Commercial Taxes Department
-
మాజీ సీఎస్ సోమేష్కుమార్కు సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ను నమోదు చేయనుంది.ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్లో సినీ నటి అరెస్ట్తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్మాల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్కుమార్కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్మాల్కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్వేర్ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో పాటు ఐజీఎస్టీ, సెస్లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
లక్ష్యం సాధించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదాయాన్ని ఆర్జించే శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖల పన్ను వసూళ్లపై సోమ వారం సచివాలయంలో రేవంత్రెడ్డి సమీక్షించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకు పైగా చెల్లించేదని, దాని గడువు ముగియడంతో ఆ నిధు లు ఆగడంతో వ్యత్యాసం కనిపిస్తోందని అధికా రులు వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదాయం తెచ్చే శాఖలకు సొంత భవనాలు రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనికి స్పందించిన రేవంత్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆదాయం తెచ్చే శాఖలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. అక్రమాలకు చెక్పెట్టేలా ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు. వే బిల్లులు.. వాహనాల ట్రాకింగ్ ఇసుక సరఫరా వాహనాలకు వే బిల్లులతోపాటు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన పలు గనులపై జరిమానాలు విధించారని, ఆ జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. టీఎస్ఎండీసీతోపాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ .231 కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్/బోధన్: బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలైంది. 2017 నుంచి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తెలంగాణ సీఐడీ అధికారులు ఇటీవల కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్భగవత్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 22 మంది వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అధికారులే.మొత్తం 123 మంది సాక్షులను విచారించినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. 68 రకాల సాఫ్ట్వేర్ మెటీరియల్తో పాటు 143 డాక్యుమెంట్లు, మూడు ఆడిట్ రిపోర్ట్లను సాక్ష్యాలుగా కోర్టుకు సమరి్పంచారు. ఈ కుంభకోణంలో నిందితులు మొత్తం రూ.231.22 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టినట్టు తేల్చారు. దీనికి సంబంధించి 2005 నుంచి 2016 వరకు బోధన్, నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అధికారుల వివరాలు సీఐడీ సేకరించింది. ఇలా దోచేశారు.. వాణిజ్య పన్నులశాఖ బోధన్ సర్కిల్లో జరి గిన నకిలీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పన్నులు చెల్లించకుండానే నకిలీ చలాన్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యాపారాలు చేసేవారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి చలానాకు ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఖజానా (ట్రెజరీ)లో ఈ నంబర్ వేయించుకుని ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులో పన్ను మొత్తాన్ని జమ చేయాలి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్లు బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. పన్నులు చెల్లించకుండానే చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించారు. కొంత మొత్తాన్ని చెల్లించి ఎక్కువ మొత్తంలో చెల్లించినట్టు చూపారు. ఒకరు చెల్లించిన చలానాతోనే పదుల సంఖ్యలో వ్యాపారులు, పలు వ్యాపార సంస్థలు చెల్లించినట్టుగా రికార్డులు సృష్టించారు. వ్యాపారుల సొమ్మును పక్కదారి పట్టించి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. ఎక్కడికక్కడ అధికారులను తమ దారికి తెచ్చుకుని ఏళ్ల తరబడి ఈ కుంభకోణం కొనసాగించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ సీటీఓ ఎల్.విజయేందర్ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2017 ఫిబ్రవరి 2న చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో ఉద్యోగుల అవినీతి బాగోతానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించాయి. ఫోర్జరీ, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరిత కుట్ర, లంచం తీసుకోవడం వంటి నేరాలు ఉండడంతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్.శ్యామ్ ప్రసాద్రావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసు నీరుగార్చే యత్నాన్ని బయటపెట్టిన ‘సాక్షి’.. ఈ భారీ కుంభకోణం దర్యాప్తులో ఆద్యంతం అనేక మలుపు చోటు చేసుకున్నాయి. చలాన్లు పెట్టేందుకే నిందితులు ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి నిండా చలాన్లు ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు దర్యాప్తును నీరుగార్చేందుకు ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరు ప్రయత్నించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాతే కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అనేకమంది అధికారుల పాత్ర వెల్లడైంది. ఈ క్రమంలో సీఐడీ విచారణాధికారికి కోటి రూపాయల ఎర వేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ విజయ్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టు అయ్యింది వీరే.. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులుగా ఉన్న సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (ఏడాది క్రితం మరణించాడు), అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్లను సీఐడీ అరెస్టు చేసింది. వీరిద్దరు నిజామాబాద్ పట్టణంలో సేల్స్ ట్యాక్స్ ప్రైవేటు ఆడిటర్లుగా ఉంటూ ఈ కుంభకోణానికి తెగబడ్డారు. వీరితో పాటు వారి సిబ్బంది విశాల్ పాటిల్ అలియాస్ విశాల్ కాంతిపాటిల్, కమ్మర రామలింగం అలియాస్ రామ లింగడు, నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి, ఎన్.సత్యవెంకట కృష్ణకుమార్ అలియాస్ పంతులు, ఎం.మల్లేశ్, గంగొనే రాకేశ్, మడపల్లి రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్ నజీముద్దీన్ అలియాస్ అబీబుద్దీన్, అర్రోజుల రాజేశ్ కూడా ఉన్నారు. ఇక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశ్యానం వేణుగోపాల స్వామి, బి.హనుమంతు సింగ్, ధరణి శ్రీనివాసరావు, టి.పూర్ణచంద్రారెడ్డితో పాటు బోధన్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ఏసీటీఓలు) ఆర్.కిషన్, కె.నాగేశ్వర్రావు, కె.విజయకుమార్, ఎస్.రత్నకుమారి, బీఎన్ ఇందిర, జె.రాజయ్య, ఎస్.సాయిలు, సీనియర్ అసిస్టెంట్లు సి.స్వర్ణలత, కె. అరుణ్రెడ్డి, బి.పీరాజి, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, జూనియర్ అసిస్టెంట్లు చంద్రహాస్, ఆర్.వినోద్కుమార్, బి.రంగారావు, ఎల్.భజరంగ్, సి.శ్రీధర్లు కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. -
సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. పోలీసుల తరపున దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్రెడ్డి వివరించారు. ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు. ఆ కాల్డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
Telangana: పన్నుల ఆదాయం రెండేళ్లలో డబుల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సొంత పన్నుల ఆదాయం వేగంగా పెరుగుతోంది. ఖజానాకు గణనీయంగా రాబడి సమకూరుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తొలి ఏడు నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం దాదాపు రెండింతలు కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) అన్నిపన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,846 కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది అదే సమయానికి రూ.40,788 కోట్లు సమకూరింది. నిజానికి గత ఏడాది (2021–22) నుంచే ఆదాయం పెరగడం మొదలైందని.. అదే ఒరవడి కొనసాగుతోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కన్నా ఈసారి అన్ని పన్నుల ఆదాయం సగటున 10 శాతం పెరిగిందని వివరిస్తున్నారు. వ్యాట్ నుంచి అధికంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రెండు రూపాల్లో సమకూరుతుంది. పెట్రో ఉత్పత్తులు, లిక్కర్లపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో, ఇతర అన్నిరకాల వ్యాపార లావాదేవీలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రాబడి వస్తుంది. ప్రస్తుతం వ్యాట్ కింద పెట్రోల్, లిక్కర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి రెండింతలకుపైగా ఖజానాకు సమకూరింది. 2020–21లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ద్వారా రూ.3,970 కోట్లురాగా.. ఈసారి ఏకంగా రూ.8,770 కోట్లకు చేరింది. లిక్కర్పై వ్యాట్ రాబడి కూడా 40 శాతం వరకు పెరిగింది. 2020–21 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.6వేల కోట్లు సమకూరగా.. 2021–22లో రూ.7,529 కోట్లు, ఈసారి రూ.8,384 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే 10 శాతం పెరిగింది. ఇక ఇతర వ్యాపార లావాదేవీలపై విధించే వ్యాట్ కలిపి ఈ ఏడాది మొత్తంగా రూ.17,560 కోట్లు ఖజానాకు చేరింది. ఇది 2020–21లో రూ.10,367 కోట్లు, 2021–22లో రూ.15,340 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. జీఎస్టీ పరిహారం రాకపోయినా.. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావడంతో ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని కేంద్రం నిలిపివేసింది. ఆ పరిహారం రాకపోయినా జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూసుకెళుతోంది. అక్టోబర్ చివరినాటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జీఎస్టీ రూపంలో రూ.21,322 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరింది. ఇందులో ఎస్జీఎస్టీ రూ.9,537.63 కోట్లుకాగా, ఐజీఎస్టీలో వాటా రూ.10,801 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్ను రాబడి 31 శాతం వృద్ధి చెందడం విశేషం. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ కలిపి 2020–21లో రూ.10,917 కోట్లు, 2021–22లో రూ.16,222 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రెండేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా వ్యాట్, జీఎస్టీ రెండూ కలిపి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుండటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలలతో పోలిస్తే.. ఈసారి జూలై, అక్టోబర్ నెలల్లో పన్ను వసూళ్లు కాస్త తగ్గాయని తెలిపారు. కానీ మిగతా ఐదు నెలల్లో అధిక వృద్ధితో మొత్తంగా పన్ను వసూళ్లు పెరిగాయని వివరించారు. -
పుంజుకుంటున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాల్లో భారీ వృద్ధి రేటు నమోదవుతుండగా, డీజిల్ అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ఆదాయంలో నమోదవుతున్న వృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో పెట్రో వ్యాట్ ఆదాయంలో 6.39 శాతం వృద్ధి నమోదు కాగా.. అక్టోబర్కల్లా 25.24 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.851.40 కోట్లుగా ఉన్న పెట్రో వ్యాట్ ఆదాయం.. ఈ ఏడాది 6.39 శాతం వృద్ధితో రూ.905.78 కోట్లకు చేరింది. అలాగే అక్టోబర్లో 25.24 శాతం వృద్ధితో రూ.750.35 కోట్ల నుంచి రూ.939.76 కోట్లకు చేరింది. లాక్డౌన్తో తొలి త్రైమాసికంలో 30 శాతం ఆదాయం నష్టపోగా రెండవ త్రైమాసికంలో కొద్దిగా కోలుకొని 3.76 శాతం వృద్ధి నమోదయ్యింది. పెరిగిన సొంత వాహనాల వినియోగం లాక్డౌన్ తర్వాత డీజిల్తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోందని పెట్రోలియం డీలర్లు పేర్కొంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు కంటే సొంత వాహనాలకే వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాల్లో 20 శాతం వరకు వృద్ధి కనిపిస్తోందని ఏపీ పెట్రో డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. తాము ప్రతి నెలా సగటున 4,500 లీటర్ల పెట్రోల్ విక్రయిస్తుండగా గత రెండు నెలల నుంచి 4,700 లీటర్లు విక్రయిస్తున్నట్లు గుంటూరుకు చెందిన డీలర్ ‘సాక్షి’కి వివరించారు. ఇదే సమయంలో డీజిల్ అమ్మకాలు మాత్రం కోవిడ్ ముందు స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ, సరుకు రవాణా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాకపోవడం..డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. కోవిడ్కు ముందు ప్రతి నెలా 8,000 లీటర్ల వరకు డీజిల్ విక్రయిస్తుండగా, ఇప్పుడది 7,000 లీటర్ల స్థాయికి చేరిందన్నారు. ఒకటి రెండు నెలల్లో డీజిల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలల్లో రూ.5,448.79 కోట్ల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.5,448.79 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఏప్రిల్–అక్టోబర్ కాలంలో ఈ ఆదాయం రూ.5,965.50 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో రూ.1,860.09 కోట్లుగా ఉన్న ఆదాయం ద్వితీయ త్రైమాసికానికి రూ.2,648.98 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికం రెండు నెలల్లో మంచి వృద్ధిరేటు నమోదు కావడంతో పూర్తి ఏడాది కాలానికి లాక్డౌన్ నష్టాన్ని పూడ్చుకొని వృద్ధి బాట పట్టగలమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
దుమ్ముదులిపిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు.. కోవిడ్ ప్రబలడానికి ముందునాటి పరిస్థితులకు చేరుకున్నాయి. జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2,480 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఈ స్థాయిలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1,975 కోట్లు. అదేనెలలో ఈ ఏడాది 26 శాతం వృద్ధితో రూ.2,480 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల్లో పేర్కొంది. దసరా పండుగకు తోడు కోవిడ్తో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థికరంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయని వాణిజ్యపన్నులశాఖ అధికారులు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వృద్ధిరేటు అధికంగా ఉండటమే దీనికి నిదర్శనమంటున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో 5 శాతం వంతున, తమిళనాడులో 13, ఒడిశాలో 21 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం వల్ల అక్టోబర్లో రూ.350 కోట్ల మేర అదనంగా వసూలైనట్లు చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ పీయూ‹Ùకుమార్ చెప్పారు. ఈ ఏడాది తొలిసారిగా కనీస రక్షిత ఆదాయానికి మించి: 2020–21 సంవత్సరానికి కనీస రక్షిత ఆదాయం నెలకు రూ.2,225 కోట్లుగా నిర్ణయించారు. ఇంతకంటే తగ్గిన ఆదాయం మొత్తాన్ని కేంద్రం పరిహారం రూపంలో చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా అక్టోబర్లో కనీస రక్షిత ఆదాయం మించి పన్ను వసూలైంది. ఏప్రిల్– సెపె్టంబర్ కాలానికి కనీస రక్షిత ఆదాయం కింద రూ.13,350 కోట్లు రావాల్సి ఉండగా రూ.8,850.62 కోట్లు మాత్రమే వచి్చంది. ఆరునెలల్లో రూ.4,499.38 కోట్ల మేర తక్కువ వసూలైంది. ఈ ఆరునెలల్లో సగటున నెలకు రూ.1,475.10 మాత్రమే జీఎస్టీ వసూలైంది. దేశంలో తొలిసారి లక్షకోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్కును అధిగమించాయి. అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,05,155 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ నెలలో వసూలైంది రూ.95,379 కోట్లు. వరుసగా రెండునెలల నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటం ఆరి్థకవ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్న సంకేతాలిస్తోంది. -
గ్రానైట్ వాణిజ్యంతో ఖజానాకు గండి
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నులశాఖలో క్రిందస్థాయి సిబ్బంది చేతివాటం ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. రాజధాని ప్రాంతంలో వసూలు కావాల్సిన లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. నగరం మీదగా వెళ్లే లారీలను తనిఖీ చేసి వేబిల్లులు సరిగా లేని, పన్నుల చెల్లించని లారీలపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు వేసేందుకు అధికారులు ప్రయత్నింస్తుంటే.. తమకున్న అనుభవంతో అధికారుల కళ్లు కప్పి లారీలను ఈశాఖలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లు తప్పిస్తున్నారు. రూ. 6 లక్షల గ్రానైట్ ఎగుమతి ఒంగోలు నుంచి మహారాష్ట్రకు గ్రానైట్ భారీగా ఎగుమతి అవుతుంది. ప్రతి నిత్యం పది నుంచి 15 లారీల్లో గ్రానైట్ రవాణా జరుగుతుంది. ఒక్కో లారీలో కనీసం రూ.6 లక్షలు విలువైన గ్రానైట్ రాళ్లు ఎగుమతి జరుగుతాయి. గ్రానైట్పై జీఎస్టీ 18శాతం. ఈ లెక్కన కనీసం ఒక్కో లారీకి రూ.లక్ష వరకు పన్ను వసూలు కావాలి . అయితే అంత పన్ను చెల్లించడానికి డీలర్లు సుముఖంగా వుండటం లేదు. దీంతో దొడ్డిదారిలో సరుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న గ్రానైట్ లారీలు (ఫైల్) ‘కోటీ’శ్వరుడు తలుచుకుంటే.... వాణిజ్యపన్నులశాఖలో అధికారులు వద్ద ఒక డ్రైవర్ ఎంతోకాలంగా పనిచేస్తున్నాడు. ఆయన డిపార్టుమెంట్లో తాత్కాలిక ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లతో ఒక టీమ్ను తయారు చేశారు. ఈ కోటీశ్వరుడు తలుచుకుంటే చాలు... గ్రానైట్ తో పాటు ఏ సరుకు రవాణా చేసే లారీనైనా సురక్షితంగా జిల్లాను దాటిస్తారని డీలర్ల నమ్మకం. ఒంగోలు, గుంటూరు మీదగా తాడేపల్లికి వచ్చే లారీల డ్రైవర్లు ముందుగా ఈ టీమ్లోని వారి సమాచారం అందిస్తారు. వారి ద్వారా టీమ్ లీడర్కు సమాచారం అందుతుంది. ఆ రోజు ఏ అధికారి ఎక్కడ వాహనాలు తనిఖీ (వీటీ) చేస్తున్నారో తెలుసుకుని ఆ మార్గంలో కాకుండా మరోక మార్గంలో లారీలను కంచికచర్ల, పెనుగంచిప్రోలు వరకు తప్పిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ రూట్లో మహారాష్ట్ర వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. తాడేపల్లి నుంచి ఒక్కక్క లారీని కాకుండా ఆరేడు లారీలను ఒకేసారి తీసుకువచ్చి తప్పిస్తారని ఆశాఖలోనే చర్చించుకుంటున్నారు. కాగా అధికారులు అనుమానం రాకుండా ఒకటి రెండు లారీలను ఈ రూట్లోకి పంపుతారు. మిగిలిన వాటిని మరో మార్గంలో తప్పిస్తారు. గతంలో ఇదే తరహాలో పట్టుకున్న వ్యాన్ను తప్పించగా.. ఆగ్రహించిన డీసీటీవో ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు కన్ను గప్పి తప్పిపోయిన వ్యాన్ను వెంటనే వెనక్కు రప్పించిన ఘనత ఈటీమ్ నాయకుడుకు ఉంది. లారీ యజమానులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి లారీని పట్టిస్తారని, అలాగే తప్పిస్తారని చెబుతున్నారు. ప్రతిదానికీ ఒకో రేటు ఒక్కో గ్రానైట్ లారీని సురక్షితంగా తప్పిస్తే రూ.5వేలు వరకు వసూలు చేస్తారు. ఈ విధంగా ఆ డ్రైవర్ ‘కోటీశ్వరుడు’ అయ్యారని వాణిజ్యపన్నులశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తన వద్ద టీమ్ను మెయిటెన్ చేస్తూ రోజుకు ఐదు నుంచి 8 లారీల వరకు తప్పిస్తారని చెబుతున్నారు. కేవలం గ్రానైట్ కాకుండా నగరానికి వచ్చే రెడీమేడ్, ఎలక్రిక్టల్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువుల లారీలను తప్పిస్తారు. అయితే ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. లారీలను అధికారులు పట్టుకున్నప్పుడు తక్కువ జరిమానాతో బయట పడే మార్గాన్ని చెబుతారని సమాచారం. తానే వీటీలు చేయిస్తూ.... అధికారులు అప్రమత్తంగా లేని సమయంలోనూ, నగరంలో వాహనాలు తనిఖీ(వీటీ)లు జరగనప్పడు ఆయనే ఒక మహిళను ఒక కారులో కూర్చుబోట్టి డీసీటీఓగా కారులో ఉన్నారంటూ లారీలను ఆపి తనిఖీలు చేసి వారి వద్ద మామూళ్లు తీసుకుని వదిలివేస్తారని సమాచారం. కాగా ఈ టీమ్లోని సభ్యుల ఫోన్ నెంబర్లు ట్రాకింగ్పెడితే అనేక వాస్తవాలు వెల్లడవుతాయని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. -
ఫంక్షన్..పన్ను టెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్లు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. విందు, వినోదం.. కార్యం ఏదైనా ఫంక్షన్ హాల్లో జరిగితే ఇకపై పన్ను కట్టాల్సిందే. ఫంక్షన్హాల్లో ఏ కార్యం చేసినా బిల్లులో 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా ఫంక్షన్ హాల్ యాప్ రూపొందించింది. జీఎస్టీ వర్తించక ముందు ఫంక్షన్ హల్ బిల్లును సర్వీస్ ట్యాక్స్ ద్వారా చెల్లించేవారు. అయితే తాజాగా ఫంక్షన్ హాల్ సేవలతో పాటు వస్తువుల కేటగిరీలోకి రావడంతో జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తగా వార్షిక అద్దె రూ.20 లక్షల కన్నా ఎక్కువ ఉన్న అన్ని ఫంక్షన్ హాళ్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటివరకు ఫంక్షన్హాల్స్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా కూడా పన్నులు చెల్లించ ట్లేదని గ్రహించిన వాణిజ్య పన్నుల శాఖ.. ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఫంక్షన్ హాల్స్ అద్దెలు కూడా పెరగనున్నాయి. కేటరింగ్, డెకరేషన్, వినోదంతో పాటు అన్ని రకాల సేవలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆధునిక పరిజ్ఞానంతో.. పన్ను వసూళ్ల కోసం వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. ఇప్పటికే ఐఓసీ, ఆర్డీ యాప్లతో సిబ్బందికి టార్గెట్లు కేటాయించి పన్నుల బకాయిలు వసూలు చేస్తోంది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్లను జీఎస్టీ పరిధిలో తీసుకురావడానికి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫంక్షన్ హాల్లు పూర్తి సమాచారాన్ని కొత్త యాప్లో నమోదు చేస్తున్నారు. ఇంకా జీఎస్టీలో నమోదు చేసుకొని ఫంక్షన్ హాళ్లను యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఫంక్షన్ హాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్లో పొందుపరచడంతో అధికారులు, సిబ్బందికి రిజిస్ట్రేషన్ సులభమైందని అధికారులు చెబుతు న్నారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, సొంతం ఎన్ని.. కంపెనీలు, పార్ట్నర్షిప్లో ఎన్ని ఉన్నాయనే వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. ఫంక్షన్ హాల్ వైశాల్యం తదితరాలతో పాటు పాటు ఉద్యోగుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు. ఫంక్షన్ హాల్లో సామగ్రిపై కూడా నజర్ వేస్తున్నారు. ఒకవేళ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు డీఆర్సీ ఫామ్–3 ద్వారా పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయించు కోకుండా పన్నులు ఎగ్గొడితే వడ్డీతోపాటు జరిమా నాతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫంక్షన్ హాల్ యాప్తో ఫంక్షన్ హాళ్లకు సంబంధించి పన్నుల వసూళ్లు సులభమవు తున్నాయని అధికారులు చెబు తున్నారు. -
పన్నుల శాఖలో ఎన్నికల లొల్లి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర పన్నుల శాఖలో కూడా ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం సారథ్యం కోసం జరగనున్న ఈ ఎన్నికలు ఆ శాఖలో అసలైన ఎన్నికల సెగ పుట్టిస్తున్నాయి. సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే ఆనవాయితీ ఉన్నా ఈ దఫా గెజిటెడ్ అధికారులు రెండుగా చీలిపోవడంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. తూకుంట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారంలో తాత్సారం వహిస్తోందని ఆరోపిస్తూ కొందరు ప్రస్తుత కార్యవర్గాన్ని వ్యతిరేకించి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో కేవలం 350 ఓట్లే ఉన్నా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం (టీసీటీజీవోఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే, ప్రస్తుత కార్యవర్గం తమ పనితీరును సమర్థించుకుంటోంది. అటు ప్రభుత్వంతో, ఇటు ఉన్నతాధికారులతో సానుకూల దృక్పథంతో వెళ్తూనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని, కొన్నింటిని పూర్తిస్థాయిలో పరిష్కరించే దశకు చేరుకున్నామని సంఘం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలు పన్నుల శాఖలో వేడి పుట్టిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులే ఎజెండా.. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు జరిగేందుకు శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని, బదిలీలు సక్రమంగా జరగకపోవడంతో పదోన్నతులు కూడా నిలిచిపోయాయనే చర్చ శాఖలో జరుగుతోంది. అయితే టీసీటీజీవోఏ కార్యవర్గం మాత్రం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో చేయాల్సిందంతా చేశామని చెబుతోంది. డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ ఇవ్వనన్ని పదోన్నతులు సాధించామని, రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కేటగిరీల్లో 75 శాతం మంది ఉద్యోగులు కనీసం ఒక్క పదోన్నతి అయినా తీసుకున్నారని, గతం కంటే పారదర్శకంగా వ్యవహరించడం ద్వారానే ఇది సాధ్యమైందని అంటోంది. అసోసియేషన్ ఎన్నికలకు ఇప్పటికే 2 ప్యానెళ్లు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుది గడువు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ జరగకపోతే ఈ నెల 13న ఎన్నికలు అనివార్యం కానున్నాయి. పద్ధతిలో తేడా తప్ప పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో మా అసోసియేషన్ ఏర్పడింది. రాష్ట్ర అస్తిత్వం, మనుగడ, పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించాం. అధిక పనిభారం, ఒత్తిడితోపాటు శాఖాపరంగా ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. కొత్త రాష్ట్రంపై తీవ్ర పోరాటాలు చేయలేం. శాంతియుత, ప్రజాస్వామిక, సమన్వయ పద్ధతుల్లోనే ఇది సాధ్యమవుతుంది. పోరాట పద్ధతుల్లో తేడా ఉంటుంది తప్ప పోరాటం ఆగదు. – తూకుంట్ల వెంకటేశ్వర్లు,టీసీటీజీవోఏ అధ్యక్షుడు -
ఆదాయం అదుర్స్
సాక్షి సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖ రాబడులు గణనీయంగా పెరిగాయి. ఉన్నతాధికారులు, సిబ్బంది సమష్టి కృషితో ఆ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.46 వేల కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే 18.20 శాతం వృద్ధి సాధించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల పన్ను వసూళ్లు జరగ్గా... ఈసారి రూ.46 వేల కోట్లు రావడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏటా వచ్చే పన్ను వసూళ్ల ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాన్ని 30శాతం పెంచి టార్గెట్ నిర్దేశించుకుంటారు. ఈ మేరకు 2018–19 లక్ష్యం రూ.52వేల కోట్లు కాగా... రూ.46వేల కోట్ల పన్ను వసూలు అయింది. 2018–19 అక్టోబర్లో అత్యధికంగా రూ.4,172 కోట్ల పన్ను రాబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో రూ.4,152 కోట్లు, జూలైలో రూ.4,006 కోట్ల ఆదాయం వచ్చింది. మేలో అత్యల్పంగా రూ.3,226 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆగస్టులో అత్యధికంగా 38.15 శాతం వృద్ధి సాధించగా... ఫిబ్రవరిలో అత్యల్పంగా 4.11 శాతం నమోదైంది. జీఎస్టీ వసూళ్లు రూ.1,275 కోట్లు కాగా ఎంట్రీ ట్యాక్స్, సీఎస్టీ డిమాండ్లు, లగ్జరీ ట్యాక్స్, వ్యాట్ ఆడిట్ డిమాండ్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్తో పాటు జీఎస్టీ పరిధిలోకి రాని పెట్రోలియం, ఎక్సైజ్, పొగాకు ద్వారా రూ.21,174 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ రెండింటి నుంచే 45శాతం.. ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో ఈ రెండింటి నుంచే ఎక్కువ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం పన్ను రాబడిలో ఎక్సైజ్, పెట్రోలియం నుంచే దాదాపు 45శాతం వచ్చిందని చెప్పారు. డీలర్లు, సంస్థలపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కఠిన వైఖరి అవలంబించడంతో ఆదాయం పెరిగిందన్నారు. 2018–19లో దాదాపు ఐదు వేల వాహనాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. వే–బిల్లు లేని వాహనాలను అదుపులో తీసుకొని జరిమానాలు విధించడంతో ఆదాయం పెరిగిందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే కొన్ని వస్తువులపై ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తుంది. 2018–19లో ఈ పన్ను రూ.800 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అధికారులు బాకాయిదారులపై దృష్టిసారించడంతో ఈ మేరకు ఆదాయం సమకూరింది. వాహనాల ఆకస్మిక తనిఖీలు, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం, బకాయిల వసూలుపై దృష్టిసారించడం తదితర చర్యలు చేపట్టారు. పన్నుల చెల్లింపులకు సంబంధించిన అన్ని లావాదేవీలను కంప్యూటరైజ్డ్ చేయడంతో పని మరింత సులభమైంది. జీఎస్టీ అమలు కూడా ఆదాయం పెరగడానికి దోహదపడిందని అధికారులు పేర్కొన్నారు. -
వాణిజ్య పన్నుల శాఖ ఆల్టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆదాయ రాబడిలో వాణిజ్య పన్నుల శాఖ ఆల్టైం రికార్డు సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.45 వేల కోట్లు దాటిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్క మార్చిలోనే రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్టు తెలు స్తోంది. మార్చిలో ఎస్జీఎస్టీ కింద రూ.1,275 కోట్లు వచ్చింది. అయితే, ఇప్పటివరకు అత్యధికంగా ఫిబ్రవరిలో 1,041 కోట్ల ఆదాయం ఎస్జీఎస్టీ కింద రాగా, ఈ నెలలో అంతకు మించి ఆదాయం రావడం గమనార్హం. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చడంలో కృషి చేసిన శాఖ సిబ్బందిని, అధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ అభినందించారు. సమస్యలు పరిష్కరించండి: టీఎస్టీఈఏ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గత ఏడాది కన్నా 20 శాతం పెరగడంపట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాఖ సిబ్బంది, అధికారులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమయిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం (టీఎస్టీఈఏ) గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కె.ఎం.వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ను కలసి అభినందనలు తెలిపారు. శాఖాపరంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించి మరింత ఆదాయం సమకూర్చేలా చేసి ఉద్యోగులు, సిబ్బందికి చేయూతనివ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సోమేశ్కుమార్ సానుకూలంగా స్పందించినట్టు టీఎస్టీఈఏ నేతలు తెలిపారు. -
రేపు అర్ధరాత్రి వరకు విధుల్లోనే..
