Indian american
-
భారతీయ అమెరికన్కు యూఎస్ బ్యాన్కార్ప్ పగ్గాలు
హ్యూస్టన్: ఫైనాన్షియల్ సర్విసుల్లో ఉన్న యూఎస్కు చెందిన యూఎస్ బ్యాన్కార్ప్ తదుపరి సీఈవోగా గుంజన్ కేడియా నియమితులయ్యారు. తద్వారా కంపెనీకి నాయకత్వం వహించనున్న మొదటి భారతీయ అమెరికన్గా నిలిచారు. యూఎస్లోని అతిపెద్ద ఆర్థిక సంస్థలలో యూఎస్ బ్యాన్కార్ప్ ఒకటి. ఏప్రిల్ 15న జరిగే వార్షిక వాటాదారుల సమావేశం తర్వాత ఆమె కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే డైరెక్టర్ల బోర్డులో కూడా చేరనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా పదవి స్వీకరించనున్న ఆండీ సెసిరీ స్థానాన్ని 54 ఏళ్ల కేడియా భర్తీ చేస్తారు. ఢిల్లీకి చెందిన గుంజన్ 2016 నుండి యూఎస్ బ్యాన్కార్ప్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. స్టేట్ స్ట్రీట్ ఫైనాన్షియల్, బీఎన్వై మెలన్, మెకిన్సీ అండ్ కంపెనీ, పీడబ్ల్యూసీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహించారు. న్యూ యార్క్కు చెందిన మ్యాగజీన్ అమెరికన్ బ్యాంకర్ ప్రకటించిన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జా బితాలో ఏడుసార్లు చోటు సంపాదించారు. -
ట్రంప్ 2.0లో భారత సంతతి హర్మీత్కు చోటు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్గా నియమించారు.ధిల్లాన్ నియామకంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. ‘‘భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ దేశంలోని ప్రముఖ న్యాయ వాదులలో ఒకరు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా కార్మికులపై వివక్ష, అందుకు అనుగుణంగా చట్టాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించిన పలు కార్పొరేషన్లపై న్యాయం పోరాటం చేశారు. మన రాజ్యాంగ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. కీలక బాధ్యతలు చేపట్టనున్న దిల్లాన్ పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను అమలు చేస్తారని ఆశిస్తున్నానని’ పేర్కొన్నారు. ప్రతిస్పందనగా, ట్రంప్ అప్పగించిన బాధ్యతలు ‘అత్యంత గౌరవం’గా భావిస్తా. మన దేశానికి సేవ చేయడం నా కల, ట్రంప్ నేతృత్వంలోని అద్భుతమైన న్యాయవాదుల బృందంలో భాగం అయినందుకు సంతోషిస్తున్నాను’ అని ఆమె ఎక్స్వేదిగా ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే ట్రంప్ తన పాలక వర్గంలో డాక్టర్ జే భట్టాచార్య (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) వివేక్ రామస్వామి (డోజ్) కశ్యప్ పటేల్ (ఎఫ్బీఐ డైరెక్టర్) నియమించగా.. తాజాగా భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ నియమించారు.👉చదవండి : సిరియా నియంత కొంపముంచిన నాటి 14ఏళ్ల బాలుడు -
బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!
ఇంతవరకు ఎన్నో వెయిట్లాస్ స్టోరీలు చదివాం. వాళ్లంతా బరువు తగ్గి.. ఎలా స్లిమ్గా మారి శెభాష్ అనిపించుకున్నారో చూశాం. కానీ ఇలాంటి అందమైన వెయిట్లాస్ స్టోరీని మాత్రం చదివి ఉండరు. ఈ మహిళ అధిక బరువుకి చెక్పెట్టి అందాల రాణిగా గెలుపు సాధించింది అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా "గెలుపు" అంటే ఇది అని చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అమెరికాలోని సీటెల్లో నివశిస్తున్న 39 ఏళ్ల భారత సంతతి మహిళ చాందినీ సింగ్ యూఎస్ఏ ఆధారిత పిల్లల పాదరక్ష కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆమె పీసీఓఎస్ సమస్యలతో గర్భం దాల్చడంలో పలు కాంప్లీకేషన్స్ని ఎదుర్కొంది. ఏదోలా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టాయి. మూడోనెల నుంచి బెడ్రెస్ట్ పేరుతో మంచానికే పరిమితమైపోయింది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తోసహ ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఫేస్ చేసింది. చివరికి డెలివరి అయ్యి.. కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. కానీ దీని కారణంగా అధిక బరువుతో పాటు ఆయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో తన ఆరోగ్యం మరింత దారణంగా దిగజారిపోతుందేమోనన్న భయం మొదలైంది చాందినీలో. ఇక అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది ఎలాగైన బరువు తగ్గాలని. తన ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా క్రమ తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన డైట్ని ఫాలో అయ్యింది చాందినీ. అయితే మొదటి రెండు నెలల్లో తన బరువులో పెద్ద మార్పులు కనిపించకపోయినా..బరువు తగ్గాలనే ఆలోచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డైట్ని, వర్కౌట్లని కొనసాగిస్తూ ఉండేది. మరికొన్ని వర్కౌట్ల సెషన్లను పెంచుకునేది. ఒకవేళ రెండు నుంచి ఐదు రోజులు వ్యాయామాలు స్కిప్ అయినా కేలరీలు ఏదో రకంగా ఖర్చు అయ్యేలా చూసుకుంది. అలా సుమారు 48 కిలోల మేర తెలియకుండా బరువు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె 70 కిలోల బరువుతో ఉంది. అలాగే ఆమె ఇంతకు ముందు ఫేస్ చేసిన అనారోగ్య సమస్యలన్ని తగ్గుముఖం పట్టాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంది. అయితే చాందీని వేగంగా బరువు తగ్గడం కంటే నిదానంగా బరవు తగ్గితేనే ఆరోగ్యకరం అంటోంది. తాను ఇంట్లో వండే భారతీయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చానని, జంక్ ఫుడ్ని పూర్తిగా దూరం పెట్టానని చెప్పారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో తినడం తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆమె వెయిట్ లాస్జర్నీ పూర్తి కాలేదు. ఆమె స్లిమ్గా మారి.. యూఎస్ఏ 2024 అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. బరువు తగ్గి ఆరోగ్యాన్ని కాపడుకోవడమే గాక అందలా రాణిగా మెరవచ్చు అని చాటి చెప్పింది. ఇక్కడ బరువు తగ్గడం అనేది అందం, ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది చాందినీ. (చదవండి: హాట్టాపిక్గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..) -
భారత సంతతి యెగా గురువు హఠాన్మరణం..శిష్యులుగా హాలివుడ్ స్టార్స్, ప్రముఖులు..
