crude prices
-
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్స్టాప్గా దౌడు తీస్తున్న బుల్కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘విండ్ఫాల్’ బాదుడు!
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దేశీయంగా వెలికి తీస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కు పెంచారు. ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) రూపంలో వసూలు చేస్తారు. డీజిల్ ఎగుమతులపై ఎస్ఏఈడీ లీటరుకు రూ.1.50 ఉండగా, పూర్తిగా తొలగించారు. ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు పెట్రోలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(విమాన ఇంధనం)పై సుంకం లేదు. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అదాటు లాభాలపై పన్నును తొలిసారిగా 2022 జులై 1న ప్రభుత్వం విధించింది. -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
డీజిల్పై ఇప్పటికీ రూ.4 నష్టమే!: చమురు వ్యవహారాల మంత్రి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో కూడా చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంసహా దేశంలో ద్రవ్యోల్బణం పెరక్కుండా ప్రభుత్వ పోరాటానికి సహాయం చేయడానికి చమురు మంత్రిత్వశాఖ తగిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుంది. ఈ విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)లతో కలిసి పనిచేస్తుంది. అవసరమైతే చమురు కంపెనీలకు వచ్చే నష్టాలకు ప్రభుత్వ నుంచి ఆర్థికపరమైన సహాయాన్నీ కోరుతుంది. ► జూన్ 2020 నుండి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో దేశీయ వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకంపై వచ్చిన నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం గత నెలలో మూడు సంస్థలకు రూ.22,000 కోట్లను ఒకేసారి గ్రాంట్గా అందించింది. అయితే రూ.28,000 కోట్లు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరింది. ► అండర్ రికవరీ (రిటైల్ అమ్మకపు ధర– అంతర్జాతీయ ధర మధ్య వ్యత్యాసం) ప్రస్తుతం డీజిల్పై లీటరుకు రూ. 27 ఉంది. అయితే వాస్తవిక నగదు నష్టం (ముడి చమురు సేకరణ–ఇంధనంగా మార్చడం వల్ల కలిగే వాస్తవ వ్యయ ఆధారిత నష్టం) లీటరుకు ఇప్పటికీ దాదాపు రూ. 3–4గా ఉంది. ► మూడు ఇంధన రిటైల్ కంపెనీలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 19,000 కోట్లకు పైగా నికర నష్టాన్ని చవిచూశాయి. తదుపరి త్రైమాసికంలో కూడా నష్టాలను ఎదుర్కొంటాయన్న అంచనా ఉంది. ► భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ధర జూన్లో బ్యారెల్కు 116 డాలర్ల వరకు పెరిగింది, అయితే నవంబర్ నెలలో 92.25 డాలర్లకు తగ్గింది. తగ్గిస్తే... మే తర్వాత మొదటిసారి ద్రవ్యోల్బణం నియంత్రించడం, వినియోగదారులపై ధరల భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం డీజిల్, పెట్రోల్పై ఈ ఏడాది మే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనితో వ్యవస్థలో ఆ నెల్లో పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గాయి. మళ్లీ ధరలు తగ్గిస్తే అది మే తర్వాత మొదటిసారి అవుతుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సవరించాలి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు మే తర్వాత ఈ సరవణలు చేయడం లేదు. అంతర్జాతీయ ధరల తీవ్రత నేపథ్యంలో మే నెల్లో ధరలు తగ్గింపునకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకూ పెరిగాయి. -
క్రూడ్ షాక్... రూపీ క్రాష్!!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 76 పైసలు బలహీనపడింది. 76.93 స్థాయికి రూపాయి పతనమైంది. రూపాయి ఈ కనిష్ట స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఒక దశలో రూపాయి 84పైసలు నష్టంతో 77.01 స్థాయిని సైతం చూసింది. కదలికలు ఇలా... దేశీయ కరెన్సీ ముగింపు శుక్రవారం 76.17. సోమవారం ట్రేడింగ్లో తీవ్ర బలహీన స్థాయిలో 76.85 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రతి దశలోనూ బలహీనంగానే కదలాడింది. కారణాలు ఇవీ... ► రష్యాపై ఉక్రెయిన్ దాడులు. నాటో దళాలు కూడా ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధంలోకి వస్తాయన్న వదంతులు. ► దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం. బంగారం, వెండి వంటి సురక్షిత సాధనల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు. ► క్రూడాయిల్ ధరల పెరుగుదల. ఇది దేశంలో ఆయిల్ సంక్షోభానికి తద్వారా పెట్రో ధరల మంటకు వెరసి ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తీవ్రతకు, కరెంట్ అకౌంట్ (ఒక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యాన్ని ప్రతిబింబించే గణాంకాలు)భారీ లోటుకు దారితీస్తాయన్న ఆందోళనలు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి.. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రూపాయికిపైగా బలహీనతతో 76.91 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిప దికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 99 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. 79 దిశగా పయనం..! అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇన్వెస్ట్మెంట్ కన్సల్టి ంగ్ సంస్థ–మిల్వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈఓ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. క్రూడ్ ధరలు మరింత పైకి ఎగసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రూపాయిని సమీప కాలంలో 79 దిశగా బలహీనపరుస్తాయన్నది తమ అంచనా అని తెలిపారు. 2020 ఏప్రిల్ తర్వాత... రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కరోనా సవాళ్లు, ఆందోళనలు, లాక్డౌన్ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం వంటి అంశాలు దీనికి నేపథ్యం. 130 డాలర్లు దాటిన క్రూడాయిల్ ధర 2008 తరువాత గరిష్ట స్థాయి న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా దాడులుసహా పలు కీలక పరిణామాల నేపథ్యంలో సరఫరాలపై తలెత్తిన ఆందోళనలు సోమవారం క్రూడాయిల్ ధరలను 2008 గరిష్ట స్థాయిలకు చేర్చాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం పైగా లాభంతో 121.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 117.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు చూడ్డం గమనార్హం. 2008 తరువాత ఇంత తీవ్రస్థాయిలో క్రూడ్ ధరలు చూడ్డం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. ఐదు ప్రధాన కారణాలు..! ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే అవకాశాలను అమెరికా, యూరోపియన్ భాగస్వామ్య దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన చేశారు. రోజుకు దాదాపు 7 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తి లేదా ప్రపంచ సరఫరాలో 7 శాతం (ఉత్పత్తిలో 10%) ఎగుమతులతో ఇందుకు సంబంధించి రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. అమెరికా మంత్రి తాజా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలకు సవాళ్లు తప్పవన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా నౌకాశ్రయాల నుంచి కజికిస్తాన్కు చెందిన చమురు ఎగుమతులకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోంది. ► దీనికి తోడు లిబియా చేసిన ఒక కీలక ప్రకటన చమురు ధర తీవ్రత కారణమైంది. ఒక సాయు« ద సమూహం రెండు కీలకమైన చమురు క్షేత్రాలను మూసివేసిందని లిబియా జాతీయ చమురు కంపెనీ ప్రకటించింది. ఈ చర్య వల్ల దేశం రోజువారీ చమురు ఉత్పత్తి 3,30,000 బ్యారళ్లకు పడిపోయిందని ప్రకటించింది. ► ఇరాన్పై 2015 ఆంక్షల ఎత్తివేత చర్చల్లోకి ‘ఆ దేశంతో రష్యా వాణిజ్య సంబంధాలను లాగొద్దని’ అమెరికాకు రష్యా డిమాండ్ చమురు ధర భారీ పెరుగుదలకు కారణమైంది. దీనితో ఈ చర్చలపై అనిశ్చితి నెలకొంది. -
త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
Russia-Ukraine crisis: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభంతో ‘రయ్’ మంటూ పైకి లేచిన బంగారం, క్రూడ్ వంటి కీలక కమోడిటీల ధరలు శుక్రవారం కొంత శాంతించాయి. యుద్ధంలో నాటో జోక్యం చేసుకోదన్న స్పష్టమైన సంకేతాలు, ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమన్న రష్యా ప్రకటన వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే 38 డాలర్ల నష్టంతో 1,888 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం ప్రారంభంలో పసిడి ధర గురువారం అంతర్జాతీయంగా ట్రేడింగ్ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా తాకటం గమనార్హం. అంటే తాజా హై నుంచి దాదాపు 100 డాలర్లు పడిపోయింది. దేశీయంగా రూ. 2,000 డౌన్ ఇక దేశీయంగా చూస్తే, మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో (ఎంసీఎక్స్)లో ధర క్రితం ముగింపుతో పో ల్చితే రూ.1,339 నష్టంతో రూ.50,204 వద్ద ట్రేడ వుతోంది. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత రూ.1,873 తగ్గి రూ.50,667 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.1,866 దిగివచ్చి రూ.50,464కి చేరింది. వెండి కేజీ ధర రూ. 2,975 దిగివచ్చి రూ.65,174 వద్దకు దిగివచ్చింది. ఇక క్రూడ్ ధరలు కూడా అంతర్జాతీయంగా గురువారం ముగింపుతో పోల్చితే 2% నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ అరశాతం నష్టంతో 96.50 వద్ద ట్రేడవుతోంది. భారత్లో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు లాభపడి, 75.33 వద్ద ముగిసింది. -
మళ్లీ చమురు సెగ- ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు?
