kumar
-
ఇలాంటి భాగస్వామిని భరించడం కష్టమే!
కవిత హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. కుమార్తో పెళ్లయి రెండేళ్లవుతోంది. కవిత కలుపుగోలు మనిషి, కుమార్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. దీంతో ‘నీ పని నువ్వు చూసుకోక అందరితో మాట్లాడతావెందుకు?’ అని దెప్పుతుంటాడు. చిన్న చిన్న పనులకు కూడా తప్పు పడుతుండేవాడు. ‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ను కలువు’ అని తరచు అనేవాడు. కొన్నాళ్లకు కవిత కూడా కుమార్ మాటలు నిజమేనేమో అనుకోవడం మొదలుపెట్టింది. ‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే కుమార్ ఎందుకలా అంటాడు’ అని అనుకునేది. తనకేదో సమస్య ఉందనే ఆలోచనలతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. నిరంతరం ఆందోళనగా ఉంటోంది. ఒంటరితనం, భయం, నిస్సహాయత. ఎవరితోనూ మాట్లాడాలనిపించడంలేదు. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్నిరకాల టెస్టులు చేయించుకుంది. శారీరకంగా ఎలాంటి సమస్య లేదని, ఒకసారి సైకాలజిస్ట్ను కలవమని సూచించారు. దాంతో కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన ఇంటి వాతావరణం గురించి, భర్త ప్రవర్తన గురించి వివరంగా చెప్పింది. మెల్లగా మంటపెడతారు... కవిత చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్కు గురవుతుందని అర్థమైంది. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి కొందరు చేసే మానిప్యులేషన్ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తాము గ్యాస్ లైటింగ్కు గురవుతున్న విషయాన్ని బాధితులు గుర్తించలేరు. అసలా దిశగా ఆలోచించలేరు. అందుకే భర్త మానిప్యులేషన్ గురించి కవితకేం చెప్పలేదు.మూడునెలల్లో పరిష్కారం... మొదట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆందోళన తగ్గించుకునేలా సహాయం అందించాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. తాను గ్యాస్ లైటింగ్కు గురవుతున్నానని అప్పుడు అర్థం చేసుకుంది. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్సైజ్లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను.స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ కవిత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. కుమార్ మాటలను పట్టించుకోవడం మానేసింది. కవిత ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న కుమార్ కూడా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది. గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు» నువ్వు ప్రతిదానికీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నావ్. » అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. · నీకోసమే అలా చేశాను. » నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?» నేను నీకు చెప్పాను, గుర్తులేదా? » అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. » నీపట్ల నాకెప్పుడూ నెగటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగటివ్ గా చూస్తున్నావ్.మాయ మాటలు నమ్మొద్దు» గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. » గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా, చేసే పనులపై దృష్టి పెట్టాలి. » ‘నీకు పిచ్చి’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. » ‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకు గుర్తుందో అదే నిజమని గుర్తించాలి. »గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. » గ్యాస్ లైటర్తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. » మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి. -
గ్రీన్ కార్డ్ కి సిటిజెన్ షిప్ కి తేడా ఏంటి..?
-
ట్రంప్ అనుకున్నది ఏది జరగదు..
-
ఇండియన్ కి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది..!
-
హైదరాబాద్లో హత్య.. కోదాడలో శవం
కోదాడ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్లో హత్యకు గురై.. నాగార్జునసాగర్ కాలువలో శవంగా తేలిన యువకుడి కేసును పోలీసులు తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్యతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వలసవచ్చి జగద్గిరిగుట్ట సమీపంలో నివాసముంటున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సదరు బాలిక తరచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది. ఈ పోస్టులను బోరబండకు చెందిన వివాహితుడైన ఆటో డ్రైవర్ కుమార్ గమనించి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో కుమార్ బాలికకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఒక దగ్గర బంధించాడు. ట్యాబ్ సాయంతో కనిపెట్టి.. తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలో బాలిక ట్యాబ్ను ఓపెన్ చేసి కుమార్తో చేసిన చాటింగ్ను గుర్తించారు. దీంతో బాలిక తల్లి మరో స్త్రీగా సామాజిక మాధ్యమంలో ఆటో డ్రైవర్ కుమార్తో పరిచయం పెంచుకుని తమ ఇంటికి ఆహ్వానించింది. ఆటోలో కుమార్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. కుమార్ రాగానే అతడిని బంధించి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. ఎంత బతిమిలాడినా కుమార్ ఆచూకీ చెప్పకపోవడంతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో కుమార్ అపస్మారకస్థితికి చేరడంతో అతడి కాళ్లు, చేతులు కట్టేసి కారులో విజయవాడ వైపు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో మునగాల వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముక్త్యాల మేజర్ కాలువలో కుమార్ను పడేసి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కుమార్ మృతదేహం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ వద్ద కాలువ ఒడ్డుకు చేరింది. పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి స్థానిక కొమరబండ చెరువు అంచున ఖననం చేశారు. టెక్నాలజీ పట్టించింది.. మార్చిలో జరిగిన ఈ ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని తమకు ఏమీ తెలియనట్లు వారి పనులు వారు చేసుకోసాగారు. సదరు బాలిక కూడా హైదరాబాద్లోని నింబోలిఅడ్డాలోని ఓ అనాథశరణాలయంలో ఉందని తెలుసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కుమార్ కనిపించకపోవడం, ఆటో కూడా దొరక్కపోవడంతో కుమార్ భార్య బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కుమార్ ఆటోకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి సదరు బాలిక తండ్రి ఉపయోగిస్తున్నాడు. దానిపై ఉన్న పేటీఎం క్యూఆర్ కోడ్ను మాత్రం తొలగించలేదు. ఆటోకు ఉన్న ప్రత్యేకమైన బంపర్ను కూడా అలాగే ఉంచారు. ఈ ఆనవాళ్లతో 10 రోజుల క్రితం పోలీసులు ఆటోను పట్టుకొని దానిని ఉపయోగిస్తున్న బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం బయటపడింది. బోరబండ పోలీసులు రెండు రోజుల క్రితం కోదాడకు వచ్చి మృతదేహాన్ని జేసీబీ సాయంతో తవ్వించారు. ఎముకలను డీఎన్ఏ పరీక్షలకు పంపి అది కుమార్ మృతదేహమా.. కాదా అని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఒంటరిగా మారగా, కుమార్ భార్య భర్తను కోల్పోయి రోడ్డున పడింది. -
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
ధర్మవరంలో బీజేపీ దౌర్జన్యకాండ
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అనుచరుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మంత్రి అనుచరుడు హరీ‹Ùకుమార్ నేతృత్వంలో వందలాది గూండాలు, వారికి వత్తాసు పలుకుతున్న కూటమి పార్టీల నాయకులతో కలిసి సోమవారం పట్టణంలో వీరంగం సృష్టించారు. వారి దాడిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, సాక్షి టీవీ విలేకరి సండ్ర రమే‹Ùతో పాటు శీలా విజయ్ కుమార్ అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లెలో ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై.. అక్రమ కేసులతో రిమాండ్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం మ«ధ్యాహ్నం ధర్మవరం సబ్జైలుకు వెళ్లారు. కేతిరెడ్డి ఆయన వాహనాన్ని తానే నడుపుతుండగా, ఆయన డ్రైవర్ రామాంజి మరో వాహనంలో ఉన్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న హరీష్కుమార్ నేతృత్వంలోని గూండాలు వారి వాహనాలను అడ్డుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రైవర్ రామాంజిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో రామాంజి అక్కడి నుంచి వాహనంలో వెళ్లిపోయారు. అంతటితో ఆగని బీజేపీ, కూటమి శ్రేణులు సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారు. కేతిరెడ్డి సబ్జైలులో ఉండగా లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, కార్యకర్త శీలా విజయ్కుమార్పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ సండ్ర రమే‹Ùపైనా పోలీసు వద్దనున్న లాఠీలను లాక్కుని మరీ బీజేపీ నాయకులు దాడి చేశారు. అనంతరం కేతిరెడ్డి కాన్వాయ్లోని పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు. చోద్యం చూసిన పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. అంత గొడవ జరుగుతున్నా అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాలేదు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మరికొందరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ భద్రత మధ్య కేతిరెడ్డిని ఇంటికి తరలించారు. ధర్మవరంలో దౌర్జన్యకర సంస్కృతికి బీజం వేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశాంతతకు పేరొందిన ధర్మవరంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడుల సంస్కృతికి బీజం వేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్జైలు ఘటనల అనంతరం ఆయన ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల్లో మంత్రి సత్యకుమార్ అనుచరులు, కూటమి పార్టీల నాయకుల దందాలు, దౌర్జన్యాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు తాను ఐదుగురితో కలసి సబ్జైల్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు తన డ్రైవర్ రామాంజిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బీజేపీతోపాటు కూటమి పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారన్నారు. దివ్యాంగుడు, ఆరోగ్యం సరిగా లేని అమర్నాథ్రెడ్డిని, విజయ్ని దారుణంగా కొట్టారన్నారు. దాడిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్పైనా పోలీస్ లాఠీలతో కొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రాలేదని, పోలీసు స్టేసన్ కూడా సబ్ జైలు పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మూడు గంటల పాటు పోలీసులు వారి దౌర్జన్యాలకు పూర్తిగా సహకరించారన్నారు. ధర్మవరంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంత్రి సత్యకుమార్ తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. ధర్మవరంలో శాంతి నెలకొల్పేందుకు తమ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులో ఉంచామని, ఇప్పుడు అదే తప్పని తేలిందని కేతిరెడ్డి అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సైతం వేలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధర్మవరం వస్తామంటూ ఫోన్లు చేసినా శాంతింపజేశామన్నారు. కూటమి నేతలకు తగిన సమయంలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్యాదవ్ ద్వారా హైదరాబాద్కు చెందిన రంజిత్కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్నగర్లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్లోని బాల్కనీ హోటల్కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
పదహారేళ్లకు తల్లి, కొడుకులను కలిపిన బేకరీ షాప్..
