critisize
-
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ డేంజర్: ప్రధాని మోదీ
వరంగల్: వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రకాళీ మహత్యం, సమ్మక్క సారక్క , రాణి రుద్రమ పౌరషం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేయాలని అన్నారు. కుటుంబాన్నిపెంచి పోషించుకోవడమే ఇరుపార్టీల పని అని ఆరోపించారు. కుటుంబ శ్రేయస్సు కోసమే కేసీఆర్ పరితపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. 'అవినీతే వారి ధ్యేయం..' కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆరోపించిన ప్రధాని.. ప్రాజెక్టుల్లో ప్రతీది అవినీతి మయమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవినీతి దేశమంతా.. కేసీఆర్ అవినీతి రాష్ట్రమంతా తెలుసని అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరమని అన్నారు. అవినీతి లేని ప్రాజెక్టు ఏదైనా ఉందా? అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిపై దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. 'అది ట్రైలర్ మాత్రమే..' మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ మాత్రమే చూపించిందని చెప్పిన ప్రధాని మోదీ.. సభకు హాజరైన జనాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాషాయ విజయం ఖాయమనిపిస్తోందని అన్నారు. కేంద్రాన్ని తిట్టడమే బీఆర్ఎస్కు తెలిసిన పని అని అన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది నాలుగే పనులని ఎద్దేవా చేశారు. 'నిరుద్యోగులకు మోసం..' ఉద్యోగాలిస్తామని యువతను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మోదీ అన్నారు. టీఎస్పీఎస్సీ స్కాంలతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో 12 యూనివర్శిటీల్లో విద్యార్థుల భవిష్యత్లో ఆందోళన నెలకొందని అన్నారు. వేలాది ఉద్యోగ ఖాలీలను నింపకుండా కేసీఆర్ తమాషా చూస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ బృతి ఇవ్వలేదని అన్నారు. నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన.. వరంగల్లో నేడు నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ. తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్కు మోదీ శంకుస్థాపన చేశారు. ఇదీ చదవండి: రూ.6 వేల కోట్లతో నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన -
‘హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’
సాక్షి, అనంతపురం: నారా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా కుట్రను దీటుగా ఎదర్కొవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు. ఈ మేరకు ఆయన అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..‘ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాయకత్వంలో 98 శాతం హామీలు అమలు చేయడం చారిత్రాత్మకం అని ప్రశంసించారు. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేశారా? అని నిలదీశారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ అవశాన దశలో ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఒక కల అని ఎద్దేవా చేశారు. అంతేగాదు చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేకపోగా, వాళ్లను వంచనకు గురిచేశారంటూ ఆరోపణలు చేశారు. ఐతే బీసీ సామాజిక వర్గానికి చెందిన 80 వేల మందికి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని నొక్కి చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ... జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుక మనమంతా గర్వపడాలన్నారు. ఈ మేరకు అనంతలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉష శ్రీ చరణ్ తదితరలు పాల్గొన్నారు. (చదవండి: 'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ') -
FIFA World Cup 2022: ఖతర్ను పొగుడుతూ ట్వీట్.. రిషి సునాక్పై విమర్శలు!
లండన్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో మ్యాచ్లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్లో సెనెగల్తో ఇంగ్లాండ్ మ్యాచ్కు ముందు ఫిఫా ప్రపంచకప్ను నిర్వహిస్తున్న ఖతర్ను పొగుడుతూ ట్వీట్ చేశారు రిషి సునాక్. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్ను నిర్వహించినందుకు ఖతార్కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్ ఇంగ్లాండ్.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్పై ప్రశంసలు కురింపించారు. ఆయన ట్వీట్కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్ టైమ్ గ్రేట్స్? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్, సెనెగల్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ రిషి సునాక్, ఖతర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్ గత మ్యాచ్లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. డిసెంబర్ 11 డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. Hats off to Qatar for hosting an incredible World Cup so far. The group stages will be remembered as one of the all-time greats. Come on @England keep the dream alive 🦁🦁🦁#FIFAWorldCup #ENGSEN pic.twitter.com/YyLv9Y2VjZ — Rishi Sunak (@RishiSunak) December 4, 2022 ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో -
భారత్ మానవ హక్కుల రికార్డుపై.. యూఎన్ చీఫ్ సీరియస్
ముంబై: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు కురిపించారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ...ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగంలో భారత్ కర్భన ఉద్గారాలు తగ్గించే విషయం గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుంద? లేక విచ్ఛన్న చేస్తుందా? అని ప్రశ్నించారు. (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్
రాప్తాడురూరల్: పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి (చందు) సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న. ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్ బాషా, మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు. ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! ‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్ను ఎన్కౌంటర్ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్కు హితవు చెప్పారు. అనంతపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ లిటిగెంట్ భూములను కొనుగోలు చేస్తూ దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్ లేని సిమ్ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. (చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ) -
బిహార్లో బహిరంగంగా మద్యం సరఫరా... నితీష్ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్ పాశ్వాన్
బిహార్: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్, ఆర్సీపీ సింగ్ వంటి నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే నితీష్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ బిహార్లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు. అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. मुख्यमंत्री @NitishKumar जी! माना की आपकी दृष्टि अभी प्रधानमंत्री की कुर्सी पर ज्यादा है , लेकिन थोड़ा ध्यान इधर भी देते तो शायद बिहार में ये सब न हो रहा होता।देखिए कैसे खुलेआम दारू सप्लाई की जा रही है और आपकी पुलिस मूकदर्शक बन देख रही है। pic.twitter.com/IKTnFFoh5J — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2022 (చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్) -
దివంగత సింగర్ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు
Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని ఆయన అనేక భాషల్లో పాడి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేసింది. అయితే ప్రముఖ బెంగాలీ గాయకుడు, గేయ రచయిత రూపాంకర్ బగ్చీ మాత్రం 'ఎవరు ఈ కేకే, ప్రాంతీయ సింగర్లను ప్రోత్సహించాలి' అంటూ వీడియో రూపంలో తన అక్కసును వెళ్లగక్కిన విషయం విదితమే. ఆయన మాటలకు అనేక మంది నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. అయితే తాజాగా రూపాంకర్ ఈ విషయంపై కేకేకు అతని కుటుంబానికి క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ నిర్వహించి బహిరంగంగా క్షమాపణలు కోరాడు. తను పోస్ట్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేసినట్లు పేర్కొన్నాడు. 'కేకే కుటుంబానికి, నా వ్యాఖ్యలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను. కేకేతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన వారి కంటే దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన గాయకులకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తుందని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. చదవండి: కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? ఇంత విద్వేశానికి గురవుతారని ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్లు వస్తున్నాయి. అందుకే కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని ప్రెస్మీట్లో రూపాంకర్ బగ్చీ తెలిపాడు. -
అందుకే ప్రమోషన్స్కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు
చైన్నై సినిమా: ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్ ఘాటుగా విమర్శించారు. జీఎన్ఏ ఫిలిమ్స్ పతాకంపై జయరాజ్ ఆర్. వినాయక సునీల్ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్ మా'. షిజన్ లాల్ ఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్లో ఒక్క కేరవాన్ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు. -
మామ మెప్పు కోసం హరీశ్ ఆరాటం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్రావు మామ కేసీఆర్ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్కు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్కుమార్కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు..జీఎస్టీ ఎందుకు కట్టాలి: నటి
కంటికి కనిపించని కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటుంది. డబ్బులు ఉన్నా సరైన వైద్యం అందక ఎంతోమంది తమ ఆప్తులను పోగొట్టుకుంటున్నారు. కరోనా కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని అటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా కేంద్రం వైఖరిపై విమర్శలు గుప్పించారు. కోవిడ్ రోగులకు సకాలంలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించనప్పుడు ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పీఎంవో ఇండియా, అమిత్ షా సహా కొందరు కేంద్ర మంత్రలకు ట్యాగ్ చేశారు. ఇక కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ నటి మీరా చోప్రా బంధువులు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆమె తన ఇద్దరు కజిన్స్ను పోగొట్టుకున్నారు. అయితే వారు కోవిడ్ వల్ల చనిపోలేదని, సరైన వైద్యం అందక మరణించారని మీరా చోప్రా ఇటీవలె వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్ అందక మరొక కజిన్ చనిపోయారని పేర్కొంది. ఇద్దరూ దాదాపు 40 ఏళ్ల వయసు వారేనని, కానీ అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. I dont want to pay 18% gst when i cant get a bed in the hospital or an oxygen to breathe and live. #removeGST @AmitShah @FinMinIndia @ianuragthakur @PMOIndia @BJP4India — meera chopra (@MeerraChopra) May 15, 2021 చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్లు రాలేదు : మీరా చోప్రా ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా.. -
పవన్ కల్యాణ్పై తమిళ మీడియా సెటైర్లు
సాక్షి, చెన్నై: జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కల్యాణ్పై తమిళమీడియా సెటైర్లు విసిరింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై ఆయన అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు, గందరగోళ రాజకీయవాదిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని శుక్రవారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ మురసు’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వివరాలు యథాతథంగా..్ఙహైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, బీజేపీ ముఖ్యనేత కే లక్ష్మణన్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలుసుకున్న తరువాత తమ పార్టీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడం లేదు, బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేగాక తమ పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వ్యవహరించారు. (బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు) 2019 పార్లమెంటు ఎన్నికల్లో బహుజనసమాజ్ పార్టీ కూటమిలో చేరగా ఆ పార్టీ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. తరువాత కొద్ది నెలల్లోనే మాయావతి కూటమికి స్వస్తి పలికి ప్రస్తుతం బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో పవన్ను ‘గందరగోళ రాజకీయ నేత అని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు’ అని బాక్స్ కట్టి మరీ కథనాన్ని ప్రచురించింది. -
ప్రాణహిత ప్రాణం తీసిన కేసీఆర్
కౌటాల: ప్రాణహిత ప్రాజెక్ట్ను నిర్మించకుండా ప్రాణం తీసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్పై అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ప్రాణహిత పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధర్యంలో పిండప్రదానం చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కౌటాల మండల కేంద్రంలోని ఆరే సంక్షేమ సంఘం భవనంలో అఖిలపక్ష ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మించి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలలో ఐదు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. గుండా మల్లేష్ మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మించవద్దని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి మహనీయుడిని అవమానించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారు : నైనాల గోవర్ధన్ సీఎం కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారని తెలంగాణ జలసాధన సమితి రాష్ట్ర నాయకుడు నైనాల గోవర్దన్ అన్నారు. కేసీఆర్ తన సొంత జిల్లా అభివృద్ధి కోసం లక్ష కోట్ల నిధులతో కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారన్నారు. ప్రాణహితను తుంగలో తొక్కిన కేసీఆర్ : కేవీ ప్రతాప్ ప్రాణహిత ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దానిని తుంగలో తొక్కారని ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీ. ప్రతాప్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నాలుగేళ్లలో తట్టెడు మట్టి తీయలేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ను వెంటనే నిర్మించి ఐదు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టిన సర్కారు : పాల్వాయి హరీశ్బాబు ప్రాణహిత ప్రాజెక్ట్ను నిర్మించకుండా రైతుల నోట్లో మట్టికొట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని నియోజకవర్గ నాయకులు పాల్వా యి హరీష్బాబు అన్నారు. కాలువలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించారన్నారు. అనంతరం ప్రాజెక్ట్ను వెంటనే నిర్మించాలని ఆయా సంఘాల నాయకులు ప్రతిజ్ణ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు టీ.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎండీ.చాంద్పాషా, జిల్లా నాయకులు మేకల రామన్న, ఎ.లాల్కుమార్, అంబాల ఓదెలు, మండల నాయకులు బండి రాజేందర్గౌడ్, దుర్గం మోతిరాం, విఠల్, బావూజీ, శ్రీనివాస్, ప్రశాంత్, తిరుపతిరావు, తిరుపతి, చందు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిలో ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తున్న అఖిలపక్ష నాయకులు -
మైనార్టీల అభివృద్ధి జగన్తోనే సాధ్యం
బద్వేలు అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అదే స్థాయిలో మైనార్టీల అభివృద్ధి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 9,10,11,12 వార్డుల్లోని 100 మైనార్టీ కుటుంబాలు సరిటాల మౌలాలి, నజీర్, మన్సూర్ ఆధ్వర్యంలో శనివారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా స్థానిక మహబూబ్నగర్లోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ మైనార్టీలకు పెద్ద పీట వేశారని, వారి ఇబ్బందులను కళ్లారా చూసి వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. అప్పట్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాజశేఖర్రెడ్డి భావించినా.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని పేర్కొన్నారు. నేడు మైనార్టీలపై కపటప్రేమ చూపిస్తూ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కే సురేష్బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీ శాఖకు వేరే వర్గాల వారిని మంత్రిగా పెట్టి మైనార్టీలపై తనకున్న వివక్షతను చూపారని విమర్శించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి పాలన అందిస్తారని తెలిపారు. ఇందుకోసం మైనార్టీలు జగన్కు అండగా నిలవాలని కోరారు. అనంతరం పార్టీలో చేరుతున్న వారికి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ కన్వీనర్ కరీముల్లా, బ్రాహ్మణపల్లె, బీ కోడూరు సింగిల్విండో అధ్యక్షులు జీ సుందర్రామిరెడ్డి, ఓ ప్రభాకర్రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ బీ మునెయ్య, 6వ వార్డు కౌన్సిలర్ గోపాలస్వామి, అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి, వేమలూరు సర్పంచు ప్రభాకర్రెడ్డి, మున్సిపాలిటీ నాయకులు వాకమళ్ల రాజగోపాల్రెడ్డి, యద్దారెడ్డి, సింగసాని శివయ్య, చెన్నకృష్ణారెడ్డి, మల్లేష్, నాగేశ్వర్రావు, మురళి, కుప్పాల శ్రీరాములు, చెన్నయ్య, మల్లికార్జునరెడ్డి, సాంబశివారెడ్డి, హుస్సేన్, బాబు, ముంతాజ్, షరీఫ్, అల్తాఫ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి మాటలు నీటి మూటలేనా..?
