-
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఐపీఎల్ 2024 సీజన్ సెంచరీల విషయంలో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. ఈ సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113*), సునీల్ నరైన్ (56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108*), జానీ బెయిర్స్టో (48 బంతుల్లో 108*), జోస్ బట్లర్ (60 బంతుల్లో 107*), రోహిత్ శర్మ (63 బంతుల్లో 105*), యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104*), శుభ్మన్ గిల్ (55 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102*), ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102), జోస్ బట్లర్ (58 బంతుల్లో 100*), విల్ జాక్స్ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. ఈ సీజన్ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, విల్ జాక్స్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్ ఆర్సీబీపై.. జాక్స్ గుజరాత్పై 41 బంతుల్లో శతక్కొట్టారు.సీజన్ల వారీగా సెంచరీలు..2024- 14 సెంచరీలు2023- 12 సెంచరీలు2022- 8 సెంచరీలు2021- 4 సెంచరీలు2020- 5 సెంచరీలు2019- 6 సెంచరీలు2018- 5 సెంచరీలు2017- 5 సెంచరీలు2016- 7 సెంచరీలు2015- 4 సెంచరీలు2014- 3 సెంచరీలు2013- 4 సెంచరీలు2012- 6 సెంచరీలు2011- 6 సెంచరీలు2010- 4 సెంచరీలు2009- 2 సెంచరీలు2008- 6 సెంచరీలుఓవరాల్గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. -
ఐపీఎల్ ఫైనల్లో షారూఖ్ సందడి.. ఆ వాచ్తో లైఫ్టైమ్ సెటిల్మెంట్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గతేడాది జవాన్, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్ను వీక్షించారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది.కేకేఆర్ విజయంతో బాలీవుడ్ బాద్షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్కు హాజరైన షారూఖ్ ఖాన్ వాచ్పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్గా గుర్తించారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దట్ ఇజ్ కింగ్ ఖాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు. -
తెలుగు కుర్రాడు అరుదైన ఘనత.. నితీష్ రెడ్డి టీమిండియాలోకి ఎంట్రీ ..!
-
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్మనీ- రూ. 12.5 కోట్లు (సన్రైజర్స్) -
పొట్టి ప్రపంచకప్పై ఐపీఎల్ ప్రభావమెంత..?
రెండు నెలలకు పైగా జరిగిన క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిన్నటితో (మే 26) ముగిసింది. ఈ సీజన్ ఫైనల్లో కేకేఆర్.. సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే మరో మహా క్రికెట్ సంగ్రామం మొదలుకానుంది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది.పొట్టి ప్రపంచకప్ ఐసీసీ ఈవెంట్ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే టోర్నీ కావడంతో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయి. ఈ సారి వరల్ఢ్కప్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్కు ఐదు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్లుగా విభజించబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్.. చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో భారత్, పాక్లతో పాటు యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా దేశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ రెండు నెలల సుదీర్ఘ కాలంపాటు సాగిన నేపథ్యంలో ఓ ఆసక్తిర ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు (దాదాపుగా) చెందిన ఆటగాళ్లు ఇన్ని రోజుల పాటు ఐపీఎల్తో బిజీగా ఉండటంతో ఈ లీగ్ ప్రభావం పొట్టి ప్రపంచకప్పై ఏమేరకు పడనుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఐపీఎల్ ముగిసి వారం రోజులు కూడా గడువక ముందే పొట్టి ప్రపంచకప్ ప్రారంభంకావడం మంచిదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఐపీఎల్ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల ఆటగాళ్లు అలసిపోయుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ప్రభావం ఆటగాళ్లపై నెగిటివ్గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లలో సీరియస్నెస్ కొరవడిందని కొందరంటున్నారు. ఐపీఎల్లో ఆడి కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్లో లభించే డబ్బును చూసుకుని కొందరు ఆటగాళ్లు దేశీయ విధులపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ ముగిసి వారం కూడా గడవక ముందే మెగా టోర్నీ నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఐపీఎల్ వల్ల మంచే జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ వల్ల తమ దేశ ఆటగాళ్లకు మంచే జరిగిందని ఆసీస్ అభిమానులు అనుకుంటున్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఐపీఎల్ ఆడటం వల్ల తమ దేశ క్రికెటర్లకు ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలిసొచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఏకీభవించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా తప్పుచేసిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే పొట్టి ప్రపంచకప్ ఇంకాస్త ఎక్కువగా సన్నద్దమయ్యేవారని వాన్ అన్నాడు.భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఐపీఎల్ ప్రతిభే కొలమానంగా ప్రపంచకప్ జట్టు ఎంపిక జరిగింది. ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్ బెర్త్ దక్కింది. జట్టులో స్థానం విషయంలో సెలెక్టర్లు ఎలాంటి ములాజలకు పోకుండా అర్హులైన వారినే ఎంపిక చేశారు. ప్రపంచకప్కు సంబంధించి వ్యూహాలు వేరుగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్ వల్ల భారత ఆటగాళ్లకు మేలే జరిగిందని చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్లో కీలక ఆటగాళ్లెవరు గాయాల బారిన పడలేదు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఆటగాళ్లందరూ మాంచి ఫామ్లో ఉండటంతో జట్టు ఎంపిక కూడా చాలా కష్టమైంది. కొన్ని సమీకరణల కారణంగా కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే పొట్టి ప్రపంచకప్పై ఐపీఎల్ ప్రభావం అనే అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు. -
