పైసా కూడబెట్టి స్వామివారి హుండీలో వేసిన కానుకలను చెలామణి చేసి దైవ కార్యక్రమాలకు వినియోగిస్తే వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. అయితే భక్తులు ఏ ఉద్దే శంతో అయితే కానుకలను స్వామి వారికి సమర్పించారో అది నెరవేరకుండా పోయిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేరుకుపోయిన ఈ నాణేలను కరిగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి నిల్వ.. టీటీడీ వద్ద సంవత్సరాల తరబడి 25 పైసలు, అంతకంటే తక్కువ విలువ గల ఐదు, పది, ఇరవై పైసలనాణేలు భారీ ఎత్తున నిల్వ ఉన్నాయి. 2011 జూన్ 30 నుంచి 25 పైసలు, అంతకంటే తక్కువ విలువైన స్వదేశీ నాణేలను చెలామణి నుంచి తప్పిస్తూ రిజర్వుబ్యాంకు నిర్ణయం తీసుకుంది. బయట చెల్లకున్నా... ఆ నాణేలను బ్యాంకులు 2014 ఫిబ్రవరి దాకా స్వీకరించాయి. గడువు తరువాత బ్యాంకులు ఆ నాణేలను తీసుకోవడం మానేశాయి. అయితే వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేయకుండా నిల్వ ఉంచింది. దీంతో టీటీడీ వద్ద స్వదేశీ నాణేలు మాత్రమే 35 టన్నుల వరకు నిల్వ ఉండిపోయాయి. తీరా గడువు పూర్తయ్యాక ఆ నాణేలను ఏమి చేయాలనే విషయంపై టీటీడీ ఆర్బీఐకి లేఖ రాసింది. బ్యాంకుల ద్వారా వెనక్కు తీసుకున్న చెల్లుబాటులో లేని నాణేలను తమిళనాడు సేలంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు తరలించి అక్కడ కరిగిస్తున్నామని, మీరు కూడా సెయిల్ను సంప్రదించమని సూచించింది. ఆర్బీఐ సూచన మేరకు టీటీడీ సెయిల్ను సంప్రదించింది. అయితే నాణేలను కరిగించగా వచ్చే లోహం విలువకు నగదు రూపంలో చెల్లించలేమని, టీటీడీ ఏవైనా ఆర్డర్లు (యంత్రాలు, పరికరాలు) ఇస్తే ఆ బిల్లులో సర్దుబాటు చేస్తామని తేల్చిచెప్పింది. ఇక చేసేది లేక టీటీడీ సెయిల్కు ప్రతిపాదనకు అంగీకరించింది. మలేషియా నాణేలు ఎలా? టీటీడీ వద్ద మలేషియా నాణేలు కూడా టన్నుల కొద్ది పేరుకుపోయి ఉన్నాయి. మలేషియా నాణేన్ని అక్కడ (రింగిట్) అంటారు. మన డబ్బుతో పోల్చితే మలేషియా నాణెం (రింగిట్) విలువ రూ.17. మనకు పావలా, అర్థరూపాయి, రూపాయి నాణేలు ఉన్నట్లు మలేషియాలో 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లు, 50 సెంట్లు, డాలర్లు, ఇతర నాణేలు ఉండేవి. వివిద దశల్లో విడుదల చేసిన ఈ నాణేల్లో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని గుర్తించి మలేషియా సెంట్రల్ బ్యాంక్ 2005 డిసెంబర్ 7న నుంచి వాటి చెలా మణి రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న నాణేలను బ్యాంకులు నిర్ణీత గడువులోపు వెనక్కు తీసుకున్నాయి. ఆ సమయంలో కూడా టీటీడీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో 40 టన్నుల మలేషియా నాణేలు తిరుమలలో మిగిలిపోయాయి. మన పెద్ద నోట్లను ఏ విధంగానైతే రూ.40 కోట్లను టీటీడీ మూలనపడేసిందో మలేషియా నాణేలను కూడా పడేయాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
’చిల్లర’ మనోవర్తి...!
లాయర్ల బుర్ర ఎంత షార్ప్గా, నేర్పుగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ... ఓ న్యాయవాది తనదైన శైలిలో మాజీ భార్యపై కక్ష తీర్చుకున్నాడు. విడాకుల తర్వాత నెలకు రూ.25 వేల చొప్పున మనోవర్తి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సదరు లాయిర్ పట్టించుకోవడం లేదంటూ మాజీ భర్తపై ఆ యువతి పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఆ లాయర్ ప్రాక్టీస్ బాగా నడుస్తోందని, అంతే కాకుండా అతడి పేరిట ఆస్తులు కూడా ఉన్నాయంటూ విన్నవించింది. ఈ నేపథ్యంలో గతంలో పేర్కొన్న విధంగా నెలకు రూ. 25 వేల మనోవర్తి చెల్లించాలని ఆ న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే అసలు డ్రామా అంతా చోటుచేసుకుంది. ఈ మనోవర్తిని నాలుగు వందరూపాయల నోట్లతో పాటు మిగతా మొత్తం (రూ.24,600) ఒకటి, రెండు రూపాయి నాణాలతో కూడిన చిల్లర రూపంలో ఓ సంచిలో పెట్టి అక్కడి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్ అందజేశాడు. తనను వేధించేందుకు ఇదొక కొత్త పద్ధతి అని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని ఆ యువతి వాదించింది. తమ కేసు ఎనో్నసార్లు వాయిదా పడిన తర్వాత ఇప్పుడు చిల్లర రూపంలో డబ్బు ఇవ్వడం న్యాయం కాదని పేర్కొంది.. అయితే తన చర్యను న్యాయవాది సమర్థించుకుంటూ డబ్బును కేవలం వంద, ఐదువందలు, రెండువేల నోట్ల కరెన్సా రూపంలోనే ఇవ్వాలని ఎక్కడా లిఖితపూర్వకంగా రాసి పెట్టి లేదని వాదించాడు. ఈ నాణేలను లెక్కించేందుకు తను ముగ్గురు సహాయకులను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చాడు. నాణేల లెక్కింపునకు సమయం సరిపోక జిల్లా కోర్టు జడ్జీ చివరకు కేసును వాయిదా వేయాల్సి వచ్చింది. -
కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్..
చండీగఢ్ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్ భర్త. భరణంగా ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కోర్టులో భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ భార్య. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్కు చెందిన ఓ లాయర్ 2014లో భార్య నుంచి వేరుపడి కొద్ది సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలవారీ ఖర్చుల నిమిత్తం భరణంగా నెలకు 25వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
దివాకర్ ట్రావెల్స్ బస్సులో 45 బస్తాల చిల్లర నాణేలు
-
హజ.. పనం.. వరహా..