బోయినపల్లి: మండలంలోని విలాసాగర్ గ్రామం లో మే 15న నిర్వహించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో విలాసాగర్ చెరువు నింపే పనుల శంఖుస్థాపన చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు నీళ్ల మూటలటు అయ్యాయని నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడిపల్లి సత్యం ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో సాగు, తాగునీటి వనరులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విలాసాగర్ సభలో విలాసాగర్ చెరువు నింపాలని మంత్రి ఎదుట పెద్ద మొత్తంలో ప్రజలు, యువకులు నిరసనలు తెలపడంతో తానే వచ్చి శంఖుస్థాపన చేస్తానని మంత్రి అన్నారని గుర్తు చేశారు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ప్రగతి లేదన్నారు. ఎల్లంపల్లి నీటితో బోయినపల్లి, తడగొండ, అనంతపల్లి గ్రామాల చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాగునీటి సాధన ఉధ్యమం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంబ లక్ష్మిరాజం, జాగీరు శోభన్గౌడ్, ఎండీ.బాబు, రాజుకుమార్, గంగిపెల్లి లచ్చయ్య పాల్గొన్నారు. -
ప్రధాన మంత్రి రైతు పక్షపాతి
ఆత్మకూరురూరల్/వెలుగోడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని శ్రీశైలం నియోజకవర్గ బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల వెలుగోడు, ఆత్మకూరు పట్టణాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ని రైతన్నల ఆదాయం మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రధానంగా వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ.200 పెంచుతున్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజా పాలనను మరిచి పూర్తిగా అవినీతి మయమైన టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని విమర్శించా రు. రైతు వ్యతిరేక టీడీపీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. నీరు – చెట్టు కార్యక్రమం శ్రీశైలం ఎమ్మెల్యేకు కల్పతరువుగా మారింద న్నారు. మంజూరైన నిధుల్లో 90 శాతం స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ ఎప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారులే ఉంటారని, ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా పేరుతో మొసలి కన్నీరుకారుస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతున్న తమ పార్టీ నాయకులు దాడులు చేయించడం దారుణ మన్నారు. వరికి మద్దతు ధర ప్రకటించడం పట్ల వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్లో, ఆత్మకూరు గౌడ్ సెంటర్ బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లె కృష్ణారెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, విశ్వరూపాచారి, విశ్వనాథం, మౌళీ, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, చండ్ర వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణ్ణ, ప్రతాప్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
నిజాంను మరిపిస్తున్న కేసీఆర్
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్(పెద్దపల్లి): తెలంగాణలో టీఆర్ఎస్ పాలన నిజాం పాలనను మరిపిస్తోందని , సీఎం కేసీఆర్ ఫాం హౌస్ నుంచి చేస్తున్న రాష్ట్రాన్ని పాలిస్తు అప్పులపాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర బుధవారం పెద్దపల్లి, సుల్తానాబాద్, గర్రెపెల్లిమీదుగా కరీంనగర్కు వెళ్లింది. పెద్దపల్లి శాంతినగర్లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి పార్టీ శ్రేణులు చేపట్టిన బైక్ర్యాలీ బస్టాండ్, ప్రగతినగర్, అమర్నగర్, శివాలయం, మెయిన్రోడ్, జెండా చౌరస్తా, కమాన్ల మీదుగా సాగింది. బస్సుయాత్ర శివాలయం ప్రాంతానికి చేరగా అక్కడ పలువురికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. పట్టణ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఠాకూర్రాంసింగ్, పుట్టమొండయ్య తదితరులు లక్ష్మణ్ను సన్మానించారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఫహీం లక్ష్మణ్ చేతికి రక్ష కట్టారు. జెండా కూడలిలో మత్స్యకారులు చేపలు బహూకరించారు. బస్సుయాత్ర పెద్దపల్లికి చేరినా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బస్సు పైకి పిలిచేదాకా ఎక్కకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి బస్సుపైకి రావాలంటూ పదేపదే కోరారు. అయితే ఇదే బస్సుపై ఈ నియోజకవర్గానికే చెందిన దుగ్యాల ప్రదీప్కుమార్ ఉండడంతో అలకబూనారని పలువురు చర్చించుకుంటున్నారు. అంతకు ముందే దుగ్యాల ప్రదీప్రావు మద్దతుదారులు బస్సుపై ఉన్న లక్ష్మణ్కు గొంగడితో సత్కరించారు. సుల్తానాబాద్లో రోడ్షోను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలతో గారడి చేస్తున్నారే తప్ప ఆచరణలో శూన్యమని అన్నారు. కాళేశ్వరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్లతో కాంట్రాక్టర్లు లాభపడుతున్నారని అందులో నుంచి పర్సెంటేజిలతో టీఆర్ఎస్ నాయకులు లాభపడుతున్నారని ఆరోపించారు. నేరెళ్ల దళితుల చిత్ర హింసలు నేటికి మర్చిపోలేమని అన్నారు. గడిల రాజ్యాన్ని కూలదోసి గరీబోళ్ల రాజ్యం తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మజ్లీస్ పార్టీని టీఆర్ఎస్ పెంచి పోషిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, బోర్ బావులు ఉచితంగా వేయించడం, అప్పుల మీద వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితులను మఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ నేడు రాజభోగాలను అనుభవిస్తూ ఎన్నికల హామీలైన డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నాణ్యమైన విద్య, ఎక్కడ అమలు అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, మాజీ అధ్యక్షుడు అర్జున్రావు, సంజీవరెడ్డి, కోట రాంరెడ్డి, కొమ్ము తిరుపతియాదవ్, కేశవరావు, కరుణాకర్, రాజేంద్ర ప్రసాద్, మహేందర్, నారాయణ, శైలేందర్, శ్రీనివాస్ రెడ్డి, పిన్నింటి రాజు, కోట నాగేశ్వర్, బాపు, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో అపశ్రుతి బీజేపీ మండల మాజీ కార్యదర్శి వేగోళం శ్రీనివాస్గౌడ్ బైక్ ర్యాలీలో సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో వెనుక నుంచి మరో వాహనం ఢీకొనడంతో బైక్ బోల్తాపడింది. దీంతో శ్రీనివాస్ గౌడ్ భుజానికి గాయమైంది. కార్యకర్తలు హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ నేతలను తరిమి కొడతాం: పవన్కల్యాణ్
పెందుర్తి: విశాఖ జిల్లాలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను తరిమికొట్టాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. పెందుర్తిని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అండతో అతడి కుమారుడు అప్పలనాయుడు దోపిడీ చేస్తున్నాడని.. అడిగిన వారిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు దోచుకోవడానికి లైసెన్సులు కాదన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పెందుర్తిలో పర్యటించిన పవన్కల్యాణ్ ముదపాక భూములను సందర్శించారు. అనంతరం ముదపాకలోనూ, పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన సభల్లో ప్రసంగిస్తూ టీడీపీ పాలనను ఎండగట్టారు. ప్రజాసమస్యలు పట్టని టీడీపీకి మళ్లీ అధికారమిస్తే ఉత్తరాంధ్రను సమూలంగా అమ్మేస్తారని ధ్వజమెత్తారు. కాలుష్యం నిండిన పరిశ్రమలను ఇక్కడపెట్టి కనీసం గాలి కూడా పీల్చుకోనీయకుండా చేసేస్తారని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడు దోపిడీలకు పాల్పడుతూ తనకు అడ్డుచెప్పిన వారిని భయబ్రాంతులకు గురి చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే, అతడి కుమారుడు తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముదపాక భూముల దోపిడీ వ్యవహారంలో వీరికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. తాడి గ్రామం తరలింపులో జాప్యం, హిందుజా, ఎన్టీపీసీ తదితర కంపెనీల్లో అక్రమ నియామకాల్లో వీరి పాత్ర ఉందని ఆరోపించారు. పరవాడ ప్రాంతంలోని ఫార్మా, ఇతర కంపెనీల్లో స్థానికులకు/అర్హులకు కాకుండా టీడీపీ నాయకులు సిఫార్సు చేస్తున్న వారికే ఉపాధి లభించడం ఏంటని ప్రశ్నించారు. సింహాచలం భూ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే ఈ నాలుగేళ్లలో చూపిన చొరవ ఏంటో ప్రజలకు తెలియజేయాలని అడిగారు. లంకెలపాలెం అండర్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం నాలుగేళ్లగా చొరవ చూపని ఎంపీ అవంతి శ్రీనివాస్ రైల్వేజోన్ కోసం దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో టీడీపీ నాయకులు ప్రజలకు మంచి చేస్తారని తాను గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే వారంతా ఏకమై జనాన్ని పీడించుకుతింటున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. తాను పదవులకు ఆశించే వ్యక్తిని కాదని ప్రజాసమస్యల గురించి పోరాటం చేసేందుకే పార్టీని స్థాపించానని వివరించారు. పెందుర్తిలో తన పర్యటన అడ్డుకునేందుకు టీడీపీ చేసిన కుట్రలు సిగ్గుచేటని.. అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీయించిన టీడీపీ నాయకుల తీరు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు ప్రజల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. పవన్కల్యాణ్ ప్రసంగం ముగింపు సమయంలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటి కల్లు తీయలేవు’ పాటతో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ముదపాకలో భూ బాధితులతో జరగాల్సిన ముఖాముఖి కార్యక్రమం అభిమానుల కారణంగా రసాబాసగా మారడంతో గందరగోళం మధ్యలో పవన్ కాసేపు ప్రసంగించి ముగించేశారు. -
కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
మంచిర్యాలక్రైం: ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి అవిర్భవించిందని జిల్లా కన్వీనర్ మందల శ్యాంసుందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేస్తే రాలేదన్నారు. రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థ సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకతాటిపై తెచ్చి ఉద్యమం నడపడం ద్వారానే రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అనేక మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థుల ఆశయాలను, ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్నిన హామీలను మరిచి స్వార్థపూరితమైన పథకాలను అమలు చేస్తూ తమ ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు కలలు గన్న రాష్ట్రం ఇది కాదన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు మలిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ జన సమితి నిర్మాణంలో భాగంగానే జిల్లా విద్యార్థి విభాగం అడ్హక్ కమిటీని నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ విద్యను నీరుగార్చే కుట్రకు పూనుకున్నాడన్నారు 4800 పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని అరోపించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం జిల్లా అడ్హక్ కమిటీని, మందమర్రి పట్టణ కన్వీనర్ను నియమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం వెంకటేష్, జిల్లా సలహాదారు బాబన్న, జిల్లా కో కన్వీనర్ ఒడ్డెపల్లి మనోహర్, దుర్గం నరేష్, గోపాల్, క్యాతం రవికుమార్, ఎర్రబెల్లి రాజేష్, కుర్సింగ వెంకటేష్, రవికుమార్, కనకరాజు పాల్గొన్నారు. టీజేఎస్వీ అడ్హక్ కమిటీ తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అడ్హక్ కమిటీని నియమించారు. కన్వీనర్గా చిప్పకుర్తి శ్రీనివాస్, కో కన్వీనర్లుగా పూరెల్ల నితిన్, గొడిసెల సురేందర్, సభ్యులుగా మామిడాల అరుణ్, ఆవునూరి ప్రసాద్, చిలుక శ్రావణ్, జక్కె ప్రశాంత్, భూక్య కిరణ్కుమార్, రమేష్, రామగిరి సాగర్లను నియమించారు. టీజేఎస్ మందమర్రి పట్టణ కన్వీనర్గా బండారి రవికుమార్ను నియమించారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
