hat trick
-
హ్యాట్రిక్తో మెరిసిన ఆస్ట్రేలియా బౌలర్
మహిళల ఐపీఎల్లో (WPL-2025) ఆస్ట్రేలియా బౌలర్, యూపీ వారియర్జ్ (UP Warriorz) ఆల్రౌండర్ గ్రేస్ హ్యారిస్ (Grace Harris) హ్యాట్రిక్తో (Hat Trick) మెరిసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఫిబ్రవరి 22) జరిగిన మ్యాచ్లో గ్రేస్ ఈ ఘనత సాధించింది. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా చివరి ఓవర్లో (20) గ్రేస్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ ఓవర్లో గ్రేస్ తొలి మూడు బంతులకు మూడు వికెట్లు తీసింది. తొలుత నికీ ప్రసాద్, ఆతర్వాత వరుసగా అరుంధతి రెడ్డి, మిన్నూ మణిలను ఔట్ చేసింది. హ్యాట్రిక్తో కలిసి గ్రేస్ ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టింది.డబ్ల్యూపీఎల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్గా గ్రేస్ రికార్డు సృష్టించింది. డబ్ల్యూపీఎల్ తొలి హ్యాట్రిక్ను లీగ్ ఆరంభ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ బౌలర్ ఇస్సీ వాంగ్ సాధించింది. యూపీ వారియర్జ్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఇస్సీ వాంగ్ ఈ ఘనత సాధించింది. అనంతరం 2024 ఎడిషన్లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్జ్ బౌలర్ దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. లీగ్లో నమోదైన మూడు హ్యాట్రిక్స్లో రెండు యూపీ బౌలర్లే సాధించడం విశేషం.ఇదిలా ఉంటే, గ్రేస్తో (2.3-0-15-4) పాటు క్రాంతి గౌడ్ (4-0-25-4) కూడా చెలరేగడంతో ముంబైపై యూపీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. చిన్నెల్ హెన్రీ సుడిగాలి అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. చిన్నెల్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఔటైంది. హాఫ్ సెంచరీ మార్కును 18 బంతుల్లో చేరుకున్న చిన్నెల్.. సోఫీ డంక్లీతో కలిసి లీగ్లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును షేర్ చేసుకుంది. యూపీ ఇన్నింగ్స్లో చిన్నెల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. తహ్లియా మెక్గ్రాత్ 24, కిరణ్ నవ్గిరే 17, దీప్తి శర్మ 13, శ్వేత సెహ్రావత్ 11, సోఫీ ఎక్లెస్టోన్ 12 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. మారిజన్ కాప్, అరుంధతి రెడ్డి తలో రెండు, శిఖా పాండే ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 178 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. జెమీమా రోడ్రిగెజ్ (56) అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఢిల్లీ ఇన్నింగ్స్లో జెమీమాతో పాటు షఫాలీ వర్మ (24), నికీ ప్రసాద్ (18), శిఖా పాండే (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుత ఎడిషన్లో యూపీకి ఇది తొలి విజయం. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట ఓడింది. మూడు మ్యాచ్ల్లో తలో రెండు గెలిచిన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ టేబుల్ టాపర్లుగా ఉన్నాయి. -
NZ Vs SL: తీక్షణ హ్యాట్రిక్ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు.తీక్షణ హ్యాట్రిక్ఈ మ్యాచ్లో లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 35 ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్ను నమోదు చేశాడు. మిచెల్ సాంట్నర్ను తొలుత ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 8 ఓవర్లు వేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణతో పాటు హసరంగ (2), ఎషాన్ మలింగ (1), అశిత ఫెర్నాండో (1) వికెట్లు తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను కమిందు మెండిస్ (64), జనిత్ లియనాగే (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. లియనాగే 16వ ఓవర్ ఆఖరి బంతికి ఔట్ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. చమిందు విక్రమసింఘే (17) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంక 1, అవిష్క ఫెర్నాండో 10, కుసాల్ మెండిస్ 2, అసలంక 4, హసరంగ 1, తీక్షణ 6, మలింగ 4 పరుగులు చేసి ఔటయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ కీలకమైన కమిందు మెండిస్ వికెట్ పడగొట్టడంతో పాటు ఇద్దరు చివరి వరుస ఆటగాళ్లను పెవిలియన్కు పంపాడు. జేకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే జనవరి 11న ఆక్లాండ్లో జరుగనుంది. -
అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. డబుల్ హ్యాట్రిక్
అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ సబ్ రీజియనల్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా కేమెన్ ఐలాండ్స్తో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా పేస్ బౌలర్ హెర్నన్ ఫెన్నెల్ ఈ ఫీట్ సాధించాడు. ఫెన్నెల్.. కేమెన్ ఐలాండ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరో బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఫెన్నెల్కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.కేమెన్ ఐలాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఐఫిల్, రొనాల్డ్ ఈబ్యాంక్స్, అలెస్సాండ్రో మోరిస్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ బాధితులు.అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫెన్నెల్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్లు నమోదు చేసిన ఆరో బౌలర్గానూ రికార్డుల్లోకెక్కాడు.ఫెన్నెల్కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్,ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిక్న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీశ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్లు నమోదు చేశారు. -
హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన వన్డే మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డీన్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో మహిళా క్రికెటర్గా డీన్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా (పురుషుల క్రికెట్తో పాటు) ఈ ఘనత సాధించిన ఏడో ఇంగ్లండ్ బౌలర్గా రికార్డు నెలకొల్పింది.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డీన్ ఇన్నింగ్స్ 17, 19 ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి మారిజన్ కాప్ వికెట్ తీసిన డీన్.. ఆతర్వాత 19వ ఓవర్ మొదటి రెండు బంతులకు నదినే డి క్లెర్క్, సినాలో జఫ్టా వికెట్లు తీసింది.ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు..కరోల్ హాడ్జస్ 1993లో డెన్మార్క్ మహిళల జట్టుపైక్లేర్ కాన్నర్ 1999లో భారత మహిళా జట్టుపైజేమ్స్ అండర్సన్ 2003లో పాకిస్తాన్ పురుషుల జట్టుపైస్టీవ్ హార్మిసన్ 2004లో భారత పురుషుల జట్టుపైఆండ్రూ ఫ్లింటాఫ్ 2009లో వెస్టిండీస్ పురుషుల జట్టుపైస్టీవెన్ ఫిన్ 2015లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుపైచార్లీ డీన్ 2024లో సౌతాఫ్రికా మహిళల జట్టుపైమ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. చార్లీ డీన్ (4/45), సోఫీ ఎక్లెస్టోన్ (3/27), లారెన్ ఫైలర్ (3/32) రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో క్లో టైరాన్ (45), లారా వోల్వార్డ్ట్ (35), డెర్క్సన్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామీ బేమౌంట్ (34), బౌచియర్ (33), డేనియల్ హాడ్జ్ (25 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్ (20) ఇంగ్లండ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్సన్ 2, డి క్లెర్క్, మారిజన్ కాప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది. -
ఒకే రోజు రెండు హ్యాట్రిక్లు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఒకే రోజు రెండు హ్యాట్రిక్లు నమోదయ్యాయి. ఇవాళ (నవంబర్ 5) జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో ఉత్తర్ ప్రదేశ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. భువీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. ఈ మ్యాచ్లో భువీతో పాటు మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో జార్ఖండ్పై యూపీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.రెండో హ్యాట్రిక్ విషయానికొస్తే.. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో ఫెలిక్స్ మొత్తంగా 5 వికెట్లు తీశాడు. ఫెలిక్స్తో పాటు మోహిత్ రేడ్కర్ (4/18) కూడా చెలరేగడంతో నాగాలాండ్పై గోవా 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా.. దర్శన్ మిసాల్ (91), సూయాశ్ ప్రభుదేశాయ్ (69) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్ నిర్ణీత ఓవర్లలో 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాగాలాండ్ ఇన్నింగ్స్లో చేతన్ బిస్త్ (63) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్లో భువీ ఈ ఫీట్ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్ను సన్రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
శ్రీలంకతో రెండో టీ20.. హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ బౌలర్
డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో శ్రీలంక తొలి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
హ్యాట్రిక్ తీసిన బౌలర్నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్ప్రీత్ను కెప్టెన్గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్జోత్ కౌర్, అమన్దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియా బౌలర్
ఆస్ట్రేలియాలో జరిగే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో హ్యాట్రిక్ నమోదైంది. టస్మానియాతో జరిగిన మ్యాచ్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీ కౌచ్ హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. కౌచ్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో టస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా తొలి ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్ జువెల్ (61), మిచెల్ ఓవెన్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో జోయెల్ పారిస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో కార్ట్రైట్ భారీ సెంచరీతో (153) సత్తా చాటగా.. సామ్ ఫాన్నింగ్ (68), గుడ్విన్ (94), ఆస్టన్ అగర్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టస్మానియా బౌలర్లలో కున్హేమన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.143 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టస్మానియా.. బ్రాడీ కౌచ్ (14-8-15-3), అస్టన్ అగర్ (17.5-11-12-3), జోయెల్ పారిస్ (15-9-18-2), కెమరూన్ గ్యానన్ (16-6-25-2) దెబ్బకు 98 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టస్మానియా సెకెండ్ ఇన్నింగ్స్లో బ్రాడ్లీ హోప్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు.HAT-TRICK! LBW, bowled, bowled - well done Brody Couch! #SheffieldShield pic.twitter.com/B1CjUWmO6l— cricket.com.au (@cricketcomau) November 4, 2024హ్యాట్రిక్ వికెట్లు తీసిన బ్రాడీ కౌచ్ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రాడీ కౌచ్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీనే. మ్యాచ్ చివరి రోజు (నవంబర్ 4) టీ విరామం తర్వాత బ్రాడీ వరుసగా జేక్ డోరన్, లారెన్స్ నీల్ స్మిత్, కీరన్ ఇలియట్ వికెట్లు పడగొట్టాడు. టస్మానియా స్కోర్ 89 పరుగుల వద్ద నుండగా బ్రాడీ ఈ ఘనత సాధించాడు. -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీ20 వరల్డ్కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదు
