delhi elections
-
మహిళా సత్తా చాటుతారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్న పార్టీలు మహిళా అభ్యర్థులను బరిలో నిలిపినా ఎంతమంది చట్ట సభల్లో అడుగు పెడతారన్న దానిపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. గడిచిన నాలుగు దశాబ్ధాలతో పోలిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగ్గా, గెలుపు తీరాన్ని ఎంతమంది చేరుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ 10 శాతం కూడా దాటని మహిళా ప్రాతినిధ్యం ఈసారైనా పెరుగుతుందా? అన్నది ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి. అభ్యర్థులు పెరిగారు.. ప్రాతినిధ్యం సంగతేంటో? ఢిల్లీకి గతంలో ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు పనిచేశారు. 1998లో బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, 1998– 2013 వరకు వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆప్కి చెందిన అతిశి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఢిల్లీ అసెంబ్లీలో మహిళా ప్రతినిధుల సంఖ్య 10 శాతం దాటలేదు. 2003 నుంచి ఇప్పటివరకు గత అసెంబ్లీలో మాత్రమే 10 శాతం అంటే 8 మంది గెలిచారు. ఈ ఎనిమిది మంది ఆప్ పార్టీకి చెందిన వారే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా పోటీ దారుల సంఖ్య పెరిగింది.ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కలిసి 96 మంది (14 శాతం) మహిళలు బరిలో నిలిచారు. ఇందులో ఆప్, బీజేపీల నుంచి తొమ్మిదేసి మంది ఉండగా, కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఉన్నారు. 1993లో, 1,316 మంది అభ్యర్థులలు పోటీలో ఉండగా, అందులో 58 మంది మహిళలు పోటీ చేయగా, 1998లో ఈ సంఖ్య 57కి తగ్గింది. 2003లో 78 మహిళలు, 2008లో 81, 2013లో 71, 2015లో 66కి మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, 2020లో 79 మంది మహిళలు పోటీ చేయగా, 10 శాతం (8) మంది విజయం సాధించారు. ఈసారి పోటీలో ఉ న్న 96 మంది మహిళలతో విజయాల రేటు రేటు మెరుగుపడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇక పార్టీల వారీగా చూస్తే 2008 నుంచి బీజేపీకి ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే లేరు.2008లో నలుగురు, 2013 లో ఐదుగురు, 2015లో ఎనిమిది, 2020లో ఆరు మందిని మహిళలను పోటీలో నిలిపినా ఎవరూ గెలువలేదు. ఈ సారి 9 మందిని బరిలో పెట్టి ఖాతా తెరవాలనే తాపత్రయంతో ఉంది. ఇక కాంగ్రెస్కు 2008లో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఆ తర్వాత వారినుంచి ప్రాతినిధ్యమే లేదు. ఈసారి ఏడుగురు మహిళలను పార్టీ రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక ఆప్ మాత్రం 2013 నుంచి స్థిరంగా విజయాలను నమోదు చేస్తోంది. 2013లో ఆరుగురిలో ముగ్గురు గెలవగా, 2015లో ఆరింటికి ఆరు, 2020లో తొమ్మిదిలో ఎనిమిది మంది గెలిచారు. ఆసారి తొమ్మిది మంది అభ్యర్థులను బరిలో పెట్టింది.ఆప్ ముఖ్యమంత్రి అతిశి, సీనియర్ ఎమ్మెల్యేలు రాఖీ బిద్లాన్, పర్మిలా టోకాస్, ధన్వతి చండేలా, బందన కుమార్, సరితా సింగ్లతో సహా ఏడుగురు మహిళా అభ్యర్థులను ఈసారి మళ్లీ పోటీలో పెట్టింది. మహిళలు మళ్లీ ఆకట్టుకునేందుకు ఆప్ ప్రభుత్వం కొద్ది నెలల ముందు మహిళలకు ప్రతి నెలా రూ. 1,000 అందించడానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే దీన్ని నెలకు రూ.2,100 పెంచుతామన్న హామీతో తిరిగి వారి మద్దతు కూడగట్టే పనిలో పడింది. -
ఇజ్జత్ కా సవాల్
-
ఢిల్లీ పోస్టర్ వార్లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్పై, ఆ పార్టీ కన్వీనర్పై అరవింద్ కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
ఢిల్లీ ప్రజలపై బీజేపీ హామీల వర్షం
-
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో ఓటర్లకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. ఇక, తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. అలాగే, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటనలో తెలిపారు. దీంతో, విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.#WATCH | Delhi | Launching BJP's 'Sankalp Patra' for Delhi Assembly polls, BJP MP Anurag Thakur says," We will provide to the youth of Delhi one-time financial assistance of Rs 15,000 for preparation of competitive examinations and reimburse two-time travel and application fees.… pic.twitter.com/muyCpF8SJ7— ANI (@ANI) January 21, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొదటి మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప పత్రం’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లను రూ.500కే ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టో ఇలా.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం. ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6వేలకు ఇవి అదనం‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీపేద కుటుంబీలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, ప్రతి హోలీ, దీపావళి (ఒకటి చొప్పున) పండగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. రూ.5కే భోజనంసంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు -
చీపురుతో తుడిచేస్తా.. కేజీవాల్ నామినేషన్
-
జాట్లు తలరాతలు మార్చేస్తారు..!