ప్రఖ్యాత యోగా గురువు శరత్ జోయిస్ అమెరికాలో మరణించారు. ఆయన హాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలకు యోగా పాఠాలు చెప్పిన ప్రఖ్యాత గురువు. 53 ఏళ్ల వయసులో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అష్టాంగ యోగ వ్యవస్థాపకుడు కృష్ణ పట్టాభి జోయిస్ మనవడు. తన తాత కనుగొన్న యోగా శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అష్టాంగ యోగా గురువు శరత్. ఆయన సెప్టెంబర్ 29, 1971న మైసూర్లో జన్మించారు. శరత్ కుటుంబం అష్టాంగ యోగా అభ్యాసం, సంరక్షణ భోధనకు అంకితమయ్యింది. 2009లో తన తాత మరణంతో ఆయన వారసత్వాన్ని శరత్ కొనసాగించారు. అలా అనతి కాలంలో ప్రభావవంతమైన యోగా గురువుల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వర్జీనియా యూనివర్సిటీలోని కాంటెంప్లేటివ్ సైన్సెస్ సెంటర్లో శరత్ బోధిస్తున్నారు. ఆయన యోగా సెంటర్ ప్రకారం.. కొత్త బ్యాచ్ క్లాస్లను స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో తన స్వగ్రామానికి రావాల్సి ఉండగా..అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల, శిష్యులు, తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.షార్లెట్స్విల్లేలోని వర్జీనియా విశ్వవిద్యాలయం సమీపంలో హైకింగ్ చేస్తున్నప్పుడు(సరదాగా కాసేపు ప్రకృతిలో గడిపేందుకు చేసే సుదీర్ఘ నడక) శరత్కు గుండెపోటు రావడంతో మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకు తల్లి సరస్వతి జోయిస్, తండ్రి రంగస్వామి, భార్య శృతి జోయిస్, కుమారుడు సంభవ్ జోయిస్, కుమార్తె శ్రద్ధా జోయిస్ ఉన్నారు. శరత్ హాలీవుడ్ స్టార్స్ మడోన్నా, గ్వినేత్ పాల్ట్రోతో (Gwyneth Paltrow)సహా ఎంతో మంది సెలబ్రిటీలకు యోగాను బోధించారు. అంతేగాదు హిల్లరీ క్లింటన్ కూడా ఒకనొక సందర్భంలో తాను మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆ సమయంలో యోగా గురువు శరత్ నాసికా శ్వాస, నాడి శోధన ప్రాణాయామం అనే టెక్నిక్ తనకు ఎంతో ఉపయోగపడిందని ఆమే స్వయంగా తెలిపారు. View this post on Instagram A post shared by 𝙎𝙝𝙖𝙧𝙖𝙩𝙝 𝙅𝙤𝙞𝙨, 𝙋𝘼𝙍𝘼𝙈𝘼𝙂𝙐𝙍𝙐 (@sharathjoisr) (చదవండి: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు) -
అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు. ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు -
'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!
మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్ లాస్ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..మొదటిది..శరీరం హైడ్రేటెడ్ ఉంచుకునేలా చూడటం..రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్ టైమర్ సహాయంతో హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకునేది. నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్ ఆన్ అయ్యేలా సెట్ చేసింది వెంటనే 20 సిప్ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది. రెండొవది ..ఆహారంలో మార్పులు..జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా. మూడొవది..క్రమం తప్పకుండా తన బరువుని చెక్చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్ మైండ్తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా. ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్ ఆటిట్యూడ్కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్హౌజ్లోని బ్లూ రూమ్లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్రూమ్లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే! పర్నియా పుట్టింది పాకిస్తాన్లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్గా చేరింది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్నే సీరియస్గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్సెన్స్కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది. ఇండియా తిరిగిరాగానే.. ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్లైన్లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్లైన్ స్టోర్ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి. అంట్రప్రెన్యూర్గా మారినా డిజైనింగ్ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది. ‘మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్తో క్లాసికల్ డాన్సర్నయ్యాను. నాన్న ఇన్స్పిరేషన్తో అంట్రప్రెన్యూర్నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్నయ్యాను. లైఫ్లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ. (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్ హారిస్
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
నేను అమెరికా నుంచి వచ్చా బొగత జలపాతాల అందాలకు ఫిదా
-
బైడెన్కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు
ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత కనిపించింది.ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ ఏడాది జో బైడెన్కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.డొనాల్డ్ ట్రంప్కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్కు మద్దతు పలికారు. కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం. -
హెల్త్కేర్ మోసాలకు పాల్పడ్డ భారత సంతతి ఫిజిషియన్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఫిజిషియన్ మోనా ఘోష్ హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసూతికి సంబంధించిన స్త్రీ జననేంద్రియ సేవల్లో నైపుణ్యం కలిగిన ఆమె చికాగోలో ప్రోగ్రెసివ్ ఉమెన్స్ హెల్త్ర్ను నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రైవేట్ బీమా సంస్థలకు కూడా లేని సేవలకు బిల్లులు క్లయిమ్ చేసిన మోసాని పాల్పడ్డారు. ఆమె విచారణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రెండు మోసాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఘోష్ మోసాపూరితంగా పొందిన రీయింబర్స్మెంట్లలో దాదాపు రూ.27 కోట్లకు జవాబుదారిగా ఉన్నట్లు ఆరోపించింది. అయితే ఘోష్ తన అభ్యర్థన ఒప్పందంలో రూ. 12 కోట్లకు మాత్రమే జవాబుదారిగా ఉన్నానని పేర్కొంది. ఈ మోసాలకు గానూ అమెరికా జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ యు వాల్డెర్రామా అక్టోబర్ 22న శిక్ష ఖరారు చేశారు. ఆమె 2018 నుంచి 2022 వరకు తన ఉద్యోగులు సమర్పించిన మెడిసెడ్, ట్రైకేర్ వంటి వాటికి ఇతర బీమా సంస్థలు కూడా అందించని లేదా వైద్యపరంగా అవసరం లేని సేవలకు కూడా మోసపూరితంగా క్లెయిమ్లను సమర్పించారని కోర్టు పేర్కొంది.ఇదంతా రోగి అనుమతి లేకుండానే ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపింది. అందుకుగానూ ఆమె ఎంత మొత్తం చెల్లించాల్సిందనేది శిక్షాకాలంలో కోర్టే నిర్ణయిస్తుందని తీర్పులో పేర్కొంది. ఇక ఘోష్ కూడా అధిక రీయింబర్స్మెంట్లు పొందేందుకు టెలిమెడిసిన్ సందర్శనలు ఎక్కువగా చేసినట్లు పేషెంట్ మెడికల్ రికార్డ్లను సృష్టించానని అంగీకరించింది. అలాగే అవసరం లేని బిల్లింగ్ కోడ్లను క్లైయిమ్ చేసినట్లు కూడా ఘోష్ విచారణలో ఒప్పుకుంది.(చదవండి: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత) -
యువకుడి దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకోంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. ఆయన గుజరాత్కు చెందిన హెమంత్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయన ఓక్లహోమాలోని ఓ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హెమంత్ కోరారు. దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్ల్లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిచర్డ్ను హోటల్ నుంచి హెమంత్ ఎందుకు వెళ్లిపోవాలన్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం..
వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.సుహాస్ నేపథ్యం..37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్హౌస్లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్. వ్యక్తిగత జీవితం..నార్త్వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్బర్న్లో నివసిస్తున్నారు. (చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు) -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో కమిషనర్గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్ ఆరతి ప్రభాకర్. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్? ఆమె నేపథ్యం ఏంటంటే..ఇంజనీర్ కమ్ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్హౌస్లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్టీపీ) డైరెక్టర్ అండ్ సైన్స్ అడ్వైజర్గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్టీపీ డైరెక్టర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైట్హైస్లో అందించే సేవలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్ ఆఫీస్లో ల్యాప్టాప్ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్కి చాట్జిపిటి గురించి వివరించడంతోనే వెట్హౌస్లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్. ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. ఆమె నేపథ్యం..ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్లోని లుబ్బాక్లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ ఫెలోషిప్ను పూర్తి చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!) -
టెక్సాస్లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
లోకం మెచ్చిన కోడింగ్ మాంత్రికుడు : అద్రిత్ సక్సెస్ జర్నీ
‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు... ‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్రావు యాప్ డెవలప్మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్కేర్కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది. కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్లో అద్రిత్రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్మెంట్కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్ఔట్ ఇన్నోవేషన్గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్ప్రాసెస్లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు... కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్ -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్షైర్లో ట్రంప్కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
22 నెలలకుపైగా న్యాయ పోరాటం.. భారతీయ అమెరికన్కు ఊరట
న్యూయార్క్: అమెరికాలో 22 నెలలకు పైగా న్యాయ పోరాటం తర్వాత ఓ భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఊరట కలిగింది. తాను కొనుక్కున్న ఇంటిలో తిష్టవేసిన జంట ఎట్టకేలకు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ భారతీయ అమెరికన్ ఊపిరి పీల్చుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో బ్యాంక్ వేలంలో జెరిఖోలోని ఫ్రెండ్లీ లేన్లోని 1,536 చదరపు అడుగుల ఇంటిని బాబీ చావ్లా అనే ఇండియన్ అమెరికన్ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటి గత యజమానులైన బారీ, బార్బరా పొలాక్ ఆ ఇంటిని విడిచి పెట్టకుండా తిష్ట వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. తాను ఆ ఇంటి కోసం పన్నులు, తనఖా చెల్లింపులు, ఇతర బిల్లుల రూపంలో ఇప్పటివరకు 85 వేల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు చావ్లా పేర్కొన్నాడు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన చావ్లా తల్లిదండ్రులను బారీ పొలాక్ తిడుతూ "పాకిస్తాన్కు వెళ్లిపోండి" అంటూ అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది. నిందితులు 1990లో 2,55,000 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2006 నాటికి తమ తనఖా చెల్లించడం మానేశారు. కోర్టు పత్రాల ప్రకారం, 2008లో ఇల్లు జప్తునకు రాగా బారీ, బార్బరా పొలాక్ జంట ఒక దశాబ్దానికి ఇల్లు జప్తు కాకుండా దశాబ్దానికిపైగా కేసును లాక్కొచ్చారు. ఇంటి జప్తు నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఏడు సార్లు దివాలా పిటిషన్లు వేశారు. బార్బరా పొలాక్ గత నెలలో తాజాగా మరోసారి దివాలా పిటిషన్ వేయడంతో ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం ఆగిపోయింది. కాగా గతవారం కేసును విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి పోలాక్స్ను మళ్లీ దివాళా పిటిషన్లు దాఖలు చేయకుండా నిరోధించారు. దీంతో ఆ జంట చివరకు డిసెంబర్ 22న ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. "ఇది క్రిస్మస్ అద్భుతంలా అనిపిస్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అని ది న్యూయార్క్ పోస్ట్తో బాబీ చావ్లా అన్నారు. తాను ఆ ఇంటిని తన ఆరు నెలల గర్భిణీ సోదరి, ఆమె భర్తకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. -
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం.. రూ.183 కోట్లు టోకరా
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటుపడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అమిత్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. యూఎస్ ఫుట్బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన అమిత్ పటేల్ ఆ టీమ్కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో సుమారు రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన టెస్లా కారు, విలువైన వాచ్, క్రిప్టో కరెన్సీ కొన్నాడు. అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ లో ఫ్రెండ్స్తో కలసి విహార యాత్రలు చేసేవాడు. ఇక ఈ విషయం బయటకు రావడంతో జాక్సన్విల్లే యాజమాన్యం అమిత్ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్ సారథ్యంలోనే!
టెక్నాలజీలో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. భారత్ కూడా ఏ మాత్రం వెనుకడుగేయకుండా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటోంది. భారతీయులు కూడా జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అనేక దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. 2015లో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎంపిక కావడంతో దాదాపు 25 పెద్ద సంస్థలు భారతీయ సంతతికి చెందిన వారి నేతృత్వంలోకి చేరాయి. ఇది గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు చాలా కంపెనీలు భారతీయ సీఈఓల నిర్వహణలోనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా వసంత్ నరసింహన్, మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓగా గణేష్ మూర్తి, ఐబీఎమ్ సీఈఓగా అరవింద్ కృష్ణన్, నెట్ యాప్ సీఈఓగా జార్జ్ కురియన్, మార్నింగ్ స్టార్ సీఈఓగా కునాల్ కపూర్, మైక్రా టెక్నాలజీ సీఈఓగా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వహిస్తూ భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. THE COMPLETE INDIAN TAKEOVER. With Neal Mohan becoming the CEO of YouTube, these are the 25 big firms led by Indian Americans with a total market value of 5 trillion dollars, more than the current Indian GDP. A very proud moment for all Indians.🇮🇳 pic.twitter.com/BPmKsQ6Wus — Aviator Anil Chopra (@Chopsyturvey) November 16, 2023 -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్లు తనకు బాగా ఇష్టం. సైన్స్లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం. -
సాంగ్ రైటర్ కమ్ సింగర్..స్ఫూర్తినిచ్చే పాటలతో అలరిస్తుంది!
టీనేజ్లో న్యూయార్క్కు వెళ్లిన రవీనా అరోరా సింగర్, సాంగ్ రైటర్గా మంచి పేరు తెచ్చుకుంది ‘స్వీట్ టైమ్’ ‘టెంప్టేషన్’ ‘హానీ’ పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక లైవ్ షోలలో పాశ్చాత్య ప్రేక్షకులను హిందీ సాంగ్స్తో అలరిస్తుంటుంది. స్టేజీ మీద ఉన్నట్టుండీ...‘వుయ్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ హిందీ నౌ’ అని ప్రకటిస్తుంది. ఆడిటోరియమ్ కేకలతో నిండిపోతున్న సమయంలో ‘ఏక్, దో, తీన్, చార్, చలోనా, మేరె సాత్’ అంటూ హిందీ పాట అందుకుంటుంది. 60,70లలోని హిందీ చిత్రాల పాటలను పాడుతూ కూడా ఈతరం కుర్రకారును ఆకట్టుకుంటుంది. ‘సంగీతంలో భిన్న ధోరణులను అన్వేషించడం ఇష్టం’ అంటున్న అరోరాకు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలా స్వరం ఇష్టం. భావగర్భితమైన పాట ఇష్టం. రవీనా పాటలు ‘ఆహా, ఒహో’లకు పరిమితమైన పసందైన పాటలు కాదు. ఎన్నో సామాజిక సమస్యలు ఆమె పాటలో భాగమై ఉంటాయి. ‘ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, తమను తాము ప్రేమించుకునేలా, తమను తాము స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా నా పాట ఉండాలనుకుంటాను’ అంటోంది రవీనా అరోరా. (చదవండి: దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను) -
ఛీ..ఛీ.. విమానంలో వికృత చేష్టలు.. ఇండో అమెరికన్ వైద్యుని అరెస్టు..
విమానంలో బాలిక ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి పక్కసీటులో కూర్చున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. గత ఏడాది మేలో ఈ ఘటన జరగగా.. అనేక విచారణల తర్వాత అరెస్టు చేశారు. సుదీప్త మొహంతీ(33) అమెరికాలోని బోస్టన్లో ఇంటర్నల్ మెడిసిన్, ప్రైమరీ కేర్ విభాగంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో స్నేహితురాలితో కలిసి బోస్టన్కు విమానంలో వెళుతున్నారు. కాగా పక్క సీటులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూర్చుంది. ఆ బాలిక తన నానమ్మ తాతయ్యలతో ప్రయాణిస్తోంది. మొహంతీ పక్కనే బాలిక ఉండగా.. అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన బాలిక పక్క సీటులోకి వెళ్లిపోయింది. విమానం దిగగానే తన నానమ్మ, తాతయ్యలతో పాటు విమాన సిబ్బందికి తెలిపింది. బాలిక ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. మొహంతీపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు ప్రాథమికంగా హాజరుపరిచారు. అప్పుడు ఆంక్షలను విధిస్తూ విడుదల చేశారు. విమానంలో అసభ్య చేష్టలకు పాల్పడితే అమెరికా శాసనం ప్రకారం అతనికి 90 రోజుల వరకు జైలు శిక్షతో పాటు 5000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి.. -
వైట్హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం!
భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు. డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ప్రొఫెసర్గా తిరిగి తన పదవిలోకి వెళ్లనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్, సైన్స్ చట్టానికి చెందిన $50 బిలియన్ల పెట్టుబడిని సెమీకండక్టర్స్ పరిశ్రమలో అమలు చేయడం కోసం గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఛటర్జీ ఈ పదవిలో నియమితులయ్యారు. “బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి డ్యూక్ యూనివర్శిటీకి వెళ్లాలని భావిస్తున్నాను. వైట్హౌస్లోని నా సహోద్యోగులందరికీ, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కీలకమైన ఆర్థిక, జాతీయ భద్రతా సమస్యలపై పనిచేసినందుకు సంతోషిస్తున్నాను’అని ఛటర్జీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వైట్ హౌస్లోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్కు కొంతకాలం సేవలు అందించిన ఆయన ఇప్పుడు రిలీవ్ అయ్యారు. గ్లోబల్ చిప్ల కొరతకు పరిష్కారం దిశగా.. చిప్స్ అండ్ సైన్స్ చట్టాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన, రూపకల్పనలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ వేదికపై దేశానికి పోటీతత్వాన్ని అందించడానికి అమలు చేశారు. దీనిని విభిన్న సెమీకండక్టర్ వర్క్ఫోర్స్ను పెంచడానికి గత సంవత్సరం ఆమోదించారు. పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన సెమీకండక్టర్ వ్యూహం గ్లోబల్ చిప్ల కొరతకు పరిష్కారం చూపించనుంది. అలాగే యుఎస్ ఆధారిత తయారీ సౌకర్యాలపై దృష్టి సారించింది. ఇతర దేశాల సరఫరాదారులపై తక్కువ ఆధారపడే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం అమలు చేశారు. తైవాన్, చైనాలతో పెరుగుతున్న ఇబ్బందుల నుంచి పరిష్కారానికి అమెరికాకు ఈ చట్టం చేయడం బాధ్యతగా మారింది. పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తి కాగా ఛటర్జీ 2021 ఏప్రిల్ నుండి వాణిజ్య శాఖకు చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. అక్కడ చటర్జీ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఈ రంగంలో అమెరికాలో పోటీతత్వం పెరిగేందుకు, కార్మిక మార్కెట్లు, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సారధ్యం వహించారు. పొలిటికో ఒక ప్రకటనలో ఛటర్జీని పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తిగా అభివర్ణించింది. ఈ రంగంలో అమెరికాలో చైన్ సిస్టమ్ను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అమెరికా అంతటా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అతని నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. అత్యుత్తుమ సేవలకు అనేక అవార్డులు కాగా ఛటర్జీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలోనూ సేవలు అందించారు. వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్లో సీనియర్ ఆర్థికవేత్తగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో టర్మ్ మెంబర్గా పనిచేసిన ఆయన గోల్డ్మన్ సాక్స్లో ఆర్థిక విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఛటర్జీ అనేక అవార్డులు అందుకున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్లో విశిష్ట పరిశోధన కోసం 2017 కౌఫ్ఫ్మన్ ప్రైజ్ మెడల్, ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ నుండి రైజింగ్ స్టార్ అవార్డు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సొసైటీ ఎమర్జింగ్ స్కాలర్ అవార్డును చటర్జీ అందుకున్నారు. చటర్జీ తన పీహెచ్డీని బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పూర్తిచేశారు. అంతకు ముందు ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టాను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి? -
కోర్టుకు హాజరైన ట్రంప్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయంలో తాను నిర్దోషినని తనకే పాపం తెలీదని చెప్పారు. ఇండియన్ అమెరికన్ మహిళా న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ ఎదుట ట్రంప్ హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ కేసులో ఇరికించారని ట్రంప్ పేర్కొన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినప్పటికీ దానిని అధికారికంగా వెల్లడించకుండా 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు హాలు వెనుక తలుపులోంచి లోపలికి ప్రవేశించారు. ఎవరీ ఉపాధ్యాయ ?: న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ గుజరాత్లో జన్మించారు. ఆమె చిన్నతనంలో తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోవడంతో కన్సస్లో పెరిగారు. -
C R Rao: తెలుగోడికి స్టాటిస్టిక్స్ నోబెల్ అవార్డు, 102 ఏళ్ల వయసులో ఘనత
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (102) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది. సాధించడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి సీఆర్ రావు. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పే.. రాధాకృష్ణారావు.. జీవితంలో ఎన్నో సాధించి ఐకాన్గా నిలిచారు. 62 ఏళ్లకు కూతురి దగ్గర ఉండేందుకు అమెరికా వెళ్లిన రావు, 70 ఏళ్ల వయస్సులో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. ఆయనకు 75 ఏళ్లున్నప్పుడు అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. 82 ఏళ్ల వయస్సులో రావు వైట్ హౌజ్ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ నోబెల్ అందుకుంటున్నారు. సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. (చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్ను కలిసిన ఉద్ధవ్) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెసర్ బ్రాడ్లీ ఎఫ్రాన్, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ Emerita Nan Laird లకు అందజేశారు. (చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!) 2023కి సీఆర్ రావుకు అవార్డు అందనుంది. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్తో సత్కరించింది. -
ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్కు సీఈవోగా అంజలీ సూద్
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు. సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది. అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్బీవో మ్యాక్స్లను కూడా ట్యూబీ అధిగమించింది. -
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్ను బోట్కి అనుసంధానించే టౌలైన్ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొడుకును కాపాడబోయి...
న్యూయార్క్: భారతీయ అమెరికన్ ఒకరు తన కొడుకును కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటాక్రజ్ కౌంటీలో వారం క్రితం ఈ విషాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి కుటుంబంతో పాంథెర్ బీచ్కు వెళ్లారు. అలల్లో కొట్టుకుపోతున్న 12 ఏళ్ల కొడుకును కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. మరొకరి సాయంతో కొడుకును ఒడ్డుకు తీసుకొచ్చారు. అంతలో బలమైన అల మూర్తిని లోపలికి లాక్కెళ్లింది. ఈత రాని ఆయన లోతైన నీళ్లలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మూర్తిని సహాయక సిబ్బంది బయటికి తీసి హెలికాప్టర్లో హాస్పిటల్కు తరలించినా ప్రాణాలు దక్కలేదు. -
బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్కు మరోసారి తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విధానాల్లో నిపుణురాలైన భారత సంతతికి చెందిన నీరా టాండన్ను తన దగ్గర దేశీయ విధాన సలహాదారుగా నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలు రచించడం, వాటిని అమలు పరిచే బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి. ‘‘ఆర్థిక విధానాల దగ్గర్నుంచి జాతి సమానత్వం వరకు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆరోగ్యం, విద్య, వలస విధానాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు జరిగేలా చూడడానికి టాండన్ను డొమెస్టిక్ పాలసీ అడ్వయిజర్గా నియమిస్తున్నాను’’ అని బైడెన్ ప్రకటించారు. టాండన్ ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో కూడా ఆమె పని చేశారు. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా అజయ్ బంగా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలకు సారథులుగా వెలుగొందుతున్న భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నిలిచారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు! ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు. జూన్ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ పదవికి నామినేట్చేశారు. బంగా జనరల్ అట్లాంటిక్ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్కార్డ్ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. -