IPL 2024 Final: కేకేఆర్కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లుగా నిలిచి కేకేఆర్కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024: కేకేఆర్దే 'కిరీటం' (ఫొటోలు)
-
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్కు సంబంధించి ఆల్టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
బెంగళూరు టీమ్పై నటి వ్యంగ్య పోస్ట్.. ఆ రెండేళ్లు మర్చిపోయారా? అంటూ సెటైర్లు!
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో హీరోయిన్గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్తో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. సామాజిక, రాజకీయ అంశాల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఐపీఎల్ టీం బెంగళూరు ఓటమిపై పోస్ట్ పెట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయిన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రముఖ కోలీవుడ్ నటి కస్తూరి తన ట్విటర్లో ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. చాలా ఏళ్లుగా ఈ విషయం అక్కడి వారికి తెలుసు అంటూ బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ పిక్ను షేర్ చేసింది. అంతే కాకుండా 'ఈసాలా కూడా కప్ ఇల్లా' అంటూ కించపరిచేలా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్టుకు కౌంటర్గా కామెంట్స్ పెడుతున్నారు. సీఎస్కే టీమ్లా రెండేళ్లు మా టీమ్ బ్యాన్ కాలేదని గుర్తు చేస్తున్నారు. మీ టీమ్ అంతా ఫిక్సింగ్ అంటూ కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు. మీ టీమ్ చెన్నై ఫిక్సింగ్ కింగ్స్ అంటూ నెటిజన్స్ పెద్దఎత్తున ఆడేసుకుంటున్నారు.The locals have known for years ....🤭😃#eesala #illa pic.twitter.com/gektBLqkFZ— Kasturi (@KasthuriShankar) May 23, 2024 -
ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12 నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50 శాతం డిస్కౌంట్తో రూ.299 లకే అందిస్తుంది. సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించి.. ప్రారంభం ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తోంది.నెలవారీ ప్లాన్ మాదిరిగానే, వార్షిక సబ్స్క్రిప్షన్ హెచ్బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్ వంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను సైతం జియో సినిమాలో వీక్షించవచ్చు. దీంతో పాటు ఐపీఎల్ ఇతర ప్రాంతీయ కంటెంట్ను ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్లో తమను దెబ్బ తీసిన కోల్కతా నైట్రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లోని ఎయిర్లైవ్లో 2 స్క్రీన్స్, మాదాపూర్లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
IPL 2024: రైజర్స్ VS రైడర్స్
గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్కతా నైట్రైడర్స్ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్లు ఫైనల్ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్కతా తమ మూడో టైటిల్పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్గా నిలిచిన హైదరాబాద్ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ తలపడతాయి. తొలి క్వాలిఫయర్లో సన్రైజర్స్నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్తో పాటు అంతకు ముందు లీగ్ దశలో కూడా కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్–2లో రాజస్తాన్ను ఓడించడంతో రైజర్స్ టీమ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్లలో దూకుడైన బ్యాటింగ్తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్ మిడిలార్డర్లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, సమద్లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్ మేనేజ్మెంట్లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్ను బట్టి క్వాలిఫయర్లో షహబాజ్ను అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా చేసుకొచ్చి టీమ్ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్ను స్పిన్కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్లో నలుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ పేస్ బౌలింగ్లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్–1 ఆడిన టీమ్నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్ ఫామ్లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్లో హైదరాబాద్కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్ వరుణ్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్రైజర్స్: కమిన్స్ (కెపె్టన్), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్/ మర్కండే. నైట్రైడర్స్: శ్రేయస్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్పై జరిగి స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్ డే ఉంది. -
SRH: అతనే కదా..! 'అభీ రైజింగ్..'!!
ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు కొన్నేళ్ల క్రితం ఒక 17 ఏళ్ల కుర్రాడిని ఎంచుకుంది. అయితే తుది జట్టు సమీకరణాల్లో భాగంగా అతనికి ఆరంభంలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. దాంతో చివరి మూడు మ్యాచ్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్తో తొలి అవకాశం దక్కించుకున్న ఆ కుర్రాడు చెలరేగిపోయాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం మరో మ్యాచ్లోనూ నాటౌట్ ఉన్న అతను ఇంకో పోరులో ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు.టీమ్ కోచ్ రికీ పాంటింగ్ అతని దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఇలాంటివి ఆడితే కోచ్లు అవసరంగా ఆ షాట్ ఆడావని, లేదా తొందరపడ్డావు, కాస్త జాగ్రత్త వహించాల్సిందని చెబుతారు. కానీ పాంటింగ్ మాత్రం ‘ఈ షాట్ మళ్లీ ఆడితే నాకు బంతి అక్కడ ప్రేక్షకుల గ్యాలరీల్లో కనిపించాలి’ అని ప్రోత్సహించాడు. ఆ కుర్రాడి మనసులో ఇది బాగా ముద్రించుకుపోయింది. ఆపై ఎప్పుడు అవకాశం వచ్చినా అతను దానిని మరచిపోలేదు. ఇప్పుడు ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున రికార్డు స్థాయిలో సిక్సర్ల పంట పండిస్తున్న ఆ కుర్రాడే అభిషేక్ శర్మ. ఢిల్లీపై చెలరేగిన మ్యాచ్ అతనికి ఐపీఎల్లో మొదటి మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్గా కూడా అతని సీనియర్ కెరీర్లో తొలి టి20 కావడం విశేషం. తన వీర దూకుడుతో హైదరాబాద్ అభిమానుల దృష్టిలో అభిషేక్ కొత్త హీరోగా మారిపోయాడు. ఓపెనర్గా తన విధ్వంసక ఆటతీరుతో జట్టుకు అద్భుత విజయాలు అందించి అతను రైజర్స్ రాత మార్చాడు.ఐపీఎల్ ఈ సీజన్లో మెరుపు బ్యాటింగ్ చూస్తున్నవారికి అభిషేక్ శర్మ అనూహ్యంగా దూసుకొచ్చిన ఆటగాడిలా కనిపించవచ్చు. కానీ స్కూల్ క్రికెట్ స్థాయి నుంచే అతను అసాధారణ ప్రతిభతో వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ పై స్థాయికి చేరాడు. పంజాబ్లోని అమృత్సర్ అతని స్వస్థలం. మాజీ క్రికెటర్ అయిన తండ్రి రాజ్కుమార్ శర్మ తొలి కోచ్ అయి ఆటలో ఓనమాలు నేర్పించాడు. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడైన శుభ్మన్ గిల్, అభిషేక్ చిన్ననాటి స్నేహితులు. అండర్–12 నుంచి అండర్–19 స్థాయి వరకు, ఆపై దేశవాళీలో సీనియర్ స్థాయిలో కూడా కలసి ఆడారు. అయితే గిల్ లిఫ్ట్ అందుకున్నట్లుగా వేగంగా దూసుకుపోతే, మెట్ల ద్వారా ఒక్కో అడుగు పైకి ఎదిగేందుకు శ్రమిస్తున్న అభిషేక్కు గుర్తింపు దక్కడం ఆలస్యమైంది. భారత దేశవాళీ క్రికెట్లో అభిషేక్ తొలిసారి అందరి దృష్టిలో పడింది 2015–16 సీజన్లోనే. ఆ ఏడాది అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 7 మ్యాచ్లలోనే అతను 1200 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్లో 57 వికెట్లు పడగొట్టడం విశేషం.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటూ..అండర్–19 ప్రపంచకప్తో..విజయ్ మర్చంట్ ట్రోఫీ తర్వాత అభిషేక్ అడుగు సహజంగానే అండర్–19 స్థాయి వైపు పడింది. 16 ఏళ్ల వయసులోనే అతను భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. అంతే కాకుండా కెప్టెన్గా కూడా అవకాశం దక్కించుకున్నాడు. 