సాక్షి, న్యూఢిల్లీ: జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ రాసిన లేఖతో హస్తినలో ఈ సామాజిక వర్గం పేరుమీద రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రాజకీయాల్లో జాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సుమారు 12 ప్రాంతాల్లో 8 నుంచి 28 శాతం వరకు జాట్లున్నారు. ఢిల్లీకి హరియాణా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. సుమారు 225 సరిహద్దు గ్రామాల్లో బలమైన సంఖ్యలో జాట్లున్నారు. ఫలితంగా, చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం ఓటర్లలో 7నుంచి 8 శాతం వాటా వీరిదే. వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. ఇటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అటు బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల అనుగ్రహంపైనే ఆశలు పెట్టుకున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఢిల్లీలోని 12 అంసెబ్లీ నియోజకవర్గాల్లో జాట్ల ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 8నుంచి 28 శాతం జాట్ల జనాభా ఉందంటున్నాయి. ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 28 శాతం, నజఫ్గఢ్లో 25, నరేలా, బిజ్వాసన్లలో 23, బవానా, నాంగ్లోయి జాట్లలో 20, మటియాలా, మెహ్రోలిల్లో 16, ఉత్తమ్నగర్లో 15, వికాస్పురిలో 10, ఛత్తర్పూర్లో 9, కిరాడిలో 8శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కైలాశ్ను జాట్ నేతగా ప్రమోట్ చేసిన ఆప్ ఒకప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అయితే, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన 8 మంది జాట్ ఎమ్మెల్యేలు, 2020లో 9 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతాలపై ఆప్ మంచి పట్టు సాధించింది. జాట్ నేతగా కైలాశ్ గెహ్లాట్ను ప్రమోట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలం గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం మంచి ఆధిక్యం కనబరిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న వార్డుల్లో బీజేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాట్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే న్యూఢిల్లీ స్థానం నుంచి అర్వింద్ కేజ్రీవాల్పై పోటీ చేస్తున్న పర్వేశ్ వర్మ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. పర్వేశ్కు టికెట్ ఇచ్చి జాట్ల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. -
పోరాడేది ముగ్గురైనా.. పోటీ ఇద్దరి మధ్యే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఢిల్లీ ఎన్నికలకు శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చకునేందుకు సిధ్దమవుతున్నాయి. ఎన్నికల పోరులో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్, కాషాయ పార్టీల మధ్యే ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కదనరంగంలోకి కాలుదువ్విన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకుపోతుండగా, పరివర్తన్ యాత్రల పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రభావం చూపేందుకు సమాయత్తమయ్యారు. ఇక ప్రచార పర్వంలో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది. తన గత వైభావాన్ని పొందే పరిస్థతి లేకున్నా, అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.జాతీయ పార్టీలను ఊడ్చేసిన ఆప్..సామాన్యడినంటూ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ అసమాన్య రీతిలో జాతీయ పార్టీలను తన చీపురుతో ఊడ్చేశారు. 2013లో కాంగ్రెస్ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేజ్రీవాల్ జన్ లోక్పాల్ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రభుత్వంలోంచి దిగిపోయారు. అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో అసమాన్య రీతితో 70 స్థానాలకు గానూ ఏకంగా తన ఛరిష్మాతో 67 స్థానాలు సాధించిన బీజేపీ, కాంగ్రెస్లను మట్టి కరిపించారు. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని పొందిన ఆప్, ఆ తర్వాత 2020లోనూ రెండు పార్టీలకు చుక్కలు చూపించింది.2020 ఎన్నికల్లో ఆప్ ఏకంగా 53.57% ఓట్లతో 62 స్థానాలు సాధించింది. 38.51% ఓట్లు సాధించిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా... షీలాదీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్ళపాటు అధికార హవాను కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 4.26% ఓట్లకు పడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించే వ్యూహంతో... ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ మరోమారు జాతీయపార్టీలకు సవాల్ విసురుతున్నారు. మళ్లీ కొత్త పంథాలో ఆమ్ ఆద్మీప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పంథాలో దూసుకెళ్తోంది. లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో అప్రతిష్టపాలైన కేజ్రీవాల్ ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ అధినేతగా ప్రచార బాధ్యతలను భుజస్కందాలపై ఎత్తుకున్న కేజ్రీవాల్... పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ పథకాలతో ప్రజలకు చేరువైన ఆయన కొత్త తరహా హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షలకు బీమా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.1 లక్ష సహాయం, మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,100 ప్రత్యేక సహాయం, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులందరికీ ఉచిత వైద్యం, హిందు, సిక్కు పూజారులకు నెలకు రూ.18 వేలు సహాయం, విదేశీ విద్యను అభ్యసించే దళిత విద్యార్థుల పూర్తి ఖర్చులను భరించేటువంటి హామీలను ఇచ్చారు. వీటితో పాటు అక్రమంగా పెంచిన నీటి బిల్లులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించారు.ఆప్ హామీల ప్రకటన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కైలాష్ గెహ్లోత్ రాజీనామా, సీఎం అధికార నివాసం శీష్ మహల్పై రగులుతున్న వివాదం ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కట్లకు గురిచేస్తోంది. అంతేగాక ఆప్ అధినేతకు పోటీగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో దిగారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్తో పాటు బీజేపీ నేత పర్వేష్ వర్మను ఎదుర్కోవడం కేజ్రీవాల్కు సవాలుగా మారింది.పీఠం దక్కించుకోవాలన్న కాంక్షతో కమలంఆమ్ ఆద్మీ పార్టీని అప్రతిష్టాపాలు చేసి అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ ప్రణాళికలను అమలు చేస్తోంది. లిక్కర్ స్కాం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బజారుకీడ్చడంలో సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ... లోక్సభ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసింది. ఆప్, కాంగ్రెస్లు కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 54.35% ఓట్లను రాబట్టుకుంది. ఇదే పంథాను కొనసాగించాలన్న బలమైన లక్ష్యంతో ఉన్న బీజేపీ... యమునా కాలుష్యం, శీష్ మహల్లో విలాస జీవితం, లిక్కర్ స్కాం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆప్ను ఇరుకునపెడుతోంది. సామాన్యుడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్... అవినీతి సొమ్ముతో అద్దాల మేడలో విలాసంగా జీవించారంటూ బీజేపీ ప్రముఖంగా విమర్శిస్తోంది. ఈ నెల 3, 5 తేదీల్లో పరివర్తన యాత్రలో భాగంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శీష్ మహల్ కేంద్రంగానే కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలు మనోజ్ తివారీ, బాన్సురీ స్వరాజ్, ప్రదీప్ ఖండేల్వాల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా వంటి నేతలు బీజేపీ గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. ఒంటరి పోరులో కాంగ్రెస్ 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు పోటీ పడుతోంది. గత రెండు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ , ఆస్థిత్వాన్ని చాటుకునేందుకు కష్టపడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోరాడి 18.19% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెరిగిన ఓట్ల శాతంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అంశాన్ని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్, అల్కా లాంబ, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్ వంటి పార్టీ సీనియర్ నేతలు ఆప్కు పోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. -
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
మేము సహకరించకుండా ఉండి ఉంటే.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా అధికార ఆప్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఆప్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం.అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారుదీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా తీవ్రంగానే స్పందించారు. ‘ మీకు ఎప్పుడూ ఆప్ను తిట్టడమే పని. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడతున్నట్లే. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మీరు ప్రారంభించిన ఆర్ఆర్టీఎస్ కారిడార్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పని అయినా స్వాగతిస్తాం. మీరుప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం, ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించకలిగారు. మేము ప్రజల కోసమే పని చేస్తామనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్కు మేము అడ్డుచెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్నీ సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పని చేయడమే మాకు తెలిసిన రాజకీయం’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు.‘ నేటి మీ ప్రసంగం 38 నిమిషాలు పాటు సాగితే.. అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ వ్యాఖ్యల్ని చూసి నేను చింతిస్తున్నా. ఈరోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్ట్ను 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టే అది జరిగింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అంతకుముందు ఆర్ఆర్టీఎస్ కారిడార్ను ప్రారంభించిన క్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్ని నిర్మించుకోవచ్చు. కానీ ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా తొలి ప్రాధాన్యం.దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారు’ అని మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. -
ప్రియాంకపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.ఇదీ చదవండి: సోషల్మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్ -
బీజేపీ కుట్రలను సమర్థిస్తున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
సార్! నేను కాంగ్రెస్ వాడిని కాను! 'ఆప్' నేతను టోపీ సేమ్ టూ సేమ్ అంతే!