అమెరికా ఫైనాన్స్లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా
న్యూయార్క్: అమెరికా ఆర్థికరంగంలో భారత సంతతి మహిళలు సత్తా చాటారు. అత్యంత ప్రభావవంత 100 మంది మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను వాల్స్ట్రీట్ జర్నల్కు అనుబంధమైన బారన్ నాలుగో వార్షిక జాబితాలో రూపొందించింది. ఆర్థిక సేవల రంగంలో ఉన్నత స్థాయిలకు చేరడంతో పాటు ఈ రంగభవితను మార్చడంలో కీలక పాత్రను పోషించిన అత్యుత్తమ 100 మంది మహిళలను ఇందులో చేర్చారు. ఈ లిస్ట్లో జేపీ మోర్గాన్కు అను అయ్యంగార్, ఏరియల్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన మీనా లక్డావాలా-ఫ్లిన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కుచెందిన రూపాల్ జె భన్సాలి, గోల్డ్మన్ సాక్స్ గ్రూప్కు చెందిన సోనాల్ దేశాయ్, బోఫా సెక్యూరిటీస్కు సెక్యూరిటీస్కి చెందిన సవితా సుబ్రమణియన్కు స్థానం లభించడం విశేషం. వీరితోపాటు పాకిస్థానీ అమెరికన్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నువీన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సైరా మాలిక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అను అయ్యంగార్: బారన్ వివరాల ప్రకారం జేపీ మోర్గాన్లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయహెడ్గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 2020 జనవరి నుంచి ఈ విభాగానికి కో-హెడ్గా పనిచేశారు. స్మిత్ బిజినెస్ అడ్వైజరీ నెట్వర్క్కు కో-చైర్గా కూడా ఉన్నారు. అయ్యంగార్ తన భర్తతో కలిసి న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. స్మిత్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బీఏ, వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఏంబీఏ చేశారు. రూపాల్ జె భన్సాలీ(55): ఏరియల్ ఇన్వెస్ట్మెంట్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, పోర్ట్ఫోలియో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 100 వుమెన్ ఇన్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. మనీ మేనేజింగ్ కోసమే తాను పుట్టానని చెప్పుకునే మహిళలను ఫైనాన్స్లో పనిచేసేలా ప్రోత్సహించాలనే ఆసక్తి ఎక్కువ. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో మాస్టర్ ఆఫ్ కామర్స్, తరువాత రోచెస్టర్ విశ్వవిద్యాలయంనుండి ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఆమె రోటరీ ఫౌండేషన్ స్కాలర్ కూడా. సోనాల్ దేశాయ్(58): 2018లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు ముఖ్య పెట్టుబడుల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె నిర్వహణలో 137 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డ్రెస్డ్నర్ క్లీన్వోర్ట్ వాసర్స్టెయిన్, థేమ్స్ రివర్ క్యాపిటల్లో పనిచేసిన తర్వాత 2009లో ఆమె ఈ సంస్థలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కరియర్ ప్రారంభించారు. మీనా లక్డావాలా-ఫ్లిన్ (45): ఒలింపిక్స్లో పోటీపడాలనుకునే ఉత్సాహభరితమైన జిమ్నాస్ట్. కానీ మోకాలి గాయం కారణంగా ఆమె దృష్టి ఫైనాన్స్ కెరీర్ వైపు మళ్లింది. అలా ఈక్విటీ సేల్స్ డెస్క్లో పనిచేస్తున్న ఫ్రైడ్మాన్, బిల్లింగ్స్ రామ్సే గ్రూప్లో ఇంటర్న్షిప్ చేసింది. గ్లోబల్ ఇన్క్లూజన్, డైవర్సిటీ కమిటీకి కో-ఛైర్గా పనిచేశారు. గ్లోబల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి కో-హెడ్గాను, 1999లో జేపీ మోర్గాన్ ఛేజ్లో పనిచేశారు. ఆతర్వాత గోల్డ్మన్ శాక్స్కు మారారు. సవితా సుబ్రమణియన్ (50): బ్యాంక్ ఆఫ్ అమెరికాలో యూఎస్ ఈక్విటీ, క్వాంటిటేటివ్ స్ట్రాటజీ విభాగ హెడ్గా ఉన్నారు. ఈక్విటీలపై యూఎస్ సెక్టార్ కేటాయింపులను సిఫార్సు చేయడం, S&P 500 ఇతర ప్రధాన సూచీలకు అంచనాలను నిర్ణయించడం చేస్తారు. అలాగే సంస్థాగత వ్యక్తిగత క్లయింట్లకు సంస్థ పరిమాణాత్మక ఈక్విటీ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. -
అమెరికాలో ఎయిర్పోర్ట్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం
న్యూయార్క్: స్నేహితుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ అమెరికన్, తెలుగు వ్యక్తి విశ్వచంద్ కోళ్ల (47) అనుకోని ఎయిర్పోర్ట్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచి వస్తున్న విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీలోని లోగన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. ఆయన కోసం విశ్వచంద్ లోగన్ ఎయిర్పోర్ట్కు మార్చి 28 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎస్యూవీ వాహనంలో చేరుకుని టర్మినల్–బి వద్ద వేచిచూస్తున్నారు. విమాన ప్రయాణికులు, లగేజీతో అదే సమయంలో అటుగా వచ్చిన డార్డ్మౌత్ ట్రాన్పోర్టేషన్ బస్సు విశ్వచంద్ను పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని నలిగిపోయి అక్కడే పడిపోయారు. ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. విశ్వచంద్ది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె అని సమాచారం. అమెరికాలో తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్ ఉన్నారు. విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంధువులు గోఫండ్మీ ద్వారా ఇప్పటికే 4,06,151 డాలర్లు (దాదాపు రూ.3.3 కోట్లు) విరాళంగా సేకరించారు. -
రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి దక్కింది. శాఖకు సంబంధించిన నిర్వహణ, వనరుల వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. దీన్ని అత్యంత శక్తిమంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన సీఈఓ స్థాయి పోస్టుగా పరిగణిస్తుంటారు. 54 ఏళ్ల వర్మ నియామకాన్ని సెనేట్ 67–26 ఓట్లతో ఆమోదించింది. మాజీ దౌత్యవేత్త అయిన వర్మ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ (న్యాయ వ్యవహారాలు)గా కూడా పని చేశారు. 2015 నుంచి రెండేళ్లపాటు భారత్లో అమెరికా రాయబారిగా ఉన్నారు. వర్మ 1968లో అమెరికాలోని భారతీయ కుటుంబంలో జన్మించారు. అమెరికా వైమానిక దళ స్కాలర్షిప్తో కాలేజీ చదువు పూర్తి చేశారు. లాహిగ్ వర్సిటీ నుంచి బీఎస్, జార్జ్టౌన్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేశారు. అనంతరం యూఎస్ ఎయిర్ఫోర్స్లో జడ్జ్ అడ్వొకేట్గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశాధ్యక్షుని నిఘా సలహా బోర్డులో, సామూహిక జనహనన ఆయుధాలు, ఉగ్రవాద కమిషన్ సభ్యునిగా చేశారు. ప్రస్తుతం మాస్టర్కార్డ్ చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్గా ఉన్నారు. ఫోర్డ్ ఫౌండేషన్తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బోర్డుల్లో సభ్యునిగా, ట్రస్టీగా కొనసాగుతున్నారు. విదేశాంగ శాఖ నుంచి అత్యుత్తమ సేవా మెడల్, వైమానిక దళం నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్, కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలోషిప్ తదితరాలు దక్కించుకున్నారు. -
అమెరికా ఎయిర్ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా చౌధరి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ రవి చౌధరి చరిత్ర సృష్టించారు. అమెరికా రక్షణ శాఖలో ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఈయనే. రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్లోని ఈ అత్యున్నత పదవికి రవి చౌధరిని నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన సిఫారసును సెనేట్ 65–29 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన డజనుకు పైగా సభ్యులు సైతం రవి చౌధరికి మద్దతివ్వడం విశేషం. రవి అమెరికా ఎయిర్ ఫోర్స్లో 1993–2015 నుంచి 22 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ)లోని అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి డైరెక్టర్ కూడా వ్యవహరించారు. సి–17 పైలట్గా అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్ ఇంజినీర్ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు. -
అమెరికాలో భారతీయుల హవా.. సంపాదనలో సూపర్
-
బైడెన్ టీంలోకి వినయ్ రెడ్డి..!
