Home Department
-
పోలీసుల పనితీరులో మార్పు రావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు కావాలని చెప్పారు. హోం శాఖ వ్యవహారాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగును డ్రోన్ల ద్వారా గుర్తించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా వచ్చే నెలలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేపట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో ఓ సైబర్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రేహౌండ్స్ సెంటర్, ఏపీ పోలీసు అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులను రాబట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ ఆధునీకరణకు రూ.61 కోట్లు విడుదల చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడుతూ నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళా కళాశాలలు, వైద్య కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పోలీసు శాఖకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు. కన్నయ్యనాయుడికి సత్కారం కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడును సీఎం చంద్రబాబు సత్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబును బుధవారం కన్నయ్యనాయుడు కలిశారు. వరద ఉద్ధృతిలోనూ తాత్కాలిక గేటు అమర్చి.. నీటి వృథాకు అడ్డుకట్ట వేసిన కన్నయ్యనాయుడును సీఎం చంద్రబాబు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను సమకూర్చుకోండిఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలుపై కేంద్రం ఇస్తున్న సబ్సీడీలను వినియోగించుకుని 1,253 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఇప్పటికే ప్రతిపాదించిన 1,489 డీజిల్ బస్సులనూ సమకూర్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
బంగ్లాలో భారతీయులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రత కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు.కాగా, బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశంపై నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, దేశాన్ని వీడటంతో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరోవైపు.. అక్కడ పరిపాలన వ్యవస్థ లేకపోవడంతో కొందరు మూకలు రెచ్చిపోతున్నారు. భారతీయులు, హిందువులు, పలువురు మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దుపై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులు, హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపడుతుందన్నారు. బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు చెప్పారు. ఇక, ఈ కమిటీలో దక్షిణ బెంగాల్, త్రిపుర విభాగాల బీఎస్ఎఫ్ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు. -
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
ఏపీకి 11.536 ఎకరాలు.. తెలంగాణకు 8.245 ఎకరాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తయింది. ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ శనివారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన జరగలేదు. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల సమన్వయంతో విభజన పూర్తయింది. ఢిల్లీలోని అశోకా రోడ్లోని ఆంధ్రప్రదేశ్ భవన్ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.9,913.505 కోట్లు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పంపకాల్లో భాగంగా ఏపీకి 58.32 శాతం వాటా దక్కగా, తెలంగాణకు 41.68 శాతం ఆస్తులు దక్కాయి. ఏపీ భవన్కు ఇలా 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవన్ను రెండు భాగాలుగా విభజించారు. విభజనలో భాగంగా ఏపీకి 11.536 ఎకరాలను అప్పగించారు. దీనిలో 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏపీ భవన్, 4.315 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సింగ్ హాస్టల్, 2.396 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ను కేటాయించారు. 0.512 విస్తీర్ణంలో ఉన్న ఇంటర్నల్ రోడ్డు, 0.954 విస్తీర్ణంలోని శబరీ బ్లాక్ కొంత భాగాన్ని అప్పగించారు. ఏపీకి కేటాయించిన స్థలం విలువ రూ.5,781.416కోట్లు. తెలంగాణ భవన్కు ఇలా.. విభజనలో భాగంగా తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. దీనిలో మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న శబరీ బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ను కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల విలువ రూ.4,132.089 కోట్లు. -
AP: మున్సిపల్ కార్మికులపై కేసులు ఎత్తివేత
సాక్షి, అమరావతి: సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు డీజీపీకి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది. -
Cyber Crimes: రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్ క్రైమ్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్ 243, గుజరాత్ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్ కార్డులను, 2810 వెబ్సైట్లు, 585 మొబైల్ యాప్లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది. ఇదీచదవండి.. అశోక్ గహ్లోత్ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్లోని శ్రీముక్త్సర్ సాహిబ్కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హోంశాఖ 2018లో ఆపరేషన్స్ మెడల్స్ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్కేడర్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్కేడర్ ఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంపికైన వారు రాజేష్ కుమార్ (ఐజీపీ), నరేందర్ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్.చైతన్య కుమార్ (నాన్కేడర్ ఎస్పీ), డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్ రెడ్డి, మహమూద్ యూసఫ్, హెడ్ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్.ప్రసాద్, కే.సి.విజయ్కుమార్, పీసీలు మహమూద్ ఖాజా మొయిద్దీన్, మోహముంద్ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్కుమార్, ఎస్.ప్రేమ్కుమార్, ఎండీ షబ్బీర్ పాషా, ఇంతియాజ్ పాషా షేక్, ఏ.శ్రీనివాస్. ఏపీ నుంచి ఎంపికైన వారు వినీత్ బ్రిజ్ లాల్ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్కుమార్ (ఎస్పీ, నాన్కేడర్), షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అనిల్కుమార్(ఎస్ఐ), ఎంవీఆర్పీ నాయుడు (ఆర్ఎస్ఐ), రాజన్న గౌరీ శంకర్ (హెడ్కానిస్టేబుల్), అనంతకుమార్ నంద (హెడ్కానిస్టేబుల్), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు. -
క్రిమినల్ బిల్లుల పరిశీలనకు మరింత సమయం
న్యూఢిల్లీ: ప్రస్తుత క్రిమినల్ చట్టాల స్థానంలో ప్రతిపాదించిన మూడు కొత్త బిల్లులపై హోం శాఖ కార్యకలాపాల పార్లమెంటరీ కమిటీ భేటీ శుక్రవారం అసంపూర్తిగా ముగిసింది. బిల్లుల డ్రాఫ్ట్ల అధ్యయనానికి మరింత సమయం కావాలని కమిటీలోని విపక్ష సభ్యులు కోరారు. స్వల్పకాలిక ఎన్నికల లబ్ధి కోసం వాటిని హడావుడిగా ఆమోదించొద్దని కమిటీ చైర్పర్సన్ బ్రిజ్ లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ నవంబర్ 6న భేటీ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. విపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆ రోజు వాటిని కమిటీ ఆమోదిస్తుందని సమాచారం. బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు మూడు కొత్త బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టడం తెలిసిందే. అనంతరం వాటిని పరిశీలన కమిటీకి పంపారు. వాటిపై పరిశీలనకు మరింత కావాలంటూ కమిటీలోని విపక్ష సభ్యులు పి.చిదంబరం (కాంగ్రెస్), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ) చైర్మన్కు లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రతిపాదిత చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని డీఎంకే వంటి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని పట్టించుకోరాదని కేంద్రం నిర్ణయించినట్టు చెబుతున్నారు. -
రేపు తెలంగాణకు కేంద్ర బృందం.. నష్టాలపై నివేదిక!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరదల నేపథ్యంలో పరిస్థితిని తక్షణమే అంచనా వేసేందుకు అమిత్షా ఆదేశాల మేరకు అంతర్–మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని కేంద్ర హోంశాఖ నియమించింది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. ఎన్డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివరణాత్మక నివేదిక కేంద్రానికి సమర్పిస్తుంది. అనంతరం అవసరమైతే కేంద్ర బృందం మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పిస్తుంది. కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రహదారుల శాఖలు, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణలో 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్లోకి దూసుకెళ్లి.. -
హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: హోంశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు. సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు రోడ్లపై కిక్కిరిసేలా చేస్తున్నారు.. చంద్రబాబు రెండు సభలలో అమాయకులు చనిపోయారని సీఎం జగన్ అన్నారు. కాగా, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన -
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నా సీఎం జగన్
-
హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలి: సీఎం జగన్
-
హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. ‘‘దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలి. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి. రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలి. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్స్టేషన్ ఉండాలి’’ సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
డేటా దేశం దాటిందా?
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డేటా లీక్ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ సీరియస్గా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 24 రాష్ట్రాలకు చెందిన 80 కోట్ల మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెట్టడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా చౌర్యానికి గురైన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారం కూడా ఉండటంతో అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సైబరాబాద్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇటీవల మూడు డేటా చౌర్యం కేసులకు సంబంధించి 17 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, ర్యాంకులు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలు లీక్ అయ్యాయి. విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీఓలతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితులు విక్రయిసున్నారు. ఎలా లీకైంది? ఎవరు కొన్నారు? హై ప్రొఫైల్ వ్యక్తుల రహస్య సమాచారం లీక్ కావడంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. నిందితులకు సమాచారం ఎలా చేరింది? ఎక్కడి నుంచి లీకైంది? ఎవరెవరు డేటా కొనుగోలు చేశారు? కొన్న సమాచారాన్ని దేని కోసం వినియోగిస్తున్నారు? సున్నితమైన సమాచారం ఏమైనా దేశం దాటిందా? వంటి అంశాలపై సైబరాబాద్ పోలీసులను ఆరా తీసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే నిందితుల నుంచి రాబట్టిన సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు వివరించారు. వెబ్సైట్ల ద్వారా డేటా విక్రయం.. తొలుత నిందితులు జస్ట్ డయల్ వేదికగా డేటాను విక్రయిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. నిందితులు సొంతగా నకిలీ గుర్తింపు కార్డులతో కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి పేరుతో వెబ్సైట్లను సృష్టించి మరీ డేటాను విక్రయిస్తున్నట్లు తేలింది. ఢిల్లీ, ఫరీదాబాద్లో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రామీణ నిరుద్యోగులను టెలీ కాలర్లుగా నియమించుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తెరుస్తూ.. కొట్టేసిన సొమ్మును నేరుగా ఆయా ఖాతాలకు మళ్లిస్తే పోలీసులకు దొరికిపోతామని నో బ్రోకర్.కామ్, హౌసింగ్.కామ్, పేటీఎం, మ్యాజిక్ బ్రిక్స్ వంటి ఆన్లైన్ సంస్థలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. 21 సంస్థలకు నోటీసులు జారీ.. నిందితుల నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను విశ్లేషించిన పోలీసులు.. 21 సంస్థల నుంచి డేటా చౌర్యానికి గురైనట్లు గుర్తించారు. దీంతో బిగ్ బాస్కెట్, ఫోన్పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యా ట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి 21 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో 8 సంస్థలు మాత్రమే విచారణకు హాజరై.. కస్టమర్ల డేటా సమీకరణ, భద్రత విధానాలపై పోలీసులకు నివేదికను సమర్పించాయి. దీంతో గైర్హాజరైన కంపెనీలపై పోలీసులు న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. 28 వెబ్సైట్లు ఇవే.. ♦ ఇన్సై్పర్ వెబ్స్ ♦ డేటా మార్ట్ ఇన్ఫోటెక్ ♦ గ్లోబల్ డేటా ఆర్ట్స్ ♦ ఎంఎస్ డిజిటల్ గ్రో ♦ ఇన్స్పైర్ డిజిటల్ ♦ ఫన్డూడేటా.కామ్ ♦ కెనిల్స్.కో ♦ డేటాస్పెర్నీడ్.కామ్ ♦ బినరీక్లూస్.కామ్ ♦ ఇనిగ్మా మార్కెటింగ్ ♦ అల్టీమోక్డ్స్.కామ్ ♦ ఫాస్ట్ డేటాబేస్ ప్రొవైడర్ ♦ డేటా సొల్యూషన్ ఫర్ బీ2బీ అండ్ ♦ బీ2సీ పోర్టల్ ♦ బీజీ డేటా ♦ డిమాండ్ డేటా సొల్యూషన్ ♦ స్పెర్ డిజిటల్ ఇండియా ♦ క్యూబిక్టెక్నాలజీ.కామ్ ♦ బీబీజీఈబ్రాండిం గ్.కామ్ ♦ ఈజీసర్వ్.కో.ఇన్ ♦ డేటాప్రొలిక్స్.కామ్ ♦ క్యూబిర్ర్ డేటాబేస్ మార్కెటింగ్ ♦ 77డేటా.నెట్ ♦ 99డేటాఏసీడీ.కామ్ ♦ డేటాబేస్ప్రొవైడర్.ఇన్ ♦ హెచ్ఐడేటాబేస్.కామ్ ♦ బల్క్డేటాబేస్.ఇన్ఫో ♦ గ్లోబల్డేటా.కామ్ ♦ డేటాపార్క్.కో.ఇన్ -
హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించండి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించి.. ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరిగా పరిగణించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డులు చింతా గోపీ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.శీనాకుమార్ వాదనలు వినిపిస్తూ.. సాధారణ అభ్యర్థులకు నిర్ధేశించినట్లు హోంగార్డులకు కూడా కటాఫ్ మార్కులు నిర్ణయించడం తగదని.. ఇది గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ప్రిలిమ్స్లో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. మొత్తం పోస్టుల్లో హోంగార్డులకు ప్రత్యేకంగా 15 శాతం కోటా ఉందని చెప్పారు. 2016 నాటి జీవో 97 ప్రకారం స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రత్యేక కేటగిరికి వర్తించని తెలిపారు. సాధారణ అభ్యర్థుల్లాగా ప్రిలిమ్స్లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో పిటిషనర్లు దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందని శీనాకుమార్ వివరించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ఆదేశించారు. కటాఫ్తో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేశారు. కౌంటర్లు దాఖలుకు గడువిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
జీవో నంబర్ 1పై దురుద్దేశంతోనే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రజల భద్రత కోసం నిబంధనలను అనుసరించి హోం శాఖ జీవో నంబర్ 1 జారీ చేసిందని అదనపు డీజీ (శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాదయాత్రలు, రోడ్షోలపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొందరు దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలపై నిషేధం విధించిందని దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జీవో నంబర్ 1లో నిషేధం అనే మాటే లేదన్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపైన సభలు, సమావేశాలు పెట్టొద్దని మాత్రమే చెప్పామని వెల్లడించారు. పూర్తిగా ప్రజల ప్రయాణం, సరుకు రవాణా కోసమే రహదారులను ఉపయోగించాలని జీవోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వైద్యం, ఇతర అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని సూచించామని తెలిపారు. అత్యవసరమైతే షరతులతో అధికారులు అనుమతినిస్తారని కూడా జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కరెంటు వైర్లు, కాలువలు, డ్రైనేజీలు దగ్గరలో లేకుండా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన సభ కోసం అనుమతి కోరితే అన్నీ పరిశీలించి అనుమతి మంజూరు చేశామని చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు సరిగా దరఖాస్తు పూర్తి చేయలేదన్నారు. దరఖాస్తు సరిచేసి ఇవ్వాలని పోలీసులు చెప్పినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఏ పార్టీ అయినా ఒకే రీతిలో జీవో నంబర్1 ను అమలు చేస్తామని వెల్లడించారు. 1861 పోలీసు చట్టం దేశమంతా అమలులో ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్లు 30, 30ఏ, 31లలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగానే జీవో నంబర్ 1ను హోం శాఖ జారీ చేసిందన్నారు. కందుకూరు, గుంటూరు జిల్లాల్లో దుర్ఘటనలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ (శాంతిభద్రతలు) రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. -
AP: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. ఈమేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో.. అత్యంత అరుదైన సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతినివ్వొచ్చు. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి. సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు, కచ్చితమైన రూట్ మ్యాప్, హాజరయ్యేవారి సంఖ్య, సక్రమ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిపై జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్ సంతృప్తిచెందితే నిర్వాహకుల పేరిట షరతులతో అనుమతినిస్తారు. సభ, ర్యాలీ నిర్వహణలో షరతులను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడతున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్ మ్యాప్ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది. -
Telangana: తుపాకులకు హోంశాఖ రెడ్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ రేంజ్, ఇతర అధికారులకు ఆయుధాలివ్వాలనే ప్రతిపాదనను గతంలోనే అటవీశాఖ నిశితంగా పరిశీలించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపుతో పాటు, తమ అవసరాలకు తగ్గట్టుగా ఏ రకమైన ఆయుధాలు కావాలి అన్న దానిపైనా అధ్యయనం జరిపారు. సెల్ప్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్) కోసం తయారీదారులను సంప్రదించే వరకు ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాక.. హోంశాఖ అభిప్రాయం కోసం పంపించారు. అయి తే హోంశాఖ ఇందుకు నిరాకరించినట్లు అటవీ అధికారవర్గాల సమాచారం. అటవీ ప్రాంతాల్లోని అధికారులకు ఆయు« దాలు అందజేస్తే అవి తీవ్రవాదులు, నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడే ప్రమాదముందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల సహకారం తీసుకోండి.. అటవీ అధికారులకు పోలీస్ స్టేషన్ మాదిరిగా ఒక స్టేషన్, ఆయుధాలు భద్రపరిచే ‘బెల్రూమ్’వంటివి లేకపోవడాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అదీగాక ఆయుధాలను ఉపయోగించడంలో అటవీ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడాన్ని కూడా హోంశాఖ ఎత్తిచూపినట్టు తెలుస్తోంది. ఏవైనా ఘటనలు జరిగితే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచిస్తూ ఈ ప్రతిపాదనను అటకెక్కించినట్లు సమాచారం. చదవండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?! -
లోన్ యాప్స్ వేధింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ
సాక్షి, అమరావతి: లోన్ యాప్స్ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్ ఫ్రీ నంబర్ 1930ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లోన్ యాప్స్ వేధింపులపై 1930కి ఫిర్యాదు చేయాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బ్యాంక్ వివరాలు, ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని హెంశాఖ హెచ్చరించింది. -
హామీలపై కేంద్ర హోంశాఖతో భేటీ.. రాజధాని కోసం రూ.29వేల కోట్లు..