-
సీఏఏకి మద్దతిచ్చే సర్కార్ కావాలి
న్యూఢిల్లీ: జాతీయ భద్రత, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునిచ్చే ప్రభుత్వ అవసరమే ఢిల్లీకి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకలో సభలో మాట్లాడారు. ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసే ప్రభుత్వాలు ఇప్పుడు రాజధానికి అవసరం లేదని, సరైన దిశానిర్దేశం చేసే ప్రభుత్వమే కావాలని ఆప్పై ఆరోపణలు గుప్పించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు. శత్రువులు మనపై దాడి చేసేలా ప్రోత్సహించే ప్రభుత్వం ఢిల్లీకి ఇక అవసరం లేదని పిలుపునిచ్చారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల కోసం కన్నీరు కార్చేవారు ఢిల్లీని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది పేదలకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని, శ్రీలంకలో ఉండే జనాభా కంటే ఎక్కువగా ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని మోదీ అన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకపోవడాన్ని ప్రధాని తప్పుపట్టారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమమైనదని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పుడు విమర్శకులూ అంగీకరిస్తున్నారని అన్నారు. బడ్జెట్పై విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై మోదీ ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. -
కేజ్రీవాల్, బీజేపీ నేతల హోరాహోరీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేజ్రీవాల్ నాయకత్వంలోని పాలకపక్షం ఆప్, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర పాలక పక్షం బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రధానంగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్ బాగ్లో కొనసాగుతున్న ప్రజా ఆందోళన ప్రధాన ఆయుధంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. నరేంద్ర మోదీ కావాలా లేదా షహీన్ బాగ్ కావాలా తేల్చుకోండంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సీఏఏ, ఎన్ఆరీసీలకు వ్యతిరేకంగా షహీన్బాగ్లో డిసెంబర్ 15వ తేదీ నుంచి మహిళల ఆధ్వర్యంలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. (కేజ్రీవాల్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు) షహీన్బాగ్లో ఆందోళన చేస్తున్న దేశ ద్రోహులను కాల్చి పారేయండంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించగా, ‘ఆందోళనకారులను ఉపేక్షించినట్లయితే వారు రేపు మీ ఇళ్లలోకి జొరబడి మీ చెల్లెళ్లను, కూతుళ్లను రేప్ చేస్తారు, హత్య చేస్తారు’ అని బీజేపీ లోక్సభ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించడంతో ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ‘షహీన్బాగ్ను ప్రేమిస్తున్న వారికి సరైన సమాధానం ఇవ్వండి’ అంటూ శుక్రవారం బీజేపీ అధికారికంగా ఓ ఎన్నికల పాటను విడుదల చేసింది. ఈ పాటకు ఇప్పటికే ఆన్లైన్లో లక్ష లైక్స్ వచ్చాయి. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) పర్వేష్ వర్మ తాజాగా కేజ్రీవాల్ను ఉద్దేశించి ‘ఆటంక్వాది, టెర్రరిస్ట్’ అని పిలిచారు. ఇక్కడ ఆప్కు సరికొత్త ఆయుధాన్ని ఆయన అందించినట్లయింది. ‘కేజ్రీవాల్ ఆటంక వాదా?, కాదనుకుంటే మీరు ఆప్కు ఓటేయండి’ అంటూ ఆ పార్టీ సరికొత్త ఎన్నికల పోస్టర్ను తీసుకొచ్చింది. ఆప్ సానుభూతిపరులైన బీజేపీ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆ పార్టీ ఈ పోస్టర్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (గల్లీల్లో ఢిల్లీ ప్రచారం) కేజ్రివాల్ పార్టీయే మళ్లీ గెలుస్తుందంటూ పలు ముందస్తు ఎన్నికల సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలనే కసితో ఉన్న బీజేపీ షహీన్బాగ్ ఆందోళన ఒక్కదాన్నే ఆయుధంగా చేసుకుని ప్రచారం చేస్తోంది. ఆ విషయంలో కేజ్రివాల్ను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు కేజ్రివాల్ సమన్వయంతో శాంతియుతంగా తాను చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలనే నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. (‘మోదీ 24 క్యారెట్ల బంగారం.. ఆయన్ని నమ్మండి’) -
కేజ్రీవాల్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆయన తన ఎమ్మెల్యేలతో కొట్టించారని, ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సాక్షి టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేజ్రీవాల్ పరిపాలన నచ్చకపోవడంతోనే.. ఆయనకు వ్యతిరేకంగా వందలమంది నామినేషన్లు వేశారని అన్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 సీట్లకుపైనే వస్తాయని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం రాకపోవడం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందన్నారు. దేశానికి మోదీ, ఢిల్లీకి బీజేపీ అనేది తమ నినాదమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎక్కడ గుడిసె ఉందో, అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టించి.. గ్యాస్, టాయిలెట్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. కుషాల్ ఢిల్లీ తమ లక్ష్యమన్నారు. -
కేజ్రీవాల్కు గట్టిపోటీ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకర్గంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవడం.. భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తయినా తరువాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తేలనుంది. చదవండి: 6 గంటలు కేజ్రీ వెయిటింగ్ మరోవైపు నామినేషన్ దాఖలు చేసిన 93 మంది అభ్యర్థుల్లో పదిమంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) మాజీ కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఐదుగురు క్యాబ్ డ్రైవర్లు కూడా నామినేషన్ వేశారు. 2011లో భారత అవినీతి నిరోధక ఉద్యమంలో పాల్గొన్న నలుగురు సామాజిక కార్యకర్తలు కూడా నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు ‘చక్ దే ఇండియా’ సినిమాలో అతిథిపాత్ర పోషించిన జాతీయ హాకీ క్రీడాకారుడు కూడా ఢిల్లీ బరిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరంతా కూడా కేజ్రీవాల్కు వ్యతిరేకంగానే బరిలో నిలిచామని చెబుతున్నారు. డీటీసీ కాంట్రాక్టు ఉద్యోగుల బృందంలోని మనోజ్ శర్మ మాట్లాడతూ.. కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు తమను కేజ్రీవాల్ విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. రాజకీయ రంగంలో కేజ్రీవాల్ను ఓడించడానికి ఇదే తమకు వచ్చిన ఏకైక అవకాశం అని ఆయన పేర్కొన్నారు. చదవండి: అయ్యో కేజ్రీవాల్.. ఆలస్యమైందా! ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదని నామినేషన్ దాఖలు చేసిన ఓ డ్రైవర్ తెలిపారు. ఆటోరిక్షా ఛార్జీలు సవరించబడ్డాయి కానీ, టాక్సీ డ్రైవర్లను ఆదుకోవడానికి కేజ్రీవాల్ ఎటువంటి పథకం తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆప్ నేతలు మాత్రం ఇదంతా బీజేపీ కుట్రేనని ఆరోపిస్తున్నారు. బలపరిచేందుకు కనీసం 10 మంది కూడా లేని వారితో కావాలనే నామినేషన్లు వేయించిందని ఆప్నేతలు ఆరోపిస్తున్నారు. చదవండి: ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ కాగా, మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తాము నామినేషన్ పత్రాలు ఇచ్చేదాకా ఆయన్ను వెళ్లనిచ్చేది లేదని అప్పటికే భారీ సంఖ్యలో అక్కడున్న అభ్యర్థులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ టోకెన్ తీసుకున్నారు. ఆయన టోకెన్ నంబర్ 45 వచ్చేసరికి ఆయన వేచిఉండాల్సి వచ్చింది. -
అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!
