gossips
-
పుష్ప 2 కళ్లచెదిరే కలెక్షన్స్... రష్మిక సెంటిమెంట్ వర్కౌట్ ...
-
తెలుగులోనే భారీ బడ్జెట్ బన్నీ, త్రివిక్రమ్ సినిమా
-
సలార్ 2 షూటింగ్ స్టార్ట్ ...వార్ 2 లో వార్స్ మాములుగా ఉండవు..
-
మేము జగన్ తోనే ఉంటాం..
-
రాజమౌళి, ఈగ 2 కి నేను అవసరం లేదన్నారు
-
తొలి సినిమా రిలీజ్ కాలేదు.. జాన్వీకి తెలుగులో మూడో ఛాన్స్?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర'లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలోనూ హీరోయిన్ జాన్వీనే. దీని షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. 'దసరా'తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల.. మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే ఆశ్చర్యమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని బహుశా నాని-శ్రీకాంత్ ఓదెల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.(ఇదీ చదవండి: మ్యూజీషియన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక
కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. కారణం ఆమె నటిస్తున్న చిత్రాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ప్రేమ వ్యవహారం గురించి కావచ్చు. నటి మేనక, నిర్మాత సురేష్ ల వారసురాలు కీర్తి సురేష్. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్తో జత కట్టిన రజనీమురుగన్ మంచి విజయాన్ని అందించింది. అలా కథానాయకిగా స్థిరపడి పోయిన కీర్తి సురేష్ తెలుగులో నటించిన మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకుంది. అదేవిధంగా కమర్షియల్ కథా చిత్రాల్లో నటిస్తూనే, నటనకు అవకాశం ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. దాంతోపాటు ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లోనూ తరచూ చిక్కుకుంటోంది. కీర్తీ సురేష్ పెళ్లి అని, ఓ వ్యాపార వేత్తతో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విషయాలపై కీర్తీ సురేష్ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే తొలి సారిగా ఆమె తల్లి మేనక స్పందించారు. ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కీర్తి సురేష్ ప్రేమలో పడిందని, పెళ్లికి సిద్ధం అవుతోందనీ గాసిప్స్ చాలానే వస్తున్నాయని. అయితే కీర్తీ. ఎవరిని ప్రేమించినా ఆ విషయాలు తమకు చెబుతుందని, దాన్ని తాము బహిరంగంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. అయితే కీర్తీ ఎవరినీ ప్రేమించడం లేదని, ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అనీ చెప్పారు. కీర్తీ సురేష్ గురించి వదంతులు దొర్లుతున్నాయంటే, ఆమె నటిగా ఎదుగుతోందని అర్థం అని మేనక పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో కీర్తీసురేష్ బిజీగా ఉంది. తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం గురువారం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. -
రజనీకాంత్, కమల్ హాసన్ చిత్ర రీమేక్లో శృతిహాసన్?
అగ్ర కథానాయకులు కమల్ హాసన్, సూపర్స్టార్ రజనీకాంత్ ఆరంభ దశలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వాటిలో కొన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలు, హీరోయిన్ కథా చిత్రాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘అవళ్ అప్పడిదాన్’. అందులో కమలహాసన్, రజనీకాంత్, శ్రీప్రియ ప్రధాన పాత్ర పోషించారు. సీ.రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ పలు సమస్యలను ఎదురొడ్డి ఎలా నెగ్గుకొచ్చింది అన్నదే ఈ చిత్ర కథ. చదవండి: తారక్పై ట్వీట్ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే.. అందులో కథానాయకి పాత్రలో శ్రీప్రియ నటించింది. కాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అధర్వ, సమంత జంటగా బానాకాత్తాడి చిత్రాన్ని తెరకెక్కించిన బద్రి అవళ్ అప్పడిదాన్ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే ఇటీవల స్వయంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నటి శ్రీప్రియ పాత్రలో శృతిహాసన్, రజనీకాంత్ పాత్రలో శింబు, కమలహాసన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్లను నటింప చేయడానికి ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ భారీ విజయం అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు దీంతో మృణాల్ కోటీ రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్ తొలుత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరాఠిలో పలు టీవీ సీరియల్స్లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్గా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మృణాల్ పాత్ర మాత్రం మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
Bimbisara Movie OTT Release Details: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార. ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న(ఆగస్ట్ 5న) గ్రాండ్గా రిలీజైంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్టాక్ తెచ్చుకుంది. ట్రైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కల్యాణ్ రామ్ బింబిసార అనే రాజుగా కనిపించాడు. చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ నెట్టింట చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసి మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు గట్టిగానే పొట్టి పడ్డాయట. చివరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం జీ5 ‘బింబిసార’ను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్లోనే ఓటీటీలో అందుబాటులోకి రానుందట. చదవండి: ‘లేడీ సూపర్స్టార్’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ మరోవైపు ఆగస్ట్ చివరిలో వారంలోనే రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా డిజిటల్ స్ట్రీన్పై బింబిసార చూడాలంటే నెలన్నరకు పైగా వేచి చూడక తప్పందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా కొత్త డైరెక్టర్ వశిష్ఠ రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈచిత్రానికి ఎమ్ఎమ కీరవాణి సంగీతం అందించారు. -
అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్కు మెరుగులు
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో కృతీకి సక్సెస్ ఫుల్ హీరోయినే అనే గుర్తింపు ఇచ్చేశారు. అదే క్రేజ్తో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ‘ది వారియర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆమె తొలి ఫ్లాప్ చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం డిజాస్టార్గా నిలిచింది. ఉప్పెన హిట్తో కృతిని ఓ రేంజ్లో ఎత్తేసిన ప్రేక్షకులు ఆమె అందం, అభియనంకు ఫిదా అవుతూ ప్రశంసలు జల్లు కురిపించారు. చదవండి: సెట్లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్పై నిషేధం అయితే ఇప్పుడు ‘ది వారియర్’ ఫ్లాప్తో ఆమెను విమర్శిస్తున్నారు. ఇందులో తన లుక్ అంతగా లేదని పలువురు కృతికి సూచించారట. దీంతో తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందు పెంచుకునేందుకు ‘బేబమ్మ’ సర్జరీకి సిద్దమైందట. తన పెదాల పరిమాణాన్ని తక్కించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్ను సంప్రదించి సలహా కూడా తీసుకుందని వినికిడి. ఇదే నిజమైతే సర్జరీతో అందానికి మెరుగులు అద్దుకున్న హీరోయిన్ల జాబితాలోకి ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా చెరినట్టే. చదవండి: ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు -
ఎన్నెన్నో వింత కథల వాన
ప్రపంచమంతా వాన చుట్టూ జానపద కథలు ఉన్నాయి. నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. వింతలు ఉన్నాయి. వినడానికీ పిల్లలకు చెప్పడానికీ బాగుంటాయి. వాన జోరున పడేటప్పుడు స్నేహితులతో పంచుకోవాల్సిన సంగతులివి. వేడి వేడి పకోడి కబుర్లు. మన జానపద కథ ఒకదాన్ని కెనడాలో చెప్పుకుంటారు. ఒక ఊళ్లో సుడిగాలి ఉండేవాడట. వాడు ఉత్త పోకిరి అట. దారిన పోయే ఆడవారిని బెదరగొడితే సుడిగాలి దెబ్బకు వారి పైటలు ఎగిరి ఇబ్బంది పడేవారట. ఇది ఊరి పెద్ద దృష్టికి వచ్చింది. ‘ఈ సుడిగాలిగాడు ఊళ్లో ఉండటానికే లేదు’ అని తీర్పు ఇచ్చాడు. ఇక సుడిగాలి ఊరు ఖాళీ చేయాల్సిందే. కాని సుడిగాలికి వాన మంచి ఫ్రెండు. వానకు కళ్లు లేవు. సుడిగాలే వానను మోసుకు తిరుగుతుంటాడు. ‘నువ్వు ఊరు ఖాళీ చేస్తే నేనెందుకు ఇక్కడుంటాను. నన్ను కూడా తీసుకుపో’ అని వాన అంటే సుడిగాలి సరేనన్నాడు. దోస్తులిద్దరూ చెప్పాపెట్టకుండా మాయమయ్యారు. ఏముంది... మూడు నెలలు గడిచే సరికి బాధ తెలిసి వచ్చింది. గాలి లేదు. దాని వెనుక వచ్చే వాన లేదు. దాంతో పంటలు పోయాయి. ఊరి పెద్ద నాలుక్కరుచుకుని ‘సుడిగాలిని వెతికి తెచ్చే వీరులెవరు?’ అని ప్రకటన చేశాడు. ఒంటె వచ్చింది. ఏనుగు వచ్చింది. నక్క వచ్చింది. ఎవరు ఎంత దూరం వెతికినా సుడిగాలి కనిపించలేదు. దాంతో పక్షులకు చెబుదాం అనుకున్నాడు ఊరి పెద్ద. కొంగ, నెమలి, గువ్వ వెతికాయి. కనిపించలేదు. ‘పెద్దయ్యా... నేను వెతికి తెస్తాను’ అని ఒక పిచుక అంది. ‘నువ్వా... సరే’ అన్నాడు పెద్దయ్య. పిచుక సుడిగాలిని వెతుక్కుంటూ వెళ్లింది. ఆకాశంలో నుంచి కిందకు చూస్తూ వెతగ్గా వెతగ్గా కింద ఒక ఝరి కనిపించింది. దాని మీదుగా ఎగురుకుంటూ వెళితే అందమైన తోట కనిపించింది. దాని పక్కనే గుహ. దాని మొదల్లో పచ్చగడ్డి. అవును... సుడిగాలి ఇక్కడే ఉండుంటాడు అని చూస్తే లోపలే సుడిగాలి, వర్షం ఉన్నారు. పిచుక సంగతి చెప్పి ‘ఊరు నాశనం అయ్యింది. రండి’ అనంటే.. ‘అరెరె.. వెనకే వస్తాం. నువ్వు పోయి సంగతి చెప్పు’ అన్నారు నేస్తులు. పిచుక ముందుగా ఊరు చేరి తమ పిచుక పెద్దలకు చెప్తే అవన్నీ సంతోషంతో గుమిగూడి కిచకిచలాడాయి. ఆ మరుసటిరోజు సుడిగాలి, దాని వెనుక హోరున వాన. మళ్లీ ఊరు కళకళలాడింది. సుడిగాలిని వెతికి తెచ్చిన పిచుకకు కృతజ్ఞత చెప్పాడు పెద్దయ్య. ఏ కారణం రీత్యా గానీ పిచుకలను వేటాడకూడదని ఆ రోజున తాకీదు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనం పిచుకను వేటాడరు. పాపం అనుకుంటారు. వాన వచ్చే ముందు పిచుకలు దగ్గరకు మూగి కిచకిచలాడే ఆనవాయితీ పోలేదు. ఇదీ కథ. ఇంద్రధనుస్సు ఈ కథ కూడా కొన్నిచోట్ల పిల్లలకు చెప్తారు. ఒకరోజు ఆకాశంలో బుజ్జిపాపలైన నల్లమేఘాలు, తెల్లమేఘాలు పరుగు పందెం పెట్టుకున్నాయట. తల్లి తూర్పుగాలి వచ్చి ‘ఇది వేళ కాదు నాయనా’ అన్నా వినిపించుకోకుండా ఇరుపక్షాలు పరుగుతీశాయట. ఆకాశంలో వీరి పరుగు ముందు సరదాగా మొదలైంది. నవ్వులాటలు... వెక్కిరింతలు సాగాయి. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలిసేలోపు గాలి మళ్లింది. ఒకదానితో ఒకటి డీకొట్టుకున్నాయి. తలలు బొప్పికట్టాయి. నల్ల మేఘాల నిండా నీళ్లే. అవి ఏడుస్తుంటే భోరున వాన కురిసింది. ఇది సూర్యభగవానుడు గమనించాడు. ‘అరెరె... నాయనలాగా ఏడవకండి’ అని వారి కళ్లు తుడవడానికి ఏడుగురు అప్సరసలను పంపాడు. ఆ ఏడుగురు అప్సరసలు ఏడు రంగుల గౌన్లు ధరించి ఆ నల్లమేఘాల దగ్గరకు వచ్చి కళ్లు తుడిచారు. వాళ్ల ఏడుపు, దాంతో పాటే వాన ఆగింది. వెనక్కు మళ్లుదామనుకున్న అప్సరసలు తమ గౌన్లు తడవడంతో వాటిని కాసేపు ఆకాశంలో ఆరనిచ్చారు. ఆకాశంలో మబ్బులన్నీ చెదిరిపోగా వారి ఏడురంగుల గౌన్లు కింద ఉన్నవారికి ఇంద్రధనుస్సులాగా కనిపిస్తూ ఉండిపోయాయి. ఈ సారి నల్ల మేఘాలు ఏడ్చినప్పుడు వాటి కళ్లు తుడవడానికి ఏడుగురు అప్సరసలు వస్తారేమో చూడండి. ఎన్నెన్నో విశ్వాసాలు మన దేశంలో వ్యవసాయం దాదాపుగా వర్షాధారం. అందుకే రుతుపవనాల రాక కోసం జానపదులు, గ్రామీణులు ఎన్నెన్నో విశ్వాసాలు, క్రతువులు పెట్టుకున్నారు. వారికి ఎలాగైనా వాన కావాలి మరి. కప్పల పెళ్లి జరిపించడం మనం చూస్తూ ఉంటాం. వానాకాలంలో కప్పలు ప్రత్యుత్పత్తికి దిగుతాయి. కప్పల పెళ్లి జరిపించడంలో అంతరార్థం వాటికి పెళ్లి జరిగి, ప్రత్యుత్పత్తికి దిగాయి కనుక రావాల్సిందేనని వానను హెచ్చరించడం. ఇప్పుడు లేదుకాని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కూడా తమిళనాడు, బిహార్ రాష్ట్రాలలో వానలు పడకపోతే ఒక కన్నెపిల్ల చేత అర్ధరాత్రి నగ్నంగా నాగలి దున్నే కార్యక్రమం చేయించేవారు. ‘ఇంద్రుడు సిగ్గుపడి ఇకనైనా వాన కురిపిస్తాడనే నమ్మకం దీని వెనుక ఉంది’ అని పరిశోధకులు అంటారు. మధ్యప్రదేశ్లోని గోండులు భీముణ్ణే వానదేవుడు అనుకుంటారు. వానలు ఎంతకూ కురియకపోతే ఒక స్తంభాన్ని భీముడిగా తలచి పేడ, బురద పూస్తారు. వాటిని కడుక్కోవడానికైనా భీముడు వాన కురిపిస్తాడని నమ్మకం. రాజస్థాన్లో ఇదే పని రైతులు చేస్తారు. ఒకరినొకరు బురదతో కొట్టుకుంటారు. ‘ఇంత బురద పూసుకున్న ఈ అమాయకులను కడిగేద్దాం’ అని వాన అనుకోవాలట. రాగాలతో వర్షాలు హిందూస్తానీ సంగీతంలో ‘మల్హార్’ రాగం పాడితే వానలు పడతాయని నమ్మకం. తాన్సేన్ మల్హార్ పాడి వర్షాలు కురిపించాడని చరిత్ర. దక్షిణాది సంగీతంలో ‘అమృతవర్షిణి’ రాగం కూడా ఇలాంటిదే. ఒకసారి ముత్తుస్వామి దీక్షితార్ ‘అమృత వర్షిణి’ని అందుకుంటే ఆకాశం భళ్లుమని వాన మొదలైపోయిందట. జానపదులు మాత్రం ‘వానల్లు కురియాలి వానదేవుడా... వరిచేలు పండాలి వానదేవుడా’ అని వాళ్లకు తోచిన రాగంలో పాడి వానదేవుణ్ణి స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. గతంలో వాన రాకడ, ప్రాణం పోకడ అనేవారు. అంటే వాన ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు అని అర్థం. కాని ఇప్పుడు ఈ అర్థం కాదు. వాన వస్తే ప్రాణం పోతుంది అని! ఎందుకంటే ఎక్కడ గుంట ఉందో ఎక్కడ మిట్ట ఉందో ఎక్కడ స్తంభాలు కూలతాయో ఎక్కడ గోతులు తవ్వి ఉన్నారో తెలియదు కనుక. వానాకాలంలో వాన కథలు చెప్పుకుందాం. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉందాం. మధ్యప్రదేశ్లోని గోండులు భీముణ్ణే వానదేవుడు అనుకుంటారు. వానలు ఎంతకూ కురియకపోతే ఒక స్తంభాన్ని భీముడిగా తలచి పేడ, బురద పూస్తారు. వాటిని కడుక్కోవడానికైనా భీముడు వాన కురిపిస్తాడని నమ్మకం. -
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డేట్ ఫిక్స్, ఆ రోజే లాంచ్!
Prashanth Neel, Jr NTR Movie Shooting Starts Soon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్ని పవర్ ఫుల్ పొలిటీషియన్గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఇక ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2, సలార్ మూవీ షూటింగ్లతో బిజీ కారణంగా ఈ ప్రాజెక్ట్పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇప్పటికే ఎన్టీఆర్కు ఒక లైన్ స్క్రిప్ట్ వినిపించి ఓకే అనిపించుకున్న ఆయన, ఈ ప్రాజెక్టును ‘దసరా’ రోజున లాంచ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగు కూడా మొదలవుతుందని ఫిలిం దూనియాలో టాక్. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ సెక్సెస్తో ఫుల్జోష్లో ఉన్న ఎన్టీఆర్, నెక్ట్ మూవీ కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను సెట్స్పైకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మే 5న ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్లు వారి వివాహ వార్షికోత్సవాలను ఇరు కుటుంబాలతో కలిసి ఒక్కచోటే సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్-లిఖిత, ఎన్టీఆర్-ప్రణతిల వివాహ వార్షికోత్సవం ఒకేరోజు కావడం విశేషం. చదవండి: నటికి చేదు అనుభవం, అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులు -
ధనుష్ మూవీ నుంచి ‘భీమ్లా నాయక్’ హీరోయిన్ను తప్పించారా?, ఏం జరిగింది..
Dhanush Sir Movie Heroine Samyuktha Menon Suddenly Walked Out: కోలివుడ్ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాష చిత్రానికి తెలుగులో ‘సార్’ అనే టైటిల్ను ఖరారు చేయగా.. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోందని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ తప్పకుందంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. చదవండి: సల్మాన్ ఖాన్తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా సంయుక్త మీనన్ భీమ్లా నాయక్లో రానాకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ నిర్మాత నాగవంశీనే ధనుష్ సార్ మూవీకి నిర్మాత కావడంతో పాటు, త్రివిక్రమ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ భీమ్లా నాయక్కు స్రీన్ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్ మూవీకి సంయుక్త మీనన్ హీరోయిన్గా తీసుకోవడంతో ఫిల్మ్ సర్కిల్లో ఈ అప్డేట్ ఆసక్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సార్ మూవీ నుంచి సంయుక్త మీనన్ తప్పించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్పై ట్రోల్స్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. సంయుక్త షూటింగ్కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి కానీ.. సంయుక్త నుండి కానీ ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె సార్ నుంచి తప్పుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సంయుక్త సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం సార్ మూవీకి సంబంధించిన అప్డేట్స్, పోస్టులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది నిజమా కదా అన్నది చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
స్టార్ హీరోకు బాబాయ్గా హీరో రాజశేఖర్!, ఏ సినిమాలో అంటే..
ప్రస్తుతం హీరో రాజశేఖర్ హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన శేఖర్ మూవీ ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోంది. మరో ప్రాజక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలో రాజశేఖర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30(#NTR30) ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: డబ్బు కోసం ఇంత దిగజారాలా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్పై ట్రోల్స్ కాగా చిత్రంలో ఎన్టీఆర్ బాబాయ్ది చాలా పవర్ ఫుల్ రోల్ అని, ఆ పాత్రకు రాజశేఖర్ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్ దీనిక ఫిదా అయ్యారని వినికిడి. దీంతో ఎన్టీఆర్కు బాబాయ్గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఈ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా గతంలో పవర్ఫుల్ క్యారెక్టర్స్.. విలన్ రోల్స్ చేసే అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని గతంలో రాజశేఖర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ పాత్ర చేయాలనుకుంటున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ హీరోలుగా ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోయిన జగపతి బాబు, శ్రీకాంత్లు ఇప్పటికే విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన విలక్షణ నటనతో విలన్గా జగపతి బాబు పరిశ్రమలో సెటిలైపోయాడు. ఇక తాజాగా అఖండతో ప్రతికథానాయకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు శ్రీకాంత్. -
సోదరుడితో సంబంధం అంటగట్టారు.. నిద్ర లేని రాత్రులు గడిపా
Raveena Tandon Recalls Being Linked To Her Own Brother: బాలీవుడ్ నటి రవీనా టండన్ ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పుకార్లను షేర్ చేసుకుంది రవీనా. తనకు తన కోస్టార్స్తో రిలేషన్ ఉన్నట్లు అవాస్తవాలను మీడియా రాసేది అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఎలా రాస్తారు అని ప్రశ్నించింది. ఒకానొక సమయంలో తన సోదరుడితో రిలేషన్లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై తాను ఎంతో కృంగిపోయాను అని చెప్పింది. రవీనా తన కోస్టార్స్ను మంచి స్నేహితులుగా చూస్తానని.. ఆ విషయాన్ని పత్రికా సంపాదకులు అంగీకరించలేకపోయేవారని తెలిపింది. అప్పట్లో జర్నలిస్టుల దయతో నటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా. ఇంకా ఆ ఇంటర్వూలో 'నేను అనేక నిద్ర లేని రాత్రులు గడపడం నాకు గుర్తుంది. నిద్ర పోవడం కోసం ఏడ్చేదాన్ని. ప్రతి నెల సినిమా మ్యాగజీన్లు విడదల అవుతున్నాయంటే భయం పట్టుకునేది. ఎప్పుడూ ఏ పుకారు నా మీద వస్తుందో అని. ఆ పుకార్లు నా పూర్తిగా నాశనం చేశాయి. నా విశ్వసనీయత, నా ప్రతిష్ఠ, నా తల్లిదండ్రుల మనసులను ముక్కలు చేశాయి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇదంతా దేని గురించి అని. వారు నా సొంత సోదరుడితో సంబంధం ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. రవీనా టండన్ను డ్రాప్ చేయడానికి ఒక అందమైన అబ్బాయి వచ్చాడు, మేము రవీనా టండన్ బాయ్ఫ్రెండ్ను కనిపెట్టాం అని స్టార్డస్ట్ రాసింది. అసలు ఎలా చెప్తారు మీరు. ఎలా ధృవీకరీస్తారు. చిత్ర పరిశ్రమలో సినిమా పాత్రికేయులు, ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేది.' అని తన మనసులోని భారాన్ని దించేసుకుంది రవీనా. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు!