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలున్నాయి. వీటిలో 7 అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా.. మరో ఏడు అంశాలు ఏపీకి సంబంధించినవి ఉన్నాయి. కాగా, సమావేశం సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.20వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని తెలిపింది. షీలాబేడీ కమిటీ సిఫార్సుల ప్రకారం 89 సంస్థలను విభజించాలని సూచించింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇవే.. - ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్లో విభజన - షెడ్యూల్-10లోని సంస్థల విభజన - చట్టంలో లేని ఇతర సంస్థల విభజన - ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన - సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన - బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన - ఏపీఎస్సీఎల్, టీఎస్సీఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15 రైస్ సబ్సిడీ విడుదల. ఏపీకి సంబంధించిన అంశాలు ఇవే.. - నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం - ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు - ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు - పన్ను మదింపులో పొరపాట్ల సవరణ - నూతన విద్యాసంస్థల ఏర్పాటు - నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు. -
AP News: అనధికార డిపాజిట్లు ఇక జప్తే..!
సాక్షి, అమరావతి: ఆర్థిక మోసాలు, అనధికార డిపాజిట్ల దందాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో అనధికారికంగా, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడాన్ని నిరోధించేందుకు కఠిన నిబంధనలను రూపొందించింది. అనధికారికంగా సేకరించే డిపాజిట్లు, అటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది. తద్వారా అధిక వడ్డీల ఎరకు మోసపోకుండా సామాన్యులకు రక్షణ కవచాన్ని కల్పించింది. అనధికార డిపాజిట్ల సేకరణపై పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.. ► ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏ సంస్థగానీ, వ్యక్తులుగానీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. ► అనధికారికంగా డిపాజిట్లు సేకరించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నియమించే అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి. ► ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే వాటికి సంబంధించిన వివరాలను ఆ అధికారికి తెలపాలి. ► తమ బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు వెల్లడించలేకున్నా వాటిని అనధికారిక డిపాజిట్లుగానే పరిగణిస్తారు. ► అడిగిన వివరాలు చెప్పకుండా పరారైతే సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను న్యాయస్థానానికి నివేదిస్తారు. ► ఇక అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, అలా సేకరించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులనూ జప్తు చేసే అధికారం ఆ అధికారికి ప్రభుత్వం ఇచ్చింది. ఆస్తుల జప్తునకు సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి సమర్పిస్తారు. ► స్థానిక పోలీసు అధికారులతో కలసి ఆ వ్యక్తులు, సంస్థల ఆస్తులు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను కూడా ఆ అధికారి పరిశీలించవచ్చు. వీటికి మినహాయింపు డ్వాక్రా గ్రూపులు, చేనేత, స్వగృహ సహకార సంఘాలు, గుర్తింపు పొందిన మతపరమైన సంస్థలకు మినహాయింపు నిచ్చారు. ఆ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు ఏడాదికి గరిష్టంగా రూ. 10 వేల వరకు చేసే డిపాజిట్లను అనధికారిక డిపాజిట్లుగా పరిగణించరు. మతపరమైన సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు, వేద పాఠశాలలు, గోశాలల నిర్వహణకు సేకరించే డిపాజిట్లకు కూడా ప్రభుత్వం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. డిపాజిట్దారుల సొమ్ముకు రక్షణ సామాన్యులు అవగాహన లేకుండా అనధికారిక డిపాజిట్లు చేస్తే.. వారి సొమ్ముకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించింది. అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, ఆ సంస్థల ఆస్తులను వెంటనే జప్తు చేస్తారు. ఆ విధంగా జప్తు చేసిన నగదు, ఆస్తులను ఇతరులకుగానీ ఇతర సంస్థలకుగానీ బదిలీ చేయడానికి వీల్లేదు. కేసు పరిష్కారమైన తరువాత డిపాజిటర్లకు వారి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సెక్యూరిటీ ఏజెన్సీలు పాటించాల్సిన నిబంధనలు, సెక్యూరిటీ సిబ్బంది నియామక అర్హతలు, వారికి ఇవ్వాల్సిన కనీస శిక్షణ ప్రమాణాలను నిర్దేశించింది. విధివిధానాలను పాటించే ఏజెన్సీలకే లైసెన్సులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం
అగ్నిపథ్ స్కీమ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్(Central Armed Police Forces), అసోం రైఫిల్స్లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇవే.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. -
మన పంతం అవినీతి అంతం
అవినీతిపై ఫిర్యాదులకు యాప్ ప్రజలు అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. దిశ మాదిరిగానే ఏసీబీకి నెల రోజుల్లో ప్రత్యేక యాప్ను తీసుకువచ్చి, కార్యాచరణ సిద్ధం చేయాలి. అవినీతిపై ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. తమ వద్దనున్న ఆడియో, వీడియో ఆధారాలతో సహా పత్రాలను నేరుగా అప్లోడ్ చేయొచ్చు. వాటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలి. ఆ యాప్కు వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్ట వేయాలి. డ్రగ్స్, గంజాయిలను పూర్తిగా నిరోధించాలి. మన పిల్లలు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. విద్యా సంస్థలపై పూర్తిగా నిఘా ఉంచాలి. జూనియర్ కాలేజీ మొదలు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల వరకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతి అన్నదే ఉండకూడదు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లంచాలన్న మాటే వినిపించకూడదు. ఏసీబీ ప్రధాన విధి అదే. అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదని, ఎక్కడా అవినీతి అన్నది కనిపించకూడదని చెప్పారు. ఏసీబీకి ఇది ప్రాథమిక విధి కావాలని, అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాలపై ఏసీబీ మరింతగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నందున, భవిష్యత్తులో కూడా ఈ వ్యవస్థలో అవినీతి కనిపించకూడదని.. అందుకోసం అవసరమైన ఎస్ఓపీలు తయారు చేయాలని ఆదేశించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలు వస్తున్నాయి. సర్వేయర్లు వస్తున్నారు. భూముల పంపకాల వల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. అవినీతి చోటు చేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి’ అని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాల్లో అవినీతికి, లంచాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. మూడేళ్లు కాకముందే ప్రజలకు రూ.1.35 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పద్ధతిలో ఇచ్చామన్నారు. మధ్యవర్తులు లేకుండా ఎక్కడా పైసా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేశామని, వచ్చే రెండేళ్లతో కలిపితే సుమారు రూ.2.5 లక్షల కోట్లు ప్రజలకు అందించనున్నామని తెలిపారు. దేవుడి దయవల్ల ఎలాంటి అవినీతికి చోటు లేకుండా ఇవన్నీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. హోం శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థ బలోపేతం ► అవినీతి నిరోధానికి 14400 టోల్ఫ్రీ నంబరు పెట్టాం. ఈ నంబరుకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఏసీబీ విధులేమిటి, ఎలా పని చేస్తుందన్నది విస్తృతంగా ప్రజలకు తెలియాలి. అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్ పంపించినా సరే చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి. ► మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థను బలోపేతం చేయాలి. దిశ, ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), ఏసీబీలకు మండల స్థాయిల్లో స్టేషన్లు ఉండాలి. ఈ మూడింటినీ పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి. ► అవినీతి నిరోధానికి ఒక యాప్ను పెట్టాలి. లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు పడాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి సమర్థవంతంగా అమలు చేయాలి. ఎలాంటి అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలి. ► ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టి పెట్టాలి. సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలి. యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలనే సూచనలను ఆ హోర్డింగ్స్లో పొందుపరచాలి. మరింత సమర్థంగా ‘దిశ’ వ్యవస్థ ► మహిళా భద్రత కోసం దిశ వంటి కార్యక్రమాన్ని మునుపెన్నడూ ఎవరూ చేపట్ట లేదు. మనమే తొలిసారిగా దిశ వ్యవస్థను తీసుకువచ్చాం. హోంమంత్రి, డీజీపీ ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసేట్టు చూడాలి. ► ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు భద్రతకు భరోసా లభించినట్లే. దిశ యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు అటూ ఇటూ ఊపినా.. 10 – 15 నిమిషాల్లో పోలీసులు వస్తారు. పోలీసులు స్పందించే సమయం (రెస్పాన్స్ టైం)ను ఇంకా తగ్గించడంతో పాటు బాధిత మహిళలకు కచ్చితంగా సహాయం అందాలి. ► ఎంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకోగలిగితే అంత వేగంగా నేరాన్ని నివారించగలుగుతాం. దాంతో మహిళలు, బాధితులకు భద్రత కల్పించే విషయంలో గొప్ప మార్పు వస్తుంది. దిశను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన ప్రోటోకాల్స్ రూపొందించాలి. ► ఇప్పటి వరకు 1.24 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మన లక్ష్యం నేరాన్ని నివారించడమే కాదు.. ఆ నేరానికి యత్నించిన వ్యక్తికి శిక్ష విధించడం. ఈ మొత్తం ప్రక్రియలో దిశ వ్యవస్థ అత్యంత సమర్థంగా పని చేయాలి. ఈ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఎటువంటి ప్రతిపాదనలనైనా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. నిఘా మరింత పటిష్టం కావాలి ► రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, రవాణాను ఉక్కుపాదంతో అణచి వేయాలి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కు ప్రభుత్వం నిర్దేశించిన కార్యకలాపాలు అత్యంత కీలకం. ఎస్ఈబీ కోసం ఓ కాల్ సెంటర్ నంబర్ను అందుబాటులోకి తేవాలి. ► ఎక్కడ ఏం జరిగినా మనకు తక్షణం సమాచారం వచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఏ సమాచారం వచ్చినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపైనే కాదు.. మూలాల్లోకి వెళ్లి ఆ వ్యవస్థలను కూకూటి వేళ్లతో సహా పెకలించాలి. ► చీకటి సామ్రాజ్యాల్లో జరిగే కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టాలి. అందుకోసం నిఘాను పటిష్ట పరచాలి. టయర్ వన్ సిటీలలో డ్రగ్స్ ఘటనలు చూశాం. అలాంటివి మన దగ్గర కూడా జరుగుతున్నాయా అన్నదానిపై దృష్టి పెట్టాలి. మన పిల్లలు, మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలి. మనం చేయకపోతే భవిష్యత్ తరం ఫెయిల్ అవుతుంది. ► మన పిల్లలకు మంచి భవిష్యత్ అందించే వాతావరణాన్ని అందించాల్సిన బాద్యత మనదే. కొందరి జీవితాలు, కొన్ని కుటుంబాలను నాశనం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు. అందుకోసం పోలీసులు అత్యంత సమర్థంగా పని చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా నివేదికలు ఇవ్వాలి ► అవినీతి నిరోధం, దిశ వ్యవస్థ, ఎస్ఈబీ పనితీరుకు సంబంధించి మనం చర్చించుకున్న అంశాల్లో మన రాష్ట్రంలో పరిస్థితులను మదింపు చేయండి. ప్రతి నెల నేను నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి ఏ స్థాయిలో మెరుగు పడ్డామో బేరీజు వేసి నివేదిక ఇవ్వండి. ► ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కూడా దిశ, ఎస్ఈబీ, ఏసీబీ కార్యకలాపాలు, యాప్స్ వినియోగంపై అవగాహన కల్పించాలి. ► దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి సలహాలు, సూచనలను నోటిఫికేషన్స్ రూపంలో పంపించాలి. తద్వారా ఏదైనా ఆపద ఎదురవ్వగానే యాప్ను చురుగ్గా ఉపయోగించగలరు. నేర నిర్ధాణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అందుకు అవసరమైన వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఈ సమీక్షలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ, దిశ ఎస్ఈబీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం జగన్
-
అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులను ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ తేవాలని ఆయన అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం.. విద్యాసంస్థలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించాలని తెలిపారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ఎప్పటికీ వైఎస్ జగన్కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి -
ఏ కేసులోనూ అరెస్టు చేయొద్దని ఎలా ఆదేశిస్తారు ?