న్యూఢిల్లీ: తానెవరో తెలియదంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన లాంటి సామాన్యుల గురించి ఉన్నత పదవిలో ఉన్న మంత్రికి తెలియకపోవడం సాధారణ విషయమే అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్(జేడీయూ) బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు సైతం ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలు అందించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పీకే బృందంతో జట్టుకట్టారు. దీంతో కిషోర్ నేత్వంలోని ఐపాక్ టీం తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కో- ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ప్రశాంత్ కిషోర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరు’ అని ప్రశ్నించారు.(రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం!) ఇందుకు బదులుగా పీకే గురించి విలేకరులు ప్రస్తావించడంతో.. ‘ అతడి గురించి నేను తెలుసుకోవాల్సింది.. కానీ నాకు అతనెవరో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పీకే.. ‘ఆయన ఒక సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుల గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్- బిహార్ రాష్ట్రాల నుంచి నాలాగా ఢిల్లీకి వచ్చిన ఎంతో మంది ఇక్కడ జీవనపోరాటం చేస్తున్నారు. ఆ లక్షల మందిలో ఒక్కడినైన నా గురించి కేంద్ర మంత్రికి తెలిసే అవకాశమే ఉండదు కదా’ అంటూ వినయపూర్వకంగానే హర్దీప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.(అరవింద్ కేజ్రీవాల్తో పీకే టీం) ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అవసరం ఉన్నపుడు అతడి సేవలు వినియోగించుకుని.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తరఫున అతడు ప్రచారంలోకి దిగగానే ఎవరని ప్రశ్నిస్తారా? కనీసం ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీయూ ఉపాధ్యక్షుడని కూడా తెలియకపోవడం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు. Prashant Kishor,Political Strategist on Union Min HS Puri asking 'Who is Prashant Kishor?': He is a senior minister,why will he know a ordinary man like me?In Delhi lakhs of ppl like me from UP-Bihar live and struggle,how will such a senior leader like Puri ji know so many ppl? pic.twitter.com/n9TW1WCCvb — ANI (@ANI) December 28, 2019 -
ప్రధాని అవుతారు.. సీఎంపై ప్రశంసలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అంటూ.. ప్రచార హోరును పెంచడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గత ఐదేళ్ల పాలనకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచారు. మరోసారి ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. టౌన్హాల్ సమావేశాల పేరిట కేజ్రీవాల్ ప్రజలతో మిళితమై.. ఇప్పటివరకు తాను చేసిన హామీల అమలును వివరిస్తూనే, బీజేపీని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టౌన్హాలు సమావేశంలో కేజ్రీవాల్ను కలిసిన ఒక వృద్ధురాలు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మంచి పనులు చేస్తూ.. బాధ్యతయుతమైన కొడుకుగా వ్యవహరిస్తున్నకేజ్రీవాల్ను ఒక్కసారైనా కలిసి, ఆశీర్వదించాలని ఉండేదని చెప్పుకొచ్చారు. తన ఆకాంక్ష ఇప్పుడు నెరవేరిందని, సీఎం కేజ్రీవాల్ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం అభిమానులతో కలిసి పెద్దావిడ ఆశీర్వదించిన వీడియోను ఆయన ట్విటర్లో పంచుకొన్నారు. आज एक बुजुर्ग अम्मा ने आशीर्वाद दिया... pic.twitter.com/g6OrRmwcJ2 — Arvind Kejriwal (@ArvindKejriwal) December 27, 2019 -