రాణీ రుద్రమ దేవి.. పరాక్రమానికి ప్రతిరూపం. ఆ పేరు వింటేనే శత్రువుల గుండెలు అదిరిపోయేవి. మరి ఆమెకు ఉన్న బిరుదేమిటో తెలుసా..? రాయ గజకేసరి! ఏనుగంతటి శత్రువుపై లంఘించి సంహరించే సింహం వంటి రాజు అన్నది దాని సారాంశం. మరి ఆమె హయాంలో రూపుదిద్దుకున్న నాణేలాపై పేరేముండేదో తెలుసా..? రాయగజ!! సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటిగా కీర్తి గడించిన కాకతీయుల హయాంలో చలామణీలో ఉన్న నాణేలపై ఇప్పటి వరకు పెద్దగా స్పష్టత లేదు. తాజాగా దీన్ని కొలిక్కి తెచ్చేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో నాణేల పరిశోధకులు రాజారెడ్డి అధ్యయనం జరుపుతున్నారు. మూడు నెలలపాటు శ్రమించి 1,600 నాణేలను పరిశీలించి, వాటిని కాకతీయ శాసనాలతో అనుసంధానించి ఓ కొలిక్కి తెచ్చారు. ఓ మహా సామ్రాజ్యానికి సంబంధించిన నాణేల వివరాలను ప్రజల ముంగిట ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,600 నాణేలపై పరిశోధన ఇప్పటి వరకు కాకతీయుల నాణేలపై పెద్దగా పరిశోధన జరగలేదు. వారి సామ్రాజ్య చిహ్నమైన వరాహం గుర్తు ఉన్న నాణేలు కాకతీయులవి అని మాత్రమే చరిత్రకారులు గుర్తించారు. కానీ ఆ సామ్రాజ్యంలో ఏ చక్రవర్తి ఎలాంటి నాణేలు రూపొందించారన్న విషయంలో స్పష్టత రాలేదు. 1975లో ప్రముఖ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి ఈ నాణేలపై పరిశోధన చేసి కొన్ని వివరాలు వెల్లడించినా, ఆయా చక్రవర్తుల నాణేల అమలు విధానాన్ని మాత్రం వెల్లడించలేకపోయారు. దీంతో నాటి నాణేలపై స్పష్టత రావాలన్న ఉద్దేశంతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు.. పురావస్తు శాఖ (హెరిటేజ్ తెలంగాణ) సహకారంలో బృహత్ అధ్యయనానికి నడుం బిగించింది. ట్రస్టు నిర్వాహకులు, ప్రభుత్వ సలహాదారు పాపారావు సూచనతో ప్రముఖ నాణేల అధ్యయన నిపుణులు డాక్టర్ రాజారెడ్డి.. నాంపల్లి స్టేట్ మ్యూజియంలో ఉన్న 1,600 కాకతీయ నాణేలపై మూడు నెలలుగా పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఆయన ఆ పరిశోధన వివరాలతో పుస్తక ముద్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ విలువ, తక్కువ విలువ.. ప్రస్తుతం నగదులో డినామినేషన్స్ ఉన్నట్టుగానే కాకతీయులు నాణేల్లో డినామినేషన్స్ రూపొందించారు. ఎక్కువ విలువ, తక్కువ విలువ ఉన్న నాణేలన్నమాట. 1.6 నుంచి 1.8 సెం.మీ. పరిమాణంలో 3.64 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణేలను వరహాలుగా పేర్కొన్నారు. వాటిలో పదో వంతు అంటే.. 0.36 గ్రాముల బంగారంతో 4 మి.మీ. వ్యాసంతో రూపొందించిన నాణేలను పనంగా పిలుచుకున్నారు. అందులో నాలుగో వంతు విలువతో కేవలం 3 మి.మీ. పరిమాణంలో హజ పేరుతో నాణేలు చెలామణి చేశారు. గజకేసరి బిరుదుతో.. కాకతీయ చక్రవర్తులను గజకేసరి బిరుదుతో పిలిచేవారు. ఈ గజకేసరి పేరుకు కొన్ని పదాలు చేర్చి నాణేలపై ముద్రించారు. ఇవి తప్ప రాజుల పేర్లు ఎక్కడా లేకపోవటంతో ఏ నాణెం ఎవరి హయాందో తేలలేదు. బీదర్ వద్ద లభించిన శాసనంలో రాణీ రుద్రమ గురించి వర్ణించే క్రమంలో రాయ గజకేసరి పేరును వాడారు. స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలను పరిశీలించగా కొన్ని నాణేలపై రాయగజ అన్న పదాలు కనిపించాయి. దీంతో అవి రుద్రమదేవి రూపొందించినవిగా గుర్తించారు. అలాగే కండవల్లి శాసనంలో ప్రతాప రుద్రుడిని దాయ గజకేసరిగా అభివర్ణించారు. కొన్ని నాణేలపై దాయ గజ అక్షరాలు ఉండటంతో అవి ఆయన హయాంలో రూపొందించినవిగా రాజారెడ్డి తేల్చారు. కొన్నింటిపై అరి గజ అన్న పదాలు కనిపించాయి. కానీ ఆ బిరుదు ఎవరికి ఉందో తెలిపే శాసనం ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నో శాసనాలు పడిఉన్నాయి. కానీ వాటిపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవటంతో పరిశోధన సాగలేదు. ఇటీవల నేలకొండపల్లిలో ప్రతాప రుద్రుడి సేనాధిపతి రుద్రసేనాని మనవడు పసాయిత గణపతిరెడ్డి వేయించిన శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ తదితరులు గుర్తించారు. నాణేలు కరిగించిన బహమనీయులు కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చేసిన బహమనీయులు పెద్ద దురాగతానికి పాల్పడ్డారు. కాకతీయులకు గొప్ప సామ్రాజ్యమన్న పేరు ఉండటంతో దాని గుర్తుగా ఉండే వాటిని రూపుమాపాలని నిర్ణయించారు. తొలుత వారి దృష్టి నాటి నాణేలపై పడింది. కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న నాణేలన్నింటినీ కరిగించేశారు. అయితే బంగారు, వెండి నాణేల విలువ ఎక్కు వగా ఉండటంతో కొంతమంది ప్రజలు వాటిని దాచుకున్నారు. అలా ఉన్నవే ఇప్పుడు తవ్వకాలలో బయటపడుతున్నాయి. కానీ రాగి నాణేల ను జనం దాచుకోలేదు. అవన్నీ బహమనీయు ల చేతుల్లో అదృశ్యమయ్యాయి. అందుకే ఇప్పటి వరకు కాకతీయులకు చెందిన ఒక్క రాగి నాణెం కూడా వెలుగు చూడలేదు. ఇలాంటివెన్నో ఆసక్తికర విషయాలతో కాకతీయుల నాణేల చరిత్రతో తొలి పుస్తకం వెలువడబోతోంది. వరహా.. 3.64 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణెం. పనం.. వరహాలో పదో వంతు. అంటే 0.36 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణెం. హజ.. పనంలో నాలుగో వంతు. కేవలం 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. -
ఈ నాణేలు ప్రకాశిస్తాయి..