మంచిర్యాలసిటీ: తెలంగాణ రాష్ట్రంలో నచ్చిన వారికి నజరానాలు, నచ్చని వారికి జరిమానాలు విధించే విధంగా తుగ్లక్ పాలన నడుస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ చేపట్టిన మార్పు కోసం జన చైతన్య యాత్ర మంగళవారం మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్బీహెచ్వీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్కు ఎన్నికల తర్వాత అది నచ్చలేదన్నారు. అందుకే ఆయనే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడని విమర్శించారు. తన కుటుంబసభ్యులకు మరో నాలుగు పదవులు కట్టబెట్టారని, అంతా ఆ నలుగురిదే రాజ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. అందులో 12వేల పోస్టులు పోలీసు ఉద్యోగాలేనని పేర్కొన్నారు. కేసీఆర్ పరిపాలనతో నిరుద్యోగులు, రైతులు, యువత తిరగబడితే వారి గొంతు నొక్కడానికి, హక్కులను కాలరాయడానికే పోలీసు ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు, వారి కుటుంబాలు వీధినపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగం అనే పదం ఉండదని ప్రకటించిన కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎందుకు రెగ్యులర్ చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగుపడుతారని అన్నారు. కానీ ఆ వర్గాలు బాగుపడడం కేసీఆర్కు ఇష్టం లేదన్నారు. 40 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి దొరికేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఎకరాలు మాత్రమే పంచితే మిగతా దళిత కుటుంబాలు ఎలా బతకాలని నిలదీశారు. డ్రైవరు కొడుకైనా, మంత్రి కొడుకైనా ప్రభుత్వ బడిలోనే చదవాలని, అందుకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ మనవడు ఏ బడిలో చదువుతున్నాడో, డ్రైవర్ బాలయ్య కొడుకు ఏ బడిలో చదువుతున్నాడో చెప్పాలని సవాల్ విసిరారు. కమీషన్ల కోసమే సాగునీరు, తాగునీరు పేరిట మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఊరికో బెల్టుషాపు పెట్టించి వచ్చిన ఆదాయంతో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని గొప్పగా కేసీఆర్ చెప్పుకుంటున్నాడని దుయ్యబట్టారు. బొందలగడ్డగా సింగరేణి.. సింగరేణిలో ఓపెన్ కాస్ట్లు ఉండవని ఉద్యమంలో ప్రకటించిన కేసీఆర్ నేడు కొత్తగా 11 గనుల ప్రారంభానికి అనుమతించారన్నారు. తద్వారా సింగరేణి ప్రాంతాలను బొందల గడ్డగా మార్చనున్నారని ధ్వజమెత్తారు. చెన్నూర్లో భూగర్భ గనుల నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ప్రారంబించడం లేదన్నారు. అక్కడ భూగర్భ గనులు ప్రారంభిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందన్నారు. సర్వ రోగాల నివారణకు జిందా తిలస్మాత్ అన్నుట్టుగా రైతు సమస్యలు పరిష్కరించకుండా రైతుబంధు పథకంతో మోసపుచ్చుతున్నాడని విమర్శించారు. కౌలురైతులను అపహాస్యం చేస్తున్న కేసీఆర్కు వారి గోస తగులుతుందన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న అడవిబిడ్దలను ఎందుకు గుర్తించడం లేదన్నారు. వారు తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. రేషన్ డీలర్లకు కేంద్రం ఇచ్చే కమీషన్ ఇస్తే వారు ఈ రోజు సమ్మెలోకి వెళ్లే వారు కాదన్నారు. సాక్షర్ భారత్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వారిని ఇబ్బందుల పాలుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పెరుగన్నం తినే రైతు తెలంగాణ ఏర్పడ్డాక పురుగుల మందు తాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సచివాలయానికే రాని వ్యక్తి దేశ రాజకీయాలను ఏలుతానంటే ఎవరైనా కేసీఆర్ను నమ్ముతారా అని ప్రశ్నించారు. నిధులిచ్చినా నిందలు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారాం మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని బద్నాం చేస్తున్న కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నేషనల్ హైవే, రైలుమార్గాలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వంటి వాటికి తమ ప్రభుత్వం వేలకోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కేసీఆర్ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని అవమానిస్తున్నాడని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్రావు మంచిర్యాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు. -
ప్రశ్నోత్తరాల సమయం లేదా?
సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు. ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు. అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు. అనుచరులకు ప్రవేశం బంద్ విధాన పరిషత్తు సభ్యుల గన్మెన్లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు. -
టీడీపీని ప్రజలు నమ్మరు
హాలహర్వి: గత ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఈసారి ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు విరక్తి పుట్టిందన్నారు. మంగళవారం సిద్ధాపురం, గూళ్యం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిని పూర్తిగా మరిచారన్నారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేస్తామని 2016లో ప్రకటించిన బాబు ఇంతవరకు పైసా మంజూరు చేయలేదన్నారు. ఇప్పటి వరకు సర్వే పనులు కూడా జరగలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సొంత నిధులతోనే సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం పోరాటం చేసి హంద్రీనీవా నుంచి కేసీ కెనాల్కు సాగునీరు అందించానన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ కడపలో చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందుకు లేనిపోని దీక్షలు, హామీలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా కాలువకు తూం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షలు ఒట్టి నాటకమేనని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా తూముల ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అనంతరం సిద్ధాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
‘పవన్ మీరు సినిమాల్లో మాత్రమే నటించాలి’
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై పవన్ అసత్యా ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. ‘మీరు రాజకీయాల్లోకి కొత్తగా ఏమీ రాలేదు. మీ అన్న పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసు’ అని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీని మీరు ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. పవన్ కేవలం బీజేపీ స్క్రిప్ట్నే ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం విషయంలో పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా విశాఖలోనే ఉండి ఎందుకు రైల్వే జోన్ గురించి పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మీరు సినిమాలో మాత్రమే నటించాలి కానీ రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. -
ఇంకో 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మడిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాసవి క్లబ్ను ఏర్పాటు చేసింది కేసీ గుప్తా అని కేసీ అంటే కల్వకుంట్ల చంద్రశేర్ గుప్తా అని గుప్తాకు మాకు ఎక్కడో దగ్గరి సంబంధం ఉందని అన్నారు. యాద్రాద్రి, హైదరాబాద్ లో చారిటబుల్ హాస్పిటల్ స్థలం కోసం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో కలిసి సీఎంను ఒప్పిస్తామన్నారు. కేసీఆర్ అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతున్న కాంగ్రెస్ నేతలు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నపుడు అభివృద్ది చేసి వుంటే ఇంకా మన దేశంలో వేల గ్రామాలకు ఇప్పటికి కరెంట్ దిక్కు లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణలకు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీయే అని ఎద్ధేవ చేశారు. తెలంగాణ అమ్మ ఇచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళు చెబితే ఎవరు ఇవ్వలేదు.. మేమే గుంజుకున్నం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పోయిన ఎన్నికల్లో ప్రజలు వాళ్ళను ఓడించారు. జనాలను చైతన్యం చేస్తారట బిజేపి వాళ్ళు. ఇప్పటికే ప్రజలు చైతన్యంగ ఉన్నారని, ఈ సారి కూడా వారి వీపులు పగలగొడతారిని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ కోటి ఏకరాల మాగాణి అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికీ నీలిచ్చిడు పక్కా.. కాంగ్రెస్ వాళ్ళ కిందకు నీళ్ళు తెచ్చుడు కూడా పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇంకో 15 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్ ధీమ వ్యక్తం చేశారు. ఎన్నికల కాలం వచ్చిందంటే ఎక్కువగా గాలి మాటలు వినిపిస్తాయి. కొద్ది రోజులు ఉంటే నోటికి ఏది వేస్తే అది మాట్లాడే నాయకులు కూడా మీ దగ్గరి వస్తారు. అవసరం అయితే ఇంటికి తులం బంగారం కూడా ఇస్తారని చెప్పుతారు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాని ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చిందని కేటీఆర్ అన్నారు. -
సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలు పట్టవా? : జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించకపోవడం ఆయన చిత్తశుద్థకి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల సమస్యల గురించి అసలు పట్టించుకోక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. గొప్పలు చెప్పుకోవటానికే పరిమితమైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేయడం బాధకరమని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా లక్షల మందికి ఉపాధి కలిగే విషయాలను కూడా సీఎం మర్చిపోయారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వీటి గురించి మాట్లావకపోవడం దారుణమని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్ల పాలనలో అప్పుల వాటా రూ. 60వేల కోట్లు ఉండగా, టీఆర్ఎస్ పాలనలో అప్పుల వాటా రూ రెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటే నాలుగు ఏళ్లలోనే రూ. 150000 వేల కోట్లు పెరిగిందని జీవన్ రెడ్డి తెలిపారు. -
వైఎస్ చొరవతోనే పోలవరం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన చొరవే కారణమని ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ స్పష్టం చేశారు. రైల్వే న్యూకాలనీలోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యావరణ శాఖల నుంచి అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లను వత్తాసు పలికేందుకే అన్నట్టుగా వ్యయాన్ని పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తానంటే కమీషన్లు అందవేమోనని భయపడి ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.15 లక్షల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రానికి 24/7 కరెంట్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాజెక్టుల్లోనూ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. గృహనిర్మాణంలో చదరపు అడుగుకు కేవలం రూ.1200 ఖర్చుతో పూర్తి చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చినా.. కాంట్రాక్టర్ల ఒత్తిడికి లోనై నేడు చదరపు అడుగు దాదాపు రూ. 2500లను ముట్టచెబుతోందన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఉచితంగా ఇసుక అందించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. ఈ తప్పులన్నీ కేంద్రంపై మోపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సాయంపై ప్రజలకు వివరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ప్రారంభించిన సంపర్క్ అభియాన్ కార్యక్రమం త్వరలో విశాఖలో ప్రారంభమవుతుందన్నారు. అంతకుముందు కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ నాయకులు, వార్డు అధ్యక్షుడు పాల్గొన్నారు. -
22న హైదరాబాద్లో అమిత్ షా పర్యటన: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్లో పర్యటించనున్నారని టీబీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. జూన్ 7 నుంచి జులై 20 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటిస్తారని, చండీఘడ్లో ప్రారంభమైన అమిత్ షా యాత్ర ముంభైతో ముగుస్తుంది తెలిపారు. అందులో భాగంగానే షా ఈ నెల 22న హైదరాబాద్ వస్తున్నారని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా భావసారూప్యత లేని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపే లక్ష్యంగా షా ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటన సాగనుందన్నారు. ఈ సందర్భంగా వరంగల్లో నిన్న జరిగిన దళిత సింహ గర్జన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పాల్గొనడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సభ మొత్తం కాంగ్రెస్ కనుసన్నల్లోనే నడిచిందని ఆరోపించారు. దళితులు, గిరిజనులపై కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ దాడులు జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో కూడా దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎందుకు తప్పు పట్టడం లేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మోదీని అడ్డుకోవాలనే కుట్రతోనే ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. దళితుల అత్యాచారాల చట్టాలను నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ఎన్నడూ చేయలేదని వ్యాఖ్యానించారు. ఆనాడు రాష్ట్రపతిగా దళితులను కాంగ్రెస్ ఎన్నుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఎన్నుకోలేదని ప్రశ్నించారు. ఇన్ని ఏళ్ళుగా కాంగ్రెస్ దళితులను, గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ ప్రస్తావించారు. మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ తన తండ్రికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ను ప్రశ్నించాలి..కానీ బీజేపీని ప్రశ్నిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. -
వారితో రాజీనామా చేయించే దమ్ము సీఎంకు లేదు..