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల ముగిసేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ నిర్దేశిత టార్గెట్ పూర్తి కోసం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 31 అర్థరాత్రి వరకు అధికారులు విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు పలు బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి. బ్యాంకుల్లో జమ చేసిన, ఆన్లైన్లో చెల్లించిన పన్నుల లెక్కలు పూర్తి చేయడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పని చేయనున్నారు. ఇంకా 48 గంటలే మిగిలి ఉండటంతో అధికారులు టార్గెట్పై దృష్టి కేంద్రీకరించారు. ఏ డీలర్ రిటర్న్స్ దాఖలు చేయలేదు.. ఎంత బకాయి ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని ఏ వాణిజ్య పన్నుల కార్యాలయానికి వెళ్లినా శుక్రవారం ఇదే సీన్ కనిపించింది. ఉన్నతాధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు యాప్ల్లో టార్గెట్లను నిర్దేశిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భారీగా పెరగనున్న పన్ను రాబడి... గత ఏడాది కంటే ఈసారి వాణిజ్య పన్నుల రాబడి పెంచడానికి ఉన్నతాధికారులు శ్రమిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్, కమిషనర్ అనిల్కుమార్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఎంట్రీ టాక్స్ ద్వారా రూ.800 కోట్లు వసూలు అయింది. గత ఏడాది మార్చి నెలలో రూ.923 కోట్లు వసూలు కాగా, ఈ సారి మార్చి నెల 25వ తేదీ నాటికి రూ.1,070 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన ఆరు రోజుల్లో ఇంకో రూ.300 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై 3 రోజుల క్రితం సోమేశ్కుమార్ 1,300 మంది సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. -
‘ఉన్నతం'గా దోచేస్తున్నారు !
సాక్షి సిటీబ్యూరో: వ్యాపారుల క్రయ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి వారి ద్వారా జరిగే వ్యాపారాలకు ప్రభుత్వం నిర్దేశించిన పన్నును వసూలు చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులే దానికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ అదాయాన్ని పెంచాల్సిన కొందరు అధికారులు వ్యాపారులతో కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. వాణిజ్య పన్ను చట్టాలను ఆసరాగా తీసుకొని వ్యాపారులకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి అనంతరం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఏడు డివిజన్లలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయ లు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల అక్రమ బాగోతంపై ‘సాక్షి’ ప్ర త్యేక కథనం.. ♦ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పంజగుట్ట డివిజన్, సోమాజిగూడ సర్కిల్లోని ఓ ప్రముఖ బంగారు నగల దుకాణానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.23 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. అయితే సదరు వ్యాపారి తన పలుకుబడిని వినియోగించి ఉన్నత అధికారులతో ఒప్పందం చేసుకుని కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించా డు. ఇందుకు గాను ఉన్నతాధికారులకు రూ.కోట్లల్లో ముడుపులు అందినట్లు సమాచారం. ♦ అబిడ్స్ డివిజన్, గౌలిగూడ సర్కిల్లోని ఓ రెడీమెడ్ షోరూంకు సంబంధించి షాప్లపై దాడులు నిర్వహించిన శాఖ అధికారులు రూ. 16 కోట్ల పన్ను చెల్లించనందుకుగాను జరిమానా విధించారు. సదరు వ్యాపారి ఉద్యోగుల అండదండలతో సదరు శాఖ ఉన్నతాధికారి సంప్రదించడంతో అతని కేసును పక్కన పెట్టేశారు. ♦ అబిడ్స్ డివిజన్, బషీర్బాగ్ సర్కిల్ పరిధిలోని ఓ భవన నిర్మాణ సంస్థకు సంబంధించి ఆడిట్ నిర్వహించిన సర్కిల్ అధికారులు రూ. 3 కోట్లు పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ షాకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు సంస్థ యజమాని కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారిని కలిసి సెటిల్మెంట్ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు రూ.10 లక్షల్లో సెటిల్ కానున్నట్లు తెలిసింది. కేవలం ఈ మూడు డివిజన్లలోనే కాకుండా గ్రేటర్పరిధిలోని చార్మినార్, బేగంపేట్, సరూర్నగర్, సికింద్రాబాద్తో పాటు హైదారాబాద్ రూరల్ ప్రాంతాల్లోనూ అధికారుల అక్రమాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి పడుతోంది. నిబంధనలకు నీళ్లు ప్రభుత్వ అధికారులు తాము పనిచేస్తున్న శాఖపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపార సంస్థలు, షాప్లపై తనిఖీలు నిర్వహించే అధికారులు వ్యాపార లావాదేవీల సమాచారం నిమిత్తం 304 నోటీసులు జారీ చేస్తారు. ఇందులో సేల్స్, కొనుగోలు బిల్లులు, స్టాక్తో పాటు లాభ నష్టాలకు సంబందించిన వివరాలు అందజేయాలని సూచిస్తారు. సదరు వ్యాపారి అకౌంట్స్ వివరాలు అందజేయకపోతే మూడుసార్లు 310 నోటీసులు జారీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అధికారులు అందుకు విరుద్ధంగా 305 ఏ చట్టం ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులను బెదిరిస్తున్నారు. సదరు వ్యాపారిని నేరుగా కార్యాలయానికి పిలిపించుకుని అతడితో బేరం కుదిరాక రూ.కోట్లలో ఉన్న మొత్తాన్ని రూ. లక్షలకు తగ్గించి 305 ఆర్డర్ ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉన్నా వారికి అందాల్సిన వాటా అందుతుండటంతో వారు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వైఖరి కారణం గా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నందున అధికారుల అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘాల నేతలు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడితేకఠిన చర్యలు డివిజన్ పరిధిలో సీటీఓల ద్వారా జారీ అయ్యే ప్రతి షోకాజ్ నోటీసుకు సంబంధించిన పన్నులు కచ్చితంగా వసూలు చేస్తాం. 304 నోటీసులతో వ్యాపారులు స్పందించకపోతే మూడు సార్లు 310 నోటీసులు ఇస్తున్నాం. అనంతర 305 ఏ నోటీసులు జారీ చేస్తున్నాం. వ్యాపారుల లావాదేవీలకు అనుగుణంగా ప్రభుత్వానికి రావాల్సిన అదాయాన్ని పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నాం. కింది స్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– కె. సీతాలక్ష్మి, జాయింట్ కమిషనర్ అబిడ్స్ డివిజన్ -
కొత్త పురపాలికల్లో బాదుడు షురూ!
సాక్షి, హైదరాబాద్: కొత్త మునిసిపాలిటీల్లో అప్పుడే బాదుడు ప్రారంభమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నులు మినహాయించి ఇతర పనులైన ఖాళీ స్థలాలపై పన్నులు, నల్లా చార్జీలు, మార్కెట్ ఫీజులు, పశు వధశాలల ఫీజులు, మునిసిపల్ భవనాలు/గదులు/ కార్యాలయ సముదాయాల అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, టౌన్ఫ్లానింగ్కు సంబంధించిన ఇతర ఫీజులు/చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఎంక్రోచ్మెంట్ ఫీజు, మ్యుటేషన్ ఫీజు, వినోద పన్ను, స్టాంపు డ్యూటీపై సర్చార్జీలను రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల మేరకు పెంచాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 25న సర్క్యులర్ జారీ చేశారు. 173 గ్రామ పంచాయతీలను అప్గ్రేడ్ చేసి కొత్తగా 38 మునిసిపాలిటీల ఏర్పాటుతోపాటు పాత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మరో 131 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి చివరిలో పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1, 2వ తేదీల నుంచి 68 కొత్త మునిసిపాలిటీలు మనుగడలోకి రాగా, 131 గ్రామ పంచాయతీలు సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో విలీనమైపోయాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో వసూలు చేసిన పన్నులు, పన్నేతర చార్జీలు, ఫీజులను ఇకపై పురపాలక శాఖ చట్టాల ప్రకారం పెంచి వసూలు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నులను మాత్రం పెంచరాదని స్పష్టం చేశారు. మునిసిపాలిటీల చట్టం ప్రకారం కొత్త పురపాలికలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లోని ఖాళీ స్థలాలు/ప్లాట్లపై 0.22 శాతం మార్కెట్ విలువన ఖాళీస్థలం పన్నుగా వసూలు చేయాలని కోరారు. నల్లా చార్జీలకు రెక్కలు కొత్త మునిసిపాలిటీల్లో పాలక మండళ్ల తీర్మానంతో నల్లా చార్జీలను పెంచాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిబంధనల మేరకు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వేర్వేరు చార్జీలను నిర్ణయించాలని సూచించింది. చిన్న హోటళ్లు, వ్యాపార గృహా ల నుంచి కూడా వాణిజ్య కేటగిరీ కింద నీటి చార్జీలు వసూలు చేయనున్నారు. పైప్లైన్ల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యయాన్ని వాటర్ డొనేషన్ చార్జీల రూపంలో ఏకకాలం(వన్టైం)లో వసూలు చేస్తారు. కొత్త మునిసిపాలిటీల్లో నల్లా చార్జీలను పట్టికలో సూచించిన విధంగా నిర్ణయించి వసూలు చేయాలని పురపాలక శాఖ కోరింది. భవన నిర్మాణ అనుమతులు ఇక భారం.. కొత్త మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఇకపై భారం కానున్నాయి. ఇకపై మునిసిపల్ బిల్డింగ్ రూల్స్(జీవో 168) ప్రకారం భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం నామ మాత్రపు ఫీజులతో అనుమతులు జారీ చేస్తుండగా, ఇకపై మూడో శ్రేణి మునిసిపాలిటీలకు వర్తించే భవన అనుమతుల ఫీజులను కొత్త మునిసిపాలిటీల్లో దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన కౌన్సిల్ తీర్మానం చేయాలని పురపాలక శాఖ కోరింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సైతం.. కొత్త పురపాలికల్లో వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక, వినోద అవసరాలకు వినియోగించే భవనాలు, గృహాల నుంచి ఇక ముందు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయనున్నారు. కౌన్సిల్లో వివిధ రకాల ట్రేడ్లకు ఫీజులను నిర్ణయించాలని పురపాలక శాఖ ఆదేశించింది. మ్యుటేషన్ ఫీజులను సైతం కౌన్సిల్లో నిర్ణయించి వసూలు చేయాలని కోరింది. మునిసిపల్ చట్టాల ప్రకారం.. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వినోద పన్నులో 90శాతం వాటాతోపాటు ఆస్తుల క్రయ విక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేసే స్టాంపు డ్యూటీలో 2 శాతాన్ని సర్చార్జీగా మునిసిపాలిటీలు తిరిగి రాబట్టుకోవాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మార్కెట్, పశువధశాలల్లో ఫీజులు కొత్త మునిసిపాలిటీల్లోని మార్కెట్లో, పశువధశాలల్లో వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసే హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్కు ఫీజులు వసూలు చేసే హక్కులను అప్పగించాలని కోరింది. కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు కౌన్సిల్ తీర్మానంతో టెండర్ ప్రకటన జారీ చేయనున్నారు. మునిసిపాలిటీల స్వీయ నిర్వహణలో ఉన్న మార్కెట్లు, పశువధశాల ల్లో టికెట్ల ద్వారా ఫీజులు వసూలు చేయనున్నారు.మూడేళ్లకోసారి ఈ ఫీజులను పెంచనుంది. కొత్త మునిసిపాలిటీల యాజమాన్యంలోని ఖాళీ స్థలాలు, దుకాణాలు, గోదాములు, భవనాలను కౌన్సిల్ తీర్మానంతో కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలా నికి ఆయా మునిసిపాలిటీలు అద్దెకు ఇచ్చుకోవచ్చని పురపాలక శాఖ సూచించింది. మునిసిపాలిటీల చట్టం ప్రకారం అద్దెలు నిర్ణయించాలని తెలిపింది. -
రూ.1,100 కోట్ల అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పనితీరును కాగ్ నివేదిక తూర్పారబట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో ఏదో ఒక తప్పును గుర్తించిన కాగ్.. మొత్తం రూ.1,100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. టర్నోవర్ లెక్కించడం నుంచి పన్ను వసూలు వరకు, పన్ను కట్టకపోతే జరిమానా విధింపు నుంచి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మంజూరు వరకు, టర్నోవర్ తేడాల నుంచి కొనుగోలు టర్నోవర్ ఎక్కువ చూపించడం వరకు.. ఇలా 1,055 కేసుల్లో తప్పులు జరిగాయని నిర్ధారించింది. పన్ను విధించక రూ.780 కోట్ల నష్టం 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 7 కేటగిరీల్లో అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా వస్తువులపై పన్ను విధించకుండా లేదా తక్కువ పన్ను వసూలు చేయడం ద్వారా రూ.780 కోట్ల అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. వర్క్ కాంట్రాక్టులకు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.19.57 కోట్లు, వడ్డీ జరిమానా విధించకపోవడం, తక్కువ విధించడం వల్ల రూ.26.02 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రూ.25.43 కోట్లు, కేంద్ర అమ్మకం పన్నులను విధించకపోవడం లేదా తగ్గించడం వల్ల రూ.79.98 కోట్లు, అమ్మకపు పన్ను వాయిదా వల్ల రూ.10.22 కోట్లు, ఇతర అవకతవకల వల్ల రూ.158.16 కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. అయితే విలువ ఆధారిత పన్నును వసూలు చేయని లేదా తక్కువ వసూలు చేసిన 312 కేసుల్లోనే రూ.780.91 కోట్ల తేడా వచ్చిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విషయానికొస్తే మొత్తం 359 కేసులకు రూ.42.06 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించింది. స్టాంపు డ్యూటీలు, ఫీజులు తక్కువగా విధించడం వల్ల రూ.36.99 కోట్లు, ఆస్తుల విలువ తక్కువ లెక్కించడం వల్ల రూ.4.29 కోట్లు, డాక్యుమెంట్లను తప్పుగా వర్గీకరించిన కారణంగా రూ.71 లక్షలు, ఇతర అవకతవకల వల్ల రూ.7 లక్షలు నష్టం జరిగిందని కాగ్ వెల్లడించింది. ఇందులో వ్యవసాయేతర భూముల (నాలా) రిజిస్ట్రేషన్కు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, భీమ్గల్, భైంసా, దేవరకొండ, ఘన్పూర్, జడ్చర్ల, జోగిపేట, జనగామ, కూసుమంచి, మధిర, మహబూబాబాద్, నర్సంపేట, నిర్మల్, వర్ధన్నపేటల్లోని సబ్రిజిస్ట్రార్ కార్యా లయాలను పరిశీలించగా, అందులో 29 దస్తావేజులను వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని నాలా భూముల రిజిస్ట్రేషన్ చేశారని తేలిందని పేర్కొంది. ఇది రూ.2.04 కోట్ల తక్కువ డ్యూటీ, ఫీజు విధిం చడానికి కారణమైందని కాగ్ తెలిపింది. -
ప్రధాన ఆదాయ వనరుకు వ్యాపారుల చిల్లు..!