Comedian Brahmanandam Sacked From Nithiin Movie?: ఒకప్పుడు ఏడాది పొడవునా వరుస పెట్టి సినిమాలు చేసే టాలీవుడ్ హాస్యబ్రహ్మ, ప్రముఖ నటుడు బ్రహ్మానందం కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించాడు. వయస్సు రీత్యా ప్రస్తుతం ఆయన పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి బ్రహ్మానందంను తొలిగించి నితిన్ ఆయనకు షాక్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ఈ వార్త హాట్టాపిక్గా మారింది. నితిన్కు బ్రహ్మీకి మధ్య ఏం జరిగిందని, ఆయనను సినిమా నుంచి తొలగించేంత పెద్ద విషయం ఏం జరిగిందా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఇదేనంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం మూవీ టీం వైజాగ్ వెళ్లారని, ఈ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్కు నితిన్తో పాటు బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉందట. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. అయితే దీనిపై డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ నుంచి ఎలాంటి కామెంట్ రాలేదు. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం తీరుతో విసుగిపోయిన నితిన్ ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ. 50 లక్షలన్నమాట. ఈ పారితోషికాన్ని అడ్వాన్స్గానే చెల్లించాడట నితిన్. అయితే పారితోషికం నష్టపోయిన ఫర్వాలేదు కానీ ఆయనను భరించాల్సి అవసరం లేదని మేకర్స్ అభిప్రాయపడ్డంటూ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నితిన్ కానీ, మూవీ టీం కానీ ఈ రూమార్స్పై స్పందించే వరకు వేచి చూడాలి. -
కత్రినా కైఫ్తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సాధారణంగా జరిగేదే. అయితే అది ఎంత వరకూ ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ‘ఉరి’ స్టార్ ఓ షోకి రాగా అందులో వీరిద్దరి బంధం గురించి హోస్ట్ టీస్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్ షో ‘కపిల్ శర్మ షో’. దానికి కపిల్ శర్మ హోస్ట్. ఈ షోకి ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ వస్తుంటారు. అలాగే తాజాగా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్ సుజిత్ సర్కార్ వచ్చారు. విక్కీ, క్యాట్ డేటింగ్లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్ టీజ్ చేశాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని తెలిపింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్ అనడం అక్కడ నవ్వులు పూశాయి. ఆ ఎపిసోడ్కి సంబంధించిన వీడియోని నెట్లో పెట్టడంతో అది వైరల్గా మారింది. విక్కీ, కత్రినా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధృవీకరించలేదు కానీ పార్టీలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రిప్కి కూడా వెళ్లారు. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో -
‘ఐరన్మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్మ్యాన్’ అలా..
ఐరన్మ్యాన్.. మార్వెల్ కామిక్స్లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్కు డానీ గుడ్బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా?
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నాను అని బుమ్రా ప్రకటించినప్పటికి.. పెళ్లి చేసుకోవడం కోసమే మ్యాచ్కు దూరమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపాయి. ఇదిలా ఉండగా.. తాజాగా బుమ్రాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరలవుతోంది. పెళ్లి పీటలెక్కబోతున్న బుమ్రా వివాహమాడబోయే వ్యక్తి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓ ప్రముఖ హీరోయిన్ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరగుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారం అవుతోంది. ఇక బుమ్రా కూడా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడని.. గుజరాత్ వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీని గురించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం అవుతోంది. అంతేకాక బుమ్రా.. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అలానే క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని అనుపమ పరమేశ్వరన్ గతంలో బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ బయట కలుసుకున్నట్లు కానీ.. కలిసి ఫోటోలు దిగినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. అలాంటిది ఒక్కసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. మరి ఇవి ఎంత వరకు వాస్తవమో చూడాలి. ఇక ఇంగ్లండ్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేదన్న సంగతి తెలిసిందే. చదవండి: అందుకే సెలవు తీసుకున్న బుమ్రా! అనుపమ పరమేశ్వరన్ మనసు పారేసుకుంది, కానీ! -
అందుకోసం రోజుకు 52 నిమిషాలు!
ముందే వచ్చేశాడే.. ఇంట్లో ఏదైనా పని ఉంటే కదా వాడికి..! ఆవిడంతే ఎప్పుడూ ముభావంగా ఉంటుంది.. ఎందుకో చెప్పనా? అదిగో చూడు వాళ్లిద్దరి ఇకఇకలు పకపకలు.. బుద్ధిలేకుండా.. వాళ్లు ఎలాంటివాళ్లంటే! ఇలా ఏ ఇద్దరు మనుషులు కలిసినా మూడో వ్యక్తి గురించి చెవులు కొరుక్కోవడం మానవ సహజ లక్షణం. ప్రతీ మనిషి రోజుకు సగటున దాదాపు 52 నిమిషాలు ఇతరుల జీవితం గురించే మాట్లాడటానికి వెచ్చిస్తాడు. అంతేకాదు తమ మధ్య లేని స్నేహితుడు, బంధువు, శత్రువు ఇలా అందరి గురించి 15 శాతం చెడుగానే మాట్లాడుకుంటారు. సామాజిక జంతువైన మనిషికి ఈ లక్షణం పూర్వీకుల నుంచే సంక్రమించింది. ఆదిమ మానవుల కాలం నాటి నుంచే గాసిప్ రాయుళ్లు వదంతులు ప్రచారం చేసేవాళ్లు. అయితే ఓ వ్యక్తితో పరిచయం, స్నేహం పెంచుకునేందుకు ఎక్కువ మంది చాడీలపై ఆధారపడతారు. ఈ విషయాలన్నీ చెబుతున్నది మేం కాదండోయ్. మనిషి ప్రవర్తన- వ్యవహార శైలిపై పరిశోధనలు చేస్తున్న సామాజిక శాస్త్రవేత్తలు, సైక్రియార్టిస్టులూనూ. గాసిప్ అంటేనే ఒకరకమైన ప్రతికూల దృక్పథం. ఈ విషయం గురించి గాలేస్బర్గ్ నాక్స్ కాలేజీ సైకాలజీ ప్రొఫెసర్ ఫ్రాంక్ మెక్ఆండ్రూ మాట్లాడుతూ.. ‘‘మన పూర్వీకులు గాసిప్ విషయంలో ఎంతో నేర్పరులు. మానవ పరిణామక్రమంలో వారి వారసులమైన మనకు కూడా ఈ గుణం అలవడింది. ఎవరు ఎవరితో పడుకుంటున్నారు? ఎవరి దగ్గర అధికారం ఉంది? ఎవరికి కావాల్సినన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి? గుహల్లో నివసించే కాలం నాటి నుంచి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నిజానిజాలు తెలుసుకోకుండా మూడో వ్యక్తి గురించి వదంతులు ప్రచారం చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఇతరులను గాయపరుస్తుంది. అయితే రోజూవారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ గాసిపింగ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఓ వ్యక్తి ఎటువంటి వాడు.. అతడి వల్ల మనకేమైనా హాని కలుగుతుందా? అన్న విషయాలు తెలుసుకుని ముందే జాగ్రత్తపడవచ్చు’’అని చెప్పుకొచ్చారు. ఇక మరో ప్రొఫెసర్ మేఘన్ రాబిన్స్.. ఇతరుల గురించి రహస్యాలు మాట్లాడుకునేప్పుడు ప్రతీ ఒక్కరూ ఉపయోగించే మాట.. ‘‘నిన్ను నమ్మి నీతో ఈ విషయం పంచుకుంటున్నా’’. అయితే ప్రతీ ఒక్కరూ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేరు. కొంతమంది మాత్రమే దీనికి కట్టుబడి ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తితో మనకు కొంతమేర ప్రమాదం పొంచి ఉంటుంది’’అని హెచ్చరించారు. ఆడ, మగా తేడా లేదు.. ఆడవాళ్లు, చదువుకోని వాళ్లు ఎక్కువగా గుసగుసలాడుకుంటారనేది ఒక అపోహ మాత్రమే అని పరిశోధకులు కొట్టిపారేశారు. గాసిపింగ్కు ఆడా, మగా.. హై క్లాస్, లో క్లాస్ తేడా ఉండదని.. నిరక్షరాస్యులే కాదు ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు కూడా ఇందుకు అతీతం కాదని వెల్లడించారు. ఇతరులకు హాని చేయనంత వరకు గాసిపింగ్ అంతచెడ్డ గుణం కాదని... బంధాలు పెంపొందించుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం రెస్టారెంట్లు, మాల్స్కు వెళ్లి కొత్త వారిని పరిచయం చేసుకుంటారని... ఇందుకోసం గాసిపింగ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే సెలబ్రిటీల గురించి మాట్లాడతాం చాలా మంది సెలబ్రిటీల జీవనశైలిని అనుకరించేందకు ప్రయత్నిస్తారు. వారి వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి ఆరాలు తీస్తారు. ఇలా తెలుసుకున్న విషయాలను పది మందిలో కూర్చున్నపుడు.. పార్టీలో ఉన్నపుడు వాటికి కాస్త మసాలా జోడించి తనదైన స్టైల్లో చెప్పి శ్రోతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడేవారు ఇలా చేస్తారు. మాట్లాడుతోంది సెలబ్రిటీల గురించి కాబట్టి.. వాళ్లు మనకు తారసపడే అవకాశం లేనందు వల్ల ఇది సేఫ్సైడ్ అనుకుంటారు. అంతేకాదు ఇలాంటి వారు.. తన కంటే అన్ని విషయాల్లో కాస్త పైచేయి సాధించిన వారి విషయంలోనూ ఇదే ధోరణి అవలంబిస్తారు. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. అదే గాసిప్ తన గురించి వస్తే మాత్రం తట్టుకోలేరు. తనలోని అవలక్షణాలను చెప్పిన వారికి దూరంగా ఉంటారు. ఇందుకోసం ముఖ్యమైన బంధాలను వదులుకోవడానికి కూడా వెనకాడరంటూ ఆండ్రూ తాను పరిశోధనలో తేలిన అంశాల గురించి చెప్పుకొచ్చారు. -
‘వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను’
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో నటి మలైకా అరోరాకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తాయి. యువ కథానాయకుడు అర్జున్ కపూర్తో షికార్లు చేస్తున్న ఈ బ్యూటి త్వరలో అతడిని పెళ్లాడనుందన్న వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయంపై అర్జున్ కపూర్, మలైకాలు ఇంతవరకు స్పందించలేదు. తాజాగా తన ఫిట్నెస్ స్టూడియో ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మలైకాకు అర్జున్తో రిలేషన్కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించిన మలైకా అరోరా, ‘నేను వ్యక్తిగత ప్రశ్నలకు ఎప్పుడూ సమాధానాలు చెప్పను. అలాంటి విషయాలు మాట్లాడటం నాకు కంఫర్టబుల్గా అనిపించదు. నా జీవితంలో జరిగే అన్ని విషయాలు అందరికీ తెలుసు. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడం నాకు ఇష్టముండదు. నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను’ అంటూ కామెంట్ చేశారు. -
మల్టీప్లెక్స్ బిజినెస్లోకి మహేష్!
టాలీవుడ్లో సూపర్స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్కు తిరుగులేదు. ఫ్యామిలీ అడియెన్స్తో పాటు మాస్ ప్రేక్షకుల్లో కూడా మహేష్కు భారీ అభిమాన గణం ఉంది. టాలీవుడ్లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేష్ ఒకరు. అంతేకాకుండా మహేష్ ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉంటారు. అయితే ఇప్పుడు మహేష్ థియేటర్ బిజినెస్లోకి దిగినట్టు తెలుస్తోంది. ఏసియన్ సినిమాస్ సంస్థతో కలసి ఆయన జాయింట్ వెంచర్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో AMB మల్టీప్లెక్స్ను నవంబర్ 8న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను మహేష్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
మరో ప్రేమకథను నిర్మించనున్న సుకుమార్!
పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్. గతంలో కుమారి 21ఎఫ్, దర్శకుడు సినిమాలను నిర్మించిన లెక్కల మాష్టారు.. ఈసారి కూడా ఓ ప్రేమ కథా చిత్రాన్ని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారని సమాచారం. సుకమార్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను దర్శకులుగా పరిచయం చేస్తూ.. కథ మాటలు అందిస్తూ.. సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్ సాధిస్తున్నారు. అయితే సుక్కు ఈసారి నాగశౌర్య, రష్మిక మందాన్న కాంబినేషన్లో ఓ లవ్ అండ్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వార్తలపై సుకుమార్ స్పందించేవరకు చూడాల్సిందే. -
ఛలో హీరోయిన్ ఎంగేజ్మెంట్ రద్దు...!
కన్నడ బ్యూటీ, ఛలో ఫేమ్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో గతేడాది ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుండటంతో ఆమె నిశ్చితార్థం రద్దు దిశగా ఆలోచన చేస్తోందని, ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసేసుకుందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీనికితోడు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయన్నది ఆ కథనం పేర్కొంది. గీత గోవిందం పోస్టర్లలో రష్మిక.. విజయ్ దేవరకొండల మధ్య రొమాన్స్పై రక్షిత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అయితే అప్పటి నుంచి రక్షిత్-రష్మికల మధ్య మాటలు లేవన్నంట. దీంతో కెరీర్ పీక్స్లో ఉన్న ఈ సమయంలో ఆమె వివాహ ఆలోచనను పూర్తిగా పక్కకు పెట్టినట్లు ఆ కథనం ఉటంకించింది. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు తూచ్గా తేల్చేస్తున్నారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో ఇద్దరూ కలిసి హాజరైన విషయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ గాసిప్స్పై రష్మిక, రక్షిత్లు స్పందించాల్సి ఉంది. -
ఫస్ట్ లుక్ 31st July 2018
-
రోజుకు నాలుగు లక్షలా?