కొలిమిగుండ్ల : కాపులను బీసీలో, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని కులాల మధ్య సీఎం చంద్రబాబు చిచ్చుపెట్టారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. ఆదివారం అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు రూ. 87 వేల కోట్ల రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రూ. 13,500 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని రైతులను నిలువునా ముంచారన్నారు. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేయకుండా రూ.10వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామని యువతకు భరోసా కల్పించి..తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. దళితులకు ఏఒక్కరికైనా రెండెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎక్కడా చూసినా ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. హబ్లు ఏమయ్యాయి? సీఎంగా చంద్రబాబు నాయుడు మొదటి సారిగా జిల్లాకు వచ్చిన సమయంలో ప్రతి ప్రాంతాన్ని హబ్లుగా మార్చుతామని హామీ ఇచ్చారని.. ఇంత వరకు అతీగతీ లేదని చక్రపాణి రెడ్డి అన్నారు. బీజెపీతో నాలుగేళ్లు సంసారం చేసి, ప్రత్యేక హోదాతో ఏమి రాదని ప్రత్యేక ప్యాకేజి తీసుకొన్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రానికి ఇవ్వనంతగా కేంద్రం ఏపీకి ఇచ్చిందని అసెంబ్లీలో తీర్మానం చేసి స్వీట్లు పంచుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయం.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్పై ఉన్న దృష్టి రైతాంగాన్ని ఆదుకోవడంలో లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారన్నారు. తాను 91 రోజులకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే 15 రోజుల్లోనే ఆమోదించారని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరానని, వారి చేత రాజీనామా చేయించే దమ్ము సీఎంకు లేదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లగా బీజెపీని ఏమాత్రం ప్రశ్నించకుండా.. ఇప్పడు ధర్మపోరాటం పేరుతో అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు. మండలాధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, నాయకులు కేపీ రామ్మోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్రెడ్డి, అంబటి రామ్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
ఆదోని టౌన్ : అవినీతి అక్రమాల కేసుల్లో సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ప్రజలు వలయంగా నిలుస్తారని, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటున్న బాబు మాటలు వింటుంటే జైలుకు వెళ్లడం తథ్యమనే విషయం అర్థమవుతుందని చెప్పారు. ఆదివారం ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ నాయకులు ఈరన్న, గోవిందు ఆధ్వర్యంలో అన్వర్తో పాటు లక్ష్మన్న, ఈరన్న, రంగన్న, చిన్న నర్సన్న, పెద్ద ఉసేని, బసప్ప తదితరులు పార్టీ తీర్థం పుచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ ఎవరికీ భయపాడాల్సిన అవసరం లేదని, అండగా తామున్నామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తూ పేదల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకుల్లో వెలుగులు నింపడంతో నేటికీ ఆయనను స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. దోచుకో... దాచుకో నినాదంతో టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయలు దాచుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కుతోందని విమర్శించారు. పేదలను పరామర్శించిన ఎమ్మెల్యే సాయి గుడిసెల్లోకి వరద నీరు చేరడంతో రాత్రంతా జాగారణ చేసిన పేదలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరామర్శించారు. వర్షం మూలంగా నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో ఎనిమిది కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎం అవుతారని, పేదల కష్టాలన్నీ తొలగి పోతాయని భరోసా ఇచ్చారు. -
2019లో కేసీఆర్కి ఓటు వస్తే బీజేపీకి వేసినట్లే ?
సాక్షి, నల్గొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే థర్డ్ ఫ్రంట్ మొదలు పెట్టారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో కేసీఆర్కి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తాని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. ముస్లింలకు ఇళ్లు, స్థాలాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో 40 వేల మంది ముస్లింలు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రంజాన్ దుస్తులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దుస్తుల పేర్లతో ముస్లింలను మోసం చేస్తున్నారని కోమిటి రెడ్డి వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్పై నమ్మకంతోనే చేరికలు
మధిర : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతోనే పలు పార్టీల నుంచి వలసలు వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమా ర్క తెలిపారు. మండలంలోని వంగవీడులో టీడీపీకి చెందిన అయిలూరి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాల వారు భట్టి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సత్యనారాయణరెడ్డితో పాటు భూక్యా గోరియా, గుడిద నర్సింహా, ఓబుల వెంకటనర్సిరెడ్డి, బొగ్గుల ఉద్దండురెడ్డి, పలగాని లక్ష్మయ్య తదితరులు పార్టీలో చేరగా, భట్టి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వంగవీడు గ్రామాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేసిందన్నారు. సీసీరోడ్లు, ఇందిర మ్మ ఇళ్లు, సాగర్నీరు, జాలిముడి ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు వం టి అనేక అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నది టీఆర్ఎస్సేనని ఆరో పించారు. నియోజకవర్గ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అన్నదాతలకు నీరందించి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలంగా ఉంచడమే తన ధ్యేయమని తెలిపారు. గ్రామపంచాయతీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. డబుల్బెడ్రూం ఇళ్లను ఆశగా చూపి ప్రజలను కెసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు, అవినీతికి పరాకాష్టగా మారిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం భట్టిని ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, కృష్ణాపురం సర్పంచ్ కర్నాటి రామారావు, నాయకులు శీలం వెంకటరెడ్డి, దుంపా వెంకటేశ్వరరెడ్డి, అద్దం కి రవికుమార్, దారా బాలరాజు పాల్గొన్నారు. -
కేసీఆర్ది తుగ్లక్ పాలన
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ది తుగ్లక్ పాలన అని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విమర్శించారు. నగరంలోని 27వ డివిజన్లో కార్పొరేటర్ నాగండ్ల దీపక్చౌదరి ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేణుకాచౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుంటాయని, ఉద్యోగాలు వస్తాయ ని పలువురు ఆశించారని, కానీ రాష్ట్రంలో ఒక కుటుంబంలోనే వెలుగులు నిండాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికే పండగలా ఉందన్నారు. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, డబుల్బెడ్ రూం, ఇంటికో ఉద్యో గం, దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మనెంట్ వంటి హామీలన్నింటిని గాలికొదిలేశారని ఆరోపించారు. గతంలో కాం గ్రెస్ చేసిన అభివృద్ధినే తమదిగా టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లకు అదనంగా ఎక్కడైనా రోడ్లు వేశారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగండ్ల దీపక్చౌదరిని అభినందించారు. అనంతరం దీపక్చౌదరి మాట్లాడుతూ నగరంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అంతకముందు పార్టీ జెండా ను రేణుకాచౌదరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు దిరిశాల భద్రయ్య, ఎస్కె.పాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, కొత్తగూడెం జిల్లా నాయకుడు యడవల్లి కృష్ణ, సైదులు నాయక్, ఎస్కె.ఖాజా, మొహినుద్దీన్, పిడతల రామ్మూర్తి పాల్గొన్నారు. -
చంద్రబాబు బూటకపు మాటలు నమ్మి...
బెళుగుప్ప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 610 హామీలను ఇచ్చి గత నాలుగు సంవత్సరాల్లో పది హామీలను కూడా అమలు చేయలేదని, ప్రస్తుతం మరోసారి బూటకపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీరంగయ్యలు విమర్శించారు. శనివారం బెళుగుప్పలో పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే మరియు అనంతపురం సమన్వయకర్తలు ముఖ్య అథితుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయం వరకు రాష్ట్రానికి రూ. 90 వేల కోట్లు అప్పులు ఉండగా ప్రస్తుతం రూ.2.4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.50,000 పైగా అప్పులు మోపిందన్నారు. రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కేవలం రూ.14 వేల కోట్లు అది వడ్డీకి సరిపోయే విధంగా రుణమాఫీ చేసి రైతుకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు సకాలంలో రాకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లో పడేశారన్నారు. రుణమాఫీ చేయకుండా 6 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేశారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ పనుల్లో నాలుగేళ్లుగా గంప మట్టిని కూడా తీయని పాలకులు రూ.50 కోట్లతో పూర్తి అయ్యే 36వ ప్యాకేజీ పనులను ప్రస్తుతం రూ. 250 కోట్లకు పెంచుకుని రూ. 200 కోట్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లో టీడీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని తలారి పీడీ రంగయ్య అన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ కొనుగోలులో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడన్నారు. ఉమ్మడి రాజధానిలో దాదాపుగా 85 రోజుల పాటు హైదరాబాద్లో సెక్రటేరియట్కు సీఎం వెళ్లకుండా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీకి మొగ్గు చూపి అసెంబ్లీ తీర్మానం చేశాడన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో వ్యాపారులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సీఎం చంద్రబాబునాయుడు యుటర్న్గా తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠాన్ని చెప్పాలని పిలుపునిచ్చారు. బెళుగుప్ప : రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలిన టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పోరాడుదామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీ రంగయ్యలు పిలుపునిచ్చారు. శనివారం బెళుగుప్పలో శ్రీనివాస్ తోటలోని హాల్ నందు పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బూత్ కమిటీ సభ్యుల శిక్షణా కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్యలు ముఖ్య అథితులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, బెళుగుప్ప సింగిల్ విండో అధ్యక్షుడు శివలింగప్ప, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు, దుద్దేకుంట సర్పంచ్ ఎర్రిస్వామి, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోధమ్మ, నాయకులు మరియు బూత్ కమిటీల కన్వీనర్లు ఓబిరెడ్డి కేశవరెడ్డి, చౌదరి, అంగడి ఎర్రిస్వామి, నరిగన్న, తిమ్మారెడ్డి, మచ్చన్న, నరిగన్న, దొడగట్ట క్రిష్టప్ప, రమనేపల్లి రమేష్, శ్రీరంగాపురం శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్, మోహన్రెడ్డి, అంకంపల్లి శ్రీనివాసరెడ్డి, రుద్రానంద, గురుమూర్తిరెడ్డి, బాబురెడ్డి, పూలప్రసాద్, వినోద్, తిప్పేస్వామి, నరసింహ, బ్రహ్మయ్య, తిమ్మారెడ్డి, రమనేపల్లి రమేష్, హనుమంతురాయుడు, దొడగట్ట క్రిష్టప్ప, నరిగన్న అక్కులన్న,రమేష్, మల్లి, ధనుంజయ, నాగరాజు, తాతెప్ప, తగ్గుపర్తి క్రిష్ణ, గంగవరం రమేష్, రవి, వెంకటనరసు, కాలువపల్లి ఫకృద్దీన్, మదు, తిమ్మన్న, రాము, యలగలవంక తిమ్మారెడ్డి, లేపాక్షి, శీనప్ప, తిప్పేస్వామినాయక్, లక్ష్మానాయక్, రామునాయక్, తగ్గుపర్తి నరేంద్ర, హనిమరెడ్డిపల్లి గోపాల్, గోవిందు, ఆనంత్రెడ్డి పాల్గొన్నారు. -
బుట్టా రేణుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో
పెరవలి (మద్దికెర) : బుట్టా రేణుక తిన్నింటి వాసాలు లెక్కగట్టే రకమని వైస్సార్సీపీ నాయకులు, బసినేపల్లి నీటి సంఘం మాజీ అధ్యక్షడు భద్రయ్య, మాజీ సర్పంచ్ ప్రతాప్ విమర్శించారు. శనివారం వారు మాట్లాడుతూ ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న బుట్టా రేణకకు జగన్మోహన్రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే స్వార్థం కోసం పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీ పంచన చేరారని ఆరోపిస్తున్న రేణక.. ఏమి ఆశించి టీడీపీలో చేరారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విమర్శలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు చౌడప్ప, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఎమ్మెల్యేల చూపు మా వైపు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని చాలా మంది అసంతృప్త నేతలు తమ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. శనివారం బెంగళూరు మల్లేశ్వరంలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని, అయితే ఆ ఎమ్మెల్యేల పనితీరు, ప్రాధాన్యాన్ని బట్టి ఎవరెవరినీ పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై తమ పార్టీ జిల్లాల నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలని మేము భావించడం లేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం వరకు తన మనుగడను నిలపుకోగలదో నాకు తెలుసు. అప్పటివరకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషిస్తాం. ఎన్నికల్లో కేవలం కొద్ది సీట్లతో అధికారం కోల్పోయాం. ఈసారి చక్కగా పనిచేసి అధికారంలోకి వస్తాం. మేం అనుకుంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రాగలం. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా 2019 లోక్సభ ఎన్నికలపై ఉంది. మరోసారి మా నాయకుడు నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తాం’ అని యడ్డి తెలిపారు. కుమారకు పట్టం.. దారుణం స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి 37 స్థానాలు గెలిచిన ఒక పార్టీ నేత ముఖ్యమంత్రి కావడం విడ్డూరమని యడ్యూరప్ప విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దారుణం జరగడం ఒక్క కర్ణాటకకే చెల్లిందన్నారు. గతంలో 20–20 నెలల చొప్పున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి జేడీఎస్ చేసిన అన్యాయం కాంగ్రెస్ మరచిపోరాదని సూచించారు. మున్ముందు ఈ విషయంలో కాంగ్రెస్ పశ్చాత్తాపపడక తప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన సీఎం కుమారస్వామి ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత 15 రోజులుగా మంత్రి విస్తరణతో బిజీగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో కొద్ది సీట్లతో వెనుకంజలో పడ్డామని, వచ్చే ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రతాప్ సింహా, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయేంద్ర, ఎమ్మెల్యే అరవింద్ లింబావళి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ బెదిరింపులకు భయపడం
ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉ ద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరింపులకు పా ల్పడటం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కు నిదర్శమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్సు డి పోలో నిర్వహించిన గేటు ధర్నాకు ఆయన మద్ద తు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా క్రియాశీలకమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆ ర్ 46 రోజులపాటు కార్మికులతో సమ్మె చేయిం చి.. ఇప్పుడు సమ్మె చేస్తే సంస్థను మూసి వేస్తామనడంలో ఆంత్యరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టాలబాట పడుతుందని ఆరోపించారు. సంస్థలో పని చేసేది 52 వేల కార్మికుల కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజ ల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికుల తమ ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు సమ్మె నిర్వహించి తీరాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్ను గద్దె దింపేంది కార్మికులేనన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ ఇచ్చింది కేవలం రూ.508 కోట్లు మాత్రమేనని, సంస్థను వ్యాపార రంగంగా కాకుండా ప్రజల సంక్షేమ రంగంగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్, జేఏసీ నాయకులు ఐలయ్య, సత్యనారాయణ, ఎజాజ్, వసంత్, హన్మంతు, సుధాకర్ పాల్గొన్నారు. -
మేము వచ్చాక కేసీఆర్ జైలుకే?