సాక్షి, హైదరాబాద్: పలువురిని మోసం చేశాడంటూ నమోదైన కేసుల్లో శ్రీధర్ కన్వెన్షన్ ఎండీ ఎస్.శ్రీధర్రావు ఆయన భార్య సంధ్యలను హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన ఏ కేసులోనూ అరెస్టు చేయరాదంటూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తమను మోసం చేశాడంటూ అనేక మంది వీరిపై ఫిర్యాదు చేస్తున్నారని, ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. శ్రీధర్రావు, సంధ్యలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, దర్యాప్తు పురోగతి ఏంటో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది. క్రిమినల్, సివిల్, వాణిజ్య వివాదాల్లో శ్రీధర్రావు, సంధ్యలను అరెస్టు చేయరాదంటూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మణికొండకు చెందిన ఖుషిచంద్ వడ్డె దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని శ్రీధర్రావు, సంధ్యలను గతంలో ఆదేశించినా స్పందించకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వీరి తరఫు సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ అభ్యర్థించడంతో ఒక రోజు గడువునిస్తూ విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. (చదవండి: ఆఫ్లు ఆఫయ్యాయి!) -
RRR Movie Tickets Prices: ఆర్ఆర్ఆర్ టికెట్ల ధరలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ నెల 18న ప్రభుత్వానికి టికెట్ల ధరల పెంపుతోపాటు ఐదో షో నిర్వహణకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంశాఖ... ఏసీ థియేటర్లలో ఈ నెల 25 నుంచి 27 వరకు అంటే 3 రోజులపాటు టికెట్పై రూ. 50 పెంచుకొనేందుకు అవకాశం కల్పించింది. అలాగే 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వరకు రూ.30 పెంచుకొనేలా వెసులుబాటు కల్పించింది. రిక్లైనర్, మల్టీఫ్లెక్స్, లార్జ్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెల 25 నుంచి 27 వరకు టికెట్పై రూ. 100 పెంచుకొనేందుకు అంగీకరించింది. ఆ తర్వాత 28 నుంచి వచ్చే నెల 3 వరకు టికెట్పై రూ. 50 పెంచుకునేలా అవకాశం కల్పించినట్టు హోంశాఖ ఇన్చార్జి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు సైతం అనుమతిచ్చినట్లు ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఇక ఓఎస్ ప్రమోషన్లకు చెల్లు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల్లో సమస్యలు రాకుండా, సీనియారిటీ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొత్త సర్వీస్ రూల్స్ను పోలీస్ శాఖ తీసుకొస్తోంది. ఔట్ ఆఫ్ సర్వీస్ కింద తాత్కాలిక పద్ధతిలో ఇచ్చే పదోన్నతులను ఆపేయాలని, యాగ్జిలేటరీ ప్రమోషన్లకు ప్రత్యేక రూల్ ఉండాలని ప్రతిపాదన చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రతిపాదనలను హోం శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆ ప్రతిపాదనలను న్యాయ శాఖకు హోం శాఖ పంపించే ఏర్పాట్లు చేస్తోంది. న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం ఆమోదించనున్నట్టు తెలిసింది. నాలుగేళ్లు స్టడీ..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూపొందించిన కఠినమైన పోలీస్ సర్వీసు రూల్స్ను రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సమీక్షించింది. సర్వీస్ రూల్స్లో అనుభవమున్న రిటైర్డ్ అధికారులతో కమిటీ వేసి నాలుగేళ్లు అధ్యయనం చేసింది. పాత సర్వీస్ రూల్స్ను అతిక్రమించి విచక్షణాధికారం పేరుతో గతంలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల కోర్టుల్లో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రతి కోర్టు తీర్పును కమిటీ అధికారులు ముందు పెట్టుకొని కొత్త రూల్స్ను రూపొందించినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. సీనియారిటీ విషయంలోనే 2,800 కేసులను కమిటీ అధ్యయనం చేసిందని తెలిసింది. యాగ్జిలేటరీలో ప్రమోషన్లు ఇలా ఇద్దాం..: మావోయిస్టు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణలో బాగా పనిచేసే పోలీస్ సిబ్బంది, అధికారులకు యాగ్జిలేటరీ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన ఓ జీవో ద్వారానే ఇలా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రత్యేకంగా రూల్ అంటూ సర్వీస్ రూల్స్లో లేదు. దీంతో సమయం ప్రకారం పదోన్నతి రాని అధికారులు అభ్యంతరం తెలపడం, కోర్టులకు వెళ్లడంతో సమస్యలు వచ్చి బ్యాచ్ల మధ్య సీనియారిటీ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో యాగ్జిలేటరీ పదోన్నతుల్లో కీలకమైన రూల్స్ను కమిటీ ప్రతిపాదించింది. ఇలా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అతని కన్నా ముందు బ్యాచ్ చివరి స్థానంలో, అతడి బ్యాచ్ ముందు వరుసలో సీనియారిటీ కల్పిస్తే సమస్యలుండవని వివరించింది. ఓఎస్ పదోన్నతుల్లో సమస్యలు పోలీస్ శాఖలో డ్యూటీలో మెరుగైన సేవలందించే వాళ్లకు ఓఎస్ (ఔట్ ఆఫ్ సర్వీస్)కింద తాత్కాలిక పద్ధతిలో పదోన్నతి కల్పించే వారు. అయితే ఆ హోదాలోకి సీనియారిటీ ప్రకారం వేరే అధికారులు పదోన్నతి పొందితే ఓఎస్ పద్ధతిలో పనిచేస్తున్న అధికారి మళ్లీ పాత హోదాలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొంత మంది అధికారులు, సిబ్బంది ఓఎస్పై కోర్టులకు వెళ్లి ఓఎస్ హోదాలోనే ఉండేలా తీర్పులు తెచ్చుకున్నారు. దీంతో సర్వీస్ సమస్యలు ఎక్కువయ్యాయి. పాత సర్వీస్ రూల్స్ను సమీక్షించిన కమిటీ.. ఓఎస్ పద్ధతిలో తాత్కాలిక పదోన్నతులను ఆపాలని ప్రతిపాదించింది. -
జస్టిస్ కనగరాజ్ నియామక ఉత్తర్వుల అమలు నిలిపివేత
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు 4 వారాల పాటునిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్లతో పాటు జస్టిస్ కనగరాజ్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లదంటూ న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్బాబు వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ కనగరాజ్ వయసు 78 సంవత్సరాలని, చట్ట ప్రకారం చైర్మన్గా నియమితులయ్యే వ్యక్తి 65 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగేందుకు వీలుందని తెలిపారు. వయసురీత్యా జస్టిస్ కనగరాజ్ నియామకం చట్ట నిబంధనలకు విరుద్దమని ఆయన వివరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన ప్యానల్ నుంచి చైర్మన్ నియామకం జరగాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మానం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వయసు రీత్యా జస్టిస్ కనగరాజ్ నియామకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందువల్ల ఆయన నియామక ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నామని స్పష్టం చేసింది. -
పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్ అథారిటీలు
సాక్షి, హైదరాబాద్: విధినిర్వహణలో అసలత్వం, ఏకపక్షంగా వ్యవహరించడం, వేధించడం, బాధితులను పట్టించుకోకపోవడం వంటి పోలీస్ మిస్ కండక్ట్లపై రాష్ట్ర పోలీసు శాఖ కొరడా ఝుళిపించనుంది. పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు పోలీస్ కంప్లైంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఫిర్యాదులపై అథారిటీలు విచారణ జరిపి తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకుగాను డీజీపీకి సిఫారసు చేస్తాయి. పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఇదివరకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒకటి, వరంగల్, హైదరాబాద్ రీజియన్ల వారీగా మరో రెండు కంప్లైంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ, వాటికి చైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అథారిటీల చైర్మన్, సభ్యుల నియామకం రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్గా జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ (రిటైర్డ్), సభ్యుడిగా విశ్రాం త ఐపీఎస్ అధికారి నవీన్ చంద్, సభ్యకార్యదర్శిగా శాంతిభద్రతల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ కొనసాగుతారు. హైదరాబాద్ రీజియన్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్గా విశ్రాంత జిల్లా జడ్జి కె.సంగారెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, సభ్యకార్యదర్శిగా వెస్ట్ జోన్ ఐజీ వ్యవహరిస్తారు. వరంగల్ రీజియన్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా జిల్లా విశ్రాంత జడ్జి వెంకటరామారావు, విశ్రాంత అడిషనల్ కమిషనర్ జె.లక్ష్మినారాయణ, సభ్యకార్యదర్శిగా వరంగల్ ఐజీ వ్యవహరిస్తారు. డీజీపీ, రాష్ట్ర హెచ్చార్సీ కార్యదర్శి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (స్పెషల్ సి) డిపార్ట్మెంట్లు సభ్యులుగా ఉంటారు. వీటి పనితీరు, విధివిధానాలను పోలీసు శాఖ త్వరలో వెలువరించనుంది. ఎవరు దేని కిందకు వస్తారు? డీఎస్పీ అంతకంటే కిందిస్థాయి పోలీసులపై రీజియన్ పోలీసు కంప్లైంట్ అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. అడిషనల్ ఎస్పీ అంతకంటే పెద్ద ర్యాంకు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయడానికి స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఆశ్రయించవచ్చు. విదేశాల్లో చాలా కాలం నుంచే.. పోలీసులకు ఉండే అధికారాలు దుర్వినియోగం కాకుండా విదేశాల్లో ఓవర్సైట్ కమిటీలు ఉన్నాయి. బ్రిటన్, అమెరికా లాంటి విదేశాల్లో స్థానిక విశ్రాంత అధికారులతో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలీసులపై వచ్చే ఆరోపణలు, ఫిర్యాదులపై ఇవి విచారణ జరుపుతాయి. పనితీరుపై సమీక్ష, పర్యవేక్షణ కూడా చేస్తాయి. -
ఆ కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పాత గుంటూరు పోలీసుస్టేషన్పై దాడి కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో యువతపై నమోదైన కేసులను వెనక్కు తీసుకుంటూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల్లో నిందితులైన వారిపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా.. 2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్పై జరిగిన దాడికి సంబంధించిన అధికారులు అప్పట్లో ఆరు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (అర్ధరాత్రి ఉద్రిక్తత.. పాత గుంటూరులో 144 సెక్షన్) -
పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలు వద్దు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోంశాఖ ఆదేశాలను ఉల్లంఘించిన కంపెనీలూ, యాజమా న్యాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ మే 15న ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 12కి సుప్రీంకోర్టు పొడిగించింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన సమయంలో ఎటువంటి పనీ జరగకపోయినప్పటికీ, కార్మికుల వేతనాల్లో ఎటువంటి కోతలూ విధించరాదనీ, పూర్తి జీతాలు చెల్లించాలంటూ హోంమంత్రిత్వ శాఖ కంపెనీలకూ, యాజమాన్యాలకూ సర్క్యులర్ జారీచేసింది. ఎవ్వరినీ ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దనీ, వేతనాల్లో కోత విధించవద్దంటూ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కి లేఖలు కూడా రాసింది. వంద శాతం వేతనం ఇవ్వకపోవడాన్ని నేరపూరితమనీ, వారిపై చర్యలు తీసుకొంటామన్న హోంమంత్రిత్వ శాఖ సర్క్యులర్లోని అంశాల పట్ల జస్టిస్ అశోఖ్ భూషణ్, ఎస్.కె.కౌల్, ఎంఆర్.షాల తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ సర్క్యులర్ని సవాల్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సహా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. చిన్న పరిశ్రమలకు రాష్ట్రాలు చేయూతనివ్వాల్సి ఉంటుందనీ, దీనిపై యాజమాన్యాల్లోనూ, కార్మికుల్లోనూ చర్చలు జరగాలని కోర్టు అభిప్రాయపడింది. -
సరుకు రవాణా వాహనాలకు పాస్లు అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసిన వాహనాలను పాస్ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్లు అవసరం లేదని, డ్రైవర్కు లైసెన్స్ ఉంటే చాలునని తేల్చి చెప్పింది. దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది. -
1,823 కేసులు.. 67 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 1,075కు చేరుకోగా కేసుల సంఖ్య 33,610కు పెరిగింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 67 మంది చనిపోగా కొత్తగా 1,823 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,162 కాగా 8,372 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన జాబితాలో మహారాష్ట్రలో 32 మంది, గుజరాత్ 16, మధ్యప్రదేశ్ 11, ఉత్తరప్రదేశ్లో ముగ్గురు, తమిళనాడు, ఢిల్లీల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 432 మంది, గుజరాత్లో 197 మంది, మధ్యప్రదేశ్లో 130, ఢిల్లీలో 56 మంది, రాజస్తాన్లో 51 మంది, ఉత్తరప్రదేశ్లో 39 మంది, తమిళనాడులో 27 మంది, బెంగాల్లో 22 మంది, కర్ణాటకలో 21 మంది, పంజాబ్లో 19 మంది చనిపోయారు. 60వేల మందిని పంపించాం 72 దేశాలకు చెందిన 60వేల మందిని స్వదేశాలకు పంపించినట్లు హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను రప్పించేందుకు ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ విషయంలో అక్కడి దౌత్య సిబ్బంది అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. మన దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత గల్ఫ్తోపాటు ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు నేవీ, వైమానిక దళం సహకారం తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది. -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
వీఐపీల భద్రతకు ఇక ‘ఎన్ఎస్జీ’ దూరం!
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) సిబ్బందిని అత్యంత ప్రముఖుల భద్రత విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలుగా ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ వీఐపీల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 1984లో ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీరికి ప్రముఖుల భద్రత బాధ్యతలు లేవు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన దళంగా ఉండేది. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అత్యంత ప్రముఖుల భద్రత బాధ్యతలో ఈ దళం ఉంది. ఇకపై వీరందరి భద్రత విధుల్లో నుంచి ఎన్ఎస్జీని తప్పించనున్నారు. వీరి భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర పారామిలటరీ దళాలకు అప్పగించనున్నారని ఎన్ఎస్జీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇకపై ఎన్ఎస్జీ కమాండోలను ఉగ్రవాద, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు పరిమితం చేయనున్నామని హోం శాఖ అధికారులు తెలిపారు. -
సాయుధ బలగాల కుదింపు
న్యూఢిల్లీ: పారామిలటరీ బలగాలను కుదించి, పోరాటపటిమను పెంచే వివిధ ప్రతిపాదనలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘ఒకే సరిహద్దు.. ఒకే సైన్యం’విధానంలో భాగంగా సశస్త్రసీమా బల్(ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగాలను విలీనం చేయడం వంటి ప్రతిపాదనలున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను మరో ఆరునెలల్లో అందజేయనుంది. సీఆర్పీఎఫ్తో ఉగ్రవాద వ్యతిరేక కమాండోలు, ఎన్ఎస్జీలను కూడా ఏకం చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఉగ్ర వ్యతిరేక పోరు, హైజాక్ ఘటనలు, మావోయిస్టు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఈ రెండు విభాగాలను ఒకే కమాండ్ కిందికి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హోం శాఖ నేతృత్వంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)తోపాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీలున్నాయి. -
సెక్యూరిటీ గార్డుల సంక్షేమానికి ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ముసాయిదా విధాన పత్రాన్ని రూపొందించింది. ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సెంట్రల్ (అమెండ్మెంట్) మోడల్ రూల్స్, 2019’ ముసాయిదాపై అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాల్సిందిగా వ్యక్తులు, సంస్థలను కోరుతూ హోం శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 90 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు అంచనా. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు లైసెన్స్లిచ్చేందుకు ఇప్పటికే హోం శాఖ ఒక పోర్టల్ను ప్రారంభించింది. లైసెన్సుల జారీకి ఆయా ఏజెన్సీల డైరెక్టర్లు, భాగస్వామ్యులు, యజమానుల వివరాలను వ్యక్తిగతంగా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం లేదని కూడా గతంలో హోంశాఖ ప్రకటించింది. ముసాయిదా నిబంధనలను mha.gov.in/sites/default/files/private SecurityAgenies&06112019.pdf నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో హోంశాఖ పేర్కొంది. అభిప్రాయాలు, సూచనలను us&pm@nic.inMకు డిసెంబర్ 6 లోపు పంపించాలని కోరింది. -
భద్రతకు రూ. 4,540 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం నుంచి పోలీసు శాఖకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూవస్తోంది. తాజా బడ్జెట్లో హోంశాఖకు రూ.4,540 కోట్ల నిధులు కేటాయించింది. అయితే గతేడాది కంటే ఈ సారి బడ్జెట్లో భద్రతకు రూ.1,250 కోట్ల మేర కేటాయింపులు తగ్గడం గమనార్హం. గస్తీకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఇప్పటికే వేలాదిగా వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చింది. ఇందులో 2014లో 3,800, 2018లో 11,500 వాహనాలు ఆ శాఖకు అందజేసింది. నాలుగున్నరేళ్లలో దాదాపుగా 15 వేల వాహనాలు (ఇందులో ఇన్నోవాలు, బస్సులు, బైకులు తదితరాలు) సమకూర్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చింది. దశలవారీగా ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించే యోచనలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉంది. వాస్తవానికి ఈ నిర్మాణాన్ని డిసెంబర్లోనే ప్రారంభిస్తారని వార్తలు వచ్చినా.. అది సాకారం కాలేదు. ఇటీవల రాచకొండ కమిషనరేట్ నూతన భవనాన్ని రూ.5.1 కోట్లతో పూర్తిచేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన కొత్త కమిషనరేట్లు సిద్దిపేట, రామగుండం నిర్మాణం కూడా వేగం పుంజుకుంది. నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలతోపాటు ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, కొత్త మండలాల్లో మోడల్ పోలీస్ స్టేషన్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన 18,000 పోస్టుల భర్తీ చేపడితే పోలీసులపై పనిభారం కొంతమేర తగ్గనుంది. -