టీ20 వరల్డ్కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కమిన్స్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024బంగ్లాదేశ్తో మ్యాచ్లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
హ్యాట్రిక్తో విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్
ఇంగ్లండ్లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్లో కెంట్ బౌలర్, ఇంగ్లండ్ లెగ్ స్పిన్ బౌలర్ మాథ్యూ పార్కిన్సన్ అదిరిపోయే హ్యాట్రిక్ సాధించాడు. మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్లో అతను 4 ఓవర్లలో హ్యాట్రిక్తో కలుపుకుని 4 వికెట్లు పడగొట్టాడు. పార్కిన్సన్ ధాటికి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న మిడిల్సెక్స్ 107 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కెంట్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. జో డెన్లీ (56), బెల్ డ్రమ్మండ్ (38) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.హాల్మెన్ (3/27), బ్లేక్ కల్లెన్ (3/47), టామ్ హెల్మ్ (2/37) బంతితో రాణించారు.A hat-trick for Matt Parkinson! 🤩 pic.twitter.com/RoIcNZgH9X— Vitality Blast (@VitalityBlast) May 31, 2024అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిడిల్సెక్స్ పార్కిన్సన్, మార్కస్ (2/28), గ్రాంట్ స్టివార్ట్ (2/22), స్వేన్పోయెల్ (1/11), బార్లెట్ (1/16) ధాటికి 14.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్లో హాల్మెన్, ఎస్కినాజీ, జాక్ డేవిస్ తలో 23 పరుగులు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా. టీ20 బ్లాస్ట్ టోర్నీ మే 30వ తేదీ నుంచి మొదలయ్యింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ మరో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 5 వన్డేలు, 6 టీ20లు ఆడిన మాట్ పార్కిన్సన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 12 మ్యాచ్ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసిన పార్కిన్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60 మ్యాచ్ల్లో 191 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ పార్కిన్సన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను 37 మ్యాచ్లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు దేశీయంగా జరిగే పలు టీ20 టోర్నీల్లో పాల్గొనే పార్కిన్సన్.. ఇప్పటివరకు 104 మ్యాచ్లు ఆడి 143 వికెట్లు పడగొట్టాడు. -
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
మోదీ హయాంలోనే సురక్షితం
మొయినాబాద్ రూరల్: దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధిస్తారని, జూన్ 8 లేదా 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మోదీ హయాంలోనే దేశం సురక్షితంగా ఉందన్న ఆయన దేశంలో పదేళ్ల క్రితం నాటి, ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు జరిగేవని గుర్తుచేశారు. గతంలో కీలుబొమ్మలాంటి ప్రధాని ఉండేవారని.. మోదీ రాకతో దేశానికి బలమైన లీడర్ లభించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్నగర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ కన్వినర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటనే మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. పదేళ్ల క్రితం అనేక వస్తువులను మనం దిగుమతి చేసుకునే వారమని, ప్రస్తుతం మనమే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం జరిగి రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు చేస్తామని చెప్పిన మోదీ చేసి చూపించారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆయనతోనే సాధ్యమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగమే వస్తుందని విమర్శించారు. రుణమాఫీకి రేవంత్ డబ్బులెక్కడి నుంచి తెస్తారో? డిసెంబర్లో రుణమాఫీ చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి అందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఉచితంగా బస్సుల్లో తిప్పితే అన్నీ ఇచ్చినట్లు అనుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యరి్థ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాశ్, సనివెళ్లి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆయా నియోజకవర్గాల బూత్ లెవల్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
హ్యాట్రిక్తో చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్.. కెరీర్లో రెండోది
మహిళల క్రికెట్లో ఇవాళ (ఏప్రిల్ 2) బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ ఆడుతున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్ ఫరిహా త్రిస్న హ్యాట్రిక్తో చెలరేగింది. త్రిస్నకు టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. 2022లో త్రిస్న తన టీ20లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టింది. త్రిస్న దెబ్బకు నేటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులకు త్రిస్న.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్, బెత్ మూనీలను ఔట్ చేసింది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన త్రిస్న.. 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. HAT-TRICK for Fariha Trisna in T20i against Australia women#BCB #Cricket #BANWvAUSW #LiveCrcket #HomeSeries #T20Iseries #womenscricket pic.twitter.com/I00NUVXNg3 — Bangladesh Cricket (@BCBtigers) April 2, 2024 బంగ్లా బౌలర్లలో త్రిస్నతో పాటు నహీద అక్తర్ (4-0-21-2), ఫహీమా ఖాతూన్ (4-0-34-2) కూడా వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వేర్హమ్ (57), గ్రేస్ హ్యరీస్ (47) మాత్రమే రాణించారు. ఆఖర్లో పెర్రీ (29) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. తహిల మెక్గ్రాత్ (19) రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమతమయ్యారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 9.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్, మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ను కష్టాల్లోకి నెట్టారు. ముర్షిదా ఖాతూన్ (8), శోభన మోస్తరీ (5), నిగార్ సుల్తాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దిలారా అక్తర్ (27), ఫహీమా ఖాతూన్ (3) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 65 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సిరీస్లో ఆసీస్ తొలి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ముంబై ‘మూడు’పోయింది
ముంబై ఇన్నింగ్స్... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్... ముంబై ఇన్నింగ్స్ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్ రాయల్స్ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది. అభిమానులు...అదే తీరు! హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లో రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్ రోహిత్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు! ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/22) పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. టపటపా... రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ (0) తొలి బంతికే అవుట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ధీర్ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్ సబ్గా వచ్చిన బ్రెవిస్ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (16) వికెట్ బర్గర్ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్లను అవుట్ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్ డేవిడ్ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రాణించిన పరాగ్... లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్ ఇన్నింగ్స్ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్ (12), బట్లర్ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్ (16)తో కలిసి అతను ఐదో వికెట్కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 16; రోహిత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; నమన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; బ్రెవిస్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 0; తిలక్ (సి) అశ్విన్ (బి) చహల్ 32; పాండ్యా (సి) (సబ్) పావెల్ (బి) చహల్ 34; చావ్లా (సి) హెట్మైర్ (బి) అవేశ్ 3; డేవిడ్ (సి) బౌల్ట్ (బి) బర్గర్ 17; కొయెట్జీ (సి) హెట్మైర్ (బి) చహల్ 4; బుమ్రా (నాటౌట్) 8; ఆకాశ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–3, బర్గర్ 4–0–32–2, అవేశ్ ఖాన్ 4–0–30–1, చహల్ 4–0–11–3, అశ్విన్ 4–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డేవిడ్ (బి) మఫాకా 10; బట్లర్ (సి) చావ్లా (బి) ఆకాశ్ 13; సామ్సన్ (బి) ఆకాశ్ 12; పరాగ్ (నాటౌట్) 54; అశ్విన్ (సి) తిలక్ (బి) ఆకాశ్ 16; శుభమ్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్ చావ్లా 3–0–18–0. -
ఈసారి కొడితే హ్యాట్రిక్..!
గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ లోక్సభ నియోజకవర్గంలో హ్యాట్రిక్పై బీజేపీ కన్నేసింది. జీబీ నగర్లోని నోయిడా, జేవార్, దాద్రీ, బులంద్షహర్లోని సికింద్రాబాద్, ఖుర్జాలతో కూడిన మొత్తం ఐదు సెగ్మెంట్లలో గౌతమ్ బుద్ధ్ నగర్ నియోజకవర్గంలో 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నకల్లోనూ అవే ఫలితాలను అంచనా వేస్తోంది. ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవే బీజేపీ బలాలు తమ ప్రభుత్వం చేపట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, దాద్రీ, బోడకిలో రవాణా సౌకర్యాలు, రైలు, మెట్రో విస్తరణ కారిడార్లు, సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక కేంద్రాలతో పాటు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన డాక్టర్ మహేష్ శర్మపై బీజేపీ విశ్వాసంతో ఉంది. గౌతమ్ బుద్ధ నగర్ రాజకీయ చరిత్రలో డాక్టర్ మహేష్ శర్మ విజయ పరంపర దశాబ్దం క్రితమే మొదలైంది. 2014 ఎన్నికలలో డాక్టర్ శర్మ 5,99,702 ఓట్లు, 50 శాతం ఓట్లతో మొదటిసారి విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నరేంద్ర భాటిని 2,80,212 ఓట్ల తేడాతో ఓడించారు. తరువాత, 2019 ఎన్నికలలో 8,30,812 ఓట్లు, 59.64 శాతం ఓట్లతో మరోసారి గెలుపొందారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నోయిడా పేరుతో ప్రసిద్ధి చెందిన గౌతమ్ బుద్ధ్ నగర్ లోక్సభ స్థానానికి రెండో దశలో ఉత్తరప్రదేశ్లోని ఇతర నియోజకవర్గాలతో పాటు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్లో 2,302,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,268,324 మంది పురుషులు, 1,034,503 మంది మహిళలు కాగా 133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు. ఇక నియోజకవర్గంలో 3,297 పోస్టల్ ఓట్లు, 5,482 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. -