సాక్షి, హైదరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. జీఎస్టీ అమలుకు ముందు ఉన్న బకాయిలు చెల్లించేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వసూలయ్యే పన్నులు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి మొత్తం 12 డివిజన్లు, 232 సర్కిళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రూ.39,261.40 కోట్ల పన్నులు విధించగా రూ.37,856.83 కోట్ల మేర వ్యాపారులు చెల్లించారు. ఇంకా రూ.1,404.56 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జీఎస్టీకి ముందు రాష్ట్రవ్యాప్తంగా 2,19,561 మంది డీలర్లు ఉన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవ పన్ను(జీఎస్టీ)ని 2017, జూలై ఒకటి నుంచి అమలు చేస్తోంది. గతంలో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), టీఓటీ (టర్నోవర్ ట్యాక్స్), సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్లను ప్రభుత్వం వసులు చేసేవి. ఈ పన్నులన్నీ రద్దు చేసి కొత్తగా వస్తు సేవ పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని ఐదు శ్లాబ్లుగా విభజించారు. ఇందులో 5, 8, 12, 28, 40 శాతం పన్నులు ఉంటాయి. జీఎస్టీ విధానంతో వ్యాపారాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రతీ డీలర్ ఆన్లైన్లో అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రతినెలా 25న ఆన్లైన్లో వివరాలను పొందుపరిచి పన్నులు చెల్లిస్తున్నారు. నో రైడ్స్.. జీఎస్టీ అమలుకు ముందు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. దీంతో పాత బకాయిలు వసూలు కావడంలేదు. గతంలో పన్నులు చెల్లించకుంటే వ్యాపారస్తులకు సంబంధించిన సీ ఫాంలు నిలిపివేసేవారు. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండడంతో సీ ఫాంలు అవసరం లేకుండాపోయాయి. వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖకు ఎలాంటి పెత్తనం లేకపోవడంతో బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ప్రత్యేక బృందాలు.. పాత బకాయిలను వసూలు చేసేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. డివిజన్, సర్కిల్ స్థాయిల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మొండి బకాయిలను వసూలు చేయనున్నారు. -వరంగల్ రూరల్ నుంచి గజవెళ్లి షణ్ముఖరాజు -
అమల్లోకి ‘ఈ–వే’
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ‘ఈ–వే బిల్లు’ విధానం అమల్లోకి వచ్చిందని, పన్నుల ఎగవేతకు ఇక ముకుతాడు పడనుందని రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో మైలురాయి అని అభివర్ణించారు. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువుల రవాణాకు తప్పనిసరిగా ఈ–వే బిల్లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ–వే బిల్లు విధానం అమలుతో వస్తు రవాణా రంగంపై తొలిసారిగా సమగ్రమైన డేటాబేస్ (సమాచార నిల్వ వ్యవస్థ) తయారవుతుందని పేర్కొన్నారు. ఏ సరకు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా అవుతుందో తెలుస్తుందని వివరించారు. కంపెనీల నుంచి వస్తువులు ఎక్కడికి రవాణా అవుతున్నాయో, పన్నులు కట్టారో లేదో తెలుసుకోవడానికి ఈ సమాచార వ్యవస్థ ఉపయోగపడనుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్తో కలసి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడికైనా అనుమతి: ఒకే ఈ–వే బిల్లుతో దేశంలో ఎక్కడికైనా వస్తువుల రవాణాకు అనుమతి ఉంటుందని, అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు ఇకపై ట్రాన్సిట్ పాస్ అవసరం ఉండదని సోమేశ్కుమార్ వెల్లడించారు. ట్రేడర్లకు వేధింపులు ఉండవ ని, ఈ–వే బిల్లులను సక్రమంగా తీసుకుంటున్నారో లేదో చెక్ చేస్తామని తెలిపారు. ఈ–వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తూ పట్టుబడితే ఎగ్గొట్టిన పన్నులతో పాటు సదరు పన్నులపై 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించా రు. ఈ–వే బిల్లు డేటాబేస్ ఆధారంగానే జీఎస్టీ వసూళ్లకు ఇన్వాయిస్లు రూపొందించే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తెలిపారు. ఈ–వే బిల్లును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, బిల్లు నంబర్ ఉంటే చాలన్నారు. జీ‘ఎస్’టీ!: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల సరళి సానుకూలంగా ఉందని, జీఎస్టీ అమలుల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జనవరిలోనే ఎక్కువ ఆదాయం వచ్చిందని సోమేశ్ కుమార్ తెలిపారు. జనవరిలో అత్యధికంగా రూ.1,656.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు. డిసెంబర్లో వచ్చిన రూ.1,493.50 కోట్ల పన్నులతో పోల్చితే జనవరిలో పన్ను వసూళ్లు దూకుడు ప్రదర్శించాయన్నారు. పన్ను వసూళ్లలో పెరుగుదల కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలుత రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, క్రమంగా పుంజుకుంటుండటంతోపాటు రాష్ట్రానికి నష్ట పరిహారం లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందుందని తెలిపారు. 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు: జీరో వ్యాపారాన్ని నిర్మూలించడానికి ట్రాన్స్పోర్టు గోదాముల్లో తనిఖీలు నిర్వహించామని సోమేశ్కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 786 వాహనాలను తనిఖీ చేశామని, పన్నులు చెల్లించకుండా వస్తువులు రవాణా చేస్తున్న 90 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేశామని తెలిపారు. జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయని 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
అవినీతి కొండ
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖలో భారీ తిమింగలం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు చిక్కింది. ఈడ్పుగల్లులోని ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) ఏడుకొండలును ఆయన కార్యాలయంలోనే ఐటీడీ సిమెంటేషన్స్ ప్రతినిధుల వద్ద లంచం తీసుకుంటుండగా శుక్రవారం అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కటంతో వాణిజ్యపన్నుల శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఉన్నతస్థాయి అధికారి చిక్కడం ఇదే ప్రథమమని చర్చించుకుంటున్నారు. గతంలో డెప్యూటీ కమిషనర్గా.. 2004–05లో విజయవాడ ఒకటో డివిజన్ డెప్యూటీ కమిషనర్గా ఏడుకొండలు పనిచేశారు. అంతకుముందు ఇక్కడే అసిస్టెంట్ కమిషనర్ (ఇంటెలిజెన్స్)లో పనిచేశారు. అప్పట్లోనే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్లో డెప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగిన భారీ కుంభకోణంలో ఏడుకొండలు హస్తం ఉందని ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన కారు బహుమతిగా పొందినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జాయింట్ కమిషనర్గా వెళ్లినా ఆయన పద్ధతులు మార్చకోలేదు. వాణిజ్యపన్నుల ఖలో పనిచేసే ఇతర అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏడుకొండలును అరెస్ట్ చేశారు. రిఫండ్స్ ఇవ్వాలంటే లంచాలు ముట్టజెప్పాల్సిందే.. కమిషనర్ కార్యాలయంలో రిఫండ్ ఫైల్ వచ్చిందంటే అధికారులకు పండగేనన్న ఆరోపణలు ఉన్నాయి. డీలర్లకు కోట్లలో రిఫండ్ ఇవ్వాల్సి రావడంతో లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని ముఖ్య అధికారులందరికీ ఇందులో వాటాలు ఉంటాయి. ఐటీడీ సిమెంటేషన్స్ రూ.4.6 కోట్ల వరకూ చెల్లించాల్సి రావడంతో ఏడుకొండలు రూ.23.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ సొమ్ము ఇవ్వడానికి ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధపడ్డారు. అయితే, ఆ శాఖలోని అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఏసీబీకి సమాచారం అందినట్లు తెలిసింది. కాగా, రూ.10 లక్షలలోపు రిఫండ్స్ డెప్యూటీ కమిషనర్, ఆపైన కమిషనర్ కార్యాలయానికి వెళ్తాయి. అయితే, పెద్ద మొత్తాల కేసులు కూడా సీటీవో స్థాయిలో పరిశీలించాకే ఉన్నతాధికారులకు పంపుతారు. దీంతో అందరినీ చేతులు తడపాలంటే కష్టంగానే ఉందని డీలర్లు వాపోతున్నారు. అంతాఅవినీతి వాణిజ్య సంస్థలపై సీటీవో స్థాయి అధికారులు దాడులు చేసి జరిమానాలు వేసినప్పుడు డీలర్లు సంతృప్తి చెందకపోతే డెప్యూటీ కమిషనర్ అపెలెంట్స్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అక్కడ అపెలెంట్ డెప్యూటీ కమిషనర్ జరిమానా వేసిన కేసులను కూడా కమిషనర్ కార్యాలయం అధికారులు తిరగదోడి చిన్నచిన్న తప్పుల్ని చూపించి భారీగా లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ శాఖలో ఉన్నతాధికారుల అవినీతి గురించి కథలుకథలుగా చెబుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖలోని ఒక ముఖ్య అధికారి విజయవాడలో సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని బినామీతో రూ.90లక్షలకు కొనిపించారు. ఆ ఇంట్లో తానే అద్దెకు ఉంటూ ఆ ఇంటిని కొనేందుకు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని, రూ.కోటి బ్యాంకు రుణం తీసుకున్నారు. దీనికి మరో కోటి వెచ్చించి మరమ్మతులు చేయించారు. అధికారులే అవినీతిపరులు కావడంతో కిందిస్థాయి అధికారులు చేసే అవినీతిని పట్టించుకోలేకపోతున్నారని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వాణిజ్య శాఖలో అతి పెద్ద అవినీతి చేప
సాక్షి, అమరావతి/కంకిపాడు(పెనమలూరు): వాణిజ్య పన్నుల శాఖలో అతి పెద్ద అవినీతి చేప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది. వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్ ట్యాక్స్) అదనపు కమిషనర్ యు.ఏడుకొండలు రూ.25 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకున్నారు. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి దొరకడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే ప్రథమం. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్కు చెందిన నిర్మాణరంగ కంపెనీ ఐటీడీ సిమెంటేషన్స్ నుంచి శుక్రవారం విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లులో ఉన్న వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏడుకొండలును పట్టుకున్నట్టు తెలిపారు. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్పోర్టు నిర్మాణాలకు సంబంధించి రూ.4.6 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ రిఫండ్ చెల్లింపులకోసం లంచం తీసుకుంటున్నట్లు వాణిజ్య పన్నులశాఖ వచ్చిన పక్కా సమాచారంతో ఈ అవినీతి అధికారిని పట్టుకున్నట్లు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం: ఏసీబీ డీజీ రిఫండ్ చెల్లింపులకోసం రూ.25 లక్షల లంచమివ్వడానికి హైదరాబాద్ నుంచి ఐటీడీ సిమెంటేషన్స్ కంపెనీ ప్రతినిధులు వస్తున్నట్లు సమాచారమందిందని, కానీ తమ దాడిలో రూ.23.3 లక్షల సొమ్ము మాత్రమే దొరికిందని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. మిగిలిన సొమ్ము ఎక్కడ ఉన్నదన్నది తనిఖీ చేస్తున్నామన్నారు. మిగిలిన సొమ్ము ఏమైంది? ఎవరెవరి హస్తముంది? అక్రమార్జన వ్యవహారాలపై తదుపరి దర్యాప్తు సాగుతుందని తెలిపారు. -
అవినీతికి అటెండర్
పేరు కొండపల్లి శ్రీనివాస్. చేసేది వాణిజ్యపన్నుల శాఖలో అటెండర్ ఉద్యోగం. అయితేనేం.. వన్టౌన్లోని వ్యాపారులను హడలెత్తిస్తాడు. కమర్షియల్ ట్యాక్ ఆఫీసర్ తరహాలో ఆయనే వాహనాలను తనిఖీ చేస్తాడు. జీరో వ్యాపారంపై దృష్టిపెట్టి వేలాది రూపాయలు ముడుపులు వసూలు చేస్తాడు. ఓ ఉన్నతాధికారి అండతో కోట్లకు పడగలెత్తి, వ్యాపారులను శాసిస్తున్న ఈ అటెండర్ బాగోతాన్ని కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాక్షి, విజయవాడ: దేశంలోని ప్రధాన నగరాల నుంచి రెడీమేడ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర లక్షల రకాల వస్తువులు రైలుమార్గంలోని విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయానికి వస్తాయి. అక్కడి నుంచి ఆ వస్తువులు నగరంలోని హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు చేరతాయి. ఈ సరుకులో ఎక్కువ భాగానికి వ్యాపారులు పన్ను చెల్లించరు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖలోని సిబ్బందికి బాగా తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తూ వన్టౌన్లో ఉండే కొండపల్లి శ్రీనివాస్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒంటరిగా తనిఖీలు వాణిజ్యపన్నుల శాఖలో వాహనాలు తనిఖీ చేయాలంటే జాయింట్ కమిషనర్ లేదా సీటీవో స్థాయి అధికారి ఆదేశాలతో డీసీటీవో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తారు. అయితే, కొండపల్లి శ్రీనివాస్ మాత్రం ఇవేం అవసరం లేదు. వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఒక్కడే వాహనాలు తనిఖీ చేస్తాడు. సరకుతో వెళ్తున్న రిక్షాలు, ఆటోలు, వ్యాన్లను ఆపి బిల్లులు తనిఖీ చేస్తాడు. బిల్లులో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే సరకు సీజ్ చేస్తానంటూ బెదిరిస్తాడు. చివరకు వ్యాపారి కాళ్లబేరానికి వస్తే ముడుపులు తీసుకుని వదిలేస్తాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నాడని సమాచారం. ఎవరైనా వ్యాపారులు గట్టిగా ప్రశ్నిస్తే, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారితో భారీగా జరిమానాలు వేయించగల సమర్థుడు. కేవలం అటెండర్గా పనిచేసే శ్రీనివాస్కు డీసీటీవో స్థాయిలో తనిఖీలు చేయడం గమనార్హం. ఒక డివిజన్కు చెందిన డీసీటీవోలు మరో డివిజన్ పరిధిలోకి వెళ్లి తనిఖీలు చేయరు. అయితే, డివిజన్–2 పరిధిలోని ఉయ్యూరు సర్కిల్కు చెందిన శ్రీనివాస్, డివిజన్–1 పరిధిలోకి వెళ్లి వాహనాలను ఆపడం వ్యాపారులకు విస్మయం కలిగిస్తోంది. తనిఖీలపై వీడియో శ్రీనివాస్ వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కొంతమంది బాధితులు వీడియోలు, ఫొటోలు తీసి వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్తోపాటు జాయింట్ కమిషనర్లకు పంపారు. దీనిపై జాయింట్ కమిషనర్–2 రఘునా«థ్ స్పందిస్తూ ఈ వీడియోపై విచారణ చేయాలని ఉయ్యూరు సీటీవో విజయభాస్కర్ను ఆదేశించారు. రంగంలోకి ఉన్నతాధికారి శ్రీనివాస్కు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారితో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో డివిజన్–2 కార్యాలయంలో పనిచేశారు. ఆ అధికారిపై గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఆ అధికారి శ్రీనివాస్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తామే తనిఖీలు చేయించామంటూ నివేదిక ఇవ్వాలంటూ డివిజన్–1 కార్యాలయానికి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. విచారణకు ఆదేశించాం కొండపల్లి శ్రీనివాస్ వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎవరో నాకు వీడియో పంపారు. దాని గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఉయ్యూరు సీటీవోను ఆదేశించాను. ఆదేశాల మేరకే విచారణ చేశారా? ఎప్పుడు చేశారు? పక్కన ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? శ్రీనివాస్ ఒక్కడే తనిఖీలు చేశాడా? అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్ను విచారించి సీటీవో నివేదిక ఇస్తారు. అప్పుడే నిర్ణయం తీసుకుంటాను. – రఘునాథ్, జాయింట్ కమిషనర్ -
ఆడిట్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన నిధులను వాణిజ్య పన్నుల శాఖ చేతులారా పోగొట్టుకుంటోంది. ప్రణాళిక లేని పనులు, హడావుడి ఉత్తర్వుల ద్వారా కోట్లాది రూపాయల ధనాన్ని కోల్పోతోంది. పన్ను చెల్లించే రిజిస్టర్డ్ డీలర్ల వ్యాపార లావాదేవీలను ఆడిట్ చేసే ప్రక్రియలో అక్కరకు రాని పనులు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా గత ఆరునెలలుగా రూ.100 కోట్ల వరకు వాణిజ్య పన్నుల శాఖకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ఆడిట్ ప్రక్రియలో అవసరం లేని ‘స్క్రూటినీ’అనే విధానాన్ని చేర్చడంతో ఆడిట్లు ఓ పట్టాన పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, గత ఆరునెలల కాలంలో ఈ విధానం ద్వారా కనీసం 10 మంది డీలర్ల వ్యాపార లావాదేవీలను కూడా ఆడిట్ చేయలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడిట్.. కథా కమామిషు వాస్తవానికి, పన్ను చెల్లింపుదారుల కింద రిజిస్టర్ అయిన డీలర్లు ఏటా తమ వార్షిక టర్నోవర్ ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. ఇందుకు గాను అవసరమైన పత్రాలను ఆడిట్ చేయించి ప్రభుత్వానికి సమర్పి స్తారు. అయితే, వ్యాపారులిచ్చిన వివరాలు, వారి లావాదేవీలు సరిగా ఉన్నాయా లేదా తనిఖీ చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కూడా ఆడిట్లు చేస్తుంది. వ్యాపారులు ఏడాది పాటు ఎక్కడి నుంచి వస్తువులు కొన్నారు?, ఎంతకు అమ్మారు?, అందులో ఏ శ్లాబు పన్ను కిందకు ఏ వస్తువులు వస్తాయి? అసలు పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఆడిట్లో చూపించిన మొత్తం ఎంత? చెల్లించింది ఎంత? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఎంత క్లెయిమ్ చేసుకున్నారు? అనే వివరాలను వ్యాపారుల వద్ద ఉన్న రికార్డుల ద్వారానే తనిఖీ చేస్తారు. ఈ విధంగా ఆడిట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని తక్కువ చూపించి పన్ను ఎగ్గొట్టే డీలర్ల నుంచి అదనపు పన్ను వసూలు చేస్తారు. ఇలాంటి ఆడిట్ ప్రక్రియలో కూడా ఏటా వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. కానీ, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆడిట్ ప్రక్రియలో స్క్రూటినీ అనే విధానాన్ని మన రాష్ట్రంలోనే కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం సదరు వ్యాపారి వద్ద తనిఖీ చేసిన ప్రతి రికార్డును ఇన్వాయిస్తో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తోంది. కాగా, ఆరేళ్లనాటి రికార్డులు కూడా పరిశీలించాలనడం.. అవి అందుబాటులో లేక, ఉన్నా సరిగా అప్లోడ్ చేయలేక ఆడిటింగ్ నత్తనడకన సాగుతోం దని అధికారులు వాపోతున్నారు. నెలలో చేయాల్సింది 1,500 పన్ను మదింపు అధికారం ఉన్న అధికారులు రాష్ట్రంలో 350 మంది ఉన్నారు. ఇందు లో డీసీటీవోలు 200 మంది, సీటీవోలు 110 మంది, అసిస్టెంట్ కమిషనర్లు 30 మంది ఉన్నారు. అంటే 350 మంది అధికారులు డీలర్ల వ్యాపారాలపై పన్ను మదింపు చేయవచ్చు. ఒక్కో అధికారి కనీసం నెలకు 5 కంపెనీల రికార్డులను ఆడిట్ చేసే వీలుంది. ఈ లెక్క ప్రకారం ప్రతి నెలా 1,500 వరకు చేయవచ్చు. అంటే ఆరు నెలలకు 9,000 ఆడిట్లు పూర్తి చేయొచ్చు. గతంలో ఉన్న పన్నుల శాఖ గణాంకాల ప్రకారం ఒక్కో ఆడిట్ ద్వారా సరాసరి రూ.2 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే 9,000 ఆడిట్లు చేయగలిగితే ఇప్పటికే ఈ ఆరునెలల్లో దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదనపు ఆదాయం సమకూరేది. ఉదాహరణకు అక్టోబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు 18,442 ఆడిట్లకు ఆథరైజేషన్ ఇవ్వగా, 18,132 ఆడిట్లు చేశారు. దీని ద్వారా రూ.37 కోట్లు పెనాల్టీ, 13 కోట్లు పన్ను, ఇంకో 58 కోట్లు కేంద్ర అమ్మకం పన్ను కింద వచ్చింది. అంటే దాదాపు 108 కోట్ల వరకు ఆడిట్ల ద్వారా ఆదాయం సమకూరింది. కానీ, స్క్రూటినీ విధానంలో ఇప్పటివరకు కనీసం 10 ఆడిట్లు కూడా పూర్తి కాలేదు. దీంతో ఆ మేరకు నష్టం వాటిల్లుతోందని, అక్కరకు రాని ఇన్వాయిస్ల అప్లోడ్ లాంటి ప్రక్రియలను ఆడిట్ నుంచి పక్కన పెట్టాలని పన్నుల శాఖ అధికారులే అంటున్నారు. -
కోట్లు ఎగ్గొట్టి.. ఆపై హైకోర్టుకెక్కి..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఓవైపు రూ. కోట్లలో పన్ను ఎగ్గొడుతూ మరోవైపు ప్రభుత్వాన్నే దోషిగా చూపేందుకు హైకోర్టుకెక్కిన ఓ ఘరానా వ్యాపార సంస్థ బాగోతం న్యాయస్థానంలోనే బట్టబయలైంది. వాణిజ్య పన్నులశాఖపై ఆ సంస్థ వేసిన కేసులో విచారణ సందర్భంగా దాని బండారం ప్రాథమికంగా రుజువు కావడంతో హైకోర్టు సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. పన్నులు ఎగవేసే ఇలాంటి వ్యాపార సంస్థలు ఎన్నున్నాయో దర్యాప్తులో నిగ్గు తేల్చాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఏమిటంటే... వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఎటువంటి మదింపు ఉత్తర్వులు జారీ చేయకుండానే తమ నుంచి రూ. 32.87 లక్షలకు పోస్ట్డేటెడ్ చెక్కులను వసూలు చేశారంటూ హైదరాబాద్కు చెందిన ఆకాశ్ ఫుడ్స్ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల చర్యను చట్ట విరుద్ధంగా ప్రకటించి తమ చెక్కులను వెనక్కి ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు చెల్లించాల్సిన పన్ను నిమిత్తం ఆ చెక్కులను నగదుగా మార్చామని వాణిజ్యపన్నులశాఖ అధికారులు కోర్టుకు నివేదించారు. అంతేగాక అయిల్ తరలింపు వాహనాలకు సంబంధించిన సీఎస్టీ వే బిల్లుల వ్యవహారంలో ఆకాశ్ ఫుడ్స్ చేసిన మోసాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించారు. పలు వాహనాలకు సంబంధించి ఆకాశ్ ఫుడ్స్ 106 వే బిల్లులు సంపాదించిందని, వాటి ద్వారా తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి అయిల్ వాహనాలు పంపిందన్నారు. దీనిపై మహారాష్ట్ర పన్ను అధికారుల సాయంతో విచారణ చేపట్టగా నాందేడ్లో ఆకాశ్ ఫుడ్స్ చూపిన ఆయిల్ డీలర్ల చిరునామాలన్నీ బోగస్వని తేలిందన్నారు. అలాగే ఢిల్లీలోని డీలర్ల బ్యాంకు ఖాతాల్లో భారీగా అవకతవకలు కనిపించాయని కోర్టుకు వివరించారు. ఆకాశ్ ఫుడ్స్ సమర్పించిన ఫోనిక్స్ ఇంపెక్స్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ. 1.05 కోట్లు చెల్లింపులు చేసినట్లు ఉంటే, ఆకాశ్ ఫుడ్స్ మాత్రం రూ. 7.77 కోట్లు చెల్లించినట్లు చూపిందన్నారు. తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం... పన్ను బకాయి కింద జమ చేసుకునేందుకు ఆకాశ్ ఫుడ్స్కు చెందిన చెక్కులను అధికారులు నగదుగా మార్చుకున్నం దున ఈ కేసును హైకోర్టు అక్కడితో మూసేయాల్సి ఉన్నప్ప టికీ... ఆకాశ్ ఫుడ్స్పై అధికారులు చేసిన ఆరోపణలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోట్ల రూపాయాల మేర పన్ను ఎగవేసేందుకు ఆకాశ్ ఫుడ్స్ ప్రయత్నించినట్లు ప్రా«థమికంగా నిర్ధారించి సంస్థ ఆర్థిక అవకతవకలపై సీబీసీ ఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తును ఈ కేసుకే పరిమి తం చేయకుండా పిటిషనర్లాగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలా పాలు సాగిస్తున్న ఆయిల్ డీలర్లందరి విషయంలోనూ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై 3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వాలకు చురకలు... ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాలను ఉద్దేశించి హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంస్థ పన్ను ఎగవేతపై అధికారులు ఇప్పటివరకు ఫిర్యాదు లేదా దర్యాప్తు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పన్నులు ఎగవేస్తున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పన్నుల వసూలు, జరిమానాల విధింపుతోనే పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం సరికాదని, నీతినియమాలు లేనటువంటి వ్యాపారులపట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. -
ఆ చెక్పోస్టులు.. అంతేనా!
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులను ‘క్లియర్’ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తమ శాఖ ఆధ్వర్యంలోని 12 చెక్ పోస్టులను మూసేసి 5 నెలలవుతున్నా కోట్ల రూపాయల విలువ చేసే ఆ చెక్ పోస్టుల్లోని వస్తువులను మాత్రం వదిలేసింది. చెక్ పోస్టులను రద్దు చేయడానికి కొంతకాలం ముందే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, ఇతర సామగ్రిని కనీసం కాపలా లేకుండా గాలికొదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. చెక్పోస్టుల్లోని సామగ్రినే కాదు అక్కడ పనిచేసి వచ్చిన ఉద్యోగుల వేతనాల విషయంలోనూ గందరగోళ వైఖరిని అవలంబిస్తోంది. కనీస ‘చెక్’ లేదు వాస్తవానికి, జీఎస్టీ అమల్లోకి రాక ముందు రాష్ట్ర నలుమూలలా 12 చెక్ పోస్టులుండేవి. భైంసా, వాంకిడి, మద్నూరు, చిరాగ్పల్లి, జహీరాబాద్, కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, తుంగభద్ర, పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేటల్లో ఉన్న ఈ చెక్పోస్టులను జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై 1 అర్ధరాత్రి నుంచే మూసేశారు. వాణిజ్య తనిఖీలు జరిగే చెక్ పోస్టులను ఎత్తేయాలన్న కేంద్ర నిర్ణయంతో ఇక్కడ కూడా చెక్పోస్టులను మూసేశారు. అక్కడ వదిలేసి వచ్చిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, కుర్చీలు, బల్లలు, ఇతర ఫర్నిచర్ సరిచూసుకునేందుకు కూడా యత్నించకపోవడం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా నిలుస్తోంది. అక్కడ ఉండే జీపులను కూడా హైదరాబాద్కు తీసుకొచ్చి ఓ మూలన పడేశారు తప్ప వాటిని వాడేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. మొత్తం వీటి విలువ రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసినా.. తిరిగి వాడుకునే వీలున్నా మూలన పడేయడంపై ఆ శాఖ వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిదీ అదే స్థితి చెక్పోస్టుల వద్ద పనిచేసే సిబ్బందికి వేరే విధులు కేటాయించారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడి సౌకర్యాలు, హెచ్ఆర్ఏ లాంటివి వర్తింపజేయకుండా పాత స్థానంలో ఉన్న సౌకర్యాలు, హెచ్ఆర్ఏలే ఇస్తుండటం గమనార్హం. అలా చెక్పోస్టుల నుంచి వచ్చిన సిబ్బందిలో ఐదుగురిని విలీనం చేసుకోకుండా డిçప్యుటేషన్ అంటూ విధుల్లో కొనసాగిస్తుండటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే వాహన భత్యం విషయంలోనూ వీరి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని ఓ సర్కిల్లో చెక్పోస్టుల నుం చి వచ్చిన ఓ అధికారికి వాహన భత్యం ఇవ్వాలా వద్దా అనే విషయంలో ప్రభుత్వానికి ఫైల్ పంపడం గమనార్హం. అదే సర్కిల్లో పనిచేస్తున్న మరి కొంతమందికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు లేవని, వాహనాల ఈసీ పుస్తకాలు లేవంటూ వాహన భత్యం నిలిపేశారని సమాచారం. -
బోధన్ స్కాం దర్యాప్తులో కదలిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఖజానాకు రూ.450 కోట్లకు పైగా గండికొట్టిన బోధన్ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. గతంలో ఇద్దరు ప్రధాన సూత్రధారులతో పాటు 9 మంది వాణిజ్య పన్నుల అధికారులను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ, తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కేసును పెద్దగా పట్టించుకోలేదు. తీరా దర్యాప్తు మధ్యలో ఆగిపోయిన కేసులు, చివర దశలో ఉన్న కేసులను తేల్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో బోధన్ స్కాంలో రెండో విడత దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న శివరాజ్కు పరిచయం ఉన్న మరికొంత మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై దర్యాప్తు వేగవంతం చేసినట్టు సీఐడీలోని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. గతంలో అరెస్టయిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బెయిల్పై బయటకు వచ్చి ఎవరెవరితో కేసు గురించి చర్చించారు? ఎక్కడెక్కడ తిరిగారు? ప్రస్తుతం వారి సంగతేంటన్న అంశాలపై రెండు దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్టు తెలిసింది. బోధన్ స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న మరికొంతమంది వాణిజ్య పన్నుల శాఖ అధికారుల జాబితాను సైతం సీఐడీ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా 16మంది అధికారులపై విచారణకు సమాయత్తం అవుతున్నట్టు ఆ అధికారి వెల్లడించారు. దీనితో పాటు స్కాంలో 3,465 నకిలీ చలాన్లు గుర్తించగా, స్కాం జరగడానికి నాలుగేళ్ల ముందు నుంచి కట్టిన చలాన్లను సైతం క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల కేవలం వాణిజ్య పన్నుల శాఖ అధికారులే కాకుండా ట్రెజరీ విభాగం అధికారులు, బ్యాంకు అధికారుల పాత్రపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు ఆరు నెలల తర్వాత కేసులో మళ్లీ కదలిక రావడంతో స్కాంలో పాత్రధారులుగా ఉన్న అధికారుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. -
అవగాహనతో ముందుకు..