ఆదిలాబాద్: పద్నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలుడు పదహారేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరాడు. చిన్నతనంలోనే దూరమైన కొడుకు ఇక తమకు దొరకడేమోనని నిత్యం కన్నీటి పర్యంతమైన ఆ తల్లికి ఎదిగిన కొడుకు దరిచేరడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజీపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ పరిధిలోని యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన సంత్రదేవి, మున్నాకుమార్ బింద్ దంపతులకు నలుగురు కుమారులు, కూతురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు మహేందర్ బింద్ అలియాస్ మనోజ్ను చిన్నతనంలో దగ్గరి బంధువు ముంబయి తీసుకెళ్లి హోటల్లో పనికి కుదిర్చాడు. కొద్ది రోజుల తర్వాత హోటల్లో పని మానేసి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన శివ్కుమార్ యాదవ్ అనే యువకుడికి తారసపడ్డాడు. తనదీ అదే రాష్ట్రమని, పని కోసం వెతుకుతున్నానని మహేందర్ బింద్ చెప్పడంతో వెంట తీసుకొచ్చి బెల్లంపల్లిలోని బేకరీలో పనికి కుదిర్చాడు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తుండగా ఓ రోజు ఇంటిపై ధ్యాస మళ్లి బేకరీ యజమాని సుశీల్కుమార్ యాదవ్కు తన ఇంటి అడ్రస్ కనుక్కోవాలని కోరాడు. దీంతో సుశీల్కుమార్ ఆ రాష్ట్రంలోని తన బంధువులకు చెప్పి ఆరా తీశాడు. ఘజీపూర్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూసుఫ్పూర్లో ఉంటున్న తల్లిదండ్రుల వివరాలు ఇచ్చారు. దీంతో తల్లి సంత్రదేవి, బాబాయ్ కమలేష్బింద్, పిన్నీ బసంత్ బింద్ శుక్రవారం బెల్లంపల్లికి చేరుకున్నారు. ఆపరేషన్ చేసిన గాయం చూసి... కొడుకును వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటొచ్చిన తల్లి అతడిని చూసి ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కొడుకూ కన్నీటి పర్యంతమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో గొంతుకింద చేసిన ఆపరేషన్ గాయాన్ని పరిశీలించి మహేందర్ బింద్ తన కొడుకేనని సంత్రదేవి మురిసిపోయి ముద్దాడింది. కుటుంబసభ్యులను కలిసేలా చేసిన బేకరీ షాప్ యజమాని సుశీల్ కుమార్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్ బింద్ తల్లి, బంధువులతో కలిసి రైలులో ఉత్తరప్రదేశ్కు బయల్దేరి వెళ్లాడు. -
ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది. ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్, ఎస్ఐ సుభాష్ ప్రకటించారు. -
సర్కారు స్కూలు పిల్లలకు ఫ్రీ
సాక్షి, హైదరాబాద్ః రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి భవన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కుమార్ సమ్రేశ్ వెల్లడించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సందర్శనకు అనుమతిస్తూ, ఆ మేరకు మార్చి 22 నుంచి సందర్శనకు అవకాశం కలి్పస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈనెల 14 వరకు రాష్ట్రపతి నిలయాన్ని దాదాపు 10 వేల మంది సందర్శకులు దర్శించారని పీఆర్ఓ సమ్రేశ్ తెలిపారు. రాష్ట్రపతి నిలయ సందర్శన సమాచారాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో గురువారం రాష్ట్రపతి నిలయంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో తీసుకువచ్చిన మార్పులు, బుకింగ్ తదితర వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా.కె రజనీప్రియతో కలిసి ఆయన వెల్లడించారు. డిసెంబర్ మినహా ఏడాది పొడవునా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన జరిగే డిసెంబర్ నెల మినహా ఏడాది పొడవునా సాధారణ పౌరుల సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఏ రోజైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కోసం http:// visit.rashtrapatibhavan.gov.in వెబ్సైట్లో లేదంటే నేరుగా రాష్ట్రపతి నిలయానికి వచ్చి అక్కడి రిసెప్షన్ సెంటర్లోనూ టికెట్ తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని, మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.50 ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సందర్శకుల బృందం 30 మందికి పైగా ఉంటే వారికి టికెట్ రుసుంలో 20 శాతం రాయితీ ఇస్తామన్నారు. సందర్శకులకు రాష్ట్రపతి నిలయంలోని విశేషాలను వివరించేందుకు 20 మంది గైడ్లను ప్రత్యేకంగా నియమించినట్టు వారు తెలిపారు. -
ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభవాలను దెబ్బతీసే విధంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో చేతన్ కుమార్పై హిందుమత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. వివరాలు.. స్వయాన హిందువైన కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస మత విశ్వాసాలను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మార్చి 20న ఆయన ట్వీట్ చేస్తూ ‘సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి చేరుకున్న తర్వాత భారతదేశ జాతి ప్రారంభమైంది అనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది ఒక అబద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అంతేకాదు హిందుత్వం అనేది సత్యం చేత ఓడించబడుతుందంటూ హిందు మతాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. దీంతో చేతన్ కుమార్పై పలు హిందు మతసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కులాలు, మతాల మధ్యనే శత్రుత్వం పెరిగిలా ఆయన ట్వీట్ ఉందంటూ చేతన్పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా పలు హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు చేతన్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా చేతన్ కుమార్ తరచూ తన తీరుతో, కామెంట్స్తో వివాదానికి తెరలేపుతుంటాడు. గతంలో ఇలానే అభ్యంతరకర కామెంట్స్ చేసి ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై అభ్యంతర కామెంట్స్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. Hindutva is built on LIES Savarkar: Indian ‘nation’ began when Rama defeated Ravana & returned to Ayodhya —> a lie 1992: Babri Masjid is ‘birthplace of Rama’ —> a lie 2023: Urigowda-Nanjegowda are ‘killers’ of Tipu—> a lie Hindutva can be defeated by TRUTH—> truth is EQUALITY — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) March 20, 2023 -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
LIC IPO: ఎల్ఐసీ కొత్త రూల్.. వారికి మాత్రమే ఐపీఓలో రాయితీ..!
LIC IPO: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వచ్చే నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తన ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రాయితీ ఇచ్చేందుకు ఇంతకముందు ఒక నిబంధన పెట్టింది. ఎవరైతే, ఫిబ్రవరి 28లోపు తమ పాలసీలకు పాన్-నెంబర్ లింకు చేస్తారో వారికి మాత్రమే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఇప్పటివరకు 60-70 లక్షల మంది తమ పాన్(శాశ్వత ఖాతా నంబర్లు) కార్డు నెంబర్లను వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లు చైర్మన్ ఎంఆర్.కుమార్ తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓకు ముందు పాలసీదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా ఎల్ఐసీ డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు కూడా సహాయం చేయనున్నట్లు అన్నారు. "మా పాలసీదారులు తమ పాన్ నెంబర్ లింక్ చేయడంలో సహాయపడటానికి మేము అన్ని కార్యాలయాలతో సమావేశాలు జరుపుతున్నాము. డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు సహాయం చేయడానికి ఎన్.ఎస్.డీ.ఎల్, సీడిఎస్ఎల్ సహకారం తీసుకుంటున్నాము" అని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్.కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. తాజాగా, ఫిబ్రవరి 13కు ముందు ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసిన వారు మాత్రమే(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన తేదీ) ఈ కోటాకు అర్హులు అని చైర్మన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్ఐసీ చట్టం, 1956కు చేసిన సవరణ చేసి ఐపీఓలో పాల్గొనే పాలసీదారులు & వాటాదారులకు రాయితీ ఇచ్చేందుకు ఎల్ఐసీ మార్గం సుగమం చేసింది. (చదవండి: మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..!) -
1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం వైఎస్ జగన్ పరిపూర్ణ సహకారం, మైక్రోసాఫ్ట్ సౌజన్యంతో ఏపీలోని 1.62 లక్షల మంది విద్యార్థులకు ఎండ్ టు ఎండ్ స్కిల్ ట్రైనింగ్ అందించనున్నట్టు ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్ అన్నవరపు కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తోందన్నారు. రూ.69 వేల విలువైన కోర్సును రూ.350 నామమాత్రపు ఫీజుతో 400 కళాశాలల్లో అందిస్తోందని, ఇది సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. ఈ ఫీజును కూడా విద్యార్థుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఇందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విదేశీ విద్య సలహాదారు డాక్టర్ అన్నవరపు కుమార్తో ‘అమెరికాలో ఉన్నత విద్య’ అనే అంశంపై మంగళవారంఇష్టాగోష్టి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విదేశీ విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు తొలుత అవగాహన అవసరమని, ఆ తర్వాత వారు అనుకున్న లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యమన్నారు. డబ్బులున్న వారు మాత్రమే విదేశాల్లో చదువుకోగలరన్నది కేవలం అపోహ మాత్రమేనన్నారు. అమెరికాలో 4 వేలకు పైగా వర్సిటీలు ఉన్నాయని, వాటిలో 350 పైగా యూనివర్సిటీలు స్కాలర్ షిప్ సౌకర్యం కల్పిస్తున్నాయని వివరించారు. ‘అమెరికన్ కార్నర్’ కీలక పరిణామం ఇటీవల విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో అమెరికా ప్రభుత్వం అమెరికన్ కార్నర్ను నెలకొల్పిందని అన్నవరపు కుమార్ చెప్పారు. దేశంలోనే ఇది రెండోదని, దీనిద్వారా మన విద్యార్థులకు అమెరికాలో విద్య, అక్కడ అవకాశాల గురించి తరచూ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో విదేశీ విద్యకు సంబంధించి ఇదో కీలక పరిణామమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భారీ అవినీతి టీడీపీ హయాంలో విదేశీ విద్యలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని కుమార్ గుర్తు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు, ఐ20లు, బ్యాంక్ ఖాతాలతో కోట్ల రూపాయలు కాజేశారని పేర్కొన్నారు. ఇదంతా అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై విజిలెన్స్ సమగ్ర విచారణ చేస్తోందన్నారు. -
బిగ్బాస్ : అఖిల్పై పగ తీర్చుకున్న కుమార్ సాయి
బిగ్ బాస్ నాల్గో సీజన్లోకి మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కుమార్ సాయి అనూహ్యంగా ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. మోనాల్ కోసమే కుమార్ సాయిని బలి చేశారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఎలిమినేట్ అయినప్పటికీ కుమార్ సాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గో సీజన్ మొత్తంలో ‘మంచోడు’ అని పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కుమార్ అనే చెప్పాలి. బిగ్బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఆతను గేమ్ ఆడాడు. ఇంటి సభ్యులంతా అతన్ని వేరుగా చూసినా.. ఆయన మాత్రం ఎవరిపైనా కోపం కానీ ద్వేషం కానీ ప్రదర్శించలేదు. ఎలిమినేట్ అయిన రోజు కూడా ఈ ‘మంచోడు’ని హౌస్మేట్స్ సరిగా సాగపంపలేదు. ముఖ్యంగా ‘కరివేపాకు’ గొడవను ఇప్పటికీ మర్చిపోలేదు. లిమినేషన్ ఎపిసోడ్లో.. నాగార్జున వెజిటబుల్స్ ఇచ్చి ఇది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని అడగడంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కర్నీ ఒక్కో విజిటబుల్తో చక్కని పోలిక ఇచ్చాడు. అందులో భాగంగా అఖిల్ని కరివేపాకుతో పోల్చుతూ.. పాజిటివ్గా మాట్లాడాడు. కానీ దీన్ని నెగిటివ్గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇంత దారుణంగా హేళన చేస్తారా? అని అప్పట్లో అఖిల్ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే...అఖిల్పై ఉన్న పగను కుమార్ సాయి తీర్చుకున్నాడు. రీ యూనియన్లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్కి వస్తుండగా.. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి నవ్వుతూనే అఖిల్, హారికపై ఉన్న పగను తీర్చుకున్నాడు. సిల్లీ రీజన్స్తో తనను నామినేట్ చేసిన హారికను..‘నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పావ్’అని తన మనసులో ఉన్న పగను తీర్చుకున్నాడు. ఆ తర్వాత సొహైల్తో జరిగిన గొడవలో వేలు సింటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. ఇక అఖిల్ని‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర’ అంటూ పులిహోరా రాజాకి గట్టిగానే ఇచ్చేశాడు. అయితే ఇవన్ని ఇంటి సభ్యులు సరదాగానే తీసుకున్నట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇంకా కుమార్ సాయి ఎవరెవరిపై పంచ్లో వేశాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్బాస్ : అఖిల్కి అంత పొగరా?