2016లోనే ఆసియా కప్లో జట్టును విజేతగా నిలిపి తన సారథ్య ప్రతిభను కూడా ప్రదర్శించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అండర్–19 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఈసారి పృథ్వీ షా కెప్టెన్సీలో జట్టు ఆడింది. అయితే కెప్టెన్సీ లేకపోయినా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అభిషేక్.. మన టీమ్ వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ విజయానికి సరిగ్గా వారం రోజుల ముందే వేలంలో ఢిల్లీ టీమ్ అతడిని రూ. 55 లక్షలకు తీసుకుంది.ఆల్రౌండ్ ప్రతిభతో..‘క్లీన్ స్ట్రయికర్’.. అభిషేక్ ఆట గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతని గురించి వినిపించే ఏకవాక్య ప్రశంస. బ్యాటింగ్లో ఎక్కడా తడబాటు కనిపించకుండా, బంతిని బలంగా బాదిన సమయంలో కూడా చూడముచ్చటగా, కళాత్మకంగా షాట్ ఆడే తీరుపై అందరూ చెప్పే మాట అది. కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆటగాడిగా ఉన్న అభిషేక్ ఆ తర్వాత తన శ్రమతో, పట్టుదలతో టాప్ ఆర్డర్కు చేరాడు. ఓపెనర్గా విధ్వంసక బ్యాటింగ్ చేయడమే కాదు, కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడే స్పిన్నర్గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పిన్లో ఎంతో సాధనతో అతను బ్యాక్ స్పిన్నింగ్ లెగ్కట్టర్ అనే ప్రత్యేక తరహాలో బౌలింగ్ అస్త్రాన్ని తయారుచేసుకున్నాడు. ఇది ఎన్నోసార్లు అతనికి వికెట్ని తెచ్చిపెట్టింది.తండ్రి రాజ్కుమార్ శర్మ, యువరాజ్ సింగ్తో..యువరాజ్ మార్గనిర్దేశనంలో..భారత మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అంటే మొదటి నుంచి అభిషేక్కు వీరాభిమానం. తర్వాతి రోజుల్లో అది అభిమానంగా మాత్రమే కాకుండా మరింత పెద్ద స్థాయికి చేరింది. గత కొన్నేళ్లుగా యువీ అతనికి మెంటార్గా వ్యవహరిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అధికారికంగా పంజాబ్ క్రికెట్లో ఎలాంటి హోదా లేకపోయినా కేవలం అభిషేక్ కోసం అతను తన సమయాన్ని వెచ్చిస్తూ అతని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. అభి స్టాన్స్, షార్ట్ బంతులు ఆడటంలో మెలకువలు, మానసికంగా దృఢంగా మార్చడం.. ఇలా అన్నింటిలో యువీ అండగా నిలిచాడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఆడే కొన్ని దూకుడైన షాట్లు యువీ ఆటను గుర్తుకు తెస్తాయంటే ఆశ్చర్యం లేదు. గత ఏడాది అభిషేక్ తన అద్భుత ఆటతో పంజాబ్ జట్టుకు తొలిసారి దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ టోర్నీలో 2 సెంచరీలు, 3 సెంచరీలు సహా ఏకంగా 180 స్ట్రైక్రేట్తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో ఆంధ్రపై 51 బంతుల్లోనే 112 పరుగులు చేసిన మ్యాచ్లో పంజాబ్ టోర్నీ రికార్డు స్కోరు 275 పరుగులను నమోదు చేసింది.ఐపీఎల్తో రైజింగ్..2019లో సన్రైజర్స్ టీమ్ శిఖర్ ధావన్ను ఢిల్లీకి బదిలీ చేసి అతనికి బదులుగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. వారిలో అభిషేక్ శర్మ కూడా ఒకడు. అయితే వరుసగా మూడు సీజన్లలో కూడా అతడిని లోయర్ ఆర్డర్లోనే ఆడించడంతో పాటు పరిమిత అవకాశాలే వచ్చాయి. దాంతో అతని అసలు సామర్థ్యం వెలుగులోకి రాలేదు. అయితే మూడో ఏడాది (2021) చివరి రెండు మ్యాచ్లలో అతను ఆశించినట్లుగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించారు. ముంబైతో మ్యాచ్లో 16 బంతుల్లో 33 పరుగులు సాధించడంతో అతని దూకుడైన శైలి మేనేజ్మెంట్కు అర్థమైంది. తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నట్లుగా 2022 ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ ఏకంగా రూ.6.5 కోట్లకు అభిషేక్ను మళ్లీ తీసుకుంది.