General Elections 2024: వెయ్యేళ్ల అభివృద్ధికి పునాది
న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల శంఖారావం చేశారు. ఈసారి కూడా ఘనవిజయం సాధించి ఖాయంగా హ్యాట్రిక్ కొడతామన్నారు. ‘‘సాధారణంగా నేను అంకెల జోలికి వెళ్లను. కానీ ఈసారి మాత్రం దేశం మనోగతాన్ని స్పష్టంగా అంచనా వేయగలను. ఎన్డీఏ కూటమికి ఏకంగా 400 పైచిలుకు స్థానాలొస్తాయి’’ అని జోస్యం చెప్పారు. బీజేపీ ఒంటరిగానే కనీసం 370 స్థానాలు సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నాం. వచ్చాక చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. మూడో టర్మ్లో వెయ్యేళ్ల ప్రగతికి పటిష్ట పునాదులు వేస్తాం’’ అని ప్రకటించారు. విపక్షాలన్నీ అప్పుడే కాడి కింద పడేశాయంటూ ఎద్దేవా చేశారు. ‘‘కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వాటికి ధైర్యం చాలడం లేదు. తమకు మరిన్ని సీట్లు తగ్గి మరోసారి విపక్ష పాత్ర ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాయి’’ అన్నారు. కాంగ్రెస్ దుకాణం త్వరలో మూతపడుతుందని, దశాబ్దాల పాటు విపక్ష స్థానానికే పరిమితమవుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. భారతీయుల సామర్థ్యంపై నెహ్రూకు, ఇందిరాగాం«దీకి ఎన్నడూ నమ్మకమే లేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన కూడా అదే ఆత్మవిశ్వాస రాహిత్య ధోరణిలో సాగిందని విమర్శించారు. పదేళ్ల పాలనలో తాము సాధించిన ఘనతలను సాధించాలంటే కాంగ్రెస్కు కనీసం 100 ఏళ్లయినా పట్టి ఉండేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సోమ వారం లోక్సభలో బదులిస్తూ ప్రధాని పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ‘‘మహా అయితే 100 నుంచి 125 రోజులు! మేం వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ (ఈసారి)’ అంటూ మోదీ పదేపదే నినదించగా, ‘400 పార్ (400 స్థానాలు దాటేస్తాం)’ అంటూ బీజేపీ సభ్యులంతా ప్రతిసారీ ముక్త కంఠంతో గొంతు కలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ మాటే అంటున్నారని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోదీ చెప్పారు. తమ ప్రభుత్వ ఘనతలను వివరిస్తూ, విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ను, గాంధీ కుటుంబాన్ని ప్రధాని తూర్పారబట్టారు. వాటిపై విపక్షాల అభ్యంతరాలను, సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. శతాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో మళ్లీ కొలువుదీరిన రాముడు దేశ ప్రగతి పయనానికి నూతన జవసత్వాలు అందిస్తాడన్నారు. కూటమి సారథిగానూ కాంగ్రెస్ విఫలం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిర్మాణాత్మక సలహాలిచ్చే అవకాశాన్ని విపక్షాలు చేజార్చుకున్నాయని మోదీ అన్నారు. ‘‘దాంతో వారిపై దేశ ప్రజలకు పూర్తిగా భ్రమలు తొలగాయి. విపక్షాలు తాము సుదీర్ఘకాలం పాటు విపక్షాలుగానే ఉంటామంటూ తీర్మానించుకున్నాయి. వారు మాట్లాడుతున్న ప్రతి మాటా అందుకు అద్దం పడుతోంది. వాటి నిర్ణయాన్ని అభినందిస్తున్నా’’ అంటూ చెణుకులు విసిరారు. ఓటమి భయంతో చాలామంది విపక్ష నేతలు ఇప్పటికే స్థానాలు మారుతున్నారని, రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లోనూ పడ్డారని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘విపక్షాలన్నీ కిందా మీదా పడి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి విచి్చన్నమైంది. ఇప్పుడా పారీ్టలన్నీ ఎక్ల చలో (ఒంటరిగా పోతాం) అంటున్నాయి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఉద్దేశించి బెంగాలీలో చమత్కరించారు. దేశంలో విపక్షాల ఈ దీన స్థితికి కాంగ్రెసే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. తద్వారా కాంగ్రెస్ ఒక పారీ్టగానే గాక కూటమి సారథిగా కూడా విఫలమైందని చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘కుటుంబ పాలనతో కాంగ్రెస్ ముందే పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించడంలోనూ గత పదేళ్లుగా పదేపదే విఫలమైంది. తద్వారా ప్రజల నమ్మకం చూరగొనే సువర్ణావకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడిక దశాబ్దాల పాటు విపక్షంలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది! ప్రజలు కూడా ఆ పార్టీని అక్కడే ఉంచడం ద్వారా ఆశీర్వదిస్తారు! అక్కడి నుంచి కాంగ్రెస్ మరిన్ని ఎత్తులకు చేరి త్వరలో లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీల్లో దర్శనమిస్తుంది’’ అంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒకే ప్రోడక్టును పదేపదే లాంచ్ చేస్తోందని రాహుల్ను, ఆయన చేపట్టిన భారత్ జోడో, న్యాయ్ యాత్రలను ఉద్దేశించి మోదీ అన్నారు. ‘‘ఇది ఎన్నికల వేళ. కాస్త కష్టపడి ఏదన్నా కొత్తగా ప్రయతి్నంచాల్సింది. జనాలకు కొత్త సందేశమేదన్నా ఇవ్వాల్సింది. కానీ ఈ విషయంలోనూ కా>ంగ్రెస్ ఘోరంగా విఫలమైంది’’ అంటూ తూర్పారబట్టారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ దుకాణం బహుశా అతి త్వరలో మూతబడవచ్చని జోస్యం చెప్పారు. ‘‘దాంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి కాంగ్రెస్ దిగజారింది. రద్దు సంస్కృతిని అలవర్చుకుంది. కేవలం నాపై అక్కసుతో దేశం సాధించిన, సాధిస్తున్న ప్రతి ఘనతనూ రద్దు చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశానికి కావాల్సింది ఆరోగ్యకరమైన విపక్షం. కానీ రాహుల్కు ఎక్కడ పోటీ వస్తారోనని కాంగ్రెస్లోని యువ నేతల గళాలను నాయకత్వమే అణచేస్తోంది. దానిది రాచకుటుంబాన్ని దాటి చూడలేనితనం’’ అంటూ దుయ్యబట్టారు. అవినీతికి విపక్షాల అండ! బీజేపీ సర్కారుపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతికి, అందుకు పాల్పడుతున్న నేతలకు విపక్షాలే అడుగడుగునా కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అవినీతి నేతలను కీర్తిస్తూ దేశానికి అవి ఏం సందేశమిస్తున్నాయని ప్రశ్నించారు. పైగా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నందుకు తనపై, తన ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయని ఆక్షేపించారు. ‘‘నన్నెంత విమర్శించినా అవినీతిపై, అవినీతి నేతలపై కఠిన చర్యలు ఆగబోవు. దోచిందంతా కక్కాల్సిందే. దేశాన్ని దోచుకుంటున్న వారు మూల్యం చెల్లించాల్సిందే. పవిత్ర సభ సాక్షిగా దేశానికి నా వాగ్దానమిది’’ అన్నారు. దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను లక్ష్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘కాంగ్రెస్ హయాంలో అలాగే జరిగింది. అప్పట్లో దేశంలో ఎటు చూసినా అవినీతి తాండవమాడేది. పార్లమెంటులో చర్చంతా అవినీతి చుట్టే సాగేది. మా పాలనలో మాత్రం దర్యాప్తు రాజ్యాంగ నిర్దేశం మేరకు స్వతంత్రంగా పని చేస్తున్నాయి. వాటి పనితీరుపై తీర్పు చెప్పాల్సింది కోర్టులు మాత్రమే’’ అని చెప్పారు.కాంగ్రెష్ పాలనలో ఈడీ కేవలం రూ.5,000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయగా తమ హయాంలో అది ఏకంగా రూ.లక్ష కోట్లు దాటిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు అన్యాయం కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారు ఓబీసీలకు తీరని అన్యాయం చేశాయని, ఓబీసీ నేతలను ఘోరంగా అవమానించాయని మోదీ దుయ్యబట్టారు. ఎన్డీఏ సర్కారులో ఓబీసీల లెక్కలు తీసిన కాంగ్రెస్ నేతలు అతి పెద్ద ఓబీసీనైన తనను మాత్రం మర్చిపోయారన్నారు. వెనకబడ్డ వర్గాలకు చెందిన దివంగత బిహార్ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చి తాము గౌరవించుకున్నామన్నారు. ‘‘1970లో బిహార్లో ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచి సీఎం పదవి నుంచి దింపేందుకు ప్రయతి్నంచిన చరిత్ర కాంగ్రెస్ది. ఆయనను కనీసం విపక్షనేతగా కూడా ఓర్వలేకపోయింది’’ అంటూ మండిపడ్డారు. యూపీఏ హయాంలో తెరపైకి తెచి్చన జాతీయ సలహా మండలిని రాజ్యంగేతర శక్తిగా మోదీ అభివర్ణించారు. అందులో ఓబీసీలు ఎందరున్నారో చెప్పాలన్నారు. దేశ సామర్థ్యంపై నెహ్రూకు నమ్మకం లేదు భారతీయులు దద్దమ్మలు, బద్ధకస్తులని భావించేవారు ఇందిరది కూడా ఫక్తు అదే ధోరణి: మోదీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై మోదీ తన ప్రసంగంలో సునిశిత విమర్శలు చేశారు. దేశం చిరకాలం పాటు ఎదర్కొన్న ఇక్కట్లకు, కశీ్మరీల సమస్యలకు ఆయన ఘోర తప్పిదాలే మూల కారణమని ఆరోపించారు. ‘‘భారతీయుల శక్తి సామర్థ్యాలపై నెహ్రూకు ఎన్నడూ నమ్మకమే లేదు. వాళ్లు బద్ధకస్తులని, తెలివితక్కువ వాళ్లని భావించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇదే విషయాన్ని నెహ్రూ స్పష్టంగా పేర్కొన్నారు. యూరోపియన్లు, జపానీయులు, చైనీయులు, రష్యన్లు, అమెరికన్ల మాదరిగా భారతీయులకు కష్టపడే స్వభావం లేదన్నారు. మనలను న్యూనతపరిచేందుకు వాళ్లను పొగిడారు. నెహ్రూ కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీది కూడా అదే ధోరణి. ఏదన్నా మంచి పని పూర్తయ్యే దశలో బద్దకించడం భారతీయులకు అలవాటని, అడ్డంకి ఎదురవుతూనే ఆశలొదిలేసుకుంటామని, కొన్నిసార్లు మొత్తం దేశమే ఓటమిని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుందని తక్కువ చేసి మాట్లాడారామె. భారతీయుల పట్ల ఆ రాచకుటుంబం భావన ఇదీ! తమను పాలకులుగా భావించుకుంటూ నిత్యం ప్రజలను కించపరిచిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ, ఇందిరల ఈ భావజాలమే కాంగ్రెస్కూ పాకింది. గాంధీ కుటుంబం చేతిలో బందీగా మారిన ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలను, విజయాలను ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించజాలదు కూడా. భారతీయుల శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ఇందిర ఘోరంగా విఫలమయ్యారు గానీ నేటి కాంగ్రెస్ నేతలను మాత్రం అప్పట్లోనే ఆమె సరిగ్గా అంచనా వేశారనిపిస్తుంది! ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు వారికి అతికినట్టుగా సరిపోతాయి’’ అని మోదీ అన్నారు. భారత్, భారతీయుల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన విశ్వాసముందని చెప్పారు. ప్రధానిగా తన మూడో టర్ములో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది తన హామీ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉండగా పెద్దగా ఆలోచించేందుకు కూడా జంకిందని ఎద్దేవా చేశారు. దాని తీరు చూస్తే జాలేస్తోందన్నారు. ‘‘కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు చేసిన తప్పులన్నింటినీ మా తొలి టర్ములో సరిదిద్దుతూ వచ్చాం. రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం. రెండో టర్ములో నూతన భారతానికి పటిష్టమైన పునాదులు వేశాం. ఇక మూడో టర్ములో వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా సాగుతాం’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారు. జీఎస్టీ, డిజిటైజేషన్, పెండింగ్ పథకాల పూర్తి వంటి పలు ఘనతలు తమ సొంతమన్నారు. తమ కృషి వల్ల భారత్ నేడు అంతర్జాతీయంగా ఇన్నొవేషన్లకు, పరిశోధనలకు, తయారీ రంగానికి కేంద్రంగా రూపుదిద్దుకుందన్నారు. స్వచ్ఛ ఇంధనం, సెమీ కండక్టర్ల వంటి పలు రంగాల్లో స్వావలంబన సాధించాల్సి ఉందని చెప్పారు. -
హ్యాట్రిక్పై బీజేపీ గురి...!
వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్లో అకాలీదళ్, బిహార్లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్బరేలీ, మెయిన్పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్బరేలీ, మెయిన్పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్లో అమృత్సర్, ఆనంద్పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్పూర్ తదితర లోక్సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక, కుకునూర్పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్గా మారిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్ అని, సింగిల్ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు! పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు. తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. -
హిస్టరీ మారుతుందా?...హ్యాట్రిక్ కొడుతుందా?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు టర్మ్ల తర్వాత పాలన మార్పు ఒరవడి ఈసారి బ్రేక్ అవుతుందా..? లేక కొనసాగుతుందా..? అనే చర్చకు తావిస్తున్నాయి. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్లు రెండుసార్లు వరుస విజయాలు సాధించాయి. కానీ మూడోసారి అధికారం చేపట్టడంలో విఫలమయ్యాయి. అయితే మధ్యలో 1989లో ఒకసారి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ 1994లో మాత్రం రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కాగా 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్, టీడీపీలకే అధికారం చేజిక్కుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) రెండోసారీ (2018లో) అధికారంలోకి వచ్చింది. తాజాగా 2023 నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఒరవడికి భిన్నంగా వరుసగా మూడో విజయాన్ని బీఆర్ఎస్ నమోదు చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మూడు ప్రధాన పార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అన్ని ఎన్నికల్లోనూ స్పష్టమైన మెజారిటీ..! గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. ఎక్కడా అసందిగ్ధతకు తావివ్వలేదు. అయితే ఈసారి ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు తమ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ హంగ్ ఏర్పడుతుందని, అయినా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పడం చర్చనీయాంశమయ్యింది. అయితే తర్వాత ఆ పార్టీ తమ నేత అలా మాట్లాడలేదంటూ హంగ్ను కొట్టిపారేసింది. తమ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. ఇక మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా హంగ్ను కొట్టిపారేయడం గమనార్హం. బీఆర్ఎస్ నేతల్లో ధీమా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు పూర్తి దీమాతో ఉన్నారు. గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని కేటీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారడం తప్పకుండా సానుకూల ఫలితాన్నిస్తుందని చెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారిందని, బెంగళూరును వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరిస్తున్నారు. కేసీఆర్ కూడా తరచూ తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలోనూ దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ అని.. సాగు, తాగునీటి రంగాలే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగిందనడానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనం అని నొక్కి చెబుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయనేది అధికార పక్షం వాదన. ఢీ అంటే ఢీ అంటున్న మూడు పార్టీలు గడిచిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాన పోటీదారుగా ఉండటంతో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఢంకా బజాయిస్తున్నాయి. సాధారణ ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి, ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ మూడోసారి అధికార పీఠాన్ని అధిష్టించే అవకాశమే లేదని, తాము గెలుపొందడం ఖాయమనే భావనలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. విజయ సాధన దిశగా ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలపై అపార నమ్మకం.. అదే సమయంలో తెలంగాణ ఇచ్చి న పార్టీగా, ఆరు గ్యారంటీలతో ఈసారి తాము తప్పనిసరిగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అవినీతి, కుటుంబ పాలనతో పాటు నిరుద్యోగులను మోసం చేసిందని ప్రధానంగా ఆరోపిస్తోంది. ప్రభుత్వ భూముల విక్రయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అనుయాయులకే ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నదని విమర్శిస్తోంది. రాష్ట్రాన్ని పాలించే అర్హత బీఆర్ఎస్కు లేదని తేల్చి చెబుతోంది. డబుల్ ఇంజన్ నినాదం రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ అధి కారంలో ఉంటే అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ చెబుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి తొమ్మిదేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోంది. బీసీ నినాదం ఎత్తుకోవడంతో పాటు బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇవ్వడం ద్వారా వారికి చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. ఉచితాల జోలికి వెళ్లకుండా అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టి విజయం సాధించాలనే ఆలోచనలో ఉంది. -
ఈసారి సెంచరీ కొడతాం
ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ ఇప్పటికే సర్వసన్నద్ధమైంది. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది. బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి. పదేళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని.. బీఆర్ఎస్ ఘన విజ యం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఆయన ‘ఎక్స్ (ట్విట్టర్)’లో స్పందించారు. ‘‘ప్రజలు రెండు సార్లు నిండు మనసుతో ఆశీర్వదించారు. డిసెంబర్ మూడున జరిగే ఓట్ల లెక్కింపులో ముచ్చటగా మూడోసారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. దక్షత గల నాయకత్వానికే మరోసారి ప్రజలు పట్టం కట్టడం ద్వారా దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. పదేళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. ప్రజల అండతో బీఆర్ఎస్కు విజయం.. ప్రతీప శక్తులకు పరాభవం తప్పదు. మా టీమ్ కెప్టెన్ కేసీఆర్ కాబట్టి హ్యాట్రిక్ విజయం సాధిస్తాం. మంచి చేసే బీఆర్ఎస్కు ప్రజలు మద్దతు పలికి.. ముంచే పార్టీలపై వేటు వేస్తారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ జెండా ఎగురుతుంది. తెలంగాణలో గాంధీ సిద్ధాంతమే తప్ప గాడ్సే రాద్ధాంతం నడవదు. ఉద్యమ చైతన్యం 2014 అసెంబ్లీ ఎన్నికలను నడిపిస్తే.. సంక్షేమ సంబురం 2018లో బీఆర్ఎస్ను రెండోమారు గెలిపించింది. తెలంగాణ సాధించిన పదేళ్ల ప్రగతి ప్రస్థానమే 2023 ఎన్నికలో మా విజయాన్ని శాసిస్తుంది. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ ఇప్పటికే సర్వసన్నద్ధమవగా.. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది, బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతుంది. ముమ్మాటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తాం..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
హ్యాట్రిక్ అర్థసెంచరీలు.. ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు
వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో గిల్ను ఒక ఎండ్లో నిల్చోబెట్టి వేగంగా ఆడిన ఇషాన్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కారియా బౌలింగ్లో స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. ద్వైపాక్షిక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో హ్యాట్రిక్ అర్థసెంచరీలు బాదిన ఆరో టీమిండియా క్రికెటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ కంటే ముందు క్రిష్ణమాచారి శ్రీకాంత్ వర్సెస్ శ్రీలంక(1982), దిలీప్ వెంగ్సర్కార్ వర్సెస్ శ్రీలంక(1985), మహ్మద్ అజారుద్దీన్ వర్సెస్ శ్రీలంక(1993), ఎంఎస్ ధోని వర్సెస్ ఆస్ట్రేలియా(2019), శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ న్యూజిలాండ్(2020) ఉన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గిల్ 61, సంజూ శాంసన్ 18 పరుగులతో ఆడుతున్నారు. क्या किशन का यह फ़ॉर्म उन्हें विश्व कप की भारतीय प्लेइंग-XI में शामिल करवा पाएगा?#WIvIND #ishankishan pic.twitter.com/VmrLVqKrR5 — ESPNcricinfo हिंदी (@CricinfoHindi) August 1, 2023 చదవండి: WTC 2023-25: చివరి టెస్టులో విజయం.. ఆసీస్తో సమానంగా ఇంగ్లండ్ -
హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్తో తలపడుతుంది. -
ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్లో తొలి హ్యాట్రిక్
మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ముంబై ఇండియన్స్ వుమెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం యూపీ వారియర్జ్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఇంగ్లండ్ బౌలర్ ఇసీ వాంగ్ ఈ ఫీట్ను సాధించింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్ దెబ్బతీసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో నవ్గిరే, సిమ్రన్ షేక్, సోఫీ ఎకెల్స్టోన్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ దెబ్బతో యూపీ వారియర్జ్ ఓటమి ఖరారైపోయింది. ఇక డబ్ల్యూపీఎల్లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా.. ఐపీఎల్లో మాత్రం ఇప్పటివరకు 21సార్లు హ్యాట్రిక్లు నమోదయ్యాయి. ఇక 2008 తొలి సీజన్లో సీఎస్కే బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అత్యధికంగా అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ తీయగా.. యువరాజ్ సింగ్ రెండుసార్లు హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. Historic moment in WPL, Take a bow Issy Wong. pic.twitter.com/eIHNFEioSk — Johns. (@CricCrazyJohns) March 24, 2023 చదవండి: పాక్కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్ -
జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్.. ఉత్కంఠ సమరంలో పరుగు తేడాతో విజయం
స్వదేశంలో నెదర్లాండ్స్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను జింబాబ్వే 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో పర్యాటక నెదర్లాండ్స్.. తమ కంటే మెరుగైన జింబాబ్వేపై సంచలన విజయం సాధించగా, ఇవాళ (మార్చి 23) జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే.. పసికూన నెదర్లాండ్స్ను చిత్తు చేసి తొలి మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో జింబాబ్వే పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ గెలుపు దిశగా సాగుతున్న నెదర్లాండ్స్ను జింబాబ్వే స్పిన్ ఆల్రౌండర్ వెస్లీ మదెవెరె హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి కట్టడి చేశాడు. నెదర్లాండ్స్ గెలుపు దిశగా సాగుతుండగా (272 పరుగుల లక్ష్య ఛేదనలో 42 బంతుల్లో 59 పరుగులు, చేతిలో 7 వికెట్లు).. 44వ ఓవర్లో బంతినందుకున్న మదెవెరె తొలి 3 బంతులకు 3 వికెట్లు తీసి, ప్రత్యర్ధిని దారుణంగా దెబ్బకొట్టాడు. Colin Ackermann ☝ Teja Nidamanuru ☝ Paul van Meekeren ☝ A stunning hat-trick for Wessly Madhevere 🤩 Watch #ZIMvNED live and FREE on https://t.co/MHHfZPzf4H 📺#CWCSL | https://t.co/bQxE1Jd6HT pic.twitter.com/9VYKdfNReN — ICC (@ICC) March 23, 2023 ఈ దెబ్బతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. నెదర్లాండ్స్ గెలవాలంటే 39 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయినా ఏ మాత్రం తగ్గని నెదర్లాండ్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చింది. ఆఖరి ఓవర్లో నెదర్లాండ్స్ గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా (చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది).. ర్యాన్ క్లెయిన్, క్లాసెన్ అద్భుతంగా పోరాడి 17 పరుగులు పిండుకున్నారు. ఆఖరి బంతికి బౌండరీ సాధించాల్సి ఉండగా..ర్యాన్ 2 పరుగులు తీసి రనౌట్ కావడంతో జింబాబ్వే పరుగు తేడాతో బయటపడింది. అగ్రశ్రేణి జట్ల పోరాటాన్ని తలపించిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించింది. మదెవెరె హ్యాట్రిక్ విషయానికొస్తే.. తొలి బంతికి ఆకెర్మన్ స్టంపౌట్ కాగా, ఆతర్వాత బంతికి తెలుగబ్బాయి నిడమనూరు తేజను, ఆమరుసటి బంతికి వాన్ మీకెరెన్ను మదెవెరె క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 25న జరుగుతుంది. -
హ్యాట్రిక్ మూవీస్ ఎందుకు చేస్తున్నారు?