జీఎస్టీ అమలు కోసం సంయుక్త సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు కోసం అవగాహనతో ముందుకెళ్లాలని, పన్ను వసూలు బాధ్యతను చెరిసగం పంచుకోవాల్సి ఉన్నందున సమన్వయంతో పనిచేయాలని సెంట్రల్ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం ఫ్యాప్సీలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఇరు శాఖల ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. డీలర్ల రిజిస్ట్రేషన్లు, రిటరŠన్స్ ఫైలింగ్, ఫైళ్ల పర్యవేక్షణ, కాల్సెంటర్లపై ఇరు శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. డివిజన్ స్థాయిలో ప్రతి రెండో, నాలుగో బుధవారాల్లో 2 శాఖల అధికారులు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. సమావేశంలో సెంట్రల్ ఎౖMð్సజ్ ప్రిన్సిపల్ కమిషనర్ నరేశ్, చీఫ్ కమిషనర్ బీబీ అగర్వాల్తో పాటు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
నష్టం.. 3,500 కోట్ల పైమాటే!
జీఎస్టీ అమలయ్యాక తగ్గిన అంతర్రాష్ట్ర వాణిజ్యం - మన ఉత్పత్తులు కొనేందుకు వెనుకాడుతున్న ఇతర రాష్ట్రాలు - డీలర్ల రిజిస్ట్రేషన్లలో జాప్యమే కారణం - 60 శాతం మంది డీలర్లకే ప్రొవిజనల్ నెంబర్లు సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు అంతర్రాష్ట్ర వాణిజ్యంపై పెద్ద ప్రభావమే చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉత్పత్తి అయ్యి ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లు చేసే వస్తువుల మార్కెటింగ్ చాలా కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా రంగంలో జీఎస్టీ అమలు కారణంగా 22 శాతం తగ్గుదల నమోదు కాగా, అది రాష్ట్రంలో 30 శాతానికి పైగానే ఉంటుందని అంచనా. దీంతో జీఎస్టీ అమలయి నెల రోజులైనా కాకముందే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏటా రూ.3వేల కోట్లకు పైగా పన్ను... వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు ఏటా అంతర్రాష్ట్ర వాణిజ్య కార్యకలాపాల ద్వారా రూ.3వేల కోట్ల వరకు పన్ను రూపంలో ఆదాయం వచ్చేది. వ్యాపారంలో 2% చొప్పున వ్యాట్ కట్టాల్సి ఉన్నందున రూ.3వేల కోట్ల పన్ను, అంటే దాదాపు ఏటా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగేవి. ఒక్క జూలైలో రోడ్డు రవాణా రంగంలో నమోదయిన తగ్గుదల మేరకు 30శాతం వ్యాపారం జరగకపోవడంవల్ల రూ.3,500 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయని, ఈ మేరకు జీఎస్టీ వల్ల నష్టం వాటిల్లినట్టేనని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన వాణిజ్య పన్నుల శాఖకు రావాల్సి న పన్ను వందల కోట్లలో తగ్గిపోనుందని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కారణమేంటి..? జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఏ వ్యాపార లావాదేవీ అయినా జీఎస్టిన్ నంబర్ ద్వారానే జరగాలి. ఈ క్రమంలో వ్యాట్ నుంచి దాదాపు 2 లక్షల మంది జీఎస్టీలోకి వచ్చారు. వీరంతా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు కానీ, 60 శాతం మందికే ఇప్పటి వరకు ప్రొవిజనల్ నెంబర్లు వచ్చాయి. కానీ, జీఎస్టీ చట్టం ప్రకారం కావాల్సిన టిన్ నంబర్లు (పన్ను గుర్తింపు సంఖ్య) రాలేదు. దీంతో సదరు వ్యాపారులు తీసుకెళ్లిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు నిరాకరిస్తున్నారు. టిన్ నెంబర్ లేకుండా ఆ వస్తువు కొన్నా, ప్రొవిజనల్ నంబర్ యథావిధిగా టిన్ నంబర్గా మారకపోయినా ఆ లావాదేవీ చట్ట ఉల్లంఘన అవుతుందనే అక్కడి వ్యాపారులు వాటిని కొనేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా సరఫరా అయ్యే ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ప్లాస్టిక్, ఫర్నిచర్, పేపర్, ఐరన్ పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది. జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ల కోసం రూపొందించిన ఆన్లైన్ పోర్టల్పై ఉన్న ఒత్తిడి, రిజిస్ట్రేషన్ల సమయంలో డీలర్లు చేసే పొరపాట్ల కారణంగా రిజిస్ట్రేషన్లు కావడం లేదని వాణిజ్య పన్నుల శాఖ అంటోంది. మరో 15 రోజుల్లో అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
బదిలీ సరే.. విధుల మాటేంటి?
- ఒక్క ఉత్తర్వుతో 200 మంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల బదిలీ - పని అప్పగించని ప్రభుత్వం.. ఖాళీగా 200 మంది.. సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలు నేపథ్యంలో తమ శాఖను పునర్వ్యవస్థీకరించాలని వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది డిమాండ్ చేస్తుంటే.. ఉన్న సిబ్బందికి కూడా పని లేకుం డా చేశారు ఆ శాఖ ఉన్నతాధికారులు. దేశ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమీకృత, సరిహద్దు చెక్పోస్టుల్లో పని చేస్తున్న 200 మందికిపైగా సిబ్బందిని బదిలీ చేసిన ప్రభుత్వం.. వారికి పని బాధ్యతలు అప్పగించడాన్ని మర్చిపోయింది. దీంతో మూసివేసిన చెక్పోస్టుల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఏం చేయాలన్నది ప్రశార్థకంగా మారింది. ఏడు రోజుల క్రితమే నిర్ణయం చెక్పోస్టులను మూసివేయాలని గత నెల 23న వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయిం చారు. కానీ ఏడు రోజుల తర్వాత కూడా ఆ సిబ్బందికి విధులు అప్పగించడం చేయలేదు. దీంతో శనివారం రిపోర్టు చేయడానికి హైదరాబాద్ రూరల్, వరంగల్ నోడల్ డివి జన్ కార్యాలయాలకు వచ్చిన చెక్పోస్టు సిబ్బందికి విధులు అప్పగించలేదు. ఇందులో 10 మందికి పైగా ఉప వాణిజ్య పన్నుల అధి కారులు (డీసీటీవో), 40 మందికి పైగా సహా య వాణిజ్య పన్నుల అధికారులు (ఏసీటీవో) ఉండటం గమనార్హం. కుర్చీల్లేవ్.. ఖాళీల్లేవ్..! రాష్ట్రవ్యాప్తంగా 90 సర్కిళ్లలో చాలాచోట్ల సరిపడా సిబ్బంది లేకపోగా, సిబ్బంది ఉన్న చోట కూడా పని ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో క్లర్కులు, అటెండర్లను మినహాయించి డీసీటీవో, ఏసీటీవోలకైనా బాధ్యతలు అప్ప గిస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు బదిలీపై వచ్చిన సిబ్బంది కూర్చునేందుకు కుర్చీలు, ఆయా కార్యాలయాల్లో ఖాళీలు లేకపోవడం గమనార్హం. ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల చెక్పోస్టుల వద్ద రూ. లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, అక్కడి చెక్పోస్టుల్లో ఉన్న కంప్యూటర్లు, కుర్చీలు, బల్లలను తెప్పించుకోవడంలో కూడా ఉన్నతాధికారులు విఫలమయ్యారు. -
ఇక జీఎస్టీ శాఖ
► వస్తుసేవల పన్నుతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వరూపం మార్పు ► కమిషనర్ హోదాలో మాత్రం మార్పులేదు ► కింది స్థాయి పోస్టులన్నింటికీ ప్రమోషన్ కేడర్లు ► సర్కిళ్లు, డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు ► ఒకటి రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వరూపాన్నే మార్చేస్తోంది. అసలు ఆ శాఖ పేరే మారిపోయి తెలంగాణ వస్తుసేవల పన్ను శాఖ (జీఎస్టీ శాఖ)గా మారిపోతోంది. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి పన్ను విధించే అధికారం లేని నేపథ్యంలో వాణిజ్య పన్నులు అనే పదాన్ని తొలగించి.. జీఎస్టీ శాఖగా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు కమిషనరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటికి ఆమోదం లభిస్తే శనివారమే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల హోదాల్లోనూ మార్పులు రానున్నాయి. కమిషనర్ హోదాలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ... తర్వాతి స్థాయి నుంచి కేడర్లో మార్పులు చేస్తున్నారు. శాఖ అదనపు కమిషనర్ను స్పెషల్ కమిషనర్గా పిలవనున్నారు. జాయింట్ కమిషనర్ నుంచి డీసీటీవోల వరకు పదోన్నతులు కల్పించి హోదా పెంచనున్నారు. కిందిస్థాయిలో ఉండే సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి (ఏసీటీవో)ని మాత్రం వస్తుసేవల పన్ను అధికారి (జీఎస్టీ అధికారి)గా పిలవనున్నారు. అయితే పేరు మార్చినా బాధ్యతల్లో ప్రస్తుతానికి మార్పు ఉండద ని.. బాధ్యతలకు ప్రత్యేక మార్గ దర్శకాలు విడుదలయ్యేం తవరకు అవే విధులను నిర్వహించాల్సి ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సర్కిళ్లు, డివిజన్లు కూడా పెంపు జీఎస్టీని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో ఉన్న సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యలో మార్పులు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను యథావిధిగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి కూడా ఫైలు వెళ్లింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటివరకు ఉన్న 91 సర్కిల్ కార్యాలయాలను 140కి పెంచనున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డివిజన్లను 20కి పెంచుతున్నారు. ఈ పెంపు ద్వారా మొత్తం 850కి పైగా అదనపు పోస్టులు కూడా అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అర్ధరాత్రి నుంచే చెక్పోస్టుల ఎత్తివేత జీఎస్టీ అమలు నేపథ్యంలో శుక్రవార అర్ధరాత్రి నుంచే రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఎత్తివేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 19 చెక్పోస్టు లు ఉన్నాయి. ఆ చెక్పోస్టులను మూసివేయాలని, అక్కడి సిబ్బందిని సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది కొరతను బట్టి వినియోగించుకోవాలని క్షేత్రస్థాయికి ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే చెక్పోస్టుల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను వెంటనే రికార్డు చేయాలని, వాటిని హైదరాబాద్కు పంపడంతో పాటు అక్కడి ఆస్తులను కాపాడేందుకు రోజుకొకరికి విధులు కేటాయించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు చెక్పో స్టుల్లో సిబ్బందిని ఉంచకూడదని, మొబైల్ బృందాల ద్వారా తనిఖీలు కూడా చేపట్టవద్దని ఆదేశించడం గమనార్హం. పన్ను రాయితీపై ప్రతిష్టంభన రాష్ట్రంలోని వెయ్యి పరిశ్రమలకు ఎఫెక్ట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలు వస్తువులు తయారు చేస్తే ఇక్కడే పన్ను కట్టేవి.. ఆ వస్తువులను వేరే రాష్ట్రంలో అమ్మినా పన్ను రాష్ట్రానికే వచ్చేది. ఇలా ఆదాయం వస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలూ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేవి. కానీ జీఎస్టీ అమల్లోకి వస్తుండడంతో పరిస్థితి మారిపోతోంది. రాష్ట్రంలో తయారైన వస్తువులను ఇతర రాష్ట్రంలో అమ్మితే.. పన్ను ఆదాయం ఆ రాష్ట్రాలకే వెళ్లిపోతుంది. వస్తువులు తయారైన రాష్ట్రానికి ఎటువంటి పన్ను ఆదాయం రాదు. ఆ పరిశ్రమలు జీఎస్టీని ఇక్కడే కట్టినా... కేంద్రం ఆ పన్నును తీసుకుని ఆయా వస్తువుల వినియోగం జరిగిన రాష్ట్రానికి ఇచ్చేస్తుంది. దీంతో ఇప్పటికే పన్ను రాయితీలిచ్చిన పరిశ్రమలకు ‘ట్యాక్స్ డిఫర్ మెంట్ (పన్ను తిరిగి చెల్లింపు)’ఎలాగన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక తయారీ పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్ని వస్తువులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి, ఎన్ని మన రాష్ట్రంలో అమ్ముడుపోయాయనే దానిని లెక్కిం చి పన్ను రాయితీ కల్పించాలా? మొత్తం ఆ పరిశ్రమ కట్టిన పన్ను మొత్తాన్ని ఒప్పందం ప్రకారం మన రాష్ట్రమే చెల్లించాలా? లేక కేంద్రం జోక్యం చేసుకుని ఆ పన్ను లాభం పొందిన రాష్ట్రం నుంచి తిరిగి ఇప్పిస్తుందా? అన్న అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. 2005 నుంచి వెయ్యికిపైగా.. పరిశ్రమలను ఆకర్షించే ఆలోచనతో 2005 నుంచి 2017 వరకు రాష్ట్రంలో వెయ్యికిపైగా పరిశ్రమలకు అప్పటి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించా యి. కొన్నింటికి ట్యాక్స్ డిఫర్మెంట్ కూడా ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆయా పరిశ్రమల ద్వారా పూర్తి స్థాయి ఆదాయం మన రాష్ట్రానికి అందని నేపథ్యంలో.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. -
రాష్ట్రంపై జీఎస్టీ భారం రూ.19,200 కోట్లు
- మల్లగుల్లాలు పడుతున్న సర్కారు - 30న కౌన్సిల్ భేటీలో కేంద్రానికి నివేదించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భారంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలతోపాటు రాష్ట్రంలోని చేనేత, బీడీ కార్మికులు, గ్రానైట్ వ్యాపారులపై జీఎస్టీతో అధిక భారం పడనుంది. ఇప్పటికే ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్య పన్నుల శాఖ తాజాగా వేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనే దాదాపు రూ.19,200 కోట్ల భారం పడనుంది. మిషన్ భగీరథపై రూ.2,000 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులపై రూ.8,000 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై రూ.1,600 కోట్లు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణపై రూ.2,600 కోట్లు, రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులపై రూ.5 వేల కోట్ల భారం పడనుంది. జీఎస్టీలో ఖరారు చేసిన పన్ను స్లాబ్ల ప్రకారం చేనేత, బీడీ కార్మికులపైనా భారం పడనుంది. వీటన్నింటికీ ప్రస్తుతం వ్యాట్ ప్రకారం అమల్లో ఉన్న పన్నులకు మించకుండా జీఎస్టీ పన్నును కనిష్ట స్లాబ్కు కుదించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కొన్నింటిపై పన్ను మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. జీఎస్టీతో వాటిల్లే నష్టానికి కేంద్రం పరిహారం ఇచ్చినా ఈ రంగాలపై పడే భారం పూడ్చలేని విధంగానే ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఈనెల 30న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను సమర్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ వివరాలన్నింటినీ ఉటంకిస్తూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. నేడు ఢిల్లీ నుంచి సీఎం రాక ఆరు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్కు తిరిగి రానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం ఇదే పర్యటనలో తన కుడి కంటికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. బుధవారం ఈ సర్జరీ జరగాల్సి ఉన్నా.. వైద్య నిపుణులు చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు తెలిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. 30న ఢిల్లీలో కేంద్రం నిర్వహించే జీఎస్టీ వేడుకలకు హాజరు కావాల్సి ఉంది. కానీ సీఎం ఈ వేడుకలకు గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. -
‘వాణిజ్య పన్నుల’పై కాగ్ విచారణ
- రాష్ట్రంలోని సీటీవోలలో ఆడిట్ చేయించాలని సర్కారు నిర్ణయం - పక్కాగా ప్రతి చలానా, రసీదుల పరిశీలన - పన్ను చెల్లింపుల్లో అక్రమాల గుర్తింపునకు చర్యలు - నల్లగొండ లేదా సూర్యాపేట జిల్లాతో మొదలు - తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ - ‘బోధన్’లో రూ.350 కోట్లకు చేరిన దుర్వినియోగం సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో వెలుగు చూసిన నకిలీ చలానాలు, పన్ను ఎగవేత కుంభకోణం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా సీటీవో కార్యాలయా ల్లో తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా నేరుగా కంప్ట్రో లర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో చలానా లను, రసీదులను ఆడిట్ చేయించనుంది. దీంతో ఈ కుంభకోణం మూలాలు బోధన్కే పరిమితమా.. మిగతా జిల్లాల్లోనూ జరిగాయా అన్నది వెల్లడికానుంది. సీరియస్గా ఉన్న సర్కారు వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి అప్పగించి, లోతైన దర్యాప్తునకు ఆదేశించింది. బోధన్ సీటీవో పరిధిలో ఇప్పటివరకు దాదాపు రూ.350 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా. ఈ వ్యవహారంలో శాఖ అధికారులతో పాటు ప్రైవేటు ట్యాక్స్ కన్సల్టెంట్లకు ప్రమేయముందని సీఐడీ విచారణలో తేలింది. మొత్తం 15 మంది బాధ్యులను గుర్తించగా.. 12 మందిని అరెస్టు చేసింది. పన్ను చెల్లించేందుకు నకిలీ చలానాలు వినియోగించడం, ఒకరి పేరిట మాత్రమే ట్యాక్స్ చెల్లించి నలుగురి పేరిట చూపి ఎగవేయటం, కట్టాల్సిన పన్నులో సగమే చెల్లించి మిగతా డబ్బును జేబులో వేసుకోవడం.. వంటి మూడు మార్గాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అవినీతి చోటు చేసుకుందా.., కోట్ల రూపాయల దుర్వినియోగం వెనుక వ్యవస్థాగతమైన లోపాలేమైనా ఉన్నాయా.., పన్ను చెల్లించే విధానంలో మార్పులేమైనా అవసరమా.. అన్న అంశాలపై సీఎం కేసీఆర్ సంబంధిత శాఖ అధికారులను ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించారు. చలానాలు, రసీదులపై పక్కాగా ఆడిట్ అన్ని ట్రెజరీల్లో జమ చేసిన చలానాలను, పన్ను చెల్లించిన వ్యాపారుల వద్ద ఉన్న రసీదులను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రసీదులు, చలానాలు ఒకటేనా, నకిలీ చలానాలు ఉన్నాయా, చెల్లించిన పన్ను మొత్తంలో తేడాలున్నాయా.. అన్న దానిపై పక్కాగా ఆడిట్ చేయనుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. సమగ్ర తనిఖీ అవసరమైన నేపథ్యంలో ప్రత్యేక ఆడిట్ బృందాలు లేదా ప్రైవేటు ఏజెన్సీలను రంగంలోకి దింపాలని యోచించింది. అయితే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ కన్సల్టెంట్లు ఆడిట్ జనరల్ కార్యాలయం అధికారులకు సైతం ముడుపులు ముట్టజెప్పినట్లు సీఐడీ విచారణలో వెల్లడించారు. దీంతో ఆడిట్ బాధ్యతలను కాగ్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత నల్లగొండ జిల్లా లేదా సూర్యాపేట జిల్లాలో కాగ్ బృందంతో ఆడిట్ చేయించనున్నారు. తర్వాత అన్ని సీటీవో కార్యాలయాల పరిధిలో ప్రతి చలానాను పరిశీలించనున్నారు. -
రండి బాబూ.. రండి!