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ మార్కెట్లో దూకుడు చూపుతున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత బలపడ్డాయి. దీంతో వచ్చే వారం మరోసారి పెట్రో మంట తప్పకపోవచ్చని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కోవిడ్-19 కారణంగా దేశమంతటా లాక్డవున్లు విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 వరకూ పెంచింది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సైతం అమలవుతోంది. దీంతో గడిచిన గురువారం(7న) పెట్రోల్ ధరలు ఆల్టైమ్ హైను తాకిన సంగతి తెలిసిందే. వెరసి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. (ధరల మంట- పెట్రోల్ @ఆల్టైమ్ హై) పన్నుల వాటా అధికం ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 84లో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 52 వరకూ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం తగ్గించమంటూ పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి తాజాగా సూచించినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పెట్రోల్ ధర లీటర్కు కనీసం రూ. 5 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది ప్రజలు కనీసం 20 శాతం సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలియజేసింది. చమురు కంపెనీలూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో కోతలను తగ్గించడానికితోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ను తగ్గించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంధన రంగ పీఎస్యూలు సైతం ఈ భారాన్ని కొంతమేర మోయవలసి రావచ్చని తెలియజేశాయి. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) మళ్లీ ధరల సెగ విదేశీ మార్కెట్లో గత మూడు రోజుల్లో 7 శాతం జంప్చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. వారాంతాన న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 2.8 శాతం ఎగసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ మరింత అధికంగా 3 శాతం జంప్చేసి56 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్కతాలో డీజిల్ ధరలు లీటర్కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్ రేటు రూ. 84.63ను తాకింది. ముంబైలో డీజిల్ లీటర్ రూ. 79.93గా, పెట్రోల్ రూ. 89.78గా నమోదయ్యాయి. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 86కు చేరగా.. డీజిల్ రూ. 78.69 అయ్యింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. కాగా.. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కోతల ఎఫెక్ట్ తాజా సమావేశంలో భాగంగా రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగాయి. వెరసి శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం 1.4 శాతం జంప్చేసి 46.26 డాలర్లకు చేరింది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7.2 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
పసిడి ధరలు ప్లస్- చమురు ధరల సెగ
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు ముడిచమురు ధరలకు జోష్నిస్తున్నాయి. మరోపక్క బంగారం, వెండి ధరలు బలహీనపడుతున్నాయి. థాంక్స్ గివింగ్ డే సందర్భంగా నేడు యూఎస్ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం అటు చమురు, ఇటు బంగారం ధరలు లాభపడ్డాయి. దీంతో నేటి ట్రేడింగ్లో ఎంసీఎక్స్లోనూ బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగుతున్న బంగారం ధరలు నాలుగు నెలల కనిష్టాలకు చేరగా.. చమురు ధరలు మార్చి గరిష్టాలను తాకాయి. ఇతర వివరాలు చూద్దాం.. లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 161 లాభపడి రూ. 48,674 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి కేజీ రూ. 298 పుంజుకుని రూ. 60,141 వద్ద కదులుతోంది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలు. కాగా.. ఎంసీఎక్స్లో పసిడికి రూ. 48,400- 48,220 వద్ద సపోర్ట్స్ లభించవచ్చని పృథ్వీ ఫిన్మార్ట్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ డైరెక్టర్ మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదేవిధంగా రూ. 48,660- 48,850 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని పేర్కొన్నారు. బలపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్లో బుధవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.22 శాతం బలపడి 1,815 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,808 డాలర్లకు చేరింది. వెండి సైతం 0.2 శాతం పెరిగి ఔన్స్ 23.50 డాలర్ల వద్ద నిలిచింది. కాగా.. కామెక్స్లో ఔన్స్ పసిడికి 1792- 1784 డాలర్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా 1814-1822 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. చమురు జోరు న్యూయార్క్ మార్కెట్లో బుధవారం నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం పుంజుకుని 45.92 డాలర్లను తాకింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.6 శాతం ఎగసి 48.61 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి గరిష్టాలను తాకాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. అయితే రెండు రోజులుగా ధరలను సవరించకపోవడం గమనార్హం! విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ల ఆశలు- మండుతున్న చమురు
లండన్/ న్యూయార్క్: దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు సిద్ధంకానున్న వార్తలతో ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. గత వారం 5 శాతం పురోగమించిన చమురు ధరలు వరుసగా రెండో రోజు బలపడ్డాయి. వెరసి విదేశీ మార్కెట్లో మూడు నెలల గరిష్టాలకు చేరాయి. ఇటీవలి ఎన్నికలలో అమెరికా ప్రెసిడెంట్గా జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా ధృవ పడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు జతగా ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికి కరోనా కట్టిడికి వ్యాక్సిన్ను విడుదల చేయనున్నట్లు పేర్కొనడంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఫలితంగా ముడిచమురు ధరలు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఒపెక్ ఎఫెక్ట్.. చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో రష్యాసహా ఒపెక్ దేశాలు గత కొద్ది నెలలుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2021 జనవరి వరకూ కోతలు అమలుకానున్నాయి. కాగా.. కోతల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశంకానున్నాయి. దీనిలో భాగంగా జనవరి 2021 తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కనీసం రోజుకి 2 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. అంటే 5.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలు మరో ఆరు నెలలు కొనసాగే వీలున్నట్లు చెబుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లతో ఆర్థిక రికవరీకి వీలు చిక్కుతుందని, దీంతో చమురుకు డిమాండ్ పుంజుకుంటుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు చమురు ఉత్పత్తిలో కోతలు కొనసాగితే ధరలు మరింత బలపడవచ్చని అంచనా వేస్తున్నాయి. ధరల జోరు ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1 శాతం ఎగసి 46.51 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1.1 శాతం పుంజుకుని 43.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం విదితమే. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. వివిధ పన్నులతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరల సవరణలో ప్రభావం చూపుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మళ్లీ చమురు ధరల సెగ
న్యూయార్క్: సెకండ్ వేవ్లో భాగంగా కోవిడ్-19 అమెరికా, యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పతన బాటలో సాగిన ముడిచమురు ధరలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 44 డాలర్లను దాటేయగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 42 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం నైమెక్స్ బ్యారల్ 1.3 శాతం బలపడి 41.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసి 44.13 డాలర్లకు చేరింది. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ పదవిని చేపట్టనుండటం, వ్యాక్సిన్పై అంచనాలు వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు సైతం చమురు ధరలు దాదాపు 3 శాతం చొప్పున జంప్చేశాయి. బ్రెంట్ 1.2 డాలర్లు పెరిగి 43.61 డాలర్ల వద్ద నిలవగా.. నైమెక్స్ బ్యారల్ 1 డాలరు పుంజుకుని 41.36 డాలర్ల వద్ద స్థిరపడింది. కారణాలివీ నవంబర్ 6తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు 5.147 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం వెల్లడించింది. ఇవి ఇంధన నిపుణులు వేసిన అంచనాల కంటే తక్కువకావడం గమనార్హం! దీనికితోడు తాజాగా అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం ద్వారా తిరిగి చమురుకు డిమాండ్ పుంజుకోనుందన్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థలు మందగిస్తుండటంతో చమురుకు డిమాండ్ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 2021 జనవరి తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించాలని ఒపెక్, రష్యా తదితర దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ సానుకూల వార్తలు చమురు ధరలకు జోష్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
బంగారం.. క్రూడ్ బేర్..!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్టైమ్ గరిష్టం 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్ స్పాట్ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది. క్రూడ్ కూడా...: మరోవైపు నైమెక్స్లో లైట్ స్వీట్ ధర కూడా బేరల్కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
చమురుకు మళ్లీ కరోనా కాటు
తాజాగా చైనాలో కరోనా వైరస్ సోకిన కేసులు బయటపడంతో ముడిచమురు ధరలకు షాక్ తగిలింది. ఏప్రిల్ తదుపరి గత వారం తిరిగి పతనమైన చమురు ధరలు నేటి ట్రేడింగ్లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లండన్ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 2 శాతం క్షీణించి 38 డాలర్ల దిగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ బ్యారల్ 3 శాతం వెనకడుగుతో 35.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 10 నుంచి చూస్తే చమురు ధరలు 11 శాతం పతనమమ్యాయి. బీజింగ్ వ్యవసాయ మార్కెట్లో సుమారు 25 మందివరకూ కరోనా వైరస్ బారినపడినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క శనివారం అమెరికాలో కోవిడ్-19 కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగినట్లు వెల్లడైంది. దీంతో రెండో దశలో కరోనా వైరస్ విజృంభించనుందన్న అంచనాలు ఆందోళనలు కలుగజేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే కోవిడ్-19 ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం విదితమే. గత వారం పతనం ఆరు వారాల ముడిచమురు ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. ఫలితంగా చమురు ధరలు 8.3 శాతం నష్టపోయాయి. కోవిడ్-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020లో ఏకంగా 6.5 శాతం క్షీణత చవిచూడవచ్చని కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వేసిన అంచనాలు గత వారాంతాన చమురు ధరలను దెబ్బతీశాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరనున్నట్లు ఫెడ్ తాజాగా వేసింది. దీంతో అమెరికాసహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోనున్న అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా చమురుకు డిమాండ్ పడిపోనుందన్న ఆందోళనలు తలెత్తాయి. దీనికితోడు గత వారం అమెరికాలో ఇంధన నిల్వలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెల 5తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7 మిలియన్ బ్యారళ్లమేర పెరిగి 538 మిలియన్ బ్యారళ్లను అధిగమించినట్లు యూఎస్ ఇంధన ఏజెన్సీ వెల్లడించింది. దీంతో చమురు నిల్వలు సరికొత్త రికార్డ్ గరిష్టానికి చేరుకున్నట్లు తెలియజేసింది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదయ్యాయి. నిజానికి 1.45 మిలియన్ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. చైనా ఎఫెక్ట్ చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనాలో తిరిగి కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో ఇంధన డిమాండ్ తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్డవున్లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు ఇటీవల అంచనా వేస్తున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి.కాగా.. ధరలకు స్థిరత్వాన్ని ఇచ్చేందుకు రష్యాసహా ఒపెక్ దేశాలు రోజుకి 9.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జులై చివరివరకూ ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నాయి. . -
చమురు ధరలకూ అమ్మకాల సెగ
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేయడంతో ప్రపంచ ఆర్థిక పురోగతిపై ఆందోళనలు పెరిగాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువత్తగా.. ముడిచమురు ధరలకూ ఈ సెగ తగిలింది. వెరసి గురువారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 7 శాతం పతనమైంది., 39 డాలర్ల దిగువకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 8 శాతం పడిపోయి 36.4 డాలర్లను తాకింది. దీంతో ఏప్రిల్ తదుపరి తిరిగి ఒకే రోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం మరోసారి అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులుతున్నాయి. బ్రెంట్ బ్యారల్ 1.5 శాతం క్షీణించి 37.97 డాలర్లకు చేరగా.. నైమెక్స్ బ్యారల్ దాదాపు 2 శాతం నీరసించి 35.68 వద్ద ట్రేడవుతోంది. నిల్వల ఎఫెక్ట్ ఈ నెల 5తో ముగిసిన వారంలో వాణిజ్య చమురు నిల్వలు 5.7 మిలియన్ బ్యారళ్లమేర పెరిగినట్లు యూఎస్ ఇంధన ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా చమురు నిల్వలు 538 మిలియన్ బ్యారళ్లను అధిగమించినట్లు తెలియజేసింది. తద్వారా చమురు నిల్వలు సరికొత్త రికార్డ్ గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. నిజానికి 1.45 మిలియన్ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోనున్న భయాలు ప్రధానంగా చమురు వర్గాలలో ఆందోళనలకు దారితీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇది చమురు డిమాండ్ను దెబ్బతీయవచ్చన్న అంచనాలు అమ్మకాలకు కారణమైనట్లు వివరించారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్డవున్లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి. -
చమురు షేర్లకు ధరల రెక్కలు
అంతర్జాతీయ మార్కెట్లలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా చమురు ఉత్పత్తిలో రష్యా, ఒపెక్ కోతలు విధించడం సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ దేశ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థల రికవరీకి దోహదపడగలవన్న అంచనాలు సైతం దీనికి జత కలిసినట్లు తెలియజేశారు.సోమవారం లండన్ మార్కెట్లో 7 శాతం జంప్చేసిన బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా మరికొంత పుంజుకుని 35 డాలర్లకు చేరింది. ఇక న్యూయార్క్ మార్కెట్లోనూ ముందురోజు 8 శాతం ఎగసిన నైమెక్స్ బ్యారల్ 32.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పాదక, తదితర కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.చమురు ఉత్పాదక కౌంటర్లపై సబ్సిడీ భారం తగ్గనుండగా..పెట్రో మార్కెటింగ్ షేర్లు సైతం కళకళలాడుతున్నాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలపడే వీలుండటం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 78కు చేరింది. ఈ బాటలో ఆయిల్ ఇండియా 6.5 శాతం ఎగసి రూ. 84ను తాకగా.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 5.2 శాతం లాభంతో రూ. 231 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇంద్రప్రస్థ గ్యాస్ 2.3 శాతం పుంజుకుని రూ. 456 వద్ద కదులుతోంది. తొలుత ఈ షేరు 460 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ 1.5 శాతం బలపడి రూ. 183 వద్ద, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.5 శాతం పెరిగి రూ. 73 వద్ద, హెచ్పీసీఎల్ 1 శాతం పుంజుకుని రూ. 175 వద్ద, బీపీసీఎల్ 1 శాతం లాభంతో రూ. 297 వద్ద ట్రేడవుతున్నాయి.ఇంట్రాడేలో బీపీసీఎల్ 304ను, హెచ్పీసీఎల్ రూ. 180నూ అధిగమించాయి. -
భారీగా తగ్గిన విమాన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ ధరలను 23 శాతం తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకన్నా చౌక ధరకు ఏటీఎఫ్ అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ (వెయ్యి లీటర్లు)కు రూ.6,813 తగ్గడంతో రూ.22,545కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.22.54గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండడంతో ఏటీఎఫ్ ధర మూడో వంతుకే అందుబాటులోకి వచ్చినట్టయింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.62.29గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్ ధరలు రెండు వంతుల మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు చారిత్రక కనిష్టాలకు పడిపోవడం కలిసొచ్చింది. -
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: వంట గ్యాస్ వినియోగదారులకు మరో సారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా ఇది వరుసగా మూడవ తగ్గింపు హైదరాబాదులో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది. న్యూఢిల్లీలో ఎల్పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి రూ. 581.50 గా వుంటుంది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ వుంటాయి. చదవండి: కరోనా : అయ్యయ్యో మారుతి! ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి -
ఎంసీఎక్స్ ‘క్రూడ్’ తొండాట..!