కమెడియన్గా టాప్ ప్లేస్లో ఉన్నప్పుడే, హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సునీల్. మొదట్లో రెండు మూడు హిట్లు పడినా.. ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. చాల రోజుల నుంచి కనీసం హిట్టు కాదు కదా.. యావరేజ్ మూవీ కూడా సునీల్ ఖాతాలో పడలేదు. ఇంకా హీరోగా ట్రై చేయడం కంటే.. తనకు లైఫ్ ఇచ్చిన కమెడియన్ పాత్రల్లోనే నటించేందుకు సిద్ధమయ్యారన్న విషయం తెలిసిందే. సునీల్ ప్రస్తుతం త్రివిక్రమ్, శ్రీనువైట్ల, భీమినేని శ్రీనివాసరావు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో నటించేందుకు సునీల్ రోజుకు నాలుగు లక్షల పారితోషకంగా తీసుకుంటున్నట్లు టాక్. దీన్ని బట్టి సునీల్ రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. మళ్లీ సునీల్ కమెడియన్గా తన సత్తా చాటి, పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడేమో చూడాలి. -
ఆ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా
‘అ ఆ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో నితిన్. ఆ సినిమా తరువాత వచ్చిన లై, ఛల్ మోహన్రంగా సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నారు నితిన్. శతమానం భవతి లాంటి హిట్ సినిమా తీసిన సతీశ్ వేగేశ్న డైరెక్షన్లో వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నితిన్ ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేయబోతున్నాడని సమాచారం. విభిన్న కథలతో ప్రయోగాలు చేసే ఈ దర్శకుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. గతంలో అనగనగా ఓ రోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా లాంటి సినిమాలు తీశారు. మరి నితిన్తో ఎలాంటి సినిమా తీస్తారో వేచి చూడాలి. -
నాగశౌర్యతో అవసరాల మరో సినిమా?
నాగశౌర్యను హీరోగా విజయాన్ని అందించిన తొలి దర్శకుడు అవసరాల శ్రీనివాసే. ఊహలు గుసగుసలాడే సినిమా విజయం సాధించడంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి హిట్లు అందుకున్నారు. రెండో ప్రయత్నంగా జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్ చేసిన అవసరాల నాగశౌర్యకు మరో హిట్ను అంధించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఫారిన్ బ్యాక్డ్రాప్లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు. -
ఆ ఎఫైర్ను నేను అంగీకరించను: హీరోయిన్
అలియా భట్.. అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించగల నటి. ఆమె నటించిన రాజీ సినిమా ఈరోజు(శుక్రవారం) విడుదలైంది. అయితే ఆ సినిమా గురించి మాట్లాడే వారి కన్నా అలియా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఇంతకీ విషయమేమిటంటే.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించినప్పటి నుంచి అలియా, రణ్బీర్ కపూర్ల మధ్య ప్రేమ చిగురించిందని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఎక్కడ చూసినా అలియా- రణ్బీర్లు జంటగా కనపడుతున్నారు. తాజాగా సోనమ్ కపూర్ పెళ్లికి వచ్చిన వీరివురు ఫొటోలకు పోజులిచ్చి అభిమానులకు కనువిందు చేశారు. అయితే రజత్ శర్మ షో ‘ఆప్ కీ అదాలత్’కి గెస్ట్గా వచ్చిన అలియా రూమర్లపై స్పందించారు. ‘ఒకవేళ ఏదైనా జరుగుతుందని మీకనిపిస్తే అలాగే అనుకోండి.. కానీ ఆ విషయాన్ని నేను అంగీకరించాలనుకోవడం లేదంటూ’ అలియా వ్యాఖ్యానించారు. అయితే వెంటనే మళ్లీ.. ‘అతడి(రణ్బీర్ కపూర్) గురించి అడిగినపుడు నా ముఖం వికసిస్తోంది. నేను దానిని ఎలా నియంత్రించాలా అని ఆలోచిస్తున్నానంటూ’ అభిమానులను కన్ఫూజన్కు గురి చేశారు. నేనేం ఫీలవ్వను.. అలియాకు జనరల్ నాలెడ్జ్ లేదంటూ సోషల్ మీడియాలో జోకులు పేలడంపై ఆమె స్పందించారు. కరణ్ షోలో పాల్గొన్నప్పుడు.. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయానని పేర్కొన్నారు. కాబట్టి తనకేమీ తెలియదంటూ జనాలు నవ్వుకుంటున్నారని.. అయితే అటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోనంటూ అలియా వ్యాఖ్యానించారు. -
నవంబర్లో ఆ నటి వివాహం..?
ప్రస్తుతం బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎన్నో ఊహాగానాల నడుమ సోనమ్ కపూర్ పరిణయ ఘడియలను కూడా ప్రకటించారు. ఈ నెల 8న అనిల్కపూర్ గారాల పట్టి సోనమ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి రణ్వీర్ సింగ్ - దీపిక పదుకోణ్ల వివాహం గురించే. ‘పద్మావత్’ సినిమా విడుదలయిన నాటి నుంచి వీరి వివాహానికి సంబంధించిన పుకార్లు ఎక్కువయ్యాయి. దీపిక పుట్టిన రోజు నాడే వీరిరువురి నిశ్చితార్ధం అయ్యిందని, త్వరలోనే వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు గతంలో బీ టౌన్లో చక్కర్ల కొట్టాయి. ఇన్ని రోజుల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ వీరి వివాహానికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరులో వీరిరువురు ఓ ఇంటివారు కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ఇరు కుటుంబాలు వారు తరచు కలుసుకుంటున్నారని, రణ్వీర్ - దీపికల వివాహవేడుక గురించి చర్చించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది నవంబర్లో రణ్వీర్ - దీపికల వివాహం చేయ్యాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అటు దీపిక, ఆమె కుటుంబ సభ్యులుగానీ, రణ్వీర్, అతని కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే గతంలో రణ్వీర్ తన వివాహం గురించి ప్రస్తావిస్తూ తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరిని పిలిచి మరీ చెప్తాను అన్న సంగతి తెలిసిందే. 2017, డిసెంబరు 11న అనుష్క, విరాట్ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
చిరుతో ‘మైత్రీ’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సై రా షూటింగ్ పూర్తి కాకముందే చిరు తదుపరి సినిమాపై చర్చ జరుగుతోంది. చిరు తరువాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఉండబోతోందన్న వార్త ఫిలిం నగర్లో హల్ చల్ చేస్తోంది. రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సంస్థ చిరుతో సినిమా చేయడానికి రెడీ అవుతోందట. రంగస్థలం షూటింగ్ సమయంలోనే చిరును సంప్రదించారని, ఈ సినిమాను కూడా సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ చెప్పిన కథ చిరుకు బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
కమాన్.. గుసగుస..
పక్కింటి కాంతం ఉంది చూశావూ.. వాళ్లాయనకు ఎవరితోనో లింకు ఉందటే.. నీకెలా తెలుసు అక్కాయ్.. ఎవరో చెబితే.. నేనెందుకు నమ్ముతానే.. ఎవరికి చెప్పొద్దని కాంతమే నాకు చెప్పిందే.. సినిమాల్లో చూపించినట్లు ఇలాంటి చెవులు కొరుక్కోవడాలు మహిళలకే పరిమితమని అనుకుంటూ ఉంటాం.. కానీ మగాళ్లూ ఇందులో ఏమాత్రం తీసిపోవడం లేదని ఓ అధ్యయనం తాజాగా తేల్చింది. ఇజ్రాయెల్కు చెందిన ఏరియల్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని చేసింది. ఇందుకోసం 2,200 మంది ఉద్యోగులను.. వారి గాసిప్ అలవాట్లు తదితరాలపై ప్రశ్నించింది. దీంతోపాటు వారు ఇటీవల కలుసుకున్న ఓ వ్యక్తి గురించి అభిప్రాయాన్ని తెలపమని కోరింది. అనంతరం ఫలితాలను విశ్లేషించగా.. మహిళలతో సమానంగా మగాళ్లు కూడా ఆఫీసుల్లో చెవులు కొరుక్కుంటున్నారట. అయితే.. ఈ గుసగుసల్లో భాగంగా మహిళా ఉద్యోగులు తమ సహచరుల గురించి మాట్లాడేటప్పుడు సానుకూలంగా మాట్లాడితే.. పురుషులు మాత్రం ఆఫీసుల్లో తమ ప్రత్యర్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా గాసిపింగ్ చేస్తున్నారు. ‘స్త్రీలే ఎక్కువగా గ్యాసిప్లు వంటివి చెప్పుకుంటారన్న సాధారణ అభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు మా అధ్యయనంలో వచ్చాయి. పైగా మగాళ్లతో పోలిస్తే.. గుసగుసల విషయంలో మహిళలు చాలా మంచిగా మాట్లాడతారు కూడా’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన బెన్ హాడర్ పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ జెండర్ స్టడీస్’లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
పొగ పెట్టొద్దు..!
నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ, మా మ«ధ్య ఏ నిప్పు లేకపోయినా కొందరు గాసిప్రాయుళ్లు పొగపెడుతున్నారని మండిపడుతున్నారు బాలీవుడ్ నటి సోనమ్కపూర్. ఇంతకీ మేటర్ఏంటంటే... సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానీయా... ఇలా ఈ నలుగురు బాలీవుడ్ బ్యూటీలు ‘వీరే ది వెడ్డింగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ‘క్విక్ గన్మురుగన్’, ‘ముంబై కట్టింగ్’ వంటి సినిమాలను రూపొందించిన శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. సోనమ్ కపూర్ సోదరి రియా, ఏక్తా కపూర్ నిర్మాతలు. ఇలా ఆల్మోస్ట్ కంప్లీట్లేడీస్ గ్యాంగ్ అంతా కలిసి ఈ సినిమా చేస్తుండటంతో బాలీవుడ్ స్టార్స్ అందరి కళ్లూ సినిమాపై ఉన్నాయి. ఈ సినిమా రీసెంట్గా ఢిల్లీలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో కరీనా కపూర్, సోనమ్కపూర్ ఎడ మొహం పెడమొహంగా ఉన్నారని టాక్. నలుగురు నాయికలు మాటా మాటా అనుకుంటున్నారని కథనాలు అల్లారు కొందరు గాసిప్రాయుళ్లు. ఈ కథనాలపై సోనమ్కపూర్ షూటుగా స్పందించారు. ‘‘సెట్లో మా మధ్య గొడవలు జరుగుతున్నాయని వెబ్ మీడియా వారు బ్లైండ్గా ఐటమ్స్ రాస్తున్నారు. వాటి వల్లవారికి క్లిక్స్ వస్తాయేమో. కానీ, అవి నిజాలు కావు. అనవసరంగా మా మధ్య పొగపెట్టొద్దు. మేం హ్యాపీగా షూటింగ్ చేస్తున్నాం. ఇలాంటి గాసిప్స్ వల్ల ప్యూచర్లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కలిసి సినిమాలు చేయడం∙మానుకుంటారు’’ అని సోనమ్ పేర్కొన్నారు. -
ఆమె నా సోదరి కాదు: నటి
సినిమా: ఆరాద్య అనే యువతి తాను అంజలి సోదరినని త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇటీవల ఓ ప్రకటన చేసింది. దీనికి అంజలి తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆరాద్య తన సోదరి కాదని చెప్పకనే చెప్పింది. ఆ విషయం స్పష్టమయ్యేలా నాకున్న ఏకైక సోదరి అంటూ అంజలి తన అక్కతో దిగిన ఫోటోను ఫోస్ట్ చేసింది. ఆమె అక్క పేరు కూడా అందులో పేర్కొనలేదు. ఆరాద్య ఎవరు, ఆమెకు అంజలికి సంబంధం ఏమిటి అనే విషయాలు ట్వీట్లో పేర్కొనలేదు. సముద్ర డైరెక్షన్లో రానున్న బైలింగువల్ మూవీలో అంజలి చెల్లెలు ఆరాధ్య హీరోయిన్గా చేస్తోందన్న వార్త హాట్ టాపిక్గా మారింది. So happy I got to hangout with my one and ONLY sister 👩👧 ❤️❤️#adaywithmyakka #sislove#myblood #familytime pic.twitter.com/kOsktDmxrJ — Anjali (@yoursanjali) September 24, 2017 -
ప్లాస్టిక్ సర్జరీ.. నా పర్సనల్: హీరోయిన్
సాక్షి, సినిమా: హీరోయిన్లు తమ అందాలకు మెరుగుపెట్టుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించటం కొత్తేం కాదు. అందంగా కనిపిస్తే ఫర్వాలేదుగానీ అందులో తేడా కొట్టేస్తే మాత్రం అయ్యో పాపం అనుకోవాల్సిందే. కొన్నాళ్ల క్రితం నటి అయేషా టకియా విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆమె ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకుందని.. అది వికటించిందని కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో ఎటువంటి స్పందన ఇవ్వని అయేషా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్లాస్టిక్ సర్జరీ ప్రస్తావన తీసుకొచ్చారు. తాను అసలు సర్జరీ చేయించుకోలేదని.. అదంతా మీడియా కల్పేనేనని ఆమె తేల్చేశారు. ‘ఆ వార్త వెలువడ్డ సమయంలో నేను కుటుంబంతో గోవాలో ఉన్నా. సోషల్ మీడియాలో ట్రోల్స్ నుంచి తప్పించుకోవటం ఇప్పుడు ఎవరి వల్లా కావటం లేదు. నేనేం తప్పు చేయనప్పుడు.. స్పందించాల్సిన పని లేదనే ఊరుకున్నా’ అని అయేషా చెబుతున్నారు. మొత్తానికి సర్జరీ వార్తలను తోసిపుచ్చిన అయేషా.. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని, సిగ్గుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎవరు ఎవరి జీవితాన్ని నిర్ణయించలేరు. ఎవరికి తోచింది వారు చేసేస్తున్నారు. అలాంటప్పుడు నా శరీరాన్ని మార్చుకునే హక్కు నాకు ఉంటుంది కదా అని అయేషా అంటున్నారు. తెలుగులో నాగార్జున సూపర్ చిత్రంతోపాటు బాలీవుడ్లో అరడజనుపైగా చిత్రాల్లో నటించిన అయేషా తర్వాత సమాజ్వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
బిగ్ బాస్లో నేనా..? టైం లేదు: అనసూయ
అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ హోస్ట్గా మొదలైన 'బిగ్బాస్' రియాల్టీ షోకు ఆదరణ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్టీఆర్ శని, ఆదివారల్లో కనిపించడం ఓ కారణం అయితే.. హౌస్మేట్స్లో ఎవరూ పెద్దగా ఇప్పుడు 'ఫైల్'లో ఉన్నవాళ్ళు కాకపోవడం మరో కారణం. అంతా ఔట్డేటెడ్ గ్యాంగ్.. అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అంతేగాకుండా సోషల్ మీడియాలో షో గురించి నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో 'బిగ్బాస్' రియాల్టీ షోకి ఊపు తెచ్చేందుకోసం, పలువురు హాట్ సెలబ్రిటీస్ని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా తీసుకొస్తున్నారనే ప్రచారం ఊపందుకొంది. ఈ లిస్ట్లో అందరికన్నా ముందు విన్పించిన పేరు హాట్ యాంకర్ అనసూయదే. అయితే, అనసూయ మాత్రం తన చుట్టూ విన్పిస్తోన్న 'బిగ్బాస్' గాసిప్స్ని కొట్టి పారేసింది. తనకు అంత టైమ్ లేదని తేల్చి చెప్పేసింది. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నానని అనసూయ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చేసింది. Umm..Laksmi garu..i dont know I dont think I can afford that time to #BigBossTelugu ..i am hands full with prior TV and movie commitments.. -
టాప్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
చెన్నై: ‘ఇప్పటి దాకా చాలా సహనం పాటించాను. ఇక ఉపేక్షించేది లేదు.. గాసిప్స్ పుట్టించే వారిపై ఇక చర్యలు తప్పవ’ని అంటోంది అగ్ర కథానాయకి అనుష్క. ఆ ముద్దుగుమ్మ గురించి ఇది వరకే చాలా గాసిప్స్ షికార్లు చేశాయి. అయితే బాహుబలి 2 చిత్రం తరువాత అనుష్కపై వదంతుల పర్వం మోతాదు మించిందనే చెప్పాలి. ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్తో ప్రేమాయణం సాగించి పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే ప్రభాస్ ఇంట్లో అనుష్కను కోడలిగా అంగీకరించడం లేదన్న ఊహాగానాలు కోకొల్లలుగా ప్రచారం చేశారు. అన్నిటికీ మౌనం పాటిస్తూ వచ్చిన అనుష్క ఇక లాభం లేదని భావించి.. ‘నేను, ప్రభాస్ హిట్ పెయిర్. అయితే పర్సనల్గా మా మధ్య ఉన్నది స్నేహమే..’ అంటూ కుండబద్దలు కొట్టారు. అయినా ఈ జంటపై వదంతుల ప్రవాహం ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఈ స్వీటీ ఇక లాభం లేదనుకుందో ఏమో తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇకనైనా గాసిప్స్కు పుల్స్టాప్ పడుతుందో, లేదో చూడాలి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
ఆయన స్పాట్ ఫ్రెండే!
హీరోలు హీరోయిన్లను సిఫారసు చేయడం అన్నది సాధారణంగా జరిగే విషయమే. అయితే దీన్ని ఎవరూ అంగీకరించరు. సిఫారసు చేసే హీరోలు కూడా హీరోయిన్ల ఎంపిక అన్నది దర్శక నిర్మాతల పరిధిలోని విషయం అనే చెబుతుంటారు. ఇక ఫలాన హీరో నాకు సిఫారసు చేశారని హీరోయిన్లు మాత్రం ఎందుకు చెబుతారు? ఏమీ చెప్పకపోయినా వారి మధ్య ఏదో ఉందని గాసిప్స్ గుప్పించే మీడియా నిజాలు చెబితే ఇంకా రెచ్చిపోదూ. అందుకు నటి తాప్సీ కూడా తనకెవరూ సిఫారసు చేయడం లేదని ఢంకా ఊదేస్తోంది. ఇంతకు ముందు వరకూ తమిళం, తెలుగు భాషల్లో నటించిన ఈ ఢిల్లీ బ్యూటీకి ఇక్కడ అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. అయితే బాలీవుడ్ అమ్మడిని ఆదుకుంది. ఆ మధ్య అమితాబ్ నటించిన పింక్ చిత్రంలో అత్యాచారానికి గురైన అమ్మాయిగా జీవించడంతో అక్కడ తాప్సీ పరిస్థితి బాగానే ఉంది. ఈ భామకు టాలీవుడ్ యువ నటుడు రానా సిఫారసు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రానా బహుభాషా నటుడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే త్రిష, తమన్నా, శ్రియలతో ఈయన్ని కలిపి వదంతులు దొర్లాలి. తాజాగా రానాతో తాప్సీ సన్నిహితం అంటూ గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బేబీ అనే హిందీ చిత్రంలో కలిసి నటించిన రానా, తాప్సీ తాజాగా కాళీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రంలో నాయకి పాత్రకు తాప్సీకి రానానే సిఫారసు చేశారనే ప్రచారానికి స్పందించిన ఈ ఢిల్లీ పాప నటుడు రానా తనకు షూటింగ్ స్పాట్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేసింది. అంతకంటే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయినా రానా తనకు సిఫారసు చేయాల్సిన అవసరం లేదని, హిందీలో తానిప్పుడు బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నానని చెప్పింది. అలా ఈ కథకు తాను అవసరం కావడంతో దర్శకుడు తనను ఎంపిక చేశారని తాప్సీ పేర్కొంది. -
నా మనసులో ప్రేమకు చోటు లేదు
నా మనసులో ప్రేమకు చోటు లేదు అంటున్నారు నటి తమన్నా భాటియా. సాధారణంగా గాసిప్స్కు దూరంగా ఉండే ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ప్రభుదేవాతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు హల్చల్ చేయడం చాలా మందికి ఆసక్తిని కలిగించింది. అయితే తాను మాత్రం ప్రస్తుతానికి ప్రేమ కోసం సమయాన్ని కేటాయించే పరిస్థితిలో లేనని తమన్నా అంటున్నారు. దీని గురించి ఈ బ్యూటీ కాస్త విపులంగా తెలుపుతూ తాను ఇంకా పలు హీరోలతో నటించాల్సి ఉందన్నారు. అదే విధంగా తన బయోగ్రఫీ కథలో, మరిన్ని కథా బలం ఉన్న చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. స్టార్ హీరోలకు జంటగా, భారీ బడ్జెట్ కథా చిత్రాలలో నటిస్తున్నప్పటికీ, స్టార్డమ్ లేని నటులతో మంచి కథా చిత్రాలలో నటించాలన్న ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. తనకు తానే ఛాలెంజ్ చేసుకునే విధంగా నటించాలని, అప్పుడే తనలో నిద్రాణమై ఉన్న నటనా ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో నటించిన ఊపిరి, ధర్మదురై, దేవి చిత్రాలు ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు. ఇక పోతే ఒకే ఛాయలున్న కథా పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ద్విభాషా చిత్రాల్లో నటించడానికి తనకు అభ్యంతరం లేదు గానీ, త్రిభాషా చిత్రాల్లో నటించనని చెప్పారు. అలాంటి చిత్రాల్లో ఆయా భాషల నేటివిటీకి తగ్గట్టుగా నటించాల్సి ఉంటుందని, అలా నటించడం చాలా చాలా కష్టమని, అలసటకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు. ఇక కాస్త సమయాన్ని ప్రేమకు కేటాయించవచ్చుగా అని అంటున్నారని, అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని, అందువల్ల తన మససులో ప్రస్తుతానికి ప్రేమకు చోటు లేదని నటి తమన్నా పేర్కొన్నారు. ఈ అమ్మడు విశాల్తో రొమాన్స్ చేసిన కత్తిసండై చిత్రం ఇప్పటికీ విడుదల తేదీ రెండు సార్లు వాయిదా పడి చివరికి సంక్రాంతి బరిలోకి దూకడానికి సిద్ధం అవుతోంది. ఇక బాహుబలి-2 ఏప్రిల్ నెలాఖరున తెరపైకి రానుందన్న విషయం తెలిసిందే. -
పద్ధతిగా ఉంటే నో గాసిప్స్
సినిమాలో పద్ధతిగా ఉంటే వదంతులు రావు అంటున్నారు నటి తమన్నా. ఈ మిల్కీబ్యూటీకి రీఎంట్రీతో దశ, దిశను మార్చిన చిత్రం బాహుబలి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా కోలీవుడ్లో వరుసగా విజయాలు వరిస్తుండడం విశేషం. ఇక్కడ తోళా, ధర్మదురై, దేవి చిత్రాల విజయాలు తమన్నా స్థాయిని బాగా పెంచాయని చెప్పవచ్చు.కాగా త్వరలో విశాల్తో రొమాన్స్ చేసిన కత్తిసండై తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో గ్లామర్ విషయంలో రెచ్చిపోయారంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ముఖ్యంగా యువళ గీతాల్లో తమన్నా అందాలు యువతను గిలిగింతలు పెట్టడం ఖాయం. ప్రస్తుతం శింబుకు జంటగా అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ భామ వదంతుల గురించి చాలానే చెప్పుకొచ్చారు. ఆ సంగతులేమిటో చూద్దాం. ‘నటీనటుల జీవితం ఇతరుల కంటే వ్యత్యాసమైనది. వారి ప్రవర్తన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నటీనటుల నడవడిక, వారు ధరించే దుస్తులు, భావనలను సాధారణ ప్రజలు అనుసరించాలనుకుంటారు.అందుకే తారల గురించి అధికంగా గాసిప్స్ ప్రచారం అవుతుంటాయి. అలాంటి వదంతులతో కొందరు నటీమణులు మనస్తాపానికి గురవుతున్నారు. వాళ్లకు కుటుంబం ఉంటుంది కదా, వాళ్లు ఏమనుకుంటారోనన్న ఆవేదన పడుతుంటారు. వదంతులనే సంస్కృతి నానాటికీ అధికం అవుతోంది. అయితే కొందరు నటీమణులు వందతులను పట్టించుకోవడం లేదు.అయితే ఇలాంటి వదంతులను మంచి నటనతో గెలవవచ్చునన్నది నా భావన. ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవచ్చు. ఉత్తమ నటి అన్న పేరే చివరి వరకూ మనతో వస్తుంది.అప్పుడే వదంతులను మరచిపోతారు. అంతే కాదు సినిమాలో పద్ధతిగా నడుచుకోవడం చాలా ముఖ్యం. వృత్తిలో అంకిత భావం ఉంటే వదంతుల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారిపై వదంతులూ అంతగా రావు. నా వరకూ మంచి కథా పాత్రలు అమరుతున్నాయి. పాత్రల ఎంపికపై ప్రతేక దృష్టి పెడుతున్నాను. బాహుబలి చిత్రంలో నా పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. వరసగా మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను’ అని తమన్నా పేర్కొన్నారు. -
అలాంటి వాటిని నా మదిలోకి రానీయను
చాలా కాలంగా చాలా రకాల గ్యాసిప్స్ను ఎదుర్కొన్న అనుష్క తాజాగా ఒక పెళ్లైన సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు, త్వరలో ఆయనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునో, లేక మరేదన్న సంఘటన తనను ఘాటుగా తాకిందోగానీ తను క్రింది విధంగా స్పందించారు. వదంతులకు తొలి రోజుల్లో చాలా బాధపడ్డాను. ఇంట్లో వాళ్లను అవి కష్టపెట్టాయి. ఇప్పుడు నేను చాలా పరిణితి చెందాను. నాలాంటి సెలబ్రిటీలు ఇలాంటి సత్యదూర ప్రచారాలను ఎదుర్కొవలసి ఉంటుందన్నది గ్రహించాను. ఇతరులు ఏమనుకుంటున్నారు, లోకం ఎలా చిత్రీకరిస్తోంది అంటూ జీవిస్తే ప్రశాంతత కరువవుతుంది.వదంతులకు చింతిస్తే మిగిలేది ఏడుపే. సినిమాలో వదంతులన్నవి సర్వసాధారణం. అలాంటివి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని తొసిపుచ్చలేను. అయితే అది కొంత సేపే. ఆ తరువాత ఏది విధికి వచ్చేస్తాం. అయినా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధ పడాలి. వదంతులకు చింతిస్తూ కూర్చుంటే నిద్రేరాదు. అలాంటి వాటిని నా మదిలోకి రానీయను. అందుకే తాను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. నటిగా కూడా చాలా సంతృప్తిగా ఉన్నాను. తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నటనా ప్రతిభను చాటుకునే పాత్రలు అమరుతున్నాయి అని అనుష్క పేర్కొన్నారు. -
రవితేజ సరసన మరోసారి?