ఆదిలాబాద్టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, ఆక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు టీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ల డం ఖాయమని శాసన మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్అలీ జోస్యం చెప్పారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని భార్గవ్దేశ్ పాండే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం టీఎన్జీవోస్ సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల భారం పడుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించుకున్నాడని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తానే నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం వారి సమ్మెను నిర్వీర్యం చేయడం సరి కాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జీ భార్గవ్దేశ్పాండే, నాయకులు హరినాయక్, అనిల్జాదవ్, సాజిద్ఖాన్, జ్యోతి, మునిగెలనర్సింగ్, మంగేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
నిర్మల్ : అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధిని అందించిన ఘనత కాంగ్రెస్దేనని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న కేసీఆర్ నాలుగేళ్లయినా ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మైనార్టీలను మోసగించిన టీఆర్ఎస్ పార్టీకి వారిని ఓట్లడిగే హక్కు లేదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, స్థానిక రియల్టర్ సయ్యద్ అర్జుమంద్అలీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు సీఎల్పీ, మండలి నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహేశ్వర్రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీఎం కేసీఆర్ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.ప్రధానంగా 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మైనార్టీలను మోసగించారన్నారు. రిజర్వేషన్ల అమలుకు ప్రధానమంత్రి ఒప్పుకున్నారని, త్వరలో ఇవ్వనున్నామని కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ముస్లింమైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. జనాభా ఆధారంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టీఆర్ఎస్కు మైనార్టీలను ఓట్లడిగే హక్కు లేదని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు పెరిగాయని, మైనార్టీలలో అభద్రతాభావం పెరిగిందన్నారు. చాలాచోట్ల మైనార్టీలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందముందని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, నోట్లరద్దు, జీఎస్టీ అంశాల్లో కేంద్రానికి మద్దతునివ్వడమే తప్పా ఒక్క ఆరోపణ కూడా టీఆర్ఎస్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలకు ఓట్లు వేస్తే వృథా అవుతాయని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తమ అధినేత రాహుల్గాంధీ నిర్మల్లో పాదయాత్ర చేశారని, ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు. ఒకపూట విందు కాదు.. జీవితాంతం భరోసా కావాలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధనంతో రాష్ట్రంలో 800 చోట్ల మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారని, ఇలాంటి ఒకపూట విందు ఇవ్వడం కాదని, జీవితాంతం ఉపయోగపడేలా ముస్లింమైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని షబ్బీర్అలీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో మైనార్టీలకు ప్రాధాన్యత తగ్గుతోందన్నారు. ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో తాను ఇఫ్తార్ విందు ఇవ్వనని చెప్పిన రాష్ట్రపతి కోవింద్ తన సంఘ్ మూలాల చాటుతూ తప్పించుకున్నారని అన్నారు. ఇందుకు తాము కూడా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ముస్లింలతో గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఐదెకరాల బంగ్లాలో ఉండే ఓవైసీలకు గరీబుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే అన్నివర్గాలకు సమన్యాయం చేస్తుందని చెప్పారు. అభద్రత, అసహనం పెరిగాయి.. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు మర్చిపోయాయని, వీళ్ల పాలనతో అభద్రత, అసహనం పెరిగాయని జానారెడ్డి అన్నారు. స్వతంత్రం కోసం పోరాడటంతో పాటు దేశాన్ని అభివృద్ధి చేసి, సామరస్యతను కాపాడుతున్న ఘనత ఒక్క కాంగ్రెస్దేనన్నారు. కేసీఆర్ రిజర్వేషన్లను ఇవ్వడం ఇక కల్లనేని, మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం స్థానిక ఆర్ఆర్ గార్డెన్లో రియల్టర్ అర్జుమంద్అలీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ముఫ్తీ ఖలీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్మాసం గొప్పతనం, అందులోని విశేషాలను షబ్బీర్ అలీ వివరించారు. అనంతరం సామూహికంగా ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందు ఆరగించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అరవింద్రెడ్డి, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా నాయకులు రామారావు పటేల్, భార్గవ్దేశ్పాండే, అనిల్జాదవ్, అజర్, హైదర్, రామలింగం, సత్యంచంద్రకాంత్, అయన్నగారి పోశెట్టి, జుట్టు దినేశ్, నాందేడపు చిన్ను, సంతోష్, సయ్యద్ అక్తర్, జునైద్ మెమన్, ఇమ్రానుద్దీన్, మోయిన్, అల్మాస్, ముత్యంరెడ్డి, బాపురెడ్డి, ఆయా జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
జనసేనకు కులాలు లేవు : పవన్ కల్యాణ్
పాడేరు : షెడ్యూల్ ప్రాంతాల్లోని గిరిజనులను ప్రభుత్వం మోసగిస్తోందని, గిరిజన ప్రాంతాలు దోపిడీకి గురవుతూ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. పాడేరులోని అంబేడ్కర్ సెంటర్లో గురువారం జనసేన ప్రజా పోరాట యాత్ర బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఇచ్ఛాపురం నుంచి ఇక్కడి వరకూ బాధకలిగించే సంఘటనలు చాలా చూశానని గిరిజన గ్రామాల్లో కనీస పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం లేకపోవడం దారుణమని అన్నారు. మన్యంలో వామపక్షాలతో కలిసి గిరిజన సమస్యలపై పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పవన్ హుకుంపేట మండలంలో కూడా పర్యటించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పట్టదా? మాడుగుల : ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం సీఎం చంద్రబాబుకు పట్టలేదని జనసేన అదినేత పవన్కల్యాణ్ అన్నారు. జనసేన పోరాట యాత్రలో బాగంగా గురువారం మధ్యాహ్నం మాడుగుల వచ్చిన ఆయన ఇక్కడి కూడలిలో మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించటంలో సీఎం విఫలమయ్యారని పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గంలో జల వనరులు పుష్కలంగా ఉన్నా సరే అసంపూర్తిగా జలాశయాలు ఉన్ననందున ఇక్కడ రైతులు వలసలు పోతున్నారన్నారు. జనసేనకు కులాలు లేవు నర్సీపట్నం : తాను తన సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు పలుకుతానని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం పట్టణంలోని అబీద్సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు తనపై చేసిన విమర్శలకు పవన్ స్పందిస్తూ జనసేనకు కులాలు లేవని, తనకు అన్నికులాలు సమానమేనని పవన్ స్పష్టం చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో రాజీలేని పోరాటం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. హోదా విషయంలో ముందు నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలన యథా చంద్రబాబు.. తథా ఎమ్మెల్యేలు అన్నట్లుగా సాగుతోందని, పైన ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే కింద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దొరికినంత మేరకు దోచుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని నల్లపురెడ్డి ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెబుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం మన దురదృష్టకరమని ఆయన విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన 23 మంది ఎమ్మెలేలతో వెంటనే రాజీనామ చేయించాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం
కామారెడ్డి అర్బన్ : కేసీఆర్ గందరగోళ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని, విద్యారంగం దేశంలో 26వ స్థానానికి దిగజారిందని, అంతర్ జిల్లాల బదీలీలు, ప్రమోషన్లు లేకుండా వెబ్ కౌన్సిలింగ్ సాధారణ బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో అయోమాయం నెలకొందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి అన్నారు. కామారెడ్డి పీఆర్టీయూ భవన్లో మంగళవారం మధ్యా హ్నం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో రెగ్యులర్ అధికారులు లేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు లేక ఇన్చార్జిలతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రమోషన్లు చేపట్టిన తర్వాతనే ఈనెల 30 వరకు బదిలీల ప్రక్రియ చేయాలన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరగా సీపీఎస్పై నిర్ణయం తీసుకొకుంటే మళ్లీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత రూల్స్ సాంకేతిక సమస్యలతో నిలిచిపోందని అతి తొందరలోనే సాధిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు పి.దామోదర్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జె.మధుసూధన్రెడ్డి, పురుషోత్తం శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, నర్సింగరావు, సెట్యా, రాష్ట్ర కార్యదర్శులు సంతోష్కుమార్, రమేష్రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి.గోవర్థన్, కార్యదర్శి శ్రీకాంత్, కామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట మండలాల అధ్యక్షులు సురేష్,హన్మాండ్లు, నర్సారెడ్డి, మనోహర్, భూమయ్యలు పాల్గొన్నారు. -
ఏం సాధించారని అవార్డులు..?