న్యూఢిల్లీ/ముంబై: అమెరికా కమోడిటీ ఎక్సే్ఛంజ్(నైమెక్స్)లో క్రూడ్ మే నెల కాంట్రాక్టు ధర మైనస్ 37 డాలర్లకు పడిపోయినప్పటికీ.. మన మార్కెట్(ఎంసీఎక్స్) మాత్రం సొంత నిర్ణయాలతో ట్రేడర్లకు తీరని నష్టం మిగిల్చింది. లాంగ్ పొజిషన్లు తీసుకున్న కొంత మంది బడా బ్రోకర్లకు నష్టాలను తగ్గించేందుకు ఎంసీఎక్స్ గోల్మాల్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగింది. వాస్తవానికి కరోనా లాక్డౌన్స్ నేపథ్యంలో ట్రేడింగ్ వేళలను కమోడిటీ ఎక్సే్ఛంజీలు సాయంత్రం 5 గంటల వరకు కుదించాయి. ఇక్కడ సోమవారం ఏప్రిల్ నెల కాంట్రాక్టు ధర రూ.965 వద్ద ముగిసింది. అయితే, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లో క్రూడ్ ధర మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే మన మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెటిల్మెంట్ ధర క్రితం ముగింపు, మైనస్ 37.63 డాలర్ల చొప్పున రూ.2,860 కలుపుకొని సుమారు రూ.3,825 డాలర్ల వద్ద సెటిల్ చేయాల్సింది. అయితే, ఎంసీఎక్స్ మాత్రం సెటిల్మెంట్ ధరను రూ.1గా నిర్దేశించింది. మంగళవారంతో గడువు ముగిసే ఈ ఏప్రిల్ కాంట్రాక్టులో 11,522 ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. ఒక్కో పొజిషన్ 100 బ్యారెల్స్ క్రూడ్కు సమానం. దీని ప్రకారం 11,52,200 బ్యారెల్స్ విక్రయించిన వారికి(షార్ట్ సెల్లర్స్) రూ.3,825 చొప్పున రూ.440 కోట్లు లాంగ్పొజిషన్ తీసుకున్న ట్రేడర్ల నుంచి సెటిల్మెంట్ చేయాల్సి వచ్చేంది. కానీ ఎంసీఎక్స్ రూపాయి ధరనే నిర్ణయించడంతో క్రితం ముగింపు రూ.965 చొప్పున షార్ట్ సెల్లర్స్కు లాభాలు రూ.110 కోట్లకు పరిమితమయ్యాయి. లాంగ్ పొజిషన్ తీసుకున్న ట్రేడర్లు రూ.440 కోట్ల నష్లాలను కేవలం రూ.110 కోట్లకు మాత్రమే పరిమితం చేసుకోగలిగారు. ఇలా ఇష్టానుసారం రూల్స్ మార్చేస్తే ఎలా అంటూ విమర్శలు చెలరేగడంతో సెబీ దీనిపై దృష్టిపెట్టింది. -
రూపాయి 65 పైసలు పతనం
సాక్షి,ముంబై: ప్రపంచ వృద్ధి ఆందోళనల నేపథ్యంలో అటు డాలరు, ఇటు రూపాయి భారీగా నష్టపోతున్నాయి. కోవిడ్-19 భయాలకు తోడు, దేశీయంగా ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనూహ్య వడ్డీరేటు కోత నిర్ణయం కరెన్సీ ట్రేడింగ్ను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి వృద్ధిని తాకవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల డాలర్ సూచీ స్పాట్ మార్కెట్లలో 0.25 శాతం క్షీణించింది. దీంతో రూపాయి డాలరుమారకంలో శుక్రవారం ఏకంగా 65 పైసలు క్షీణించింది. 73.99 ట్రేడింగ్ను ఆరంభించి 74.06 కనిష్టానికి చేరింది. గురువారం డాలర్తో పోలిస్తే 73.33 వద్ద 6 పైసల లాభాలతో రూపాయి ముగిసింది. మూలధన మార్కెట్ల నుండి ఫారెక్స్ ప్రవాహం కొనసాగుతుండటం భారతీయ కరెన్సీని తాకిందని వ్యాపారులు తెలిపారు. అటు దేశీయ స్టాక్మార్కెట్లుభారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకుపై పతనం కాగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధర విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐ) గురువారం నికర ప్రాతిపదికన రూ .2,476.75 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు మార్కెట్ డేటా ద్వారా తెలుస్తోంది. చమురు ధరలు 1.06 శాతం తగ్గాయి. దీంతో బంగారం ధరలు వరుసగా లాభపడుతూ శుక్రవారం ఆల్టైం గరిష్టానికి చేరాయి. బంగారు ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముకు రూ. 200 పెరిగి 44,640 వద్ద కొత్త గరిష్టానికి తాకింది. చదవండి : బ్లాక్ ఫ్రైడే; సెన్సెక్స్1500 పాయింట్లు క్రాష్ -
భారీగా తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా దిగి వస్తున్నాయి. వరుసగా మూడవరోజుకూడా పెట్రోలు డీజీలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్పై 27 పైసలు ధర తగ్గింది. దీంతో మొత్తంగా ఫిబ్రవరిలో పెట్రోల్ లీటరుకు 82 పైసలు, డీజిల్ లీటరుకు 85 పైసలు తగ్గింది. జనవరి 12 నుండి ఇంధన రేట్లు తగ్గడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రకంపనలు ముడిచమురు ధరలను కూడా తాకాయి. చమురుకు డిమాండ్ ఎక్కువుండే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం పడిపోయింది. వారంలో వరుసగా ఐదవ క్షీణతను నమోదు చేసింది. బ్రెంట్ ముడి బ్యారెల్ 54.50 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ : లీటరు పెట్రోల్ రూ. 72.45, డీజిల్ ధర రూ.65.43. ముంబై : లీటరు పెట్రోల్ రూ. 78.11, డీజిల్ ధరూ.68.57 కోల్కతా: లీటరు పెట్రోల్ రూ. 75.13, డీజిల్ ధ రూ. 67.79 చెన్నై: లీటరు పెట్రోల్ రూ. 75.27, డీజిల్ ధ రూ. 69.10 విజయవాడ : లీటరు పెట్రోల్ రూ. 76.63, డీజిల్ ధర రూ.70.91 హైదరాబాద్ : లీటరు పెట్రోల్ రూ. 77.08, డీజిల్ ధర రూ.71.35. -
41,700–41,810 శ్రేణే సెన్సెక్స్కు అవరోధం
అమెరికా–ఇరాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం ప్రథమార్ధంలో పెరిగిన బంగారం, క్రూడ్ ధరలు మన ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి. ఇంతలోనే మధ్యప్రాచ్య ఆందోళనలు చల్లారడంతో ఇటు బంగారం, క్రూడ్ ధరలు దిగివచ్చాయి. రూపాయి విలువ కూడా గణనీయంగా పుంజుకోవడంతో తిరిగి స్టాక్ సూచీలు ర్యాలీ చేయగలిగాయి. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, మన మార్కెట్లో ఇక బడ్జెట్ అంచనాలు, కార్పొరేట్ ఫలితాలకు అనుగుణంగా ఆయా రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశం ఉంది. అయితే స్టాక్ సూచీలను ప్రభావితం చేసే హెవీవెయిట్ షేర్లు మాత్రం ప్రస్తుతం నిస్తేజంగా ట్రేడవుతున్నందున, సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పడం అనుమానమే. బ్యాంకింగ్ హెవీవెయిట్లు ప్రకటించే ఫలితాలే సూచీల కదలికలకు కీలకం. ఇక స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 10తో ముగిసిన వారంలో 40,476–41,775 పాయింట్ల మధ్య 1300 పాయింట్ల మేర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 135 పాయింట్ల స్వల్పలాభంతో 41,600 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం సెన్సెక్స్ పెరిగితే పైన ప్రస్తావించిన శ్రేణి తొలుత నిరోధించవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,300 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,450 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,170 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 40,860 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చు. నిఫ్టీ అవరోధ శ్రేణి 12,300–12,320.... గత వారం ప్రథమార్ధం లో 11,929 పాయింట్ల వరకూ క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 12,311 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 12,257 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 12,300–320 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి అవరోధం కలగవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే అప్ట్రెండ్ వేగవంతమై 12,420 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై క్రమేపీ 12,480–12,540 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,210 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 12,130 వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,045 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. -
రూపాయికి వరుస లాభాలు, ఈ వారంలో
సాక్షి,.ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా నాలుగో సెషన్లో కూడా బలపడింది. శుక్రవారం ఆరంభంలో డాలరు మారకంలో స్వల్పంగా వెనుకంజ వేసినా గణనీయంగా పుంజుకుంది. ఒక దశలో 70.86 గరిష్టాన్ని తాకింది. చివరికి 27పాయింట్ల లాభంతో రూ. 70.94 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు చల్లబడటంతో వరుసగా నాలుగవ సెషన్లో తన విజయ పరుగును కొనసాగించింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా రూపాయి 99 పైసలు పుంజుకోగా, ఈ వారంలో 1.19 శాతం ఎగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు బ్రెంట్ 0.03 శాతం తగ్గి బ్యారెల్కు 65.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ సూచిక 0.12 శాతం పెరిగి 97.57 వద్ద ఉంది. అటు స్టాక్మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 147.37 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 41,599.72 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 40.90 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 12,256 ముగిసింది. ఇంట్రా-డేలో 12,311 స్థాయిని టచ్ చేసింది. -
‘క్రూడ్’ కల్లోలం!
ఇరాన్–అమెరికా మధ్య భీకర పరస్పర ప్రతిజ్జలు కొనసాగుతున్నాయి. ఫలితం... ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగభగమన్నాయి. మన మార్కెట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సోమవారం స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నష్ట భయం అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్ కరెన్సీ యెన్లవైపు తరలిపోతుండటంతో రూపాయి 72ను సైతం తాకింది. అంతర్జాతీయంగా పుత్తడి పరుగులు పెట్టింది. దేశీయంగా పసిడి ధర ఆల్టైమ్ గరిష్టానికి ఎగిసింది. పశ్చిమాసియాలో అమెరికా రాజేసిన యుద్ధభయాలతో స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం, ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరగడం నష్టాలకు మరింత ఆజ్యం పోసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 41 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 851 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 788 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 11,993 వద్దకు చేరింది. నిఫ్టీ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఆరు నెలల కాలంలో ఇదే ప్రథమం. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పరస్పర హెచ్చరికలు..... ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీమ్ సులేమానీని గత శుక్రవారం బాగ్దాద్లో అమెరికా డ్రోన్ దాడిలో చంపేసిన విషయం తెలిసిందే. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. 2015 నాటి అణ్వస్త్ర ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు కూడా ప్రకటించింది. అంతే కాకుండా ఇరాన్లో ఉన్న అమెరికా దళాలను ఉపసంహరించాలని ఇరాన్ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు ప్రతీకార దాడులకు దిగితే అంతకు మించిన దాడులు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధిస్తామని కూడా ఆయన బెదిరించారు. ఇరు దేశాల భీషణ ప్రతినల నడుమ ముడిచమురు ధరలు భగ్గుమనగా, ప్రపంచ మార్కెట్లు వణికిపోయాయి. షేర్ల తీరు ఇలా..... ► సెన్సెక్స్లోని మొత్తం 30 షేర్లలో రెండు షేర్లు–టైటాన్, పవర్ గ్రిడ్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 4.6 శాతం నష్టంతో రూ.3,938 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ముడిచమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్, విమానయాన రంగ షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్పీసీఎల్ 7 శాతం, ఐఓసీ 1.5 శాతం, బీపీసీఎల్ 2.7 శాతం చొప్పున క్షీణించాయి. ► టైర్లు, పెయింట్ల షేర్లు కూడా నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, అపోలో టైర్స్, ఎమ్ఆర్ఎఫ్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లు 1–4% నష్టపోయాయి. ► బీఎస్ఈలో ట్రేడైన ప్రతి ఐదు షేర్లలో సగటున 4 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ► రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–3% నష్టపోయాయి. సెన్సెక్స్ మొత్తం 788 పాయింట్ల నష్టంలో ఈ 3 షేర్ల వాటా 330 పాయింట్ల మేర ఉంది. ► సౌత్ అమెరికన్ సినర్జీ గ్రూప్ వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతోందన్న వార్తలతో ‘జెట్ ఎయిర్వేస్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ.36 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో రూ. 3.36 లక్షల కోట్లు ఆవిరి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో మన మార్కెట్ నష్టపోయింది. గత శుక్రవారం 162 పాయింట్లు, ఈ సోమవారం 788 పాయింట్లు చొప్పున సెన్సెక్స్ పతనమైంది. ఈ నష్టాల కారణంగా రూ.3.36 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.37 లక్షల కోట్లు ఆవిరై రూ.153.9 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లలో భయం... అమెరికా– ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ మార్కెట్లు భయపడుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఉన్న తమ పొజిషన్లను స్క్వేరాఫ్ చేసుకొని సురక్షిత పెట్టుబడుల సాధనాల దిశగా మళ్లిస్తున్నారని వివరించారు. భారత్పై ప్రభావం అధికం... ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇతర వర్ధమాన దేశాల కంటే కూడా భారత్పైనే అధికంగా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు వినియోగదేశమైనప్పటికీ, మన అవసరాలకు మూడో వంతుకు పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, చమురు ధరలు పెరిగితే అది మన ఖజానాపై తీవ్రంగానే ప్రభావం చూపగలదని వారంటున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయి దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని, ఇది ప్రభుత్వవ్యయంపై ప్రభావం చూపుతుందనేది నిపుణుల ఆందోళన. బడ్జెట్ ర్యాలీ అనుకుంటే, భారీ నష్టాలు.... ఏడాది కాలం పాటు మన మార్కెట్తో పాటు ప్రపంచ మార్కెట్లపై అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రంగానే ప్రభావం చూపాయి. ఇటీవలే ఇరు దేశాలు తొలి దశ ఒప్పందానికి అంగీకరించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. మరో నెలలో రానున్న బడ్జెట్లో కేంద్రం మరిన్ని తాయిలాలిస్తుందనే ఆశలతో బడ్జెట్ ర్యాలీ కొనసాగుతుందని అంతా అంచనా వేశారు. హఠాత్తుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లడంతో గత రెండు రోజులుగా మన మార్కెట్ కుదేలైంది. -
బంగారం.. చమురు భగ్గు!