అమలాపురం టౌన్: పసిఫిక్ మహా సముద్రంలో ఫ్రెంచి పాలినేషియా, కిరిబాటి, కెయిర్న్ ద్వీపాల మధ్య ఉన్న అందమైన దీవి క్రెసెంట్. ఈ దీవి ప్రభుత్వం విడుదల చేసిన చీకట్లో మెరిసే నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఈ దీవి ప్రజలు చాలా కాలం డబ్బుకు బదులుగా ముత్యాలనే వాడేవారు. క్రెసెంటీస్ భాషలో ‘పోవా’ అంటే ముత్యమని అర్థం. 2006లో 500, 1,000, 5,000 పోవా ముఖ విలువ కలిగిన నాణేలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నాణేలను యాక్రిలిక్ పదార్థంతో తయారు చేశారు. వీటి తయారీలో ఫ్లోరోసెంట్ పదార్థం వాడడంవల్ల అవి చీకట్లో మెరుస్తాయి. నాణేలను 39 మిల్లీమీటర్ల వ్యాసంతో, 5 మిల్లీమీటర్ల మందంతో గుండ్రని ఆకారంలో రూపాందించారు. వీటిపై ఉదయిస్నున్న సూర్యుడు, కొబ్బరి చెట్టు ముద్రించారు. ఇవి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో పారదర్శకంగా ఉండి అక్కడి ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తాయని కామేశ్వర్ చెప్పారు. -
జీహెచ్ఎంసీ ఉద్యోగికి చుక్కలు చూపించారు
సికింద్రాబాద్: ఈ ఫొటోలో చిల్లర నాణేలు లెక్కించుకుంటున్నది జీహెచ్ఎంసీ ఉద్యోగి.. పేరు శ్రీకాంత్. నగరంలోని వారాసిగూడలో ఉన్న ఓ ఇంటిపై పన్ను చెల్లించాలని ఆ ఇంటి యజమానికి ఇచ్చిన వాయిదాలు దాటిపోయాయి. దీంతో పన్ను చెల్లించాలని సదరు ఉద్యోగి యజమానిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా దాచిపెట్టిన రూ.10, రూ.5 నాణేలను తీసుకొచ్చి శ్రీకాంత్ ఎదుట కుమ్మరించాడు. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.30 వేలకు నాణేలను తీసుకోవాలని కోరాడు. వాటిని లెక్కించుకుని రశీదు ఇచ్చే సరికి శ్రీకాంత్కు బొమ్మ కనపడింది. -
నాణేల ముద్రణను పునరుద్ధరించండి: కేంద్రం
కోల్కతా: నాణేల ముద్రణ నిలిపేయాలంటూ దేశంలోని నాలుగు నాణేల ముద్రణ కేంద్రాలకు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాణేల ముద్రణను తిరిగి ప్రారంభించాలని, అయితే ముద్రణ వేగాన్ని తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీఎంసీఐఎల్ పరిధిలో ఉన్న 4 ముద్రణా కేంద్రాల్లో గతంలో లాగా 2 షిఫ్టుల్లో కాకుండా ఒక్క షిఫ్టులోనే ముద్రణ కొనసాగించాలని తెలిపింది. 2017–18కి గాను 7,712 మిలియన్ల నాణేలు ముద్రించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు తమకు జారీ చేసిన ఇండెంట్లో పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేనికారణంగా నాణేల ముద్రణ నిలిపేయాలంటూ ఈ నెల 9న కేంద్రం ఎస్పీఎంసీఐఎల్కు ఆదేశాలిచ్చింది. -
కడుపులో 263 నాణేలు!?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి కడుపులో ఈ స్థాయిలో ఇనుప వ్యర్థాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసి వ్యర్థాలను తొలగించారు. రేవా జిల్లాలోని మారేమూల గ్రామానికి చెందిన సదరు వ్యక్తి కడుపు నుంచి మొత్తంగా 263 నాణేలను తొలగించినట్లు వైద్యులు ప్రకటించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని.. వాటి విలువ రూ. 790 ఉంటుందని వైద్యులు తెలిపారు. నాణేలతో పాటు విరిగిపోయిన సైకిల్ చైన్ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయన్నారు. కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
కొత్త నాణేల ముద్రణ అవాస్తవం
ముంబై: ‘కొత్తగా ముద్రించిన రూ.10, రూ.50, రూ.100 కాయిన్లు ఇవే’అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలను భారత ప్రభుత్వ మింట్(ఐజీఎమ్) కొట్టిపారేసింది. ఇదంతా అవాస్తవమని, అసలు అలాంటి నాణేలను ముద్రించలేదని స్పష్టం చేసింది. ముంబైకి చెందిన మనోరంజన్ ఎస్.రాయ్ అనే వ్యక్తి కొత్త నాణేల ముద్రణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా.. ఐజీఎమ్ ఈ మేరకు వెల్లడించింది. ‘గత కొద్ది రోజులుగా నాణేల మీద వార్తలు వస్తున్నాయి. ఇందులో రూ.10 నుంచి రూ.2,000 వరకు విలువైన కాయిన్స్ ఫొటోలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవమేనా? దీనిపై స్పష్టత ఇవ్వండి’అని మనోరంజన్ దరఖాస్తులో కోరారు. స్పందించిన ఐజీఎమ్ కొత్త నాణేల ముద్రణపై వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పింది. ప్రస్తుతం రూ.10 నాణేలను మాత్రమే ముద్రిస్తున్నామని స్పష్టం చేసింది. -
నాణాలు కావాలా నాయనా..!
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : ఒకప్పుడు చిల్లర నాణాల కోసం వ్యాపారులు బ్యాంకుల వద్ద క్యూలు కట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకులు పిలిచి మరీ నాణాలు ఇస్తామన్నా తీసుకునే నాథుడే కనిపించడం లేదు. దీంతో జాతీయ బ్యాంకుల్లో నాణాల నిల్వలు మూలుగుతున్నాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని ఆంధ్రాబ్యాంకులో పెద్ద మొత్తంలో నాణాలు నిల్వ ఉన్నాయి. శ్రీవారి హుండీల ద్వారా వచ్చే నాణాలు ఈ బ్యాంకుకు చేరుతుండటమే ప్రధాన కారణం. గతంలో హుండీలు తెరిచే సమయంలో స్థానిక వ్యాపారులతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఎమ్మెల్యేల సిఫార్సులతో అధిక మొత్తంలో చిల్లర నాణాలను పొందేందుకు ఎగబడేవారు. సందిట్లో సడేమియా అంటూ కొం దరు చిల్లర వ్యాపారులు కమీషన్ బిజినెస్ కోసం నాణాలను తీసుకెళ్లేవారు. అయితే ఇటీవల మార్కెట్లో చిల్లర నాణాల చలా మణి ఎక్కువుగా ఉండటంతో వీటి కోసం ఎదురుచూసేవారు కరువయ్యారు. ప్రస్తు తం ద్వారకాతిరుమల ఆంధ్రాబ్యాంకులో రూ.1, రూ.2, రూ.5 నాణాలు పెద్ద మొ త్తంలో నిల్వ ఉన్నాయి. కావాల్సిన వ్యాపారులు ఫోన్ నంబర్లు 08829–271429, 83745 59609లో సంప్రదించాలని బ్యాం కు మేనేజర్ శేషగిరిరావు కోరుతున్నారు. -
రూపాయి విలువ తెలుసా?