గవర్నర్కు ఆ అధికారం లేదు
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్ని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు ఎలాంటి అధికారాలు లేవని కేంద్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాజీవ్ హంతకుల్ని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ నేతృత్వంలోని బృందం దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నందున.. దోషులకు శిక్ష తగ్గింపు లేదా రద్దు నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ సంప్రదించాల్సి ఉంటుందని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య వెనుక భారీ కుట్ర కోణంపై విచారణ కొనసాగుతోందని, న్యాయ సాయం కోసం వివిధ దేశాలకు లేఖలు రాశామని సీబీఐ సారథ్యంలో మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. సీఆర్పీసీ, 1973లోని సెక్షన్ 435 ప్రకారం శిక్ష తగ్గింపు, రద్దు కోసం కేంద్రంతో సంప్రదింపుల అనంతరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
నయీమ్ కేసులో వారికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీమ్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సస్పెండ్కు గురయిన పోలీసు అధికారులకు ఊరట లభించింది. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఆతనితో కలసి పలువురు పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నయీమ్కు అండగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్తోపాటు ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తాజాగా వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో వారు శుక్రవారం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. -
ప్రమాదంలో ప్రధాని భద్రత
న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు ముప్పు ఏర్పడిందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ప్రధాని భద్రతకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు కొత్తగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అనుమతి లేకుండా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ప్రధానికి దగ్గరగా వెళ్లడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి ఊహించని ముప్పు పొంచి ఉందని, 2019 ఎన్నికలకు సంబంధించి సంఘ వ్యతిరేక శక్తులకు ప్రధాని మోదీనే అత్యంత విలువైన లక్ష్యమని ఆ మార్గదర్శకాల్లో హెచ్చరించారు. ‘ఎవరూ కూడా, చివరకు మంత్రులు కూడా ఎస్పీజీ అనుమతి లేకుండా ప్రధాని దగ్గరకు వెళ్లడానికి వీల్లేదు’ అని వాటిలో స్పష్టంగా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని మోదీనే కీలక ప్రచారకర్తగా వ్యవహరించాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రోడ్ షోల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రధానికి ఎస్పీజీ సూచించినట్లు సమాచారం. రోడ్షోల సమయంలో దాడులకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, అందువల్ల ఎక్కువగా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని, బహిరంగ సభలకు భద్రత ఏర్పాట్లు చేయడం కొంతవరకు సులభమవుతుందని ఎస్పీజీ ప్రధానికి వివరణ ఇచ్చింది. తాజా మార్గదర్శకాలను ప్రధాని భద్రతను పర్యవేక్షించే క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అధికారులకు వివరించారు. అవసరమైతే, మంత్రులను, అధికారులను కూడా తనిఖీ చేసేందుకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా మావోల ప్రభావం అధికంగా గల రాష్ట్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి.. ఆయా రాష్ట్రాల పోలీసు చీఫ్లు ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశించింది. మావోల లేఖ వల్లనే!: రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోదీని హతమార్చేందుకు అవకాశాలున్నాయంటూ పలు వివరాలున్న ఒక లేఖను పుణె పోలీసులు ఇటీవల బహిర్గత పర్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మావోయిస్టు సానుభూతిపరుల నుంచి ఆ లేఖను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దాంతో ప్రధాని భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు, ఇటీవలి పశ్చిమబెంగాల్ పర్యటన సమయంలో.. ఆరంచెల భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ ఓ వ్యక్తి మోదీకి దగ్గరగా వచ్చిన ఘటన భద్రతా దళాలకు ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలోనే.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్లతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. -
‘పద్మ’ అవార్డుల కోసం 1200 ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అసాధారణ, ప్రత్యేక ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ‘పద్మ’ అవార్డుల కోసం 1,200పైగా ప్రతిపాదనలు అందినట్లు హోంశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో 1,207 ప్రతిపాదనల పరిశీలన పూర్తయిందని ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీలోగా నామినేషన్లు, ప్రతిపాదనలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 1954 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ప్రకటిస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు, ప్రసిద్ధ సంస్థలు, భారతరత్న, పద్మ విభూషణ్ గ్రహీతల నుంచి ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు వెల్లడించింది. ప్రతిపాదనలను ఆన్లైన్లో www.padmaawards.gov.in లోనే పంపాలని కోరింది. -
మోదీ భద్రత మరింత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని హత్యచేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారని ఇటీవల లేఖలు లభ్యమైన నేపథ్యంలో ప్రధాని భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్ రాజీవ్ జైన్లు సోమవారం ఢిల్లీలో సమావేశమై ప్రధాని భద్రతను సమీక్షించినట్లు వెల్లడించింది. అన్ని సంస్థలతో సంప్రదించి ప్రధాని భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్నాథ్ అధికారుల్ని ఆదేశించినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. నిషేధించబడిన సీపీఐ(మావోయిస్టు)తో సంబం«ధాలు కొనసాగిస్తున్న వ్యక్తుల ఇళ్లలో ఇటీవల నిర్వహించిన సోదాల్లో ప్రధాని హత్యకు కుట్ర పన్నిన లేఖలు లభ్యమయ్యాయని పుణె పోలీసులు కోర్టుకు తెలిపారు. -
అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల కేసులు, మైనర్లపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు కేంద్ర హోంశాఖలో మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక విభాగం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో కేంద్ర హోంశాఖలో మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని కింద అత్యాచారాల నియంత్రణ, ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకోవడం, నిర్భయ ఫండ్ మేనేజ్మెంట్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్), నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విభాగాలుంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కోర్టుల్లో కేంద్ర నిధులతో నియామకాలు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అత్యాచారాలు, లైంగిక వేధింపుల నియంత్రణకు ఏర్పాటు చేసే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేంద్ర నిధులతో నియామకాలు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే బాధితుల పక్షాన పోరాడేందుకు అదనపు పబ్లిక్ ప్రాస్యిక్యూటర్లను నియమించనున్నారు. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, హైకోర్టు ఆధ్వర్యంలోనే వీటి నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా అత్యాచారాల కేసుల్లో శిక్షల శాతం చాలా తక్కువగా ఉండటంతో.. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పటిష్టవంతమైన దర్యాప్తు, త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిధులతో దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లకు అత్యాధునిక ఫోరెన్సిక్ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. ప్రతీ పోలీస్ అధికారికి దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలపై శిక్షణ ఇవ్వనుంది. అలాగే ప్రతీ రాష్ట్రంలో ఒకటి లేదా రెండు స్పెషలైజ్డ్ ఫోరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేయనుంది. అత్యాచారాల కేసుల దర్యాప్తులో సహకరించేందుకు ప్రతీ పోలీస్స్టేషన్కు ఎన్సీఆర్బీ, సీసీటీఎన్ఎస్ డాటాబేస్ను అనుసంధానించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ (పోస్కో చట్టం) 2012, ఐపీసీ 1860లోని కొన్ని సెక్షన్లను సవరించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. -
ముగ్గురికి సీఎం సర్వోన్నత పోలీసు పతకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ‘తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకాల’ను ప్రకటించారు. దీంతోపాటు పోలీసు, ప్రత్యేక భద్రతా దళాలు, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి పోలీసు సేవా పతకాలను ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్, ఏసీబీ కేంద్ర కార్యాలయం ఇన్స్పెక్టర్ జి.వెంకటేశం, ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్ పి.రాములు ‘తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకాల’కు ఎంపికయ్యారు. ఇక శౌర్య పతకానికి 15 మంది, మహోన్నత సేవా పతకానికి 17 మంది, ఉత్తమ సేవా పతకానికి 95 మంది, కఠిన సేవా పతకానికి 53 మంది, సేవా పతకానికి 339 మందిని ఎంపిక చేశారు. ఇక ప్రత్యేక భద్రత విభాగంలో ఉత్తమ సేవా పతకానికి నలుగురు, సేవా పతకానికి 15 మంది.. అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవా పతకానికి ఒకరు, సేవా పతకానికి 14 మంది ఎంపికయ్యారు. నిఘా విభాగంలో మహోన్నత సేవా పతకానికి ముగ్గురిని, ఉత్తమ సేవా పతకానికి ఇద్దరిని, సేవా పతకానికి పది మందిని ఎంపిక చేశారు. ఏసీబీలో మహోన్నత సేవా పతకానికి ఒకరు, ఉత్తమ సేవా పతకానికి ఐదుగురు, సేవా పతకానికి 20 మంది ఎంపికయ్యారు. -
జేడీఎస్కు ఆర్థికం, కాంగ్రెస్కు హోం!
న్యూఢిల్లీ/బెంగళూరు: కన్నడనాట మంత్రి పదవుల పంపిణీ ఓ కొలిక్కివచ్చింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణం ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి పదవి జేడీఎస్కు, హోం శాఖ కాంగ్రెస్కు ఇచ్చేట్లు ఒప్పందం కుదిరిందని ఆయా పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. రెండు పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో కొనసాగించిన పలు దఫాల చర్చల్లో పదవుల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇక్కడి నేతలతో ఫోన్లో మాట్లాడారని వెల్లడించాయి. పదవుల కేటాయింపు ఒప్పందం తుది దశలో ఉందని తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకోబోయే ముందు కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ బెంగళూరు వెళ్లి తమ పార్టీ నేతలతో మాట్లాడతారని సమాచారం. ‘ మా పార్టీకి ఆర్థిక శాఖ ఇవ్వాలని అంగీకారం కుదిరింది. దీనిపై బెంగళూరు వెళ్లి సీఎంతోపాటు పార్టీ అధినేత దేవెగౌడతో మాట్లాడి ఖరారు చేస్తాం’ అని జేడీఎస్ నేత డానిష్ అలీ తెలిపారు. మే 23వ తేదీన జేడీఎస్కు చెందిన కుమారస్వామి సీఎంగా, కాంగ్రెస్ నేత పరమేశ్వర డెప్యూటీ సీఎంగా ప్రమాణంచేశాక కీలక మంత్రిత్వశాఖలపై రెండు పార్టీలు పట్టుబట్టాయి. నేడు ప్రకటిస్తాం: సీఎం కేబినెట్ విస్తరణ, మంత్రి పదవుల కేటాయింపుపై శుక్రవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఎం కుమారస్వామి చెప్పారు. ‘నాతో పాటు జేడీఎస్ అధినేత దేవెగౌడ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో జరిగిన పరిణామాలపై చర్చలు జరిపి, అంతిమ నిర్ణయం శుక్రవారం ప్రకటిస్తాం’అని చెప్పారు. ఆర్థిక శాఖ విషయమై ఇబ్బందుల్లేవని, అంగీకారానికి వచ్చామని సమాధానమిచ్చారు. -
ఆన్లైన్లో అత్యాచార నిందితుల జాబితా!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడుల వంటి నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో.. వాటి కట్టడి దిశగా కేంద్ర హోం శాఖ చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఏడేళ్ల క్రితం 24,206 మంది లైంగిక వేధింపులకు పాల్పడితే.. 2017లో 96,036 మంది లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా నేరాలకు పాల్పడినవారి ఫొటోలు, వివరాలు, నమోదైన కేసులు, పడిన శిక్షలు తదితర వివరాలన్నింటినీ ఓ ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్’పేరిట డేటాబేస్ను ఏర్పాటు చేసి.. దర్యాప్తు సంస్థలకు, ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. తద్వారా లైంగిక నేరాలకు పాల్పడినవారిని సులువుగా గుర్తించడం, తగిన జాగ్రత్తలు చేపట్టడం వంటి చర్యల ద్వారా ఆయా నేరాలను నియంత్రించే అవకాశముందని భావిస్తోంది. దేశవ్యాప్త వివరాలు ఒకే వెబ్సైట్లో.. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినవారి వివరాలను ఒకేచోట పొందుపరచనున్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినవారి ఫొటోలతో సహా పూర్తి వివరాలు, వారిపై ఉన్న కేసులు, పడిన శిక్షలు తదితర వివరాలన్నింటినీ నమోదు చేసి... దర్యాప్తు సంస్థలకు, ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. మారు మూల ప్రాంతాల్లో ఉన్న పోలీస్స్టేషన్ల నుంచి దేశవ్యాప్తంగా నేరస్తుల డేటా రూపొందించే సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు వరకు అన్ని స్థాయిల్లో ఉపయోగించుకునేలా ఈ వెబ్సైట్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో సీఐడీ పరిధిలో పనిచేసే స్టేట్క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, జిల్లాల్లో పనిచేసే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారులు నోడల్ అధికారులుగా పనిచేస్తారు. జీవితాంతం జాబితాలో.. ♦ తొలిసారి లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల వివరాలను 15 ఏళ్ల పాటు ఈ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తారు. అదే విధంగా ఐపీసీ సెక్షన్లు 376, 354 (ఏ, బీ, సీ, డీ), 377 పరిధిలోని నేరాలకు పాల్పడినవారి వివరాలను కూడా 15 ఏళ్లపాటు నిక్షిప్తం చేస్తారు. పదే పదే లైంగిక వేధింపులు, అత్యాచార నేరాలకు పాల్పడినవారి వివరాలను 25 ఏళ్లపాటు డేటాబేస్లో ఉంచుతారు. ♦ ఇక ఐపీసీ సెక్షన్లు 376 (1), (3,4,5,6) పరిధిలోని నేరాలు, ట్రాఫికింగ్ నేరాలు, 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలపై వేధింపుల (పోస్కో యాక్ట్ పరిధిలోని నేరాలు)కు పాల్పడేవారి డేటాను 25 ఏళ్ల పాటు వెబ్సైట్లో ఉంచుతారు. ఒకవేళ వీరు తిరిగి నేరాలకు పాల్పడితే వారి జీవితాంతం వివరాలు డేటాబేస్లో ఉండిపోతాయి. ♦ తరచూ నేరాలు చేసేవారు (హ్యాబిచువల్ అఫెండర్స్), కిరాతకమైన అత్యాచారాలు, గ్యాంగ్రేపులు, కస్టోడియల్ రేపులు, రేప్ అండ్ మర్డర్ కేసులు నమోదైన వారి వివరాలను వారి జీవితాంతం వెబ్సైట్లో ఉంచుతారు. కేసు కొట్టివేస్తే.. తొలగింపు లైంగిక వేధింపులు, అత్యాచార కేసులను కోర్టులు కొట్టివేస్తే.. ఆయా కేసుల్లోని వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. కోర్టు నుంచి వచ్చిన తుది ఉత్తర్వులకు లోబడి నోడల్ అధికారులు ఈ వివరాలను తొలగిస్తారు. అయితే పదేపదే నేరాలకు పాల్పడేవారి విషయంలో మాత్రం పేర్లను జాబితా నుంచి తొలగించరు. నిఘాతో నియంత్రణ... మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినవారి వివరాలు అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులో ఉండటం వల్ల.. వారిపై నిఘా పెట్టడం, మళ్లీ నేరాలు చేయకుండా నియంత్రించడం సులువు అవుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అంతేగాకుండా ఈ నేరస్తుల జాబితాను అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు కూడా అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. ఇక నిందితులపై అత్యాచారాల, వేధింపుల షీట్స్ తెరవాలని కూడా నిర్ణయించింది. అనుమానితుల ఫొటోలను స్కాన్ చేసి.. జాబితాలో ఉంటే గుర్తించేలా ‘ఫేస్ రికగ్నిషన్’సాంకేతికతను కూడా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్కు కూడా ఈ వెబ్సైట్కు అనుసంధానం చేసి.. నిందితుల వేలిముద్రలనూ నిక్షిప్తం చేయనున్నారు. దీనివల్ల జాబితాలో ఉన్నవారు దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ నేరాలకు పాల్పడినా వెంటనే గుర్తించేందుకు అవకాశం లభించనుంది. అయితే ఈ జాబితాలో నేరం రుజువై శిక్షపడిన వారి వివరాలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దర్యాప్తు విభాగాలకు మాత్రం వారిపై ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ప్రతి వివరాలూ అందుబాటులో ఉంటాయి. -
నక్సల్స్ నిధులకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నక్సలైట్ల ఆదాయ మార్గాలను మూసివేయడంతోపాటు నక్సల్ నేతల ఆస్తులను జప్తు చేయడం కోసం వివిధ దర్యాప్తు సంస్థల అధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ కేంద్ర సంస్థలతోపాటు రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాల వారు కూడా ఉంటారని హోం శాఖకు చెందిన ఓ అధికారి సోమవారం చెప్పారు. ఈ బృందానికి అదనపు కార్యదర్శి స్థాయి వ్యక్తి నేతృత్వం వహిస్తారనీ, ఐబీ, ఈడీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, సీబీఐ, సీబీడీటీలతోపాటు రాష్ట్రాల నిఘా, నేర దర్యాప్తు విభాగాల అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని అధికారి వివరించారు. నక్సల్ నేతలు బలవంతంగా వసూళ్లకు పాల్పడి, అనంతరం ఆ డబ్బును తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కుటుంబ సభ్యుల చదువు, విలాసాల కోసం వినియోగిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో హోం శాఖ తాజా చర్య తీసుకుంది. బిహార్–జార్ఖండ్ కమిటీకి చెందిన సీపీఐ (మావోయిస్టు) నేత ప్రద్యుమ్న శర్మ గతేడాది రూ. 22 లక్షలు కట్టి తన సోదరి కూతురిని ఓ ప్రైవేట్ వైద్యకళాశాలలో చేర్పించారు. అదే పార్టీకే చెందిన సందీప్ యాదవ్ అనే మరో నేత నోట్ల రద్దు సమయంలో రూ. 15 లక్షల విలువైన పాత నోట్లను మార్చుకున్నారు. ఆయన కూతురు ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలో, కొడుకు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు అధికారి తెలిపారు. మరో సీనియర్ నాయకుడు అరవింద్ యాదవ్ కూడా తన సోదరుడి చదువు కోసం రూ. 12 లక్షలు చెల్లించారన్నారు. -