న్యూఢిల్లీ: ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సొలేమానిని అమెరికా హతమార్చడం.. భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతర్జాతీయంగా అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు.. సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం, క్రూడ్, డాలర్ ఇండెక్స్ శుక్రవారం భారీగా పెరిగాయి. వేర్వేరుగా ఆయా అంశాలపై దృష్టి సారిస్తే... బంగారం: అంతర్జాతీయ ఫ్యూచర్స్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో శుక్రవారం బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్లు ఎగసి 1,553.95 డాలర్ల స్థాయి తాకింది. పసిడికి ఇది నాలుగు నెలల గరిష్టస్థాయి. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో ఒక దశలో 10 గ్రాములు.. 24 స్వచ్ఛత పసిడి ధర రూ.791 లాభంతో రూ.40,068 వద్ద ట్రేడయ్యింది. గురువారంతో పోలి్చతే ఇది 2 శాతంకన్నా అధికం. వెండి కేజీ ధర కూడా ఒకశాతం పైగా పెరుగుదలతో రూ. 47,507 వద్ద ట్రేడయ్యింది. దేశంలోని పలు స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు రూ.40,000, వెండి ధరలు 51,000పైన ముగియడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర లాభాలతో.. 18.14 డాలర్లను తాకింది. రూపాయి బలహీనత కొనసాగి, అంతర్జాతీయంగా ధరలు పటిష్టంగా ఉంటే.. సోమవారం దేశీ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్: ఇక క్రూడ్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ నైమెక్స్ బ్యారల్ ధర ఒక దశలో 4 శాతం పెరిగి 64 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు దాడులకు తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో బంగారం సహా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నది నిపుణుల అంచనా. డాలర్ ఇండెక్స్ కూడా ఫ్యూచర్స్ మార్కెట్లో పటిష్టంగా (96.48) కొనసాగుతుండడం గమనార్హం. రూపాయి... 42పైసలు పతనం ముంబై: అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హతమవడం రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42పైసలు పతనమైంది. నెలన్నర కనిష్టం 71.80కి పడిపోయింది. అమెరికా దాడి... ఇరాన్ హెచ్చరికలు.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల... ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీసింది. 71.56 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.81ని కూడా చూసింది. వారంవారీగా రూపాయి 45 పైసలు నష్టపోవడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
పది రోజుల్లో 84 పైసలు పెరిగిన పెట్రోలు ధర
-
పెరిగిన పెట్రోలు ధర
సాక్షి, ముంబై : పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసల చొప్పున ఎగిసింది. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెంట్ ఫూచర్స్ 0.3 శాతం పెరిగి బ్యారెల్కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. బుధవారం రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పది రోజుల్లో పెట్రోలు ధర 85 పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.16, డీజిల్ ధర 71.80 విజయవాడ : పెట్రోలు ధర రూ. 77.40, డీజిల్ ధర 70.76 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర 65.79 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.15, డీజిల్ ధర 68.2 చెన్నై : పెట్రోలు ధర రూ. 76.34 డీజిల్ ధర 69.54 ముంబై : పెట్రోలు ధర రూ. 79.12, డీజిల్ ధర 69.01 -
ముడిచమురు ముప్పు?
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల భారత ఈక్విటీలకు అతిపెద్ద రిస్కని సీఎల్ఎస్ఏ ఈక్విటీ వ్యూహకర్త క్రిస్వుడ్ హెచ్చరించారు. మే2 తర్వాత ఇరాన్ చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మినహాయింపు ముగిసిపోతుందని, తదనంతరం బ్రెంట్ క్రూడ్ ధర వందడాలర్ల వరకు దూసుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వీలయినంతవరకు ఈక్విటీ పొజిషన్లను చమురు స్టాకులతో హెడ్జ్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు తన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో సలహా ఇచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరం మార్చుకునే చాన్సులు కూడా ఉన్నాయని వుడ్ అభిప్రాయపడ్డారు. చైనాతో వాణిజ్య యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఇరాన్ చమురు కొనుగోలుపై ఆంక్షల అంశాన్ని ట్రంప్ వాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం సౌదీ తన ఉత్పత్తి పెంచుకునేందుకు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నా అంగీకరించడం లేదని, అందువల్ల అటు చైనా, ఇటు సౌదీలను దారిలో తెచ్చుకునేలా ఇరాన్ ఆయిల్పై ట్రంప్ స్వరం మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ టెన్షన్ల కారణంగా చమురు ధరలు ఇంతవరకు దాదాపు 40 శాతం ర్యాలీ చేశాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ధర 75 డాలర్లను తాకింది. చమురు ధరల్లో అనూహ్య పెరుగుదల దేశీ కరెన్సీపై పడింది. దీంతో రూపీ 70 స్థాయిలకు పైన కదలాడుతోంది. ప్రస్తుతం ఇండియా స్టాక్ మార్కెట్పై సానుకూలంగా ఉన్నా, రూపాయిపై తాను ఆసక్తిగా లేనని వుడ్ చెప్పారు. రూపాయి వాస్తవ ఎక్చేంజ్ రేటు లెక్కన ఇంకా చౌకగా లేదని, ఆర్బీఐ పాలసీలో వచ్చిన మార్పుతో రూపాయికి రక్షణ తగ్గిందని వివరించారు. ఎన్నికలు– ఎకానమీ మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక ఆర్థ్ధిక నిర్ణయాల్లో నోట్లరద్దు, జీఎస్టీ ఎకానమీపై పెను ప్రభావం చూపాయి. వీటిలో నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థకు అత్యంత చెరుపు చేసిందని వుడ్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎకానమీలో నల్లధనం ఏరివేతే నోట్లరద్దు ఉద్దేశమని, కానీ అసంఘటిత రంగానికి నోట్ల రద్దు చాలా కీడు చేసిందని, ఇదే తరుణంలో వచ్చిన జీఎస్టీతో ఈ రంగానికి మరింత ఇక్కట్లు కలిగాయని చెప్పారు. ముఖ్యంగా బీజేపీకి ప్రధాన మద్దతుదారులైన చిన్న వ్యాపారస్థులకు జీఎస్టీ దెబ్బ గట్టిగా తగిలిందన్నారు. అయితే తాజా ఎన్నికల్లో తిరిగి మోదీనే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని, కానీ గతంలో కన్నా మెజార్టీ తగ్గవచ్చని అంచనా వేశారు. అందుకే మోదీ ఈ దఫా గుజరాత్లో సైతం గట్టిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఎకానమీ సంబంధిత అంశాలను ఆయన ప్రస్తావించడం లేదని, కేవలం జాతీయత, దేశభక్తి, పాక్కు గుణపాఠం వంటి అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్నారు. ఆందోళనలో ఆటోమొబైల్ ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల దేశీయ ఆటోమొబైల్రంగాన్ని ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ సరఫరా లోటు భర్తీ చేసేందుకు ఇతర దేశాలు ముందుకు వస్తున్నా, రాబోయే కొన్ని వారాల పాటు మాత్రం ముడిచమురు ధరలకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చమురు ఆధారిత రంగాలన్నీ క్రూడ్ ధర 90 డాలర్లను దాటకూడదని ఆశిస్తున్నాయి. ఒకవేళ క్రూడ్ 90 డాలర్లను దాటితే వెంటనే ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం కనిపిస్తుంది. ఒకపక్క కొన్ని నెలలుగా దేశీ ఆటో విక్రయాలు మందగించాయి. ఇదే సమయంలో పెరుగుతున్న చమురు ధరలు ఆటో మొబైల్ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ క్రూడ్ 80 డాలర్లను చేరితే అసలే అంతంతమాత్రంగా ఉన్న విక్రయాలు మరింత దిగజారతాయని ప్రముఖ కంపెనీలు భయపడుతున్నాయి. క్రూడాయిల్ ధరల ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. కొందరు నిపుణులు మాత్రం ముడిచమురు ధరలు మరింత పెరిగితే టూవీలర్ విక్రయాలు, అందునా అధిక మైలేజ్ ఇచ్చే వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీలెవల్ బైక్స్, కాంపాక్ట్ కార్ల విక్రయాలు సైతం పాజిటివ్గా ఉండే చాన్సులున్నాయి. ఓఎంసీలకు గడ్డుకాలం! మరింత రాబడి కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలపై(ఓఎంసీ) ప్రభుత్వం తెస్తున్న ఒత్తిళ్ల కారణంగా సమీప భవిష్యత్లో ఈ కంపెనీల ఫైనాన్షియల్ ప్రొఫైల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఓఎంసీల ఫలితాలు ఇబ్బందుల్లో పడితే వాటి క్రెడిట్ రేటింగ్ డౌన్గ్రేడ్ చేసే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరించింది. బడ్జెట్లో పేర్కొన్న డిజి న్వెస్ట్మెంట్ అంచనాలను అందుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోందని తెలిపింది. ఇందుకోసం నగదునిల్వలు భారీగా ఉన్న పీఎస్యూలను రెండో దఫా మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని, షేర్ బైబ్యాక్ చేపట్టాలని కోరుతోందని తెలిపింది. ఈ కంపెనీలు వచ్చే రెండేళ్ల కాలానికి రూపొందించుకున్న పెట్టుబడుల ప్రణాళికలకు బైబ్యాక్లు, డివిడెండ్లు విఘాతం కల్పిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఓఐఎల్కు బీబీబీ నెగిటివ్ రేటింగ్, ఐఓసీ, బీపీసీఎల్కు బీబీ ప్లస్ రేటింగ్ ఉంది. క్రూడ్ ధర పెరిగినా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే వీటికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2008 రిపీట్?! ప్రస్తుత పరిస్థితులు 2008లో ముడిచమురు మార్కెట్ను గుర్తు చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అప్పట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పరుగులు తీసి 150 డాలర్ల వరకు చేరాయి. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువ దేశాల్లో చమురు ధరలపై ప్రభుత్వాల నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు చాలా దేశాలు ఓపెన్ మార్కెట్కు మరలాయి. ఇండియాలో చమురు ధరలపై ప్రభుత్వ పెత్తనం ఉన్నంత వరకు ఎకానమీపై తీవ్ర ఒత్తిడి ఉండేది. ధర పెరిగే కొద్దీ ప్రభుత్వం సబ్సిడీలు పెంచుతూ పోవాల్సి వచ్చేది. కానీ గత నాలుగైదేళ్లుగా చమురు ధరలు బాగా దిగివచ్చాయి. చాలా రోజులు క్రూడ్ ధర 40 డాలర్ల వద్ద కదలాడింది. ఈ సమయంలో ప్రభుత్వానికి చాలా మిగులు కలిగింది. ఇదే సమయంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేయడం కూడా జరిగింది. అంతర్జాతీయంగా అమెరికా షేల్ గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల గతంలోలాగా ముడిచమురు 150 డాలర్లకు చేరకపోవచ్చని ఎక్కువమంది భావన. -
ముడిచమురు @ 75 డాలర్లు
లండన్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు మంటలు మొదలయ్యాయి. గురువారం ట్రేడింగ్లో బ్రెంట్క్రూడ్ ధర 75 డాలర్ల పైన ఆరునెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఇరాన్పై ఆంక్షలతో చమురు సరఫరా అతలాకుతలం అవుతుందన్న ఆందోళనలు చమురు ధరల్లో కాక పెంచాయి. గురువారం ఇంట్రాడేలో బ్రెంట్ క్రూడ్ 75.60 డాలర్లను తాకింది. గత అక్టోబర్ తర్వాత ఈ స్థాయి చూడడం ఇదే తొలిసారి. మరోవైపు డబ్లు్యటీఐ క్రూడ్ సైతం ఆరునెలల గరిష్టం 66.16 డాలర్లను చేరింది. ఇరాన్పై గతంలోనే ఆంక్షలు విధించిన అమెరికా అప్పట్లో ఎనిమిది దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజాగా ఈ మినహాయింపును కొనసాగించేది లేదని యూఎస్ స్పష్టం చేసింది. మే2తో మినహాయింపుల గడువు ముగియనుంది. ఇరాన్ సరఫరా కొరతను దృష్టిలో ఉంచుకొని ఒపెక్ తన ఉత్పత్తి కోతలను తగ్గించుకుంటుందా, లేక కొనసాగిస్తుందా? అని నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు చమురు ఉత్పత్తి పెంచే ఆలోచనేమీ లేదని ఒపెక్ పెద్దన్న సౌదీ బుధవారం ప్రకటించింది. ఆంక్షల ప్రభావం ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా చమురు ఇన్వెంటరీల్లో మంచి పెరుగుదలే నమోదవుతోందని, అందువల్ల ఇప్పుడే ఉత్పత్తి కోతను తగ్గించాలని అనుకోవడం లేదని సౌదీ ఎనర్జీ మంత్రి ఖలీద్ అల్ఫలీహ్ చెప్పారు. ఒపెక్, రష్యాలు తీసుకున్న ఉత్పత్తి కోత నిర్ణయాలే ఈ ఏడాది చమురు ధరల్లో రికవరీకి కారణం. ప్రస్తుతం ఇరాన్, వెనుజులా, లిబియాల్లో ఉత్పత్తి, సరఫరా సంక్షోభంలో పడినందున ఒపెక్ కోతలు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలకు రెక్కలు వస్తాయని అంచనా. ఆంక్షలు అక్రమం యూఎస్ తమపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ అధిపతి ఆయతుల్లా ఖొమైనీ డిమాండ్ చేశారు. తమ చమురు సరఫరాపై ఆంక్షల విధింపు అక్రమమని, ఇందుకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ ఎంత కావాలంటే అంత, ఎవరికి కావాలంటే వాళ్లకి చమురు సరఫరా చేయగలదన్నారు. 2015లో ఇరాన్తో ప్రపంచ అగ్రదేశాలు కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఆంక్షలను విధించారు. అయితే ముందస్తు ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షల నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే మినహాయింపులు పొందిన ఎనిమిది దేశాల్లో ఐదు దేశాలు(గ్రీస్, ఇటలీ, జపాన్, సౌత్కొరియా, తైవాన్) ఇరాన్ చమురు దిగుమతులను సాధ్యమైనంతవరకు తగ్గించుకున్నాయి. చైనా, ఇండియాలు మాత్రం మినహాయింపుల కొనసాగింపు కోసం చివరి వరకు యత్నించాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా రష్యా నుంచి పొలండ్, జర్మనీకి జరిగే చమురు సరఫరా సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం కూడా ముడిచమురు డిమాండ్ పెరిగేందుకు కారణమైంది. ఈ పరుగు తాత్కాలికమేనా? ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బ్రెంట్ధర దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందన్న ఆందోళనలు పెరిగిపోతున్న తరుణాన, బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందగమన ప్రభావంతో మార్కెట్లో చమురు నిల్వలు పెరిగిపోతున్నాయని, సరఫరా ఎక్కడా దెబ్బతినలేదని యూఎస్ ప్రత్యేక ప్రతినిధి బ్రైన్హుక్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి రష్యా, సౌదీ, ఇరాక్లు తగ్గించిన ఉత్పత్తి ఇరాన్ చమురు సరఫరాకు దాదాపు సమానమని ఎనర్జీ కన్సెల్టెన్సీ రైస్టాడ్ఎనర్జీ వెల్లడించింది. ఈ దేశాలు కోతలను ఆపేస్తే చమురు సరఫరా యథాత«థంగా ఉంటుందని, అందువల్ల ధరలు విపరీతంగా పెరగకపోవచ్చని పేర్కొంది. యూఎస్ షేల్ గ్యాస్ ఉత్పత్తి బలంగా పెరుగుతున్నది, దీంతో ప్రపంచంలో సౌదీ, రష్యాలను తోసిరాజని అమెరికా చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందని, అందువల్ల ఈ ఏడాది చమురు ధరల్లో డౌన్ట్రెండ్ ఉండొచ్చని క్యాపిటల్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఇందుకు తగ్గట్లే సౌత్కొరియా ఎకానమీ తొలి త్రైమాసికంలో అనూహ్యంగా తరుగుదల నమోదు చేసింది. చైనా సైతం మందగమన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మందగమన భయాలతో పలు దేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు సహా పలు చర్యలను ప్రకటిస్తున్నాయి. -
రూపాయి 47పైసలు పతనం
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి నష్టాలతో ప్రారంభమైంది. డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపాయి 47పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్ చమురు ధర 73.77 డాలర్ల వద్ద 5 నెలల గరిష్టాన్నినమోదు చేసింది. -
రెండోరోజూ... రూపాయి పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కిందకు జారింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42 పైసలు తగ్గి, 69.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పటిష్టత దీనికి నేపథ్యం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనితో వడ్డీరేట్లు తగ్గిస్తూ, సరళతర ఆర్థిక విధానాలవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసియా దేశాల కరెన్సీలూ ఒత్తిడికి గురవుతున్నాయి. ట్రేడింగ్లో 69.04 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.35నూ తాకింది. బుధవారం రూపాయి 2 పైసల నష్టంతో రూ.68.88 వద్ద ముగిసింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా 2 నెలల క్రితం గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్లు పడిపోవడంతో రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ తాజా కనిష్ట స్థాయిల నుంచి 13 డాలర్లకుపైగా పెరగడంతో ఆతర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. 2 నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. తాజాగా 68.50 స్థాయిని చూసింది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం..!