బిగ్బాస్ హౌజ్లో ఇన్నాళ్లు అఖిల్కి అంతో ఇంతో మంచి పేరు ఉండేది. ఒక్క మోనాల్ విషయం తప్ప హౌజ్మేట్స్ అందరికి అఖిల్పై మంచి ఒపినియన్ ఉంది. ఇక ప్రేక్షకులు కూడా మోనాల్ వల్లే అఖిల్ టాస్క్లు సరిగా ఆడటం లేదనే సానుభూతి ఉండేది. అయితే ఆదివారం ఎపిసోడ్లో జరిగిన ఒక్క సీన్తో అఖిల్పై ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అఖిల్పై దుమ్మెత్తిపోస్తున్నారు. (చదవండి : బిగ్బాస్: టూ మచ్ బిగ్బాస్.. ఓట్లు ఎందుకు మరి?) అసలు ఏం జరిగిందంటే..ఆరోవారం బిగ్బాస్ హౌస్ నుంచి కుమార్సాయి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి సభ్యులను కూరగాయలతో పోల్చమని హోస్ట్ నాగార్జున చెపాపడు. దీంతో కుమార్ సాయి ఒక్కో ఒక్క కూరగాయను ఒక్కో వ్యక్తితో పోలుస్తూ చాలా పాజిటివ్గా చెప్పుకొచ్చాడు. అలా అఖిల్ని కరివేపాకుతో కంపేర్ చేశాడు. అయితే వాడుకుని తీసిపారేసే కరివేపాకులా కాకుండా పాజిటివ్ వివరణ ఇచ్చాడు కుమార్. ‘అఖిల్ నువ్ ఆడుతున్నావ్ కానీ, రిజల్ట్ రావడం లేదు, నువ్ కష్టపడుతున్నావ్.. బట్ ఫోకస్ ఉండటం లేదు.ఎనర్జీతో ఆడుతున్నావ్ గ్రేట్.. అయినా ఫెయిల్ అవుతున్నావ్.. కరివేపాకు వేస్తున్నావ్ కానీ ఆ ఫ్లేవర్ రావడం లేదు’ అని చాలా పాజిటివ్ వేవ్తో కుమార్ సాయి చెప్పాడు. అయితే దీన్ని నెగిటివ్గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. బిగ్బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్పై అఖిల్ సీరియస్ కావడం ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు. ఇక నెటిజన్లు అయితే అఖిల్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ‘మరీ ఇంత పొగరా?, పాపం కుమార్ సాయి.. పాజిటివ్గా చేస్తే అఖిల్ అలా అంటాడా?, అఖిల్ ఓవరాక్టింగ్ పీక్స్కి వెళ్లిపోయింది. మోనాల్ మాయలో పడి ఏం మాట్లాడుతున్నాడో మర్చిపోయాడు, ‘అఖిల్కి సరైన మెగుడు అభి, ఆ యాటిట్యూట్, బలుపు సంగతి త్వరలోనే తీర్చేస్తాం.. నామినేషన్స్లోకి రా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఎలిమినేట్ అయిన కుమార్ సాయికి మాత్రం నెటిజన్లు మద్దతుగా నిలిచారు. ఓడినా.. అందరి మనసును గెలిచావ్ అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. #Akhil is one of the worst contestant in the history of BB 👎#BiggBossTelugu4 pic.twitter.com/pU6mUbxKMs — change seeker ✊ (@changeseeeker) October 18, 2020 Assale #KumarSai elimination meedha mandipoi unna janalani .. ee #Akhil gadu baagaa kelikesadu.. inka veedu fasak..!! 🤣🤣🤣#BiggBossTelugu4 pic.twitter.com/T6u1YL4VBU — భరత్ అనే నేను!!™ 🇺🇸🇮🇳 (@iBharathGupta) October 18, 2020 Today its confirmed #Akhil is the worst contestant, IDK what #Kumarsai did wrong to him, antha maata analsindi emi ledu akkada velletappudu you have to send them on good note, #Akhil ala anna kuda #kumarsai em anledu, inka eedni #Abhijeet tho compare ata #BiggBossTelugu4 — Gopi (@_GTweets_) October 18, 2020 #BIGGBOSSTELUGU4 At least #KumarSai played his own game and came out of the house. What are you doing My #CurryLeaf #Akhil ? Will your parents be happy seeing you like this in the house? — Sye Raa! (@SuryaAdityaSun) October 18, 2020 Eedi OverAction 😟😟🤮🤮 #BiggBossTelugu4 pic.twitter.com/UGcPKD1msE — R A M (@Ram_Sayzz) October 18, 2020 -
కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం
-
కంచిలో విషాదం
సాక్షి, చెన్నై: కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు. బుధవారం వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్ ఆలయంలో ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసుల తీరుతో ఆటోడ్రైవర్ ఆత్మాహుతి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కాంచీపురంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కాంచీపురం కరుసపేటకు చెందిన కుమార్ అనే ఆటో డ్రైవర్ పాస్ తీసుకుని భక్తులను ఆలయానికి తరలిస్తున్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆటోను ఆలయం వద్దకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, ఆటోడ్రైవర్ కుమార్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. అతడు మంటల్లో కాలిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. -
మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రానికి ఓకే!
సంచలన తార నయనతార మరో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దక్షిణాది అగ్ర కథానాయకిగా వెలిగిపోతున్న నటి నయనతార. ఈ బ్యూటీ ఒక పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేస్తూనే మరో పక్క స్టార్ సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకూ జత కట్టేస్తోంది. ఇంతకు ముందు కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాల సక్సెస్లు నయనతార ఖాతాలో పడ్డాయి. అజిత్తో జత కట్టిన విశ్వాసం చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించింది. త్వరలో నయన్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ఐరా, శివకార్తికేయన్కు జంటగా నటించిన మిస్టర్ లోకల్ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక తెలుగులో చిరంజీవితో నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి నిర్మాణంలో ఉంది. ఇక అదే హీరోతో మరో చిత్రం కమిట్ అయ్యింది. అదే విధంగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్శివన్కు నిర్మాణ బాధ్యతలను అప్పగించి తాను నిర్మించే చిత్రంలోనూ నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్తో అట్లీ దర్శకత్వంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం. పునీత్ రాజ్కుమార్ మేనేజర్ కుమార్ నిర్మించనున్న నూతన చిత్రంలో నయనతార నటించబోతోంది. ఈయన నిర్మిస్తున్న తమిళ చిత్రానికి సీ.వేల్మతి దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు అండావ కానోమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. నయనతార హీరోయిన్గా నటించే చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మైండ్ గేమ్
‘సర్! మా నాన్నగారిది సహజ మరణం కాదు. హత్యేనని నేను కచ్చితంగా చెప్పగలను’ ఇన్స్పెక్టర్ కుమార్కు చేతులు జోడించి చెప్పాడు ప్రణీత్. ‘ఏమిటి ప్రణీత్ బాబూ మీరనేది? నీరజ్గారు గుండెపోటుతో పోయారని డాక్టర్లు చెబుతుంటే’ ముసలి జావేద్ తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. సీఐ కుమార్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్న పనివాడు యాభయ్యేళ్ల కోటయ్య వంక చూశాడు. ‘కోటయ్యా! నువ్వు నిన్న ఇక్కడే ఉన్నావు కదా... ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. కోటయ్య గొంతు సవరించుకున్నాడు. చెస్ చాంపియన్ల ఖిల్లాగా ఆ పట్టణానికి పేరుంది. ఐదారేళ్ల నుంచి వరుసగా ఆ పట్టణవాసులే రాష్ట్ర చెస్ చాంపియన్షిప్ గెలుస్తూ ఉన్నారు. ప్రస్తుత చాంపియన్ నీరజ్, మాజీ చాంపియన్ సరోజ్ ఆ పట్టణవాసులే. ప్రస్తుత చాంపియన్ నీరజ్ తండ్రి కూడా చదరంగ ప్రవీణుడే. తాతలనాటి పురాతన భవంతిలోనే నీరజ్ నివసిస్తూ ఉంటాడు. చదరంగమే లోకంగా ఉంటూ ఉద్యోగమేమీ చేయకపోవడంతో అతనికి పెద్దగా ఆదాయం లేదు. నీరజ్కు, మరికొందరికీ చిన్ననాటి నుంచి చదరంగం తర్ఫీదు ఇచ్చి చాంపియన్లుగా తీర్చిదిద్దిన జావేద్ ముసలివాడయ్యాడు. కంటిచూపు మందగించినా, ఆటపై మక్కువ చంపుకోలేక రోజూ చదరంగం ఆడటానికి తన శిష్యుడు నీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా మాజీ చాంపియన్ సరోజ్, మరికొందరు కూడా నీరజ్తో చదరంగం ఆడటానికి రోజూ వస్తూ ఉంటారు. నీరజ్తో చదరంగం ఆడటానికి రోజూ వచ్చేవారిలో మదన్, మోహిని ముఖ్యులు. మదన్ది జమీందార్ల వంశం. డబ్బుకు, అతిశయానికీ లోటు తక్కువేం లేదు. రాష్ట్రస్థాయిలో అతను చదరంగంలో మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాడు. కానీ ఇంతవరకు ఏ పోటీలోనూ విజేతగా నిలవలేదు. మోహిని రాష్ట్రస్థాయి మహిళా చదరంగ పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఈసారి ఆ పోటీలో గెలవాలని కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నీరజ్ చదరంగం ఆడటం తగ్గించాడు. రాత్రి ఎనిమిదిన్నరకు పాములు, తేళ్ల భయంతో ఇంటి తలుపులు, కిటికీలన్నీ మూసి నిద్రిస్తాడు. నీరజ్ భార్య గత ఏడాది మరణించింది. కొడుకు ప్రణీత్ ఆ ఊళ్లోనే బీ టెక్ చదువుతున్నాడు. పనివాడు కోటయ్య వంటచేసి రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లిపోతుంటాడు. ‘నిన్న సాయంత్రం ఐదు గంటలకు సరోజ్గారు ఇంటికి వచ్చారు. ప్రణీత్ ఇంట్లో లేడు. నీరజ్గారి గదిలోకి వెళ్లి సరోజ్ గారు చదరంగం ఆడారు. అప్పుడు అయ్యగారు ఉల్లాసంగానే కనిపించారు’ అన్నాడు కోటయ్య. ‘నేను మంచి ఫామ్లో ఉన్నాను. ఏడు నిమిషాల్లోనే నీరజ్పై గెలిచాను. ఆ శుభవార్త బయటనే వెయిట్ చేస్తూ ఉన్న మోహినికి చెప్పి ఆనందంగా వెళ్లిపోయాను’ అన్నాడు సరోజ్. ఇన్స్పెక్టర్ కుమార్ మోహిని వంక చూశాడు. ‘ఔను! సరోజ్ ముఖం గెలుపు ఆనందంతో మతాబాలాగా వెలుగుతోందప్పుడు. నా కాన్ఫిడెన్స్ కొద్దీ బ్లైండ్ఫోల్డ్గా ఆడతానని నిన్ననే నీరజ్గారికి చెప్పి వారి పర్మిషన్ తీసుకున్నా. కళ్లకు గంతలు కట్టుకుని ఆయనతో చదరంగం ఆడాను’ చెప్పింది మోహిని. ‘మరి గెలిచారా?