‘ట్విన్ టవర్స్’ నిధులు అదుర్స్
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేసింది. హోంశాఖకు మొత్తం రూ.1389.66 కోట్లు కేటాయించగా... ఇందులో రూ.574.2 కోట్లు (41.3 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు (ఐసీసీసీ) మూడో విడతగా రూ.280.8 కోట్లు కేటాయించడం గమనార్హం. ‘పది లక్షల కళ్ల’ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాజెక్టుకు రూ.140 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.509 కోట్లు కేటాయించగా... ఈసారి కేటాయింపులు రూ.63 కోట్లు పెరిగాయి. పోలీసు అధికారులు ప్రతిపాదనలకు అనుగుణంగానే కేటాయింపులు ఉండటం విశేషం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు రూ.42.97 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి. దాదాపు రెండేళ్ల క్రితం ఏర్పడిన రాచకొండకు పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది. ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు.. బంజారాహిల్స్లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్సీపీసీహెచ్క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.280.8 కోట్లు కేటాయించారు. నిర్మించతలపెట్టిన దాని కంటే ఎత్తు తగ్గడం, తదితర కారణాల నేపథ్యంలో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. మౌలిక వసతులకు రూ.10కోట్లు.. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్లో భాగంగా పోలీసుస్టేషన్ల స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆధునిక హంగులతో కూడిన ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల ఏర్పాటు, ప్రత్యేకంగా రిసెప్షన్ తదితరాల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. కొత్తగా పోలీసుక్వార్టర్స్ నిర్మాణం, అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్, యంత్రసామాగ్రి కొనుగోలు కోసం రూ.40 కోట్లు కేటాయించారు. ‘ట్రాఫిక్ టెక్నాలజీ’కి రూ.10 కోట్లు.. నగర ట్రాఫిక్ విభాగం ప్రమాదాల నిరోధం, నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, విధి నిర్వహణలో పారదర్శకతలకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పథకం కింద ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈ ఏడాది రూ.10 కోట్లు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేకుండా ట్రాఫిక్ నిర్వహణ, ఉల్లంఘనుల గుర్తింపు, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీ లక్ష్యాలుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు తుది దశకు చేరింది. దీంతో పాటు జీపీఎస్ టెక్నాలజీతో పని చేసే డిజిటల్ కెమెరాలు, 3 జీ కనెక్టివిటీతో పని చేసే చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు, ఇతర ఊపకరణాలకు నిధులు కేటాయించారు. ఈ కోణంలో సైబరాబాద్కు రూ.5 కోట్లు, రాచకొండకు రూ.కోటి కేటాయించింది. రూ.12 కోట్లతో వ్యవస్థీకృత నేరాలకు చెక్ సైబర్ నేరాలతో పాటు వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న ముఠాల పైనా నగర పోలీసులు సాంకేతిక యుద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్స్, ఇతర ఉపకరణాలు ఖరీదుతో పాటు క్రైమ్ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకుగాను సర్కారు రూ.12 కోట్లు కేటాయించింది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో భాగంగా పోలీసు విభా గం అనేక ఎనలటిక్స్ను సమకూర్చుకుంటోంది. నేరగాళ్ల కదలికలపై నిఘా, అనుమానితుల గుర్తింపు తదితరాల కోసం వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సైబర్, క్రైమ్ ల్యాబ్స్తో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్లో భారీ స్థాయిలో బ్యాక్ఎండ్ సేవలు చేసే సాఫ్ట్వేర్స్తో పాటు వీడియో ఎన్హ్యాన్స్మెంట్, రిట్రీవ్ సాఫ్ట్వేర్స్ సమీకరించుకున్నారు. ఈ బడ్జెట్తో అవసరమైన అదనపు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉన్న వాటి అభివృద్ధికి వీటిని వెచ్చించనున్నారు. సైబరాబాద్లో ఈ పద్దు కింద రూ.5 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది. రాచకొండ కమిషనరేట్కు నిధులు.. 2016లో ఆవిర్భవించిన రాచకొండ కమిషనరేట్కు ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో ఇప్పటికీ గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్లోనే కొనసాగుతోంది. సరూర్నగర్లోని వీఎం హోమ్ స్థలాన్ని కేటాయించినా... కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీం తో రంగారెడ్డి జిల్లాలో 56 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకు ంది. గురువారం నాటి బడ్జెట్లో కమిషనరేట్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు కేటాయించారు. డేగ‘కళ్ల’ కోసం రూ.140కోట్లు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించింది. సైబరాబాద్కు రూ.6 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది. ప్రతిపాదనల మేరకు కేటాయింపులు రాచకొండ పోలీసు కమిషనరేట్కు సంబంధించి ప్రతిపాదనల మేరకు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రతి ఠాణాను మోడల్గా మార్చడానికి, ట్రాఫిక్ స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేస్తాం. కమిషనరేట్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది తొలి దఫా నిధులు మాత్రమే. భూమి స్వాధీనం, అభివృద్ధి పూర్తి చేసిన తర్వాత రెండో దఫాగా అవసరమైన మొత్తం ప్రతిపాదిస్తాం. – మహేష్ మురళీధర భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
పోలీస్.. పవర్ఫుల్..!
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేసిన ప్రభుత్వం హోంశాఖలో పోలీస్ విభాగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ప్రగతి పద్దు కింద రూ.1,389 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.975.95 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద ఈ ఏడాది రూ.4,400.68 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.3,852.21 కోట్లు కేటాయించింది.కొత్త జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలు, ఠాణాల నిర్మాణం, హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ మూడో దఫా నిధులు, ప్రతీ జిల్లాలో సిబ్బందికి క్వార్టర్లు, ట్రైనింగ్ సెంటర్లు, రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధునీకరణ, హోంగార్డుల జీతభత్యాలు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, సైనిక్ వెల్ఫేర్ తదితర విభాగాలకు సముచిత స్థానం కల్పిస్తూ నిధులు కేటా యించింది. – సాక్షి, హైదరాబాద్ ‘హైదరాబాద్’కే అగ్ర తాంబూలం.. రాష్ట్ర పోలీస్ శాఖకు కేటాయించిన మొత్తం ప్రగతి బడ్జెట్లో రూ.574 కోట్లు హైదరాబాద్ నగర కమిషనరేట్ కోసమే కేటాయించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి ఇందులో నుంచి రూ.280 కోట్లు కేటాయించా రు. ఐటీ బ్యాక్బోన్ సపోర్ట్, సీక్రెట్ సర్వీస్ ఫండ్, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, రంజాన్, బక్రీద్, బతుకమ్మ, దసరా తదితర పండగల బందోబస్తుకు రూ.10 కోట్ల మేర నిధులు ఇచ్చారు. స్టాఫ్ క్వార్టర్స్, కార్యాలయాలు, నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.40 కోట్లు ప్రగతి పద్దులో ప్రభుత్వం కేటాయించింది. డీజీపీకి గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది దానిని 98 శాతం పెంచుతూ రూ.604.86 కోట్లు కేటాయించింది. కొత్త జిల్లాల కార్యాలయాలకు రూ.400 కోట్లు కొత్త జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్ల నిర్మాణానికి ప్రగతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.20 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇచ్చింది. వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి మూడో దఫా రూ.20 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమ్యూనికేషన్స్, నెట్వర్క్ టెక్నాలజీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది. అన్ని జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నూతన భవనాల కోసం రూ.40 కోట్లు, డీజీపీ అకౌంట్ కింద సీక్రెట్ ఫండ్కు రూ.3.22 కోట్లు ఇచ్చింది. పలు జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న అగ్నిమాపక కేంద్రాల కోసం రూ.8.9 కోట్లు ప్రగతి బడ్జెట్లో కేటాయించగా, పక్కా భవనాలు లేని అగ్నిమాపక కేంద్రాలు, శిథిలావస్థలో ఉన్న కేంద్రాలకు నూతన భవనాలకు రూ.4.33 కోట్లు కేటాయించింది. ఇంటెలిజెన్స్కు రూ. 36.67 కోట్లు రాష్ట్రానికి కీలక విభాగమైన ఇంటెలిజెన్స్కు ప్రగతి పద్దులో తగినన్ని నిధులు కేటాయించింది. మొత్తం రూ.36.67 కోట్లు కేటాయించగా, అందులో ప్రధానంగా అంతర్గత భద్రతకు కావల్సిన ఆయుధాలు తదితర సామగ్రికి రూ.2 కోట్లు ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాల కల్పనకు రూ.6.19 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి ఏటా అందే మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, ఎల్డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం) నిధుల కింద రాష్ట్ర వాటాగా ఈ ఏడాది రూ.114.80 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం తోడ్పాటుతో ముందుకెళతాం.. పోలీస్ శాఖపై నమ్మకం ఉంచిన రాష్ట్ర సర్కార్ గతేడాదికంటే రెట్టింపు బడ్జెట్ కేటాయించింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్త జిల్లాల్లోనూ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలందించేందుకు ఈ బడ్జెట్ ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ కమిషనరేట్లో చేపట్టిన వినూత్న పద్ధతులను జిల్లాల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతీ పోలీస్స్టేషన్లలో రిసెప్షన్లు ఏర్పాటు చేసి బాధితులకు ఠాణా అంటే భయం లేకుండా స్నేహపూర్వక వాతావరణం సృష్టిస్తాం. సీసీటీవీలు, కమాండ్ సెంటర్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలా అన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం సహకారంతో ఈ ఏడాది కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. – డీజీపీ మహేందర్రెడ్డి -
హోంశాఖకు పెంపు.. జీతాలకే సరి
సాక్షి, అమరావతి: హోంశాఖకు పెరిగిన అవసరాలను పట్టించుకోకుండా బడ్జెట్లో జరిపిన అరకొర కేటాయింపులు జీతాలకే సరిపోతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంశాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లోనూ మోక్షం లభించలేదు. కేవలం రూ.6,226 కోట్లు కేటాయించారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్భయ మహిళా పోలీస్ వాలంటీర్ల కోసం రూ.28.71 కోట్లు మంజూరు చేశారు. పోలీసుల సంక్షేమానికి రూ.9.69 కోట్లు మాత్రమే విదిల్చారు. నేరాల నివారణలో ఎంతో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ (సీసీటీఎన్)కు రూ.20.70 కోట్లు ఇచ్చారు. రాజధానిలో నిర్మించే ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి రూ.10 కోట్లనే ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రతకు నిధులను కేటాయించలేదు. రాష్ట్రంలో వంద మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మిస్తామని ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా కేవలం 30 మోడల్ పోలీస్స్టేషన్ భవనాలకు మాత్రమే నిధులిచ్చారు. మంగళగిరిలో ఏపీఎస్పీ 6వ బెటాలియన్ వద్ద రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్మాణం మినహా ప్రధాన సౌకర్యాలు సమకూరలేదు. రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) ఏర్పాటు చేయాల్సి ఉంది. మచిలీపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితమే స్థల పరిశీలన పూర్తైనా అక్కడ ఒక్క ఇటుక వేస్తే ఒట్టు. అన్ని రాష్ట్రాల్లో హోంగార్డులకు రోజుకు రూ.500లకు పైగా వేతనం ఇస్తుంటే ఏపీలో మాత్రం రూ.400లతో సరిపెడుతున్నారు. -
మహిళా పోలీసులు 7 శాతమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో మహిళలు కేవలం 7.28 శాతమే ఉన్నారని హోంశాఖ తాజా గణాంకాల్లో తేలింది. దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులతో తమిళనాడు పోలీస్శాఖ తొలిస్థానంలో నిలిచింది. కేవలం 2.47 శాతం మహిళా ఉద్యోగులతో తెలంగాణ పోలీస్ విభాగం చివరన ఉంది. కశ్మీర్లోని 80వేల మంది పోలీస్ సిబ్బందిలో 3.05 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 2015లో మహిళలపై 3,29,243 నేరాలు జరగగా.. ఈ సంఖ్య 2016 నాటికి 3,38,954కు చేరింది. పోలీస్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2009, 2012, 2016ల్లో మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ పరిస్థితి మారలేదని హోంశాఖ తెలిపింది. తెలంగాణలోని 60,700 మంది పోలీస్ సిబ్బందిలో కేవలం 2.47 శాతం మహిళలు ఉండగా, యూపీలోని 3.65 లక్షల సిబ్బందిలో 3.81 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయలలోనూ మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తమిళనాడు తర్వాత హిమాచల్, మహారాష్ట్ర, గోవాలలో మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ పోలీస్విభాగంలో మహిళలు అత్యధికంగా ఉండగా, ఢిల్లీ పోలీస్ విభాగంలో కేవలం 8.64 శాతం మహిళా సిబ్బంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 2015లో 34,651 రేప్ కేసులు నమోదుకాగా, 2016 నాటికి ఆ సంఖ్య 38,947కు చేరుకుందని పేర్కొంది. దేశంలో అత్యాచారాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్రలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళలపై నేరాల్లో భర్త, కుటుంబ సభ్యులపై నమోదైన కేసులే ఎక్కువ. మహిళలపై దాడి, అపహరణ, అత్యాచారం వంటి నేరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
నేటి నుంచి డీజీపీల సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో సాంకేతికంగా తెచ్చిన మార్పులు, విప్లవాత్మకంగా రూపొందించిన యాప్స్.. తదితర అంశాలపై అఖిల భారత డీజీపీల సదస్సులో ‘టెక్నో ఎక్స్పో’ ఏర్పాటు చేయనున్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ టెకన్పూర్లో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంపులో శనివారం నుంచి మూడు రోజల పాటు జరిగే డీజీపీల సదస్సు లో ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డికి సూచించింది. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్రెడ్డి ఎక్స్పో ఏర్పాట్లను పర్యవేక్షించేం దుకు రెండురోజుల ముందే సీనియర్ ఎస్పీ రమేశ్రెడ్డిని గ్వాలియర్ పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ సదస్సులో రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేకంగా నిలవనుందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, సదస్సులో పాల్గొనడంకోసం శుక్రవారం రాత్రి డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్ మధ్యప్రదేశ్ వెళ్లారు. ఎన్నో ప్రత్యేకతలు.. హైదరాబాద్ కమిషనరేట్ నేతృత్వంలో తయారుచేసిన హాక్ఐ, లాస్ రిపోర్ట్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ తదితర యాప్స్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కేసుల దర్యాప్తు కోసం పోలీసు సిబ్బంది, అధికారుల అంతర్గత వినియోగానికి ‘హైదరాబాద్ కాప్’యాప్ రూపొందించి తర్వాత దానిని టీఎస్ కాప్గా అభివృద్ధి చేశారు. దీని పనితీరు, ఉప యోగాలను సదస్సులో ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించనున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నడవడికను పర్యవేక్షించేందుకు చెస్ట్ మౌంటెడ్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. దీన్నికూడా టెక్నో ఎక్స్పోలో ప్రదర్శించనున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్లో తొలిసారిగా క్రైమ్, సైబర్ ల్యాబ్లను ఏర్పా టు చేశారు. వీటన్నింటినీ ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు. క్రైమ్ సీన్ రికార్డింగ్ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా 3డీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరాలను ఎక్స్పో ద్వారా ఇతర రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటన్నింటికీ మించి పంజగుట్ట పోలీసు స్టేషన్ దేశంలోనే ‘బెస్ట్ ఆఫ్ త్రీ’గా ఎంపికయ్యింది. ఈ అవార్డును హైదరాబాద్ పోలీసు అధికారులు ఈ సదస్సులో అందుకోనున్నారు. ఇంకా పలు అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వివరిస్తారు. -
చెన్నమనేని భారత పౌరుడు కాదు
-