సాక్షి, జగిత్యాల: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా అవార్డులు.. ఇచ్చిన ప్రశంసపత్రాల ప్రదానంలో అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల పూర్తయిన రైతుబంధు, సబ్సీడీ గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారులకు చేపల పంపిణీ, భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛ జగిత్యాల అంతా ఓ బూటకమని ఎద్దేవా చేశారు. ఆయా రంగాలకు అవార్డులు ప్రదానం చేయడం దారుణమన్నారు. అవార్డులకు గుర్తింపు లభించే విధంగా అర్హులకే అవార్డులు ప్రదానం చేయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని మండిపడ్డారు. జిల్లాలో రైతుబంధు పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇప్పటికే అనేక ప్రచార, ప్రసార మాధ్యమాల్లో రైతుబంధు వైఫల్యం బట్టబయలైందన్నారు. అయినా.. జిల్లాకు ఎక్సలెన్సీ అవార్డు రావడం దారుణమన్నారు. పథకం పూర్తయిన తర్వాత.. నిర్వహించిన సమీక్షలో సాక్ష్యాత్తూ సీఎం అధికారులకు చీవాట్లు పెట్టిన పరిస్థితి వచ్చిందన్నారు. ఫలితంగా.. ఎక్సలెన్సీ అవార్డు వచ్చిన జిల్లాకూ అన్ని జిల్లాలతో పాటే స్పెషలాఫీసర్ నియామకం జరిగిందన్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో విఫలమైందన్నారు. తొలి విడతలో 9,769 యూనిట్లలో 2.10లక్షల జీవాలు పంపిణీ చేస్తే.. అందులో 25శాతం చనిపోయాయని, మేత లేక మరో 25శాతం ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీ చేయించి పంపిణీ చేసిన గొర్రెల్లో ఏ మేరకు గొల్లకుర్మల వద్ద ఉన్నాయో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో ఒక్కో గొర్రెను రూ. 5,700తో కొనుగోలు చేస్తే.. కొనుగోలు చేసిన గొర్రె ప్రస్తుత ధర రూ. 3,500కు మించడం లేదన్నారు. జీవాల ధర పతనం కావడంతో.. అర్హులైన గొల్లకుర్మలు తమ జీవాలను అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య కార్మికులకు పంపిణీ చేసిన చేప పిల్లలూ ఎండకు చనిపోయాయన్నారు. స్వచ్ఛ భారత్– స్వచ్ఛ జగిత్యాలలో బహిరంగ మల, మూత్ర విసర్జన అటకెక్కిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న పది వేలకు పైగా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని.. వారందరూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ పద్రక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాను స్వచ్ఛ జగిత్యాలగా ప్రకటించడంతోనే బిల్లులు మంజూరు కావడం లేదన్నారు. కేవలం జగిత్యాల పట్టణంలోనే నాలుగొందల కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటే జిల్లాలో పథకం అమలు తీరు తెన్నులు అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాహక్కు చట్టాన్ని కనీసం ఈ ఏడాదైనా అమలు చేసి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో నిరుపేదలకు 25శాతం సీట్లు ఇప్పించి విద్య అందించాలని డిమాండ్ చేశారు. పొరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరకు రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. మన రాష్ట్రంలో మాత్రం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. అలాగే.. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. అలాగే... ఇస్లాం మతంలో ఇతరుల ప్రమేయం సహించరాని నేరమని జీవన్రెడ్డి చెప్పారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లని కేసీఆర్కు ముస్లింల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ గురించి కశ్మీర్, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో భారీగా ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ సిరాజొద్దీన్ మన్సూర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శంకర్, కొలుగూరి దామోదర్, గాజుల రాజేందర్, ముకస్సిర్ అలీ నేహాల్, గిరి నాగభూషణం, రియాజ్ పాల్గొన్నారు. -
కేంద్రంపై పోరాటం చేయాలి
కొత్తగూడ(ములుగు): దళిత, గిరిజనులు ఏకమై కేంద్రంపై పోరాటం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో జరిగిన సింహగర్జన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేడు హరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లకు అణుగునంగా భద్రత, స్వేచ్ఛగా జీవించే హక్కులు కల్పించారన్నారు. దళిత, గిరిజనులు చదువువుకు దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. దళిత, గిరిజనులపై అత్యాచారా లు జరుగుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు సుప్రీం కోర్టును అగ్రవర్ణాలు ఉపయోగించుకున్నాయన్నారు. రక్షణ కవచం లాంటి చట్ట రక్షణకు దళిత, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని సూచించారు. ఈనెల 10 తలపెట్టిన సింహ గర్జనకు తరలి రావాలన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, జెన్కో భూపాలపల్లి జిల్లా ఎస్ఈ జనగం నరేష్, నర్సంపేట డీఈ విజయ్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, బూర్క యాదగిరి, సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు బూర్క వెంకటయ్య, శ్రీశైలం ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, మిడుతపల్లి యాకయ్య, వజ్జ సారయ్య,రేణుక, వివిధ సంఘాల నాయకులు బాబూరావు, నర్స య్య, ప్రేమ్సాగర్, రాజం సారంగం, కల్తి ఎల్లయ్య, గుమ్మడి లక్ష్మినారాయణ, కంగాల లచ్చయ్య, చెన్నూరి మహేందర్, విజయ్, గంగిరెడ్లు, బుడిగ జంగాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ చట్టం కవచం లాంటిది మరిపెడ: అట్రాసిటీ చట్టం ఎస్సీ, ఎస్టీలకు ఒక కవచంలాంటిది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మరిపెడ లోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎల్హెచ్పీఎస్ నియోజక వర్గ ఇన్చార్జి భూక్యా రామ్మూర్తినాయక్ అధ్యక్షతన సింహగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బానిస బతుకుల నుంచి విముక్తి కావాలంటే దళిత, గిరిజనులు తరలిరావాలన్నారు. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసి టీ యాక్ట్ చట్టాన్ని రూపొందించారన్నారు. ఈనెల 10న వరంగల్లో జరిగే దళిత, గిరిజన సింహగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో హలావత్ శంకర్ నాయక్, రామన్ననాయక్, అల్వాల వీరయ్య, బానాల రాజన్న, చెన్నయ్య, కనకయ్య, లక్ష్మి, భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సుధీర్రెడ్డిని విమర్శించే అర్హత లేదు
ఎర్రగుంట్ల: వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్రెడ్డిని విమర్శించే అర్హత , పార్టీ ఫిరాయింపులు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులకు లేదని మైసురారెడ్డి తనయుడు హర్షవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు డి. సూర్య నారాయణరెడ్డి, పద్మనాభయ్య, నాగన్న, కడప పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎర్రగుంట్లలో విలేకరులతో వారు మాట్లాడారు. మా నాయకుడు సుధీర్రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు, గ్రామాల్లో ఉన్న కార్యర్తల పేర్లను చెప్పగలరన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గ్రామాల పేర్లే చెప్పగలరని, కార్యకర్తల పేర్లను చెప్పగలరా అని ప్రశ్నించారు. సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అయితే తాను అభివృద్ధిపనులు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎర్రగుంట్లలో కళాశాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయంలో వచ్చినవే అని అన్నారు. వైఎస్సార్సీపీలో గెలిచి స్వార్థం కోసం పార్టీ ఫిరాయించిని మంత్రి ఆది వర్గీయులకు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సాయం కోసం ఎవరు వచ్చినా అండగా ఉండే నైజం సుధీర్రెడ్డిడి అని అన్నారు. మంత్రి ఆది వర్గీయులు లోపల వైఎస్సార్సీపీ ఉంటే, బయట టీడీపీ ఉంటుందని విమర్శించారు. నిజమైన టీడీపీ వారు కాదన్నారు. ప్రజాభిమానం పొందుతున్న సుధీర్రెడ్డిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని, అ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో షర్ఫద్దీన్ పాల్గొన్నారు. -
పరిటాల రవికి భయపడి జేసీ ఊరు వదిలివెళ్లలేదా?
తాడిపత్రి : మూడు దశాబ్దాలుగా తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొందని, ఈ ప్రాంతాన్ని జేసీ సోదరులు సర్వనాశనం చేశారంటూ వైఎస్సార్ సీపీ నేత పైలా నరసింహయ్య విమర్శించారు. స్థానిక భగత్సింగ్ నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. జేసీ సోదరుల నీచ సంస్కృతి జిల్లావాసులకు తెలిసిందేనన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు వారు పెట్టింది పేరన్నారు. అందితే జట్టు... అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం ఉన్న జేసీ సోదరులు.. గ్రామాల్లో ఫ్యాక్షన్కు ఆజ్యం పోస్తూ వచ్చారన్నారు. వారి స్వార్థానికి ఎందరో బలిపశువులయ్యారన్నారు. నేటికీ తాను పెద్ద రౌడీగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి.. పరిటాల రవి బతికున్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయకుండా ఊరు వదిలి వెళ్లిన విషయం నేటికీ తాడిపత్రి వాసులు మరిచిపోలేదన్నారు. వీరిని నమ్మి మోసపోగూడదంటూ ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ జిలాన్బాషా, కౌన్సిలర్ డీవీ కుమార్కి హితవు పలికారు. జేసీ సోదరులను నమ్ముకున్న వారిలో పొట్టి రవి తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేసీ సోదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతూ వస్తోందన్నారు. దీనిని జీర్ణించుకోలేక వారు మతి చలించి మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో విజయమ్మ సేవా సమితి అధ్యక్షుడు సంపత్ కుమార్, బాలరాజు, నాయకులు బాణా నాగేశ్వరరెడ్డి, కంచెం రామోహ్మన్ రెడ్డి, పేరం అమర్నాథరెడ్డి, ప్రదీప్రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. -
తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది మేమే..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళ్లు అర్పించి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం విశిష్టత నెలకొన్నది. సోనియా గాంధీ దృఢసంకల్పంతో ప్రజల సెంటిమెంట్ను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రాన్ని ఇచ్చారు.సోనియాగాంధీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మన్మోహన్, సోనియా, మీరాకుమార్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఆనాటి అఖిల పక్ష సమావేశంలో పాల్గొనడం మరిచిపోలేను. ఒకే ఒక ఎంపీతో తెలంగాణ వచ్చిందా? సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంద’న్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనీ, దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ పథకాల ఊసే లేదని ఆరోపించారు. రైతులను కేసీఆర్ ఆదుకోలేకపాగా.. ఖమ్మం రైతులకు భేడీలు వేయించారని విమర్శించారు. కానీ.. రైతులకు అండగా కాంగ్రెస్ ఉద్యమాలు, పోరాటాలు చేసి మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని, వారి కుటుంబం మాత్రం బాగుపడితే చాలన్నట్లుగా పరిపాలిస్తున్నారని ఆరోపించారు. ఆ కుటుంబంలోని నలుగురికి తప్పా మిగిలిన తెలంగాణకు దుఃఖమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగ యువత పూర్తిగా నైరాశ్యంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ ఉంటుందని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉత్తమ్ కుమార్ జోస్యం చెప్పారు. -
టీడీపీ నేతలపై విరుచుకుపడిన పవన్కల్యాణ్
గజపతినగరం : అధికార దాహంతో టీడీపీ నేతలు కనిపించిందల్లా కబ్జా చేస్తూ అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు దోచుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదన్నారు. జనసేన ప్రజా పోరాటయాత్రలో భాగంగా గజపతినగరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పవన్ విరుచుకు పడ్డారు. విభజన సమయంలో అనుభం ఉన్న నాయకుడు ఉండాలనే ఉద్యేశంతో కొమ్ముకాస్తే... రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ప్రజాధనం కూడబె ట్టుకుంటున్నారన్నారు. వారు చేసే దోపిడీకి ఆధారాలు ఉన్నాయా అని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రశ్ని స్తున్నారని... వారి అవినీతికి, దోపిడీకి ఎవరైనా రశీదులు, బిల్లులు ఇస్తారా అని చమత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అధికారులపై జులుం చూపిస్తున్నారని, చం పావతి నదిని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అగ్రిగరోల్డ్ బాధితుల సమస్యలు ఎదురవుతున్నాయని, అధికార పార్టీ పెద్దలు అగ్రిగోల్డ్ భూములను లాక్కుంటే జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వద్దనుం చి లాక్కుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర సీఎంకు ప్రజాసంక్షేమ పథకాలకు, రైతు రుణ మాఫీకి, ప్రజారోగ్యానికి, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజ్ చేసేం దుకు నిధులు లేవని, తన అనుచరునికి రూ. 500 కోట్లతో ఫైబర్నెట్కి అనుమతులు ఇచ్చేం దుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా సీఎం నివాసం ఏర్పరచుకున్నారని, చంద్రబాబు నివాసాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి అవసరమైన సాగునీటిప్రాజెక్టులకు నిధులు ఉండవు.. పుష్కరాలకు కోట్లాది రూపాయలు ఖర్చులు చేస్తారంటూ దుయ్యబట్టారు. -
కమీషన్ల పాపమే ఫ్యాక్టరీలు: బాణాల
భిక్కనూరు : టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల కమీషన్ల పాపమే భిక్కనూరు మండలంలో విచ్చల విడిగా కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ మండల కార్యకర్తల విస్తృస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో విచ్చలవిడగా కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కావడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. మూడేళ్లలో మండల ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యాల దగ్గర కమీషన్లు తీసుకుంటూ ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నారన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ప్రజలు ఆందోళన చేస్తే అధికార పార్టీ నేతలు పోలీసుల చేత కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటని, పది రోజుల్లో కెమికల్ ఫ్యాక్టరీలను మూసివేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, కెమికల్ ఫ్యాక్టరీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సమష్టిగా కృషిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని సూచించారు. వార్డుస్థాయి నుంచి జడ్పిటిసి వరకు కార్యకర్తలు పోటీలో ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజల చూపు... బీజేపీ వైపు టీఆర్ఎస్ పాలనతో విస్తుపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఉప్పునూతుల మురళీధర్గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ పూర్తిగా నెరవేర్చలేదని, టీఆర్ఎస్ నేతలు ప్రగల్బాలకే పరిమితమయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయని, దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. కర్ణాటకలో మెజార్టీ ప్రజలు బీజేపీని ఆదరించారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రోజూ గంట సమయాన్ని కేటాయించాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాల చిట్టా తయారు చేసి ప్రజలకు వివరించాలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తున్కి వేణు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల రవీందర్రెడ్డి, భిక్కనూరు మండల అధ్యక్షుడు సిం గం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు తాటికొండ బాబు, నేతలు ప్రభాకర్యాదవ్, డప్పు రవి, రాజిరెడ్డి, యాదగిరి, రాజేందర్రెడ్డి, పుల్లూరి నర్సింలు, ప్రవీణ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, తక్కళ్ల రాజిరెడ్డి, రమేశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తన్ని లోపలేస్తారా?