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘లేదు. కానీ గెలిచినంత పని చేశా. నన్ను నిలువరించడానికి నీరజ్గారు ఇరవై నిమిషాలు కష్టపడాల్సి వచ్చింది. చివరికెలాగో నన్ను ఓడించారు’ చెప్పింది మోహిని. ‘సాయంత్రం ఐదు నలభైకి నీరజ్గారు ఎందుకో గట్టిగా కేక పెట్టారు. బయట తోటలో ఉన్న నేను పరుగున ఆయన గదిలోకి వెళ్లాను. అప్పుడు సార్ మదన్గారితో గేమ్ ఆడుతున్నారు. ఏదో వస్తువు కిందపడ్డట్లు అనిపించింది’ అన్నాడు కోటయ్య. ‘టేబుల్ మీద ఉన్న నా లెదర్ బ్యాగ్ కింద పడిందంతే. కోటయ్యను కాఫీ తీసుకు రమ్మని చెప్పారు నీరజ్ గారు. ఎందుకో ఆయన భయపడినట్లు అనిపించింది’ చెప్పాడు మదన్. ‘మరి ఆట ముగిశాక మీరు వెళ్లిపోయారా?’ ‘లేదు. ఎందుకో నీరజ్గారు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో నేను ఆయన పక్కనే ఉన్న చెయిర్లో కూర్చున్నాను. ఇంతలో జావేద్గారు లోనికి వచ్చారు’ అన్నాడు మదన్. ‘నేను గదిలోకి వచ్చేసరికి బెడ్లైట్ వెలుగుతోంది. ఆట మొదలెడదామా అని నేను అడిగే సరికి సరేనన్నాడు నీరజ్. మదన్గారు పక్కనే కుర్చీలో ఉన్నారు. కోటయ్య వచ్చి మా ముగ్గురికీ కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఐదు నిమిషాల్లోనే నేను గెలిచాను. ఆ ఆనందంతో నీరజ్తో కరచాలనం చేసి వెళ్లిపోయాను’ చెప్పాడు జావేద్. ‘ఆ తర్వాత మదన్గారు వెళ్లిపోయారు. నేను గదిలోకి వెళ్లి చూసే సరికి మూడు కప్పుల్లో కాఫీ అలాగే ఉంది. కప్పులు తీసుకుని వెళ్లిపోయాను. పది నిమిషాల తర్వాత ఏదో అనుమానం వచ్చి నీరజ్గారి గదిలోకి వెళ్లి పిలిస్తే పలకలేదు. శరీరంలో చలనం లేదు. భయంతో డాక్టర్గారికి, ప్రణీత్కు ఫోన్ చేశాను’ అన్నాడు కోటయ్య. ఇన్స్పెక్టర్ కుమార్కు మరుసటి రోజు ఏదో అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ప్రణీత్. చదరంగంలో రాష్ట్ర చాంపియన్గా నీరజ్కు ఉన్న పేరు ప్రఖ్యాతుల బట్టి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్తో వచ్చి దర్యాప్తు చేశాడు కుమార్. డాక్టర్తోను, ముందురోజు నీరజ్తో చదరంగం ఆడిన నలుగురితోనూ మాట్లాడాడు. ‘నాకు అర్జెంట్గా విజయవాడలో పని ఉంది. నేను వెళ్లి సాయంత్రం నాలుగింటికి తిరిగొస్తాను’ అన్నాడు మదన్. మిగిలిన ముగ్గురూ కూడా తమకేదో పని ఉందంటూ చెప్పారు. ఇన్స్పెక్టర్ కుమార్ ప్రణీత్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. సరే, మీరందరూ మీ మీ పనులు చూసుకొని రండి. సాయంత్రం ఐదింటికి మళ్లీ మనం ఇక్కడే కలుద్దాం. నీరజ్ది సహజ మరణమే అనిపిస్తోంది’ అన్నాడు. నలుగురూ బయటకు వెళ్లిపోయారు. కుమార్ తనతో వచ్చిన కానిస్టేబుల్స్కు పనులు పురమాయించాడు. ‘మిస్టర్ మదన్! మీరు నీరజ్ మరణానికి కారకులయ్యారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అన్నాడు కుమార్. మదన్ ముఖం కళ తప్పింది. ‘సార్! ఇది అన్యాయం. నీరజ్గారు గుండెపోటుతో మరణించారని డాక్టర్లే చెప్పారు’అన్నాడు ఆవేశంగా. ‘కావచ్చు. కానీ గుండెపోటు వచ్చేలా చేసింది నువ్వే’ అన్నాడు కుమార్. ‘ఇది చాలా అన్యాయం సార్’ దీనంగా అన్నాడు మదన్. ‘నిన్ను అరెస్టు చేయడానికి ఈ రుజువు చాలు’ అని కుమార్ ఒక చిన్న టేప్రికార్డర్ తీసి ఆన్ చేశాడు. అందులో మదన్, నీరజ్ల సంభాషణ ఉంది. ‘ఆ రోజు సాయంత్రం నీరజ్ ఎప్పటిలాగానే చదరంగం ఆడటానికి తన గదిలో కూర్చున్నాడు. ముందు వచ్చిన సరోజ్ బాగా ఆడి గెలిచి సంతోషంగా వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన మోహిని కళ్లకు రిబ్బన్ కట్టుకుని బ్లైండ్ఫోల్డ్ గేమ్ ఆడింది. ఆమెకు తెలియడం కోసం నీరజ్ ఆమె, తాను వేసే ప్రతి ఎత్తునూ గట్టిగా బయటకు చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు ఆట తర్వాత వివాదాలు రాకుండా రికార్డు ఆన్ చేయడం ఆయనకు అలవాటు. మోహినితో ఆట పూర్తయ్యాక టేప్ రికార్డర్ ఆఫ్ చేయడం మరచి, అలాగే ఉంచేశాడు నీరజ్.తర్వాత వచ్చిన మదన్కు రాష్ట్ర చాంపియన్ కావాలని తగని కోరిక ఉంది. ఎలాగైనా నీరజ్ను అంతమొందిస్తే సరోజ్ను డబ్బుతో కొనవచ్చని, అలా ఇద్దరు ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవచ్చని పథకం వేశాడు. నీరజ్ గుండెజబ్బు మనిషని మదన్కు తెలుసు. అందుకే సరోజ్తో ఘోరంగా ఓడావని, మోహిని బ్లైండ్ఫోల్డ్ ఆడినా ఓడినంత పనైందని నీరజ్ను రెచ్చగొట్టాడు. తర్వాత తనతో తెచ్చిన బొమ్మ పామును జేబులోంచి తీసి నీరజ్ కాలిపై వేసి ‘పాము... పాము’ అని చిన్నగా అరిచాడు. దాంతో షాక్ తిన్న నీరజ్ గుండెపోటుకు గురై మరణించాడు. అదంతా టేప్రికార్డర్లో రికార్డయింది. మదన్ ఇల్లు శోధిస్తే ఆ బొమ్మ పాము దొరికింది. పథకం ప్రకారం మదన్ నీరజ్ శవాన్ని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాను నీరజ్ కుర్చీలో కూర్చున్నాడు. మదన్కు మిమిక్రీ వచ్చు. ట్యూబ్లైట్ ఆఫ్ చేసి, గదిలో బెడ్లైట్ వేశాడు. గదిలోకి వచ్చిన కోటయ్యకు కాఫీ తెమ్మని నీరజ్ గొంతుతో చెప్పాడు. తర్వాత జావేద్ వచ్చాడు. కంటిచూపు బాగులేని జావేద్ బెడ్లైట్ వెలుతురులో మదన్నే నీరజ్ అనుకున్నాడు. జావేద్తో ఆట ఓడిపోయి, నీరజ్ గొంతుతో అతన్ని అభినందించాడు. జావేద్ వెళ్లగానే నీరజ్ను అతని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు మదన్.’ అని ముగించాడు కుమార్. మదన్ తలదించుకుని పోలీసులకు లొంగిపోయాడు. -
గొడవ చేయొద్దన్నందుకు.. చెవి కొరికి మింగాడు
న్యూఢిల్లీ : 28 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చెవి కొరికి మింగేశాడో తాగుబోతు. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్పరిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుమార్(28) ఢిల్లీలోని సుల్తాన్పురిలో నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన దీపక్, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు తప్పతాగి కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కుమార్ను గమనించిన ఆ ఇద్దరు అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. కుమార్ వారిని గొడవ చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని బతిమాలాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగి ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ఆరంభించారు. దెబ్బలకు తాళలేకపోయిన అతడు సహాయం కోసం బిగ్గరగా అరవటం మొదలు పెట్టాడు. విచక్షణ కోల్పోయిన సంతోష్ దాదాపు సెంటీమీటర్ మేర కుమార్ చెవి భాగాన్ని కొరికి దాన్ని నమిలి మింగేశాడు. విషయం తెలుసుకున్న అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే ముందే కుమార్ను ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి వారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. కుమార్కు ఆ ఇద్దరు వ్యక్తులతో ఎటువంటి గొడవలు లేవని దర్యాప్తులో తేలింది. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. -
టెక్కీ అజితాబ్ ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ టెక్కీ కుమార్ అజితాబ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన తన కారును కొనుగోలుదారుడికి అమ్మేందుకు బయటకు వెళ్లిన అజితాబ్ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అజితాబ్ అదృశ్యంపై వైట్ఫీల్డ్లో కేసు నమోదైంది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అతని తండ్రి అశోక్కుమార్ సిన్హా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తునకు నగర కమిషనర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఎంత విచారించినా, సుదీర్ఘంగా గాలించిన అజితాబ్ ఆచూకీ లభించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా అజితాబ్ ఆచూకీ పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఐడీ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అజితాబ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. అజితాబ్ ఆచూకీ తెలిసిన వారు సీఐడీ కంట్రోల్ రూమ్ 080–2204498, 22942444 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలని సూచించింది. -
పద్ధతి మార్చుకోలేదని ప్రాణం తీశాడు
- ప్రియురాలిని చంపిన ప్రియుడు - శవం సహా పోలీస్స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు తనకల్లు: వివాహేతర సంబంధం వద్దని చెప్పినా పద్ధతి మార్చుకోనందుకు ప్రియురాలిని అంతమొందించిన ప్రియుడి ఉదంతం తనకల్లు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. శవం సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి చెందిన అశోక్కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడుప్పుడు సిమెంట్ ఇటుకలు, టైల్స్ని అశోక్కు చెందిన టాటా ఏస్ వాహనంలో తరలించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ నేపధ్యంలో కుమార్ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్య మల్లీశ్వరి(40)తో ఏడాది నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న కుమార్.. అశోక్తో గొడవపెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్ తిరుపతికి వెళ్లి కారును బాడుగుల కోసం పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు. అయినా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం అలాగే కొనసాగేది. మంగళవారం మల్లీశ్వరిని కొక్కంటిక్రాస్కు రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపి కారులోనే గొడవపెట్టుకున్నాడు. ‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్ కారులో ఉంచిన కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శవాన్ని కారులోనే పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ తెలిపారు. -
గరగపర్రు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంకు లేఖ
–బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ తాడితోట, (రాజమహేంద్రవరం సిటీ): గరగపర్రు వెలి జరిగి ఆగస్టు 5వ తేదీ నాటికి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని సందర్శించ లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ విమర్శించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద వెలి గరగపర్రు గ్రామంలోనిదేనని ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ఆ గ్రామాన్ని సందర్శించి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని తెలిపారు. సమస్యలు అలానే వెంటాడుతున్నా మీ కుమారుడు లోకేష్ మాత్రం అన్ని సమస్యలూ పరిష్కరించినట్లు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన గరపర్రు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నానని, అనుమతి కోసం లేఖ రాస్తున్నానని, నాతోపాటు పోలీసులను పంపిచినాఅభ్యంతరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 5, ఉదయం 10 గంటలకు గరగపర్రు బయలుదేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
డి.హీరేహాళ్ (రాయదుర్గం), తాడిపత్రి రూరల్ : కుటుంబాలను పోషించే ఓ యువతి, ఓ యువకుడిని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చింది. శుక్రవారం జరిగిన ఈ రెండు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి నుంచి పలువురు కూలీలు శుక్రవారం బొమ్మనహాళ్ మండలం శ్రీరంగాపురం వద్ద పొలాల్లో కలుపుతీసే పనికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా ఎస్.ఆర్.కోట సమీపంలో మలుపువద్దకు రాగానే ఆటోలో కూర్చున్న కూలీ శాంతమ్మ (19) తను పట్టుకున్న ఇనుప కడ్డీ ఊడిరావడంతో కిందపడింది. ఆ వెంటనే వెనుకచక్రం ఆమె తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మురడి గ్రామానికి చెందిన రుద్రప్ప భార్య గంగమ్మ ఇదివరకే మృతి చెందడంతో కుమార్తె శాంతమ్మే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేది. ఇప్పుడు ఆమె కూడా మృత్యువాత పడటంతో తండ్రి, తమ్ముళ్లు గుండెలవిసేలా రోదించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన వీణయ్య, జయమ్మ దంపతుల రెండో కుమారుడు కుమార్ (21) తాడిపత్రిలో ఓ అడిటర్ వద్ద పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా హైదారాబాద్కు వెళ్లి తిరిగి వచ్చిన కుమార్ శుక్రవారం తాడిపత్రి నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గం మధ్యలోని అక్కన్నపల్లి పెట్రోల్ బంక్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
పాడుబుద్ధికి 10 నెలల జైలు
బాలుడి కిడ్నాప్ కేసులో కటకటాలు గోపాలపట్నం: గంజాయి వ్యసనం ఓ వ్యక్తిని కిడ్నాప్కి ప్రేరేపించింది. సొంత మేనమామే ఓ బాలుడిని ఆడిస్తున్నట్లుగా నటించాడు. తల్లి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి ఆ బాలుడిని రైల్వేస్టేషన్లో వదిలేశాడు. గంజాయి మత్తులో పడి ఎటో వెళ్లిపోయాడు. పోలీసుల అప్రమత్తతతో ఆ బాలుడు దొరికాడు. ఆ నిందితుడు ఇపుడు కటకటాల పాలయ్యాడు. పెందుర్తికి చెందిన డోలా కిరణ్కుమార్ అనే వ్యాను డ్రైవరు మద్యం, గంజాయికి బానిసయ్యాడు. గోపాలపట్నం లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్న తన సోదరి బోనెల విజేత ఇంటికి గత నవంబరు 18న వచ్చాడు. ఆమె రెండున్నరేళ్ల కొడుకు తిలక్ని ఆడిస్తూ.. పెందుర్తిలో ఉన్న తన అమ్మ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. బాలుడిని బైక్పై తీసుకెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైకుంఠరావు నేతృత్వాన ఎస్ఐ దుంపల శ్రీనివాస్ ఆగమేఘాలమీద నాలుగు బందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. వాట్స్యాప్లలో అన్ని పోలీస్స్టేషన్ల ఇన్చార్జిలకు నిందితుడి ఫొటోలు, బాలుడి ఫొటోలూ పంపారు. చివరకు విశాఖ రైల్వే స్టేషన్లో ఆ మర్నాడు వేకువజామున రిజర్వేషన్ కౌంటర్లో అనుమానంగా తిరుగుతున్న కిరణ్కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. మైకంలో రోడ్డు పక్కన ఉన్న చుక్కా చిట్టమ్మ అనే వృద్ధురాలి ఒడిలో తిలక్ని పెట్టానని చెప్పాడు. ఆ వృద్ధురాలి అడ్రసు గాలించి మధురవాడలో వాంబే కాలనీలో పట్టుకున్నారు. ఇలా తిలక్ని తీసుకుని కుటుంబసభ్యులకు అందజేశారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ కేసులో రెండవ మెట్రోపాలిటన్ మెజిస్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కిరణ్కుమార్కి పది నెలల జైలు, రెండువేల జరిమానా విధించారు. -
ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి
గొల్లపల్లి(జగిత్యాల): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడనే విషయం తెలిసి ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి పెళ్లిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన దీప(24)కు ఓ ఫోటో స్టూడియోలో నాలుగేళ్ల క్రితం తూర్పాటి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న దీపను కాదని కుమార్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుమార్ స్నేహితుల ద్వారా తెలుసుకున్న దీప ‘తనను అన్ని విధాలుగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోకుండా.. వేరే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని’ గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
సీబీఐ వలలో ఎమ్ఎస్ఎమ్ఈ ఏడీ
రూ.3.7లక్షల నగదు, 23లక్షల ప్రామిసరీ నోట్స్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేటు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో, స్మాల్, అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎల్ఎన్ కుమార్ను సీబీఐ వలపన్ని అరెస్ట్ చేసింది. ఖాజాగూడకు చెందిన శైలజ ఎంటర్ప్రైజెస్లో ప్రతీ ఏటా నిర్వహించే తనిఖీలకు సంబంధించి కంపెనీకి అనుకూలంగా నివేదికిస్తానని చెప్పి ఎస్ఎల్ఎన్ కుమార్ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఈ నెల 20న సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సీబీఐ అధికారులు వలవేసి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా కుమార్ను మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు రూ.3.7లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన ప్రామిసరీనోట్లు, చెక్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీ నం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన కుమార్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవే శపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
అమడగూరు: బంధువుల మనిషి చనిపోయారన్న విషయం తెలుసుకుని శనివారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్తున్న సమయంలో కర్ణాటక బాగేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల బంధువుల వివరాల మేరకు.. అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లికి చెందిన కుమార్ (24), కర్ణాటక చెంచురాయునిపల్లికి చెందిన వెంకటేష్ (22) అనే యువకులు శనివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై మించరాయునికోటకు బయలుదేరి వెళ్లారు. బాగేపల్లి దాటగానే బెంగళూరు నేషనల్ హైవేపైకి వెళ్లే సమయంలో రోడ్డు దాటుతుండగా కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ఇన్నోవా కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే ఉన్నం బంధువుది? ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారు కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి బంధువులకు చెందినదిగా తెలిసింది. ప్రమాదంలో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయిపోగా వాహన డ్రైవర్ పరారయ్యాడు. ఇన్నోవా కొత్త వెహికల్ కావడంతో రిజిస్ట్రేష¯ŒS కూడా కానట్లు తెలిసింది. బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. -
మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తించాలి
ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్ రంపచోడవరం : వ్యవసాయం, అనుబంధ రంగాల సమన్వయంతో పురోగతి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వీలు కలుగుతుందన్నారు. రైతులను భూసార పరీక్షలు చేయించి సూక్ష్మ పోషకాలందించి అధిక దిగుబడిని సాధించేలా చైతన్యం చేయాలన్నారు. ఏజెన్సీలోని చెక్డ్యామ్లకు మరమ్మతులు చేయించి పూర్తిగా వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ అవకాశాలను మెరుగుపర్చాలన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ రాబర్ట్పాల్, శ్రీనివాస్రెడ్డి , ఏపీడీ వై శంకర్నాయక్, పీహెచ్ఓ బి.శ్రీనివాసులు, ఈఈ వెంకటేశ్వర్లు, మైక్రో ఇరిగేషన్ పీడీ సుబ్బారావు, కేవీకే కో ఆర్డినేటర్ శ్రీనివాసు, పీఏఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాగా నోడల్ ఏజెన్సీలో ఉన్న పెండింగ్ సమస్యలను గిరిజన సబ్ప్లాన్లో పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్బాబు పీవో దినేష్కుమార్ను కోరారు. టీఎస్పీ కింద గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 2017–24 వరకు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం టీఎస్పీ కింద రాష్ట్రంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని పీవో దినేష్కుమార్ చెప్పారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో టీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి నాబార్డు కన్సల్టెన్సీ ప్రతినిధులు బుధవారం సంప్రదింపులు జరిపినట్లు పీవో తెలిపారు. -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే. -
హర్షకుమార్ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు -
హర్షకుమార్ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో కిడ్నాప్ కేసు నిందితులు