గాసిప్స్ రాశీఖన్నా ఏ హీరో సరసన నటించినా ఆ హీరోకి యాప్ట్గా ఉంటారు. ఒకవైపు సాయిధరమ్ తేజ్లాంటి యువహీరోలు, మరోవైపు రవితేజ లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. రవితేజతో ఆమె ‘బెంగాల్ టైగర్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. మరోసారి ఈ జంట సందడి చేయనున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో రాశీఖన్నాను కథానాయికగా తీసుకున్నారట. ఈ చిత్రం అక్టోబర్లో సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. ఒకవైపు తెలుగు చిత్రాలు చేస్తూనే రాశీఖన్నా తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళంలో సిద్ధార్థ్ సరసన ‘సైతాన్ కా బచ్చా’ అనే తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. తాజాగా, యువహీరో అథర్వ సరసన ఓ తమిళ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద రాశీఖన్నా బిజీ బిజీ. -
గాసిప్స్ బాధిస్తున్నాయి
తన గురించి చాలా వదంతులు ప్రచారం చేస్తున్నారు. అవి వ్యక్తిగత జీవితాన్ని బాధిస్తున్నాయని విచారాన్ని వ్యక్తం చేశారు నటి సమంత. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వెల్లడించి కొత్త చర్చకు దారి తీసిన ఈ చెన్నై చిన్నది తను నటించే చిత్రాలనూ తగ్గించుకుంటూ వచ్చారు. నటుడు ధనుష్కు జంటగా నటించాల్సిన వడచెన్నై చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఒకే ఒక్క తెలుగు చిత్రం జనతా గ్యారేజ్లో నటిస్తున్నారు. ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. సమంత నటనకు ఫుల్స్టాప్ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించడానికి పచ్చజెండా ఊపి మరోసారి చర్చకు తావిచ్చారు. ఇలాంటి పరిస్థితిలో ఈ చెన్నై చిన్నది తన మనసులోని మాటల్ని బయట పెట్టారు. అవేమిటో తన మాటల్లోనే. నాపై గాసిప్స్ చాలా ప్రచారం చేస్తున్నారు. అవి నా వ్యక్తిగత జీవితాన్ని వివాదం చేస్తున్నాయి. ఇది బాధాకరం. చర్చించడానికి దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. కొందరు పనికట్టుకుని ఎగతాళి చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటివి హర్షణీయం కాదు. బ్రహ్మోత్సవం చిత్రంలో నటుడు నాజర్ మంచి విషయాల గురించి ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చు అన్న డైలాగ్ను పదేపదే చెబుతారు. అది నాకు బాగా నచ్చింది. మన చుట్టూ చాలా మంచి విషయాలు జరగుతున్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇతరులను విమర్శించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి పేపర్లో చదువుతున్నాం. మంచి విషయాల గురించి చర్చించడం వల్ల మంచి ఆలోచనలు కలుగుతాయి. అది ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా చెడు అలవాట్లకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అందరం మంచి విషయాల గురించే చర్చించాలని ఎవరికి వారు ప్రమాణం చేసుకుంటే మంచిది. -
ఆమె గాసిప్స్ పట్టించుకోదు
గాసిప్స్ పట్టించుకోకుండా నటనపైనే ఏకాగ్రత పెడతారు నటి నయనతార. ఈ మాటలన్నది ఎవరో కాదు ఆమె తాజా ప్రియుడిగా ప్రచారంలో నానుతున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం నానుమ్ రౌడీదాన్. విజయ్సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్కు నయనతారకు మధ్య ప్రేమ మొదలైందని, దర్శకుడికి నయనతార ఖరీదైన కారును, ఒక ఇంటిని కొని ఇచ్చారని రకరకాల వదంతులు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై దర్శకుడు చాలా కాలం తరువాత పెదవి విప్పారు. ఆయన తెలుపుతూ నానుమ్ రౌడీదాన్ చిత్ర కథను సంగీత దర్శకుడు అనిరుద్ కోసం తయారు చేసినట్లు చెప్పారు. ఆయన కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలిగారని తెలిపారు. దీంతో కథలో కొన్ని మార్పులు చేసి విజయ్సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్గా రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర సమయంలో తనను నయనతారను కలుపుతూ రకరకాల వదంతులను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నయనతారతో ప్రేమతో పాటు తనను మలయాళీని చేసేశారనీ, తాను నిజానికి తాను తమిళుడినని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఆ వ్యక్తుల మనసుల్ని బాధిస్తాయన్న విషయాన్ని మరచిపోతున్నారని అన్నారు. ఇలా వ్యక్తిగత విషయాలను చెబితే ప్రచారం కోసం పాకులాడుతున్నారంటారన్నారు. నయనతార విషయానికొస్తే ఇలాంటి వదంతులను తను పట్టించుకోరని తన దృష్టినంతా నటన పైనే సారించే నటి అని అన్నారు. ఆమెలా నటనలో మమేకమయ్యే నటిని చూడలేదని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నయనతార మూగ యువతిగా నటిస్తున్నాని ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి ఎవరూ మాట్లాడుకోరని దర్శకుడు వాపోయారు. అదే విధంగా నటుడు పార్తిబన్ విలనీయం ప్రదర్శించడం విశేషం అని అన్నారు -
ఎన్టీఆర్కి డబుల్ ధమాకా
సినిమా వెనుక స్టోరీ - 17 కొన్నిసార్లు వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. కొన్నిసార్లు వెతికి వెతికి దొరకబుచ్చుకున్న తీగ మెడకు చుట్టుకుంటుంది. కానీ అది బంగారు తీగని తెలిశాక మాత్రం చాలా సంతోషం వేస్తుంది. ‘అదుర్స్’ వెనుక ఇంత కథ ఉంది. ఎన్టీఆర్కి ముగ్గురన్నలు. బ్లడ్ రిలేషన్ కాదు కానీ, అంతకన్నా ఎక్కువే. మొదటి అన్న... కొడాలి నాని. ఎన్టీఆర్కి మొదటి నుంచీ అండా దండా. ఎన్టీఆర్ స్టార్ అవుతాడని మొదటి నుంచీ బలంగా నమ్మిన వ్యక్తి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నవాడు. కానీ సినిమాలంటే చాలా ఇంట్రస్ట్. కృష్ణాజిల్లాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఎన్టీఆర్తోనే ‘సారబ’ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. రెండో అన్న... వల్లభనేని వంశీమోహన్. పెద్ద ఎన్టీఆర్కి, ఈ చిన్న ఎన్టీఆర్కి వీరాభిమాని. మూడో అన్న.. వీవీ వినాయక్. ‘ఆది’తో ఎన్టీఆర్ని స్టార్ని చేసినవాడు. ఎన్టీఆర్ మనసుకు చాలా దగ్గర మనిషి. ఈ ముగ్గురన్నలతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అది ఎలా ఉండాలంటే? కొండలను పిండి చేయకూడదు, కానీ బంగారుకొండలా ఉండాలి. టాటా సుమోలు, బాంబ్ బ్లాస్ట్లు, రక్తపాతాలు... ఇవన్నీ కనబడకూడదు. పొట్ట పగిలేలా పడీపడీ నవ్వాలి. ప్రయోగంలా ఉండాలి, కానీ కమర్షియల్గా వర్కవుట్ కావాలి. ఎన్టీఆర్ని మాస్, యాక్షన్ చట్రం నుంచి బయటకు తీసుకురావాలి. అలాంటి కథ కోసమే వెతుకులాట. నెల... రెండు నెలలు... మూడు నెలలు... నాలుగు నెలలు... ఇలా నెలలు గడచిపోతున్నాయి. ఎన్టీఆర్ - వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది (2002), సాంబ (2004)లను మించే కథ అనుకుంటే ఏదీ ఆనడం లేదు. ‘దుర్గయ్య’ అని ఓ కథ అనుకున్నారు. కానీ నో యూజ్. డెరైక్టర్ దశరథ్ వినాయక్కి క్లోజ్. ఇద్దరూ రెగ్యులర్గా కలుస్తుం టారు. ఆ రోజు దశరథ్ సరదాగా ఓ కథ చెప్పాడు. పోలీసు కథ. వినాయక్కి విపరీతంగా నచ్చేసింది. ‘‘ఎన్టీఆర్కి బాగుంటుంది. కథ ఇచ్చేస్తావా?’’... అడిగాడు వినాయక్. ఓకే అన్నాడు దశరథ్. ఇద్దరూ కూర్చుని ఓ వెర్షన్ రెడీ చేశారు. ఫైనల్లీ నాట్ శాటిస్ఫైడ్. ‘మస్కా’ రైటర్ సూర్య ఓ లైన్ తీసుకొచ్చాడు. హీరో ఓ కాలేజ్ స్టూడెంట్. ఫస్ట్ హాఫ్ అదిరింది. సెకండాఫ్ సరిగ్గా లేదు. ఇదీ అంతే. వినాయక్ కథలు వింటూనే ఉన్నాడు. బుర్ర వాచిపోతోంది. అవతల ఎన్టీఆర్ డేట్స్ దగ్గర పడుతున్నాయి. టెన్షన్ టెన్షన్. అలాగని ఏది పడితే అది చేసెయ్యకూడదు. ఆ రోజు రైటర్ కోన వెంకట్ కలిశాడు. నిలబెట్టి వంద కథలు చెప్పగలడు. సరదాగా ఓ డ్యుయల్ రోల్ కాన్సెప్ట్ చెప్పాడు. ఒకడు క్లాసు, ఇంకొకడు మాసు. కవలలుగా పుట్టి విడివిడిగా పెరుగుతారు. ఒకడు పిరికి. మరొకడు ధైర్యస్తుడు. వీళ్ల పాలిట ఒక కామెడీ డాన్. ఇద్దరూ కలిసి అతడి భరతం పట్టించడం కథ. వినాయక్ వెంటనే కనెక్టయిపోయాడు. ‘‘ఇందులో పిరికివాడు పూజారైతే బావుంటుందేమో ఆలోచించండి’’... వినాయక్ సజెషన్. కోన రెచ్చిపోయాడు. సింహాచలంలో తనకు తెలిసిన పూజారి గారబ్బాయి గుర్తొచ్చాడు. అతని ఇన్స్పిరేషన్తో ‘చారి’ క్యారెక్టర్ రెడీ చేశాడు. వినాయక్ ఫుల్ హ్యాపీ. రెండు క్యారెక్టర్లూ ఎన్టీఆర్కి నచ్చేశాయి. ఒకటి నరసింహ... ఫుల్ సీరియస్. రెండోది బృందావనం నరసింహాచార్యులు ఉరఫ్ చారి... ఫుల్ ఫన్. చారి క్యారెక్టర్ను కోన ఓ శ్లాంగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఎన్టీఆర్ పడీపడీ నవ్వాడు. కానీ వినాయక్లో ఎక్కడో చిన్న టెన్షన్. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని చారి పాత్రలో ఫ్యాన్స్ డెజైస్ట్ చేసుకోగలరా? ఎన్టీఆర్తో చెప్పి, ఫొటో సెషన్ పెట్టాడు. చారి గెటప్ కోసం చాలా హోమ్వర్క్ చేశారు. ఫైనల్గా గెటప్ రెడీ. చారిగా ఎన్టీఆర్ భలే ఉన్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తే షూటింగ్కి వెళ్లిపోవచ్చు. కోన ఆ పని మీదే ఉన్నాడు. ఫస్ట్ వెర్షన్... సెకండ్ వెర్షన్... థర్డ్ వెర్షన్. కానీ, సెకండాఫ్ కాంక్రీట్గా లేదు. అయినా పర్లేదు. రన్నింగ్లో చేసేసుకోవచ్చనే ధీమా. షూటింగ్కి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇద్దరు హీరోయిన్లు. నయనతార ఫస్టే ఫిక్స్. వినాయక్తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసింది... లక్ష్మీ, యోగి. ఇంకో హీరోయిన్గా ‘పరుగు’లో చేసిన షీలా ఓకే. విలన్గా రెగ్యులర్ ఫేస్ ఉండకూడదు. డాన్ పాత్రే అయినా అమాయకంగా కనబడాలి. దొరికాడు. మహేశ్ మంజ్రేకర్. బాలీవుడ్ డెరైక్టర్ టర్న్డ ఆర్టిస్ట్. కాస్టింగ్ ఓకే. క్రూ ఓకే. ప్రొడక్షన్ అంతా ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జికి అప్పగించారు. 2008 ఏప్రిల్ 23. హైదరాబాద్ - ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో ఓపెనింగ్. ఫస్ట్ డే షూటింగ్. వినాయక్ టెన్షన్గా ఉన్నాడు. చారి గెటప్లో ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు. ‘చక్కెర తక్కువ’ అంటూ ఓ సీన్ తీయాలి. రెడీ.. స్టార్ట్... కెమెరా... ఆ సీన్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి యూనిట్ అంతా పడీపడీ నవ్వారు. దాంతో వినాయక్కి ఫుల్ కాన్ఫిడెన్స్. ఇక చారి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. చారి ఎలా మాట్లాడాలి? ఎలా బిహేవ్ చేయాలి? కోన జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చాడంతే. ఎన్టీఆర్ అల్లుకుపోయాడు. చారిగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూసి వినాయక్ మురిసిపోతున్నాడు. తాను కోరుకుంది ఇదే. టైటిల్ ఏం పెట్టాలి? లవకుశ... దసరా... డబుల్ ధమాకా... ఇంకా చాలా చాలా అనుకున్నారు. చివరకు ‘అదుర్స్’ అని పెట్టారు. హ్యాపీగా ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది. కానీ సెకండాఫ్ స్క్రిప్ట్ విషయంలోనే క్లారిటీ రాలేదు. టోటల్ సీరియస్ మూడ్లో వెళ్తోంది సెకండాఫ్. వినాయక్ ఫుల్ ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. గోపీమోహన్ హెల్ప్తో కోన ఇంకో వెర్షన్ రెడీ చేయడం మొదలుపెట్టాడు. ఈలోగా 2009 ఎలక్షన్ల హడావుడి. టఫ్ ఫైట్. టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి. దాంతో ‘అదుర్స్’కి లాంగ్ బ్రేక్. ఎలక్షన్స్ అయిపోగానే షెడ్యూల్ వేసుకోమని చెప్పేశాడు ఎన్టీఆర్. ఆ పనిలోనే ఉంది యూనిట్. కానీ కాలం వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది 2009 మార్చి 27. అర్ధరాత్రి టీవీ చానల్స్లో ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్. ప్రచారం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొస్తున్న ఎన్టీఆర్ కారుకు ఘోరమైన యాక్సిడెంట్. ఎన్టీఆర్ జస్ట్ మిస్. హాస్పిటల్లో ఎమర్జెన్సీ అడ్మిట్ చేశారు. ‘5 పక్కటెముకలు విరిగిపోయాయి. 6 నెలలు విశ్రాంతి తీస్కోవాలి’... డాక్టర్ల వార్నింగ్. అలాగే బెడ్మీద పడి ఉన్నాడు ఎన్టీఆర్. కదల్లేకపోతున్నాడు. కూర్చోలేకపోతున్నాడు. ఎన్నాళ్లిలా? భయం వేసింది. ఇంటికి తీసుకెళ్లారు. బెడ్మీద నుంచి కదల్లేకపోతున్నాడు. లేవలేని స్థితి. ఈ బాధకు తోడు... గాసిప్స్ బాధ. ఎన్టీఆర్ పని అవుట్. ఒకవేళ లేచి నడిచినా డ్యాన్స్ చేయలేడు. ఒకవేళ డ్యాన్స్ చేసినా మునుపటి స్పీడ్ ఉండదు... ఈ కామెంట్స్ అన్నీ ఎన్టీఆర్ చెవిన పడుతున్నాయి. కసి... పట్టుదల... తెగువ. తను మళ్లీ లేవాలి. మునుపటిలా డ్యాన్సులు చేయాలి. తనను కామెంట్ చేసినవాళ్ల నోళ్లు మూయించాలి. డాక్టర్లిచ్చే మెడిసిన్ కన్నా మనోబలమే గొప్ప మందు. ఎన్టీఆర్కి ఇప్పుడు అదే పనిచేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ లేస్తున్నాడు. నడుస్తున్నాడు. వినాయక్కి ఫోన్ చేశాడు. ‘‘వినయన్నా... షూటింగ్ పెట్టుకోండి. ముందు క్లైమాక్స్ సాంగ్ తీసేద్దాం’’ అని చెప్పాడు. వినాయక్ షాక్. ‘‘ఏంటి తారక్ నువ్వు మాట్లాడేది? ఇంకో 2 నెలలు రెస్ట్ తీసుకో. ఇప్పుడు సినిమా అర్జెంట్గా పూర్తిచేయాల్సిన అవసరం లేదు’’ అని సర్దిచెప్పాడు. ఎన్టీఆర్ మొండివాడు. ఎంతకూ వినడే! దాదాపు 6 నెలలు షూటింగ్ లేదు. ‘అదుర్స్’ ఉంటుందా లేదా అని యూనిట్లోనే కొంతమందికి డౌట్. కానీ వినాయక్, కోన మాత్రం ఈలోగా సెకండాఫ్ను టైట్గా సెట్ చేశారు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా సూపర్గా రెడీ. పాట కోసం ఆర్ఎఫ్సీలో సెట్ వేశారు. గాయాలు పచ్చిగానే ఉన్నా, రెడీ అయ్యి వచ్చేశాడు ఎన్టీఆర్. షీలాతో ‘‘పిల్లా నావల్ల కాదు...’’ అంటూ డ్యూయెట్. కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్ భయం భయంగానే స్టెప్ వేసి చూపించాడు. జస్ట్ అలా చూసి సెట్లోకి వెళ్లాడు ఎన్టీఆర్. షాట్ రెడీ. ఎలా చేశాడో కానీ మెరుపుతీగలా కదిలాడు ఎన్టీఆర్. సింగిల్ టేక్లో లెంగ్తీ స్టెప్ ఓకే. ఆగకుండానే స్టెప్పులేస్తున్నాడు. పక్కటెముకల్లో విపరీతమైన నొప్పులు. భరించలేకపోతున్నాడు. కానీ భరించాలి. డాక్టర్లనడిగి ఏవో మాత్రలు వేసుకున్నాడు. వినాయక్ సెట్ లోపలక్కూడా రాలేదు. బయటే టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. షూటింగ్ ఆపేద్దామని గొడవ. ఎన్టీఆర్ సర్దిచెప్పాల్సి వచ్చింది. అడ్డంకులు... అవరోధాలు... ప్రసవ వేదనలు... బోలెడన్ని మానసిక సంఘర్షణలు... ఇవన్నీ దాటుకుని ‘అదుర్స్’ 2010, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సూపర్ హిట్... బంపర్ హిట్... బ్లాక్ బస్టర్ అయ్యిందా అనే విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం ఇరగదీసేశాడు. చారి భాషలో చెప్పాలంటే... సాంతం అదరగొట్టేశాడు. ఇక భట్టు - చారి ఎపిసోడ్ అయితే పగలబడి నవ్వాల్సిందే. భట్టుగా బ్రహ్మానందం, చారిగా ఎన్టీఆర్ ఒకరికొకరు పోటీపడ్డారు. ఎన్టీఆర్లోని యాక్టర్ని న్యూ డెమైన్షన్లో ఆవిష్కరించిందీ చారి పాత్ర. ఇక ఏ దారిలో వెళ్లినా విజయం సాధించొచ్చనే భరోసా వచ్చింది ఎన్టీఆర్కి. అటు విజయం... ఇటు భరోసా... ఎన్టీఆర్ డబుల్ ధమాకా! వెరీ ఇంట్రస్టింగ్... * ఎన్టీఆర్కు హీరోగా 16వ సినిమా. వినాయక్కు దర్శకునిగా 10వ చిత్రం. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడోది. ఇంతకుముందు ‘ఆది’ (2002), ‘సాంబ’ (2004) చేశారు. * వినాయక్కి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తన కొత్త సినిమా షూటింగ్ కచ్చితంగా ఫైట్తోనే మొదలుపెడతాడు. అలాగే ఆయన అన్ని సినిమాల్లోనూ ఎక్కడో ఓ చోట రెడ్ క్లాత్ చుట్టిన బ్లాక్ కలర్ విగ్రహం కనిపిస్తుంది. కలకత్తాలోని కాళీమాత టెంపుల్లో ఒక్క సీన్ అయినా తీయడం వినాయక్కి సెంటిమెంట్. * ‘వేరీజ్ దట్’ పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడారు. * ‘అదుర్స్’కి సీక్వెల్ చేసే ఆశ, ఆలోచన వినాయక్కి ఉన్నాయి. -
నయా ట్రిక్స్
ఏ నటికైనా, నటుడికైనా ప్రచారం చాలా అవసరం. అందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంభిస్తుంటారు. కొందరు ధనాన్ని వెచ్చిస్తే, మరి కొందరు సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇంకొందరు యుక్తిని ఉపయోగిస్తుంటారు. నటి నయనతార ఈ మూడో కోవకి చెందినామె అని చెప్పవచ్చు. బాలీవుడ్కు చెందిన హీరోయిన్లు ఎలాంటి గాసిప్స్కు చింతించరు. పైగా అలాంటి వాటిని వారు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తమపై వదంతుల్ని వారే పుట్టించుకుంటారని కూడా ప్రచారంలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రచారంతో మీడియాలో హెడ్లైన్స్లో ఉండాలన్నదే అలాంటి వారి ఆలోచన. ఇప్పుడీ వరుసలో నటి నయనతార చేరారని చెప్పక తప్పదు. దక్షిణాదిలో ఏ నటి ఎదుర్కోని సమస్యలు ఈమెను చుట్టిముట్టాయి. వీటిలో స్వయంకృతాపరాధం వల్లే అధికం అనక తప్పదు. ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు ఓడిపోయారు. మూడోసారి ప్రేమ ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్ శివతో నయనతార ప్రేమాయణం సాగిస్తున్నారన్నది కోలీవుడ్ టక్. ఇలాంటి వదంతులు హోరెత్తుతున్నా ఏమాత్రం చలించని నయనతార దర్శకుడు విఘ్నేశ్శివతో సన్నిహితంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్లో హల్చల్ చేస్తోంది. వీరి మధ్య ఏదో ఉందనే సందేహం పరిశ్రమ వర్గాల్లో కలగడం సహజం. వీటిలో దేనికి నయనతార స్పందించక పోవడం చూస్తుంటే ఇలాంటి వదంతులను ఆమే ప్రచారం చేసుకుంటున్నారనిపిస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. పలు భేటీలతో వచ్చే ప్రచారం కంటే ఇలాంటి వదంతులతో పది రెట్లు అధికంగా పోందవచ్చుననేది నయనతార యుక్తి కావచ్చునన్నది సినీ వర్గాల భావన. కేరళాకు చెందిన ఈ అమ్మడు కొచ్చిలో నివసిస్తూ షూటింగ్లకు చెన్నై, హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు చెన్నై, కోయంబేడులో బ్రహ్మాండమైన ఫ్లాట్ను కొనుగోలు చేశారని తెలిసింది. నయనతార భవిష్యత్లో చెన్నైలో సెటిల్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. -