న్యూఢిల్లీ: అఖిల భారత అన్నా డీఎంకే వ్యవస్థాపక నాయకుడు ఎంజీ రాంచంద్రన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంద రూపాయలు, ఐదు రూపాయల నాణాలను తీసుకొస్తున్న విషయం తెల్సిందే. మన కరెన్సీ నాణాలకు 67 ఏళ్ల చరిత్ర ఉంది. మొట్టమొదటి సారిగా స్వాతంత్య్రానంతరం 1950, ఆగస్లు 15వ తేదీనా భారత నాణాలను తీసుకొచ్చారు. అప్పటి వరకు బ్రిటీష్ ఇండియన్ కరెన్సీపై నున్న బ్రిటిష్ రాజు బొమ్మను తొలగించి నాలుగు సింహాలు, అశోక చక్రం ముద్రతో మొదటి భారత రూపాయి బిళ్లను దేశంలో ప్రవేశ పెట్టారు. అప్పట్లో రూపాయి అంటే సరిగ్గా దాని విలువ వంద పైసలు ఉండేది కాదు. రూపాయి అంటే అరు అణాలు, 64 పైసలు ఉండేది. ఒక దశలో అది 182 పైసలకు కూడా వెళ్లింది. ఒకప్పుడు భారత నాణాలను సిల్వర్, కాపర్, నికిల్ ఏదో ఒక లోహాన్ని ఉపయోగించి నాణాలను తయారు చేయగా ఆ తర్వాత రెండేసి లోహాలను ఉపయోగించి నాణాలను తయారు చేయడం ప్రారంభమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాణాలను హస్త ముద్ర సిరీస్ కింద 2007లో తీసుకొచ్చారు. అందులోనే కొత్త సీరిస్ను 2011లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 17వ తేదీన తీసుకరానున్న ఐదు, వంద రూపాయల నాణాలను సిల్వర్, కాపర్, నికిల్తోపాటు జింక్ను కూడా కలిపి తీసుకొస్తున్నారు. -
త్వరలో 100 రూపాయిల కాయిన్: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో కొత్తగా వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూ. 100, రూ. 5 నాణెలను ముద్రిస్తున్నట్లు పేర్కొంది. రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుందని వివరించింది. వంద రూపాయిల కాయిన్ వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్ బొమ్మ ఉంటుందని తెలిపింది. కాయిన్ బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్, జింక్ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. 23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 కాయిన్ బరువు 6 గ్రాములు ఉంటుందని చెప్పింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా కాయిన్స్, పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. -
క్వాయిన్ టెన్షన్
తణుకు అర్బన్/తణుకు : పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చిల్లర కొరత సమస్య సృష్టించి మార్కెట్ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిల్లర కొరత తీర్చేందుకు అధిక సంఖ్యలో విడుదలైన పది రూపాయల నాణాల మారకం మార్కెట్లో ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. నకిలీ నాణాలు చలామణి అవుతున్నాయని, బ్యాంకుల్లో రూ.10 నాణాలను తీసుకోవడంలేదనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు వీటిని నిరాకరిస్తున్నారు. ఏకంగా పది రూపాయలు నాణాలు తీసుకోమంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. దీంతో మరలా చిల్లర సమస్య తప్పదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిన్న, పెద్ద దుకాణదారులు పది రూపాయిల నాణాలను భారీగానే సమకూర్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న నాణాలను బయటకు పంపించలేకపోతున్నామని, కొత్త నాణాలు ఎలా తీసుకుంటామని కొందరు అంటున్నారు. నకిలీ నాణాలు పెద్ద సంఖ్యలో చలామణి అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కొన్ని నాణాలను నకిలీవి గా బ్యాంకు అధికారులు ధ్రువీకరించారని అంటున్నారు. దీంతో పది రూపాయల నాణాల మారకం సమస్యగా మారడంతోపాటు చిల్లర కొరత కూడా ఎక్కువవుతుందని తెలుస్తోంది. -
ఆగని వదంతులు..!
రూ.10నాణేలు చెల్లుబాటు కావంటూ పుకార్లు ∙ తీసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యాపారులు ∙ అటువంటిదేమీ లేదంటున్న బ్యాంకర్లు రాయవరం : పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉంది. రూ.10నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా..నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం వదంతులేనని బ్యాంకర్లు కొట్టిపడేస్తున్నారు. నోట్ల రద్దు నుంచి.. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ అదే పరిస్థిథి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవని ఆటోవాలాలు, చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు, పాల వ్యాపారులు..ఇలా ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. రూ.10నాణేలు వచ్చిన కొత్తలో, ఆ తర్వాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న పుకార్లతో వారు ఆ నాణేలను బయటకు తీస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు రూ.10నాణేలు ఇస్తే అటు ప్రయాణికులు..ఇటు కండక్టర్లు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి.. రూ.10 నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం అపోహలు మాత్రమే. రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని రూ.10నాణేల మారకాన్ని వినియోగించుకోవాలి. – డి.సత్యనారాయణ, ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాయవరం -
తవ్వేకొద్దీ నాణేలే
► కొట్టూరులో 90 కేజీలకు చేరిన పురాతన నాణేలు ► జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వైనం బళ్లారి: ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపీలో అమూల్యమైన మణులు-వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. హంపీకి దగ్గరలోనే ఉన్న కొట్టూరు పట్టణంలో పాతకాలం నాణేలు కుప్పలు కుప్పలుగా బయటపడుతుండడం అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 24న శ్రీకొట్టూరేశ్వరస్వామి మఠం సమీపంలోని గిరిజమ్మ అనే మహిళకు చెందిన పురాతన ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా సుమారు 25 కేజీల పురాతన నాణేలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాలు కూడా పాత ఇంటిని కూల్చుతుండగా పెద్ద సంఖ్యలో పురాతన నాణేల నిధి వెలుగుచూసింది. ప్రస్తుతం 90 కేజీల వరకు పురాతన నాణేలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్, సీఐ తనిఖీ తహసీల్దార్ కృష్ణమూర్తి, కొట్టూరు సీఐ రాజానాయక్ ఘటనాస్థలంలో పురాతన నాణేలను పరిశీలిస్తున్నారు. నాణేలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 1915–20వ సంవత్సరానికి చెందిన కాలంలో బ్రిటిషప్రభుత్వం ముద్రించినవిగా అధికారులు తెలిపారు. నాణేలపైన కింగ్ జార్జ్- ఫోర్త్ అనే అక్షరాలతో పాటు బ్రిటన్ రాజు చిత్రం ఉంది. వాటిపై అణా పైసలు, దమ్మిడీలు అనే పదాలు కన్పిస్తున్నాయి. ఆ ఇంటి పూర్వీకులే గోడలు, పునాదుల్లో దాచి ఉంటారని భావిస్తున్నారు. తవ్వకాలు జరిగేకొద్దీ మరిన్ని నాణేలు బయటపడవచ్చని చెబుతుననారు. -