ప్రభుత్వాలే ‘లిటిగెంట్’!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య ఏటా భారీగా పెరిగిపోతోంది.. అందులో సగానికిపైగా కేసుల్లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలే లిటిగెంట్లుగా ఉంటున్నాయి.. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల తీరు వివాదాలకు కారణమవుతోంది. దీంతో ఆయా శాఖలను ప్రతివాదులుగా చేస్తూ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 3.21 లక్షల పెండింగ్ కేసులు ఉండగా.. అందులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై దాఖలైనవే 1.68 లక్షల కేసులు కావడం గమనార్హం. కోర్టుకు వెళ్లమంటున్నారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు, చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తే ‘కోర్టుకు వెళ్లి తేల్చుకోండి’అంటూ అధికారుల నుంచి సమాధానం వస్తోంది. దీంతో చాలా మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వుల రూపంలో పిటిషనర్లకు కొంతవరకు ఉపశమనం కల్పిస్తున్నారు. కానీ కేసు విచారణకు వచ్చినా ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడం, తగిన వివరణ ఇవ్వకపోవడం, ఆదేశాలను అమలు చేయకపోవడం, పదే పదే వాయిదాలు కోరడం వంటి చర్యలు విచారణలు సుదీర్ఘంగా కొనసాగేందుకు కారణమవుతున్నాయి. కొన్ని కేసుల్లో రెండు సంవత్సరాలకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని సందర్భాలున్నాయి. 4 పరిష్కరించేలోపు.. 40 కేసులు ఓ కేసులో తుది విచారణ చేపట్టాలంటే దాని పూర్వాపరాల్లోకి వెళ్లి లోతుగా వాదనలు వినాల్సి ఉంటుంది. ఇందుకు గంటలకు గంటలు సమయం వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయడం, సరైన వివరణ ఇవ్వడం వంటివి జరిగిన సందర్భాల్లోనే. దీంతో న్యాయమూర్తులు తొలుత ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి తర్వాత ఎప్పుడో తుది విచారణ చేపట్టాల్సి వస్తోంది. ఇక ఓవైపు నాలుగు కేసులను పరిష్కరించే సమయంలోనే.. మరోవైపు ప్రభుత్వ చర్యలపై నలభై కొత్త కేసులు దాఖలువుతున్నాయి. అయితే అవకాశమున్న సందర్భాల్లో మాత్రం న్యాయమూర్తులు ప్రభుత్వాలకు నిర్ధిష్టమైన ఆదేశాలిస్తూ కేసులను వేగంగా పరిష్కరిస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కిస్తున్నారు ఇక కోర్టులు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవటంతో కక్షిదారులు తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టు ధిక్కార పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో న్యాయమూర్తులపై అదనపు భారం పడుతోంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తేనో, జైలుకు పంపాల్సి ఉంటుందని, జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తేనో తప్ప అధికారులు స్పందించడం లేదు. ఏకంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను హాజరుకావాల్సిందిగా ఆదేశించాకే కోర్టుల ఉత్తర్వులు అమలైన ఉదంతాలూ ఉన్నాయి. 2015లో 2,534 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలుకాగా.. 2016లో 2,651కి పెరిగింది. ఈ ఏడాది నవంబర్ 20 నాటికి 2,398 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయ్యాయి. పెరుగుతున్న పెండింగ్ కేసులు ఉమ్మడి హైకోర్టులో రెండు దశాబ్దాల కింద దాఖలైన పలు కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి 2.85 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా.. ఈ ఏడాది నవంబర్ 17 నాటికి ఆ సంఖ్య 3.21 లక్షలకు చేరింది. ఇందులో ప్రభుత్వ చర్యలపై దాఖలైన రిట్ పిటిషన్లే 1,68,324 ఉన్నాయి. అంటే సగానికిపైగా పెండింగ్ కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే. ‘పెండింగ్’కు సమస్యలెన్నో.. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వాలే అతి పెద్ద లిటిగెంట్ అని స్వయంగా ప్రధాని మోదీ గతేడాది జరిగిన జాతీయ న్యాయ సదస్సులో అంగీకరించడం గమనార్హం. ప్రభుత్వ లిటిగేషన్ను తగ్గించేందుకు నేషనల్ లిటిగేషన్ పాలసీ (ఎన్ఎల్పీ)ని రూపొందిస్తున్నామని ప్రకటించారు. కానీ అది అమల్లోకి రాలేదు. ఇక హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం పెండింగ్ కేసులు పెరిగేందుకు కారణమవుతోంది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా.. ప్రస్తుతం 31 మంది ఉన్నారు. మిగతా 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖపైనే ఎక్కువ రిట్ పిటిషన్లలో అత్యధికంగా రెవెన్యూశాఖపైనే దాఖలవుతున్నాయి. గ్రామస్థాయిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పు, చేర్పులకు నిరాకరించడం, అసలు యజమాని స్థానంలో మరొకరిని చేర్చడం, రికార్డుల్లో పట్టా భూమి ఉంటే దానిని ప్రభుత్వ భూమిగా చూపడం, రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్)లో ఖాళీలపై వివాదం వంటి చిన్న అంశాలపైనా అధికారులు వివాదం సృష్టించడం ఎక్కువైపోయిందనే విమర్శలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ రిట్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. పాస్ పుస్తకాలు, ఎన్వోసీలు, సేల్డీడ్ల రిజిస్ట్రేషన్లు తదితర వ్యవహారాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా దాఖలవుతున్న కేసులను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. దాంతో న్యాయమూర్తులు ఒకే అంశానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తూ.. వీలైనంత త్వరగా తీర్పులు ఇస్తున్నారు. అయినా ప్రభుత్వాల తీరుతో ఫలితం లేకుండా పోతోంది. జి.సత్యనారాయణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో లక్షలాది మందికి, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయకుండా అప్పీలు చేసి వివాదాన్ని పెద్దది చేసింది. ఇక ఇటీవల భూసేకరణలో ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో.. దీనిపై దాఖలవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో స్థానం పోలీసుశాఖదే! పోలీసులు, వారు వ్యవహరిస్తున్న తీరుపై దాఖలవుతున్న కేసులు కూడా భారీగా ఉన్నాయి. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయని సందర్భాల్లో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తుండటంతో బాధితులు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇక తెలంగాణకు పరిపాలనా ట్రిబ్యునల్ లేకపోవడంతో ఉద్యోగ వివాదాలూ హైకోర్టుకే చేరుతున్నాయి. -
ఇక సోషల్ మీడియా పాలసీ!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలపై నిఘాను కట్టుదిట్టం చేయడానికి కొత్తగా ‘సోషల్ మీడియా పాలసీ’ని హోంశాఖ తీసుకురానుంది. ఉగ్రవాదులు తమ భావజాల వ్యాప్తికి, భారత వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీలో విధివిధానాలపై చర్చించడానికి పలు కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు గురువారం నాడిక్కడ సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చాలాచోట్ల సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వల్ల అల్లర్లు చెలరేగుతున్నాయని.. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో పరిస్థితులు సమస్యాత్మకంగా మారాయని వెల్లడించాయి. సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి కావాల్సిన సిబ్బంది, మౌలిక వసతులపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. -
పోలీస్ బదిలీల ఫైలుకు మోక్షం
ఎట్టకేలకు ఆమోదించిన హోంశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీల బదిలీలకు సంబంధించిన ఫైలుకు హోంశాఖ ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. డీజీపీ కార్యాలయం నుంచి పదిహేను రోజుల క్రితం వెళ్లిన ప్రతిపాదనల ఫైలు హోంమంత్రి పేషీలో పెండింగ్లో ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై పోలీస్–హోంశాఖ మధ్య కోల్డ్ వార్ కథనం ప్రభుత్వ వర్గాల్లో సర్వత్రా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత కూడా హోంశాఖలో ఫైలు పెండింగ్లో ఉండటంపై ఆరోపణలు వస్తుండటంతో మంగళవారం ఆమోదముద్ర వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు వెలువడాల్సి ఉంది. వరంగల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ, హైదరాబాద్లో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన నేపథ్యంలో ఈనెల 28 తర్వాత ఆదేశాలు వెలువడతాయని హోంశాఖ వర్గాలు తెలిపాయి. బందోబస్తు, భద్రత వ్యవహారాల్లో కొంత మంది బదిలీ అయ్యే అదనపు ఎస్పీలు నిమగ్నమయ్యా రని అధికారులు తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి హోంశాఖకు వెళ్లిన ప్రతి పాదనలను బట్టి అధికారులు ఈ కింది పోస్టులకు బదిలీ కానున్నట్టు తెలిసింది. ప్రధానంగా బదిలీ అయ్యే అధికారులు అధికారి బదిలీ అయ్యే స్థానం ఎం.వెంకటేశ్వర్రావు ఎల్బీనగర్ డీసీపీ (రాచకొండ) ఎన్.కోటిరెడ్డి మహబూబాబాద్ ఎస్పీ అన్నపూర్ణరెడ్డి వికారాబాద్ ఎస్పీ శశిధర్రాజు ఈస్ట్జోన్ డీసీపీ (హైదరాబాద్) డీవీ శ్రీనివాస్రావు జనగామ డీసీపీ ఉమామహేశ్వర శర్మ మల్కాజ్గిరి డీసీపీ -
పోలీస్, హోంశాఖల మధ్య కోల్డ్వార్
- పదోన్నతులపై పీటముడి వేసిన హోంశాఖ - బదిలీల్లోనూ అడ్డుపుల్ల వేసిన వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోం మంత్రిత్వశాఖ, రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం మధ్య కోల్డ్వార్ సాగుతోంది. ఈ రెండింటి మధ్య రోజురోజుకూ వివాదం రాజుకుంటోంది. ముఖ్యంగా పదోన్నతులు, బదిలీల విషయంలో రెండు విభాగాల మధ్య సమన్వయ లేమి కనిపిస్తోంది. పదిహేను రోజుల కిందట పలువురు అదనపు ఎస్పీల బదిలీల ప్రతిపాదనను పంపితే ఇప్పటివరకు ఆదేశాలు వెలువడకుండా అడ్డుకున్నారని పోలీస్ అధికారులు హోం విభాగంపై రుసరుసలాడుతున్నారు. అదే విధంగా మంత్రిమండలి ఆమోదంతో కొత్త పోస్టుల్లో పదోన్నతులకు ప్రతిపాదనలు వెళ్లినా దీనిపై హోంశాఖలో పీటముడి పడ్డట్టు డీజీపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. హోంమంత్రి.. ఐపీఎస్ల మధ్య గ్యాప్.. పదిహేను రోజుల క్రితం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి 9 మంది అదనపు ఎస్పీల బదిలీలకు చెందిన ఫైలు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి వెళ్లింది. అక్కడి నుంచి హోం మంత్రి చాంబర్కు వాటి ఆమోదం కోసం పంపారు. ఆ తర్వాత ఆ ఫైలు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. ప్రదిపాదిత జాబితాలో తమకు చెందిన అధికారులకు సరైన పోస్టింగులు లేవని తెలుసుకున్న కొంతమంది అదనపు ఎస్పీలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి బదిలీల ఫైలు ఆమోదంకాకుండా ఆపారని వెల్లడైంది. దీనితో హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్ల మధ్య అఘాతం పెరిగిపోయినట్టుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి మహబూబాబాద్, వికారాబాద్ జిల్లా ఎస్పీ, హైదరాబాద్లోని ఈస్ట్జోన్ డీసీపీ, టాస్క్ఫోర్స్అదనపు డీసీపీ, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ, రాచకొండలోని ఎల్బీనగర్, మల్కాజ్గిరి డీసీపీ పోస్టుల్లో అధికారుల బదిలీపై సీనియర్ ఐపీఎస్లు సీఎంతో ఆమోదముద్ర వేయించారు. అయినా హోంశాఖలో ఫైలు పెండింగ్లో పడటంపై ,ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఆయనకు ఫిర్యాదు చేయాలని సీనియర్ ఐపీఎస్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పదోన్నతులకు విభజన బ్రేక్.. బదిలీల కథ అలా ఉండగా డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, నాన్క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర పోలీస్ శాఖ ముఖ్య కార్యాలయం ప్రతిపాదన పంపిం చింది. అయితే సివిల్ అధికారులు(డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ) విభజనపై హైకోర్టులో స్టే ఉండటం, సీనియారిటీ వ్యవహారం తేలక పోవడంతో పదోన్నతులు కుదరవని హోంశాఖ తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల కొరతతో కొత్తగా పోస్టులు మంజూరు చేయించుకోవ డం, తాత్కాలిక కేటాయిం పుల్లో భాగంగా రాష్ట్రానికి కేటా యించే వారికే తాము పదోన్నతులు కల్పించి అధికారుల కొరత తీర్చు కోవాలని భావిస్తున్నా మని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయినా కూడా హోంశాఖ ప్రతిపాదనలను తిప్పి పంపడంపై సీనియర్ ఐపీఎస్ల్లో అసహనం ఏర్పడింది. అటు పదోన్నతులు, ఇటు బదిలీలపై సీఎం వద్దే తేల్చుకోవాలని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. -
బాబు భద్రతకు కొత్తగా 290 పోస్టులు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ భారీగా పెంచుతూ హోం శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందుకోసం కొత్తగా 290 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు ఎస్పీలు, ఏడుగురు డీఎస్సీలు, 23 మంది ఇన్ స్పెక్టర్లు, 51 మంది ఆర్ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. మిగిలిన పోస్టుల కింద కానిస్టేబుల్స్ ను భర్తీ చేస్తారు. -
డ్రోన్ల ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక
బెంగళూరు: కర్ణాటక హోంశాఖలో డ్రోన్ (అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ - యూఏఈ) దళం ఏర్పాటైంది. మొత్తం 20 మంది సిబ్బంది కలిగిన ఈ విభాగం వివిధ రకాల నిఘా విషయాలపై దృష్టి సారించనుంది. ఓ రాష్ట్ర పోలీసు శాఖలో డ్రోన్ దళం ఏర్పాటు కావడం దేశంలో ఇదే మొదటిసారి. దక్షిణ కొరియా నుంచి ఒక్కొక్కటి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 12 డ్రోన్లను కర్ణాటక కొనుగోలు చేసింది. 18.5 మెగాపిక్సల్స్ సామర్ధ్యం కలిగిన ఫాంటం మోడల్ కు చెందిన ఈ డ్రోన్లు రాత్రుళ్లు కూడా ఫోటో, వీడియోలను చిత్రించగలవు. ప్రస్తుతం వీటిని రాష్ట్రంలోని ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు, గనుల తవ్వకాలపై నిఘా ఉంచడానికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ మాట్లాడుతూ.. డ్రోన్ వినియోగంపై ఇప్పటివరకు 20 మంది సిబ్బందికి శిక్షణనిచ్చినట్లు తెలిపారు. వీరు కొప్పళ్, యాదగిరి, బళ్లారి, బీదర్, రాయచూర్, కల్బుర్గి జిల్లాల్లో విధులు నిర్వస్తున్నట్లు వివరించారు. -
యూనిఫామ్ పోస్టులకూ వయో పరిమితి పెంపు
పోలీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా గరిష్ట వయో పరిమితిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో యూనిఫామ్ సర్వీసులను మినహాయించి ఉద్యోగ నియామకాలన్నింటికీ ప్రభుత్వం వయో పరిమితిని పదేళ్లకు పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లో యూనిఫామ్ సర్వీసులపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పోలీస్ శాఖలోని రాష్ట్ర స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మూడేళ్ల పాటు పరిమితిని పెంచింది. అయితే సివిల్ పోలీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదు. హోం శాఖ పరిధిలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), జైళ్ల శాఖ, అగ్నిమాపక సర్వీసులకు మాత్రమే ఈ మూడేళ్ల పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
నేషనల్ పోలీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
- మహిళా పోలీసుల డిమాండ్ను హోం శాఖకు వివరిస్తా - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ - ఎన్పీఏ అంతర్జాతీయ సదస్సులో ఢిల్లీ నుంచి స్కైప్ ద్వారా ప్రసంగం సాక్షి, హైదరాబాద్: చైనాలో మాదిరిగానే మనదేశంలోనూ నేషనల్ పోలీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వర్సి టీ ఏర్పాటుకు సంబంధించి మహిళా పోలీసు అధికారులు చేసిన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్వీపీఎన్పీఏ)లో ‘చట్టం అమలులో మహిళ’ అనే అంశంపై 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఢిల్లీ నుంచి స్కైప్ ద్వారా స్మృతి ఇరానీ ప్రసంగించారు. ఇంత మంది మహిళల్ని పోలీసు అధికారులుగా చూస్తుంటే ఆనందంగా ఉందని, అవకాశం వస్తే ఏ రంగంలోనైనా మహిళలు దూసుకుపోగలరన్న దానికి మీరే ఉదాహరణ అని కొనియాడారు. మహిళా అధికారుల మనోవికాసానికి ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు మరిన్ని నిర్వహించాలని, రాబోయే రోజుల్లో దేశంలోని యూనివర్సిటీలతో కలసి ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాలని ఎన్వీపీఎన్పీఏను కోరారు. ప్రతి పాఠశాలలో విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పేం దుకు పోలీసులతో భాగస్వామ్యమయ్యేలా పాఠశాలలకు ఆదేశాలిస్తామని రాజస్థాన్కు చెందిన పోలీసు అధికారి మమత అడిగిన ప్రశ్న కు సమాధానమిచ్చారు. పోలీసు అకాడమీ, ఇతర విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పటిష్టపరుస్తామన్నారు. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్ రంగంలో ఉన్న మహిళలకి నెట్వర్క్ ఏర్పడటంతో పాటు అందరూ తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా విధి నిర్వహణను సమర్థంగా నిర్వహించే స్థాయికి చేరుకున్నారని ఎన్వీపీఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ అన్నారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అంతర్జాతీయ సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ సదస్సు తెలియజేసిందని ప్రొఫెసర్ ట్రెసీ గ్రీన్ అన్నారు. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడులకు తన భర్త, కూతురు ఎలా బలైపోయారో వన్ లైఫ్ అలయన్స్ ప్రెసిడెంట్ కియస్కెర్ ఉద్వేగభరితంగా వివరించారు. -
వీళ్లకు పద్మాలివ్వండి
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు..హోంశాఖకు చేరిన జాబితా - భారతరత్నకు ఎన్టీఆర్ను ప్రతిపాదించని బాబు సర్కార్ సాక్షి, న్యూఢిల్లీ: ఈనాడు పత్రికాధిపతి సీహెచ్.రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే భారతరత్న పురస్కారం విషయంలో ఎన్టీఆర్కు మళ్లీ మొండి చేయి చూపింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు అవకాశం ఉన్నా ఆ అవార్డుకు ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేయలేదు. రాష్ట్రం నుంచి 30 మంది పేర్లతో పద్మ అవార్డుల జాబితా వచ్చిందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. పద్మ విభూషణ్ అవార్డుకు రామోజీరావుతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్.నాగేశ్వర రెడ్డి పేరును కూడా రాష్ర్ట ప్రభుత్వం సిఫార్సు చేసిందని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పద్మ విభూషణ్కు ఇద్దరి పేర్లను, పద్మ భూషణ్కు ఐదుగురి పేర్లను, పద్మ శ్రీ అవార్డులకు 23 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాల వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. పద్మవిభూషణ్కు..: సీ.హెచ్. రామోజీరావు (జర్నలిస్టు), డాక్టర్ నాగేశ్వర రెడ్డి (గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్). పద్మ భూషణ్కు: డాక్టర్ అనంద శంకర్ జయంత్ (కూచిపూడి నృత్యం), డాక్టర్ బాల వి.బాలచందర్ (విద్య), చాగంటి కోటేశ్వరరావు( సాహిత్య, సంస్కృతి), డాక్టర్ ఎం.గోపిచంద్ (సామాజిక సేవ), ఎం. మురళీ మోహన్ (ఎంపీ, ఆర్ట్ అండ్ సామాజిక సేవ). పద్మ శ్రీకి: డి.హారిక (చెస్), కె. శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), ఎం. వెంకటేశ్వర యాజులు (సాహిత్య-విద్య), ముదిగొండ శివప్రసాద్ (సాహిత్యం), ఎ. ప్రకాశరావు (సాహిత్యం), అంబిక (కూచిపూడి నృత్యం), వందేమాతరం శ్రీనివాస్ (గాయకుడు), జి. రమణయ్య (చేనేత), పూజ కపూర్ (మ్యూజిక్), డాక్టర్ జయప్రద రామమూర్తి (ఫ్లూట్), జి.రాజేంద్రప్రసాద్ (సినిమా), కీర్తి శేషులు వేటూరి సుందరరామ్మూర్తి (రచయిత), పసుమర్తి రత్తయ్య శర్మ (కూచిపూడి నృత్యం), యార్లగడ్డ నాయుడమ్మ (వైద్యం), డాక్టర్ విశ్వరూపరెడ్డి (ఈఎన్టి సర్జన్), డాక్టర్ ముక్కామల అప్పర (ఎన్ఆర్ఐ-రేడియాలజీ), డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు (కార్డియాలజీ), డాక్టర్ టి. దశరథరామిరెడ్డి (ఆర్థోపెడిక్), డాక్టర్ సీ.హెచ్. మోహన్ వంశీ (అంకాలజీ), డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు (అంకాలజీ), డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలె (సి.టి. సర్జన్), అక్షయ క్షేత్రం (సామాజిక సేవ), వి. శ్రీదేవి (హార్టికల్చర్)ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. -
నకిలీ కరెన్సీ అడ్డా..ఏపీ..!