-
టీ20 ప్రపంచకప్లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
Hasaranga Takes Hat Trick Vs South Africa In 2021 T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్(19)ను క్లీన్ బౌల్డ్ చేసిన హసరంగ.. 18వ ఓవర్ తొలి బంతికి బవుమా(46), రెండో బంతికి ప్రిటోరియస్(0) వికెట్లు పడగొట్టి.. కెరీర్లో తొలి టీ20 హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2007లో ఆసీస్ స్పీడ్స్టర్ బ్రెట్ లీ పొట్టి ప్రపంచకప్లో తొలి హ్యాట్రిక్ను నమోదు చేయగా.. ప్రస్తుత వరల్డ్కప్లో ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ క్యాంపర్ నెదర్లాండ్స్పై ఈ ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా హసరంగ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా చేరింది. వన్డేల్లో, టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. హసరంగకు ముందు బ్రెట్ లీ, తిసార పెరీరా, లిసత్ మలింగలు ఈ ఘనత సాధించారు. కాగా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. ఈ మ్యాచ్లో లంక నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. తొలుత లంక స్పిన్నర్ హసరంగ(3/20) హ్యాట్రిక్ సాధించడంతో మ్యాచ్ లంక వైపు మొగ్గుచూపగా.. ఆఖర్లో మిల్లర్(13 బంతుల్లో 23; 2 సిక్సర్లు) కిల్లర్ ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. మిల్లర్ వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అతనికి రబాడ(7 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) సహకరించడంతో మరో బంతి మిగిలుండగానే దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారి కెప్టెన్ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగతో పాటు చమీరా(2/27) రాణించాడు. చదవండి: షాహిన్ అఫ్రిది తరహాలో టీమిండియాపై విరుచుకుపడతా.. కివీస్ స్టార్ పేసర్ -
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో..
Cristiano Ronaldo Creates History By Scoring 10th International Hat Trick: పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా మంగళవారం లక్సెంబర్గ్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్(10 సార్లు) సాధించిన తొలి ఫుట్బాలర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా రొనాల్డో తన కెరీర్లో 58 హ్యాట్రిక్లు సాధించి, సమకాలీన ఫుట్బాలర్స్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్లు(182), అత్యధిక గోల్స్(115), అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
‘పది హ్యాట్రిక్కుల’ మొనగాడు.. అదిరిపోయే డీల్
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్బాల్ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్బాల్ మొనగాడు. యూరోపియన్ క్వాలిఫైయర్స్(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్ తరపున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో లగ్జెంబర్గ్ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్తోనూ వార్తల్లోకెక్కాడు మరి. సింగపూర్ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్) ఫుట్బాల్ క్లబ్ ఓనర్ పీటర్ లీమ్కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్కు చెందిన మింట్ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్ఫామ్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్బాల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్ఫామ్ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్బాల్ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ను జాయింట్గా రిలీజ్ చేశారు రొనాల్డో-లీమ్. పోర్చ్గల్ కెప్టెన్ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్ గోల్స్, పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్ల్లో 115 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్బాలర్గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ గణాంకాలు చెప్తున్నాయి. Unlucky 😢 What a bicycle kick 😭#CristianoRonaldo #CR7 #bicyclekick pic.twitter.com/18EVZ34BWo — Habibulla Sonet (@HabibullaSonet) October 12, 2021 చదవండి: ఐస్బాత్లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
దుమ్మురేపిన తాహిర్; హ్యాట్రిక్తో పాటు ఐదు వికెట్లు
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ టోర్నీలో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ దుమ్మురేపాడు. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో హ్యాట్రిక్తో మెరిసిన తాహిర్.. ఐదు వికెట్ల మార్క్ను అందుకున్నాడు. టోర్నీలో అరుదైన ఫీట్ అందుకున్న తొలి బౌలర్గా తాహిర్ రికార్డులకెక్కాడు. వెల్ష్ఫైర్తో సోమవారం బర్మింగ్హమ్ ఫొనిక్స్, వెల్ష్ఫైర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. ఇమ్రాన్ తాహిర్ మెరుపులతో బర్మింగ్హమ్ కీలకదశలో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్గా నిలిచింది. ఖయాస్ అహ్మద్, మాట్ మిల్నెస్, డేవిడ్ పైన్ రూపంలో హ్యాట్రిక్ను అందుకున్న తాహిర్ అంతకముందు గ్లెన్ ఫిలిప్స్, లూస్ డూ ప్లూయ్లను కూడా ఔట్ చేసి మొత్తం ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ విల్ సిమిద్(65 నాటౌట్), మొయిన్ అలీ(59) మెరుపులతో 100 బంతుల్లో 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెల్ష్ఫైర్ తాహిర్ దెబ్బకు 74 బంతుల్లోనే 91 పరుగులకు కుప్పకూలింది. ఇయాన్ కాక్బైన్ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో బర్మింగ్హమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో ట్రెంట్ రాకెట్స్తో సమానంగా ఉన్న బర్మింగ్హమ్ మెరుగైన రన్రేట్తో తొలిస్థానంలో ఉంది. ఇక ట్రెంట్ రాకెట్స్ ఏడో స్థానంలో నిలించింది. -
చివరి మూడు బంతుల్లో హ్యట్రిక్; అద్భుత విజయం
లీడ్స్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా శుక్రవారం లంకాషైర్, యార్క్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో యార్క్షైర్ ఆఖరిఓవర్లో విజయాన్ని దక్కించుకుంది. యార్క్షైర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్తో మెరిసి జట్టును గెలిపించాడు. లంకాషైర్కు చివరిఓవర్లో 20 పరుగులు అవసరం కాగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ను ఫెర్గూసన్ వేశాడు. అయితే ఫెర్గూసన్ వేసిన రెండో బంతి నోబాల్ కావడం, ఆ తర్వాత బంతిని రాబ్ జోన్స్ ఫోర్గా మలిచాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి సింగిల్ తీయడంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేస్తే లంకాషైర్ విజయం సాధిస్తుంది. ఈ దశలోనే ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికి వెల్స్ ను వెనక్కి పంపిన ఫెర్గూసన్ ఐదో బంతికి లూక్ వుడ్ను అద్బుత యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే లంకాషైర్ పరాజయం ఖరారైనా.. ఇంకా ఒక బంతి మిగిలి ఉండడంతో ఫెర్గూసన్ బంతిని విసిరాడు. టామ్ హార్ట్లీ భారీ షాట్కు యత్నించి లాంగాన్లో లిత్ చేతికి చిక్కాడు. అంతే ఎవరు ఊహించని విధంగా ఫెర్గూసన్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. యార్క్షైర్ బ్యాటింగ్లో హారీ బ్రూక్(50 బంతుల్లో 91నాటౌట్ ; 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం చేయగా.. ఓపెనర్ కెప్టెన్ లిత్ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన లంకాషైర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినా ఆఖర్లో ఫెర్గూసన్ హ్యాట్రిక్తో మెరవడంతో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాబ్ జోన్స్ 64 నాటౌట్, కీటన్ జెన్నింగ్స్ 37 పరుగులతో రాణించారు. LOCKIE FERGUSON HATTRICK 🔥 Look at those scenes 😍#Blast21 pic.twitter.com/QaFAp25KAZ — Vitality Blast (@VitalityBlast) July 2, 2021 -
సౌథాంప్టన్: షమీ విశ్వరూపం.. మళ్లీ రిపీటయ్యేనా?