తాబేలు పొట్టలో 915 నాణేలు
-
తాబేలు పొట్టలో 915 నాణేలు
బ్యాంకాక్: సముద్రపు తాబేలు పొట్టలో 915 నాణేలు బయటపడ్డాయి. బ్యాంకాక్లోని శ్రీరకా కన్జర్వేషన్ సెంటర్లో తాబేలు నివసించే ట్యాంక్లో సందర్శకులు వందల సంఖ్యలో కాయిన్లు విసేరేసేవారు. వాటిలో కొన్నింటిని అందులో నివాసముండే ఒమ్సిన్ అనే సముద్రపు పచ్చతాబేలు మింగేసింది. కాలక్రమేణా ఎక్కువ సంఖ్యలో నాణేలను మింగడంతో ఈదలేని పరిస్ధితికి చేరుకుంది. ఒమ్సిన్ అవస్ధను గుర్తించిన కన్జర్వేషన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి తాబేలు పొట్టలోని నాణేలు బయటకు తీయకపోతే దాని ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఒమ్సిన్కి ఆపరేషన్ నిర్వహించగా.. దాని పొట్టలో చుట్టబడిపోయిన 5 కేజీల నాణేల బాల్ ఉంది. దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి తాబేలును వైద్యులు రక్షించారు. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి ఆపరేషన్ను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఒమ్సిన్ పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మరో ఆర్నెల్ల పాటు ఫిజికల్ థెరపీ అవసరమని తెలిపారు. -
నేడు ఆంధ్రబ్యాంకులో చిల్లర నాణేల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): విజయ దశమి, మొహర్రం, దీపావళి పర్వదినాలను పురష్కరించుకుని బుధవారం నాణేల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆంధ్రబ్యాంకు డీజీఎం గోపాకృష్ణ తెలిపారు. మార్కెట్లో చిల్లర కొరత ఎక్కువగా ఉన్నందున దీనిని అధిగమించేందకు ఆంధ్రబ్యాంకు కర్నూలు ప్రజల అవసరార్థం చిల్లర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పార్క్ రోడ్ శాఖలో రూ.1, 2, 5 నాణేల పంపిణీ ఉదయం 11 గంటలకు చేపడుతున్నామని ఈ అవకాశాన్ని ఖాతాదారులు తదితరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
చిల్లర నాణేలకు డిమాండ్
-కమీషన్లపై కొంటున్న వ్యాపారులు - కృత్రిమ కొరతను సృష్టిస్తున్న బడా వ్యాపారులు - నగరంలో నిత్యం రూ. 5 కోట్ల వరకు వ్యాపారం నల్లకుంట ఏంటీ చిల్లర నాణేలే కదా అని ఈజీగా తీసుకుంటున్నారా? ఆ చిల్లర నాణేలతో కమీషన్ వ్యాపారాలు చేస్తున్న కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంబర్పేట నియోజక వర్గంలో చిల్లర నాణేల వ్యాపారులు కమీషన్ల పేరుతో చిరువ్యాపారులను దోచుకుంటున్నారు. బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి చిల్లర నాణేలను తీసుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం రూ.5 కోట్ల వరకు చిల్లర నాణేల వ్యాపారం జరుగుతోందని అంచనా. చిల్లర నాణేల చెలామణి తక్కువగా ఉండడంతో నూటికి రూ.8 నుంచి రూ.10 శాతం కమీషన్ ఇచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. రూపాయి, రెండు రూపాయల చిల్లరను కొన్ని సందర్భాల్లో ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు 80 శాతం మంది వ్యాపారులు కమీషన్ పద్దతిలోనే చిల్లరను సమకూర్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. దీన్ని అదునుగా చేసుకుంటున్న కొంతమంది వ్యాపారులు చిల్లర కొరత సృష్టించి లక్షలాది రూపాలయను సంపాదిస్తున్నారు. సంతలు, మార్కెట్లలో అవసరం.. అంబర్పేట నియోజకవర్గంలోని వారపు సంతలు, మెడికల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మార్కెట్లలో చిల్లర వినియోగం ఎక్కువగా ఉంటోంది. సుమారుగా 25 వేలకు పైగా చిన్న, పెద్ద దుకాణదారులు నిత్యం వ్యాపారం చేస్తుంటారు. వారు నిత్యం రూ.300 నుంచి రూ.800 వరకు చిల్లరను వినియోగిస్తుంటారని అంచనా. కనీసం రూ.200 వరకు చిల్లర నాణేలను సమకూర్చుకోకుంటే వ్యాపారం చేయలేని పరిస్థితి. ఇక బస్సులు, రైళ్ల చార్జీల విషయంలో చిల్లర అవసరం. రేషన్ దుకాణాలు సైతం చిల్లర నాణేలు లేనిదే నడవని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు పలు సందర్భాల్లో చిల్లర అవసరం. రూ.15 లక్షల కమీషన్.. చిల్లర వ్యాపారంలో కమీషన్లను పరిశీలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సుమారు రూ. 15 లక్షలకు పైగానే కమీషన్ సంపాదిస్తున్నారని అంచనా. ఇందు కోసం ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా వ్యాపారులుండగా మరి కొన్నిచోట్ల పాన్ షాపులు, జనరల్ స్టోర్ వ్యాపారులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు కూడా ఈ చిల్లర వ్యాపారాన్ని చేస్తున్నట్లు సమాచారం, ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే చిల్లర నాణేల సరఫరా జరిగిపోతుంది. సంతల్లో అక్కడికే చిల్లర తీసుకు వచ్చి కమీషన్ తీసుకుంటున్నారు. ఇలా సేకరిస్తున్నారు.. దేవాలయాల హుండీలను లెక్కించే సమయంలో అక్కడి అధికారులను మచ్చిక చేసుకొని కమీషన్ వ్యాపారులు చిల్లర సేకరిస్తున్నారని తేలింది. దేవాలయాల వద్ద యాచకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో చిల్లర సేకరిస్తున్నారు. అలాగే గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాల నుంచి రూ. 5 కమీషన్ చొప్పున చిల్లర నాణేలు సేకరించి తిరిగి వాటిని నగరాల్లో రూ. 8 నుంచి రూ.10 లకు సరఫరా చేస్తున్నారు. ఈ చిల్లర దోపిడి వ్యాపారులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు అంటున్నారు. -
చిల్లర కొనాల్సిందే!