ముంబై: ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య పరమైన చర్చలు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఈవారంలో మార్కెట్లను ప్రభావితం చేసే దేశీ ఆర్థిక అంశాలు ఏమీ లేనందున.. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్తో రూపాయి మారకం విలువ కదలికలు సూచీలపై ప్రభావం చూపనున్నాయి.’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ వెల్లడించారు. మార్కెట్ను ప్రభావితం చేసే సానుకూల అంశాలు లేకపోవడం, ముడిచమురు ధరలు పెరుగుతుండడం వంటి ప్రతికూలతలు ఉన్న కారణంగా ఈవారంలో అధిక శాతం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం! మంగళవారం హౌసింగ్ మార్కెట్ ఇండెక్స్ డేటా వెల్లడితో ఈవారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు ప్రారంభంకానున్నాయి. 20న (బుధవారం) రెడ్బుక్ ఈ–కామర్స్ రిటైల్ సేల్స్, ఫిబ్రవరి 15తో ముగిసే వారానికి యూఎస్ ఎంబీఏ మార్టిగేజ్ అప్లికేషన్ డేటా వెల్లడికానుంది. గురువారం ఎఫ్ఓఎంసీ మినిట్స్, ఏపీఐ క్రూడ్ వివరాలు... ఫిబ్రవరి 16తో ముగిసే వారానికి జాబ్లెస్ క్లెయిమ్స్, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ వెల్లడికానున్నాయి. అదే రోజున ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల గణాంకాలు, ఫిబ్రవరి కాంపోజిట్ అండ్ సర్వీసెస్ పీఎంఐ డేటా కూడా గురువారమే వెల్లడికానుంది. ఇతర ప్రధాన దేశాల స్థూల ఆర్థిక అంశాల విషయానికి వస్తే.. సోమవారం జనవరి నెలకు సంబంధించిన చైనా వాహన విక్రయ గణాంకాలు, జపాన్ డిసెంబర్ మెషినరీ ఆర్డర్స్ వెలువడనుండగా.. మంగళవారం యూరో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, డిసెంబర్ నిర్మాణ డేటా వెల్లడికానుంది. గురువారం యూరో జోన్ ఫిబ్రవరి తయారీ, కాంపోజిట్ అండ్ సర్వీసెస్ పీఎంఐ వెల్లడికానుంది. ఈ ప్రాంత జనవరి ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ఇదే రోజున చైనా జనవరి నెల గృహ ధరల సూచీ, జపాన్ జనవరి ద్రవ్యోల్బణం వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంతర్జాతీయ అంశాలకు తోడు ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట..! వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ ఈనెల 20న (బుధవారం) సమావేశంకానుంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో మంత్రుల బృందం సిఫార్సుల మేరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభించనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిమెంట్పై ప్రస్తుతం ఉన్నటువంటి 28% పన్నురేటును 18%కి తగ్గించాలని ప్రతిపాదన ఉండగా.. అందుబాటు గృహాల విభాగానికి చెందిన ప్రాజెక్టులపై అమల్లో ఉన్న 8% పన్నును 3%కి తగ్గించాలనే సిఫార్సులను కౌన్సిల్ పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందని అంచనా. మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలా వద్దా..? ఈ ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తిపై కేంద్ర బ్యాంక్ సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ మేరకు ఢిల్లీలో సమావేశంకానున్న ఆర్బీఐ బోర్డు సమావేశం జరగనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతేడాది డిసెంబర్లో 50 డాలర్ల కనిష్టాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర.. గతవారం చివరినాటికి 31% పెరిగింది. గతవారంలో 6.7% పెరిగి 66.25 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ గతవారం 9 పైసలు బలహీనపడింది. ఈవారంలో రూపాయి విలువ 71.60–70.90 స్థాయిలో ఉండొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చెబుతోంది. ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు ఫిబ్రవరి 1–15 కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) రూ.5,322 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే ఇదే సమయంలో రూ.248 కోట్లను వీరు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.5,074 కోట్లను ఈ 15 రోజుల్లో ఎఫ్పీఐలు పెట్టుబడి పెట్టారు. ఇకపై వీరు ఎటువంటి ధోరణి అవలంభిస్తారనే అంశం లోక్ సభ ఎన్నికలు, క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉందని బజాజ్ క్యాపిటల్ హెడ్ అలోక్ అగర్వాల్ అన్నారు. -
రూపాయికి ‘ఇంధనం’...
ముంబై: భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే క్రూడ్ ధరలు భారీ పతనం, దీనితో కరెంట్ అకౌంట్ లోటుపై (ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగ్గిన ఆందోళనలు రూపాయి సెంటిమెంట్ను బలోపేతం చేస్తున్నాయి. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 69 పైసలు రికవరీతో 69.70 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (2.25–2.5 శాతం) పెంచినా కూడా రూపాయి బలపడటానికి ప్రధాన కారణం క్రూడ్ ధరలు దిగిరావడమేనని విశ్లేషణ. రూపాయి వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచీ రికవరీ అవుతూ వస్తోంది. ఈ రోజుల్లో 220 పైసలు బలపడింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు స్పీడు తగ్గుతుందన్న విశ్లేషణలు అటు డాలర్నూ కిందకు నెట్టడం గమనార్హం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు చూస్తే... అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి 30 డాలర్లకుపైగా కిందకు దిగాయి. న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్చంజ్లో ట్రేడయ్యే లైట్ స్వీట్ బేరల్ ధర గురువారం ఒక దశలో 45.83ను తాకింది. ఈ వార్త రాసే 7 గంటల సమయంలో 46 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాదిన్నర కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. ఈసీబీపై ఆర్బీఐ పరిమితులు ఇదిలాఉండగా, విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)కు సంబంధించి ఆర్బీఐ తాజాగా నియంత్రణలు విధించింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో)లో ఈసీబీల పరిమాణం 6.5 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి ఈసీబీలు 160 బిలియన్ డాలర్లు దాటకూడదు. సెప్టెంబర్ 30 నాటికి ఈసీబీలు 126 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
చల్లబడిన చమురు : మార్కెట్లు జంప్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో కీలక సూచీలు భారీగా పుంజుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్ చివరికి 332 పాయింట్లు జంప్చేసింది. 35,144 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 10,582 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ కీలకమైన 10550పైన ముగిసింది. ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో రంగాలు పుంజుకోగా.. ఫార్మా రియల్టీ నష్టపోయాయి. ఐషర్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, అల్ట్రాటెక్, గ్రాసిమ్, యాక్సిస్, ఎల్అండ్టీ టాప్ విన్నర్స్గా నిలవగా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, పవర్ గ్రిడ్, సిప్లా, హెచ్సీఎల్ టెక్ నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒపెక్ లేదా పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థలపై ఒత్తిడి నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ ముడి చమురు ధరలు 1 శాతం తగ్గాయి. దీంతో అటు ఈక్విటీ మార్కెట్లు, ఇటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బాగా పుంజుకుంది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
డీజిల్ ధర కూడా దిగి వచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం మరింత తగ్గాయి. ఒక రోజు విరామం తరువాత నిన్న పెట్రోలు ధరను తగ్గించి, డీజిల్ ధరను యథాతథంగా ఉంచిన ఆయిల్ సంస్థలు తాజాగా డీజిల్ రేటును కూడా తగ్గించాయి. పెట్రోలుపై లీటరుకు 19 పైసలు, డీజిల్ ధర లీటరుకు14 పైసలు తగ్గింది. తాజా తగ్గింపుతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీ: పెట్రోలు లీటరుకు రూ. 79.18, డీజిలు రూ. 73.64గా ఉంది. ముంబై : పెట్రోలు లీటరుకు రూ.84.68, డీజిలు రూ. 77.18గా ఉంది. హైదరాబాద్ : పెట్రోలు లీటరుకు రూ.83. 96, డీజిలు రూ.80.12గా ఉంది. విజయవాడ: పెట్రోలు లీటరుకు రూ.83.10, డీజిలు రూ. 78.87గా ఉంది. -
రూపాయి రయ్ రయ్
ముంబై: ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, దేశీ ఆర్థిక పరిస్థితుల గణాంకాలు మెరుగ్గా ఉండటం తదితర అంశాలతో రూపాయి మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్తో పోలిస్తే 50 పైసల మేర ర్యాలీ చేసి 73.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మధ్య విభేదాలపై ఆందోళనలు కొంత తగ్గడం సైతం రూపాయి రికవరీకి తోడైనట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజీలో క్రితం ముగింపు 73.95తో పోలిస్తే మెరుగ్గా 73.88 వద్ద గురువారం రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత మరింతగా బలపడి చివరికి 50 పైసల లాభంతో 73.45 వద్ద క్లోజయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 12 తర్వాత ఒకే రోజున రూ పాయి ఇంతగా పెరగడం ఇదే ప్రథమం అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ విభాగం హెడ్ వీకే శర్మ చెప్పారు. డాలర్ బలపడటంతో బుధవారం నాడు రూపాయి మారక ం విలువ 27 పైసలు క్షీణించి మూడు వారాల కనిష్టమైన 73.95 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రధాన నగరాల్లో తగ్గిన పెట్రో ధర
సాక్షి, న్యూఢిల్లీ:అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా 13వ రోజులపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు నిన్న (బుధవారం ,అక్టోబరు 31) స్వల్పం విరామం తరువాత నేడు గురువారం (నవంబరు 1) వాహనదారులకు మరోసారి మరింత ఊరట కలిగించాయి. అయితే పెట్రోలు ధరలను తగ్గించిన ఆయిల్ కంపెనీలు డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత తగ్గింపుతో వాణిజ్య రాజధాని ముంబైలో 16 పైసలు తగ్గిన పెట్రోలు లీటరు ధర రూ.84.86గా ఉండగా, డీజిల్ ధర రూ.77.32 వద్ద ఉంది. ఢిల్లీలో 16 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.79.39. డీజిల్ ధర రూ.73.78 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.84.14 పలుకుతోంది. డీజిల్ ధర రూ.80.25 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.29 , డీజిల్ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు రూ .79.99. డీజిల్ ధర రూ.74.16. కోల్కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.25. డీజిల్ ధర రూ. 75.63. చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.65 గాను, డీజిల్ ధర లీటరుకు78 రూపాయలుగాను ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల దిగువకు పడిపోయింది. క్రూడాయిల్ ధర 74.73 డాలర్లకు చేరింది. అక్టోబరులో బ్యారెల్ ధర 86 డాలర్ల గరిష్టస్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
తగ్గిన ‘చమురు’ సెగ పెరిగిన రూపాయి విలువ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ట స్థాయిల నుంచి తగ్గిన క్రూడ్ ధర రూపాయి విలువకు కలిసివస్తోంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం 29 పైసలు బలపడింది. 73.32 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి ట్రేడింగ్ 73.62 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత ఒకదశలో 73.31కి కూడా చేరింది.ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. ఈ కనిష్ట స్థాయిలను చూసిన తర్వాత రెండు రోజుల మినహా (సోమవారం, బుధవారం) మిగిలిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి (100 పైసలకు పైగా) రికవరీ అవుతూ వస్తున్న విషయం గమనార్హం. కారణాలు... ♦ అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయి– 86.74ను తాకిన బేరల్ బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 80 స్థాయిలో ట్రేడవుతోంది. ♦ ఆరు దేశాల కరెన్సీలపై ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 96పైన నిలబడలేకపోవడం రూపాయి సెంటిమెంట్ను కొంత బలపరుస్తోంది. ♦ శుక్రవారం ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పటికీ, ఫారిన్ ఫండ్స్ రూ.140 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. -
పెట్రో వాత : ఆగస్టునుంచి ఎంత?