⇔ ప్రీ జీఎస్టీ క్లియరెన్స్ సేల్.. ⇔ జీఎస్టీ అమలుపై గ్రేటర్ వ్యాపారుల్లో గందరగోళం ⇔ మిగిలి ఉన్న స్టాకుపై పన్ను వేస్తారని ఆందోళన ⇔ ప్రీ జీఎస్టీ క్లియరెన్స్ సేల్ పేరిట తగ్గింపుతో అమ్మకాలు ⇔ ఆందోళన వద్దంటున్న వాణిజ్య పన్నుల శాఖ ⇔ జీఎస్టీతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు పెరిగే చాన్స్ సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను(జీఎస్టీ).. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న దేశమంతా ఒకే పన్ను విధానం.. జీఎస్టీతో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయని, మరికొన్ని పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రేటర్లోని వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తమ వద్ద మిగిలి ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తదితరాల స్టాకుపై జీఎస్టీ అధికంగా విధిస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. గతంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఫ్రిజ్లు, టీవీలు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషిన్లు, ఓవెన్స్, వాచీలు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు సంబంధించి ఇప్పటికే వ్యాపారుల వద్ద చాలా స్టాకు మిగిలింది. జీఎస్టీ అమలులోకి వస్తే పన్ను అధికంగా వేస్తారన్న భయంతో కొందరు వ్యాపారులు ఆయా వస్తువుల ధరలపై ఐదు నుంచి పది శాతం తగ్గింపుతో విక్రయించేస్తున్నారు. దీంతో వినియోగదారులు కూడా ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాల్లో జీఎస్టీపై ఆందోళన అవసరం లేదని, పెద్ద మొత్తంలో స్టాకు కొనుగోలు చేసి విక్రయించకుండా తమ వద్ద ఉన్నవారు గతంలో అధిక పన్నులు చెల్లించిన పక్షంలో జీఎస్టీలో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, జీఎస్టీ అమలుతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు సుమారు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. దిగిరానున్న నిత్యావసరాల ధరలు.. గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ఇందులో 70 శాతానికిపైగా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారే. ప్రతినెలా వీరంతా ఇంటి అవస రాలకు బియ్యం, గోధుమలు, పాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తారు. వీటిపై జీఎస్టీ తగ్గించడంతో ఆయా ధాన్యాలపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర తగ్గే అవకాశాలున్నాయి. వంటనూ నెలపైనా పన్ను తగ్గడంతో లీటర్ నూనెపై ఇదే స్థాయిలో ధర తగ్గుముఖం పడతాయి. తలనూనె, సబ్బులు, టూత్పేస్టులపైనా పన్ను 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు రూ.5 నుంచి రూ.8 వరకూ తగ్గే అవకాశాలున్నాయి. దీంతో వేతనజీవులు, నిరు పేదల నెల బడ్జెట్ తగ్గుతుంది. వేతనజీవులు నెలవారీగా నిత్యా వసరా లకు రూ.5 వేలు ఖర్చు చేస్తుంటే.. జూలై నుంచి వారికి నెలకు రూ.500–1,000 వరకు మిగులు ఉండే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. విలాస వస్తువులపైనే అధికం.. జీఎస్టీ విలాస వస్తువు లపైనే అధికంగా ఉంది. నిత్యావసరాలపై తక్కువగా ఉంది. ఈ పన్ను పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటగానే ఉంది. న్యాయంగా వ్యాపారం చేసేవారికి జీఎస్ టీ బాగానే ఉంటుంది. దొంగ వ్యాపారులకే ఇబ్బందికరం. – జి.గోపాల్, వ్యాపారి 5 శాతానికి పరిమితం చేయాలి నాన్ ఏసీ హోటల్స్కు12%, ఏసీ హోటల్స్కు 18% జీఎస్టీ విధించడంతో భోజన ప్రియులు హోటళ్లకు దూరమయ్యే పరిస్థితి ఉంది. జీఎస్టీ వల్ల హోటళ్ల గిరాకీపై తీవ్ర ప్రభావం పడ నుంది. హోటళ్లపై జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేయాలి. – కిషన్యాదవ్, నందిని గ్రూప్ ఆఫ్ హోటల్స్ మిగిలిన స్టాకుపై పన్ను వద్దు రెడీమేడ్ దుస్తులపై 23 శాతం జీఎస్టీ వి«ధించడం సబబుగాలేదు.గతంలో వీటిపై పన్ను చాలా తక్కువగా ఉండే ది. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్టాక్ పై పన్ను విధించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని తెలిసింది. దీనిని తక్షణం ఉపసంహరించు కోవాలి. – ప్రసాద్, వ్యాపారి, బడీచౌడీ -
‘ఇన్పుట్’తోనూ ఎగనామం
- బోధన్ స్కాంలో కొత్తకోణం.. - అడ్రస్ లేని వ్యాపార సంస్థల నుంచి బోగస్ ఇన్వాయిస్లు - ఏటా రూ.కోట్లలో పన్ను ఎగవేతలు.. - మిల్లర్ల మరో అక్రమాల బాగోతమిది.. సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బోధన్ స్కాంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు బోగస్ చలానాలతోనే రూ.వందల కోట్లు పన్ను ఎగవేసినట్లు తేలింది. ఇది కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో కూడా కొందరు రైస్ మిల్లర్లు సర్కారుకు పెద్ద మొత్తంలో ఎగనామం పెట్టినట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. చాలా మంది రైస్ మిల్లర్లు బోగస్ చలానాలతో పన్ను ఎగవేస్తే.. పెద్ద మొత్తంలో టర్నోవర్ చేసిన కొందరు మిల్లర్లు మాత్రం ఇలా ఇన్పుట్ ట్యాక్స్ దారిని ఎంచుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ విచారణ అధికారుల దృష్టికి వచ్చింది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు పన్ను ఎగవేసేందుకు వ్యాపారుల వద్ద కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లతో సర్కారును బురిడీ కొట్టించారు. ఇన్పుట్ ట్యాక్స్ అంటే..? వ్యాపారి గానీ, వ్యాపార సంస్థ గానీ ఆ నెలలో చేసిన క్రయవిక్రయాలపై వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో సరుకు క్రయవిక్రయాల్లో పెరిగిన విలువ ఆధారంగా పన్ను మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపారి రూ.లక్ష విలువ చేసే వంద క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తే దానిపై రూ.4వేలు (4 శాతం) వ్యాట్ చెల్లించాలి. ఆ వ్యాపారి ఈ ధాన్యంపై లాభం, ఇతర ఖర్చులు కలుపుకుని రూ.1.25 లక్షలకు ఓ రైస్ మిల్లరుకు విక్రయించాడనుకుందాం. కొనుగోలు చేసిన రైస్ మిల్లరు అదనంగా కలిసిన రూ.25 వేల విలువకు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. ఆ రూ.4 వేల పన్ను మొత్తాన్ని ఇన్పుట్ ట్యాక్స్ కింద చూపుతారు. ఆడిట్ అధికారులకు భారీ నజరానాలు... జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు బోగస్ వ్యాపార సంస్థలు సృష్టించి.. వాటి పేరుతో నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి, ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో తక్కువ పన్ను కట్టారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విధంగానూ వాణిజ్య పన్నుల శాఖకు ఏటా రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. ఇన్పుట్ ట్యాక్స్ చూపిస్తున్న రైస్ మిల్లర్ల రికార్డులను పరిశీలించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రతి నెలా మామూళ్లతో సరిపెట్టుకోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగింది. అప్పుడప్పుడు తనిఖీలకు వెళ్లే ఆడిట్ విభాగానికి పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టజెప్పడం ఇక్కడ ఆనవాయితీ. ప్రస్తుతం బోధన్ స్కాంలో సూత్రధారులైన ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతని కుమారుడు సునీల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీఐడీ అధికారులు... ఇన్పుట్ ట్యాక్స్ కుంభకోణంపై కూడా దర్యాప్తు చేస్తే మరికొంత మంది రైస్మిల్లర్ల బాగోతాలు బట్టబయలయ్యే అవకాశాలున్నాయి. -
డిలీట్ చేస్తే నెలకు రూ.5 లక్షలు
- అక్రమ చలాన్లు సరిచేస్తే నెలకు రూ.2 లక్షలు - మరీ దాసోహపడితే ఏడాదికో కొత్త కారు - ఆరు నెలలకోసారి ఎంటర్టైన్మెంట్ ట్రిప్ - ప్రతీ ఆర్థిక సంవత్సరం చివర రూ.5 లక్షల బోనస్ - కమర్షియల్ స్కాంలో అధికారులకు తాయిలాలు - సీఐడీ విచారణలో వెలుగులోకి.. సాక్షి, హైదరాబాద్: బోధన్ స్కామ్కు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల విచారణలో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్లో ఉన్నంత కాలం డబ్బుకు లోటుండదు. అతిథి సత్కారాలకు అంతరాయం ఉండదు. టూర్లు, షికార్లు, విందులు, వినోదాలకు ఢోకాలేదు. అన్నీ తానై శివరాజు సెటప్ చేసి పెట్టాడు. ఏ అధికారి వచ్చినా అక్కడ శివరాజుదే పైచేయి. అతడు చెప్పిందే లెక్క. అతడు కట్టిందే ట్యాక్స్. మూడు చలాన్లు, ఆరు కమిషన్లతో హాయిగా సాగిపోయింది. దండుకున్నోళ్లకు.. దండుకున్నంత అన్నట్టుగా ఇన్నాళ్లూ నడిచిపోయింది. ఇలా ఒకటా రెండా.. ఏకంగా రూ.350 కోట్లు అప్పనంగా కొట్టేశారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఒక్కో అధికారి దిగమింగిన లెక్క మెల్లమెల్లగా బయటకు వస్తోంది. డిలీట్ చేస్తే నెలకు రూ.5 లక్షలు.. నకిలీ చలాన్లు సృష్టించి ట్యాక్స్ క్లయిమ్ చేసినందుకు ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు శివరాజు పక్కాగా లకారాలు అందించాడు. అక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన శ్రీనివాస్రావు విచారణలో సీఐడీ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. నిజామాబాద్ జిల్లా కింద ఉన్న నాలుగు సర్కి ల్ కార్యాలయాల్లో ప్రతీ నెలా ట్యాక్స్ అమౌం ట్ను కమర్షియల్ ట్యాక్స్ వెబ్పోర్టల్లో ఎంట ర్ చేస్తారు. అయితే నకిలీ చలాన్ల ద్వారా వచ్చే అమౌంట్, సర్కిల్ కార్యాలయాల్లో ఆడిటింగ్లో వచ్చిన అమౌంట్ సరిపోలాలి. అయితే ప్ర తి నెలా ఈ రెండింటిని పోల్చేందుకు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రావు తన ప్రతిభ ఉపయోగించాడు. పోర్టల్లో పొందుపరిచిన వివరాల ను సరిచేయడం, తప్పుగా ఉంటే డిలీట్ చేయడం, శివరాజు చెప్పిన లెక్కను యథావిథిగా పోర్టల్లో ఎంట్రీ చేయడం శ్రీనివాస్రావు చేసేవాడని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకుగానూ శివరాజు గ్యాంగ్ నుంచి ప్రతి నెలా రూ.5 లక్షలు శ్రీనివాస్రావు పుచ్చుకున్నట్టు విచారణలో బయటపడిందన్నారు. అక్రమాలకు తగ్గ రేటు.. ప్యాకేజీలు.. డిప్యూటీ కమిషనర్కు నెలకు రూ.5 లక్షలు పక్కాగా 3వ తేదీన శివరాజు అందించేవాడని, సీటీవోకు రూ.2 లక్షల నగదు తీసుకొచ్చి ఇచ్చేవాడని విచారణలో తేలింది. డివిజన్ అధికా రికి రూ.2 లక్షలు, ఏసీటీవోకు రూ.లక్ష పక్కాగా అందించాడని సీఐడీ బయటపెట్టింది. ఏటా శివరాజు బంపర్ ఆఫర్లు ఇచ్చేవాడు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రావుకు హోండా అమేజ్ కారు.. రిటైర్డ్ సీటీవోకు షెవర్లెట్ స్పార్క్ కారును గిఫ్ట్గా ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ఆరు నెలలకోసారి ప్రతీ సర్కిల్ కార్యాలయం బృందానికి గోవా, ఊటీ, కేరళ, అండమాన్.. ఇలా టూర్లకు కూడా తిప్పాడని విచారణలో వెల్లడైంది. ప్రతీ నెలా 30న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కోరుకున్న చోట, కోరుకున్న విందు ఏర్పాటు చేశాడని, ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఒక్కో అధికారికి రూ.5 లక్షలు బోనస్ కూడా ఇచ్చాడని సీఐడీ ఆధారాలతో బయటపెట్టింది. ఈ లెక్కన జాయింట్ కమిషనర్ల నుంచి ఏసీటీవోల వరకు హోదాను బట్టి ఒక్కో అధికారి ఆస్తులు కనీసం రూ.50 కోట్లకు పైమాటే అని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన అధికారులపై త్వరలోనే ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నందుకు పీసీ యాక్ట్ కింద కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసింది. -
బోధన్ స్కాంలో దర్యాప్తు అధికారి ఔట్
డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన సీఐడీ అదనపు డీజీపీ - దర్యాప్తును క్యాష్ చేసుకున్న వైనంపై ‘సాక్షి’ కథనం - విచారణకు ఆదేశించిన సీఎస్ - కర్నూలు జిల్లాకు చెందిన డీఎస్పీతో కలసి రూ.65 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడి - సీఐడీకి చేరిన డీఎస్పీ బేరసారాల ఆడియో క్లిప్ సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసును నీరుగార్చేందుకు యత్నించిన సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. దర్యాప్తును క్యాష్ చేసుకుంటున్నారని ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కథనంపై రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసు దర్యా ప్తును అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీపీ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారులు బోధన్ కమర్షియల్ స్కాంలో నిందితులతో కుమ్మౖకన అధికారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ విజయ్కుమార్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ‘సాక్షి’ తెలిపారు. బ్యాచ్మేట్ డీఎస్పీని రంగంలోకి దింపి.. సీఐడీలో పనిచేస్తున్న డీఎస్పీ విజయ్కుమార్, బోధన్ స్కాంలో ఏ–2గా ఉన్న సునీల్తో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో తేలింది. అంతేకాదు కేసును నీరుగార్చేందుకు ఇద్దరు ఒకేచోట కూర్కొని డీల్ సెట్ చేసుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో భాగంగా సునీల్ దగ్గర పనిచేసిన రామలింగం అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని డీల్ నడిపినట్టు బయటపడింది. నేరుగా డీల్లో పాల్గొంటే దొరికిపోతానని భావించిన విజయ్కుమార్ తన బ్యాచ్మేట్ అయిన కర్నూల్ జిల్లాల్లోని ఓ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అతడి ద్వారా సునీల్, రామలింగం, సునీల్ భార్యతో సెటిల్మెంట్ కు యత్నించారు. ఇందులో భాగంగా రూ.65 లక్షలు డిమాండ్ చేసినట్టు విచారణలో బయటపడింది. దీంతో విజయ్కుమార్ను కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేస్తున్నట్టు అదనపు డీజీపీ గోవింద్ సింగ్ తెలిపారు. త్వరలో అధికారుల బండారం.. బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు నిందితులతో కలసి పోలీస్ విచారణను నీరుగార్చే యత్నం చేస్తున్నారని విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం తీవ్రంగా పరిగణించి నట్టు సమాచారం. పోలీస్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మధ్య సాగిన వ్యవహారా లను కూడా బయటపెట్టనున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలో ఆ విభాగం అధికారుల బండారం కూడా బయటపడుతుందని, వారిని సైతం సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తేల్చిచెప్పారు. మరో డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డీఎస్పీపైనా విచారణ సాగుతోందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఈ డీఎస్పీతోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఒకట్రెండు రోజుల్లో వారి సంగతి కూడా తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అడ్డంగా పట్టించిన ఆడియో క్లిప్... కేసును సెట్ చేయడంతోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు డీల్ కుదుర్చుకున్నపుడు జరిగిన సంభాషణల ఆడియో క్లిప్ ఒకటి అదనపు డీజీపీకి చేరింది. దీని ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, డీల్లో ఎవరెవరున్నారు? వారికి కేసుకు సంబంధమేంటి? అధికారులూ ఉన్నా రా? అని విచారణ చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
రూ. 65 కోట్లు కాదు.. 316 కోట్లు
బోధన్ స్కామ్పై సీఐడీ నివేదిక.. - 2005 నుంచే అక్రమాలు - శివరాజు విచారణలో సంచలన అంశాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పుట్ట పగలబోతోంది. సర్కిల్ కార్యాలయాల్లో సాగిన దందా కేంద్ర కార్యాలయం వరకు విస్తరించినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిరూపించబోతోంది. అధికారులు బ్రోకర్లు కలసి చేసిన ఈ స్కాంపై సీఐడీ కీలక అంశాలను ఏ1గా ఉన్న శివరాజు నుంచి రాబట్టగలిగింది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం ఇప్పటిది కాదని, 15 ఏళ్ల నుంచి నడుస్తోందని పూసగుచ్చినట్టు సీఐడీ అధికారులకు శివరాజు చెప్పినట్టు తెలిసింది. పాత్రదారులు ఎవరు... శివరాజుతో కుమ్మౖక్కై కోట్లు గడించిన అధికారుల పాత్ర ఏంటన్న అంశాలపై సీఐడీ రాష్ట్ర డీజీపీ పూర్తి నివేదిక సమర్పించారు. కేంద్ర కార్యాలయం నుంచే... బోధన్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్... ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాలను డీసీటీవో కంటే శివరాజే ఎక్కువగా ఆపరేట్ చేసినట్టు సీఐడీ గుర్తిం చింది. గతంలో డీసీటీవోలుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారని, మరికొంత మంది బదిలీ అయి ఇతర విభాగాలకు వెళ్లిపోయా రని, వారి పేర్లతో సహా శివరాజు బయటపెట్టి నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. గతం లో ఈ విభాగంలో పనిచేసిన నలుగురు ఐఆర్ ఎస్ అధికారులు కుట్రలో ప్రధాన భాగస్వా ములయ్యారని విచారణలో బయటపడినట్టు తెలిసింది. వీరి ద్వారా కేంద్ర కార్యాలయంలో సర్కిల్ కార్యాలయాల్లోని ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించకుండా చేశాడని సీఐడీ గుర్తించింది. 2012 నుంచి కాదు... వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో 2012 నుంచి కుంభకోణం జరిగిందని ఆ విభాగం కమిషనర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కానీ 2005 నుంచి స్కాం జరిగినట్టు సీఐడీ విచారణలో గుర్తించింది. అలాగే... రూ.65కోట్లు మాత్రమే నకిలీ చలాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని వాణిజ్య పన్నుల శాఖ తెలుపగా, రూ.316 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ దర్యాప్తు బృందాలు డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత భారీతేడా ఉన్నా వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు గుర్తించకపోవడంపై సీఐడీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. అధికారులకు బంపర్ ఆఫర్లు... శివరాజు నిజామాబాద్ను కేంద్రంగా చేసుకొ ని దందా సాగించాడు. అతడికి సహకరించిన ఏసీటీవోలు, డీసీటీవోలు, అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు ఆరు నెలలకోసారి ఆఫర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక, ముంబై.. ఇలా టూర్ ప్యాకేజీలు ఇచ్చి దగ్గరుండి స్కాం పనులు చక్కబెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఇలా శివరాజుకు సహకరించిన 16 మంది అధికారుల జాబితా ను నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. వివరాలివ్వడంలోనూ జాప్యం... స్కాం విచారణ మొదలుపెట్టిన నాటి నుంచి సీఐడీ అడిగిన ఏ వివరాలనూ వాణి జ్య పన్నుల శాఖ తమకు అందించలేదని సీఐడీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చీఫ్ సెక్రెటరీ ఆదేశించిన తర్వాతే వివరాలు అందించారన్నారు. ఈ జాప్యం వెనుక అసలు కోణాలు శివరాజు విచారణలో బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. కేసుల నమోదుకు రంగం సిద్ధం... శివరాజుకు సహకరించి ప్రభుత్వ ఖజానా ను జేబులోకి మళ్లించుకున్న 16 మంది అధికారులపై సీఐడీ ఇప్పుడు నజర్ పెట్టిం ది. సీఎం శాఖ కావడం, పైగా 15 ఏళ్ల నుంచి స్కాం జరుగుతుంటే పట్టించుకోక పోవడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. దీనితో వీరిపై కేసులు నమోదు చేసి విచారించాలని సీఐడీ భావిస్తోంది. ఇందుకు అన్ని ఆధారాలను సిద్ధంచేసి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్కు అందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నాం: డీజీపీ అనురాగ్శర్మ బోధన్ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో సీఐడీ వేగవంతంగా విచారణ సాగిస్తోంది. అరెస్టయిన వారి నుంచి సేకరించిన వివరా లను బట్టి మరికొంత మందిని విచారించా ల్సి ఉంది. స్కాంలో ఆరోపణలెదుర్కుంటు న్న వారికి నోటిసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయాలి. శివరాజు చెప్పిన అంశాలపై మరికొంత స్పష్టత, మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఎంతటి అధికారులైనా స్కాంలో పాత్రదారులని తేలితే అరెస్ట్ చేయక తప్పదు. -
నిజామాబాద్ జైలుకు శివరాజ్
- మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అధికారులు - 14 రోజుల కస్టడీకి ఆదేశం సాక్షి, నిజామాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్ను సీఐడీ అధికారులు బుధవారం తెల్లవారు జామున బోధన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య ముందు హాజరుపర్చారు. వారం క్రితమే శివరాజ్ను అదుపులోకి తీసు కున్న సీఐడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో బోధన్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివరాజ్ను 14 రోజు ల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యా యమూర్తి సౌజన్య ఆదేశించారు. అనంతరం శివరాజ్ను నిజామాబాద్ సబ్జైలుకు తరలిం చారు. కాగా వారం క్రితం శివరాజ్ను పట్టు కున్న క్రమంలో ఆయన అస్వస్థతకు గురికాగా కొన్ని రోజులుగా హైదరాబాద్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం శివ రాజ్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి అర్ధరాత్రి బోధన్కు తరలించారు. అరెస్టు ప్రక్రియలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రెండు నెలలుగా పరారీలో.. రూ.వందల కోట్ల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో శివరాజ్ ప్రధాన నిందితుడు. అతని కుమారుడు సునీల్ ఏ–2గా ఉన్నాడు. మిగతా ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాజ్తో పాటు, అతని కుమారుడు సునీల్ రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పరారీలోనే ఉన్న సునీల్ కోసం సీఐడీ ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో సునీల్ను కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని రికార్డులు స్వాధీనం ఈ కేసులో సీఐడీ అధికారులు శివరాజ్కు సంబంధించిన మరిన్ని రికార్డులను మంగళ వారం స్వాధీనం చేసుకున్నారు. నిజామా బాద్లో పలుచోట్ల దాచిన రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సీఐడీ అధికారులు సేకరించారు. తాజాగా మంగళ వారం కూడా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. శివరాజ్ను కస్టడీకి ఇవ్వాలని గురువారం సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. -
కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?
⇒ ‘కమర్షియల్’ స్కాంపై సీఎం కేసీఆర్ సీరియస్ ⇒ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెంచాలని ఆదేశం ⇒ సీఐడీ విచారణపై ఆరా..ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై విచారణ సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కేవలం రూ.60 కోట్ల వరకే స్కాం జరిగినట్లు నివేదికిచ్చారని, కానీ సీఐడీ విచారణలో వందల కోట్లు పక్కదారి పట్టినట్లు తేలడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయ పరిధిలోని ఆడిటింగ్ను తప్పనిసరిగా కేంద్ర కార్యాలయాల్లో పర్యవేక్షించాలని, అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ నిఘాను పెంచాలని ఆదేశించారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తు తీరుపై డీజీపీ అనురాగ్ శర్మతో సీఎం వాకబు చేశారు. కేసు విచారణలో బయటపడుతున్న సంచలనాత్మక అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని, మరిన్ని బృందాలను రంగంలోకి దించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. (చదవండి: బో‘ధన్’ దొంగలెందరో?) క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం బోధన్ స్కాం అక్రమాల్లో పాలుపంచుకున్న కమర్షియల్ ట్యాక్స్ సీటీవోలు, ఏసీటీవోలు, సూపరింటెండెంట్లు, డీసీటీవోలు, జాయింట్ కమిషనర్ల విచారణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న 18 మంది అధికారుల పాత్రపై సీఐడీ ఆరా తీయనుంది. ప్రైవేట్ ఆడిటర్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్తో పదే పదే సంభాషణలు కొనసాగించిన ఈ అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరిని విచారించేందుకు సీఐడీకి అనుమతి లభించడంతో నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వాలని కోరే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. నీకింత.. నాకింత వాటాలు పంచుకున్న 18 మంది అధికారులు బోధన్ స్కాం తవ్వుతున్న సీఐడీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ బయటపడింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉన్నతాధికారుల జాబితా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 18 మంది ఉన్నతాధికారుల పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. బోధన్లో గతంలో పనిచేసిన ఏసీటీవో, సీటీవోల దగ్గరి నుంచి డివిజన్ కార్యాలయాలు, జాయింట్ కమిషనర్ల వరకు ఈ స్కాంలో పాత్రదారులుగా ఉన్నారని సీఐడీ ఆధారా లు సేకరించింది. ప్రైవేట్ ఆడిటర్గా ఉం టూ ట్యాక్స్ చెక్కులు వసూలు చేసిన శివరాజుతో కలసి ఈ 18 మంది వాటాలు పంచుకున్నారని విచారణలో తేలినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేస్తున్నారు. వీరు పనిచేస్తున్న ప్రాంతాల్లోనూ శివరాజుతో కలసి ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్నట్టు సీఐడీ గుర్తించింది. అయితే వీరు పనిచేస్తున్న ప్రాంతాలను తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. బోధన్లో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించాల్సిన 100 మంది వ్యాపారుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. వీరిలో ట్యాక్స్ కట్టిన వారు, ట్యాక్స్ కట్టకుండా శివరాజుతో కలసి పన్ను కట్టినట్టు నకిలీ చలాన్లు పెట్టుకున్న వారిని విచారించాలని భావిస్తున్నారు. దీంతో పాత నిజామాబాద్ జిల్లాలో కలవరం మొదలైంది. ఎప్పుడు ఏ సీఐడీ అధికారులు వచ్చి విచారిస్తారో తెలియక సతమవుతున్నట్టు తెలిసింది. -
బో‘ధన్’ దొంగలెందరో?