‘హస్తిన’.. ఎవరి హస్తగతమవునో..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందోననే అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిరసనలు, ఉద్యమాలకు నెలవు, భారత రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే రాజధాని నగరంలో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డడానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన బీజేపీ మళ్లీ అదే ఫీట్ను నమోదు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన ఆప్ ఎంపీ సీట్లనూ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన హస్తం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని పొందే దిశగా వ్యూహాలు పన్నుతోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న త్రిముఖ పోరులో గెలిచి మురిసేదెవరో..! రాజకీయ చరిత్ర ఢిల్లీ 1990 వరకూ హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. 90ల తరువాత రాజధానిలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1991లో కాషాయ పార్టీకి హస్తిన ప్రజలు పట్టం కట్టారు. తదనంతర కాలంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి ఢిల్లీ కోటలో పాగా వేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ షీలా దీక్షిత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్కు గట్టి షాకిచ్చి ఘనవిజయం సాధించింది. దూసుకొచ్చిన బీజేపీ కాంగ్రెస్కు కంచు కోటగా ఉన్న ఢిల్లీలో 1991 పార్లమెంట్ ఎన్నికల్లో లాల్ కృష్ణ అద్వానీ సారథ్యంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. 40.2శాతం ఓట్లతో బీజేపీ 5సీట్లు గెలుచుకోగా, 39.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ వికసించిన కమలం బీజేపీ 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తన పట్టును నిలుపుకుంది. ఈసారి 49.6శాతం ఓట్లతో మళ్లీ 5సీట్లను గెలుచుకొని, కాంగ్రెస్ను ద్వితీయ స్థానానికి నెట్టింది. 37.3శాతం ఓట్లను హస్తం పార్టీ గెలుచుకోగలిగింది. 1998లో జరిగిన ఎలక్షన్లలో వాజ్పేయి హయాంలోని కమల దళం 50.7శాతం ఓట్లతో 6సీట్లలో విజయ బావుటా ఎగురవేసింది. 42.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒక సీటుకే పరిమితమైంది. కమలం క్లీన్స్వీప్ 1991 నుంచి చిక్కిన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాషాయ పార్టీ 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తూ 51.7శాతం ఓట్లతో 7సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ రెపరెపలు దాదాపు దశాబ్దం కాలంపాటు సాగిన బీజేపీ ఆధిపత్యానికి చెక్పెడుతూ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో 54.8శాతం ఓట్లను సాధించి 6సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ అన్ని సీట్లనూ(7) తన వశం చేసుకుంది. బీజేపీ గెలుపు ఢంకా 2014 సార్వత్రిక ఎన్నికల్లో 3జీ స్కాం, కుంభకోణాలు, పలు అవినీతి ఆరోపణలతో దేశమంతా కాంగ్రెస్కు ఎదురుగాలి వీచింది. ఎగ్జిట్పోల్స్ ముందే చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ 46.6శాతం ఓట్లతో 7సీట్లలో గెలుపు నగారా మోగించింది. -
ఢిల్లీ గుణపాఠం కనువిప్పేనా?
సందర్భం ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు రోజు సాయంత్రం నేను ఓలా విజ్డమ్ ట్యాక్సీని బుక్ చేశాను. పోలింగ్ జరగడానికి ముందురోజు ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గొని ఇంటికెళుతూ మేం ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నాం. మమ్మల్ని డ్రాప్ చేస్తూ, డ్రైవర్ ‘మీరు రాజకీయ పార్టీకి చెందినవారా’ అని అడిగాడు. నా ముఖాన్ని అతడు స్పష్టంగా గుర్తుపట్టలేకపోయాడు. అదేమంత పెద్ద విషయం కాదని అతడికి చెబుతూ మరుసటి రోజు జరగనున్న ఎంసీడీ ఎన్నిక గురించి ఏమనుకుంటున్నావని అడిగాను. అతడు సాంప్రదాయికంగా కాంగ్రెస్ ఓటరట. 2014లో లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా బీజేపీకి ఓటేశాడు. కానీ 2015లో అతడు కేజ్రీవాల్ పార్టీకి మారాడు. మరి ఈసారి? తన వార్డు అభ్యర్థుల పేర్లను అతడు గుర్తుపెట్టుకోలేదు కానీ ఈసారి మాత్రం మోదీకే ఓటేస్తానని చెప్పాడు. ఢిల్లీ మునిసిపల్ కౌన్సిస్ పనితీరు గురించి తన అభిప్రాయాన్ని అడిగాను. వాళ్లు ఒక్క పనీ చేయలేదు (కుచ్ కామ్ నíహీ కియా) అని నొక్కి చెప్పాడు. గత పదేళ్లుగా ఎంసీడిని పాలిస్తున్నది బీజేపీనే అని అతడికి గుర్తు చేశాను. కేజ్రీవాల్ మాకు ద్రోహం చేశాడు అని అతడు కొట్టిపడేశాడు. ఇప్పుడు తన నమ్మకం పూర్తిగా మోదీపైనే ఉందన్నాడు. ‘ఉత్తరప్రదేశ్లో ఆయన యోగి వంటి ఉత్తమ ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఢిల్లీలో