సౌథాంప్టన్: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు (2019, జూన్ 22), సౌథాంప్టన్ వేదికగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ విశ్వరూపం ప్రదర్శించాడు. 2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా అఫ్ఘనిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో లాలా.. హ్యాట్రిక్ సాధించి, మెగా ఈవెంట్లో ఈ అరుదైన ఘనత సాధించిన రెండో భారతీయ పేసర్గా చరిత్రకెక్కాడు. కాగా, ఆ అరుదైన ఫీట్ను మరోసారి రిపీట్ చేసే అవకాశం షమీకి మళ్లీ వచ్చిందని టీమిండియా అభిమానులు అంటున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించారు.135 పరుగులకే న్యూజిలాండ్ సగం వికెట్లను పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట జరగాల్సి ఉన్న నేపథ్యంలో లాలా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని అభిమానులు ఆశిస్తున్నారు. లాలా.. మరో హ్యాట్రిక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, సౌథాంప్టన్ వేదికగా అఫ్ఘనిస్తాన్తో జరిగిన నాటి మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్లో షమీ హ్యాట్రిక్ సాధించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన అఫ్ఘన్కు శుభారంభం లభించింది. ఆఫ్ఘన్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా, షమీ చేతికి కెప్టెన్ కోహ్లీ బంతినిచ్చాడు. అప్పటికే మహమ్మద్ నబీ ఒంటిరి పోరాటం చేస్తూ.. మాంచి ఊపుమీదున్నాడు. తొలి బంతిని నబీ ఫోర్ బాది భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా అతను క్రీజ్ను వదల్లేదు. నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారిన నేపథ్యంలో షమీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వరుస బంతుల్లో నబీ, అఫ్తాబ్ అలామ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్లను అవుట్ చేసి టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్లో చేతన్ శర్మ తరువాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా షమీ రికార్డు సృష్టించాడు. చదవండి: కౌంటీ క్రికెట్ చరిత్రలో దారుణమైన గణాంకాలు నమోదు -
పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
ఆంటిగ్వా: వెస్టిండీస్, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్ మ్యాచ్లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్ రికార్డు ముందు రెండో రికార్డ్ పాపులర్ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనుంజయ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(28 పరుగులు), క్రిస్ గేల్( 0 పరుగులు), నికోలస్ పూరన్(0 పరుగులు)లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్గా ..ఓవరాల్గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు. విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్ ధనుంజయ బౌలింగ్లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’ పోల్ పొజిషన్
మోంజా (ఇటలీ): వేదిక మారినా... ట్రాక్ ఏదైనా... తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... రయ్ రయ్మంటూ దూసుకెళ్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 18.887 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్ గ్రాండ్ప్రిలలో వరుసగా... మళ్లీ స్పెయిన్, బెల్జియం, ఇటలీ గ్రాండ్ప్రిలలో వరుసగా హామిల్టన్కు ‘పోల్ పొజిషన్’ దక్కడం విశేషం. ఓవరాల్గా హామిల్టన్ కెరీర్లో ఇది 94వ పోల్ పొజిషన్. మెర్సిడెస్కే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి, మెక్లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫెరారీ జట్టు డ్రైవర్లు 1984 తర్వాత తొలిసారి సొంతగడ్డపై టాప్–10లో లేకుండా రేసును ప్రారంభించనున్నారు. -
ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు
అడిలైడ్: బిగ్బాష్ లీగ్(బీబీఎల్) ఒకే రోజు రెండు అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ధనాధన్ ఫార్మట్లో బ్యాట్స్మెన్ హవా కొనసాగుతున్న తరుణంలో బౌలర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఒకే రోజు రెండు హ్యాట్రిక్ వికెట్స్ నమోదయ్యాయి. తొలుత అడిలైడ్ స్ట్రైకర్ స్పిన్నర్, అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ సిడ్నీ సిక్సర్స్పై హ్యాట్రిక్ నమోదు చేయగా.. ఇదే రోజు మెల్బోర్న్ స్టార్స్, పాకిస్తాన్ ప్లేయర్ హ్యారీస్ రౌఫ్ సిడ్నీ థండర్పై రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సిడ్నీ థండర్తో మ్యాచ్లో మెల్బోర్న్ పేస్ బౌలర్ వరుసగా ఫెర్గుసన్ (35), గిల్స్క్(41), స్యామ్స్ (0) వికెట్లన పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఒకే రోజు రెండు హ్యాట్రిక్ వికెట్లు నమోదవడంపై బీబీఎల్ ఫ్యాన్స్ సంబరపడుతూ ఇట్స్ మిరాకిల్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సిడ్నీ సిక్సర్తో జరిగిన మ్యాచ్లో అడిలైడ్ స్ట్రైకర్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. వరుసగా జేమ్స్ విన్సే(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే రషీద్ హ్యాట్రిక్తో మెరిసినా అడిలైడ్ ఓటమి చవిచూసింది. రెండు వికెట్లు తేడాతో సిడ్నీ సిక్సర్ విజయం సాధించింది. ఇక గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న జూనియర్ రావల్సిండి ఎక్స్ప్రెస్ హ్యారీస్ రౌఫ్ టీ20 ప్రపంచకప్ కోసం సమయాత్తమవుతున్నాడు. దీనికోసం బీబీఎల్ను చక్కగా వినియోగించుకోవాలని ఈ పాక్ బౌలర్ భావిస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో బీబీఎల్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో ఈ పాకిస్తాన్ క్రికెటర్ హ్యారీస్ రౌఫ్.. ఆ మ్యాచ్లో వాడిని బంతిని మ్యాచ్ అనంతరం అక్కడున్న ఓ భారతీయ సెక్యూరిటీ గార్డుకు బహుమతిగా ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. A day of hat-tricks at the #BBL 🤯 Haris Rauf claims the second 🎩🎩🎩 of the day! pic.twitter.com/s1tTHG8xnA — T20 World Cup (@T20WorldCup) January 8, 2020 -
రషీద్ హ్యాట్రిక్.. కానీ బర్త్డే బాయ్దే గెలుపు
అడిలైడ్: బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో బుధవారం రెండు వినూత్న ఘటనలు జరిగాయి. అడిలైడ్ స్ట్రైకర్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సిడ్నీ సిక్సర్స్ బౌలర్, బర్త్డే బాయ్ జోష్ హేజిల్వుడ్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ఈ పోరులో బర్త్డే బాయ్ హేజిల్ వుడ్ విజయం సాధించాడు. కాగా సిడ్నీ ఆల్రౌండర్ టామ్ కరన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బీబీఎల్లో భాగంగా బుధవారం అడిలైడ్, సిడ్నీ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్కు దిగిన అడిలైడ్కు టామ్ కరన్(4/22) చుక్కలు చూపించాడు. కరన్కు తోడు మిగతా సిడ్నీ బౌలర్లు సహకారం అందించడంతో అడిలైడ్ జట్టు 19.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సిడ్నీకి కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. అడిలైడ్ బౌలర్ నెసెర్ ఆరంభంలోనే సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ల వికెట్లు పడగొట్టాడు. అయితే ఎట్టాగెట్టానో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్మన్ పనిపట్టాడు రషీద్ ఖాన్. వరుసగా జేమ్స్ విన్సే(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. కాగా, బీబీఎల్లో రషీద్కు ఇది మూడోది కాగా, అడిలైడ్ స్ట్రైకర్ జట్టుకు మొదటిది. రషీద్ దెబ్బకు 97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి సిడ్నీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టామ్ కరన్ ఈ సారి బ్యాట్తో జట్టును ఆదుకున్నాడు. అయితే అతడు కూడా 18 ఓవర్ చివరి బంతికి ఔటవ్వడంతో సిడ్నీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అంతేకాకుండా చివరి రెండో ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే సిడిల్ వేసిన 19 ఓవర్లో హేజిల్ వుడ్ అనూహ్యంగా హ్యాట్రిక్ ఫోర్ కొట్టి సిడ్నీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో రషీద్, హేజిల్ వుడ్ పోరులో(హ్యాట్రిక్) బర్త్డే బాయే గెలిచాడాని కామెంటేటర్లు సరదాగా కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న టామ్ కరన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
హ్యాట్రిక్ నంబర్ 35
మాడ్రిడ్ : ఆధునిక ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో తనెంత గొప్ప ఆటగాడో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి చాటి చెప్పాడు. మూడు నెలల కిందట ఆరోసారి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకొని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(5)ను అధిగమించిన మెస్సీ.. గతవారం ఏటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాలర్లకు ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ను ఆరోసారి దక్కించుకొని మళ్లీ రొనాల్డో(5)ను దాటేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెస్సీ మరోసారి రొనాల్డో రికార్డును బ్రేక్ చేశాడు. యూరోప్లో విశేషాదరణ ఉన్న స్పానిష్ లీగ్ ‘లా లిగా’ ఫుట్బాల్ టోర్నీలో మెస్సీ 35వ హ్యాట్రిక్ సాధించాడు. టోర్నీలో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ ఆదివారం మల్లోర్కా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్లో బార్సిలోనా జట్టు 5–2తో మల్లోర్కాపై గెలిచింది. కాగా, మెస్సీ తర్వాత 34 హ్యాట్రిక్లతో రొనాల్డో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
‘మళ్లీ హ్యాట్రిక్ నమోదు చేస్తానేమో’
లండన్: యార్కర్ల కింగ్ లసిత్ మలింగ 2007 వరల్డ్కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్తోసహా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా వరల్డ్కప్లోనూ తాను మరోసారి హ్యాట్రిక్ నమోదు చేయొచ్చంటున్నాడు మలింగ. ఐసీసీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలింగ మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయడాన్ని సవాల్గా తీసుకోవాల్సిందే. అప్పుడే మన సామర్థ్యానికి అసలు పరీక్ష ఎదురవుతుంది. ఇంగ్లండ్లో బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తా. ఈసారి ఐపీఎల్లో విజయవంతం అవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. వికెట్లు తీయగలిగే నైపుణ్యం నాకుందని నేను నమ్ముతా. అదే నాకు కావాల్సిన శక్తిని ఇస్తుంది’ అని పేర్కొన్నాడు. కాగా, మరొక్క వికెట్ తీస్తే వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వారి జాబితాలో తమ దేశానికే చెందిన సనత్ జయసూర్యను మలింగ అధిగమించి టాప్–10లోకి చేరతాడు. ఇక కరుణరత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు తన తొలి ప్రపంచకప్ పోరులో న్యూజిలాండ్తో జూన్ 1న తలపడనుంది. సీనియర్ ఆటగాళ్లు లసిత్ మలింగ, మాథ్యూస్లపైనే ఆజట్టు ఆధారపడి ఉంది. మలింగకు ఇదే చివరి వరల్డ్కప్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది. -
ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు నమోదు చేశాడు. కరేబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రెచ్చిపోయాడు. శుక్రవారం ట్రిన్బాగో నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో జమైకా తలవాస్ కెప్టెన్ అయిన రస్సెల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. తొలుత హ్యాట్రిక్తో రెచ్చిపోయిన జమైకన్ స్టార్ అనంతరం బ్యాటింగ్లో సెంచరీతో చెలరేగాడు. దీంతో ఒకే మ్యాచ్లో హ్యాట్రిక్తో పాటు సెంచరీ సాధించిన రెండో టీ20 ప్లేయర్గా రస్సెల్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు ఇంగ్లండ్ ఆటగాడు జోయ్ డెన్లీ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. డ్వాన్బ్రేవో జట్టైన ట్రిన్బాగో నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. రస్సెల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో మెకల్లమ్(56), బ్రావో(29), రామ్దిన్(0)లను పెవిలియన్కు చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో బ్రేవో జట్టు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రస్సెల్ వీరవిహారం.. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తలవాస్.. ఆ బాధ్యతలను సారథిగా రస్సెల్ స్వీకరించాడు. ఒక వైపు త్వరగా వికెట్లు కోల్పోయినా 7 స్థానంలో బ్యాటింగ్కు దిగి లూయిస్(51) సహకారంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు 13 సిక్సర్లతో 121 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. దీంతో జమైకా తలవాస్ 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఇక సీపీఎల్లో రస్సెల్దే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఇక ఐపీఎల్లో రస్సెల్ కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. -
మెస్సీ మ్యాజిక్... హైతీపై హ్యాట్రిక్
ఫుట్బాల్ ప్రపంచకప్నకు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు. హైతీతో బుధవారం జరిగిన సన్నాహక మ్యాచ్లో అతను హ్యాట్రిక్ కొట్టాడు. మ్యాచ్ 17వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన ఈ అర్జెంటీనా స్టార్... రెండో భాగంలో 10 నిమిషాల (58 ని., 68 ని.) వ్యవధిలోనే రెండు గోల్స్ చేశాడు. అగ్యురో 69వ నిమిషంలో మరో గోల్ సాధించడంతో అర్జెంటీనా 4–0 తేడాతో హైతీని ఓడించింది. తన 124వ అంతర్జాతీయ మ్యాచ్లో 64వ గోల్ చేసిన మెస్సీ ఈసారి అర్జెంటీనా ప్రపంచకప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
తాహీర్ హ్యాట్రిక్
-
పరుగు వ్యవధిలో 5 వికెట్లు!