అమ్మ, తోబుట్టువుతో..రెండు సీజన్ల పాటు నిలకడగా రాణించిన అతను జట్టుకు విజయాలు అందించాడు. అయితే అభిషేక్ విశ్వరూపం ఈ ఏడాదే కనిపించింది. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన అతను 200కు పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్తో కలసి అతను అందించిన ఆరంభాలు రైజర్స్కు ఘన విజయాలను ఇచ్చాయి. టోర్నీలో అతను కొట్టిన ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువగా ఉండటం అతని విధ్వంసం ఎలాంటిదో చూపిస్తుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో టీమ్ అత్యధిక స్కోరు (277) సాధించడంలో అతనిదే కీలక పాత్ర. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది హైదరాబాద్ టీమ్ తరఫున లీగ్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు.ఇక లక్నోతో జరిగిన మ్యాచ్లోనైతే 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్ను ఐపీఎల్ అభిమానులెవరూ మరచిపోలేరు. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించక ముందే ఐపీఎల్లో ఆడి (అన్క్యాప్డ్ ప్లేయర్) సత్తా చాటిన ఆటగాళ్లలో అభిషేక్ అగ్రస్థానంలో ఉంటాడంటే అతిశయోక్తి కాదు. అతని తాజా ప్రదర్శనతో వచ్చే టి20 వరల్డ్ కప్లో అభిషేక్కు చోటు ఇవ్వాల్సిందనే చర్చ జరిగింది. అయితే స్వయంగా మెంటార్ యువరాజ్ కూడా దానికి ఇంకా సమయం ఉందని, 23 ఏళ్ల అభిషేక్ రాబోయే ఇంకా మరిన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధమై భారత జట్టులో అరంగేట్రం చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో సీనియర్ల స్థానంలో కుర్రాళ్లు చోటు దక్కించునే అవకాశాలు ఉండటంతో ఆ జాబితాలో అభిషేక్ పేరు తప్పక ఉండవచ్చనేది మాత్రం వాస్తవం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ దద్లానీ చేసిన పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్కు మ్యాచ్కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.తాజాగా షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె చెప్పింది. షారుఖ్పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ, ప్రార్ధనలు ఆయనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. కేకేఆర్ ఫైనల్స్ ఆడేటప్పుడు స్టాండ్స్లో నుంచి జట్టును ఉత్సాహపరుస్తాడని జట్టు సహ-యజమాని జుహీ చావ్లా తెలిపింది. -
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
-
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్కు మ్యాచ్కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.కాగా.. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. కోల్కతా జట్టుకు యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ టీమ్కు మద్దతుగా స్డేడియంలో సందడి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లిన బాద్షా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Due to heat stroke dehydration, but sir is fine now and he’s been discharged, nothing to worry.Love You @iamsrk ❤️#ShahRukhKhan https://t.co/5k5S5z1ixD— Sudhir Kothari (@sudhirkothari03) May 22, 2024 -
ఎలిమినేట్ అయ్యేదెవరో?