కూడా ఆయన మంచి ప్రభుత్వానికి హామీ ఇస్తారు’ అనేశాడు. నాకు మాటల్లేకుండా పోయాయి. భయపడ్డాను కూడా. అయితే రాజకీయాల గురించి ఆ వోలా డ్రైవర్ నాకు తెలియనిది కొంత చెప్పాడు. బీజేపీకి అనుకూలంగా పెద్ద స్థాయిలో ఓట్లు సైలెంటుగా బదిలీ అవుతున్నాయని ఎన్నికల ప్రచారం ముగింపు నాటికే తేలిపోయింది. ఎంసీడీ పనితీరుపై ఓటర్లు దృష్టి పెట్టలేదని స్పష్టమైంది. అయితే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై నేను చేసిన విమర్శలపైనే వారు మరింత ఆసక్తి చూపారు. పోలింగు రోజున బీజేపీ పూర్తి ఆధిక్యత సాధించనుందంటూ పరిశీలకులు చేసిన అంచనాను ఎగ్జిట్ పోల్స్ ధ్రువపర్చాయి. తన సమీప ప్రత్యర్థిపై బీజేపీ 20 శాతం కంటే అదనంగా ఆధిక్యత సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతటి ఆధిక్యత సహజంగానే సీట్ల పరి భాషలో సంపూర్ణమైన క్లీన్ స్వీప్ను సాధించిపెడుతుంది. అలాంటి ఫలితం భయాన్ని, విషాదాన్ని కూడా కలిగిస్తుంది. అత్యంత చెత్త పనితీరును ప్రదర్శించే దేశీయ మునిసిపాలిటీల్లో ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీలుకూడా చేరిపోయి ఉంటాయనడంలో సందేహమే లేదు. ఢిల్లీలోని సగం జనాభాకు ఆశ్రయమిస్తున్న తూర్పు, ఔటర్ ఢిల్లీ ప్రాంతాలను సందర్శిస్తే, ఇక్కడి పట్టణ మౌలిక వసతులు యూపీ, బీహార్లోని పట్టణాలకంటే ఏమంత మెరుగ్గా ఉండవు. గత సంవత్సర కాలంగా ఢిల్లీనగరం చికున్ గున్యా, డెంగ్యూ వ్యాధులతో సతమతమైంది. ఇక వాయు కాలుష్యం అయితే అన్ని ప్రమాద హెచ్చరికలను అధిగమించేసింది. ఈ పరిస్థితికి ఎవరు కారణం అనే విషయంలో రెండు వాదనలకు తావులేదు. ఢిల్లీలోని మునిసిపల్ కార్పొరేషన్లు గత పదేళ్లుగా బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. పట్టణ ప్రభుత్వాలు ఎలా ఉండకూడదో ఈ మునిసిపాలిటీలు టెక్ట్స్ బుక్ ఉదాహరణగా నిలుస్తాయి. నిజం గానే ఢిల్లీ ప్రభుత్వం వద్ద వనరులు లేక అవి కునారిల్లుతున్నాయి. ఏమాత్రం పనిచేయని పాలకపార్టీకి ఢిల్లీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? స్పష్టంగానే దీనికి సమాధానం ఈవీఎం ట్యాంపరింగ్లో మాత్రం లేదు. బాధ్యతారహిత ఆరోపణలు చేయడానికి బదులుగా, ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టే బీజేపీ గెలుస్తోందన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. స్పష్టంగానే, బీజేపీకి ఓటు వేస్తున్నవారు పనిచేయని ఢిల్లీ మునిసిపాలిటీ కౌన్సిళ్లకు తాము రివార్డు అందిస్తున్నట్లు భావించడం లేదు. ఈ ఎన్నికల్లో తీవ్రమైన మునిసిపల్ సమస్యలను బీజేపీ పక్కకు దాటివేయిం చగలిగింది. దీనికి బదులుగా జాతీయవాదం, కశ్మీర్, గోవధ, జాతీయ భద్రత వంటి ఎంసీడీలకు సంబంధం లేని అంశాలపై చర్చించేలా ఓటర్లను, మీడియాను బీజేపీ ఏమార్చగలిగింది. బాగా చెడ్డపేరు వచ్చిన ప్రస్తుత కౌన్సిలర్లను మరోసారి నామినేట్ చేయకుండా చేసి ప్రజాగ్రహం తనపై మళ్లకుండా అది జాగ్రత్త పడింది. మరోవైపున ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఈ ఎన్నికను కేజ్రీవాల్పై వ్యక్తిగత రిఫరెండంగా మార్చి నిజమైన మునిసిపల్ సమస్యలపై చర్చను దారిమళ్లించింది.. చివరికి ఈ ఎన్నికలు సీఎం, పీఎంలకు మధ్య పాపులారిటీ పోటీగా మారిపోయాయి. ఢిల్లీ ప్రజలు సీఎంకు బదులుగా పీఎంను ఎంచుకున్న్టట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మోదీ మ్యాజికల్ ప్రభంజనంతో దీన్ని వివరించలేం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015లో బీజేపీని తుంగలో తొక్కివేసిన రోజు కూడా మోదీ ఏమంత తక్కువ శక్తిమంతంగా లేరు. లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా విజయాలతో మోదీ పాపులారిటీ ఒక మెట్టుపైనే ఉండేది. ఇప్పటివలే కాకుండా మోదీ ఆనాడు పార్టీ స్థానిక వ్యతిరేక ఓటును కూడా ఎదుర్కొనలేదు. మనమిప్పుడు ఈ కష్టమైన ప్రశ్న నుంచి తప్పించుకోలేం. 2015లో మోదీ వేవ్ ఎందుకు పనిచేయలేదు. 