షార్జా: క్రికెట్ అనేది ఫన్నీ గేమ్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. అందులోనూ టీ 20 క్రికెట్ వచ్చిన తర్వాత ఈ గేమ్ స్వరూపమే మారిపోయింది. బంతికో ఫోర్.. బంతికో వికెట్గా అన్న మాదిరిగా టీ 20 ఫార్మాట్ తయారైందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఒక జట్టు పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడమే ఇందుకు ఉదాహరణ. శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్-ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 15.4 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. 101 పరుగుల వద్ద ఆరో వికెట్ను కోల్పోయిన గ్లాడియేటర్స్.. మరో పరుగు మాత్రమే చేసి మిగతా వికెట్లను నష్టపోయింది. దాంతో పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇందులో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహీర్ హ్యాట్రిక్ వికెట్లను సాధించడం మరొక విశేషం. తాహిర్ స్పిన్ దెబ్బకు గ్లాడియేటర్స్ విలవిల్లాడుతూ హ్యాట్రిక్ను సమర్పించుకుంది. చివరి ఐదు వికెట్లలో మూడు డకౌట్లు ఉండటం గమనార్హం. ఇది పీఎస్ఎల్ చరిత్రలో మూడో హ్యాట్రిక్గా నమోదైంది. ఆపై 103 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముల్తాన్ సుల్తాన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుమార సంగక్కరా(51 నాటౌట్), షోయబ్ మస్జూద్(26 నాటౌట్), అహ్మద్ షెహజాద్(27)లు తమ జట్టు ఘన విజయానికి సహకరించారు. -
ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్తో కొత్త చరిత్ర!
ఆక్లాండ్: ఆ ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు.. ఆ ఇద్దరూ ఒకే జట్టుకి ప్రాతినిథ్యం కూడా వహించారు. అయితే ఆ ఇద్దరూ తాజాగా ఒకే రోజు హ్యాట్రిక్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నిజం. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే న్యూజిలాండ్కు చెందిన క్రికెటర్లు లాగోన్ వేన్ బీక్, మ్యాట్ మెక్ ఇవాన్లు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ దేశవాళీ లీగ్లో భాగంగా ఫ్లంకెట్ షీల్డ్ ట్రోఫీలో వెల్లింగ్టన్ ఫైర్బర్డ్స్ ఆటగాడు వేన్ బీక్.. కాంటర్బరీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముందుగా హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో భాగంగా చివరి రెండు బంతులకి రెండు వికెట్లు సాధించిన వేన్ బీక్.. ఆరో ఓవర్ మొదటి బంతికి వికెట్ తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇది ఫ్లంకెట్ షీల్డ్లో 40వ హ్యాట్రిక్గా పుస్తకాల్లోకెక్కగా, ఆపై అతని స్నేహితుడు మ్యాట్ వాన్ కూడా హ్యాట్రిక్ సాధించాడు. వేన్ బీక్ సాధించిన హ్యాట్రిక్ తరహాలో వాన్ వరుస మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఆక్లాండ్ తరపున ఆడిన ఇవాన్.. నార్త్రన్ డిస్ట్రిక్స్ జట్టు హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ 26 ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించగా, 28 ఓవర్ తొలి బంతికి మరో వికెట్ తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇది ఇది ఫ్లంకెట్ షీల్డ్లో 41 హ్యాట్రిక్. ఫలితంగా 112 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్లంకెట్ ఫీల్డ్లో రెండు హ్యాట్రిక్లు ఒకే రోజు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ రెండు హ్యాట్రిక్లు వచ్చింది శుక్రవారం. గతంలో ఇద్దరూ క్రికెటర్లు కాంటర్బరీ తరపున ఆడగా, క్రిస్ట్చర్చ్ సెయింట్ ఆండ్రూస్ కాలేజ్లో విద్యను అభ్యసించడం మరొక విశేషం. -
ఆఫ్రిది రికార్డ్ హ్యాట్రిక్.. సెహ్వాగ్ బాధితుడే..!
షార్జా: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. టీ10 టోర్నీలో మూడు వరుస బంతులకు ముగ్గురు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఔట్ చేసి ఈ ఫార్మాట్లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. గురువారం షార్జాలో టోర్నీ ప్రారంభమైన తొలిరోజే పాక్ ఆల్ రౌండర్ హ్యాట్రిక్ ఫీట్తో చెలరేగాడు. టీమిండియా మాజీ ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా బాధితుడిగా మిగిలాడు. ఆఫ్రిది నేతృత్వంలోని ఫక్తూన్స్ జట్టు, సెహ్వాగ్ నేతృత్వంలోని మరాఠా అరేబియన్స్ జట్ల మధ్య గురువారం టీ10 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫక్తూన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 121 పరగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన సెహ్వాగ్ జట్టు తొలి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ఆ మరుసటి ఓవర్ వేసిన ఫక్తూన్స్ కెప్టెన్ ఆఫ్రిది తొలి బంతికి దక్షిణాఫ్రికా ఆటగాడు రిలే రోసౌను, రెండో బంతికి వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను, మూడో బంతికి టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ను పెవిలియన్ బాట పట్టించాడు. రోసౌ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, బ్రావో, సెహ్వాగ్లను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో 46/2గా ఉన్న మరాఠా అరేబియన్ టీమ్ ఆఫ్రిది దెబ్బకు 46/5 తో కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో ఆఫ్రిది జట్టు 25 పరుగుల తేడాతో సెహ్వాగ్ జట్టుపై విజయం సాధించింది. -
ఆఫ్రిది రికార్డ్ హ్యాట్రిక్.. సెహ్వాగ్ బాధితుడే..!
-
స్టార్క్ ‘డబుల్ హ్యాట్రిక్’
సిడ్నీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో స్టార్క్ రెండు ఇన్నింగ్స్లలోనూ ‘హ్యాట్రిక్’ సాధించాడు. న్యూసౌత్వేల్స్ తరఫున ఆడుతున్న స్టార్క్... ఈ ఫీట్ను ప్రదర్శించాడు. తద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున అతను రెండో క్రికెటర్ కాగా 1978–79 తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు కావడం ఇదే తొలిసారి. స్టార్క్ మొదటి ఇన్నింగ్స్లో బెహ్రన్డార్ఫ్, మూడీ, మాకిన్లను అవుట్ చేయగా... రెండో ఇన్నింగ్స్లో బెహ్రన్డార్ఫ్, మూడీ, వెల్స్లను పెవిలియన్ పంపించాడు. ఈ మ్యాచ్లో న్యూసౌత్వేల్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గతంలో ఏడుగురు (అమీన్ లఖాని, జోగీందర్ సింగ్ రావు, జెన్కిన్స్, పార్కర్, టీజే మాథ్యూస్, ఆల్బర్ట్ ట్రాట్, ఎ.షా) ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఒకే మ్యాచ్లు రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇందులో మాథ్యూస్ మాత్రమే ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్లో ఈ ఘనత సాధించగా... మిగతావన్నీ దేశవాళీ క్రికెట్లోనే వచ్చాయి. వీరిద్దరు ప్రత్యేకం... ‘డబుల్ హ్యాట్రిక్’ జాబితాలో ఆల్బర్ట్ ట్రాట్, జోగీందర్ సింగ్ రావుల హ్యాట్రిక్లకు మరో ప్రత్యేకత ఉంది. వీరిద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో రెండుసార్లు ‘హ్యాట్రిక్’ సాధించడం పెద్ద విశేషం. అయితే కెరీర్లో ఏకంగా 375 ఫస్ట్క్లాస్ మ్యాచ్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు జట్ల తరఫున కలిసి మొత్తం 5 టెస్టులు ఆడిన ట్రాట్... 41 ఏళ్ల వయసులో కటిక దారిద్య్రం కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మరోవైపు జోగీందర్ సింగ్ రావు కెరీర్ సర్వీసెస్ తరఫున ఒకే సీజన్లో 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లకే పరిమితమైంది. ఆర్మీ శిక్షణలో భాగంగా పారాగ్లైడింగ్లో గాయపడటంతో ఆయన క్రికెట్ ఆట అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత జోగీందర్ పాకిస్తాన్తో రెండు యుద్ధాల్లో పాల్గొని మేజర్ జనరల్ స్థాయికి ఎదిగి 1994లో మరణించారు. -
హామిల్టన్ హ్యాట్రిక్
* హంగేరి గ్రాండ్ప్రి టైటిల్ సొంతం * సీజన్లో ఐదో విజయం బుడాపెస్ట్: ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా మూడో విజయాన్ని సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ 70 ల్యాప్లను గంటా 40 నిమిషాల 30.115 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఓవరాల్గా ఈ సీజన్లో హామిల్టన్కిది ఐదో విజయం కాగా, కెరీర్లో 48వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్బర్గ్ (మెర్సిడెస్)ను తొలి ల్యాప్లోనే వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. రోస్బర్గ్కు రెండో స్థానం దక్కగా... రికియార్డో (రెడ్బుల్) మూడో స్థానాన్ని పొందాడు. భారత్కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్బర్గ్ పదో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. సీజన్లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్ప్రి ఈనెల 31న జరుగుతుంది. -
ఈశ్వర్ పాండే హ్యాట్రిక్
వడోదర:ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ ఈశ్వర్ పాండే హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్-సిలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో పాండే ఈ ఘనతను అందుకున్నాడు. ఆంధ్ర కోల్పోయిన తొలి మూడు వికెట్లను పాండే తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. పాండే మూడో ఓవర్ ను అందుకుని ఆ ఓవర్ మూడో బంతికి ఆంధ్ర కెప్టెన్ భరత్(9) ను పెవిలియన్ కు పంపగా, ఆ తరువాత వరుస బంతుల్లో ప్రశాంత్ , శ్రీకాంత్లను అవుట్ చేశాడు. ఓవరాల్ గా 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను సాధించిన పాండే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లోతొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆంధ్ర టాపార్డర్ లో భరత్(9),ప్రశాంత్(3), శ్రీకాంత్(9), ప్రదీప్(0), అశ్విన్ హెబర్(15) ఘోరంగా విఫలం చెందడంతో జట్టు వంద మార్కులు అంకెను కూడా చేరలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన మధ్యప్రదేశ్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఆటగాళ్లలో హర్ ప్రీత్ సింగ్(40 నాటౌట్) రాణించగా, సహాని(22), ధలివాల్(25 నాటౌట్)లు విజయంలో సహకరించారు. -
‘నాతో పోటీకి ముందు ఆలోచించి మాట్లాడాలి’
మాంచెస్టర్: భవిష్యత్లో తనతో పోటీకి ముందు ప్రత్యర్థులు ఆచితూచి మాట్లాడాలని స్టార్ బాక్సర్ విజేందర్ హెచ్చరించాడు. ఆదివారం సామెట్తో జరిగిన పోరులో విజేందర్ నాకౌట్ విజయంతో హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్కు ముందు సామెట్ మాటల యుద్ధం ప్రారంభిస్తూ భారత బాక్సర్ తనకు పోటీయే కాదని, అతడి ఎముకలు విరిచేస్తానని సవాల్ విసిరాడు. ‘ఫైట్కు ముందు సామెట్ మాటలతో నేను అద్భుత ప్రదర్శన ఇవ్వాలని భావించాను. అది సాధించాను. సవాల్ విసిరినంతగా అతడి ఆట లేదు. మూడు విజయాలతో ఈ ఏడాదిని ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని విజేందర్ అన్నాడు. -
సంపత్నందితో మళ్లీ చేస్తా!