సాక్షి, రాజమహేంద్రవరం : ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గత నెల 27న అరసాడ శరత్కుమార్ కిడ్నాప్ అయినట్టు అదే రోజు నమోదైన కేసులో ముగ్గురు నిందితులను ప్రకాశ్నగర్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో కంపెన సత్యనారాయణ, పుచ్చల సాయికిరణ్, జానకీరామ్ను విచారిస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల 27న మాజీ సైనికుడు అరసాడ శరత్కుమార్ ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న తన అపార్ట్మెంట్ నుంచి వస్తుండగా కిడ్నాప్కు గురయ్యారు. ఆయనను చిత్రహింసలు పెట్టిన నిందితులు రూ.3.5 కోట్ల విలువైన మూడు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుని, అదే రోజు విడిచిపెట్టారు. మూడు ఆస్తుల్లో ఒకటి అప్పటికే శరత్కుమార్ వేరే వారికి విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఆస్తి యజమానులు సోమవారం పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. తాము హుకుంపేటలోని 39 సెంట్ల భూమిని శరత్కుమార్ వద్ద 2016 జూలై 22న కొనుగోలు చేసినట్టు సబ్ రిజిస్ట్రార్కు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించి, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని విన్నవించారు. కాగా, నిందితుల కోసం గాలిస్తుండగా వారే స్టేషన్ కు వచ్చి లొంగిపోయారని ప్రకాశ్నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ’సాక్షి’కి తెలిపారు. -
ఘర్షణలో గాయపడిన యువకుడి మృతి
గుత్తి: గుత్తిలో మొహర్రం సందర్భంగా సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణలో గాయపడిన కుమార్(25) మంగళవారం మరణించినట్లు ఎస్ఐ చాంద్బాషా తెలిపారు. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన కుమార్, రవి, మల్లికార్జున ఉప్పర వీధిలో చిందులు వేస్తుండగా వేణుగోపాల్ అనే వ్యక్తికి కుమార్ కాలు తగిలింది. దీంతో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కుమార్తో రవి, మల్లికార్జున జత కలసి వేణుగోపాల్తో గొడవకు దిగారు. దీంతో వేణుగోపాల్ తండ్రి నాగరాజు, స్నేహితుడు యుగంధర్ సైతం రంగంలోకి దిగారు. ఘర్షణ పెద్దదై పరస్పరం కొట్టుకున్నారు. అంతలోనే కొందరు మధ్యవర్తులు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కాసేపయ్యాక వారు మళ్లీ పరస్పరం దాడులకు దిగారు. కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు మంగళవారం సాయంత్రం తరలిస్తుండగా కుమార్ మార్గమధ్యంలోనే మరణించాడన్నారు. దీంతో వేణుగోపాల్, నాగరాజు, యుగంధర్పై హత్య కేసు సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా కుమార్ ఏడాది కిందటే సుధారాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుధారాణి ప్రస్తుతం గర్భిణి. భర్త మృతి చెందడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. -
ఎయిర్పోర్టు కాలనీలో దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎయిర్పోర్టు కాలనీలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాలనీకి చెందిన కుమార్(30) సమీపంలోని నిర్జన ప్రదేశంలో విగతజీవిగా పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతని తలపై బండరాళ్లతో మోది చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. -
ఆరోగ్యశ్రీని రద్దు చేసే కుట్ర
నిరుపేదలు వైద్యం అందకచనిపోతే ప్రభుత్వానిదే బాధ్యత వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ కె.నగేష్, అక్కెనపల్లి కుమార్ ధర్మారం : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే కుట్రలో భాగంగానే నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేష్, జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ ఆరోపించారు. ధర్మారంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం బిల్లులు చెల్లిం^è కపోవటంతో ప్రై వేటు ఆసుపత్రులు నిరుపేదలకు వైద్యం అందించటం లేదన్నారు. రోగాల బారినపడిన నిరుపేదలకు వైద్య సేవలందక మరణిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యసేవలందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ దశలవారీగా ఆరోగ్యశ్రీని రద్దు చేసేందుకే బిల్లులు చెల్లించటంలేదని అన్నారు. బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.650 కోట్లు కేటాయించిన ప్రభుత్వం విడుదల చేయకపోవటం పేదలకు శాపంగా మారిందన్నారు. జ్వరాలతో నిరుపేదలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే వసతులు లేక నేలపై పడుకోపెట్టి వైద్యం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఎందుకు ప్రారంభించటం లేదనిప్రశ్నించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిపడిన నిధులను వెంటనే మంజూరీ చేసి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇప్పాల మల్లేశం, వేణుమాధవరావు, రాష్ట్రసంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్ పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు
వేలూరు: కార్పొరేషన్లోని ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్లోని మొత్తం 24 వార్డుల్లో రూ.40 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ కాలువకు ప్రతి ఇంటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు పూర్తిగా పైప్లైన్ ఏర్పాటు చేసి కలపాల్సి ఉంది. వీటిపై కార్పొరేషన్ అధికారుల బృందం ఇళ్ల యజమానులకు అవగాహన కల్పిం చారు. కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ కాలువల్లో లింకు చేసేందుకు అతి తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్ద పరిశీలించి వారందరికీ కాలువల్లో లింకులు ఇచ్చామని తెలిపారు. దీనిపైఆయా వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని భూగర్భ డ్రైనేజీ కాలువలకు అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ పథకంలో లింకు చేసేందుకు ఒక ఇంటికి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఒకే సారి చెల్లించక పోయినా నాలుగు దఫాలుగా కూడా నగదు చెల్లించవచ్చన్నారు. అనంతరం కొసపేటలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికీ వెళ్లిన కార్పొరేషన్ అధికారుల బృందం భూగర్భ డ్రైనే జీ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆ ప్రాంతంలో 450 ఇళ్ల పైపు లైన్లను లింకు చేసేందుకు దరఖాస్తులు అందజేశారు. ఆయనతో పాటు కార్పొరేషన్ ఇంజినీర్ బాలసుబ్రమణియన్, ఆరోగ్యశాఖ అధికారి బాలమురుగన్ ఉన్నారు. -
జిల్లాతోనే అభివృద్ధి
సిరిసిల్ల : జిల్లా అయితేనే సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ అన్నారు. న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ముందుగా ప్రకటించిన సిరిసిల్లపై ప్రభుత్వం మాటమార్చిందన్నారు. సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జక్కుల యాదగిరి, నాయకులు గుండెటి శేఖర్, వంగరి అనిల్, కొత్వాల్ రవి, దీక్షల్లో న్యాయవాదులు కోడం సత్యనారాయణ, జె.ప్రభాకర్, టి.వెంకటి, నర్మెట రమేశ్, కె.ధర్మేందర్, కోడి లక్ష్మణ్, కళ్యాణ్ చక్రవర్తి, కుంట శ్రీనివాస్, అనిల్, టి.పర్శరాములు, సురభి సత్యనారాయణరావు, జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంత్రావు, బుస్సా వేణు, రాజేశం, కంసాల మల్లేశం, లింగంపల్లి సత్యనారాయణ, రొడ్డ రామచంద్రం, బీఎస్సీ నాయకులు మల్యాల రమేశ్, బట్టు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
యువతి వేధింపులు భరించలేక...
కరీంనగర్ : యువతి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జగిత్యాలకు చెందిన యువకుడు కుమార్ను యువతి వేధింపులుకు గురి చేస్తుంది. ఆ క్రమంలో ఇటీవల మరీ వేధింపులు అధికమయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఆశ్రయించాడు. అయినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు శనివారం సూసైడ్ నోటు రాసి పురుగుల మందు సేవించాడు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్!
ఇటీవల వినూత్న లుక్ లో అలరిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ కుమార్ స్పోర్ట్స్ హెయిర్ స్టయిల్ వెనుక రహస్యం ఏమిటి అంటే... అంతా ఆయన క్రీడాభిమాని అవటం వల్లేనట. అదొక్కటే అసలు కారణం కాదు. చిన్నపాటి క్రాఫ్ ను తిన్నగా పాపిడి తీసి దువ్వినట్లుగా కనిపిస్తున్నఆయన కొత్త హెయిర్ స్టయిల్ వెనుక క్రీడాభిమానంతోపాటు మరో కారణం కూడా ఉంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికే ట్రయలర్ తో అభిమానులను అలరిస్తూ త్వరలో విడుదల కాబోతున్నఅక్షయ్ చిత్రం.. 'హౌస్ ఫుల్ 3' నేపథ్యంలోనిదే ఆయన క్రాప్ వెనుక కథ. అక్షయ్... ఆ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రోనాల్డో, సెర్జియో ఆగ్రో కేశాలంకరణను అనుకరించే కొత్త లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. క్రీడలపై తనకున్న ప్రేమ దాచేది కాదని... అది క్రికెట్, కరాటే, ఫుడ్బాల్ వంటివి ఏవైనా కావచ్చొని అక్షయ్ కుమార్ అంటున్నారు. అయితే వర్షాలు ఇతర అన్ని క్రీడలకు అడ్డంకిగా మారినా, ఫుడ్ బాల్ విషయంలో మాత్రం అటువంటి ఇబ్బంది ఎదురుకాదని, వర్షంలో కూడా ఎంతో ఎంజాయ్ చెయ్యగలిగే ఆటగా అక్షయ్ పేర్కొన్నారు. బంతిని ఒక్క తన్నుతన్ని కింద పడటం... బట్టలపై నీళ్ళుపడి మురికైపోవడం సాధారణంగా అందరికీ ఉండే మంచి అనుభవమని, కొడుకు ఆరవ్, తాను రుతుపవనాలు వస్తే ఫుడ్ బాల్ ఆడాలని ఎదురు చూస్తుంటామని, ఎందుకంటే అది తమ ఇద్దరికీ ఎంతో ఇష్టమని అక్షయ్ తెలిపారు. ఇక 'హౌస్ ఫుల్ 3' విషయానికి వస్తే... ఆ సినిమాలో తాను ఫుడ్ బాల్ ప్లేయర్ అని, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్ లతో సినిమా కోసం ఫుట్ బాల్ సరదాగా ఆడటం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అక్షయ్ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, నార్గిస్ ఫఖ్రి, లిసా హాయ్దోన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ తారాగణంగా నటిస్తున్న'హౌస్ ఫుల్ 3' చిత్రం.. మూడు నిమిషాల ఫస్ట్ ట్రయలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 3న విడుదలకు సిద్ధమౌతోంది. -