గాసిప్స్ డోస్ పెంచాలి
కొందరు నాయికలు గాసిప్స్కు దూరంగా ఉండేలా జాగ్రత్త పడతారు. మరికొందరు గగ్గోలు పెడతారు. ఇంకొందరు గాసిప్స్ను ఎంజాయ్ చేస్తారు. ఈ మూడవ కోవకు చెందిన నటి లక్ష్మీమీనన్. ఈ కేరళ కుట్టిపై ఇప్పటికే పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అవిచాలవట. ఇంకా డోస్ పెంచాలంటోంది. ఈ కుంకి హీరోయిన్కు అదృష్టం తేనెతుట్టెలా పట్టిందనవచ్చు. తొలి చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన నాన్ శిగప్పు మనిదన్ చిత్రం వరకు వరుస విజయాలను అందుకుంది. తాజాగా కార్తీతో రొమాన్స్ చేసిన కొంభన్ గురువారం తెరపైకి వచ్చింది. నిజం చెప్పాలంటే విశాల్ తరువాత ఈ కేరళ కుట్టిస్టార్ హీరో సరసన నటించిన చిత్రం ఇదే. ఇందులో దక్షిణాది ప్రాంత పల్లెటూరి యువతిగా మరోసారి చీరకట్టులో కనిపించింది. ఇంత క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్న కెరీర్ను ప్లస్టూ పరీక్షల కోసం అంటూ బ్రేక్ ఇచ్చుకున్న లక్ష్మీమీనన్ ఇక నటనకు స్వస్తి చెప్పినట్లే, పై చదువుల కోసం బెంగళూరులో సెటిల్ అవబోతోందంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆమె కొన్ని చిత్రాలను నిరాకరించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో తన జానతనాన్ని ప్రదర్శిస్తూ నేను నటనకు స్వస్తి చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి నా కొచ్చిన అవకాశాలు నచ్చకపోవడంతోనే వాటిని తిరస్కరించాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే లంగా ఓణి పాత్రలు ధరించి బోర్ కొట్టేసింది. మూస పాత్రలు ధరించడం ఇష్టం లేదు. అంతకంటే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. మాడ్రన్ గర్ల్ లాంటి పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. అలాంటి నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తే చేస్తాను. గ్లామర్గా నటిం చడానికి అభ్యంతరం లేదు. అవసరం అయితే అందుకు తగ్గట్టుగా తన శారీరకభాషను మార్చుకుంటాను. అయితే ప్రస్తుతానికి అందుకోసం ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. నచ్చిన ఆహారం పుష్టిగా లాగించేస్తున్నాను. ఇక పాడడం గురించి అడుగుతున్నారు. అనూహ్యంగా వచ్చిన అవకాశాలతో ఒకటి రెండు పాటలు పాడాను. అంతేకాని అది నా వృత్తి కాదు. అలాగే నాపై ప్రచారం అవుతున్న గాసిప్స్ గురించి స్పందించాల్సిందిగా అడుగుతున్నారు. అలాంటివి చదివి ఎంజాయ్ చేస్తున్నాను. గాసిప్స్ డోస్ పెంచాలని కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే అవి బోలెడంత ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడతాయంటోది నటి లక్ష్మీమీనన్. -
అవకాయ్ బిర్యాని 7th March 2015
-
ఆ గాసిప్స్ నమ్మొద్దు...
‘‘ఉన్నదాంట్లో సంతృప్తి పడటం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ‘అత్యాశ’ అనే పదమే నా నిఘంటువులో లేదు. అలా అత్యాశకు లోనయ్యేవారిని చూస్తే నాకు అసహ్యం’’ అన్నారు కాజల్ అగర్వాల్. బాలీవుడ్ డెరైక్టర్ సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందనున్న ‘పెహలే ఆప్ జనాబ్’ చిత్రంలో నటించడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు కాజల్. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘‘నా పారితోషికం గురించి రకరకాల గాసిప్పులు మీడియాలో వినిపిస్త్తున్నాయి. వాటిని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే...నా కష్టానికి మించి పారితోషికం నేను తీసుకోను. పనిని బట్టే నా పారితోషికం. ఒక్కోసారి గ్లామర్కే పరిమితమయ్యే పాత్ర చేయాల్సి వస్తుంది. అవి చేసేటప్పుడు స్ట్రగుల్ ఉండదు. వాటికి కూడా కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తుంటాయి. అది నిజం కాదు. నేను అత్యాశకు పోను’’ అని కాజల్ చెప్పారు. ఆమె ఇంకా చెబుతూ ‘‘సౌకర్యవంతమైన సినిమాలే చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు. ఏదో పెద్ద సంస్థ సినిమా తీసేస్తోందనీ, పెద్ద హీరో నటిస్తున్నాడనీ సినిమాలకు సైన్ చేయను. ముందు చేసే సినిమా సౌకర్యంగా ఉండాలి. అప్పుడే ‘ఓకే’ చేస్తా’’ అని పేర్కొన్నారు కాజల్. సుధీర్ మిశ్రా సినిమా గురించి చెబుతూ -‘‘జీవితాన్ని సాఫీగా సాగిస్తున్న ఓ అమాయకురాలి జీవితంలోకి అనూహ్యమైన పరిణామాలు వచ్చి చేరతాయి. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో బాలీవుడ్ తెరపై కనిపించబోతున్నా. దర్శకుడు సుధీర్ మిశ్రా అద్భుతమైన ప్రతిభాశాలి. ఆయన ఈ కథ నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే... నటిగా నన్ను నేను నిరూపించుకునే అరుదైన అవకాశం ఇది. ఇందులోని నా పాత్రలో అంతర్లీనంగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి’’ అని తెలిపారు. -
గాలివార్తలు బాధాకరం: ప్రభాస్
* షర్మిలను కలిసిందీ, మాట్లాడిందే లేదు * నా ఆరోగ్యంపైనా ఇలాంటి వార్తలే సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలపై, తనపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషప్రచారాన్ని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ తీవ్రంగా ఖండించారు. ఆమెను తానెప్పుడూ కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ‘‘ప్రచారంలో ఉన్న గాలి వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో వీసమెత్తయినా నిజం లేదు’’ అని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను కూడా ప్రభాస్ ఖండించారు. ‘‘నా ఆరోగ్యం బాగా లేదని, తీవ్రంగా గాయపడ్డానని, కోమాలో ఉన్నానని... ఇలా అనేక మాసాలుగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ గాలివార్తలే’’ అని వివరించారు. ‘‘వాటిని చూసి శ్రేయోభిలాషుల నుంచి నా సన్నిహిత మిత్రులకూ, కుటుంబసభ్యులకూ బోలెడన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. మిగతా వారి సంగతెలా ఉన్నా వీటన్నిటితో నా కుటుంబం ఎంతో బాధకూ, ఆవేదనకూ గురైంది’’ అని వెల్లడించారు. ఆ బాధ నాకు తెలుసు! ‘‘మొదట్లో నా ఆరోగ్యం గురించి పుకార్లు వచ్చినప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఇలాంటి వదంతులను పట్టించుకోకుండా వదిలేయడమే మంచి పద్ధతని, వాటంతట అవే సమసిపోతాయని భావించాను. కానీ నాతో పాటు మరో వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగించేలా విషప్రచారం సాగుతున్నప్పుడు నేను వాటిని ఉపేక్షించకూడదు. అందుకే ఆ దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ప్రభాస్ వివరించారు. ‘‘పెళ్లి చేసుకుని, పిల్లలు కూడా ఉన్న అత్యంత గౌరవనీయురాలైన ఓ మహిళ గురించి ఇంత అమానవీయంగా, అగౌరవకరమైన రీతిలో, ఆమె గౌరవమర్యాదలను దెబ్బ తీసే రీతిలో పుకార్లను ప్రచారం చేయడం శోచనీయం. నాకు రాజకీయ ఆసక్తులేవీ లేవని మీ అందరికీ తెలుసు. ఈ ప్రచారం వ్యక్తిగతంగా హృదయాన్ని తీవ్రంగా బాధించడంతో ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ రకమైన నిరాధారమైన గాలి వార్తల వల్ల ఒక వ్యక్తి ఎంతటి బాధకు గురవుతారో, మానసిక క్షోభను అనుభవిస్తారో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ దుష్ర్పచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతుల వల్ల సంబంధిత వ్యక్తుల గౌరవమర్యాదలకు తీరని నష్టం వాటిల్లుతుంది గనుక ఈ పుకార్లను సృష్టించిన, వాటిని ప్రచారంలో పెట్టడానికి బాధ్యులైన వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ఈ యువ హీరో ప్రకటించారు. -
అవి పనికిమాలిన గాసిప్పులు!
తనను స్టార్ని చేసిన దక్షిణాది సినిమాను దాదాపుగా పక్కన పెట్టేసి.. పూర్తిగా బాలీవుడ్పైనే దృష్టి పెట్టేసింది గోవా భామ నా. ప్రస్తుతం ఆమె సైఫ్ అలీఖాన్కి జోడీగా ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రంలో నటిస్తోంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే... ఈ చిత్ర దర్శకుడు రాజ్ నిడుమోరు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఇలియానా చనువుగా తిరుగుతున్నారని బాలీవుడ్ టాక్. దీనిపై బాలీవుడ్కి సంబంధించిన కొన్ని పత్రికల్లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. వీటిపై ఇల్లూ బీబీ రుసరుసలాడిపోతున్నారట. ఇలాంటి పలికిమాలిన గాసిప్పుల గురించి మాట్లాడటం కూడా వృథా అని ఘాటుగా స్పందించారట.