‘‘ఈ సినిమా మళ్లీ ఇంకోసారి ప్రేక్షకుల మధ్యలో చూడాలనుంది. అవకాశం వస్తే, మళ్లీ సంపత్నందితో సినిమా చేస్తా’’ అని రవితేజ చెప్పారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నాలతో సంపత్నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ విజయోత్సవం శుక్రవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్నంది మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా నాకు హ్యాట్రిక్ కావాలని హీరో రవితేజ పదేపదే మనస్ఫూర్తిగా అన్నారు. పైన తథాస్తు దేవతలు ఉన్నారేమో అందుకే హిట్ అయింది. బురదలో తీసిన ఫైట్కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’అని అన్నారు. సంపత్నంది హ్యాట్రిక్ ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, నాయిక తమన్నా పాల్గొన్నారు. -
మిశ్రా హ్యాట్రిక్
హరియాణా ఘన విజయం విజయ్ హజారే ట్రోఫీ ఆలూరు (కర్ణాటక): విజయ్ హజారే వన్డే ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హరియాణా 10 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కశ్మీర్ 22 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హర్షల్ పటేల్ (5/21) చెలరేగగా, భారత లెగ్స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/4) కెరీర్లో తొలిసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్లోనూ హర్షల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించడంతో 11 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసిన హరియాణా మరో 234 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవడం విశేషం. బెంగళూరులో జరిగిన ఇదే గ్రూప్లోని మరో మ్యాచ్లో జార్ఖండ్ 5 వికెట్లతో కేరళను ఓడించింది. కేరళ 8 వికెట్లకు 236 పరుగులు చేయగా, జార్ఖండ్ 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. ధోని (18) మళ్లీ విఫలమయ్యాడు. రాజ్కోట్: గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ నాలుగు వికెట్లతో బెంగాల్ను ఓడించింది. ముందుగా బెంగాల్ 221 పరుగులకు ఆలౌటైంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టిన బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ 6 వికెట్లకు 222 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మరోవైపు హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. సర్వీసెస్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. -
ఉమేశ్ హ్యాట్రిక్ రంజీ ట్రోఫీ
నాగపూర్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత తుది జట్టులో చోటు దక్కని పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రంజీ ట్రోఫీలో రాజస్తాన్ జట్టుపై చెలరేగాడు. ఉమేశ్ ఈ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ సాధించడం విశేషం. తన 18వ ఓవర్లో అతను వరుస బంతుల్లో అజయ్, అనికేత్, నాథు సింగ్లను అవుట్ చేశాడు. ఉమేశ్ (4/45) బౌలింగ్ ధాటికి రాజస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 216 పరుగులకే ఆలౌటైంది. కాన్పూర్లో తమిళనాడుతో జరుగుతున్న మరో రంజీ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ 4 వికెట్లకు 277 పరుగులు చేసింది. సురేశ్ రైనా (56 బంతుల్లో 52 బ్యాటింగ్; 8 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నాడు. -
‘షేన్’దార్ రాయల్స్
అద్భుతం... అసాధ్యాలు సుసాధ్యం కావడం... ఒక్క ఓవర్లో మ్యాచ్ ఫలితం తారుమారు కావడం... ఇవన్నీ టి20 ఫార్మాట్లోనే సాధ్యం. వారం క్రితం సూపర్ ఓవర్ను కూడా టై చేసుకున్న రాజస్థాన్, కోల్కతా.. మరోసారి టి20 క్రికెట్లోని మజాను రుచి చూపించాయి. అసలు ఇదెలా సాధ్యం..! అని ఆశ్చర్యపోయేలా రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్ను అనూహ్యంగా గెలిచారు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టూ ఓడిపోని విధంగా... అత్యంత నాటకీయంగా కోల్కతా చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది. - రాజస్థాన్ సంచలన విజయం - షేన్ వాట్సన్ ఆల్రౌండ్ షో - పవీణ్ తాంబే హ్యాట్రిక్ - నాటకీయంగా కుప్పకూలిన కోల్కతా రెండు బంతుల్లో హ్యాట్రిక్ ! తాంబే ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించినా... లీగల్గా తను వేసింది రెండు బంతులే. తొలి బంతి వైడ్ అయినా స్టంపౌట్ రూపంలో వికెట్ వచ్చింది. తర్వాతి రెండు లీగల్ బంతులకు రెండు వికెట్లు వచ్చాయి. టి20ల్లో ఇలా రెండు బంతుల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి భారత క్రికెటర్ తాంబే. గతంలో చాంపియన్స్లీగ్లో ఇసురు ఉదాన (శ్రీలంక) రెండు బంతుల్లో ఇలాగే హ్యాట్రిక్ సాధించాడు. అహ్మదాబాద్: లక్ష్యం 171... స్కోరు 14 ఓవర్లలో 121/0... ఈ దశలో ఏ జట్టైనా అలవోకగా గెలుస్తుంది. కానీ కోల్కతా మాత్రం నాటకీయంగా కుప్పకూలి అనూహ్యంగా ఓడిపోయింది. కేవలం 8 బంతుల వ్యవధిలో రెండే పరుగులు జతచేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆడుతూ పాడుతూ గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా ఘోర పరాజయం పాలైంది. షేన్ వాట్సన్ ఆల్రౌండ్ నైపుణ్యానికి.. స్పిన్నర్ ప్రవీణ్ తాంబే హ్యాట్రిక్ తోడవడంతో... సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే (22 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్), కరుణ్ నాయర్ (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. సంజు శామ్సన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు), వాట్సన్ (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొత్తం బ్యాట్స్మెన్ అంతా సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ భారీస్కోరు సాధించింది. కోల్కతా బౌలర్లలో వినయ్ కుమార్, నరైన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు గంభీర్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్), ఉతప్ప (52 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 121 పరుగులు జోడించి... విజయానికి కావలసిన ప్లాట్ఫామ్ను సిద్ధం చేశారు. అయితే వాట్సన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం... ఆ వెంటనే తర్వాతి ఓవర్లోనే తాంబే హ్యాట్రిక్ సాధించడంతో కేవలం 2 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్కతా ఇక కోలుకోలేకపోయింది. చివర్లో షకీబ్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, తాంబే మూడేసి వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 30; కరుణ్ నాయర్ (స్టం) ఉతప్ప (బి) షకీబ్ 44; శామ్సన్ (సి) పాండే (బి) నరైన్ 37; వాట్సన్ (సి) యాదవ్ (బి) నరైన్ 31; బిన్నీ (సి) టెన్ డష్కటే (బి) వినయ్ 11; స్టీవ్ స్మిత్ (సి) యాదవ్ (బి) వినయ్ 3; ఫాల్క్నర్ నాటౌట్ 1; భాటియా నాటౌట్ 6; ఎక్స్ట్రాలు (లెగ్బైస్ 3, వైడ్లు 2, నోబాల్ 1) 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-52; 2-105; 3-136; 4-153; 5-163; 6-163. బౌలింగ్: వినయ్ కుమార్ 4-0-42-2; ఉమేశ్ యాదవ్ 3-0-31-0; షకీబ్ అల్ హసన్ 4-0-25-1; నరైన్ 4-0-28-2; రస్సెల్ 3-0-27-0; టెన్ డష్కటే 2-0-14-0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) భాటియా (బి) వాట్సన్ 65; గంభీర్ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 54; రస్సెల్ (బి) వాట్సన్ 1; పాండే (స్టం) శామ్సన్ (బి) తాంబే 0; షకీబ్ నాటౌట్ 21; యూసుఫ్ పఠాన్ (సి) అండ్ (బి) తాంబే 0; డష్కటే ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 0; సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 9; ఎక్స్ట్రాలు (లెగ్బైస్ 5, వైడ్లు 3, నోబాల్స్ 2) 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-121; 2-122; 3-122; 4-123; 5-123; 6-123. బౌలింగ్: వాట్సన్ 4-0-21-3; సౌతీ 3-0-33-0; తాంబే 4-0-26-3; ఫాల్క్నర్ 4-0-27-0; భాటియా 3-0-30-0; టెవాటియా 2-0-18-0. కళ్లుచెదిరే క్యాచ్లు తొలుత రాజస్థాన్ ఇన్నింగ్స్ను టాపార్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా నిర్మించారు. రహానే, నాయర్, శామ్సన్13 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుతూనే 105 పరుగులు చేశారు. దీంతో వాట్సన్ హిట్టింగ్కు కావలసిన రంగం సిద్ధమైంది. కెప్టెన్ వాట్సన్ అంచనాలను నిలబెట్టుకుంటూ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ దశలో రాయల్స్ 180-190 పరుగులు దిశగా సాగింది. కానీ కోల్కతా ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లతో నియంత్రించారు. ముఖ్యంగా వాట్సన్ క్యాచ్ను సూర్యకుమార్ అత్యద్భుతంగా అందుకున్నాడు. అలాగే బిన్నీ క్యాచ్ను టెన్డష్కటే అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రాయల్స్ 170 పరుగులకు పరిమితమైంది. 121/0.... 123/6 కోల్కతాకు గంభీర్, ఉతప్ప కళ్లుచెదిరే ఆరంభాన్నిచ్చారు. టోర్నీలో తొలిసారి గంభీర్ అర్ధసెంచరీ చేయగా... ఉతప్ప అద్భుతమైన షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ ఎక్కడా తడబడకుండా ఆడి కోల్కతాను పటిష్ట స్థితిలో నిలిపారు. 15వ ఓవర్లో డ్రామా మొదలైంది. వాట్సన్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే గంభీర్ అవుట్ అయ్యాడు. మూడో బంతిని పుల్ చేసిన ఉతప్ప బౌండరీ దగ్గర సులభమైన క్యాచ్ ఇచ్చాడు. చాలా నిర్లక్ష్యపు షాట్ ఇది. ఇదే ఓవర్ ఐదో బంతికి వాట్సన్... రస్సెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు (అది కూడా ఓవర్ త్రో) మాత్రమే వచ్చింది. తర్వాతి ఓవర్లో తాంబే తొలి బంతిని వైడ్ వేశాడు. కానీ మనీష్పాండే ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దీంతో మళ్లీ ఇదే ఓవర్ తొలి బంతి వేసిన తాంబే... యూసుఫ్ పఠాన్ను రిటర్న్ క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాతి బంతి టెన్ డష్కటే ఎల్బీగా అవుట్ కావడంతో తాంబేకు హ్యాట్రిక్ దక్కింది. కేవలం రెండు పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్కతా ఇక ఆ తర్వాత కోలుకోలేకపోయింది.