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలోకి మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చేరారు. వినయ్ రెడ్డి, గౌతమ్ రాఘవన్లకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తనకు దీర్ఘ కాలంగా సహాయకుడిగా ఉన్న వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్గా నియమించగా.. గౌతమ్ రాఘవన్కి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో రాఘవన్ వైట్హౌస్లో సీనియర్ అధికారిగా విధులు నిర్వహించారు. ఇక వినయ్ రెడ్డి, రాఘవన్లతో పాటు మరో నలుగురికి బైడెన్ తన టీమ్లో చోటు కల్పించారు. వీరిలో గతంలో ఒబామా టీమ్లో పనిచేసిన అన్నె ఫిలిపిక్ ఉండగా.. ఆమెకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డైరెక్టర్, మేనేజ్మెంట్.. ర్యాన్ మోంటోయా అనే ఒబామా మాజీ స్టాఫ్కు డైరెక్టర్ ఆఫ్ షెడ్యూలింగ్ అండ్ అడ్వాన్స్ బాధ్యతలు అప్పగించారు. బైడెన్తో చాలాకాలంగా పనిచేస్తున్న బ్రూస్ రీడ్కి డిప్యూటీ చీఫ్ స్టాఫ్, ఎలిజబెత్ విల్కిన్స్ని చీఫ్ స్టాఫ్ సీనియర్ అడ్వైజర్గా నియమించుకున్నారు. ఇప్పటికే కమలా హారిస్ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్ను బడ్జెట్ చీఫ్గా, వేదాంత్ పటేల్లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బైడెన్ తన టీమ్లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికాను అగ్రపథంలో నిలుపుతాం!) ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ‘నూతనంగా నియమితులైన అధికారులు తనతో కలిసి పాలసీలను రూపొందించడంలో.. అమెరికాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తారని’ వెల్లడించారు. రాఘవన్ గతంలో ఒబామా వైట్హౌస్ బృందంలోనూ సేవలందించారు. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ టీమ్లోనూ చీఫ్ స్టాఫ్గా వ్యవహరించారు. వినయ్ రెడ్డి బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్గా పనిచేసిన వినయ్ ఇప్పుడు రైటర్స్ టీమ్ హెడ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. -
అమెరికా ఎన్నికలు: మూడో సారి గెలిచిన రాజా కృష్ణమూర్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వివరాలు.. డెమొక్రాటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి మూడో సారి విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి ప్రత్యర్థిప్రెస్టన్ నెల్సన్పై విజయం సాధించారు. 71 శాతం ఓట్లతో గెలుపొందారు. కృష్ణమూర్తి 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. (ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు ) మరో భారత సంతతి వ్యక్తి అమి బెరా కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదో సారి విజయం సాధించాలని ఆశిస్తున్నారు. అలానే మరో ఇండియన్ అమెరికన్ ఆర్ఓ ఖన్నా కూడా కాలిఫోర్నియా నుంచి మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇండో అమెరికన్ ప్రమిలా జయపాల్ కూడా వాషింగ్టన్ నుంచి మూడోసారి గెలుపొందాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. -
పాక్ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి
-
భారతీయ అమెరికన్కు 10 ఏళ్లు జైలు
వాషింగ్టన్: షేర్ హోల్డర్లను రూ.315కోట్ల మేర మోసం చేసిన కేసులో శ్రీధర్ పోతరాజు అనే భారతీయ అమెరికన్ డాక్టర్కు 10ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. అమెరికాలోని మేరీ ల్యాండ్, వర్జీనియాలో శ్రీధర్ కళ్ల సర్జన్గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1999లో ఆయన వైటల్స్ప్రీంగ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారు. 2008 ఆర్థిక మాంద్యం నేపథ్యంలో లాభాలను అధికంగా చూపి 174మంది ఇన్వెస్టర్ల నుంచి రూ. 315 కోట్లు సేకరించాడు. కంపెనీ ఎంప్లాయిమెంట్ ట్యాక్స్ చెల్లించలేదని ఐఆర్ఎస్ ప్రకటించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
భార్యను పొడిచి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు!
హూస్టన్: భార్యపై హత్యాయత్నం చేసిన భారత అమెరికన్ జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన అరుదైన సంఘటన ఇది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలే ఆయన్ను కాపాడాయి. కాన్కాస్ నివాసి నవీన్కుమార్ పటేల్(46) భార్య పప్పు తృణ ధాన్యాలు తిన్నదని తను నడుపుతున్న హోటల్లోనే చిన్న కత్తితో పొత్తి కడుపులో రెండు సార్లు పొడిచాడు. ఆమె లావుగా ఉన్నందునే అలా చేశానని పోలీసుల వద్ద అంగీకరించాడు. హిందూ సంస్కృతి ప్రకారం... భర్తను అరెస్టు చేస్తే అతని భార్య, పిల్లలను పటేల్ వర్గం బహిష్కరిస్తుందని అతని తరపు లాయర్ జాన్ కెర్న్స్ డగ్లస్ కౌంటీ జడ్జి రాబర్ట్ ఫేర్చైల్డ్కి విన్నవించారు. హిందూ సంప్రదాయాలు అతనికి శిక్ష విధించడంలో అడ్డంకిగా మారాయని జడ్జి అన్నారు. ప్రస్తుతానికి పటేల్కు ప్రొబేషన్ విధించారు. నేరాలకు తిరిగి పాల్పడకుండా నిరోధించే ప్రణాళికలు తయారుచేసే వరకు తాత్కాలికంగా జైలుకు పంపారు. పటేల్ మద్యానికి బానిసై ‘బైపోలార్ డిసార్డర్’ అనే రుగ్మత వల్లే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన్ను పరీక్షించిన వైద్యుడు చెప్పారు. తాగడం మాని వైద్యాన్ని కొనసాగిస్తే నేరాలకు పాల్పడే అవకాశం తగ్గుతుందని సూచించారు. విచారణ సమయంలో భార్యతో పాటు కుటుంబ సభ్యులు పటేల్కు మద్దతుగా నిలిచారు. తేలికపాటి శిక్ష విధించాలని జడ్జికి ఉత్తరాలు కూడా అందాయి. ఇకపై పటేల్ తాగకుండా జాగ్రత్తపడతామని కుటుంబ సభ్యులు జడ్జికి హామీ ఇచ్చారు. -
వాషింగ్టన్ ప్రైమరీ విజేతగా భారత అమెరికన్
వాషింగ్టన్: వాషింగ్టన్ ఓపెన్ కాంగ్రెషనల్ ప్రైమరీలో ఇండియన్ అమెరికన్ ప్రమీలా జయపాల్ విజయం సాధించారు. నవంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ గెలిస్తే ఆమె అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యురాలు అవుతారు. చెన్నైలో జన్మించిన ప్రమీల.. ఇండోనేసియా, సింగపూర్లలో పెరిగారు. 1982లో అమెరికాలో స్థిరపడ్డారు. ప్రమీల కాకుండా మరో ముగ్గురు భారత అమెరికన్లకు (అమీ బెరా, రాజ కృష్ణమూర్తి, ఖన్నా) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఎంపికయ్యే అవకాశం ఉంది. -
రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా ఇండో అమెరికన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా భారత సంతతికి చెందిన సంపత్ శివంగి నియమితులయ్యారు. సంపత్ శివంగిని పార్టీ ప్రతినిధిగా నియమిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిల్చిన డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చాలారోజులుగా ఇండియన్ అమెరికన్ పొలిటికల్ వింగ్లో సభ్యుడిగా కొనసాగుతున్న సంపత్ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా నియమితుడు కావడం ఇది నాలుగోసారి. మొదటిసారిగా 2004లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నియమించగా, 2008లో అప్పటి పార్టీ అధ్యక్ష అభ్యర్థి మెక్కెయిన్ రెండోసారి సంపత్నే ఎంచుకున్నారు. 2012లో అధ్యక్ష అభ్యర్థిగా నిలబడ్డ మిత్ రోమ్ని కూడా సంపత్నే పార్టీ అధికార ప్రతినిధిగా నియమించగా తాజాగా ట్రంప్ కూడా అదే బాటలో నడిచారు. నాలుగోసారి పార్టీ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నట్లు సంపత్ తెలిపారు. -