- దేశంలోనే మూడోస్థానంలో నిలిచిన రాష్ట్రం - దేశవ్యాప్తంగా దొరికిన కరెన్సీలో 17.91 శాతం ఇక్కడే - తొలి రెండు స్థానాల్లో గుజరాత్, ఛత్తీస్గఢ్ - నకిలీ రూ.వెయ్యి నోట్ల విషయంలో ఏపీకి నాలుగో స్థానం - స్పష్టం చేస్తున్న కేంద్ర హోం శాఖ గణాంకాలు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పోలీసు సహా వివిధ నిఘా విభాగాలు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో 17.91 శాతం ఆంధ్రప్రదేశ్లోనే దొరికినట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం రూ.3, 03, 54, 604 విలువైన నకిలీ కరెన్సీ లభ్యమైంది. ఇందులో రూ.54, 37, 600 విలువైన కరెన్సీతో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు వెల్లడించాయి. రూ.87, 47, 820తో గుజరాత్ తొలిస్థానంలో, రూ.73, 86, 900తో ఛత్తీస్గఢ్ రెండో స్థానంలో ఉన్నాయి. స్వాధీనమవుతున్న నకిలీ కరెన్సీలో అత్యధిక భాగం పాకిస్తాన్ భూ భాగంలో ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో ముద్రతమవుతున్నట్లు హోం శాఖ అనుమానిస్తోంది. నిపుణులు సైతం గుర్తించలేని విధంగా ఈ కరెన్సీ ముద్రితమవుతుండటమే దీనికి నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నకిలీ నోట్లలో రూ.1,000, రూ.500 నోట్లే అధికంగా ఉంటున్నాయి. దీంతో కరెన్సీ నోట్ల ముద్రణలో ఆర్బీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెక్యూరిటీ ఫీచర్స్ను ఎప్పటికప్పుడు మారుస్తోంది. అయినప్పటికీ పాక్లో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ నోట్లు, అసలు నోట్ల మధ్య తేడాలు రానురాను తగ్గిపోతుండడం ఆందోళనకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవర్ ప్రెస్లోనే ఫేక్ కరెన్సీని ముద్రిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న రూ.3, 03, 54, 604 విలువైన నకిలీ కరెన్సీలో రూ.1, 98, 95, 000 విలువైనవి రూ.1,000 డినామినేషన్ నోట్లే కావడం గమనార్హం. దీంతోపాటు రూ.94, 090, 500 విలువైన రూ.500 నోట్లు, రూ.9, 38, 800 విలువైన రూ.100 నోట్లు, రూ.25 వేల విలువైన రూ.50 డినామినేషన్ నోట్లు ఉన్నట్లు హోం శాఖ లెక్కకట్టింది. రూ.1,000, రూ.500 మినహా మిగిలిన డినామినేషన్లో ఉండే నకిలీ నోట్లను స్థానికంగా ఉన్న ముఠాలే ప్రింటర్లు, స్కానర్ల ద్వారా రూపొందిస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో రూ.24,41,000 విలువైన రూ.1,000 డినామినేషన్ నోట్లు లభ్యమయ్యాయి. ఈ విషయంలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో నిలిచినట్లు హోం శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
‘సన్ టీవీకి అనుమతుల ప్రసక్తి లేదు’
న్యూఢిల్లీ: మారన్ కుటుంబ సభ్యులకు చెందిన సన్ టెలివిజన్ నెట్వర్క్కు భద్రతా అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ శనివారం స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభ్యంతరాలను పక్కన పెట్టింది. సన్ టీవీకి 33 టీవీ చానళ్లు, ఒక ఎఫ్ఎం రేడియో ఉన్నాయి. ‘సన్ టీవీ యజమానులు చాలా నిబంధనలను ఉల్లంఘించారు. ఆ సంస్థలకు భద్రతా అనుమతులు ఇచ్చేందుకు చట్టంలో ఎలాంటి అవకాశమూ లేదు’ అని హోంశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సన్ టీవీ అనుభవం నేపథ్యంలో.. ప్రైవేటు టెలివిజన్ సంస్థలకు లెసైన్సులు మంజూరు చేసే నిబంధనల్లో హోంశాఖ పలు మార్పులు చేసింది. వాటి ప్రకారం.. టీవీ చానళ్ల ప్రమోటర్లు, టెండరుదారులు.. తమపై ఎటువంటి క్రిమినల్, మనీ లాండరింగ్, ఉగ్రవాదులతో సంబంధాలు, ఆర్థిక మోసం వంటి కేసులేవీ పెండింగ్లో లేవని ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. -
నేడు లెక్కింపు
- అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ - గెలుపోటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ - అవాంఛనీయ - సంఘటనలు జరగకుండా హోం శాఖ చర్యలు రెండు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాయాదుల సమరం, అత్తాకోడళ్ల పోటీ కి గ్రామ పంచాయతీ ఎన్నికలు వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 5,735 గ్రామ పంచాయతీల్లో 84,854 స్థానాలకు అభ్యర్థులు పోటీపడ్డారు. మొదటి విడతలో 82. 54శాతం ఓటింగ్ నమోదు కాగా, రెండో విడతలో 80. 38శాతం ఓటింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 8గంటలకు ఆయా తాలూకాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5గంటలకు ఫలి తాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుం డా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ప్రక్రియ అనుకున్న సమయం కన్నా కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో గెలుపు, ఓటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ సైతం సాగుతోంది. కొన్ని గ్రామాల్లో బెట్టింగ్ వేలు, లక్షలు సైతం దాటి కోట్ల రూపాయల్లోకి చేరడం గమనార్హం. ఇక పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగక పోయినప్పటికీ, అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే వార్తల మధ్య ప్రముఖ పార్టీల నేతల్లో సైతం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర కుతూహలం నెలకొందనే చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రత కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హోం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టంది. దాదాపు 22వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇదే సందర్భంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు హోం శాఖ ఉన్నత అధికారులు వెల్లడించారు. అంతేకాక సమస్యాత్మకంగా గుర్తించిన ప్రాంతాల్లో విజయోత్సవాలకు అనుమతి సైతం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. -
పోలీసులకు ఒత్తిడి పెరుగుతోంది: సేన
ముంబై: ఎక్కువ గంటలు పని చేయడంతో పోలీసులు అలసిపోతున్నారని శివసేన ఆరోపించింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతోపాటు పోలీసుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయని సేన పేర్కొంది. ఇటివల ఓ ముంబై పోలీసు ఇన్స్పెక్టర్ను ఓ జూనియర్ అధికారి కాల్చిన నేపథ్యంలో సేన ఈ వ్యాఖ్యలు చేసింది. హోం శాఖ ఈ హత్యను కూడా ఇతర హత్యల్లానే పరిగణించి కేసు మూసేయాలని చూస్తోందా అని ప్రశ్నించింది. శాంతి భద్రతలు కాపాడే వ్యక్తుల మానసిక స్థితి సరిగా లేకపోతే భవిశ్యత్లో హింస మరింత ఎక్కువవుతుందని అభిప్రాయపడింది. శనివారం సీనియర్ ఇన్స్పెక్టర్ విలాస్ జోషిని సబ్ ఇన్స్పెక్టర్ దిలిప్ శిర్కే కాల్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం శిర్కే విధులకు ఎందుకు హాజరవలేదని విలాస్ ప్రశ్నించగా తనపై కాల్పులు జరిపి, తాను కాల్చుకొని అత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అనుభవమున్న ఇద్దరు పోలీసులు అనవసర వాగ్వివాదం వల్ల ప్రాణాలు కోల్పోయార ని సేన పేర్కొంది. ఇలాంటి ఘటనలు పోలీ్స్ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నది. కేసు దర్యాప్తునకు ఆదేశించిన సీఎం పోలీసుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తానన్నారు. -
ఉగ్ర కన్ను !