రూ.10 కమిషన్తో రూ.100 చిల్లర కొనుగోలు జిల్లాలో నిత్యం రూ.లక్షల్లో నష్టపోతున్న వినియోగదారులు వెండింగ్ బాక్స్ల ఏర్పాటులో బ్యాంకుల చొరవ కరవు ఆర్బీఐ ఇస్తున్న చిల్లర ఎటుపోతుందో తెలియని పరిస్థితి జోగిపేట: చిల్లర అంటే.. చిన్న విషయం కాదు. వర్తకులు, ఇతర వ్యాపారవేత్తలకు వాటి విలువ తెలుసు. నిత్యం సగటున ప్రతి వినియోగదారుడు జరిపే కొనుగోలులో కనీసం పది పైసలు మొదలు రెండు రూపాయల వరకు చిల్లర నష్టపోతుంటాడు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా చిల్లర సమస్య వేధించడమే అసలు సమస్య. ఇంతలా సమస్య ఎం దుకు వచ్చిందో తెలుసుకోవాల్సిందే... చిల్లర కొనాల్సిందే! పైసలను పైసలు పెట్టి కొనడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును ప్రస్తుతం చిల్లర పైసల కొరత ఏర్పడటం.. దాన్ని ఆసరాగా తీసుకునే చిరు వ్యాపారులు రోజు కు వేల రూపాయల చిల్లరను హోటళ్లు, పెద్ద కిరాణం, వ్యాపార సంస్థలకు కమిషన్ పై అందజేస్తున్నారు. రూ.100కు రూ.10 చొప్పున కమిషన్పై వేల రూపాయల చిల్లరను అందజేసి వేలు సంపాదిస్తున్నారు. పేరుకి చిల్లరగా భావిస్తున్నా డబ్బు నుంచి డబ్బును సంపాదించడం తెలిసినవారికి అది లాభాల పంట పండిస్తోంది. ఏ మాత్రం నష్టభయం లేని నిశ్చింత వ్యాపారాల్లో ఇదొకటి. జిల్లాలోని ప్రతి వ్యక్తి చిల్లర సమస్యను ఎదుర్కొంటున్న వారే. చిల్లరను ఎవరు ఉంచుకోవాలి? చిల్లరను ఎవరు ఉంచుకోవాలన్నది వివాదస్పదంగా మారింది. వినియోగదారుడు సరిపడా చిల్లరను ఇచ్చి సేవలు పొందాలని అమ్మకందారుడు అంటుంటే.. అమ్మకందారుడే విధిగా అందించాల్సి ఉంటుందని వినియోగదారుడు భావిస్తున్నాడు. చివరకు చిల్లర కోసం అనవసర కొనుగోలు తప్పడం లేదు. సరిపడా లేక అదనపు కొనుగోళ్లు చేయాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో డిమాండ్ లేని ఇతర వస్తువులను కొందరు వ్యాపారులు అంటగట్టడం పరిపాటిగా మారింది. ఆర్బీఐ ఇస్తుందంతా ఏమవుతోంది? రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విపణిలో చిల్లర అందుబాటులో ఉంచేలా ఆయా బ్యాంకులకు అందజేస్తుంది. ఆ మొత్తాలను అందుబాటులో తేవాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనే ఉంటున్నా.. వాస్తవ పరిస్థితుల్లో జిల్లాలో చిల్లర మిషన్ల ఏర్పాటు ఎక్కువగా కనిపించడం లేదు. మరి ఆర్బీఐ ఇస్తున్నదంతా ఎక్కడకు పోతుందనే విషయానికి సమాధానలు లేకున్నా.. చిల్లరను వ్యాపారుల పరం చేస్తూ సాధారణ జీవులకు అందుబాటులో లేకుండా చేసే దళారీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెండింగ్(చిల్లర) మిషన్ల ఏర్పాటులో ప్రోత్సాహమేదీ? సుమారు లక్ష జనాభా ఉన్న చోట వెండింగ్ మిషన్ అందుబాటులో ఉంచాలని ఆర్డీఐ ఆదేశాలు చెబుతున్నాయి. జిల్లాలో బ్యాంకర్లు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఉన్నాయని చెబుతున్నా జిల్లాలో అవి ఎక్కడ ఉన్నాయో అనే విషయాన్ని ఆయా బ్యాంకుల సిబ్బందే చెప్పలేక పోవడం గమనార్హం. 50 పైసలు దాటితేనే ... వ్యాపార లావాదేవీల్లో 50 పైసలు దాటితేనే రూపాయి తీసుకోవాల్సి ఉంది. అంతేకాక 50 పైసల్లోపు ఉంటే దానికి ముందు ఉన్న మొత్తాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అమ్మకందారులు పైసా దాటినా రూపాయి వసూలు చేస్తున్నారు. వీటిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇష్టారీతిన చిల్లరను నొక్కేస్తున్నారు. జిల్లాలోని పెట్రోలు బంకుల్లో ‘చిల్లర’ వ్యత్యాసంలో రోజుకు సుమారు లక్షలు మిగులుతాయని ప్రైవేట్ బ్యాం కులు సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఆర్బీఐ నుంచి రావడంలేదు రెండేళ్లుగా ఆర్బీఐ నుంచి మా బ్యాంకుకు చిల్లర రావడంలేదు. గతంలో రాగానే వ్యాపారస్తులకు ఇచ్చేవాళ్లం. చిల్లర డబ్బుల సమస్య ఉన్నట్లు వ్యాపారస్తుల ద్వారా తెలుసుకున్నాం. కాయిన్ వెండర్స్ మిషన్మా బ్యాంకులో ఉన్నా పనిచేయడం లేదు. – మారుతి కుమార్, ఎస్బీహెచ్ మేనేజర్, జోగిపేట చిల్లర కొనుక్కుంటున్నాం మా హోటల్ వ్యాపారానికి చిల్లర తప్పనిసరి. కాబట్టి చిల్లరను వందకు పది రూపాయల చొప్పున ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఒక్కోసారి కమిషన్ మీద తీసుకోవాలనుకున్నా దొరకడం లేదు. ఒకేసారి రూ.5 వేలు, రూ.10 వేల వరకు చిల్లరను తీసుకుంటున్నాం. – సురేశ్, హోటల్ యజమాని, జోగిపేట -
కలెక్షన్ కింగ్
♦ పురాతన నాణేలు, స్టాంపుల సేకరణ ♦ ప్రత్యేకత చాటుతున్న వాజేడు లైబ్రేరియన్ ♦ కళాశాలలో ప్రదర్శన వాజేడు: స్వాతంత్య్రం రాకపూర్వం చలామణిలో ఉన్న నాణేలు, పురాతన స్టాంపులు చూడాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఏ మ్యూజి యంకో వెళ్లాలి. కానీ, మ్యూజియం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాడు వాజేడు ప్రభుత్వ జూని యర్ కాలేజీ లైబ్రేరియన్ నవీన్. పురాతన నాణేల నుంచి, ఆధునిక నాణేల వరకు, దేశ, విదేశీ కరెన్సీ, దేశంలో ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సేకరించాడు. వాటిని ఏ కాలంలో వినియోగించేవారో ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరిస్తున్నాడు. అణా పైసల నుంచి రూ.10 వరకు నాణేలనూ ప్రదర్శిస్తున్నాడు. వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న అలపర్ల నవీన్ స్వస్థలం భద్రాచలం. అతడి తండ్రి వీజే పీటర్ పాతతరం రూపాయి నాణేన్ని దాచాడు. నవీన్ చిన్నతనంలో ఉన్నప్పుడు పీటర్ అలా చేయడాన్ని గమనించాడు. అప్పటి నుంచి నవీన్ కూడా ప్రాచీన నాణేలు సేకరించి భద్రపర్చడం నేర్చుకున్నాడు. 9వ తరగతి చదువు తున్నప్పటి (1993) నుంచి పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు, పలు సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సేకరించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. స్వాతంత్య్రం రాక ముందు చలామణిలో ఉన్న 17 పురాతన నాణేలను సేకరించారు. ఒక్కపైసా నుంచి రూ.10 వరకు నాణేలను సేకరించారు. వాడుకలో ఉన్న పలు ఏడాదుల్లో వచ్చిన భారతదేశ కరెన్సీ రూ.1 నోటు నుంచి రూ.1000 నోటు వరకు సేకరించి భద్రపర్చారు. అమెరికా, ఈజిప్ట్, కతార్, ఒమన్, యూఏఈ, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్, అరేబియా, శ్రీలంక, ఇథియోపియా, కెన్యా, బ్రెజిల్, ఫిలిప్పైన్స్, బహ్రెయిన్తోపాటు మొత్తం 20 దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన అనంతరం విడుదలైన మొదటి స్టాంపు, మహాత్మాగాంధీ మృతి అనంతరం ఆయన ఫొటోతో విడుదలైన మొదటి స్టాంపు, 1993 నుంచి 2016 వరకు విడుదలైన మినీ ఏజర్ సీట్స్ (నాలుగు, ఐదు స్టాంపులు కలిసి ఉన్న సీట్)లను 134 సేకరించారు. రూ.25 వేలు ఖర్చు చేసి వాటన్నింటినీ కళాశాలలో ప్రదర్శిస్తున్నారు. వాటి ప్రత్యేకతను నవీన్ వివరిస్తున్నారు. -