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 16పైసలు పైకి ఎగబాకింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ధర సోమవారం 83.21 డాలర్ల నుంచి బ్యారెల్కి 85 డాలర్లకు చేరింది. త్వరలోనే బ్యారెల్కు 100 డాలర్లు తాకే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు మధ్యకాలం నుంచి పెట్రోలు లీటరుకు 6.50 రూపాయల మేరకు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రోజువారీ పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెంపు డాలరు మారకంలో రూపాయి విలువ అంతకంతకూ మరింత దిగజారుతోంది. దేశీయకరెన్సీ డాలరు మారకంలో సోమవారం 72.91 వద్ద ముగిసింది. -
రూపాయికి చమురు సెగ!
ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మళ్లీ తీవ్రం అవుతుండడంతోసహా పలు అంశాలు డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ కరగడానికి కారణమవుతున్నాయి. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ మార్కెట్ (ఫారెక్స్)లో రూపాయి విలువ సోమవారం ఒకేరోజు 43 పైసలు (0.60 శాతం) పతనమయ్యింది. 72.63 వద్ద ముగిసింది. రెండు రోజుల పాటు క్రమంగా బలపడుతూ, రూపాయి గడచిన శుక్రవారం 72.20 వద్ద ముగిసింది. అయితే సోమవారం ప్రారంభంతోటే బలహీనంగా 72.47 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం ఇంట్రాడే ట్రేడింగ్లో 72.73 స్థాయిని కూడా తాకింది. ♦ అంతర్జాతీయంగా 96 స్థాయిని చూసిన డాలర్ ఇండెక్స్, మళ్లీ 93 స్థాయిని చూస్తున్నప్పటికీ... రూపాయి పతనానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. ♦ ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలు క్రూడ్ ధరలు పెరగడానికి కారణమవుతోంది. ♦ క్రూడ్ ఆయిల్ ధరలకు తోడు అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రతికూల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది. ♦ గత వారం రూపాయి ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు 72.99, 72.98లను చూసింది. అటు తర్వాత శుక్రవారంతో ముగిసిన రెండు ట్రేడింగ్ సెషన్లలో 78పైసలు బలపడి, 72.20 స్థాయికి చేరింది. అయినా ఈ స్థాయిలో నిలబడలేకపోవడం గమనార్హం. ♦ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఉపసంహరణ కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతుండడం గమనార్హం. సెప్టెంబర్లో ఇప్పటి వరకూ 2.1 బిలియన్ డాలర్ల (రూ.15,365 కోట్లు) ఈ తరహా ఉపసంహరణలు జరిగాయి. ♦ ఇక సోమవారం ప్రధాన దేశాల కరెన్సీలతో కూడా రూపాయి బలహీనపడింది. బ్రిటన్ పౌండ్ విషయంలో 95.28 నుంచి 95.41కి పడింది. యూరోలో 84.96 నుంచి 85.43కి జారింది. జపాన్ యన్ 64.06 నుంచి 64.50కి పడింది. రూపాయి బలపడకపోవచ్చు: మూడీస్ విదేశీ పెట్టుబడులు పెరగడానికి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఐదు సూత్రాల ప్రణాళిక రూపాయి బలోపేతానికి దోహదపడకపోవచ్చని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఈ చర్యలు ఫలితాన్ని ఇవ్వడానికి కొన్నాళ్లు పట్టే అవకాశం ఉండడమే తన అంచనాలకు కారణమని తెలిపింది. భారత్ విదేశీ నిధులకు సంబంధించి అకౌంట్కు కేంద్ర చర్యలు క్రెడిట్ పాజిటివ్ అవుతాయే తప్ప రూపాయి బలోపేతానికి మాత్రం తక్షణం దోహదపడవన్నది తమ అంచనా అని తెలిపింది. కాగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉన్నందున, రూపాయి బలహీనమైనా తక్షణ ప్రతికూలతలు ఏవీ ఉండబోవని విశ్లేషించింది. 2019 జూన్ నాటికి 95 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనా నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకిన చమురు ధర ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 2019 జూన్ నాటికి 95 డాలర్లకు చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఆఫ్ఏఎంఎల్) విశ్లేషించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం నాలుగు సంవత్సరాల గరిష్టస్థాయి 80.74ను తాకిన నేపథ్యంలో బీఓఏ ఎంఎల్ తాజా విశ్లేషణ చేసింది. ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ధర నాలుగేళ్ల గరిష్టం 80.50ని తాకింది. మళ్లీ సోమవారం ఈ స్థాయిని క్రూడ్ అధిగమించడం గమనార్హం. ఇరాన్పై అమెరికా ఆంక్షలు దీనికి నేపథ్యం. భారత్ క్యాడ్పై ప్రభావం... కాగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపుతుందని బీఓఏ ఎంఎల్ విశ్లేషించింది. ‘‘2018–19లో 2.8 శాతానికి క్యాడ్ పెరిగే అవకాశం ఉంది. 2019–20లో ఇది 2.9 శాతంగా ఉంటుంది’’ అని విశ్లేషించింది. గతంలో ఇది 2.6 శాతంగా ఉండొచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 13 శాతం పతనమైన రూపాయికి బీఓఏ ఎంఎల్ తాజా అంచనా ప్రతికూలమైనదే. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీలు మినహా ఒక దేశానికి వచ్చీ– పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. దీనిని సంబంధిత నిర్దిష్ట కాల స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి శాతాల్లో చూస్తారు. 2018–19 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత్ క్యాడ్ జీడీపీలో 2.4 శాతం. విలువలో 15.8 బిలియన్ డాలర్లు. -
ప్రపంచ పరిణామాలే ప్రధానం
మళ్లీ చెలరేగిన వాణిజ్య యుద్ధ భయాలు ఈ వారం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రుతుపవనాల విస్తరణ, డాలర్తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ తదితర అంశాలు కూడా మార్కెట్పై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఆర్బీఐ పాలసీ, రిటైల్, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వంటి కీలకమైన దేశీయ అంశాలన్నీ ముగియడంతో భారత స్టాక్ మార్కెట్ స్తబ్దత స్థాయికి వెళ్లిపోయిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకని ఈ వారం అంతర్జాతీయ సంకేతాలే మార్కెట్కు కీలకమని వారంటున్నారు. వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించడంతో..అందుకు ప్రతిగా చైనా కూడా సుంకాలు విధించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగే అవకాశాలుండటం మార్కెట్పై ప్రభావం చూపించనున్నదని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) టీనా వీర్మాణి చెప్పారు. కీలకమైన దేశీయ అంశాలు అన్నీ ముగిసిపోయాయని, ఇక అంతర్జాతీయ పరిణామాలపైననే అందరి కళ్లూ ఉంటాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తపా నదీమ్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రుతు పవనాల విస్తరణపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగడం సమీప భవిష్యత్తులో మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ముడి చమురు సరఫరా కోతల విషయమై ఒపెక్, రష్యాల సమావేశంపై మార్కెట్ దృష్టి పెడుతుందని వివరించారు. రూపాయి క్షీణత మార్కెట్లో కొంత వరకూ కలవరం సృష్టిస్తున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సెన్సెక్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నేటి నుంచి సెన్సెక్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్థానంలో వేదాంత షేర్ను చేరుస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్ నిచ్చాయి. అయితే నైరుతి రుతు పవనాలు సకాలంలోనే ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతోంది. రెండు ఐపీఓలు.. ఇక ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తున్నాయి. రూ.180–185 ప్రైస్బ్యాండ్తో రైల్వేలకు చెందిన రీట్స్ కంపెనీ రూ.460 కోట్లు సమీకరించనున్నది. మరోవైపు రూ.780–783 ప్రైస్బ్యాండ్తో ఫైన్ ఆర్గానిక్స్ కంపెనీ రూ.600 కోట్లు సమీకరించనున్నది. ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ రెండు కంపెనీల ఐపీఓలు ఈ నెల 22న ముగుస్తాయి. ఈ రెండు కంపెనీల షేర్లు వచ్చే నెల 2న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాల పరంగా చూస్తే, నేడు(సోమవారం) జపాన్ వాణిజ్య గణాంకాలు వస్తాయి. ఈ నెల 20న(బుధవారం) జపాన్ కేంద్ర బ్యాంక్ సమావేశ వివరాలు, అమెరికాలో ఇళ్ల విక్రయ గణాంకాలు వెల్లడవుతాయి. ఈ నెల 21న(గురువారం) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడుతుంది. శుక్రవారం (ఈ నెల 22న) జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. రూ. 5,500 కోట్ల విదేశీ నిధులు వెనక్కి... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మన క్యాపిటల్ మార్కెట్ నుంచి ఈ నెలలో రూ.5,500 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.831 కోట్లు, డెట్మార్కెట్ నుంచి రూ.4,683 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు చెలరేగడం, రేట్ల పెంపు విషయమై ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యల కారణంగా ఈ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.2,400 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.35,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
పెట్రో సుంకం తగ్గిస్తే ద్రవ్యలోటు పైపైకే...