గుల్బర్గాలో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులకు ‘సిమి’తో సంబంధం! ధార్వాడలో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం {Mిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో విధ్వంసానికి కుట్ర! బెంగళూరు : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడనున్నారనే సమాచారం నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాదులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను గుల్బర్గాలో పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో కర్ణాటకపై కూడా ‘ఉగ్ర’ కన్ను పడినట్లు రాష్ట్ర హోం శాఖ భావిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన సందర్భంలో వీరు ముగ్గురు అరవింద్, ఆనంద్, కిషన్ అనే పేర్లతో ధార్వాడ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఆరు నెలల పాటు ఈ ముగ్గురు అనుమానితులు నివాసమున్నట్లు తెలిసింది. తాము వస్త్రాల వ్యాపారులమని చెప్పుకొని ధార్వాడ నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వీరు రెక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు సైతం వీరు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించారని సమాచారం. ధార్వాడ ప్రాంతం లో ఆరు నెలలు గడిపిన అనంతరం వ్యాపారాన్ని మరో చోటికి మారుస్తున్నామని చెప్పుకొని ఈ ముగ్గురు అనుమానితులు గుల్బర్గాకు తమ నివాసాన్ని మార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ధార్వాడ పట్టణంలో అనుమానిత ఉగ్రవాదులు నివసించిన ప్రాంతాన్ని సైతం పోలీసులు తనిఖీ చేసి అక్కడి వారి నుంచి మరికొంత సమాచారాన్ని రాబట్టారు. రాష్ట్రంలో హై అలర్ట్... ఇక రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం రాష్ట్ర హోం శాఖకు సమాచారం అందజేయడంతో రాష్ట్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇక గుల్బర్గాలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసు లు వారిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారి స్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంత మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంలో రాష్ట్రం లో విధ్వంసాన్ని సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేస్తున్నట్లు తెలియడంతో రాష్ట్ర హోం శాఖ ఉలిక్కిపడింది. దీంతో తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ను ప్రకటించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్తో పాటు డీజీపీ లాల్రుఖుమ్ పచావో ఇతర సీనియర్ పోలీసు అధికారులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొం దించనున్నట్లు సమాచారం. -
ఉత్తమ సేవలకు పతకాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 766 మందికి గుర్తింపురాష్ట్రంలో 43 మంది పతకాలకు ఎంపిక సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత 65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొత్తం 766 మంది సిబ్బందికి కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. వీటికి రాష్ట్రపతి శనివారం ఆమోదముద్ర వేశారు. నలుగురికి రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం, 44 మందికి పోలీసు శౌర్య పతకం, 94 మందికి రాష్ట్రపతి విశిష్ట పోలీసు సేవాపతకం, 624 మందికి విశిష్ట పోలీసు సేవా పతకాలను ప్రదానం చేయనున్నారు. ఇక సంస్కరణ సేవ (కరెక్షనల్ సర్వీసు)లో మొత్తం 41 మందికి విశిష్ట సేవా పతకాలు లభించాయి. దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సీఆర్పీఎఫ్ సిబ్బందికి మొత్తం 33 మందికి ఈ పతకాలు లభించగా, వాటిలో 15 పోలీసు శౌర్య పతకాలు ఉన్నాయి. ఇక సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు 51 పతకాలు లభించాయి. మన రాష్ట్రంవారు 43 మంది... ఈ గణతంత్ర పతకాల విజేతల్లో మన రాష్ట్రానికి చెందినవారు మొత్తం 43 మంది ఉన్నారు. ఐదుగురికి రాష్ట్రపతి విశిష్ట శౌర్య పతకం, 37 మందికి పోలీసు విశిష్ట శౌర్యపతకం లభించగా, ఒకరికి కరెక్షనల్ సర్వీసులో పతకం లభించింది. ఠ రాష్ట్రపతి విశిష్ట శౌర్య పతకం: జె.పూర్ణచందర్రావు, ఏడీజీపీ (ఎస్ఎల్పీఆర్బీ చైర్మన్, హైదరాబాద్), పి.ఉమాపతి, డీఐజీ (వైజాగ్ రేంజ్), టి.యోగానంద్, డీఐజీ (సీఐడీ, హైదరాబాద్), టి.మురళీకృష్ణ, డీఐజీ (కర్నూలు రేంజ్), అనిల్కుమార్, ఐజీ (ఎన్ఐఎస్ఏ, హైదరాబాద్, సీఐఎస్ఎఫ్) ఠ పోలీసు విశిష్ట సేవాపతకం: విక్రంసింగ్ మాన్, డీఐజీ (ఏలూరు రేంజ్), ఎన్.శివశంకర్రెడ్డి, ఎస్పీ (తూర్పు గోదావరి), జి.శ్రీనివాస్, ఎస్పీ (ఇంటెలిజెన్స్, హైదరాబాద్), డి.నాగేంద్రకుమార్, ఎస్పీ (మహబూబ్నగర్), ఎ.సత్యనారాయణ, జేడీ (ఏసీబీ, హైదరాబాద్), విశ్వనాథ్ రవీందర్, ఎస్పీ (కరీంనగర్), పి.రాజేంద్రప్రసాద్, ఏఎస్పీ (హైదరాబాద్), ఎం.చక్రధర్రావు, అదనపు కమాండెంట్ (ఏపీఎస్పీ, 8వ బెటాలియన్, కొండాపుర్), పి.సీతారాం, అదనపు కమాండెంట్ (గ్రేహౌండ్స్, హైదరాబాద్), పి.వెంకట్రామిరెడ్డి, డీఎస్పీ (గుంటూరు రూరల్), ఎం.దయానందరెడ్డి, ఎస్డీపీవో (అనంతపురం), కేవీ రాఘవరెడ్డి, డీఎస్పీ (మదనపల్లి), సీహెచ్ భద్రయ్య, డీఎస్పీ (విద్యుత్సౌధ, ఖైరతాబాద్), దేవెందర్సింగ్, డీఎస్పీ (సీఐ సెల్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్), ఎం.మునిరామయ్య, డీఎస్పీ (హైదరాబాద్ రూరల్), బి.రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ (గ్రేహౌండ్స్, హైదరాబాద్), పి.వీరాంజనేయరెడ్డి, ఇన్స్పెక్టర్ (సీసీఎస్, నెల్లూరు), షేక్ బురాన్ షరీఫ్, ఎస్సై, ఇ.మనోహర్, ఎస్సై (కల్యానిధం, తిరుపతి), ఎం.మంతయ్య, ఎస్సై (సైబరాబాద్), బి.వెంకటరామిరెడ్డి, కమాండెంట్ (సికింద్రాబాద్), సి.హనుమంతరెడ్డి, ఏఎస్సై (ఎస్వోటీ, సైబరాబాద్), ఎన్.శివకుమార్, ఏఆర్ ఎస్సై (ఏపీఎస్పీ, వరంగల్), ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ ఎస్సై (విజయవాడ), గణేష్ ప్రసాద్, ఎస్సై (ఇంటెలిజన్స్, హైదరాబాద్) ఎం.ఇక్బాల్ హుస్సేన్, హెడ్కానిస్టేబుల్ (విజయవాడ), రావు బొడ్డేడ శంకర్, ఇన్స్పెక్టర్ (ఏసీబీ, హైదరాబాద్), మంగళ్ లక్రా, కమాండెంట్ (సీఐఎస్ఎఫ్, ఖమ్మం జిల్లా), శాంత్ రక్సిత్, అసిస్టెంట్ కమాండెంట్ (జాతీయ పోలీసు అకాడమీ, హైదరాబాద్), పీవీ వర్గీస్, ఎస్సై ఎగ్జిక్యూటివ్ (సీఐఎస్ఎఫ్, వైజాగ్), టి.సెల్వరాజు, హెడ్కానిస్టేబుల్ (సీఐఎస్ఎఫ్, వైజాగ్), ఎ.మనోహరన్, హెడ్కానిస్టేబుల్, జీడీ (సీఐఎస్ఎఫ్, హైదరాబాద్), గోపీచంద్, హెడ్కానిస్టేబుల్, ఎన్ఐఎస్ఏ (సీఐఎస్ఎఫ్, హైదరాబాద్), సీహెచ్ సత్యసింహ వెంకటరమణ, డీసీఐవో (హోం వ్యవహారాల శాఖ, హైదరాబాద్), రణ్ధీర్సింగ్, ఇన్స్పెక్టర్, జాతీయ పోలీసు అకాడమీ (హైదరాబాద్), ఆదిత్యనారాయణ సింగ్, హెడ్కానిస్టేబుల్, జాతీయ పోలీసు అకాడమీ (హైదరాబాద్), పి.సత్యనారాయణ, ఏఎస్సై (ఆర్పీఎస్ఎఫ్, సికింద్రాబాద్ రైల్వేస్). కరెక్షనల్ సర్వీసులో విశిష్ట సేవా పతకం: గడ్డం ప్రసాదరావు, హెడ్వార్డర్, సబ్జైలు (గిద్దలూరు). -
హోంశాఖ కార్యదర్శి బదిలీ
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన సీఎం జయలలిత ఇప్పటి వరకు 13 సార్లు తన కేబినెట్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. మంత్రుల శాఖల్లో మార్పులు జరిగినప్పుడ ల్లా ఐఏఎస్ల బదీలీలు పరిపాటే. అయితే, జిల్లాల కలెక్టర్లు, ప్రధాన శాఖల్లోని ఐఏఎస్లను మార్చేవారు. ఎప్పుడో ఒక సారి మాత్రం ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులపై బదిలీ వేటు పడుతోంది. గత వారం ఐఏఎస్ల మహానాడును దిగ్విజయవంతంగా నిర్వహించారు. ఇందులో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా శాఖల వారీగా చర్చల్లో వెలుగు చూసిన అంశాల మేరకో లేదా, ఏ కారణమో తెలియదు గానీ మంగళవారం ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారుల శాఖల్లో బదిలీ చిట్టాను రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ ప్రకటించారు. హోం కార్యద ర్శిగా అపూర్వ: రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి నిరంజన్ మార్డిని తప్పించి ఆయన స్థానంలో ఉన్నత విద్యా శాఖ ప్రధాన అపూర్వ వర్మను నియమించారు. నిరంజన్ మార్డిని ఆర్థిక గణాంకాల విభాగం ప్రధాన కార్యదర్శి గా బదిలీ చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు మేనేజింగ్ డెరైక్టర్ రాజారామన్ను తప్పించి, ఆయన స్థానంలో ఆరోగ్య పథకాల ప్రాజెక్టు డెరైక్టర్గా ఉన్న పంకజ్ కుమార్ బన్సల్ను నియమించారు. రాజారామన్కు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని అప్పగించారు. ఆ శాఖలో ఉన్న మణి వాసన్ను వికలాంగుల సంక్షేమ విభాగం కమిషనర్గా మార్చారు. ఆర్థిక గణాంకాల విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న వి ఇరై అన్భును అన్నా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ డెరైక్టర్గా నియమించారు. వికలాంగుల సంక్షేమ విభాగంలో ఉన్న వికే జయకొడిని క్రీడల శాఖకు మార్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ఎస్ పళని మాణిక్యంకు ఉన్నత విద్యాశాఖను పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతగా అప్పగించారు. -
సీఎం కిరణ్ లేఖ పై స్పందించిన రాష్ట్రపతి
ఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. అసెంబ్లీ తీర్మానంపై అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మూడు పేజిల లేఖ రాశారు. ఈ లేఖను రాష్ట్రపతి భవన్ అధికారులు కేంద్ర హోంశాఖకు పంపారు. ఆంధ్ర ప్రదేశ్ విభజనపై కేంద్ర కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కపెట్టాలని లేఖలో సీఎం పేర్కోన్నారు. అసెంబ్లీలో తీర్మానం తర్వాత, వివిధ స్టేక్ హోల్డర్లలో విశ్వాసం నింపిన తర్వాతనే బిల్లును రాష్ట్రపతికి పంపాలని లేఖలో సూచించారు. స్టేక్ హోల్డర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే విభజనపై దృష్టి సారించాలని లేఖలో తెలిపారు. రాష్ట్ర విభజనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. -
శాంతిభద్రతలు కేంద్రం చేతికి!
-
శాంతిభద్రతలు కేంద్రం చేతికి!
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో శాంతిభద్రతల యంత్రాంగాన్ని పూర్తిగా తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం శనివారం జరిపిన సమావేశంలో బృందం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే ఈ మేరకు స్వయంగా ప్రతిపాదన చేసినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైద్రాబాద్ పాలనా వ్యవస్థ, శాంతిభద్ర తల పరిరక్షణ, నగరంతో పాటు తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రతకు తీసుకోవాల్సిన చట్టబద్ధమైన చర్యలపై హోం శాఖ ప్రతిపాదనలతో కూడిన ప్రాథమిక నివేదికను జీవోఎం ముందుంచిన షిండే... నగర శాంతిభద్రతలను పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను కూడా ఈ సందర్భంగానే తెరపైకి తెచ్చారంటున్నారు. అయితే కీలకమైన రెవెన్యూ విభాగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చే అంశం మాత్రం ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల కేటాయింపులను బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాతిపదికగా నిర్ధారించాలని, దాంతోపాటు వాటి సక్రమ అమలు కోసం అంతర్రాష్ట్ర వివాద పరిష్కార ట్రిబ్యునళ్లకు బదులు చట్టబద్ధమైన నదీజలాల వినియోగ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా జీవోఎం పరిశీలనకు వచ్చినట్టు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఇమిడి ఉన్న న్యాయపరమైన చిక్కులను, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎదురయ్యే అభ్యంతరాలను అధిగమించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై కూడా ప్రాథమిక చర్చ జరిగినట్టు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వివరించారు. విభజనతో ముడివడి ఉన్న కీలకాంశాలపై నవంబర్ 5వ తేదీ దాకా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని జీవోఎం తీర్మానించింది. ఇప్పటిదాకా అందిన ఇ-మెయిళ్లలోని సమాచారాన్ని, నవంబర్ 5 దాకా లభించే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సిద్ధం చేసే తుది నివేదికల ఆధారంగానే హైదరాబాద్ ప్రతిపత్తి, నదీజలాలు, విద్యుత్ పంపిణీ, ఆదాయ వనరులు, సిబ్బంది పంపిణీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి కీలకాంశాలపై సిఫార్సులను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇ-మెయిల్ ద్వారా ప్రజలు తదితర వర్గాల నుంచి వచ్చే సూచనలు, సిఫార్సులకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఇతరుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అంశాలవారీగా సిఫార్సులు, సూచనలతో నివేదికలు రూపొందించే బాధ్యతను ఆయా శాఖలకు చెందిన కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులకు జీవోఎం అప్పగించింది. నవంబర్ 7న మరోసారి సమావేశమై వారి నివేదికలను కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పలు అంశాలపై కేంద్ర మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులను ఖరారు చేసేందుకు నవంబర్లో బహుశా ఒకట్రెండుసార్లు జీవోఎం సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. జీవోఎం నివేదిక సమర్పించాక కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో తెలంగాణ బిల్లు తయారవుతుందని, దాన్ని రాష్ట్రపతి ద్వారా బహుశా డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో శాసనసభ అభిప్రాయం కోసం పంపవచ్చని పేర్కొన్నాయి. పరిశీలనకు సమయం పడుతుంది: షిండే జీఓఎం రెండో భేటీ శనివారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో షిండే అధ్యక్షతన జరిగింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా మిగతా సభ్యులు పి.చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, వి.నారాయణసామి హాజరై గంటన్నర పాటు చర్చించారు. వివిధ అంశాలపై అందిన సమాచారం ఆధారంగా రూపొందించిన నివేదికలను పరిశీలించారు. అన్ని ప్రాంతాల ప్రజలను సాధ్యమైనంత ఎక్కువగా సంతృప్తిపరచగలిగేలా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో కలిసి వచ్చే సమావేశం నాటికి అంశాలవారీగా కూలంకషంగా నివేదికలను సమర్పించాల్సి ఉంటుందని తెలియజేశారు. ‘‘మాకందిన ఇ-మెయిళ్లలోని సూచనలను పరిశీలించడానికి సమయం పడుతుంది. అంశాలవారీగా అందుబాటులోకి వచ్చే నివేదికలను నవంబర్ 7న భేటీలో పరిశీలించి చర్యలకు ఉపక్రమిస్తాం’’ అన్నారు. గతంలో రాష్ట్రాల విభ జన, కొత్త రాష్ట్రాల ఏర్పాటులో అనుసరించిన నిర్దిష్టమైన విధివిధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన అన్ని అంశాలపైనా ఆమోదయోగ్యమైన, సముచిత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు జీవోఎం ప్రయత్నిస్తోందని అందులోని సభ్యుడు ఒకరు వెల్లడించారు. అభిప్రాయాలు, సూచనలు పంపండి: హోం శాఖ రాష్ట్రంలోని పలు పార్టీలు, ప్రజాప్రతినిధులు, పౌరులు, ప్రజా సంఘాలు జీవోఎం పరిశీలనాంశాలపై తమ అభిప్రాయాలను నవంబర్ 5 వరకూ తెలియజేయవచ్చని జీవోఎం భేటీ అనంతరం విడుదలైన ఒక అధికార ప్రకటన తెలియజేసింది. వాటిని కేంద్ర హోం శాఖ వెబ్సైట్ చిరునామాకు ఇ-మెయిల్ ద్వారా గానీ, న్యూఢిల్లీ జైసింగ్ రోడ్లోని ఎన్డీసీసీ-11 బిల్డింగ్లో ఉన్న హోం శాఖ కేంద్ర-రాష్ట్ర విభాగానికి పోస్టు ద్వారా గానీ పంపవచ్చని పేర్కొంది. -
రాష్ట్ర విభజన నోట్ విడుదల
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మీడియాకు నోట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి హోంశాఖ రూపొందించిన సమాచారాన్ని మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) పరిశీలించింది. వచ్చిన ఈ మెయిల్ సమాచారాన్ని జీఓఎం చర్చించింది. ఈ మెయిల్లో వచ్చిన సమాచారంతో ఆయా శాఖలు తమ నివేదికలను మార్పు చేయాలని హొం శాఖ ఆదేశించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలు జీఓఎంకు నిర్దిష్ట సిఫార్సులు చేయాలని తెలిపింది. 11 శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్రానికి చేరింది. రాష్ట్ర విభజనపై సూచనలతో పెద్ద సంఖ్యలో ఈ మెయిల్స్ వచ్చాయి. సూచనలు స్వీకరించేందుకు కొంత సమయం ఇవ్వాలని జీఓఎం నిర్ణయించింది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ సలహాలు, సూచనలు జీఎంఓకు పంపించవచ్చునని హొం శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) సమావేశంలో రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించినట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. గంటన్నరసేపు జరిగిన సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా శాఖల కార్యదర్శులు సమాచారాన్ని పంపారని తెలిపారు. ఇప్పటి వరకు 2000 ఇమెయిల్స్ వచ్చాయని చెప్పారు. వాటన్నిటినీ శాఖల వారీగా వర్గీకరించి ప్రభుత్వ కార్యదర్శులకు పంపుతామన్నారు. నవంబర్ 7 మరోసారి సమావేశమవుతామని చెప్పారు. సమావేశానికి ఆంటోనీ హాజరు కాలేదన్నారు. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండేతోపాటు కేంద్ర మంత్రులు గులామ్ నబీ ఆజాద్, వీరప్పమొయిలీ, జైరాం రమేష్, చిదంబరం, నారాయణస్వామి హాజరయ్యారు. -
పోలీసులపై ఎస్పీ ప్రతాపం: సస్పెన్షన్
ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ సీనియర్ ఎస్పీ రాజేష్ మోదక్ తన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఆయనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. రాజేష్ మోదక్ను ఆదివారం సస్పెండ్ చేసింది. తన నివాసం వద్ద విధులు నిర్వహించే ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆయన కొట్టినట్టు కేసు నమోదైంది. ఎస్పీ అకారణంగా తమపై చేయి చేసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారించిన అనంతరం పోలీసు శాఖ ఉన్నతాధికారులు రాజేష్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని హోం శాఖ వర్గాలు ధ్రువీకరించాయి.