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ప్రశ్నిస్తే తన్ని లోపలేస్తారా అని సోమిరెడ్డిని ప్రశ్నించారు. మంత్రి చేసిన ఆరోపణపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార దర్పంతో తన్నిస్తామనడం ప్రజాస్వామ్యమేనా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. -
బీజేపీ కనుసన్నల్లో కేసీఆర్ ‘ఫ్రంట్’
మొయినాబాద్(చేవెళ్ల) : సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తుందని ఏఐసీసీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ను అడ్డుకునేందుకు బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగంగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. శనివారం మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. అనంతరం అంజనాదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని.. రాబోయే రోజుల్లో కేసీఆర్కు అదే గతి పడుతుందన్నారు. దేశంలో రాహుల్గాంధీ గ్రాఫ్ పెరుగుతుందని, దీన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే బీజేపీ కేసీఆర్ను పావుగా వాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లీటరు పెట్రోలు రూ.50 ఉంటే ఇప్పుడు రూ.80 దాటిందన్నారు. పెద్దనోట్లు రద్దుతో ఇప్పటికీ ఏటీఎంల్లో డబ్బులు లేని పరిస్థితి దాపురించిందని, కానీ కేసీఆర్ ఇచ్చే పెట్టుబడి చెక్కులు డ్రా చేసుకునేందుకు మాత్రం బ్యాంకుల్లో డబ్బులు అందుబాటులో ఉంచుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ప్రత్యేక రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు పూర్తి అన్యా యం జరుగుతోందని సబితారెడ్డి అన్నారు. జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుని నీళ్లు రాకుండా చేసిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు నీళ్లు తెస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని ఊసెత్తడంలేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కేంద్రం, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మద్దతు ధర పెంచి రైతులకు ఎకరాకు రూ.18 వేల లాభం వచ్చేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్, మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు మాణిక్రెడ్డి, గణేష్ గౌడ్, యాదయ్య, మాధవరెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్త లావణ్య, నాయకులు మాణెయ్య, శ్రీనివాస్యాదవ్, సతీష్, వడ్డెరాజు, మహేందర్, కృష్ణగౌడ్, అశోక్రెడ్డి, జొన్నాడ రాజు, మక్బుల్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడింది దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఏఐసీసీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యావత్ భారతదేశం ఎదిరిచూసిన కర్ణాటక ఫలితాలు సంతోషానిచ్చాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కాపాడాల్సిన గవర్నర్ కర్ణాటకలో ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా నిర్ణ యం తీసుకున్నారని.. దానికి సుప్రీంకోర్టు సరై న నిర్ణయం తీసుకుని ప్రజాస్వామాన్ని కాపాడిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జోన్ల విభజనతో వికారాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సబితారెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన
కాజీపేట : ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు కొనసాగడం వల్లే తెలంగాణ జన సమితి ఆవిర్భావం జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో సీమాంధ్ర నాయకులతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా వ్యతిరేకతో కూడిన కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. జిల్లా కోఆర్డినేటర్ బోట్ల భిక్షపతి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగట్టు గుట్ట కింద ఉన్న బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించే రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చే యాలన్నారు. రాజేంద్రప్రసాద్, రాజేందర్, పులి సత్యం, తిరునహరి శేషు, శ్యాంసుందర్రెడ్డి, అశోక్రెడ్డి, ఛత్రపతిశివాజీ, డా.కృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. -
బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్లా మారింది
సాక్షి, గుంటూరు : బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్లా మారిందని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్ కళ్ళున్న కబోదిలా మారారని ఆరోపించారు. నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉందనే భరోసా కలిగిందని అన్నారు. బీజేపీకి అనుకులంగా వ్యవహరించిన గవర్నర్ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
గవర్నర్ తలదించుకునేల చేశారు : జీవన్ రెడ్డి
సాక్షి, కరీంనగర్ : కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ తలదించుకునే పని చేశారని టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ రాజకీయాలను నిరసిస్తూ కాంగ్సెస్ పార్టీ హుజురాబాద్ లో నిర్వహించిన నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ పొన్నాల ప్రభాకర్, వి. హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్నారు. ప్రధాన మంత్రి మోదీకి నిజంగా నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తి సీఎం కేసీఆర్ ఇప్పుడు కర్ణాటక విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆరోపించారు. -
కౌలు రైతులకు చెక్కులు ఇవ్వాలి
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్హాల్లో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు రోజులపాటు వర్క్షాపు నిర్వహించామని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఒం టరిగానే పోటీ చేస్తుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి రాష్ట్రంలో పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాష్ట్ర పర్యటన జూన్లో ఉంటుందన్నారు. ఈ నెల 14న ఢిల్లీలో జరుగనున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల సమావేశంలో అమిత్షా పర్యటన ఖరారవుతుందని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుంటుం దని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండే పార్టీలతో సమావేశమవుతున్నారని, గతంలో యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వంలోను భాగస్వాములుగా ఉన్నారని గుర్తు చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేని ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా, కేంద్రం రాష్ట్రాలకు సహాయం అందించడం లేదని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. రైతు బంధుతో సమస్యలు తీరవు.. రైతు బంధు పథకంతో రైతుల సమస్యలు పరి ష్కారం కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మ ణ్ అన్నారు. అన్ని రోగాలకు జిందాతిలిస్మాత్ ఔషధమన్నట్లు, రైతుల సమస్యలన్నింటికీ రైతు బం ధు పథకం పరిష్కారమన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రైతులకు అదనంగా రైతులను, సాగు భూమిని అధికంగా చూపించిందని, ఈ మొత్తాన్ని ఎవరి జేబుల్లోకి నెట్టడానికని ప్రశ్నించారు. ఎన్నికల పెట్టుబడి కో సం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. రైతుల రుణాల వడ్డీ మాఫీకి కేం ద్రం 4 శాతం సాయం అందిస్తుందని, రాష్ట్ర వాటా 3 శాతం చెల్లించకపోవడంతో వడ్డీ మాపీ కావడం లేదన్నారు. కౌలు, పోడు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నాయకులు రేష్మారాథోడ్, గాదె రాంబాబు, పెదగాని సోమయ్య పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమం పట్టని టీఆర్ఎస్ సర్కార్
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తుందని.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సానుకూలం చేసుకుని తిరిగి అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతో ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధనశాస్త్రీ విమర్శించారు. పెద్దపల్లిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి వారిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించిన విషయాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామని పేర్కొంటున్నా... రైతులపై ఇప్పటికీ వడ్డీభారం అలాగే ఉందని.. బ్యాంకుల్లో ఉన్న పాసుపుస్తకాలు ఇంకా రైతుల చేతికే రాలేదన్నారు. ఇపుడు కొత్తగా దేశానికే ఆదర్శమంటూ రైతులను మభ్యపెట్టేందుకే రైతుబంధు పేరిట ఎకరానికి రూ.4 వేలు చెల్లిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఆయన వెంట నాయకులు చిలారపు సదానందం, సిద్ధార్థరెడ్డి, ప్రేంకుమార్ ఉన్నారు. -
రైతుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కు లేదు
యాదగిరికొండ : రైతుల గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్కు లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి వాగ్థానాన్ని మరిచిపోయి ఎన్నికలు దగ్గరకు రాగానే రైతులపై కుల సంఘాలపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక దొంగ అని పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో పీజు రీయింబర్స్మెంట, డబుల్ బెడ్రూం వంటి ఎన్నో పథకాలు ప్రజల దరి చేరలేదన్నారు. రైతుబంధు పథకం చిన్న , సన్నకారు రైతుల కోసం కాదని, లాభపడేది అగ్రకులాలేనన్నారు. చిన్నకారు రైతుల వద్ద కేవలం ఒక ఎకరం లేదంటే, 30 గుంటల వరకు భూమి ఉంటుందని, అగ్రకులాల వద్ద 20 ఎకరాలు, 40 ఎకరాల వరకు ఉందన్నారు. ఈ పథకం ద్వారా అగ్రకులాలే లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. -
హామీలను విస్మరించిన ప్రభుత్వాలు
నిర్మల్టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. నిర్మల్రూరల్ మండలంలోని మంజులాపూర్లో గ్రామ ప్రజల సమస్యలను ఆయన శనివారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ఆరోపించారు. డబ్బే ప్రధాన లక్ష్యం చేసుకుని ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బహుజనులంతా ఏకమై బీఎస్పీనే గెలిపించాలని కోరారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ నెల 8 నుంచి జోనల్ స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బాపురావు, నాయకులు సాయన్న, ప్రకాష్, ముత్యం, నాగరావు, దిగంబర్ పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిని మరిచారు
గద్వాల రూరల్ : కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ధరూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగ్లా కుటుంబం గద్వాల ను నలబై ఏళ్లు పాలించిందన్నారు. వీరంతా దౌర్జన్యాలు, హత్యారాజకీయాలతో రాజ్యాధికారం సంపాదించారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుకొన్నారే తప్పా ఏనాడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో గద్వాల అభివృద్ధికి రూ.28కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.26కోట్లు, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ప్రతి మండలానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయించామన్నారు. కాగా టీఆర్ఎస్లో చేరిన వారిలో ధరూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాజులపాడు రఘురెడ్డి, గువ్వలదిన్నె సర్పంచ్ సిద్ధన్గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులుగౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, పాగుంట సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు ఈర్లబండ శ్రీనివాస్రెడ్డి, రాజారెడ్డి, సోమశేఖర్రెడ్డి, కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ సుభాన్, ధరూరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావెంకటేశ్వర్రెడ్డి, గట్టు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, గద్వాల మార్కెట్ యార్డు వైస్చైర్మన్ నజీర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్నాయుడు, ఆయా గ్రామ సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్, ఉరుకుందు, రామకృష్ణ, దామ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నకిరేకల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎమెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తుగ్లక్ లాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని అన్నారు. నకిరేకల్లోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రజలపై అధికంగా భారం మోపుతూ రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నారన్నారు. సాగు పెట్టుబడులకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కూడా రైతులను మోసం చేసేందుకేనన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ భూస్వాములు, బడా కాంట్రాక్టర్లు బిల్డర్లు వేలాది భూములు కొనుగోలు చేశారన్నారు. వారిని బాగు చేసేందుకు ఎకరాకు ఏడాదికి రెండు దఫాలు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు.వచ్చేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు. ప్రత్యేకించి 119 అసెంబ్లీ స్థానాల్లో నకిరేకల్ నుంచి రాబోయే 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. తొలుత నకిరేకల్కు విచ్చేసిన రాజగోపాల్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనస్వాగతం పలికారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, కాంగ్రెస్మండల, పట్టణ అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, నడికుడి వెంకటేశ్వర్లు, మంగళపల్లి సర్పంచ్ ప్రగడపు నవీన్రావు, ఎంపీటీసీ గుర్రం గణేష్, నాయకులు చెల్ల కృష్ణారెడ్డి, మాదధనలక్ష్మి, పల్లె విజయ్, రాచకొండ సునీల్, మామిడి కాయల నాగయ్య, ఆరుట్ల శ్రవణ్ ఉన్నారు. -
బలహీనవర్గాలకు కాంగ్రెస్ అండ
బజార్హత్నూర్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది బడుగుల జీవితాలు మారుతాయేమోనని ఎదురుచూశామని కాని ఇక్కడ దొరల పాలనతో బడుగుల జీవితాలు దుర్భరంగా మారాయని ఒక్క సంవత్సరం ఆగితే బడుగుబలహీనవర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని దిగ్నూర్ గ్రామంలో పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అరచేతిలో అద్భుతం చూపిస్తోందని, దళితబస్తీ భూములు, డబుల్బెడ్రూం ఇళ్లు, ఇప్పటి వరకు ఎంత మందికి లబ్ధి చేకూర్చారో తెలిపాలని టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన చెరువులకు రంగులద్ది కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిరాశతో ఉన్నారని, యువత తిరగబడి దొరల పాలనకు చరమగీతం పాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వినర్ కానిందే ఉద్దవ్, ఎస్సీ కన్వీనర్ దావెంతు నర్సయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సల్మాన్, రవి, సంజీవ్, కల్లెం విఠల్ పాల్గొన్నారు. -
కేంద్ర నిధులకు లెక్కలు చెప్పరేం
అనంతపురం : రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం 2018కి పెద్ద జోక్గా ఉందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.16 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 58,650 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.. దీంతో ఆ తర్వాత నిధులు ఇచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటోందన్నారు. సీఎం నాటకాలను కేంద్రం గుర్తించే నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు కేంద్రం సహకరిస్తే పోలవరం ప్రాజెక్ట్ను 2019 నాటికి పూర్తి చేస్తానని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీళ్లిస్తామంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పుణ్యమా అని అభివృద్ధిలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు నెట్టారని వాపోయారు. చంద్రబాబు చేçస్తున్న అవినీతి, అక్రమాలకు వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని తప్ప.. అభివృద్ధికి అడ్డుకాదని స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్లో రూ. 375 కోట్లు అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే పురుషోత్తం పట్నం ప్రాజెక్ట్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ టీడీపీకీ వరంలా మారిందని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు చేయడం వేస్ట్ అని ఎన్జీఓ సంఘం అశోక్బాబు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాలూ రోడ్డెక్కి పోరాటాలు చేస్తుంటే అశోక్బాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. -
కాంగ్రెస్ బాటలోనే బీజేపీ..