కమర్షియల్ ట్యాక్స్లో బయటపడని తిమింగళాలు మరెన్నో.. - వెయ్యి కోట్ల దాకా స్కాం జరిగి ఉండొచ్చని సీఐడీ అనుమానం - అన్ని సర్కిళ్లలోనూ బోధన్ తరహా వ్యవహారాలే! - ఒక్క బోధన్లోనే రూ. 200 కోట్లు నొక్కేసిన శివరాజ్ గ్యాంగ్ - ఐదేళ్లుగా అన్నీ దొంగ లెక్కలు.. నకిలీ ఆడిటింగ్లు - బ్యాంకులు, సబ్ ట్రెజరీల్లోనూ అక్రమార్కులు - అధికారులపై దాడులకు సిద్ధమైన ఏసీబీ - ఫైలు సీఎంవోకు వెళ్లకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి? సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ కింద రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాల్లోకి మళ్లించారు.. ఒక వ్యాపారి చెల్లించిన ట్యాక్స్ నగదును మరో ఐదుగురు వ్యాపారుల పేర్ల మీదకు మార్చేశారు.. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో ఇలాంటి ఎన్నో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి! కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారుల కళ్లు బైర్లు కమ్మే విషయాలు కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.200 కోట్లకు పైగా ట్యాక్స్ వసూలు చేసి కేవలం 25 నుంచి రూ.30 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాలోకి చేరాయంటే ఎంతటి స్థాయిలో స్కాం జరిగిందో తెలుస్తోంది. ఇలా కేవలం బోధన్ మాత్రమే కాదు కమర్షియల్ ట్యాక్స్లోని 80 శాతం సర్కిళ్లలో ఇదే పరిస్థితి ఉన్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఇలా ఏటా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల దాకా వ్యాట్ సొమ్ము గల్లంతైనట్టు సీఐడీ అంచనా వేస్తోంది. కేసు సీఐడీకి బదిలీ వెనుక ఒత్తిడి? బోధన్ స్కాం వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే ముందు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఈ విచారణలో కేవలం బోధన్లోనే రూ.200 కోట్లు స్కాం జరిగినట్టు తేలింది. సీటీఓ, ఏసీటీవోతోపాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బంది, ఆడిటర్ నేతృత్వంలో స్కాం చేసినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇలా రాష్ట్రంలోని 12 డివిజన్లలో 91 సర్కిల్ కార్యాలయాలున్నాయి. ఈ సర్కిళ్లలోని 80 శాతం కార్యాలయాల్లో ఆడిటర్లే వాటిని పరోక్షంగా శాసిస్తున్నారని తేలినట్టు తెలిసింది. ఇలా ఈ సర్కిల్ కార్యాలయాల్లో రూ.1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగి ఉంటుందని ఏసీబీ అనుమానించింది. అయితే ఈ కేసును తామే విచారణ చేస్తామని ఉన్నతాధికారులు పట్టుదల చూపించారు. కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి కేసును కేవలం బోధన్కు మాత్రమే పరిమితం చేసి సీఐడీకి బదిలీ చేయించారని విశ్వసనీయంగా తెలిసింది. అన్ని వారి చేతుల్లోనే.. బోధన్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించింది ఆడిటర్ శివరాజ్గా సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతడి ప్రమేయం లేనిదే ఆ సర్కిల్ పరిధిలో ట్యాక్స్ చెల్లింపులు జరగవని గుర్తించారు. శివరాజ్తోపాటు అతడి కుమారుడు సునీల్ కూడా కీలక పాత్ర పోషించాడని దర్యాప్తులో బయటపడింది. శివరాజ్ లాబీయింగ్తోనే కమర్షియల్ ట్యాక్స్ అధికారుల బదిలీలు కూడా జరిగాయంటే స్కాంలో అతడి పాత్ర ఎంతటితో అర్థమవుతోంది. ఇలా అతడు ఒక్క బోధన్లోనేగాక.. నిజామాబాద్ డివిజన్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని నకిలీ ట్రెజరీ చలాన్లతో ట్యాక్స్ చెల్లించినట్టు వ్యాట్ వెబ్పోర్టల్లో అధికారులు యూజర్ ఐడీ, పాస్వర్డులతో వివరాలు అప్లోడ్ చేసేవాడని సీఐడీ అధికారుల ద్వారా తెలిసింది. ఇలా ఐదేళ్లలో ఇతడి ద్వారానే దొంగ ఆడిటింగ్లు చేయించారని, వాటికి సంబంధించిన ఫైలు కూడా దొరక్కుండా చేశారని తేలింది. ఒక్క చెక్కు.. ఐదుగురికి ట్యాక్స్... బోధన్లో ప్రముఖ వాహనాల డిస్టిబ్యూటర్ ప్రతి నెలా రూ.25 లక్షల ట్యాక్స్ కడుతుంటాడు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు నిత్యం టచ్లో ఉండే ఆడిటర్ శివరాజ్కు రూ.25 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకున్న శివరాజ్ ఐదుగురు వ్యాపారుల పేరిట చలాన్లు తీసి సబ్ ట్రెజరీ ఆఫీస్లో చెల్లించాడు. వాహనాల డిస్టిబ్యూటర్ పేరిట కేవలం రూ.5 లక్షలు చెల్లించి మిగతా డబ్బును ఇతర వ్యాపారుల పేరిట జమ చేశారు. వారిచ్చిన డబ్బును శివరాజ్తో పాటు అధికారులు తమ సొంత జేబుల్లో నింపుకున్నారు. గత అయిదేళ్లలో ఒక వాహనాల డీలర్ రూ.28 కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు చెక్కులున్నాయి. కానీ కమర్షియల్ టాక్స్లో ఆయన పేరిట ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే జమ అయినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. మిగతా రూ.26 కోట్లు అధికారులే స్వాహా చేశారనే నిర్ధారణకు వచ్చారు. ఇలా బోధన్ పరిధిలో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించే వారు 150 మంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా రైస్మిల్లర్లు, కార్ల డిస్టిబ్యూటర్లుండటంతో కమర్షియల్ టాక్స్ అధికారుల పంట పడింది. ఒకరు కట్టిన ట్యాక్స్ను ఖజానాకు జమ చేసి.. మిగతా వారు కట్టిన డబ్బును తమ సొంతం చేసుకున్నారు. బ్యాంకు, సబ్ ట్రెజరీల్లోనూ... కమర్షియల్ ట్యాక్స్ ప్రభుత్వ ఖాతా ఉన్న బ్యాంకు, చలాన్లు చెల్లించే సబ్ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్టీవో)ల్లో కూడా శివరాజ్ మనుషులున్నట్టు సీఐడీ గుర్తించింది. ఒకరి పేరుపై ట్యాక్స్ చెల్లించేందుకు ఇచ్చిన చెక్కుతోనే మిగతా వ్యాపారుల పేరిట చలాన్లు స్వీకరించడం ఏంటన్న అంశంపై దృష్టి సారించగా.. ఈ రెండు విభాగాల అధికారుల అక్రమాలు బయటపడినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లోనే రూ.20 కోట్లు బోధన్లో ట్యాక్స్ కుంభకోణం బయటపడి 15 రోజులు గడుస్తోంది. ఈ పక్షం రోజుల్లో బోధన్ మిల్లర్లు రూ.20 కోట్ల వరకు పెండింగ్ ట్యాక్సులు చెల్లించినట్టు తెలిసింది. ఇవి కేవలం 20 శాతం మంది మిల్లర్లు మాత్రమే చెల్లించినవి సీఐడీ తన దర్యాప్తులో బయటపెట్టింది. మొద్దు నిద్రలో వాణిజ్య విభాగం బోధన్లో ఈ స్కాం ఐదేళ్ల నుంచి జరుగుతోందని సీఐడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఐదేళ్లకు సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా దొరక్కుండా కాల్చి బూడిద చేశారు. మరి ఐదేళ్ల నుంచి కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఉన్నతాధికారులు, ఆడిటింగ్ విభాగం ఎందుకు పట్టించుకోలేదన్న అంశంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీరి చేతుల్లోకి కూడా వసూళ్ల డబ్బు వచ్చి ఉంటుందని అనుమానిస్తోంది. 2012 నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు స్కాం జరిగినట్టు విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వసూళ్లనే దోచుకుంటే వాణిజ్య విభాగం చూసీచూడకుండా ఉండటంపై విమర్షలు వెలువెత్తుతున్నాయి. ఆ అధికారులపై నజర్ ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలకు సంబంధించి కేసుల నమోదు, దాడులు చేసే అధికారం కేవలం ఏసీబీకి మాత్రమే ఉంది. బోధన్ స్కాంతో వెలుగులోకి వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బినామీ పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై త్వరలోనే కొరడా ఝళిపించే అవకాశం ఉందని ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. అయితే అధికారులపై దాడులకు సంబంధించిన ప్రతిపాదన పైలు జీఏడీలో పెండింగ్లో ఉందని, ఆ ఫైలును సీఎం కార్యాలయానికి చేరకుండా కమర్షియల్ ట్యాక్స్లోని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి ఆపించే కుట్ర చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. 10 రోజులుగా ఆ ఫైలు సీఎంవోకు వెళ్లకుండా పక్కనబెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ నుంచి జాయింట్ కమిషనర్లకు వరకు ఉన్నట్టు తెలిసింది. -
వాణిజ్య పన్నుల రాబడికి భారీ గండి
►‘నోట్ల రద్దు’ ప్రభావంతో తగ్గిన ఆదాయం ►ఒక్క నవంబర్లోనే రూ.500 కోట్ల నష్టం ►వెలవెలబోయిన చిల్లర వ్యాపారాలు సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్ లో సరిపడా నగదు లేకపోవడంతో నవంబర్లో రోజువారీ క్రయవిక్రయాలు బాగా పడిపో యాయి. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయం రూ.500 కోట్ల మేర తగ్గింది. సాధారణంగా ప్రభుత్వానికి వ్యాట్ ద్వారా నెలకు సగటున రూ.2,800 కోట్లు సమకూరుతుంది. కానీ నోట్ల రద్దు ప్రభావంతో నవంబర్లో రూ.2,300 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమికంగా తేల్చింది. చెక్కులు, ఇతర రూపాల్లో కొంతమేర ఆదాయం వచ్చినప్పటికీ.. ఆ మొత్తాన్ని రాబడి లోకి తీసుకోలేదు. ఇది రూ.25 కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రధాన వనరుకే దెబ్బ: వాణిజ్య శాఖ నుంచి నెలకు సగటున రూ.3వేల కోట్ల ఆదాయం సమ కూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నోట్ల రద్దు కారణంగా ఈ లక్ష్యంలో 20% కోత పడడం సర్కారును కలవరపరుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల భవిష్యత్తు ప్రధా నంగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఆదా యంపైనే ఆధార పడిందని చెప్పవచ్చు. ఆ శాఖ నుంచి నెలవారీగా వచ్చే ఆదాయంతోనే ఉద్యో గుల వేతన చెల్లింపులు, పెన్షనర్ల చెల్లింపులు, ఆస రా చెల్లింపులన్నీ ఆధారపడి ముందుకెళ్తున్నాయి. మరోవైపు డిసెంబర్లోనూ నగదు సమస్యతో గం దరగోళం నెలకొంది. బ్యాంకుల్లో నగదు లేకపోవ డంతో ఖాతా దారులకు చెల్లింపులు నిలిచిపోతు న్నాయి. ఈ పరిస్థితులు వ్యాపారాలపై తీవ్ర ప్రభా వం చూపుతుండటంతో డిసెంబర్లోనూ వాణిజ్య పన్నుల శాఖకు నష్టాలు తప్పవని తెలుస్తోంది.కుదేలైన చిరు వ్యాపారులు: ‘నోట్ల రద్దు’తో చిరు వ్యాపారులు పూర్తిగా కుదేలయ్యారు. చిల్లర వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులపై విస్తృత ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో అమలు సంతృప్తికరంగా లేదు. ‘క్యాష్ లెస్’పై ప్రజలకు అవగాహన లేకపోగా.. వ్యాపారులకు సరైన సౌకర్యాల్లేవు. స్వైపింగ్ మెషిన్ల కొరతకు తోడు మెషిన్లు ఉన్న చోట కూడా మాటిమాటికీ మొరాయిస్తుండడంతో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోతున్నాయి. -
అక్రమ దాడులు ఆపండి
కడప రూరల్: వాణిజ్య పన్నులశాఖ తమపై జరుపుతున్న అక్రమ దాడులను ఆపాలని ట్రాన్స్పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నిసార్జాన్ డిమాండ్ చేశారు. లేకుంటే నవంబరు 1న జిల్లా బంద్ చేపడతామని హెచ్చరించారు. ఆ మేరకు ఈనెల 15వ తేదిన కార్యచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలంటే కేంద్రాన్ని అడగాలేగానీ తమపై పడి వసూళ్లను రాబట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పన్నులు చెల్లించలేక ట్రాన్స్పోర్టులను నిర్వహించలేక ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు వాణిజ్య పన్నులశాఖ వారు ప్రభుత్వానికి రాబడి ఇచ్చే క్రమంలో తమపై పెనాల్టీలు వేయడం దారుణమని వాపోయారు. తమవద్ద వే బిల్లులు ఉన్నప్పటికీ, లేనప్పటికీ లక్షల్లో జరిమానాలు విధించడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జీఎల్టీ, సూర్య, తిరుమల ట్రాన్స్పోర్టు అధినేతలు జంషీర్, చైతన్య, రమేష్బాబు, హరినాథరెడ్డి, రమేష్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు అసెంబ్లీ సమావేశం
ఒకే రోజు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం సమావేశం కానుంది. వచ్చే ఏప్రిల్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానున్న జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెడతారు. సోమవారం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సచివాలయంలో భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలను ఒకే రోజు నిర్వహించాలని, జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఆమోదించి పంపించాలని తీర్మానించింది. ఇదే సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్ను బిల్లు రూపంలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐదో విడత సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఒకే రోజు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించినప్పటికీ మరి కొన్ని రోజులు కొనసాగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. బీఏసీలో తీసుకునే నిర్ణయం మేరకు దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించినా వినాయక చవితి ఉత్సవాల తర్వాతే సమావేశాలు కొనసాగించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేబుల్ టీవీ నెట్వర్క్ పర్యవేక్షణకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ నెట్వర్క్ పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్నతాధికారుల కమిటీలను ఏర్పాటు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కేబుల్ నెట్వర్క్ (క్రమబద్ధీకరణ) చట్టం-1955 అమలు తీరు, చట్టాల్లో మార్పులు ఇతర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర స్థాయి కమిటీలో వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, దూరదర్శన్ కేంద్రం డెరైక్టర్, సమాచార శాఖ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లు ఉంటారు. ఏడాదికోసారి ఈ కమిటీ సమావేశమై రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్న కేబుల్ ఆపరేటర్ల వివరాలు, టీవీ వీక్షకుల వివరాలను పూర్తిస్థాయి నివేదికతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. కాగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, డీపీఆర్ఓతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. -
పన్ను చెల్లింపుల్లో కూల్.. కూల్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే వేల కోట్ల రూపాయల విలువైన శీతల పానీయాల వ్యాపారానికి సంబంధించి పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. కూల్డ్రింకులు తయారు చేసే రెండు అంతర్జాతీయ కంపెనీలు హిందుస్థాన్ కోకోకోలా, పెప్సీకోలా కంపెనీలు ఏటా రూ. 2వేల కోట్లకు పైగా విలువైన వ్యాపారం చేస్తూ, విలువ ఆధారిత పన్ను చెల్లిస్తున్నప్పటికీ... తరువాత అంచెల్లో పన్ను ఎగవేస్తున్నట్లు అధికారులు తేల్చారు. కంపెనీల్లో తయారైన కూల్డ్రింకులు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల ద్వారా వినియోగదారులకు చేరుతాయి. ఈ క్రమంలో కూల్డ్రింక్ కంపెనీలు తాము డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించిన ధర మీద వ్యాట్ చెల్లిస్తున్నాయే తప్ప... డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు మాత్రం తాము జరిపే విక్రయాలపై లభించే మార్జిన్ మీద పన్ను చెల్లించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన వాణిజ్యపన్నుల శాఖ తదుపరి చర్యలకు రంగంలోకి దిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూల్డ్రింక్ కంపెనీల ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరిన ‘సరుకు’ వివరాలను సేకరించి ‘మార్జిన్’పై పన్ను చెల్లించని వారి గురించి ఆరా తీస్తోంది. మూడు అంచెల్లోపన్ను చెల్లించాల్సిందే! ఒక వస్తువు తయారై వినియోగదారుడికి చేరే ప్రక్రియలో మూడంచెల్లో ఎప్పటికప్పుడు విలువ ఆధారిత పన్ను చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీలో వస్తువు తయారై డిస్ట్రిబ్యూటర్కు విక్రయించిన ధరపై 14.5 శాతం పన్ను చెల్లించాలి. తరువాత డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్కు, రిటైలర్ నుంచి వినియోగదారుడికి చేరే సమయాల్లో కూడా వారికి లభించే ‘మార్జిన్’ మీద 14.5 శాతం మేర పన్ను చెల్లించాల్సిందే. కానీ కూల్డ్రింక్ వ్యాపారంలో అది జరగడం లేదని వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. కోకోకోలా, పెప్సీ కోలా కంపెనీలు రూ. 2వేల కోట్ల టర్నోవర్పై రూ. 220 కోట్లు పన్ను చెల్లిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్, రిటైలర్లలో మెజారిటీ తమకు లభించే మార్జిన్ మీద పన్ను చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు డివిజన్లలోని అధికారులు 50 బృందాలుగా ఏర్పాటై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూల్డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల లావాదేవీల డేటాను సేకరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 10 జిల్లాల్లోని కూల్డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లను టార్గెట్ చేసుకొని రెండు, మూడు అంచెల్లో జరిగిన కూల్డ్రింక్ అమ్మకాల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని పరిశీలించి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల నుంచి మార్జిన్ మీద పన్ను వసూలు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా రూ. 100 కోట్ల వరకు పన్ను వసూలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
విదేశీ సిగరెట్టు.. గుట్టురట్టు
► అక్రమంగా విక్రయిస్తున్న రూ.5 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత ► రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 32 బృందాలతో దాడులు సాక్షి, హైదరాబాద్: విదేశీ సిగరెట్కు సెగ తగిలింది. అక్రమ వ్యాపారులకు వాణిజ్యపన్నుల శాఖ పొగ పెట్టింది. విదేశీ చౌకధర సిగరెట్ల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. వాణిజ్యపన్నుల శాఖకు చెందిన 32 బృందాలు బుధవారంరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేశాయి. హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సిగరెట్ అక్రమ రవాణా ఏజెంట్ల గోడౌన్లు, ఇతర అడ్డాలపై దాడులు చేసి రూ. 5 కోట్ల విలువైన సిగరెట్ కార్టన్లను సీజ్ చేశాయి. బ్లాక్, మోండ్, ఎస్సె, డన్హిల్, కేమల్, ఎల్.ఎమ్ బ్రాండ్లతో గల విదేశీ ప్రీమియం సిగరెట్లతోపాటు పారిస్, విన్, ఇంపాక్ట్, ఎలవెన్ 10, రూలి రివర్, రిచ్మ్యాన్, వేణుస్ తదితర బ్రాండ్లతో గల లోకల్ సిగరెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సీజ్ చేసిన అక్రమ విదేశీ సిగరె ట్ కార్టన్లకు సంబంధించి కోటి రూపాయల వరకు పన్నురూపంలో వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేయనుంది. సిగరెట్టు కంపెనీల ఫిర్యాదుతో... మలేషియా, సింగపూర్, థాయ్లాండ్ వంటి విదేశాల్లో తయారైన ప్రీమియం, ఆర్డినరీ సిగరెట్లతోపాటు కోల్కతా, ముంబై, బంగ్లాదేశ్, ఇండోనేషియాల్లో తయారైన లోకల్ ఆర్డినరీ సిగరెట్లు కొన్నేళ్లుగా దేశీయ మార్కెట్ను ముంచెత్తాయి. ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ టాక్స్ లేకుండా నేరుగా మార్కెట్లోకి వస్తున్న ఈ సిగరెట్ల ధర కూడా చాలా తక్కువ. సిగరెట్టు డబ్బాలపై చట్టపరమైన హెచ్చరిక ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే అక్షరాలు గాని, క్యాన్సర్కు సంబంధించిన ఫొటోలుగానీ లేకుండా మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్తగా సిగరెట్టును అలవాటు చే సుకునే యువత, తక్కువ ధరకు సిగరెట్లు వస్తుండడంతో బీడీ, సిగరెట్టుకు అలవాటు పడ్డవారు ఈ విదేశీ సిగరెట్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిగరెట్ తయారీ కంపెనీలైన ఐటీసీ, వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ వాణిజ్యపన్నుల శాఖకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణిల నేతృత్వంలో దాడులు జరిగాయి. హైదరాబాద్ బేగంబజార్కు చెందిన ప్రధాన డీలర్తోపాటు పలువురిని గుర్తించారు. వాణిజ్యపన్నుల శాఖకు రావలసిన పన్ను వసూలు నోటీసులు జారీ చేశారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి
మలక్పేట: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. లక్ష్మి అనే మహిళ తమ షాపునకు సంబంధించి వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గాను సీనియర్ అసిస్టెంట్ నరహరి రూ.2,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.43వేల కోట్ల రెవెన్యూ సాధిస్తాం
♦ ఈ ఏడాది ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటాం: తలసాని ♦ వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు ♦ జీరో దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం ♦ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన రెవెన్యూను సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయ లక్ష్యం, ప్రణాళికలు, జీరో దందా నివారణకు తీసుకోనున్న చర్యలను ఆయన బుధవారం ‘సాక్షి’కి వివరించారు. తమ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43,115 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించారని.. నెలకు సగటున రూ.3,500 కోట్ల రెవెన్యూ సాధించాల్సి ఉందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని... ప్రజలపై పన్నుల భారం మోపకుండానే సంస్కరణల ద్వారా లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జీరో దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ‘పన్నులు చెల్లించండి- దర్జాగా వ్యాపారం చేసుకోండి’ అనే నినాదాన్ని వ్యాపార వర్గాల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. కొత్తగా వ్యాట్, టీవోటీ డీలర్ల రిజిస్ట్రేషన్కు మేళాలు నిర్వహించామని తెలిపారు. పన్ను ఎగవేత సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ఇచ్చేందుకు రూ.10లక్షల నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్)ని సమకూర్చామని వెల్లడించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమం కింద చట్టాలలో కొన్ని సవరణలు చేసి వ్యాపార వర్గాలకు పన్ను సేవలను సులభతరం చేశామని వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేసి రూ.115 కోట్ల మేర పన్ను నోటీసులు జారీ చేశామన్నారు. తనిఖీలు చేపడుతున్నాం.. రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేసే ‘మహా చెక్’ కార్యక్రమాన్ని చేపట్టి రూ.9.70 కోట్లు ఆదాయాన్ని సమకూర్చామని తలసాని తెలిపారు. పన్ను ఎగవేత కు ఆస్కారమున్న ఐరన్, స్టీల్, ప్లైవుడ్, టైల్స్, బియ్యం, నిత్యావసర వస్తువులను గుర్తించి లీకేజీని అరికట్టే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 14 చెక్పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల ఏర్పాటు ద్వారా అక్రమ సరుకు రవాణాను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.12 కోట్లు విడుదల చేశామని, ఆధునీకరణ ద్వారా భారీ ఆదాయాన్ని సమీకరిస్తామని తెలిపారు. -
పన్ను వసూళ్లు.. రూ. 32,492 కోట్లు
♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 96 శాతం లక్ష్య సాధన ♦ పన్ను వసూళ్ల వృద్ధిలో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం ♦ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పన్ను వసూళ్లలో గణనీయవృద్ధి సాధించి తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని వాణిజ్య పన్నుల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.33,965 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికిగానూ రూ.32.492 కోట్లు సమకూరిందని, 96 శాతం లక్ష్యసాధన అధికార యంత్రాంగం కృషి వల్లనే సాధ్యమైందని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరచడంతో 17.85 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. 2015-16 పన్ను వసూళ్లలో 30 శాతం వృద్ధి సాధించి బిహార్ తొలి స్థానంలో నిలవగా, 16 శాతం వృద్ధితో ఏపీ మూడోస్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో రూ. 18 వేల కోట్ల వార్షిక పన్ను ఆదాయం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లలోపే రూ.32 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూర్చుకోవడం విశేషమన్నారు. ఇదే స్ఫూర్తితో 2016-17 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం రూ.43,115 కోట్లుగా నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. డిఫర్మెంట్ టాక్స్ను ముందుగా చెల్లిం చిన వారికి రాయితీలు కల్పించడం, గుర్రపు పం దేలు, బెట్టింగ్ పన్నుల్లో చట్ట సవరణ, కేంద్రీకృత బిల్లింగ్ విధానం అమలు చేయడంతో పాటు శాఖలోని ఖాళీలను భర్తీ చేసి, పన్ను వసూళ్లను కట్టుదిట్టం చేయడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలోని 419 ఉద్యోగ ఖాళీల్లో 110 మంది ఏసీటీవో స్థాయి అధికారులను గ్రూప్-2 ద్వారా నియమించేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. మార్చిలో 74 డీసీటీవో పోస్టులను ఏసీటీవోలకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. చెక్పోస్టుల ఆధునీకరణ.. అధికారుల పెంపు రాష్ట్రంలోని 14 సరిహద్దు చెక్పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తలసాని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల కోసం రూ. 12 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ వ్యాపారాల ద్వారా రూ.1,657 కోట్ల టర్నోవర్కు సంబంధించి పన్ను ఎగవేతను గుర్తించి రూ.115 కోట్ల పన్ను వసూలుకు నోటీసులు జారీ చేసి, రూ.51 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వాహనాలను తనిఖీల ద్వారా రూ.9.70 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రతి జిల్లాకు ఓ డిప్యూటీ కమిషనర్తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డివిజన్లలో అదనంగా డిప్యూటీ కమిషనర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు. -
హోలీకా ఇనామ్..!