న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలతో ఒకపక్క ప్రజల జేబుకు చిల్లు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వం కూడా దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోకుండా, పెట్రోలు, డీజిల్పై గనుక ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే.. ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కొంత ఊరట కల్పించాలంటూ అన్నివైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, పెట్రోలు, డీజిల్పై ప్రతి రూపాయి సుంకం తగ్గింపుతో ఖజానాకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. ‘బీఏఏ’ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే... ఆర్థిక క్రమశిక్షణ విషయంలో భారత్ చాలా వెనుకబడిందని మూడీస్ పేర్కొంది. వ్యయాలను తగ్గించుకుంటేనే... ‘ఒకవేళ పెట్రో ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తే... దానికి అనుగుణంగా వ్యయాలను కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. లేదంటే ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది’ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్(సావరీన్ రిస్క్ గ్రూప్) విలియమ్ ఫోస్టర్ వ్యాఖ్యానించారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ భారత్ సావరీన్ రేటింగ్ను మూడీస్ గతేడాది పెంచిన(బీఏఏ2, స్థిర అవుట్లుక్) సంగతి తెలిసిందే. -
భారత ఆర్థికవ్యవస్థకు చమురు సెగ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్ను చమురు ధరల సెగ ప్రభావితం చేయనుందని ప్రముఖ ఆర్థిక ఎనలిస్టులు సంస్థలు విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, కరెంట్ అకౌంట్ లోటుకు తోడు రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కానుందని భావిస్తున్నారు. గురువారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 80 డాలర్ల మార్క్ను అధిగమించి,2014 నవంబర్నాటి స్థాయిలను తాకిన సంగతి తెలిసిందే. దేశీ ఇంధన అవసరాలకు సుమారు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన 1,575 మిలియన్ బారెల్స్ ముడి చమురు దిగుమతి చేసుకునే ఇండియాకు సుమారు 1.6 బిలియన్ డాలర్లు (రూ .10 వేల కోట్లు) పెంచుతుందని కేర్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడంతో గృహాల వాస్తవిక ఆదాయాలు తగ్గిపోవచ్చని, అందువల్ల వినియోగదారుడి డివిజనల్ డిమాండ్ దెబ్బతింటుందని నోమురా విశ్లేషించింది. ఇదే అంశంపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికె విజయకుమార్ మాట్లాడుతూ ఆర్బీఐ 2018 సంవత్సరానికి 68డాలర్లుగా అంచనావేయగా ముడి చమురు ధర ఏప్రిల్ నుంచి పది డాలర్ల మేర పెరిగిందన్నారు. బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు 80 డాలర్ల వద్ద ఉందనీ, ముడి చమురు ధరల్లో ప్రతి 10 డాలర్లు పెంపు, దేశంలో ద్రవ్యోల్బణం 10 బీపీఎస్ పాయింట్ల మేర పెరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో దేశీయ కరెన్సీపై మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. దిగుమతుల బిల్లును డాలర్లలో చెల్లించాల్సి ఉండటంతో రూపాయి మరింత బలహీనపడే అవకాశముంది. మరోవైపు ఎగుమతులకంటే దిగుమతుల బిల్లే ఎక్కువ కావడం కూడా డాలర్లకు డిమాండుకు జోష్నిస్తుంది. ప్రధానంగా ముడిచమురు, డాలరు బలపడటం వంటి అంశాలు దేశ ఆర్థిక లోటుకు కారణమవుతుంది. అటు చమురు ధరల పెరుగుదలతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెంపు అనివార్యం. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మరోపక్క ఏప్రిల్ తరువాత డాలరుతో మారంకలో రూపాయి ఏకంగా రూ. 3 పతనం కావడం గమనార్హం. ఏప్రిల్లో డాలరుతో మారకంలో రూపాయి 65 స్థాయిలో ట్రేడ్ కాగా... ప్రస్తుతం రూపాయి 68 దిగువకు పతనమైంది. కార్పొరేట్ లాభాల మార్జిన్లు భారీగా క్షీణించడంతో విమానయాన, పెయింటింగ్ , టైర్లు, ప్లాస్టిక్లు, రసాయనాలు, ఎరువులు, మైనపు, రిఫైనింగ్, పాదరక్షలు, సిమెంట్, లాజిస్టిక్స్ పరిశ్రమలను చమురు ధరల సెగ తాకనుంది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఆయా ఉత్పత్తుల ధరలను భారీగా ప్రభావితం చేయనుంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతాయని విజయ్కుమార్ తెలిపారు. -
మరో 34పైసలు నష్టపోయిన రుపీ
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ మరింత బలహీనపడింది. ఇటీవల నష్టాలను మరింత పెంచుకున్న రూపాయి కరెన్సీ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరో సెషన్లోకూడా బలహీనపడింది. డాలర్ మారకంలో సోమవారం కూడా నెగిటివ్గానే ముగిసింది. ఆరంభంలో 8పైసల నష్టంతో ట్రేడ్అయిన రూపాయి ఇన్వెస్టర్ల అమ్మకాలతోమరింత నష్టపోయింది. డాలర్ మారకంలో దాదాపు 34పైసలు (0.5శాతం) పతనమై 66.46వద్దకు చేరింది.నింగిని తాకుతున్న చమురు ధరలు రుపీ ట్రెండ్ను బలహీన పర్చాయని ట్రేడర్లు చెప్పారు. అలాగే రిజర్వ్ బ్య ాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు కరెన్సీలో అమ్మకాలకుదారితీసింది. అటు డాలర్ పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు , బ్యాంకర్ల కొనుగోలవైపు మొగ్గు చూపారు. దీంతో మార్చి 2017నాటి కనిష్టానికి చేరింది. -
క్రూడ్ షాక్, జియో దెబ్బ : రిలయన్స్కు భారీ నష్టం
ముంబై : అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోవడం, ఇటీవల కాలంలో టెలికాం నెట్వర్క్ జియో జోరు తగ్గడం మార్కెట్ విలువలో దేశీయ అతిపెద్ద కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ను భారీగా దెబ్బకొడుతున్నాయి. నవంబర్ మొదటి నుంచి బిలీనియర్ ముఖేష్ ఆంబానీ ప్రమోట్ చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో రూ.50వేల కోట్లను నష్టపోయింది. నవంబర్ నెల తొలి 13 రోజుల్లోనే కంపెనీ షేరు ధర 8 శాతానికి పైగా క్షీణించింది. ఆరు లక్షల కోట్లు దాటిని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ సోమవారం ముగింపు నాటికి రూ.5.53 లక్షల కోట్లకు పడిపోయింది. క్రూడ్ ధరలు అంతకంతకు పెరిగిపోవడం కంపెనీ విలువపై స్వల్పకాలికంగా ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దానికి సమానంగా దేశీయంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదు. సెప్టెంబర్ నుంచి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 10 డాలర్ల మేర పెరిగి, 63 డాలర్లుగా నమోదైంది. క్రూడ్ ఆయిల్ ధరలకు సమానంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగాలంటే కనీసం రెండు వారాల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్ పడిపోతుందనే భయాందోళనతో కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు మరో దెబ్బ దాన్ని టెలికాం వెంచర్ జియో ఇన్ఫోకామ్. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ కంపెనీ ఎక్కువ మొత్తంలో ఆఫర్లతో దంచికొడుతుండటంతో, అంతేమొత్తంలో రుణం కూడా పెరుగుతోంది. మరోవైపు ఇటీవల కాలంలో జియో జోరు తగ్గింది. సబ్స్క్రైబర్లను తక్కువ మొత్తంలో ఆకట్టుకుంది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన డేటాలోఆగస్టులో కేవలం 4.09 మిలియన్ కస్టమర్లను మాత్రమే జియో తన కస్టమర్లుగా యాడ్ చేసుకుంది. ఏడాది క్రితం కంపెనీ లాంచ్ అయినప్పటి నుంచి ఇదే రెండోసారి తక్కువ వృద్ధి నమోదుచేసిన నెల. 2017 జనవరి వరకు ప్రతి నెలా జియో 16 మిలియన్కు పైగా సబ్స్క్రైబర్లను ఆకట్టుకుంది. తర్వాత ఫిబ్రవరిలో 12 మిలియన్లకు, తర్వాత మార్చిలో 5.83 మిలియన్లకు, ఆ తర్వాత ఏప్రిల్లో మరింత కిందకి 3.87 మిలియన్లగా తన సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. కంపెనీ కొత్త ఆఫర్లను లాంచ్ చేయడంతో మే నెలలో మళ్లీ తన సబ్స్క్రైబర్లను పెంచుకుంది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకునే సంఖ్య పడిపోతుందనే సమయానికి జియో మరోసారి ట్రిపుల్ క్యాష్బ్యాక్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. -
సూచీలకు స్వల్ప లాభాలు
♦ 84 పాయింట్ల లాభంతో 25,773కు సెన్సెక్స్ ♦ 22 పాయింట్లు లాభపడి 7,888కు నిఫ్టీ ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు రికవరీ కావడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. లాభాల స్వీకరణతో మధ్యాహ్నం దాకా నష్టపోయిన సూచీలు యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 84 పాయింట్లు లాభపడి 25,773 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 7,888 వద్ద ముగిశాయి. లోహ, వాహన షేర్లు నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. నష్టాల్లొంచి...లాభాల్లోకి... డాలర్తో జపాన్ కరెన్సీ మారకం రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో జపాన్ మార్కెట్ పెరగడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండడం, యూరోప్ కంపెనీల ఫలితాలు బాగా ఉండటంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం కలసివచ్చాయి. సోమవారం జోరుగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 75 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు పటిష్టంగా ప్రారంభం కావడంతో కొనుగోళ్లు జరిగాయి. పొరిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు రేపు (గురువారం) వెలువడుతున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ 3 శాతం అప్ డాక్టర్ రెడ్డీస్ షేర్ 3 శాతం లాభపడి రూ.2928 కు చేరింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ‘ఉజ్జీవన్’ లిస్టింగ్ లాభాలు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో లాభాలు సాధించింది. ఇష్యూధర(రూ.210)తో పోల్చితే 8 % లాభంతో రూ.227 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. ఇంట్రాడేలో 16% లాభంతో రూ.244 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 10% లాభంతో రూ.231 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,738 కోట్లకు చేరింది. -
మరో ఐదేళ్లు.. క్రూడ్ నేలచూపులే!
దీనివల్ల భారత్కు లాభమే... * రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు మరో 3-5 ఏళ్ల పాటు ఇప్పుడున్న దిగువ స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దీనివల్ల చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సీఎన్ఎన్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత క్రూడ్ ధరల పరిస్థితి చాలా కాలంపాటు కొనసాగవచ్చని భావిస్తున్నాం. కనీసం మూడు నుంచి ఐదేళ్లు ఉండొచ్చు. అంతేకాదు తొలిసారిగా డిమాండ్ను మించి సరఫరా పెరిగిపోవడం కారణంగా ముడిచమురు ధరలు పడిపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మార్కెట్ స్వరూపంలో భారీ మార్పులు వస్తేనే ప్రస్తుత ట్రెండ్ మారే అవకాశం ఉంది. మరోపక్క, అమెరికాలో క్రూడ్ ఉత్పత్తి గతంలో రోజుకు మిలియన్ బ్యారెళ్ల స్థాయి నుంచి ఇప్పుడు 9 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరింది. ఇది కూడా ధరల పతనానికి కారణమే. ఈ అధిక సరఫరా కారణంగా చమురు ఉత్పత్తి దేశాల కూటమి(ఒపెక్) ప్రపంచ క్రూడ్ మార్కెట్పై పట్టు కోల్పోయింది. ఫలితంగా అధిక సరఫరాకు దారితీసి ధరలు ఘోరంగా పతనమవుతున్నాయి’ అని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాజాగా క్రూడ్ రేటు 11 ఏళ్ల కనిష్టానికి(నెమైక్స్ లైట్ స్వీట్ క్రూడ్ 26 డాలర్లు) పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషనరీ) పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను కనిష్టస్థాయిల్లోనే కొనసాగిస్తాయని... అనుకున్నదానికంటే ఎక్కువ కాలమే ఈ ధోరణి ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ద్వితీయార్ధంలో రిలయన్స్ జియో సేవలు... వాణిజ్యపరంగా 4జీ టెలికం సేవలు అందించేందుకు తమ రిలయన్స్ జియో సంస్థ తుది సన్నాహాలు చేస్తోందని... ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. గతేడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సిబ్బంది(దాదాపు 1.2 లక్షలు), వ్యాపార భాగస్వాములకు జియో సేవలు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తమ సేవల ప్రారంభంతో దేశంలోని 80 శాతం ప్రజలకు తాము హైస్పీడ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురానున్నామని ముకేశ్ చెప్పారు. 2017 నాటికి దీన్ని 90 శాతానికి.. 2018 కల్లా దేశమంతా జియో సేవలను విస్తరింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
రిలయన్స్ లాభాల రికార్డ్
క్యూ2లో రూ. 6,720 కోట్లు; 12.5 శాతం అప్ ♦ 34% తగ్గిన ఆదాయం; రూ.75,117 కోట్లు ♦ 10.6 డాలర్లకు స్థూల రిఫైనింగ్ మార్జిన్... ♦ కలిసొస్తున్న క్రూడ్ ధరల పతనం... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు లాభాల పంట పండింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం కారణంగా... రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో పటిష్టమైన మార్జిన్ల ఆసరాతో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. అంచనాలను మించి.. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.6,720 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.5,972 కోట్లతో పోలిస్తే 12.5% ఎగబాకింది. రిలయన్స్ కంపెనీ చరిత్రలో ఒక క్వార్టర్లోఇదే అత్యధిక లాభం కావడం గమనార్హం. అయితే, క్రూడ్ క్షీణత ప్రభావంతో కంపెనీ మొత్తం ఆదాయం భారీగా దిగొచ్చింది. క్రితం ఏడాది క్యూ2లో రూ.1,13,396 కోట్లతో పోలిస్తే 34% తగ్గి... రూ.75,117 కోట్లకు చేరింది. కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో రిలయన్స్ సగటున రూ.6,000 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. అమెరికా షేల్ గ్యాస్ పైప్లైన్ వెంచర్లో వాటాను ఈఎఫ్ఎస్ మిడ్స్ట్రీమ్ను విక్రయం వల్ల లభించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే క్యూ2 లాభంలో రూ.252 కోట్లు అదనంగా కలసిఉందని కంపెనీ తెలిపింది. దీన్ని తీసేస్తే లాభం రూ.6,468 కోట్లు కిందలెక్క. దీని ప్రకారం ఈ ఏడాది క్యూ1లో లాభం రూ.6,222 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్గా చూస్తే... ఈ క్యూ2లో 4 శాతం పెరిగింది. ఏడేళ్ల గరిష్టానికి జీఆర్ఎం... సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్(ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడి- జీఆర్ఎం) కూడా 10.6 డాలర్లకు దూసుకెళ్లింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 8.3 డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 10.4 డాలర్లు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ►{పధానమైన కేజీ-డీ6 చమురు-గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి అట్టడుగు స్థాయిలోనే కొనసాగుతోంది. క్యూ2లో ఇక్కడి నుంచి 0.39 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్, 37 బిలియన్ ఘనపుటడుగుల(బీసీఎఫ్) సహజ వాయువు ఉత్పత్తి అయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే గ్యాస్ ఉత్పత్తి 9 శాతం, ముడిచమురు ఉత్పత్తి 24 శాతం చొప్పున దిగజారింది. ముఖ్యంగా క్షేత్రాల్లో భౌగోళిక పరమైన అడ్డంకులు దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. ►రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) 42.1 శాతం ఎగబాకి రూ. 5,461 కోట్లకు చేరింది. పెట్రోకెమికల్స్ వ్యాపార ఎబిటా 7.2 శాతం వృద్ధితో రూ.2,531 కోట్లుగా నమోదైంది. ►చమురు-గ్యాస్ వ్యాపార ఎబిటా 83.1 శాతం దిగజారి రూ.56 కోట్లకు పడిపోయింది. ►రిటైల్ వ్యాపార విభాగం జోరు కొనసాగుతోంది. క్యూ2లో రిలయన్స్ రిటైల్ మొత్తం ఆదాయం 22 శాతం ఎగబాకి రూ.5,091 కోట్లకు చేరింది. పన్ను ముందు లాభం రూ.186 కోట్ల నుంచి రూ. 210 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ దేశవ్యాప్తంగా 250 నగరాల్లో 2,857 స్టోర్లను నిర్వహిస్తోంది. ►సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ. 1,72,765 కోట్లుగా ఉంది. ఇక నగదు తత్సంబంధ నిల్వలు రూ.85,720 కోట్లుగా ఉన్నాయి. ►రిలయన్స్ షేరు ధర బీఎస్ఈలో 0.91% లాభంతో రూ.912 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో ‘ఎల్వైఎఫ్’ 4జీ హ్యాండ్సెట్లు వస్తున్నాయ్... 4జీ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలను వివిధ నగరాల్లో విజయవంతంగా పరీక్షించామని.. త్వరలోనే వాణిజ్యపరంగా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. డిసెంబర్లో సర్వీసులు ఆరంభం కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తమ సొంత బ్రాండ్ ‘ఎల్వైఎఫ్’ పేరుతో 4జీ హ్యాండ్సెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నట్లు(నవంబర్లో వచ్చే చాన్స్) కంపెనీ పేర్కొంది. -
గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!