విభిన్న ఆలోచనలు.. విదేశీ కరెన్సీలు
అభిలాష్ అభిరుచి 120 దేశాల కరెన్సీ సేకరణ రామటెంకీలు, ముద్ద, చిల్లుపైసలు ఆయన సొంతం కొందరు యువకులు కంప్యూటర్తో పరుగులు పెడుతున్నారు. తమ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. కానీ, చేర్యాలకు చెందిన ఉప్పల అభిలాష్ విభిన్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. దేశవిదేశాల కరెన్సీ సేకరించి భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. సుమారు పదహారేళ్లుగా 120దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు సేకరించి భద్రపర్చుతున్నారు. - చేర్యాల సిద్దిపేట, తిమ్మాపురానికి చెందిన తన మేనమామ పడకంటి నాగరాజు స్ఫూర్తితో తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో ఈ పనికి పూనుకున్నారు. అభిలాష్ చేర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నప్పట్నుంచే విదేశాల నాణేలు, నోట్లు, స్టాంపుల సేకరణ ప్రారంభించారు. ఇండియాతో పాటు ఇండోనేషియా, సౌత్ఆఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, యూఎస్ఏ, ఫిలిఫైన్స్, భూటాన్, దుబయ్, సౌదిఅరేబియా, రష్య, చైనా, ఘన, మలేషియా, సింగపూర్, జర్మనీ, ఇంగ్లడ్, ఫ్రాన్స్ తదితర 120 దేశాల నాణేలు, 80 దేశాల స్టాంపులు, 40 దేశాల కరెన్సీ తన వద్ద భద్రపర్చారు. వెరుు్య ఏళ్లనాటి నాణేలు భద్రం న్యూ మీస్ మ్యాటిక్ సొసైటీ సహకారంతో సుమారు వెరుు్య ఏళ్లనాటి నాణేలు అభిలాష్ సేకరించారు. ఇందులో ఇండియూలోని వెండి రామటెంకీలతో పాటు 400 క్రితం నాటి(1500-1600ఏళ్లనాటి ముద్దపైసలు), 1835 నాటి బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ(నిజాం సిక్క) నాణేలు, 1900 నాటి నిజాం హయూంలోని చార్మినార్ నాణెం నుంచి నేటి వరకు అన్ని నాణేలు సంపాదించారు. వీటిలో నిజాం హయూంలోని రూపారుులో 1/24 పైస నాణెం, ఈస్ట్ ఇండియా కంపెనీ వినియోగించిన రూపాయిలో 1/12 పైస నాణెం, ఇండియా కరెన్సీలోని నాణేలు, 1948 నుంచి నేటి వరకు అన్ని రకాల విదేశీ కరెన్సీ సేకరించారు. అభిలాష్ సేకరించిన ఫారిన్, ఇటలీ దేశాలతో పాటు యూరో, ఫౌండ్, దినార్, దిరాం, సెంట్ల, యూవాన్, రింగిట్, పైసో, లీరా, టెకా, ప్రాంకీ, రుప్పయలాంటివి ఉన్నారుు. ఇండియాతో పాటు 80 దేశాల స్టాంపులు సైతం.. అభిలాష్ సిలాటలి సొసైటీ గ్రపులతో కలిసి ఇండియాతో పాటు 80 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. 1947లో స్వాత్రంత్యం వచ్చాక వినియోగంలోకి వచ్చిన సుమారు ‘ఒక అణా’విలువైన స్టాంపుల నుంచి రూ.250 విలువైన అన్ని రకాల స్టాంపులు సంపాదించారు. స్వాతంత్య్రానంతరం కూడా.. 1947 స్వాత్రంత్య నాటి ముద్రగా ఉన్న ఒక్కరూపాయి నోటు నుంచి నేడు మార్కెట్లో చెలామణిలోని రూ.1000 విలువైన నోట్లు సేకరించారు. బెహరాన్కు చెందిన 1/4 బినాద్ (బెహరాన్కు చెందిన కరెన్సీ నోటు- ఇండియా కరెన్సీతో పోల్చితే రూ.40 కి సమానం). 1/4 దినార్ కువైట్కు చెందిన కరెన్సీ (ఇండియా రూ.40కి సమానం) వీటితో పాటు 40 దేశాల్లోని వివిధ రకాల కరెన్సీ నోట్లు అన్ని డిజైన్లవీ సేకరించారు. అనుభూతులు తెలిశారుు దేశవిదేశాల కరెన్సీ, స్టాంపుల సేకరణలో ఆ దేశస్తుల ఆచా ర వ్యవహారాలు, సంస్కృ తి, సంప్రదాయూలు, నా యకులు, అక్కడి చరిత్ర తెలిసింది. అన్నింటికీ మించి అక్కడి వారితో కొత్తమిత్రులు లభించారు. వీటి సేకరణ ద్వారా మహానాయకుల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. నా స్నేహితులు ఎంతో సహకరించారు. - అభిలాష్ -
చిల్లర వేట
తూర్పుగోదావరి: పుష్కరాల సందర్భంగా ఘాట్లలో గోదావరికి భక్తులు సమర్పించే చిల్లర కోసం మత్య్సకార యువకులు నీటిలో నిరీక్షిస్తున్నారు. భక్తులు చిల్లర నాణేలు వేయగానే అది నీటి అడుగుకు వెళ్లకుండానే ఒడుపుగా పట్టుకుంటున్నారు. అయాస్కాంతాలతో కట్టిన ఒక తాడును నీటిలో వేసి నాణేలను తీస్తున్నారు. అలా కొన్ని నాణేలు వచ్చేదాకా పంటి కింద అదిమి పట్టుకుంటున్నారు. కొంత చిల్లర పోగయ్యాక ఒక సంచిలో అవి వేసుకుని పంటితో పట్టుకుని గట్టుకు వచ్చేస్తున్నారు. -
అతని పొట్టనిండా నాణేలే
కడుపులోంచి 173 నాణేల వెలికితీత కర్ణాటక రాష్ర్టం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)లో ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అతని కడుపు నుంచి 173 నాణేలు వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో స్థిరపడ్డాడు. అతనికి మతిస్థిమితం లేదు. అప్పుడప్పుడు తనకు తెలీకుండానే నాణేలు మింగాడు. దీంతో కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తాయి. దీంతో అతని బంధువులు 15 రోజుల క్రితం బళ్లారి విమ్స్లో చేర్పించారు. ఆ వ్యక్తి కడుపులో నాణేలు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి, 173 రూపాయి, ఐదు, పది రూపాయల నాణేలను బయటకు తీశారు. రోగికి ఎలాంటి ప్రాణాప్రాయమూ లేదని వైద్యులు తెలిపారు. - సాక్షి, బళ్లారి -
రియో ఒలింపిక్స్ నాణేలు విడుదల
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ (2016) నాణేల (కాయిన్స్)ను బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మరో నాలుగు సాధారణ నాణేలను అందుబాటులోకి తెచ్చామని గేమ్స్ నిర్వాహకులు తెలిపారు. ‘1952 హెల్సింకీ గేమ్స్ నుంచి నాణేలను విడుదల చేయడం గేమ్స్లో భాగంగా కొనసాగుతోంది. అదే మాదిరిగా రియో కాయిన్స్ను కూడా ఆవిష్కరించారు. మొత్తం 36 కాయిన్స్ అందుబాటులోకి వచ్చాయి’ అని రియో గేమ్స్ అధ్యక్షుడు కార్లోస్ నుజ్మాన్ అన్నారు. బంగారు నాణెంలో ఓ వైపు క్రీస్తు విగ్రహం, రెండో వైపు 100 మీటర్ల స్ప్రింట్ను చిత్రీకరించారు. రజత నాణేలలో ఓ వైపు రియోకు చెందిన ప్రఖ్యాత గుర్తులు, మరోవైపు అథ్లెట్లు పోటీపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. -
ఆ నాణేలను పురాణాలు అనేవారు!