► భైంసా చెక్పోస్టులో వ్యాపారుల నజరానాలు.. ► ఆర్థిక సంవత్సరం ముగింపులోనూ మారనితీరు ► వాణిజ్యపన్నుల శాఖలో అవినీతి బాగోతం భైంసా : హోలీ పండుగ అందరినీ రంగుల్లో ముంచెత్తితే.. భైంసా పట్టణ సమీపంలోని వాణిజ్యపన్నుల శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టు సిబ్బందిని మాత్రం నజరానాలతో తడిపేస్తోంది. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. దీంతో పట్టణసమీపంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వాణిజ్యపన్నుల శాఖ చెక్పోస్టు ఏర్పాటైంది. భైంసా పట్టణం మీదుగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వరకు పన్నులు చెల్లించకుండా అధికారులతో ముందస్తుగా సమాచారం ఇచ్చి వాహనాలను దాటించడం ఇక్కడ ‘మామూలు’ వ్యవహారంగా మారింది. అందుకే ఈ చెక్పోస్టులో పని చేసేందుకు అధికారులు, సిబ్బంది ఎక్కువ మక్కువ చూపుతుంటారు. గతంలో ఏసీబీ అధికారులు చెక్పోస్టులో తనిఖీలు నిర్వహించినా అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇక్కడి అధికారులంతా బడా వ్యాపారుల కనుసన్నల్లోనే పని చేస్తుంటారనే ఆరోపణలున్నారుు. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వ్యాపారులు కూడా వారికి నజరానాలు ప్రకటిస్తుంటారు. ప్రతియేటా దీపావళి, దసరా, హోలీ పర్వదినాలు వచ్చాయంటే వ్యాపారులే ముందుకు వస్తారు. ఇనామ్ల పేరిట చెక్పోస్టుల్లో పనిచేసే అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఈ హోలీ వేడుక కూడా కలిసి రావడంతో వ్యాపారులు అధికారులను మెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగింపు నెల అయినప్పటికీ... మార్చి నెల అంటేనే ఆర్థిక సంవత్సరానికి ముగింపు. అలాంటి ఈ నెలలోనూ భైంసా వాణిజ్యపన్నుల కేంద్రంలో తనిఖీలు అంతగా జరగడంలేదని విమర్శలు ఉన్నాయి. ముగింపు నెలలోనూ హోలీ పండుగ కలిసి రావడంతో ఈ చెక్పోస్టు గుండా వాహనాలు దాటించే బడా వ్యాపారులంతా ఇనామ్లు పంపిస్తున్నారన్న విషయం బాహాటంగా చర్చకు వస్తోంది. ఇక్కడి పరిస్థితిపై, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తీరుపై తెలిసిన చర్యలు మాత్రంలేవు. పైగా పై అధికారులు కూడా ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. అధికారుల తీరు కాస్త ప్రభుత్వ ఖజానాకు గండి పడేలా చేస్తోంది. ఏళ్లుగా ఇదేతంతు.. భైంసా పట్టణం మీదుగా ప్రతిరోజు వేల సంఖ్యలోనే వాహనాలు సరిహద్దు దాటి వస్తుంటాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పక్కాగా తనిఖీ చేస్తే అక్రమ వ్యాపారుల గుట్టు బట్టబయలవుతుంది. ఏళ్లుగా జాతీయ రహదారిపై భైంసా నుంచి వెళ్లేందుకు ప్రతి ఒక్కరికీ సులభమని తెలియడంతో వ్యాపారులంతా ఇటువైపే దృష్టి సారిస్తున్నారు. ముందస్తుగా స్థానిక చెక్పోస్టులో సమాచారం అందించి వాహనాలను యథేచ్ఛగా దాటిస్తున్నారు. వ్యాపారులు విశ్వప్రయత్నాలు చేసి ఇక్కడ విధులు నిర్వహించే అధికారులను మచ్చిక చేసుకుని తమ పని కానిస్తున్నారు. పోలీసుల తనిఖీలతో.. వాణిజ్యపన్నుల శాఖ చెక్పోస్టులను దాటి భైంసా వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పట్టణ సీఐ రఘు ఇప్పటికే తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన గు ట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నీలి కిరోసిన్ను పట్టుకున్నారు. పట్టణ సీఐగా బాధ్యతలు తీసుకున్న వారం రో జుల్లోనే తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారుల అక్రమదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు మరింత దృష్టి సారిస్తే కల్తీ నూనె, అనుమతి పత్రాలు లేకుండా వచ్చే చక్కెర లారీలు చిక్కే అవకాశం ఉంది. పోలీసు అధికారి తనిఖీలతో ఈ విషయం బయటపడుతుంటే ఇక్కడ తనిఖీల్లో షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించే వాణిజ్యపన్నుల అధికారులు, సిబ్బందికి ఇలాంటివి కనిపించకపోవడం గమన్హారం. -
పవన విద్యుత్కు భారీ రాయితీలు
సాక్షి, హైదరాబాద్: పవన విద్యుదుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. విద్యుత్ సుంకం, స్టాంపు డ్యూటీ, వ్యాట్/ఎస్జీఎస్టీ పన్నులపై 100 శాతం రాయితీ ఇస్తామంది. సత్వర, సరళీకృత విధానంలో పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాచబాటలు వేసింది. తెలంగాణ పవన విద్యుత్ విధానం-2016 ముసాయిదాను తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎన్ఆర్ఈడీసీఎల్) సోమవారం ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ ముసాయిదాను సంస్థ వెబ్సైట్(www.tnredcl.telangana.gov.inలో ప్రదర్శన కోసం ఉంచింది. మార్చి 7లోగా సూచనలు, అభ్యంతరాలను తెలపాలని ఔత్సాహిక ఉత్పత్తిదారులను కోరింది. దేశంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 37,000 మెగావాట్లు కాగా, అందులో పవన విద్యుత్ వాటా 24,000 మెగావాట్లు. అదే విధంగా రాష్ట్రం 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ పవన విద్యుత్ సంస్థ జరిపిన ప్రాథమిక సర్వేలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2018-19 నాటికి కనీసం 2,000 మెగావాట్ల పవన విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో నిర్దేశించిన సమయం లేక గరిష్టంగా 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తేనే రాయితీలు వర్తిస్తాయి. లేనిపక్షంలో రద్దవుతాయి. ముసాయిదాలో ముఖ్యాంశాలు.. ► పవన విద్యుత్ ప్రాజెక్టులకూ సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు లభించనున్నాయి. దీనికోసం ‘విండ్ పాలసీ సెల్’ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టు డెవలపర్లే భూమిని సేకరించాల్సి ఉంటుంది. నిర్దేశిత రుసుం చెల్లిస్తే భూములను వ్యవసాయేతర కేటగిరీకి తక్షణమే మార్చనున్నారు. మరే ఇతర అనుమతులు అవసరం లేదు. భూములకు ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు లభించనుంది. ► గ్రిడ్ కోడ్ ప్రకారం అన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వం ‘మస్ట్ రన్’ హోదాను కేటాయించనుంది. కాప్టివ్, ఓపెన్ యాక్సెస్, షెడ్యూల్డ్ వినియోగదారుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులకు 100 శాతం విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. ► డిస్కం లేక థర్డ్ పార్టీకి విద్యుత్ విక్రయం, కాప్టివ్/గ్రూపు కాప్టివ్ వినియోగ అవసరాల కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు విద్యుత్ సుంకం మినహాయింపు. ► థర్డ్పార్టీ వినియోగదారుడికి విద్యుత్ విక్రయిస్తే ఐదేళ్ల వరకు 100 శాతం క్రాస్ సబ్సిడీ సర్చార్జీ మినహాయింపు. ► ఎకరాకు రూ.25 వేల చొప్పున అభివృద్ధి చార్జీలు, లే అవుట్ ఫీజులను చెల్లిస్తే గ్రామ పంచాయతీలు ప్రాజెక్టు ఏర్పాటుకు 14 పనిదినాల్లో అనుమతివ్వాలి. ► ఐదేళ్ల పాటు ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్పై 100 శాతం వ్యాట్/ఎస్జీఎస్టీ పన్నులను వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లించనుంది. ► గ్రీన్ ఎనర్జీలో భాగమైన పవన విద్యుత్ ప్రాజెక్టులకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్ఓసీ అవసరం లేకుండా మినహాయింపు. ► 10 శాతం మార్కెట్ ధరను చెల్లిస్తే ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను కేటాయించనున్నారు. ఆ ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలి. రెవెన్యూ, ప్రైవేటు భూముల్లో కలిపి నిర్మించే ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తిచేయాలి. ► రూఫ్ టాప్ బేస్డ్ విండ్, విండ్-సోలార్ హైబ్రిడ్ సిస్టమ్స్ నెట్ మీటరింగ్ను ప్రభుత్వం అనుమతించనుంది. టారిఫ్ను టీఎస్ఈఆర్సీ నిర్ణయించనుంది. -
ఒక్క రోజులోనే డీలర్ రిజిస్ట్రేషన్
కొత్త విధానానికి వాణిజ్య పన్నులశాఖ శ్రీకారం సాక్షి, హైదరాబాద్: వ్యాపార వర్గాలకు సేవలను త్వరితగతిన అందించేందుకు వాణిజ్యపన్నులశాఖ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రక్రియలో భాగంగా వ్యాపారులకు ఒకే రోజులో డీలర్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత విధానంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించే డీలర్, టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ) డీలర్గా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులకు నెల రోజుల్లోగా అన్ని పత్రాలను పరిశీలించి సర్టిఫికేట్ ఇస్తుండగా ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న ఒక రోజు (24 గంటలు)లోనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని వాణిజ్యపన్నులశాఖ నిర్ణయించింది. పైగా తమ కార్యాలయం వరకు రానవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. పాన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, లీజు డీడ్తోపాటు వాణిజ్యపన్నులశాఖ కోరే పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే దరఖాస్తుదారుడికి ఒకే రోజులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందేలా నిబంధనలు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కోట్లలో వ్యాపారం... సర్కారుకు సున్నం!
♦ పన్ను చెల్లింపులో ఆటోమొబైల్ డీలర్ల చేతివాటం ♦ కొనుగోలుదారుల నుంచి 14.5% పన్ను వసూళ్లు ♦ చెల్లింపుల్లో మాత్రం తప్పుడు లెక్కలు ♦ 300 డీలర్ల ఎగవేత సొమ్మే రూ. 25 కోట్లు ♦ ఏటా సుమారు రూ. 100 కోట్ల ఎగవేత ♦ 900 మంది డీలర్ల మూడేళ్ల లెక్కల సేకరణలో అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆటోమొబైల్ డీలర్లు సర్కారుకు పన్ను చెల్లింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పేరున్న టూ వీలర్, త్రీ, ఫోర్ వీలర్ కంపెనీల డీలర్లతోపాటు జిల్లాల్లోని ట్రాక్టర్, ట్రక్ డీలర్లు కొనుగోలుదారుల నుంచి వ్యాట్ పేరుతో భారీగా పన్ను వసూళ్లు చేస్తున్నప్పటికీ దానిని ప్రభుత్వానికి చెల్లించే సమయంలో మాత్రం తప్పుడు లెక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల దృష్టిసారించిన వాణిజ్యపన్నులశాఖ కళ్లు చెదిరే వాస్తవాలు తెలుసుకుంది. నెలకు రూ. 1,000 కోట్ల వరకు వ్యాపారం చేసే ఆటోమొబైల్ డీలర్లు ఏటా కనీసం రూ. 100 కోట్ల వరకు వాణిజ్యపన్నులశాఖకు ఎగనామం పెడుతున్నట్లు తేలింది. ఆర్టీవో ఆఫీసుల నుంచి వివరాల సేకరణ.. రాష్ట్రంలో విక్రయించిన ప్రతి వాహనం రవాణాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ మేరకు గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను వాణిజ్యపన్నులశాఖ అధికారులు సేకరించారు. తద్వారా ఏయే డీలర్లు ఎన్ని కోట్ల విలువైన వాహనాలను విక్రయించి ఎంత పన్ను చెల్లించారనే విషయాలను విశ్లేషించారు. వాహనాల బేసిక్ ధర, యాక్సెసరీస్తోపాటు వ్యాట్ మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్న డీలర్లు పూర్తిస్థాయిలో పన్ను చెల్లించడం లేదని తేల్చారు. పది వాహనాలు విక్రయిస్తే వాటిలో కొన్నింటి వ్యాట్ను చెల్లించడం లేదని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్యపన్నులశాఖ డిప్యూటీ కమిషనర్లు ఆయా జిల్లాల్లో మూడేళ్లలో జరిగిన ఆటోమొబైల్ విక్రయాలు, చెల్లించిన పన్ను వివరాలను కమిషనర్ అనిల్ కుమార్కు శనివారం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 900 మంది డీలర్లు ఉండగా వారిలో కేవలం 300 మందికి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తేనే ఒక సంవత్సరంలో రూ. 25 కోట్ల వరకు పన్ను చెల్లించలేదని తేలినట్లు సమాచారం. ఈ లెక్కన ఏటా సుమారు రూ. 100 కోట్ల వరకు ఆటోమొబైల్ వ్యాపారులు పన్ను చెల్లించడం లేదని అంచనా. ఈ నేపథ్యంలో మూడేళ్లలో 900 మంది డీలర్లు ఎంత మేర ఎగ్గొట్టారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, వాణిజ్యపన్నులశాఖ చేపట్టిన చర్యల గురించి తెలిసిన కొందరు డీలర్లు బకాయిలను స్వచ్ఛందంగా చెల్లించేం దుకు ముందుకు వచ్చినట్లు తెలియవచ్చింది. ఎగవేతదారుల నుంచి పన్నుతోపాటు కనీసం 25 శాతం అపరాధ రుసుము వసూలు చేయనున్నట్లు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రూటు మారని చెక్పోస్టులు
సరిహద్దు చెక్పోస్టులతో వాణిజ్య పన్నుల శాఖ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతోంది. ఒకే మార్గంలో ఒక బోర్డర్ చెక్పోస్టు దాటిన తరువాత జిల్లా మధ్యలో మరో బోర్డర్ చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఆ అనధికార చెక్పోస్టుకు అధికారులు టార్గెట్లు విధించడం వింతగా ఉందని ఆ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ(వన్టౌన్) : రాష్ట్రం విడిపోయిన తరువాత కృష్ణా, ఖమ్మం జిల్లాలు రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో తిరువూరు వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా ఒక చెక్పోస్ట్ను నిర్వహిస్తుంది. తెలంగాణా ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోకి వచ్చే వాహనాలను అక్కడ తనిఖీలు నిర్వహిస్తారు. ఇదే రూట్లో కొండపల్లి బాలకృష్ణా సినిమా హాలు వద్ద వాణిజ్య పన్నుల శాఖ మరో సరిహద్దు చెక్పోస్ట్ పేరుతో తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. తిరువూరులో బోర్డర్ చెక్పోస్ట్లో తనిఖీ చేసిన వాహనాలు అదే దారిలో ఇబ్రహీంపట్నంకు వచ్చే క్రమంలో కొండపల్లి వద్ద వారికి ఈ బోర్డర్ చెక్పోస్టు కనిపిస్తోంది. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా నిర్వహిస్తోంది. ఒకే రహదారిలో రెండు బోర్డర్ చెక్పోస్టులు ఏ విధంగా పెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన మూడు మాసాలకు అధికారులు రెవెన్యూ శాఖ వద్ద స్థలం తీసుకుని చెక్పోస్టు ఏర్పాటు చేయడంతోపాటు ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల వ్యయం అవుతున్నా ఆశించినంత ఆదాయం మాత్రం రావడం లేదని సమాచారం. అయితే ఈ చెక్పోస్టు వివరాలు వాణిజ్య పన్నుల శాఖ వెబ్సైట్లోనూ లేకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. నిరుపయోగంగా చెక్పోస్టు తెలంగాణ రాష్ట్రంలోంచి వచ్చే వాహనాలు కొండపల్లి చెక్పోస్టుకు రాకుండానే రాష్ట్రంలోకి వెళ్లి పోవచ్చని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. తిరువూరు నుంచి నూజివీడు మీదుగా హనుమాన్జంక్షన్కు వెళ్లిపోవచ్చు. కొండపల్లిలోకి ప్రవేశించిన తరువాత కూడా మరోమార్గంలో విజయవాడ జాతీయ రహదారి మీదకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ చెక్పోస్టు వల్ల ఉపయోగం లేదంటున్నారు. తొలగించమని ప్రభుత్వానికి లేఖ రాశాం రాష్ట్ర విభజనతో గూగుల్ మ్యాప్ సహాయంతో కొండపల్లి చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి కొన్ని వాహనాలు తిరువూరు మీదుగా కొండపల్లి రావచ్చని భావించి దీనిని ఏర్పాటు చేశారు. అయితే సరుకు రవాణా చేసే భారీ వాహనాలన్నీ తిరువూరు చెక్పోస్టు మీదు గా తప్ప ఇతర మార్గాల్లో రావడం సాధ్యపడదు. దీంతో ఈ చెక్పోస్టు పెద్దగా ఉపయోగపడటం లేదు. ప్రభుత్వం చెక్పోస్టు కేటాయిం చినందున సిబ్బందిని కేటాయించి తనిఖీలు చేయిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తొలగిస్తాం. - కిరణ్, అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ -
వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలు
హైదరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళనలో భాగంగా బుధవారం 73 మంది సీటీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం.. శనివారం మరో 14 మందిని బదిలీ చేసింది. ఒక అడిషనల్ కమిషనర్, ముగ్గురు డిప్యూటీ కమిషనర్(డీసీ)లు, పది మంది అసిస్టెంట్ కమిషనర్ల(ఏసీ)ను బదిలీ చేస్తూ శనివారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన తొమ్మిది మంది అధికారులు ఉన్నారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన అడిషనల్ కమిషనర్ జి.వెంకటేశ్వర్లును కమిషనర్ కార్యాలయంలో నియమించింది. ఇక తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఎన్.సుభద్రను కర్నూల్ జిల్లా డీసీగానూ.. ఎస్.ఈశ్వరయ్య, ఐ.శ్రీనగేష్లను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ నియమించారు. -
వాణిజ్యపన్నులశాఖలో జలగలు
- ప్రతి పనికీ ఒక రేటు - వాణిజ్యశాఖకు పన్నుల ఎగనామం - ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి - లంచాల మత్తులో అధికారులు నెల్లూరు (టౌన్): నెల్లూరు వాణిజ్యపన్నుల శాఖలో అవినీతి రాజ్యమేలుతుంది. అక్కడ ఏ పని కావాలన్నా అధికారులు అడిగినంత సమర్పించుకోవాల్సిందే. ప్రతి పనికి ఒక ధరను నిర్ణయించి అక్కడ కొంతమంది అధికారులు అమలు చేస్తున్నారు. లెసైన్సు దగ్గర నుంచి పన్ను చెల్లింపు వరకు అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం నెల్లూరులో పనిచేస్తున్న సీటీఓ(ఆడిట్) సూర్యప్రకాష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా కోట్లల్లో కూడబెట్టిన అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. లావాదేవీలు ఇలా.. జిల్లాలోని వాణిజ్యపన్నుల శాఖలో 5 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 3 సర్కిల్ కార్యాలయాలు, గూడూరు, కావలి ప్రాంతాల్లో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉంది. జిల్లాలో ఐదుగురు సీటీఓలు, 11మంది డీసీటీఓలు, 23 మంది ఏసీటీలు విధులు నిర్వహిస్తున్నారు. సర్కిల్ కార్యాలయంలో వాణిజ్యపన్నుల అధికారి ఉంటారు. ఆయనతో పాటు డీసీటీఓలు, ఏసీటీఓలు వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారు. వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు ఆయా వస్తువులును బట్టి 1శాతం, 1శాతం, 14.5శా తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5నుంచి రూ. 40లక్షల లోపు వ్యాపారం చేసే ప్రతివారు 1 శాతం పన్నును చెల్లించాలి. వీరంతా టీఓటీ(టాట్) పరిధిలోకి వస్తారు. రాష్ట్రంలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంది. రూ. 40 లక్షల పైబడి వ్యాపారం చేసేవారు వ్యాట్ పరిధిలోకి వస్తారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తుంటారు. జిల్లాలో దాదాపు 10వేల మందికి పైగా వ్యాట్ డీలర్లు ఉన్నారు. వ్యాట్కు తూట్లు... జిల్లాలో కోట్లల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రసుత్తం ఏసీబీకి దొరికిన సీటీఓ గూడూరులో పనిచేస్తున్నడప్పుడు పలు ఆరోపణలు వచ్చాయి. బియ్యం, ఇనుము పరిశ్రమలతో పాటు సెజ్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించా యి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కొంతమేర పరిశ్రమల నుంచి పన్నులు వసూలు చేశారు. ఇదే రీతిలో పలు పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి పన్ను చెల్లించకుండా జిల్లా నుంచి పెద్దమొత్తంలో సరుకులను ఇతర రాష్ట్రాలకు తరలించి వాణిజ్యశాఖకు పన్ను ఎగనామం పెడుతున్నారు. జిల్లా నుంచి బియ్యం, చక్కెర, ధాన్యం, పప్పు లు భారీగా ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నా యి. వీటిని ఎక్కువగా పార్శిల్ లారీల్లో ఇతర రాష్ట్రాలకు చేరవేస్తుంటారు. ఆయా శాఖల అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి సరిహద్దును దాటించడంలో జాక్పాట్ లారీలు ప్రసిద్ధి. ఈ రీతిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అటు వ్యాపారులు, ఇటు అధికారులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. -
ఆదాయ వనరులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వనరులను పెంచేందుకు విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. పన్నులు ఎగవేసే అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో వాణిజ్యపన్నుల శాఖ పనితీరుపై సీఎం సమీక్షించారు. వాణిజ్యపన్నుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలించారు. జీరో వ్యాపారం, పన్ను ఎగవేత, తక్కువ పన్ను చెల్లించి ఎక్కువ వ్యాపారం చేయడం వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. తెలంగాణకు ఉన్న నాలుగు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల్లో 14 చెక్పోస్టులున్నాయని, వాటిని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీతో సరిహద్దుల్లోని 7 చెక్పోస్టులకు భవనాలు లేవని, రోడ్లపైనే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సీటీ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చెక్పోస్టులకు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి లీజు పద్ధతిన భూమి తీసుకొని చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. రెండు చెక్పోస్టులకు భూమి అందుబాటులో ఉందని అధికారులు పేర్కొనగా, వెంటనే పనులు జరిగేలా చూసేందుకు నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పారు. వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగాల నియామకానికి ఇప్పటికే అనుమతిచ్చామని, ఇంకా ఖాళీలు ఉంటే వాటిని కూడా భర్తీ చే స్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్ కుమార్, అదనపు కమిషనర్లు చంద్రశేఖర్రెడ్డి, రేవతి రోహిణి (ఎన్ఫోర్స్మెంట్)తో పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, శాంతికుమారి హాజరయ్యారు. -