అలనాటి కాన్పూర్ విద్యార్థికి ఒబామా సన్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి భారతీయ సంతతి పౌరుడికి గుర్తింపును ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన రాకేష్ కే జైన్ (65)ను ఒబామా సైన్స్ మెడల్ తో సత్కరించారు. మరో పాక్ సంతతి పౌరుడికి కూడా ఒబామా ఈ సన్మానం చేశారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ ఆస్పత్రిలో రాకేష్ విశేష సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ వ్రణాలపై పరిశోధించి ముందస్తుగా దానిని గుర్తించేలా నివారణ చర్యలు తీసుకునేలా, వైద్య ప్రక్రియను కూడా ఆయన ఆవిష్కరించారు. జైన్ అలనాడు ఐఐటీ కాన్పూర్ విద్యార్థి. ఇప్పటికే ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1972లోనే కాన్పూర్ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. 1959లో ప్రారంభించిన ఈ అవార్డు నేషనల్ సైన్స్ పౌండేషన్ తరుపున ప్రతి ఏడాది వైట్ హౌస్ అందిస్తుంది. ఇక పాక్ సంతతికి చెందిన హుమయూన్(53) కూడా ఒబామా చేతుల మీదుగా సత్కారం పొందారు. -
'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'
వాషింగ్టన్: భారతీయ సంతతికి వ్యక్తులకు చెందిన రెండు కంపెనీలకు అమెరికా కోర్టు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. దాదాపు రూ.68,41,458.17(103000 డాలర్లు) మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.5579441.62(84,000డాలర్లు) ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించింది. ఇంతమొత్తంలో ఆ కంపెనీలకు ఎందుకు ఫైన్ వేశారని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం ఆ కంపెనీలు హెచ్-1బీ వీసాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడటమే. సిలికాన్ వ్యాలీలో గల ప్రముఖ కంపెనీలైన స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, ఆరియాన్ ఇంజినీర్స్ అనేవి భారతీయ సంతతికి చెందిన వ్యక్తులైన కిషోర్ కుమార్ మరో వ్యక్తికి సంబంధిన కంపెనీలు. ఈ కంపెనీ భారత్తోపాటు ఇతర దేశాల నుంచి కూడా తమ కంపెనీకి హెచ్-1బీ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఈబే, ఆపిల్, సిస్కో సిస్టమ్ కంపెనీల మాదిరిగా రప్పించింది. అయితే, ఈ క్రమంలో ఆ కంపెనీలు వీసా ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన లేబర్ వేజ్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. వీసాల్లో పేర్కొన్న విధంగా సదరు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి భారీ ఫైన్ వేసింది. -
కాలిఫోర్నియాలో పోస్ట్మాస్టర్గా భారత సంతతి మహిళ
న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో పోస్ట్మాస్టర్గా భారత సంతతికి చెందిన జగ్దీప్ గ్రేవాల్ నియమితులయ్యారు. గత 166 ఏళ్లలో ఇక్కడ పోస్ట్మాస్టర్గా నియమితులైన తొలి మహిళ జగ్దీప్ గ్రేవాల్ కావడం విశేషం. 537 సిటీ మార్గాలు, 94 రూరల్ ప్రాంతాల్లో విధుల నిర్వహించే 1,004 మంది ఉద్యోగులకు ఆమె నేతృత్వం వహిస్తారు. భారత్లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రేవాల్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1988లో విండో క్లర్క్గా తపాలా శాఖలో కెరీర్ ప్రారంభించారు. ఐదేళ్లలోనే మేనేజర్ స్థాయికి ఎదిగారు. తపాల సేవలకు ఆదరణ తగ్గిన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తోటి ఉద్యోగులతో కలిసి మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు. కాగా యూఎస్ తపాల శాఖ తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. గతేడాది 586 మిలియన్ డాలర్ల నికర నష్టాలను చవిచూసింది. -
భారతీయ అమెరికన్కు యంగ్ సైంటిస్ట్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డును ఈ ఏడాదికిగానూ కరణ్ జెరాత్ (18) అనే భారతీయ అమెరికన్ గెలుచుకున్నాడు. సముద్రగర్భంలోని చమురుబావుల నుంచి చమురు, సహజ వాయువు, నీటి లీకేజీని వెంటనే అరికట్టగల పరికరాన్ని కనిపెట్టినందుకు కరణ్కు ఈ అవార్డు లభించింది. శుక్రవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్ నగరంలో జరిగిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్-2015లో కరణ్ ఈ అవార్డు అందుకున్నాడు. అవార్డు కింద సుమారు రూ. 31 లక్షలు (50 వేల డాలర్లు) అతనికి లభించాయి. అలాగే ‘ఇండో-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం విజి ట్ టు ఇండియా అవార్డు’కు ఎంపికైన ఐదుగురు విద్యార్థుల్లో ఒకడిగా నిలిచాడు. కరణ్తోపాటు మరో ఇద్దరు టీనేజర్లు ఇదే అవార్డును గెలుచుకున్నారు. హెచ్ఐవీ వల్ల సోకే ఇన్ఫెక్షన్లను త్వరగా నిర్ధారించేందుకు నూతన విధానాన్ని ఒకరు కనిపెట్టగా విమానాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచే సాఫ్ట్వేర్ను మరొకరు రూపొందించారు. -
భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: భ్రూణహత్యకు పాల్పడినందుకు ఓ భారత సంతతి మహిళలకు అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్వీ పటేల్(33) అనే మహిళ అమెరికాలోని ఇండియానా రాష్ట్రం గ్రాంగర్ లో నివాసం ఉంటోంది.2013 వ సంవత్సరంలో గర్భవతిగా ఉన్న పూర్వీ ఆన్ లైన్ ద్వారా విదేశాల నుంచి తెప్పించుకున్న మందులు వాడి గర్భస్రావం చేయించుకుంది. ఈ క్రమంలోనే పిండాన్ని బ్యాగ్ లో చుట్టి చెత్త తీసుకు వెళ్లే వాహనంలో వేసింది. అనంతరం ఆమెకు రక్తస్రావం అధికం కావడంతో ఆసుపత్రిలో చేరింది. దీనికి సంబంధించి ఆమెను పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెపై అప్పట్లో భ్రూణ హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారించిన కోర్టు పూర్వీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. -
అమెరికా సర్జన్ జనరల్గా వివేక్ మూర్తి
వాషింగ్టన్: అమెరికా సర్జన్ జనరల్గా 37 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ మూర్తి నియామకాన్ని సెనేట్ ఆమోదించింది. దీంతో పిన్న వయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే. బోస్టన్లో వైద్య వృత్తిలో స్థిరపడిన మూర్తి కర్ణాటకలో జన్మించారు. మూడేళ్ల వయసులోనే అమెరికాకు వలసవెళ్లారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీగా పట్టాలు పుచ్చుకున్నారు. -
అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ సంతతికి చెందిన ఏకైక సభ్యుడు అమిరేష్ 'అమీ' బెరా తాజా ఎన్నికలలో కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు. రెండువారాల కిందట జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన అమీ బెరా తొలుత తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీకి చెందిన డౌగ్ ఓసే కంటే 3వేల ఓట్లు వెనుకబడ్డారు. మిగిలిన ఓట్లన్నీ లెక్కించేసరికి 1,432 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2012లో కూడా అమీ బెరా గెలిచారు. ఈసారి హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన అమీ బెరాకు ప్రత్యర్థి డౌగ్ ఓసే అభినందనలు తెలిపారు. ** -
డబ్బులిచ్చి.. చెంపదెబ్బలు తిన్నాడు..