ఎదులాపురం(ఆదిలాబాద్): దేశంలో కాంగ్రెస్ అనుసరించిన బాటలోనే బీజేపీ పయనిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆదిరెడ్డి, గుండా మల్లేశ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో బుధవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలో వారు అతిథులుగా హాజౖ రె మాట్లాడారు. దేశ పాలనలో మోదీ అన్న అయితే రాష్ట్రంలో కేసీఆర్ తమ్ముడిగా పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో గోరక్షణ దళాల పేరుతో మతోన్మాద దాడులకు పాల్పడుతూ హింస ను ప్రేరేపిస్తుందన్నారు. సాహితీవేత్తలు, సంఘ సంస్కర్తలను హత్య చేయి స్తున్నారని ఆరోపించారు. ఉపాధి హా మీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంద న్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లే దన్నారు. రైతు కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. థర్డ్ ఫ్రంట్ ను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. తొలు త కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరి నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్, నళినిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యరద్శి మేస్రం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్తోనే ప్రజలకు న్యాయం’
సాక్షి, మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీవల్లే దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మహబూబ్ నగర్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీలు ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగాల వంటి అన్ని రంగాల్లో ముందున్నారని కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని దశాబ్దాల వెనక్కు నెట్టిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. కాంగ్రెస్ ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్తో బీసీ విద్యార్ధుల్ని ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించామని, దాంతో వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలను తీసుకువస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు గొర్రెలు.. బర్రెలు అంటూ తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. బీసీలు సమష్టిగా ముందుకు వెళితేనే ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎదుగుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంతరావు, బీసీ నేత చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని గాలికొదిలి విదేశాల్లో చక్కర్లు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో 13 దేశాల్లో చక్కర్లు కొట్టడం తప్ప సాధించింది ఏమీలేదని వైఎస్సార్సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలిన చంద్రబాబు దేశాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాను వదిలిపెట్టిన చంద్రబాబు పోలవరం విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పోలవరం, ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, పుట్టిన రోజు కూడా వైఎస్ జగన్ ప్రజల మధ్యే వున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై అన్ని వర్గాలను చైతన్యవంతం చేయడమే ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యమని చెప్పారు. పోలవరంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కలుస్తుందని ఆయన తెలిపారు. -
‘ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లే దు’
చెన్నూర్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడిలో పడిందని, ప్రభుత్వాన్ని విమర్శించడం పీడీఎస్యూ నాయకులు ఫ్యాషన్ అయిపోయిందని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎరినాగుల మల్లికార్జున్ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం నిబద్ధతతో విచారిస్తోందని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ విద్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించి తరగతులు నిర్వహిస్తోందని వివరించారు. పీడీఎస్యూ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు సైదుల రమేశ్, నాయకులు తగరం కిషన్, అయిత రాజేందర్రెడ్డి, శ్రీనివాస్, నయాబ్ఖాన్ పాల్గొన్నారు. -
'ఎప్పుడు ఎలా తినాలనే బాబు ఆలోచన'
-
'ఎప్పుడు ఎలా తినాలనే బాబు ఆలోచన'
హైదరాబాద్: పప్పుల ధరలు ఆకాశన్నంటినా నీరో చక్రవర్తిలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బాబు ప్రభుత్వం పప్పుదినుసు పంటలను ప్రోత్సహించడం లేదని చెప్పారు. జనం సొమ్ము ఎలా తినాలి, ఎంత తినాలి అని అని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారే తప్ప అసలు ప్రజలు ఏం తింటున్నారనే ఆలోచన ఆయనకు లేనే లేదని అన్నారు. రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని, ఇలా ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే నేడు ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గతంతో పోలిస్తే పప్పు పంటల దిగుమతులు తగ్గిపోయాయని ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని చెప్పారు. 90శాతం కందిపప్పు భారత్లోనే ఉత్పత్తి అవుతుందని, అయినా, రైతులకన్నా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారని చెప్పారు. కూరగాయల ధరలు 150శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పప్పు దినుసుల పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంలేదని, ఈ పంటల విషయంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా చేశారని చెప్పారు. -
వారితో ఒరిగిందేమీ లేదు
నల్లగొండ రూరల్: వామపక్షాల నేతలతో కార్మికులకు ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్లోనే ప్రస్తావించారని, వారి వేతనాల పెంపు ప్రకటన నేడో, రేపో వస్తుందని తెలుసుకొని వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టడం సరికాదన్నారు. తమవల్లే కార్మికుల సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పుకునేందు కు వామపక్షాల నేతలు రాజకీయ ప్రయోజనం కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకా శం ఉందన్నారు. రాష్ట్రానికి పూర్తి స్థాయి లో ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును రెండుగా విభజించి నిర్మించాలని భావిస్తున్నారన్నారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మి స్తే ఆదిలాబాద్ జిల్లాకు, కాళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మాణం వల్ల నిజాంసాగర్, శ్రీరాంసాగర్కు నీరు అందుతుందని తెలి పారు. ప్రయోజనకరమైన ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అండగా ఉండాల్సిన నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వ్యతిరేకించడం సరికాదన్నారు. గుత్తాకు ఏం తెలుసు? ఉపాధి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందన్న విషయం ఎంపీ గుత్తాకు తెలియదా...? అని ప్రశ్నించారు. ఉపాధి ఉద్యోగుల సమస్యలను ఎంపీగా పార్లమెంట్లో లేవ నెత్తాలని సూచించారు. గుత్తాకు అధికారం లేకపోయేసరికి కమీషన్లు, పర్సం టేజీలు, పైరవీలు కరువైనట్టు ఆయన తెలిపారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. సమావేశంలో సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య, రాష్ట్ర నాయకులు చాడ కిషన్రెడ్డి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, ఫరీద్, గోలి అమరేందర్రెడ్డి, చింత శివరామకృష్ణ, జి.సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నువ్వుంటే ఎంత..? పోతే ఎంత..?
- పార్టీయే ఆయన్ను మోసిందని వ్యాఖ్య - పదవుల్లో 30 ఏళ్లు.. పదవి లేకుండా 30 రోజులు ఉండలేరా అని నిలదీత సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేత డి.శ్రీనివాస్ వదిలివెళ్లడం వల్ల పార్టీకి నష్టమేమీ లేదని టీపీసీసీ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, అసెంబ్లీ, మండలిలో విపక్షనేత జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఉన్నంతకాలం డీఎస్ను పార్టీయే మోసిందని, పార్టీని ఏనాడూ డీఎస్ మోయలేదన్నారు. ‘పార్టీలో 30 ఏళ్ల పాటు ఎన్నో పదవులను డీఎస్ అనుభవించారు. పదవి లేకుండా 30 రోజులు కూడా పార్టీకి సేవచేయలేకపోయారు. పార్టీకోసం లక్షలాదిమంది కార్యకర్తలు కష్టపడితే, ఆ ఫలితాన్ని ఆయన అనుభవించారు. ఆయన వెళ్లడం వల్ల సొంత జిల్లాలో ఎవరికీ నష్టంలేదు. కష్టకాలంలో పార్టీలో పనిచేయాలనే ఆలోచన లేని డీఎస్లాంటి వారు ఉంటే ఎంత, పోతే ఎంత’ అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్కు ఏనాడూ అవమానం జరగలేదని, ఎంతో గౌరవాన్ని చూపిందన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం, రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనను పారీ ్టగౌరవించిందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ప్రతిపక్షనేతగా గౌరవాన్ని కల్పించిందని టీపీసీసీ నేతలు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవకాశాల్లేవని, అన్యాయం జరుగుతున్నదంటూ డీఎస్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఆయన రిటైరైతే ఆ స్థానంలో బీసీ వర్గానికే చెందిన మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, ఇది బీసీలకు అన్యాయం జరిగినట్టు ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా పీసీసీకి 2 సార్లు అధ్యక్షునిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన డీఎస్ కూడా బీసీవర్గానికే చెందిన నేత అనే విషయం మరిచిపోవద్దన్నారు. పార్టీలో ఏ నిర్ణయం జరిగినా ఉమ్మడిగానే ఉంటుందని, ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్తో సహా ఏ ఒక్కరిపైనా నిందలు వేయడం డీఎస్లాంటి నేతకు సరైందికాదని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ సీనియర్నేతలు రాజనర్సింహ, శ్రీధర్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?
రాజధాని’లో చంద్రబాబు కూరుకుపోయారు నిపుణుల కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ విమర్శ వీజీటీఎం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం.. దేశంలోనే ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి సారవంతమైన పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ స్పష్టంచేసింది రెండు, మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకోవటం దురదృష్టకరం కొత్త రాజధాని నగరంలో ఐదేళ్లలోనే నగరాన్ని, సదుపాయాలను నిర్మిస్తామనటం అతిశయోక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ మొత్తం సమతుల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంది ఇప్పటికైనా బాబు పునరాలోచించుకోవాలి:‘ద హిందూ’లో రాజధానిపై నిపుణుల కమిటీ చైర్మన్ వ్యాసం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ధాన్యాగారంగా పరిగణించే ప్రాంతంలో వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసేసుకోవడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హ్రస్వదృష్టికి నిదర్శనమని.. ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన కె.సి.శివరామకృష్ణన్ తప్పుపట్టారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక విస్తృత సవాళ్లపై దృష్టిసారించాల్సి ఉండగా.. చంద్రబాబు కేవలం రాజధాని నిర్మాణం అంశంలోనే కూరుకుపోతున్నారని ఆయన విమర్శించారు. సాధ్యమైనంత వరకూ సారవంతమైన, పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. చంద్రబాబు దానిని విస్మరించి ఏడాదికి రెండు, మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని కోసం సేకరించబూనటం దురదృష్టకరమని అభివర్ణించారు. శివరామకృష్ణన్ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందు’లో సోమవారం రాసిన ఒక వ్యాసంలో ఈ విమర్శలు చేశారు. వ్యాసంలోని ముఖ్యాంశాలివీ... విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ధాన్యాగారం. మొత్తం భారతదేశంలోనే అతి ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఏటా రెండు పంటలు, మూడు పంటలు పండే 30,000 ఎకరాలకు పైగా పంట భూములను రాజధాని కోసం తీసేసుకోవటం.. హ్రస్వ దృష్టికి నిదర్శనం. ఈ చర్య ఫలితంగా తాత్కాలిక ఆర్థిక లబ్ధి కోసం రైతులు భూనిర్వాసితులవుతారు. భూగర్భ నీటిమట్టం అధికంగా గల ప్రాంతంలో నేలను గట్టిపరచటం, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటానికి, నిర్మించటానికి చాలా సమయం పడుతుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో నిర్మించిన గాంధీనగర్, చండీగడ్, భువనేశ్వర్, ఉక్కునగరాలైన బొకారో దుర్గాపూర్, రూర్కెలా తదితర దాదాపు 100 కొత్త పట్టణాలకు.. కనీస మౌలిక సదుపాయాల నిర్మాణానికే ఏడెనిమిదేళ్లు పట్టింది. ఏపీలో ఇవన్నీ ఐదేళ్ల కాల వ్యవధిలో చేయవచ్చన్నది పూర్తి అతిశయోక్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్పై పనిచేస్తున్న సింగపూర్ కంపెనీలు.. రాజధాని ప్రాంతానికి వెలుపల, వీజీటీఎం ప్రాంతం లోపల 3,000 ఎకరాల భూమి కావాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు. అదే జరిగితే సింగపూర్ కోటాలోకి వెళ్లే భూమి వ్యవసాయ భూమి. రాష్ట్ర రాజధాని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అంతర్జాతీయంగా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ విషయంలో ఏపీకి తాము అందించగల సాయంపై పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. చిత్తూరు, తిరుపతిల్లో ప్రధానంగా ప్రయివేటు రంగ సంస్థల సాయంతో కొన్ని వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు మొదలవుతుండటం ఆహ్వానించదగ్గ విషయం. అయితే.. రాయలసీమ సామర్థ్యానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరం. ఆర్థిక రాజధాని కూడా వీజీటీఎం ప్రాంతానికి బదిలీ అవుతుందన్న విషయం తెలుస్తోంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తుతాయనేది ఖచ్చితం. ఏపీ సీఎంగా సమతుల్యమైన అభివృద్ధిపై దృష్టిసారించాల్సి ఉందని, కేవలం వీజీటీఎం ప్రాంతం అభివృద్ధి గురించి మాత్రమే కాదని నిపుణుల కమిటీ పదేపదే చెప్పింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పంచుకోవటానికి పదేళ్ల సమయం ఇచ్చింది. చంద్రబాబు పునరాలోచించుకోవటానికి ఇంకా సమయముంది. 'రాజధాని ప్రాజెక్టు వల్ల నేరుగా ప్రభావితమయ్యే వారే కాకుండా.. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సొంత వ్యవసాయ భూమి లేని, ఆదాయం లేని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల భద్రతకు, సంక్షేమానికి భరోసా ఇవ్వటం ఆచరణాత్మకంగా అసాధ్యం' 'ఏపీ ఎదుటనున్న అతి తీవ్రమైన సవాలు.. ఏటా మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించటమని నిపుణుల కమిటీ పదే పదే స్పష్టంగా చెప్పింది. కానీ ఈ ఉద్యోగాలేవీ కనిపించటం లేదు. ఇటీవలి తుపానులతో దెబ్బతిన్న పట్టణాలను పునర్మించాల్సి ఉంది. హైకోర్టు వంటి ముఖ్యమైన సంస్థలను రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచించిన విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంది.'