-
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
చాపకింద నీరులా ఐపీఎల్ బెట్టింగ్
కోలారు: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ దందా నగరంలో చాపకింద నీరులా సాగుతోంది. పోలీసులు ఇంతవరకు అరెస్టు చేసిన వారు చిన్న చిన్న చేపలు కాగా బెట్టింగ్ దందాలో ఉన్న ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు అజ్ఞాతంలో ఉండి వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంతవరకు నాలుగు బెట్టింగ్ కేసులను ఛేదించి కేవలం చిన్న మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలువురు పంటర్లు ముంబై, గోవాల్లో కూర్చుని అక్కడి నుంచే వ్యవహారాలు నడిపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నీ అంతమ దశకు చేరుకుంది. ఐపీఎల్పై దేశ విదేశాలలో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన పోటీపై భారీ ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కోలారు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెట్టింగ్ సాగుతుండగా పలు కేసులను పోలీసులు ఛేదించారు.బెట్టింగ్లోకి ఆస్తులు, బంగారంజూదర్లు డబ్బులతో పాటు బంగారం, ఆస్తులను బెట్టింగ్లో పెట్టడానికి వెనుకంజ వేయడం లేదు. కోలారు జిల్లాలో జరుగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ దందాను అరికట్టడానికి జిల్లా ఎస్పీ ఎం నారాయణ ప్రత్యేక బృందాన్ని రచించారు. వారం రోజుల క్రితం గల్పేట పోలీసులు బెట్టింగ్లో పాల్గొన్న నలుగురిని అరెస్టు చేశారు. శనివారం మరో బెట్టింగ్ అడ్డాపై దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. శ్రీనివాసపురంలో బెట్టింగ్లో పాల్గొన్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కోలారు నుంచి దుబై వరకు క్రికెట్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతుందని అంటున్నారు. గతంలో బెట్టింగ్ పంటర్లు కోలారులోనే ఉండి వ్యవహారం నడిపే వారు. గత రెండేళ్లుగా పోలీసు యంత్రాంగం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా వీరు దూర ప్రాంతాల్లో కూర్చుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు అక్కడి నుంచే ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాగానే బెట్టింగ్ యాప్ లింక్ పంపించడం, ఆన్లైన్ బెట్టింగ్ ఐడీలు పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆన్లైన్లోనే డబ్బు వ్యవహారం జరుగుతుంది.బెట్టింగ్పై నిఘా పటిష్టంబెట్టింగ్ అడ్డుకట్టకు ప్రత్యేక బృందాన్ని రచించాం. క్రికెట్ బెట్టింగ్ యాప్లపై, పోలీసులపై కూడా నిఘా పెట్టాం. క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు తెలిస్తే, పోలీసులు పాల్గొంటున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసులు బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న వారితో చేతులు కలిపినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.–ఎం నారాయణ, ఎస్పీ, కోలారు -
SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
-
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్కు షాకిస్తూ మెరుగైన రన్రేట్తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్ పూరన్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్లో ఔటై వెనుదిరిగారు. అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జైయింట్స్కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్రేట్ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. "De chauka de chakka. Aaj ho jaye, ho jaye, Dhoom Dhadaka" pic.twitter.com/f0gZiT3kjz— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024 -
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
-
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
-
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లలో జరిగే టి20 ప్రపంచకప్కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం!
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
గెలుపెవరిదో వారి పాలనే చెబుతుంది!
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
వన సంపదకు పెద్ద ఆపద!
ఇజ్రాయెల్పై కొత్త ఒత్తిళ్లు
18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
ఈ పాపం ఎవరిది?
ప్రజాభవన్లో బాంబు కలకలం
తప్పక చదవండి
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
- బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
Advertisement