2017లో మాత్రం పనిచేస్తున్నట్లు ఎందుకు కనిపిస్తోంది? తేడా ఎక్కడుందంటే 2015 ఫిబ్రవరి నుంచి ఆప్ ప్రభుత్వంతో ఢిల్లీ పొందిన అనుభవంలోనే ఉంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆప్ తన నైతికాధికారాన్ని కోల్పోయింది. విద్యుత్ బిల్లులను పాక్షికంగా తగ్గిం చడం, స్కూల్ విద్య కోసం అదనపు నిధులను కేటాయించడం మినహా ప్రభుత్వం తన సమర్థతను ఏమాత్రం ప్రదర్శించక పోవడంతో సుపరిపాలనపై అది చేసిన వాగ్దానం తేలిపోయింది. హామీలను నెరవేర్చడానికి బదులుగా ఆప్ ప్రభుత్వం కేంద్రానికి, దాని ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ కాలం గడిపేసింది. ఆ ఆరోపణల్లో కొన్ని నిజమైనవే కావచ్చు. కాని ఈ ఆరోపణలపైనే ఎక్కువగా అది ఆధారపడినందువల్లే నా ఓలా డ్రైవర్ వంటి ఢిల్లీ ప్రజలను విసుగెత్తించేసింది. ఈ వ్యక్తిగత రిఫరెండాన్ని కోల్పోవడంతో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి ఆరాధన తనకే ఎదురు తగిలింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిన ఆప్ ఇప్పుడు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలి పోతోంది. ఈ పార్టీ ఇప్పటికైనా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటుందనే ఆశిద్దాం. ఢిల్లీలో ఎంసీడీ ఎన్నిక భారత రాజకీయాల్లో పెద్దన్నగా బీజేపీ వికాసానికి సంబంధించిన ఒక దశను పూర్తి చేసింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాన్నిగుర్తించనట్లయితే అవి కోలుకోవడం చాలా కష్టం. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav -
సంస్కరణలపై ‘ఢిల్లీ’ ప్రభావం ఉండదు: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల అమలు వేగంపై ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందినప్పటికీ.. ఆ ప్రభావంతో సంస్కరణల వేగం తగ్గబోదని ఆయన వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. 5వ భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా గురువారం అమెరికా ఆర్థిక మంత్రి జాకాబ్ లీతో కలసి జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జైట్లీ తెలిపారు. ‘నిజానికి నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం. ఒక్కచోట మాత్రమే కోల్పోయాం. ఈ పరిణామం.. ఆర్థిక సంస్కరణలపై ఎంతమాత్రమూ పడబోదు’ అని పేర్కొన్నారు. పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగ కల్పన, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల, పేదరికాన్ని తగ్గించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్టు జైట్లీ వివరించారు. -
ఎన్నికలు నిర్వహిస్తే బాబుకు ‘ఢిల్లీ ’ పరిస్థితే
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ నర్సీపట్నం: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితే సీఎం చంద్రబాబుకు పడుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు దక్కించుకున్న బీజేపీ, ఎనిమిది నెలలు తిరగకుండా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి టీడీపీ అంతకన్నా దారుణమైన పరిస్థితి తప్పదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టాయని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చెప్పినట్టుగానే స్టీల్ప్లాంట్ ఎన్నికల్లో అదే జరుతుందన్నారు. స్టీల్ప్లాంట్ ఎన్నికల్లో వైఎస్సార్టీయూసీ ఎదుర్కొనే శక్తిలేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ పోటీచేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే సీఎంగా జగన్మోహన్రెడ్డిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం: నర్సీపట్నం పీనారపాలెం రెండో వార్డుకు చెందిన రుత్తల నూకరాజు తుపాను సమయంలో చెట్టు పడి మృతి చెందాడు. వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి సమకూర్చిన రూ.50 వేల చెక్కును గురువారం మృతుని భార్య లక్ష్మికి అమర్నాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్, మున్సిపాల్ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు తమరాన నాయుడు, బోడపాటి సుబ్బలక్ష్మి, బైపురెడ్డి వెంకటలక్ష్మి, కోనేటి వెంకటలక్ష్మి, మాజీ మహిళా విభాగం నాయకురాలు పీలా వెంకటలక్ష్మి, గుడబండి నాగేశ్వరరావు, గుడివాడ లక్షబాబు, ధనిమిరెడ్డి నాగు, ఎండీ భాషా, బైపురెడ్డి చినబాబు,చిట్టిరాజు , ఆరుగుల్ల రాజుబాబు, కర్రి శ్రీనివాసరావు, యాదగిరి శేషు, ఆదినారాయణ,ఏకా రాజుబాబు, ఆదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.