వాణిజ్య రాబడి భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు నిధులు సమకూర్చేందుకు వాణిజ్యపన్నుల శాఖ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో లక్ష్యానికి అనుగుణంగానే రాబడి సాధించింది. ఈ కాలంలో రూ.7,406 కోట్ల ఆదాయం సాధించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏ నెలలోనూ రూ. 2,400 కోట్లకు తగ్గకుండా ఆదాయం సమకూరింది. జూన్లో రూ. 2,577 కోట్లు సాధించి, కొత్త రికార్డు సాధించింది. ఈ నెలలో అంచనా మొత్తానికన్నా రూ. 177 కోట్లు అధికంగా వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని సాధించేందుకు ఆ శాఖ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రూ.కోటికి పైగా బకాయిపడి కోర్టుల్లో ఉన్న వందలాది కేసులను పరిష్కరించేందుకు పేరున్న అడ్వొకేట్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే పన్ను చెల్లించకుండా జీరో దందాలు సాగించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే వారి ఆస్తుల అటాచ్మెంట్కూ వెనకాడవద్దని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ పొందిన కమిషనర్ వి.అనిల్కుమార్ కిందిస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కాగా, ఈ శాఖ 2014-15లో రూ. 27,777 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.23,727.15 కోట్లు సాధించింది. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి వ్యాట్ ద్వారా మద్యం, పెట్రోల్, డీజిల్, సిగరెట్ల మీద వచ్చే పన్నుపైనే ప్రధానంగా ఆధారపడుతున్న వాణిజ్యపన్నుల శాఖ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఉద్యోగ విభజన పూర్తయితే సిబ్బంది కొరతను పూడ్చుకొని కొత్త నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ఈలోపు క్లరికల్ పోస్టుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకునే ప్రయత్నాల్లో ఉంది. సీటీవో, డీసీటీవో స్థాయిలో యంత్రాంగాన్ని పరిపుష్టం చేయడం ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను రాబట్టాలని చూస్తోంది. సీఎస్టీ, వినోద పన్ను, విలాసపన్ను, గుర్రపు పందాల బెట్టింగ్ పన్నులను క్రమబద్ధీకరించి, పూర్తిస్థాయిలో పన్ను వసూలయ్యేలా కృషి చేయాలని భావిస్తున్నారు. -
అధికారులపై..‘ఆంధ్రా’ వ్యాపారుల జులుం
వాడపల్లి(దామరచర్ల) : వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించకుండా ఆంధ్రా పత్తివ్యాపారులు జులుం ప్రదర్శిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో సేల్టాక్స్ చెల్లించమంటూ జబర్దస్తీగా వేబిల్లులు ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన అధికారులపై ఏకంగా దాడిచేసేందుకే యత్నిం చారు. ఈ ఘటన రాష్ట్ర సరిహద్దు దామరచర్ల మండలం వాడపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. తెలంగాణ నుంచి వెళ్లే పత్తిలోడు లారీలు వాణిజ్య పన్నుల శాఖకు సేల్ టాక్స్ రూపేణా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అధికారుల ఉదాసీన వైఖరిని ఎండగడుతూ ఇటీవల ‘సాక్షి’ మినీలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో తేరుకున్న అధికారులు గురువారం ఉదయం నుంచే నాగార్జునసాగర్లో వాణి జ్య పన్నుల శాఖ అధికారులు మకాం వేశారు. అయితే పత్తివ్యాపారులు తమ లారీలను దారి మళ్లించి వాడపల్లి మీదుగా రాష్ట్ర సరిహద్దు దాటించాలని యత్నించారు. అప్రమత్తమైన అధికారులు వాడపల్లి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. చెక్పోస్టు అధికారులతో వాగ్వాదం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమైన చెక్పోస్టు అధికారులు శుక్రవారం ఉదయం వరకు 30 లారీలు సరిహద్దు దాటకుండా నిలిపారు. దీంతో డ్రైవర్లు తమ యజయానులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం వరకు అక్కడికి చేరుకున్న వ్యాపారులు వచ్చీరావడంతోనే చెక్పోస్టు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెల్లించిన సేల్స్ ట్యాక్స్ బిల్లులు ఉన్నాయి. లారీలను ఎలా ఆపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఉంటేనే సరిహద్దు దాటేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. లారీడ్రైవర్లు, యజమానులు దాదాపు వందమందికి పైగా ఉండగా, అధికారులు ముగ్గురే ఉన్నారు. దీంతో వ్యాపారులు జులుం ప్రదర్శించారు. చేసేదేమీ లేక ఏసీటీఓ వినోద్నాయక్ వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అటెండర్ను తీసుకుని వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చెక్పోస్టుపై దాడిచేసి వేబిల్లులను ఎత్తుకెళ్లారు. దాదాపు 20 లారీల వరకు అనుమతి లేకుండానే రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లిపోయాయి. -
ఆదాయమిచ్చే శాఖకు సొంతగూడు కరువు
ఏలూరు (టూటౌన్) : రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే వాణిజ్యపన్నుల శాఖకు సొంత గూడు కరువైంది. దీంతో ప్రతి ఏటా లక్షలాది రూపాయలు అద్దెలను చెల్లించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రధానంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాలతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది. అయినప్పటికీ జిల్లాలో ఉన్న 9 వాణిజ్య శాఖల సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అధికారులు, సిబ్బంది పలు ఇబ్బందులకు గురవడంతో పాటు ఏటా సుమారు రూ.42 లక్షల మేర అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు -1, 2 వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఇవి మొత్తం ప్రైవేటు భవనాల్లో కొనసాగడం గమనార్హం. ఈ శాఖ ద్వారా ఒక్క మన జిల్లా నుంచే గతేడాది రూ.379 కోట్లను సమకూర్చడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.221 కోట్లను వసూలు చేయడం జరిగిందని, మార్చి నాటికి రూ.430 కోట్ల వరకు సేకరిస్తామని జిల్లా వాణిజ్యపన్నుల శాఖ డెప్యూటీ కమిషనర్ కె.రవిశంకర్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువస్తున్న తమ శాఖకు సొంత భవనాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని గతంలో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ను కలిశారు. దీంతో స్పందించిన ఆయన కొద్ది రోజుల్లోనే స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు డెప్యూటీ కమిషనర్ కె.రవిశంకర్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 116 వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు ఉండగా కేవలం ఒక్క తిరుపతిలోనే సొంత భవనం ఉందని విశాఖపట్నంలో మాత్రం భవన నిర్మాణ దశలో ఉన్నట్లు డీసీ చెప్పారు. కలెక్టర్ సహకారంతో భవనాల నిర్మాణం జిల్లాలో కలెక్టర్ సహకారంతో స్థలాలు సేకరించి పక్కా భవనాల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వాణిజ్య పన్ను శాఖ డీసీ కె.రవిశంకర్ తెలిపారు. దీనికి సంబంధించి తమ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే మన జిల్లా అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో పక్కా భవనాలకు స్ధలాలు ఉంటే మంజూరు సులభతరం అవుతుందని డీసీ చెప్పారు. -
సీటొదల!
విజయవాడ : అక్రమ ఆదాయం దండిగా వచ్చే పోస్టుల కోసం వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో నగరంలో తమ ఆధిపత్యం కొందరు ఆధికారులు జోరుగా పైరవీలు చేస్తున్నారు. తమకు కావాల్సిన కుర్చీలపై గురిపెట్టి వాటి కోసం ఆరాటపడుతున్నారు. లక్షల్లో డబ్బు ముట్టజెప్పి నగరాన్ని వదలకుండా ఉండేందుకు కొందరు సీటీవోలు, డీసీటీవోలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ నెలాఖరుకు బదిలీ ఉత్తర్వులు రానుండడంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పైరవీలు ఊపందుకున్నాయి. విజయవాడ-1, 2 డివిజన్లలో పనిచేసే సీటీవోలు, డిప్యూటీ సీటీవోల్లో బదిలీల ఫీవర్ నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను జీరో సర్వీసు కింద బదిలీ చేస్తారు. ఏడాది సర్వీసు పూర్తి చేసిన సీటీవోలు, డీసీటీవోలను కూడా బదిలీ చేస్తారు. ఈ క్రమంలో డీసీలు, ఏసీలు, సీటీవోలను రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ చేస్తారు. డీసీటీవోలను మాత్రమ జోన్లో.. అంటే తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో బదిలీ చేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జోన్ స్థాయిలో బదిలీ కావాల్సిన 60 మంది డీసీటీవోలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూకుమ్మడి బదిలీ తప్పదని భావిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న 20 మంది సీటీవోలు రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అవుతారు. జిల్లాలో ఉన్న నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు కూడా బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా నెల రోజులుగా హైదరాబాద్కు, అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధికారులు తాము కోరుకున్న సీటిస్తే దక్షిణ కూడా సమర్పించేందుకు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. పాతుకుపోయిన అధికారులు విజయవాడ-1, 2 డివిజన్లలోని సీటీవోలు, డీసీటీవోలు దాదాపు ఆరు నుంచి ఎనిమిదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు. రకరకాల సాకులతో కదలకుండా తిష్ట వేశారు. ఎనిమిదేళ్లుగా ఈ రెండు డివిజన్లలోనే అటూ ఇటూ మారుతూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరైతే ఒకే డివిజన్లో సీట్లు మారుతున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ లేకుండా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన బదిలీల్లో జీరో సర్వీసు నిబంధనలు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం కూడా తమకు కావాల్సిన వారిని అవసరమైన చోటుకు తెచ్చుకునేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియకు తిలోదకాలిచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు నాయకులు పోస్టింగ్లకు కౌంటర్లు తెరిచినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. కొందరు నాయకత్వం ముసుగులో బదిలీలపై అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. -
అక్రమార్కులకు పండుగే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దీపావళి పండుగ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం దేవుడెరుగు.. ఈ దీపావళి పటాకులు మాత్రం అధికారుల జేబులు నింపుతున్నాయి. యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ వ్యాపారంతో సర్కారు ఆ దాయానికి వ్యాట్ రూపంలో రూ.కోట్లలో గండి పడుతుండటం ఒకెత్తయితే.. అక్రమ నిల్వలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీపావళి పండుగ అంటేనే పటాకలకు ఎంతో ప్రాధాన్యం. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంప్రదాయం. అయితే జిల్లాలో బాంబుల వ్యాపారం జోరోగా కొనసాగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చి కొందరు బడా వ్యాపారులు రూ.లక్షల్లో వ్యాట్ను ఎగవేస్తున్నారు. పండుగ సీజన్లో జిల్లాలో సుమారు రూ.ఐదు కోట్ల వరకు ఈ వ్యాపారం జరుగుతుందని అంచనా. అధికారికంగానే సుమారు 500 వరకు క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు మంజూరవుతుండగా, అనధికారికంగా మరో 500 వరకు రిటైల్ షాపులు వివిధ పట్టణాల్లో వెలుస్తాయి. ఒక్కో షాపులో సగటున కనీసం రూ.80 వేల వ్యాపారం జరుగుతుంది. ఈ లెక్కన రూ.ఎనిమిది నుంచి రూ.పది కోట్ల వరకు బాంబుల టర్నోవర్ అవుతోంది. పటాకలపై 14.5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.1.40 కోట్లు వ్యాట్ రూపంలో జమ కావాల్సి ఉంటుంది. కానీ.. వ్యాట్ పన్ను రాబడి రూ.25 లక్షలకు మించడం లేదు. గతేడాది అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ పటాకలపై కేవలం రూ.22 లక్షలు మాత్రమే వ్యాట్ ఆదాయం వచ్చిందంటే ఏ మేరకు జీరో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటే.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం తమ అక్రమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖలో రిజిస్ట్రేషన్ అయిన డీలర్లు జిల్లాలో సుమారు 20 మంది వరకు ఉంటారు. శివకాశి, తమళనాడు, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ డీలర్లు తీరా దీపావళి అయిపోయాక, సరుకంతా విక్రయించుకున్నాక రిటర్న్ (అమ్మకం వివరాలు) దాఖలు చేస్తారు. డీలర్లు కట్టిందే పన్ను.. వచ్చిందే ఆదాయం అనుకుని అధికారులు రిటర్న్ ఎంత అమ్మినట్లు పేర్కొంటే అంతే మొత్తంలో పన్ను వసూలు చేసుకుంటారు. పండగకు ముందు ఈ శాఖ అధికారులు ఒక్క డీలరు గోదాములపై ఆకస్మిక దాడులు చేసి, స్టాకు వివరాలు తీసుకున్న దాఖలాల్లేవంటే వ్యాపారులతో వాణిజ్య పన్నుల అధికారులకు ఉన్న ‘సన్నిహిత’ సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు శాఖల్లో కూడా.. బాంబుల విక్రయాల కోసం రెవెన్యూ శాఖ జారీ చేస్తున్న క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు ఆ మూడు శాఖల అధికారులకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. క్యాజువల్ ట్రేడ్ లెసైన్సు మంజూరు కావాలంటే అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు శాఖల నుంచి ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు శాఖల నుంచి ఎన్వోసీ వస్తేనే రెవెన్యూ అధికారులు ఈ లెసైన్సులు జారీ చేస్తున్నారు. ఈ ఎన్వోసీలు ఆయా శాఖల అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎన్వోసీ కోసం రూ.500 చొప్పున చాలాన్ రూపంలో ఆయా శాఖలకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లెసైన్స్ మంజూరుకు నిబంధనల ప్రకారం రూ.రెండు వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ.. మరో రూ.12 నుంచి రూ.15 వేల వరకు అధికారులకు సమర్పించుకోనిదే ఎన్వోసీ మంజూరు కాదనేది బహిరంగ రహస్యం. ఒక్కో శాఖకు ఒక్కో రేటు.. ఒక్క ఎన్వోసీ కోసం మున్సిపల్ అధికారులకు అదనంగా రూ.రెండు నుంచి రూ.మూడు వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ఇంకా ఎక్కువే. ఒక్కో ఎన్వోసీ ఈ శాఖల అధికారులు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగ రహస్యంగా తయారైంది. ఇక లెసైన్స్ మంజూరు చేసే రెవెన్యూ శాఖలో కూడా చేయి తడపనిదే పని జరగడం లేదు. మొత్తం మీదా ఒక్క క్యాజువల్ ట్రేడ్ లెసైన్స్ మంజూరు కావాలంటే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికారుల చేతులు తడపాల్సి వస్తోంది. ఇదంతా ఏటా జరుగుతున్న తంతే. ఈ లెసైన్సుల జారీకి కొందరు వ్యాపారులు దళారులుగా అవతారమెత్తారు. ఈ లెసైన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వద్ద ఈ దళారులు వసూలు చేసి ఏక మొత్తంగా సంబంధిత అధికారులకు ముట్టజెప్పడం పరిపాటిగా తయారైంది. ఈ మామూళ్ల దందా ఒకెత్తయితే.. పటాకలకు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్లు అదనం. ఏరియా కౌన్సిలర్లు, చోటామొటా నాయకుల నుంచి మొదలు.. ఫైర్ మెన్లు, కానిస్టేబుళ్లు, ఆయా కార్యాలయాల సిబ్బందికి ఈ గిఫ్ట్ ప్యాక్లు ముట్టజెప్పాల్సిందే. -
నిఘా నిద్దరోతోంది!
- జహీరాబాద్ కమర్షియల్ టాక్స్ చెక్పోస్టు అధికారుల నిర్లక్ష్యం - వేబిల్లులు లేకుండానే రాష్ట్రంలో ప్రవేశిస్తున్న సరుకులు - సిగరెట్ల వ్యాన్ పట్టివేతతో తేటతెల్లం సంగారెడ్డి క్రైం: జిల్లా సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టు నిద్రపోతోంది. మామూళ్లపై శ్రద్ధ చూపుతున్న ఆ శాఖ అధికారులు అక్రమ రవాణాను నిలువరించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు ఎటువంటి వే బిల్లులు లేకుండానే లక్షల రూపాయల సరుకులను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సర్కార్ ఖజానాకు చేరాల్సిన సొమ్ములు పక్కదారి పడుతున్నాయి. జహీరాబాద్ పట్టణ శివారులో అధికారులు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టును ఏర్పాటు చేశారు. అయితే నిఘా తీవ్రం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడింది ఆటా పాడింది పాటగా మారింది. చెక్పోస్టుపై సంబంధిత శాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు జహీరాబాద్ చెక్పోస్టు వద్ద ఎటువంటి వే బిల్లులు లేకుండా సిగరెట్ల లోడ్లతో వెళ్తున్న డీసీఎం (ఏపీ 09టీ 0849)ను పట్టుకున్నారు. ఆ వ్యాన్లో మొత్తం 53 కాటన్లలో ఇండోనేషియా సిగరెట్లు ఉన్నాయి. ఈ వ్యాన్ ముంబాయ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని సంగారెడ్డిలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వే బిల్లులు లేకుండా తరలిస్తున్న ఈ వ్యాన్ సంగారెడ్డిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఆధీనంలో ఉంది. వాహనంలో ఉన్న సిగరెట్ల విలువ ఎంత ? ఈ వాహనం వే బిల్లులు లేకుండా ఎక్కడికి వెళ్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలా వెళ్లాయా? అనే విషయాలపై ఆరా తీయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రపోతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవంటూ కాలయాపన చేశారు. సోమవారం నిపుణులను పిలిపించి డీసీఎంలోని సిగరెట్ల విలువ ఎంతో నిర్ణయిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ చెక్పోస్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా సరిహద్దు దాటుతున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్పోస్టువద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఖజానాకు ‘సుగంధ’ నామం
భారీగా సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా పెద్ద ఎత్తున పన్నుల ఎగవేత చర్యలు మరిచిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థ కోసం సిఫార్సు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇందుకోసం స్మగ్లర్లు అడ్డదారులు తొక్కుతూ ఖజానాకు ‘సుగంధ’నామం పెడుతున్నారు. ఫలితంగా వాణిజ్య పన్నుల శాఖకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. దీనిపై ఆలస్యంగా మేల్కొన్న వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థ కోసం సిఫార్సు చేసి ఊరుకున్నారు. కానీ, కఠిన చర్యలకు వెనకాడుతున్నారు. అక్రమ రవాణా తీరు.. యాలకులు, లవంగాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. నిబంధనల ప్రకారం వీటిని దిగుమతి చేసుకోవాలంటే వ్యాపారులు పెద్దమొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారు దొంగదారులను ఆశ్రయిస్తున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండుతాయి. నిఘా లోపించడంతో.. అక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలను రాష్ట్రంలోని తూర్పుగోదావరి, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి గిరిజన గ్రామాల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్రంలో పండిన పంట కూడా ఇలానే వెళుతోంది. వాణిజ్య పన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సంయుక్త పర్యవేక్షణలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 60 అడ్డదారుల్లో ఇవి రవాణా అవుతున్నాయని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అడ్డదారులతోపాటు.. పర్మిట్ ఉండి చెక్పోస్టుల ద్వారా వెళ్లే లారీల్లోనూ దొంగచాటుగా పంపుతున్నట్లు తేలింది. కిలో లవంగాలను రూ. 950 నుంచి రూ. 1250లకు కొనుగోలు చేస్తున్న దళారులు.. రూ. 4వేలకుపైనే అమ్ముకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో లారీలో 15 టన్నుల వరకూ సుగంధ ద్రవ్యాలు రవాణా అవుతున్నాయి. సరైన మార్గంలో వెళ్తే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూపాయి పన్ను చెల్లించకుండా అడ్డదారుల్లో రోజూ 10లారీల వరకు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయని అధికారుల అంచనా. అలా ఏటా రూ. 15 కోట్లకుపైనే పన్ను ఆదాయానికి గండిపడుతోంది. తమ శాఖ ఇప్పటి వరకూ చెక్పోస్టుల వద్దే నిఘా ఉంచిందని, గిరిజన గ్రామాల్లో, మారుమూల మార్గాల్లో నిఘాకు తగిన వ్యవస్థ లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంటున్నారు. అయితే, స్థానికంగా రాజకీయ ఒత్తిడులు, క్షేత్రస్థాయి అధికారులు భారీగా ముడుపులు అందుకోవడం అక్రమార్కులకు దారిచూపుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
ఆదాయానికి ‘సెగ’
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వానికి కామధేనువు అయిన వాణిజ్య పన్నుల వసూళ్లు నగరంలో చాలావరకు తగ్గుముఖం పట్టాయి. సీమాంధ్ర సెగతో వ్యాపార,వాణిజ్యరంగాల టర్నోవర్ బాగా తగ్గిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. గత రెండునెలలుగా వివిధ పన్నుల వసూళ్లు తగ్గడంతో ఉన్నతాధికారులు కలవరపడుతున్నారు. వాణిజ్యపన్నులశాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ నగర రాబడియే అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74శాతం వరకు ఇక్కడినుంచే జమవుతోంది. వాణిజ్య పన్నులశాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువఆధారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవేకాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంతవరకు ఆదాయం వస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా,మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు సమకూరుతోంది. తాజా పరిణామాలతో వ్యాట్తోపాటు వివిధ పన్నుల వసూళ్లు క్షీణించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఈనెల మొత్తం లక్ష్యంలో ఇప్పటివరకు కనీసం 40శాతం కూడా వసూలు కాకపోవడం పరిస్థితికి నిదర్శనం. గ్రేటరే పెద్ద అన్న : గ్రేటర్ హైదరాబాద్ వాణిజ్య పన్నులశాఖకు కల్పతరువు లాంటిది. ఇక్కడినుంచే అధిక రాబడి వసూలవుతోంది. రాష్ట్రం మొత్తం 25 డివిజన్లలో కలిపి వివిధ పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సమకూరిన ఆదాయం రూ.8706.32 కోట్ల కాగా, అందులో కేవలం గ్రేటర్లోని ఏడు డివిజన్ల రాబడి మొత్తం రూ.5214.47 కోట్ల వరకు ఉంటుంది. అంటే సగానికన్నా ఎక్కువన్నమాట. అందులో సైతం అత్యధికంగా పంజగుట్ట డివిజన్ నుంచి రూ.1125.74 కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత అబిడ్స్ డివిజన్ నుంచి రూ.932.12 కోట్లు, బేగంపేట డివిజన్ నుంచి రూ.902.36కోట్ల వరకు రాబడి లభించింది. ప్రధాన ంగా వివిధ వ్యాపార,వాణిజ్య సంస్థలు, కంపెనీల నుంచి వ్యాట్,అమ్మకం తదితర పన్నులు వసూళ్లవుతాయి.పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోలు,డీజిల్, వంటగ్యాస్, సీఎన్జీ తదితర వాటిపై అధిక పన్నులు వసూలవుతాయి. ప్రధానంగా రాజధానిలో పెట్రోలియం కంపెనీల కార్యాలయాలు ఉన్నకారణంగా వ్యాట్ను ఇక్కడే చెల్లిస్తారు. మొత్తం వ్యాట్ రాబడిలో కేవలం పెట్రోలుపైనే సుమారు 27శాతం వరకు ఉంటుంది. అలాగే మద్యం వినియోగం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ కేవలం హైదరాబాద్లోనే మొత్తం వ్యాట్ వసూలవుతోంది. రాష్ట్ర బ్రేవరేజ్ కార్పొరేషన్ మద్యం విక్రయాలకు అనుగుణంగా నగరంలోనే వ్యాట్ చెల్లిస్తుంది.