-
గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!
చెన్నై : సంక్రాంతి పండుగ వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన పరపతి విధానంలో వడ్డీరేట్లను తగ్గించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఆర్బీఐ రెపో రేట్ను 0.25శాతం తగ్గించింది. దీంతో అది 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గింది. అయితే నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులేదు. వచ్చేఏడాది జనవరి నాటికి ద్రవ్యోల్భనం 6 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. మరోవైపు రెపో రేటు తగ్గిన కారణంగా యాభైవేల కోట్ల రూపాయిలు చలామణిలోకి రానున్నాయి. ఇక గృహ రుణాదారులకు కూడా శుభవార్త. గృహరుణాలు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్త గృహ రుణదారులకు సంక్రాంతి కానుకగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు కూడా మంచి జోరు మీదున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
ఈ ఏడాది 5.5% వృద్ధి !
-
ఈ ఏడాది 5.5% వృద్ధి !
మధ్యంతర ఆర్థిక సమీక్షలో కేంద్రం అంచనా... స్థూల ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయ్... పన్ను వసూళ్ల మందగమనం ఇబ్బందికరం... క్రూడ్ ధరలు దిగిరావడంతో క్యాడ్ 2 శాతానికి పరిమితం కావచ్చు... నివేదికను పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతానికి పుంజుకోనుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది. శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ఈ ఏడాది మధ్యంతర ఆర్థిక సమీక్ష నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. ద్రవ్యోల్బణం అనూహ్యంగా దిగొచ్చిందని.. రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ మళ్లీ 7-8 శాతానికి ఎగబాకే అవకాశాలున్నాయని సమీక్షలో ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టానికి(4.7 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే. అంతక్రితం ఏడాది కూడా 4.5 శాతానికి మందగించింది. కాగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నేలకు దిగొచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 2 శాతానికి కట్టడి కావచ్చని నివేదిక అభిప్రాయపడింది. బంగారం దిగుమతులపై ఆంక్షలు, ఇతరత్రా చర్యల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ 1.7 శాతానికి తగ్గింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర ఐదున్నరేళ్ల కనిష్టస్థాయిలో 60 డాలర్ల దిగువకు చేరడం(ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 50 శాతం తగ్గింది) తెలిసిందే. పెట్టుబడులు పెరగాలి... ‘ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఇంకా గణనీయంగా పెరగాల్సి ఉంది. మరోపక్క, ద్రవ్యోల్బణం నాటకీయంగా అట్టడుగుకు దిగొచ్చింది. అయితే, పన్ను వసూళ్లు మందకొడిగా ఉండటం కాస్త ఇబ్బందికరమైన అంశమే’నని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే... అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంచనాలు, సహాయ ప్యాకేజీల ఉపసంహరణ కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని తెలిపింది. ప్రధానంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇతరత్రా అంశాలు దీనికి కారణమని పేర్కొంది. నిలిచిపోయిన ప్రాజెక్టులపై దృష్టి... దాదాపు 18 లక్షల కోట్ల విలువైన(జీడీపీలో దాదాపు 13 శాతం) ప్రాజెక్టులు వివిధ కారణాలతో నిలిచిపోయాయని.. ఇందులో 60 శాతం వరకూ మౌలిక రంగానివేనని నివేదిక వెల్లడించింది. దీంతో కార్పొరేట్ కంపెనీల లాభదాయకత దిగజారుతోందని.. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైపడి... మొండి బకాయిలు ఎగబాకుతున్నాయని వివరించింది. మొత్తం రుణాల్లో కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణల వాటా 11-12 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. ‘నష్టభయం(రిస్క్) పెరిగిపోవడంతో.. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలివ్వడానికి బ్యాంకులు జంకుతున్నాయి. భవిష్యత్తులో వృద్ధి జోరందుకోవాలంటే.. ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కాల్సి ఉంటుంది. వేగంగా అనుమతులు లభించాలి. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితి పెంపు(26 శాతం నుంచి 49 శాతానికి) వంటి ముఖ్యమైన సంస్కరణలతో పాటు... వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు, సబ్సిడీల కల్పనకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని మరింత విస్తృతం చేసే(ఆధార్, జనధన ఖాతాల అనుసంధానం) కీలకమైన(గేమ్ చేజింగ్) సంస్కరణలకు ప్రభుత్వం నడుంబిగించింది. రానున్నకాలంలో ఆర్థిక వ్యవస్థ జోరుకు ఇవి చేయూతనందించనున్నాయి. అయితే, రికవరీ ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది. మార్చివరకూ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చు... వచ్చే ఏడాది మార్చివరకూ రిజర్వ్ బ్యాంక్ పాలసీ విధానంలో మార్పులు ఉండకపోవచ్చని.. వడ్డీరేట్ల కోతకు ఆస్కారం లేదని సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. పారిశ్రామికోత్పత్తి తీవ్రంగా క్షీణించడం(అక్టోబర్లో మైనస్ 4.2 శాతం), ద్రవ్యోల్బణం దిగొచ్చిన నేపథ్యంలో(టోకు ధరల ద్రవ్యోల్బణం నవంబర్లో సున్నా, రిటైల్ ద్రవ్యోల్బణం 4.4 శాతం) వడ్డీరేట్లను తగ్గించాల్సిందిగా కార్పొరేట్ ఇండియా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. వచ్చే ఐదు త్రైమాసికాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1-5.8 శాతం స్థాయిలో ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. కాగా, గత ఇరువురు ఆర్బీఐ గవర్నర్ల హయాంలో పాలసీ విధానాలపై ఆర్థిక శాఖ విమర్శలు గుప్పించింది. ‘2007-13 మధ్య కాలంలో ఆర్బీఐ పరపతి విధానం విశ్వసనీయతను కోల్పోయింది. అయితే, 2013 ద్వితీయార్థం నుంచి ఈ పరిస్థితి గణనీయంగా మారింది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. మధ్యంతర ఆర్థిక సమీక్ష నివేదికను ఆయనే రూపొందించారు. 2003 సెప్టెంబర్ నుంచి 2008 సెప్టెంబర్ వరకూ వైవీ రెడ్డి ఆర్బీఐ గవర్నర్గా పనిచేయగా... 2013 సెప్టెంబర్ వరకూ దువ్వూరి సుబ్బారావు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతేడాది సెప్టెంబర్ 4న రఘురామ్ రాజన్ 23వ గవర్నర్గా నియమితుయ్యారు. ఆర్బీఐ, ప్రభుత్వం కలసికట్టుగా తీసుకున్న చర్యలతో పరపతి విధానంపై విశ్వాసం పెరిగిందని నివేదిక పేర్కొంది. గత జూలై నుంచి ద్రవ్యోల్బణం కట్టడికోసం పాలసీ వడ్డీరేట్ల పెంపు ద్వారా తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుందని అబిప్రాయపడింది. కాగా, ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. -
నేడు ఆర్బీఐ పాలసీ సమీక్ష
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) త్రైమాసిక ద్రవ్య, పరపతి సమీక్ష మంగళవారం జరగనుంది. గవర్నర్ రఘురామ్ రాజన్ పాలసీ రేట్లకు సంబంధించి తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు-రెపో 8 శాతంగా ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనంలో ఉండడం, ఆర్బీఐ లక్ష్యాలకన్నా తక్కువగా కనిష్ట స్థాయిల్లో తిరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తగ్గుదల వంటి అంశాల నేపథ్యంలో వృద్ధికి ఊతం అందించడానికి రేట్ల కోతకు ఇది సరైన సమయమని ప్రభుత్వ వర్గాలుసహా పలువురు వాదిస్తున్నారు. ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కూడా ఈ విషయంలో రాజన్ను ఒప్పించాలని ఇప్పటికే కేంద్రానికి సూచించారు. అయితే ఖరీఫ్ దిగుబడులు తగ్గే అవకాశం, ద్రవ్యోల్బణం తగ్గుదలలో బేస్ ఎఫెక్ట్ ప్రభావం, చమురు రంగానికి సంబంధించి అనిశ్చితి వాతావరణం తదితర అంతర్జాతీయ అంశాల నేపథ్యంలో ప్రస్తుతానికి రేట్ల కోత ఉండదని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యసహా పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు. -
రూపాయి మళ్లీ 60 దిగువకు
ఆరు వారాల కనిష్టానికి పతనం 60.16 వద్ద ముగింపు ముంబై: ఇరాక్ సంక్షోభంతో చమురు ధరలు పెరుగుతుండటం దేశీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగియడం వల్ల రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం మరో 39 పైసలు క్షీణించి 60 స్థాయి దిగువకి పడిపోయింది. ఆరు వారాల కనిష్టమైన 60.16 వద్ద ముగిసింది. అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరగడం, ఇటు దేశీ స్టాక్మార్కెట్లు బలహీనంగా ఉండటం సైతం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచాయి. ఇరాక్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగియడంతో చమురు దిగుమతి సంస్థలు తదుపరి కొనుగోళ్ల కోసం తప్పనిసరిగా మరిన్ని డాలర్లను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇది రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 59.77తో పోలిస్తే కాస్త బలహీనంగా 59.82 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 59.80కి పెరిగినా చివరికి 0.65 శాతం క్షీణించి 60.16 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం కూడా దేశీ కరెన్సీ 52 పైసలు (0.88 శాతం) మేర పతనమైన సంగతి తెలిసిందే. భౌగోళికపరమైన రాజకీయ రిస్కులు, దేశీయంగా రుతుపవనాల ఆలస్యం, అంచనాలు మించి పెరిగిన ద్రవ్యోల్బణం .. అన్నీ కలగలిసి రూపాయికి ప్రతికూలంగా మారాయని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్టు అనింద్య బెనర్జీ తెలిపారు. ఇరాక్ సంక్షోభం నేపథ్యంలో బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి.. గడిచిన రెండు రోజుల్లో ఒకటిన్నర శాతం మేర తగ్గిందని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. డాలర్తో రూపాయి ట్రేడింగ్ శ్రేణి స్పాట్ మార్కెట్లో 59.70-60.80 మధ్య ఉండగలదని చెప్పారు. ఎకానమీకి సమస్య.. రూపాయి అకస్మాత్తుగా బలహీనపడటం, క్రూడ్ ధరలు ఎగుస్తుండటం వంటి పరిణామాలు .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎకానమీ, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశీ కరెన్సీ స్థిరపడితే గానీ పరిస్థితులు మళ్లీ చక్కబడకపోవచ్చని వారు చెప్పారు. అయితే, రూపాయి మారకం త్వరలోనే స్థిరపడగలదని, సెప్టెంబర్ క్వార్టర్లో సగటున 58.5గా ఉండొచ్చని జైఫిన్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్టు దేబోపమ్ చౌదరి తెలిపారు.