గ్రంథపు చెక్క ఇతర దేశాల మాదిరిగానే ప్రాచీన భారతదేశంలో కూడా తొలి మారక ద్రవ్యంగా పశుధనం ఉండేది. కొంతకాలం పోయిన తరువాత లోహపు కడ్డీలు ఉండేవి. ప్రాచీన రచనల ప్రకారం, ఇరాన్కు చెందిన అహ్మనీద్ వంశ చక్రవర్తులు సింధునది లోయలో కొంత ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంలో భాగం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు చక్రవర్తికి కప్పం కింద నిర్దిష్ట పరిణామంలో బంగారు రజను చెల్లించుకునేవారు. ఆ విధంగా బంగారు రజను డబ్బు పాత్ర పోషించేది. బహుశా ఆరోజుల్లో అక్కడ బంగారం చాలా ఎక్కువగా ఉండేదనుకుంటా! ఆ కాలంలో భారతదేశంలో స్వంత వెండి అస్సలుండేది కాదు. ఇతర దేశాల నుంచి వెండిని భారతదేశానికి తీసుకువచ్చేవారు. అందుకే బంగారంతో పోల్చి చూస్తే వెండి ధర ఇతరదేశాల్లో కంటే భారతదేశంలో ఎక్కువగా ఉండేది. ప్రాచీన భారతదేశంలో బాగా వాడకంలో ఉన్న నాణాలను సంస్కృత భాషలో ‘పురాణాలు’ అనేవారు. ఇవి బెంగాల్ నుంచి కాబూలు దాకా బాగా విస్తృతంగా వ్యాపించి ఉండేవి. ఇవి గుండ్రంగానో, నలు చదరంగానో ఉన్న చిన్న వెండి కడ్డీలు. అరుదుగా రాగి కడ్డీలు ఉండేవి. ఒక నాణెం మీద ఎన్నో చిత్రాలను ముద్రించేవారు. కడ్డీ ఒకవైపు ఏ చిత్రం లేకుండా నున్నగా ఉండేది. రెండో వైపున మానవ ఆకారాలు, చెట్లు, పక్షులు, ఆయుధాలు, మత సంబంధమైన చిహ్నాలు, సూర్యచంద్రుల చిహ్నాలు... ఇలా ఎన్నో ఉండేవి. ఈ నాణాలు... అంటే పురాణాలు ఎప్పుడు అవతరించాయో చెప్పడం కష్టం. ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశం బలీయమైన విదేశీ ప్రభావానికి గురయ్యింది. ఇది నాణాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. - గె.అ. ఫ్యోదొరవ్, దవీదొవ్ రష్యన్ రచనకు డా.నిడమర్తి మల్లికార్జునరావు చేసిస తెలుగు అనువాదం ‘నాణాలు చెప్పిన కథ’ పుస్తకం నుంచి. -
అధికారులకు చుక్కలు చూపించిన అభ్యర్థి!
ముంబై: ఎన్నికలొచ్చాయంటేచాలు ఓటర్ల దష్టిలో పడేందుకు అభ్యర్థులు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. కొందరు భారీగా జనాన్ని సేకరిస్తారు. మరికొందరు బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేస్తారు. ఇలా చేస్తే ఓటర్లను బాగా ఆకట్టుకోవచ్చని వారు భావిస్తుంటారు. అయితే నాసిక్లో ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన 12,500 వేల రూపాయల నగదును ఏకంగా చిల్లర నాణేల రూపంలో చెల్లించి అందరినీ ఆకట్టుకున్నాడు. వాటిని లెక్కించేందుకు సంబంధిత అధికారులకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. తొలివిడతలో లోక్సభకు జరిగే ఎన్నికలకు నామినేషన్ వేయడానికి శనివారం చివరి రోజు. నాసిక్లోని ఓ నియోజక వర్గం నుంచి బహుజన్ స్వరాజ్య మహాసంఘ్ పార్టీ అభ్యర్థి ప్రమోద్ నాథేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అధికారులకు చుక్కలు చూపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం జనరల్ కోటా నుంచి పోటీ చేసేవారు రూ.25 వేలు, రిజర్వేషన్ కోటా నుంచి పోటీచేసే వారు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ప్రమోద్ రూ.12,500 చిల్లర నాణేలను జిల్లా అధికారి కార్యాలయంలో సమర్పించారు. 5,954 నాణేలతో మూటగట్టిన సంచిని చూసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చిల్లర తీసుకోకూడదనే నిబంధన ఏదీ లేదు. అందువల్ల అధికారులు ఆ చిల్లరను తీసుకోక తప్పలేదు. అందులో రూపాయి మొదలుకుని రూ.10 వరకు అన్ని చిల్లర నాణేలు ఉన్నాయి. గతంలో వచ్చిన ‘గల్లీత్ గోంధల్ ఢిల్లీత్ ముజ్రా’ అనే చిత్రంలో చిల్లర నాణేలు సమర్పించి ఆ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో చూపించిన విధంగానే ప్రమోద్ చిల్లర నాణేలు సమర్పించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా చిల్లర లెక్కింపు పూర్తయ్యేంత వరకు మిగతా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. ప్రమోద్ సమర్పించిన చిల్లర నాణేలు: రూపాయి నాణేలు - 2,500 రెండు రూపాయల నాణేలు - 2,500 ఐదు రూపాయల నాణేలు - 908 పది రూపాయల నాణేలు - 46 -
ఏ మతానికీ ప్రచారం చేయొద్దు
కేంద్రం, ఆర్బీఐలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం నాణాలపై మతచిహ్నాల ముద్రణపై వివరణ ఇవ్వాలని నిర్దేశం న్యూఢిల్లీ: హిందూ, ముస్లిం, క్రైస్తవం సహా ఏ మతాన్నీ ప్రోత్సహించినట్లుగా, ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించొద్దని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు లౌకికత్వం అనే దానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. కరెన్సీ నాణాలపై మతానికి సంబంధించిన చిహ్నాలు, చిత్రాలను ముద్రించడంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వు బ్యాంకులను ఆదేశించింది. తాంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రభుత్వం.. ఆ ఆలయం చిత్రంతో ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది. అలాగే, వైష్ణోదేవి ఆలయ బోర్డుకు సంబంధించిన బొమ్మతో 2013లో రిజర్వుబ్యాంకు ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది. దీనిని ప్రశ్నిస్తూ.. ఢిల్లీకి చెందిన నఫీస్ ఖాజీ, అబు సయీద్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నాణాలపై మతానికి చెందిన చిహ్నాలు, చిత్రాలు రాజ్యాంగ మూల సూత్రమైన లౌకికతత్వానికి విఘాతం కలిగిస్తాయని.. ఆ నాణాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి (ప్రభుత్వానికి) చెందిన స్థిర, చరాస్తులు వేటిపైనా మతాలకు సంబంధించిన చిహ్నాలను ముద్రించకుండా, వినియోగించకుండా... ఒక జాతీయ పాలసీని రూపొందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. -
విదేశీ నాణెంపై విఘ్నేశ్వరుడు
గణపవరం, న్యూస్లైన్ : విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఆఫ్రికా ఖండంలోని ఐవరీకోస్ట్ దేశం ప్రత్యేక నాణెం ముద్రించడం విశేషం. ఈ నాణేన్ని స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణ అభిరుచి ఉన్న గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజు సేకరించారు. ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ వివిధ దేశాల నాణాలు, స్టాంపుల సేకరణ హాబీ ఉన్న తాను ఇంటర్నెట్లో ఈ నాణెం గురించి తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు సేకరించారన్నారు. నాణెం 25 గ్రాముల బరువు, 38.61 మిల్లీమీటర్ల వ్యాసం ఉందన్నారు. నాణేనికి ఒక వైపు ఆ దేశ రాజముద్ర, నాణెం విలువ, రెండో వైపు రావిఆకులతో రూపొందించిన విఘ్నేశ్వరుడి చిత్రం ముద్రించి ఉన్నాయన్నారు. గిఫ్టు బాక్సును వినాయకుని మూషిక వాహనం నమూనాలో రూపొందించి, అందులో ఈ స్మారక వెండి నాణేన్ని ఉంచి పార్శిల్ ద్వారా పంపారన్నారు. ఆ దేశ కరె న్సీ ప్రకారం ఈ నాణెం విలువ 1001 ఫ్రాంక్లని తెలిపారు. దీని సేకరణకు తనకు రూ.8 వేలు ఖర్చయిందని రాజు చెప్పారు. వివిధ దేశాల నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నానని, వాటి సేకరణకు ఇప్పటి వరకు రూ. 8 లక్షలు ఖర్చు చేశానన్నారు.