నవ్వుతూ చెంప వాయించేందుకు చేయి లేపిన ఈ అమ్మాయి ఉద్యోగి. అతను బాస్. అవును.. ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా చెంపదెబ్బ కొట్టేందుకే ఆమెను ఉద్యోగంలో పెట్టుకున్నాడు మనీశ్ సేథీ అనే ఈ భారతీయ అమెరికన్. కొన్నాళ్లు చెంపదెబ్బలు తిన్నతర్వాత ఈయన ఫేస్బుక్ను అతిగావాడే అలవాటును మానుకున్నాడట కూడా. రెండేళ్ల క్రితం ఈ సంగతి తెలిసి ఇంటర్నెట్లో ఈయన తెగ పాపులర్ కూడా అయిపోయారు. అయితే మనుషులకు కాస్త హెచ్చరికగా కొట్టడం లేదా షాక్లివ్వడం చేస్తే కొన్నాళ్లకు అలవాట్లను మార్చుకుంటారని సేథీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడట. అందుకే.. ఇప్పుడు షాక్లిస్తూ మనుషుల్ని దారిలోపెట్టే సరికొత్త రిస్ట్బ్యాండ్ను తయారుచేశారు. పొద్దున్నే వాకింగ్కు వెళ్లాలనుకుని.. తీరా అలారం మోగేసరికి దాని బటన్ నొక్కేసి ముసుగుతన్నేసే వారిని ‘పావ్లోక్’ అనే ఈ రిస్ట్బ్యాండ్ షాక్లిచ్చి మరీ నిద్రలేపుతుందట. తొలుత రెండుసార్లు వైబ్రేషన్లు ఇచ్చిన తర్వాత ఇది షాక్ కొడుతుందట. బద్దకిస్టులు, ఫేస్బుక్, ఇతర సైట్లను ఎక్కువగా చూసేవారు దీనిని ధరిస్తే షాక్లిస్తూ దారికి తెస్తుందట. వివిధ అలవాట్లు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్లో నిక్షిప్తంచేస్తే.. దానికి అనుగుణంగా ఈ బ్రేస్లెట్ పనిచేస్తుందంటున్నారు. సుమారు రూ.15 వేల ఖరీదైన ఈ చేతిపట్టీ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. -
న్యూజెర్సీ అసెంబ్లీకి భారతీయ అమెరికన్
న్యూయార్క్: న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డెమొక్రటిక్ పార్టీ ప్రతిపాదించిన 29 ఏళ్ల రాజ్ ముఖర్జీ చిన్న వయసులోనే అసెంబ్లీకి ఎన్నికైనవారిలో ఒకడిగా నిలిచిపోనున్నారు. రాజ్ముఖర్జీ గతంలో న్యూజెర్సీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం జెర్సీ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. మొదటి సారిగా డెమొక్రటిక్ పార్టీ ముఖర్జీని 33వ లెజిస్లేటివ్ జిల్లాకు ప్రతిపాదించింది. జూన్లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఆయన 36 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ముఖర్జీకి 18,586 ఓట్లు సాధించారు. స్కూల్లో ఉన్నప్పుడే ఇంటర్నెట్ కన్సల్టెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీని స్థాపించి ముఖర్జీ తన సత్తా చూపారు. దాన్ని తర్వాత పెద్ద టెక్నాలజీ కంపెనీకి విక్రయించారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత యూఎస్ మెరైన్స్లో 17 ఏళ్లకే చేరిపోయారు. 19ఏళ్ల వయసులో ప్రజావ్యవహారాల కంపెనీని స్థాపించారు. దాన్ని న్యూజెర్సీలో మూడవ అతిపెద్ద న్యాయవాదుల లాబీయింగ్ కంపెనీగా తీర్చిదిద్దారు. పలు సంస్కరణల కోసం పనిచేశారు. -
ఒబామా కొలువులో మరో భారతీయుడు
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మరో అత్యున్నత పదవి లభించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా కేరళకు చెందిన అరుణ్.ఎం.కుమార్ను అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. క్లిష్టపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాను గాడిన పడవేయడానికి ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి వరకు అరుణ్ కుమార్ కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యునిగా ఉన్నారు. శుక్రవారం అసిస్టెంట్ సెక్రటరీగా, అమెరికా విదేశీ వాణిజ్యసేవల విభాగం, అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్గా నియమితులయ్యారు. అరుణ్ గత నెల వరకు వెస్ట్కోస్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అధిపతిగా పనిచేశారు. 2007-2013 మధ్య అమెరికా-భారత వ్యవహారాలను పర్యవేక్షించారు. కేరళ వర్సిటీ నుంచి భౌతికశాస్త్రంలో పట్టా పొందిన అరుణ్ అమెరికా వెళ్లి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మేనేజ్మెంట్లో డి గ్రీ పుచ్చుకున్నారు. -
యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ
అమెరికా (యూఎస్)లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఆమెను నామినేట్ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్ షాను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా మహిళ ఇందిర కావడం విశేషం. ఇందిర ప్రస్తుతం బోస్టన్లోని సెగల్ రొటిమన్ ఎల్ఎల్పీలో విధులు నిర్వహిస్తోంది. అక్కడే రాష్ట్ర ఫెడరల్ ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసింది. పదోన్నతిపై మసాచూసెట్స్లో న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తారనే నమ్మకముందని ఒబామా అన్నారు. -
యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్
అమెరికా (యూఎస్)లో మరో భారత సంతతి వ్యక్తిని కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ మనీష్ ఎస్ షా నియమితులయ్యారు. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తన స్వరాష్ట్రం ఇలినాయిస్లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయను నామినేట్ చేశారు. షాతో సహా ఏడుగురి నియామకాలను ఒబామా ఖరారు చేసినట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. న్యూయార్క్లో జన్మించిన 40 ఏళ్ల షా ప్రస్తుతం క్రిమినల్ డివిజన్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2011-12 మధ్య కాలంలో ఆయన క్రిమినల్స్ అపీల్స్ చీఫ్గా పనిచేశారు. గతంలో ఆర్థిక నేరాలు, ప్రత్యేక విచారణ విభాగం డిప్యూటీ చీఫ్గా వ్యవహరించారు. షా తాజా నియామకాన్ని ఇలినాయిస్ రాష్ట్రానికి చెందిన సెనెటర్లు డెమోక్రట్ డిర్క్ డర్బిన్, రిపబ్లికన్ మార్క్ కిర్క్ స్వాగతించారు. -
భారతీయ అమెరికన్కు ఇండెక్స్ డిజైన్ అవార్డు
న్యూయార్క్: ఆహారాన్ని దీర్ఘకాలంపాటు తాజాగా ఉంచేందుకు దోహదపడే తాజా కాగితం(ఫ్రెష్ పేపర్) రూపొందించిన భారతసంతతి అమెరికన్ కవితశుక్లా ఇండెక్స్ డిజైన్ అవార్డును గెలుచుకున్నారు.ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దోహదపడే అత్యుత్తమ ఆవిష్కరణలకు గుర్తింపుగా.. రూ.4.25 కోట్ల విలువైన ఈ అవార్డును రెండేళ్లకోసారి డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో అందజేస్తారు. హోమ్ కేటగిరీలో శుక్లా ఎంపికయ్యారు. సాదాసీదాగా ఉండటమే కాకుండా ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండేవిధంగా ఉన్న ఫ్రెష్ పేపర్ ధర న్యాయనిర్ణేతలను విశేషంగా ఆక ర్షించింది. అమెరికా మార్కెట్లలో ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. రిఫ్రిజిరేటర్లు పరిమితంగా ఉన్న అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ‘ఇండెక్స్’ జ్యూరీ చైర్మన్ మికాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.