కాల్వలో దిగి ఇద్దరు చిన్నారులు మృతి
డక్కిలి : అప్పటి వరకు కంటి ముందు తిరిగిన అన్నదమ్ములు ఆడుకొనేందుకు వెళ్లి శవాలై తిరిగొచ్చారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ సంఘటన డక్కిలి మండలంలోని వెలికల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వెలికల్లు అరుంధతీయవాడకు చెందిన లచ్చా పోలయ్య, వెంకటరమణమ్మలు దంపతులు. పోలయ్య కూలి పనిచేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాలాజీ (7), రెండో కుమారుడు కుమార్ (5) స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడి కావడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు. తల్లికి మూగ, చెవుడు కావడంతో.. బాలాజీ, కుమార్ ఇంట్లో కొంతసేపు ఉన్న తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నామని తల్లికి చెప్పారు. అయితే వెంకటరమణమ్మకు మూగ, చెవుడు ఉండటంతో పిల్లలు చెప్పిన విషయం ఆమెకు అర్థంకాలేదు. తండ్రి ఈ సమయంలో కూలికి వెళ్లి ఉండటంతో ఎవరూ అడ్డుచెప్పేవారు లేకుండాపోయారు. ఇద్దరూ కాలనీ సమీపంలోని తెలుగు గంగ మూడో బ్రాంచి కాలువ వద్దకు ఆడుకొనేందుకు వెళ్లారు. కొంతసేపటికి ప్రమాదవశాత్తు అన్నదమ్ములు కాలువలో పడి మృతిచెందారు. అటుగా పొలాల్లోకి వెళ్తున్న ఓ మహిళ కాలువలో పిల్లల మృతదేహాలు తేలుతుండటం గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి ఇంటికి తీసుకొచ్చారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు : చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కడుపుకోతతో తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిం చారు. వెంకటరమణమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మూగ, చెముడు ఉన్నప్పటికీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆమె బాధ స్థానికుల చేత కన్నీరు పెట్టించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ : ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మృతిచెందారనే విషయాన్ని తెలుసుకొన్న వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఏఎస్సై నారాయణ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా బాధిత తల్లిదండ్రులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను అప్పగించేందుకు ఇష్టపడలేదు. పోలీసులు విచారణ చేపట్టారు. -
సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
కడప: కడప సెంట్రల్ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్ మంగళవారం ఉదయం జైలు ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి వారు అతడిని కిందికి దించి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అతడిని వెంటనే రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యం, మానసిక కారణాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. -
చిన్నారిపై టీచర్ లైంగిక దాడి
చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలపై దాడికి దిగారు. బస్సులను తగులబెట్టి, ఫర్నిచర్ను ధ్వంసంచేశారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటన మెదక్ జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మిర్దొడ్డిలోని వికాస్ ప్రైమరీ స్కూలులో కుమార్(22) అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. అతడు స్కూల్లో చదువుకునే ఆరేళ్ల బాలికపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. దీంతో వారు దుబ్బాక సీఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం బంధువుల తో కలసి పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై దాడికి యత్నించారు. ఆవరణలోని రెండు పాఠశాల బస్సులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం మిర్దొడ్డి ప్రధాన జంక్షన్లో రాస్తారోకోకు దిగారు. విషయం తెలిసి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్గౌడ్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి, పంపేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డిప్యూటీ డీఈవో శ్యాంప్రసాద్రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. -
ట్రాక్టర్, లారీ ఢీ: ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుని కథనం ప్రకారం... పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏలబోతరం కుమార్(30), కలవేని అశోక్ (28), పొన్నల రవి ఆదివారం రాత్రి ట్రాక్టర్లో వెళ్లి చిన్నబోంకూర్ సమీపంలోని శాలివాహన పవర్ప్లాంట్లో సామగ్రిని దించి వేశారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాడుతున్న ట్రాక్టర్ను కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమార్, అశోక్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన రవిని 108లో కరీంనగర్కు తరలించారు. -
వడ్డీ వ్యాపారి దాడి: వ్యక్తికి తీవ్రగాయాలు
హైదారాబాద్: నగరంలోని నాచారంలో ఓ వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బంగారు నగల వ్యాపారి గిరి వ్యాపార నిమిత్తం కుమార్ అనే వ్యక్తి నుంచి రూ. 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రస్తుతం రూ. కోటి ఇవ్వాలని కుమార్ డిమాండ్ చేయడంతో.. ఇద్దిరి మధ్య వివాదం చోటు చేసుకుంది. వ్యాపారి నుంచి తీసుకున్న అప్పుకు మూడింతలు వడ్డీ వసులు చేస్తుండటంతో గిరి నిలదీశాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కుమార్ గిరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదా ఘాతంతో విద్యార్థి మృతి
వెల్దండ మండలం మర్రి గుంట తాండాకు చెందిన కుమార్(15) అనే విద్యార్థి కరెంటు షాక్తో మృతిచెందాడు. కుమార్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
'కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలి'
-
‘సత్య’వ్రతుడు
నిరాడంబరుడు, సేవాతత్పరుడు పోటీ పరీక్షల్లో హ్యాట్రిక్ టాపర్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుమార్ ప్రస్థానం ఏ రంగంలోనైనా రాణించేవారు ఎందరో ఉంటారు. బహు రంగాల్లో రాణించే వారు కొందరే ఉంటారు. వృత్తి, ప్రవృత్తిలోనే కాదు.. నీతి, నిజాయతీ, దయాగుణంతో నడిచే వారు అరుదుగా ఉంటారు. అవన్నీ కలగలిసిన ఒకాయన నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. కోచింగ్ తీసుకోకుండా ఏకంగా మూడు పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్గా నిలిచారు. గ్రూప్-1 ఆఫీసర్ హోదాలో ఓ శిథిల క్వార్టరులో ఉంటున్నారు. ఆయన మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ కూడా. విధి నిర్వహణలోనూ పలు అవార్డులందుకుంటున్నారు. నిస్వార్థం, నిరాడంబరత, ఆదర్శం మేళవించిన ఆ అధికారి పేరు చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్. విశాఖ జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదవండి... విశాఖపట్నం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కుమార్కు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు మిమిక్రీ అంటే పిచ్చి. రేడియో, టీవీల్లో వచ్చే నేరెళ్ల వేణుమాధవ్ వంటి ప్రముఖుల మిమిక్రీ షోలు చూసి స్వతహాగా అనుకరించడం నేర్చుకున్నారు. మిమిక్రీపై ఆసక్తి చూపితే కెరీర్ పాడవుతుందని, చదువు ముఖ్యమని తల్లి భుజంగవేణి కుమారుడికి హితబోధ చేసేది. అమ్మ చెప్పిన మాటలను ఒంట బట్టించుకుని చదువులో రాణిస్తూనే, తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజంపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో ఇచ్చిన తొలి షోను అంతా మెచ్చుకోవడంతో దూసుకెళ్లారు. జెమినీ, దూరదర్శన్, ఆకాశవాణితో పాటు పలు సంస్థల తరఫున ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డులు, సన్మానాలు పొందారు. ఉద్యోగ ప్రస్థానం.. కుమార్ ఉద్యోగ ప్రస్థానంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. విశాఖలో పాలిటెక్నిక్, విజయవాడలో బీటెక్ (సివిల్) చదివారు. అనంతరం తొలిసారి జేఈ ఉద్యోగానికి ఆర్ఆర్బీ (సికింద్రాబాద్) పరీక్ష రాసి 2002లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆ ఉద్యోగంలో ఉంటూ 2005లో సెక్షన్ ఇంజినీర్ పోస్టుకి ఆర్ఆర్బీ (కోల్కతా) ఎగ్జామ్ రాసి దేశంలోనే మరోసారి టాపర్గా నిలిచారు. ఆ పోస్టులో ఉంటూనే ఏపీపీఎస్సీ 2007లో వెలువరించిన గజిటెడ్ ఎగ్జామ్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంకు పొందారు. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ (గ్రూప్-1 కేడర్)గా శ్రీకాకుళం జిల్లాలో నియమితులయ్యారు. అనంతరం తూర్పుగోదావరి బదిలీ అయి, రెండున్నరేళ్లుగా విశాఖ జిల్లాలో ఏడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజం షోలివ్వక పోయినా ఉన్నతాధికారుల కోరికపై అప్పుడప్పుడూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. పురస్కారాలివీ.. కుమార్ వృత్తి, ప్రవత్తిలో పలు అవార్డులందుకున్నారు. నేషనల్ సర్వే డే రాష్ట్ర అవార్డు, బెస్ట్ సిటిజన్ జాతీయ, రాష్ట్ర అవార్డులు, ఆంధ్రరత్న రాష్ట్ర అవార్డు, లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు, విశాఖ మదర్ థెరీసా సంస్థ ఆణిముత్యం, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ జాతీయ అవార్డ, ఒంగోలు నేషనల్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలు, అర్పిత సంస్థ ఆంధ్రరత్న వంటి 15 అవార్డులు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు. నిరాడంబరత.. విధి నిర్వహణలో కుమార్ సమర్థవంతుడన్న పేరుంది. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఎంతో కీలకమైనది. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తూర్పు గోదావరికి బదిలీ చేసింది. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు స్టేట్ అవార్డు ఇచ్చింది. అనంతరం విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూముల గుర్తింపు, కంచె వేయించి పరిరక్షణ పనులు చేపట్టారు. చిన్నపాటి ప్రభుత్యోద్యోగులే బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఈ రోజుల్లో నిరాడంబరత కోరుకునే కుమార్ ఓ శిథిలమైన సాదాసీదా ఆర్ అండ్ బీ క్వార్టరులో ఉంటున్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న కుమార్ పురాణాలు, ఇతిహాసాలను బాగా ఔపోసన పట్టారు. తనను అవే మార్చాయంటారాయన. తన పుట్టినరోజును అనాథలు, వృద్ధుల ఆశ్రమాల్లో జరుపుకుంటారు. 30 మంది పేద పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తుంటారు. నా ఆస్తులు ట్రస్టుకే.. నేను సర్కారు బడిలోనే చదివాను. ఒక్కరోజూ కోచింగ్ గడప ఎక్కలేదు. కేవలం మార్కెట్లో దొరికే పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టే స్టేట్ టాపర్ ర్యాంకులు సాధించాను. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాను. నాకొచ్చే జీతంలో ఎలాంటి సేవింగ్స్ చేయడం లేదు. చట్టబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తాను. కర్మయోగాన్ని నమ్ముతాను. నా తదనంతరం ఆస్తిపాస్తులు మదర్ థెరిసా ట్రస్టుకివ్వాలని నిర్ణయించుకున్నాను. నా భార్య కడప జిల్లా రాజంపేటలో స్టేట్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆమె కూడా నా నిర్ణయాలకు సహకరిస్తున్నారు. -సీహెచ్వీఎస్ఎన్ కుమార్, ఎ.డి. -
రెండు ఎన్నికలు - ఒకే నీతి
గత సంవత్సరంగా కంటి మీద కునుకులేని చాలా చాలా పార్టీలకి కేజ్రీవాల్ విజయం ఒక ఊరట. ఆయన గెలిచినందుకు కాదు. మోదీ ఓడినందుకు. ఓటమికి ఇది ప్రారంభమని వారు గుండెల మీద చేతులు వేసుకోగలిగినందుకు. గత పన్నెండు నెలల్లో కేజ్రీవాల్ని ఢిల్లీ ప్రజలు రెండు సార్లు ఎన్నుకున్నారు. మొదటి సారి కేవలం అవినీతిపై కేజ్రీవాల్ ఎత్తిన ధ్వజం మాత్రమే కారణమైతే, రెండో సారి ఎన్నికల్లో మిగతా పార్టీలు మోదీపై వారు ఎత్తద లచిన ధ్వజం కారణం. తృణ మూల్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, లల్లూ ప్రసాద్, నితీశ్కుమార్ వంటి వారికి కేజ్రీవాల్ మీద ప్రేమ కంటే మోదీ పట్ల వ్యతిరేకత - ఇంకా తమ ఉనికి పట్ల సందిగ్ధత ఎక్కువ మొగ్గు. బాచయ్య బూచయ్యకి వ్యతిరేకి. బూచయ్యంటే నాకు సుతరామూ ఇష్టం లేదు. అందుకూ బాచయ్యంటే నాకిష్టం. రాష్ట్రంలో తన ప్రతిపత్తిని కోల్పోయిన లల్లూకి, పశ్చిమ బెంగాల్లో నానాటికీ అవినీతి తెరలు ముసురు కుంటున్న మమతా బెనర్జీకి, స్వయంకృతాపరాధం నుంచి ఎలా బయటపడాలో తెలీని నితీశ్కి కేజ్రీవాల్ నీటిలో తేలే ఊతం కర్ర. అయితే ఇక్కడ ఆగితే కేజ్రీవాల్కి అన్యాయం చేసినట్టే అవుతుంది. ‘టీ’ అమ్ముకుని జీవించిన ఓ సాదా సీదా మనిషి ఢిల్లీకి నిచ్చెన వెయ్యడమనే ‘అండర్ డాగ్’ రొమాన్స్ ఆనాడు ఆకర్షణ అయితే- గత ఏడు నెలలుగా తిరుగులేని విజయాలని మూటగట్టుకున్న ‘ఆత్మ విశ్వాసం’ దాదాపు అహంకారపు స్థాయికి చేరిన మోదీ కారణంగానే కేజ్రీవాల్ అండర్ డాగ్ అయ్యాడు. ఆరోజు మోదీ ఎన్నిక కావడానికి ముఖ్య కారణమే ఈ రోజు కేజ్రీ వాల్కి కొంగుబంగారం అయింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టుబడి- మోదీ. ఈ దేశంలో గత సంవత్సరంగా కంటి మీద కును కులేని చాలా చాలా పార్టీలకి కేజ్రీవాల్ విజయం ఒక ఊరట. ఆయన గెలిచినందుకు కాదు. మోదీ ఓడినం దుకు. ఓటమికి ఇది ప్రారంభమని వారు గుండెల మీద చేతులు వేసుకోగలిగినందుకు. ఎనిమిది నెలల పాటు తిరుగులేని విజయాన్ని శిరస్త్రాణంలాగ ధరించి, నిరంకు శంగా నడిచిన మోదీ ‘బాడీ లాంగ్వేజ్’ వారిని హింసిం చింది. ఎట్టకేలకు మోదీ ప్రతిభ, మోదీ గ్లామర్, మోదీ దూకుడు వీగిపోయిన మధురక్షణం- చాలామందికి. ఇందులో బీజేపీ స్వయంకృతాపరాధం కూడా ఉంది. తమ పార్టీకి తిరుగులేదనుకుంటే ఫరవాలేదు కాని- తక్కువ వ్యవధిలోనే సాథ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహరాజ్, ప్రవీణ్ తొగాడియా వంటివారు ఈ విజయా న్ని నెత్తికెత్తుకుని అనుచితంగా చేసిన ప్రకటనలని మోదీ ఖండించకపోవడం ద్వారా పరోక్షంగా వాటిని సమర్థిస్తు న్నట్టు కనిపించడం చాలామందిని గాయపరిచింది. నాయకత్వం పట్టించుకోని అలసత్వం నిజంగా ప్రభుత్వ ధోరణికి అద్దం పడుతోందా అన్న మీమాంస చాలా మంది ఓటర్లని బలితీసుకుంది. ఏడు దశాబ్దాల ‘సెక్యుల రిజం’ అనే ఆత్మ వంచనని ప్రాక్టీసు చేస్తున్న ఈ దే శపు పార్టీలకి ఇది అదను. అవకాశం. బీజేపీని ఎదిరించ డానికి వారి ఆయుధమూ- మతమే. క్రితం ఎన్నికకీ, ఈ ఎన్నికకీ కేజ్రీవాల్ శక్తి సామ ర్థ్యాలు చరిత్ర సృష్టించేంత పెరగలేదు. అయితే ఎదిరి పక్షం బలహీనమయింది. తమ తమ ప్రయోజనాలకు మిగతా పార్టీల దొంగ దెబ్బ కలసివచ్చింది. ఇది కాదన లేని కర్ణుడి శాపం. తాను చెయ్యదలచుకున్నదంతా 49 రోజుల్లోనే చేసెయ్యాలనుకున్న ఆత్రుత ఆనాడు కేజ్రీవాల్ ప్రభుత్వా న్ని రోడ్డు మీదకు ఈడిస్తే, అయిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం లో 7 నెలల అలసత్వం - దాదాపు అదే ఇబ్బందిని - సూచనగా బీజేపీకి కలిగించింది. అయితే ఇద్దరికీ రెండు అవకాశాలున్నాయి. కేజ్రీవాల్కి ఇప్పుడు ఐదేళ్ల పాలనా వకాశం. బీజేపీకి ఇంకా 4 సంవత్సరాల 4 నెలల అవకా శం. ఈ విధంగా ఈ అపజయం బీజేపీకి పరోక్షమయిన ఉపకారం. వేళ మించిపోకుండా కలసొచ్చిన చెంపపెట్టు. ఇకముందు కేజ్రీవాల్ - ఇదివరకులాగ కాక తన పాత్రని సవరించుకోవలసి ఉంది. ఉద్యమానికీ, ఉద్యో గానికీ, నినాదానికీ, నిర్మాణానికీ బోలెడంత తేడా ఉంది (ఉద్యోగానికీ, రాజకీయానికీ చుక్కెదురని నిరూపించిన ఇద్దరు మహానుభావులు కళ్లముందున్నారు- మన్మోహన్ సింగ్, కిరణ్బేడీ). కాగా నిజాయితీ మంకు పట్టుదల కాకూడదు. అర్ధరాత్రి దాడులు కాకూడదు. రోడ్ల మీద ప్రభుత్వాల ధర్నా కాకూడదు. ఇవన్నీ కేజ్రీవాల్కి ఈపాటికి అర్థమయ్యే ఉంటా యి. ముఖ్యంగా ఆయన గోడ మీద రాసుకుని గుర్తుం చుకోవలసిన విషయం ఒకటుంది. 67 సంవత్సరాలు జులుంతో, అవినీతితో, దుర్మార్గంతో, అసమర్థతతో రాజకీయ నాయకుల అరాచకంతో విసిగిపోయిన ప్రజా నీకం- రాజకీయాలతో ప్రమేయం లేని ఉద్యమకారుడిని గద్దె ఎక్కించింది. ఇది స్వతంత్ర భారతంలో చరిత్ర. ఈ ఎన్నిక విజయం కాదు. ఓటరు విసుగుదలకి సంకేతం. ఒక పరీక్ష. ఒక అవకాశం. కుర్చీ ఎక్కించిన ఓటరు నిర్దాక్షిణ్యంగా దింపగలడని- కనీసం ఈ ఎన్నిక- ఈ రెండు పార్టీలనూ హెచ్చరిస్తోంది. -
లైంగిక దాడి కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు
వరంగల్ లీగల్ : అడవిలో ఒంటరిగా పని చేస్తున్న మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన నేరం రుజువు కావడంతో తాడ్వా యి మండలం మేడారం గ్రామానికి చెందిన నేరస్తుడు ఆలకుంట్ల కుమార్కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.3000 జరిమానా విధిస్తూ బుధవారం ఏడో అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎన్.సాల్మన్రాజు తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువుకోసం తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి వచ్చి శివారులో గుడిసె వేసుకుని ఉంటున్నారు. 2009 నవంబర్ 12న భర్త బియ్యం కోసం వెళ్లగా, ఆమె చింతల్ గ్రామం వైపు వెళ్లే రోడ్డుపక్కన అడవిలో ఎర్రమట్టి తవ్వడానికి వెళ్లింది. ఒం టరిగా ఉన్న సదరు మహిళ వద్దకు ఆలకుంట్ల కుమార్ చేతిలో గొడ్డలి పట్టుకుని వెళ్లాడు. ఆమెను బెదిరించి తన వెంట తెచ్చుకున్న కండువా నోట్లో కుక్కి తాడుతో చేతులు కట్టేసి లైంగికదాకి పాల్పడ్డాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన వారు రావడం గమనించిన నేరస్తుడు పారిపోయా డు. మూడు రోజుల తర్వాత బాధితురాలు తాడ్వాయి పోలీసుల కు ఫిర్యాదు చేసింది. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనందున నేర స్తుడు కుమార్కు ఐపీసీ సెక్షన్ 376 కింద ఏడేళ్ల జైలు శిక్ష ,రూ.3000 జరిమానా విధిస్తూ జడ్జి సాల్మన్రాజు తీర్పు ఇచ్చారు. జరిమాన చెల్లించకుంటే మరో 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు లో పేర్కొన్నారు. కేసును అప్పటి ములుగు డీఎస్పీ ఎం.దయానందరెడ్డి పరిశోధించగా సీఐ కిషోర్కుమార్, ఎస్సై సాంబ మూర్తి నేరస్తుడిని కోర్టులో హాజరుపర్చారు. లైజన్ ఆఫీసర్ వి.రఘుపతిరెడ్డి విచారణను పర్యవేక్షించగా, సాక్షులను కానిస్టేబుల్ కె.రాజేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును పీపీ రఫత్ వాదించారు. -
మోదీజీ...విడి సిగరెట్లను నిషేధించండి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్యాన్సర్ బారి నుంచి బయటపడిన మాజీ కస్టమ్స్ కమిషనర్ కుమార్ లేఖ రాశారు. విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఆయన గురువారం మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు 2008లో క్యాన్సర్ సోకినట్లు గుర్తించారని, తన స్వరపేటికతో పాటు నాలుకను కూడా సగం తొలగించారని కుమార్ తన లేఖలో కోరారు. క్యాన్సర్ వల్ల ఆహారం తీసుకోవడం, మాట్లాడం తనకు ఇప్పుడు అతి పెద్ద సవాల్గా మారిందని, మరో వ్యక్తికి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే విడిగా సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలని కుమార్ లేఖలో పేర్కొన్నారు. -
ఇద్దరు ఎర్ర దొంగల అరెస్టు
పెనుమూరు: ఆటోలో ఆరు ఎర్రచందనం దుంగలు తరలి స్తున్న ఇద్దరు తమిళనాడువాసులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పెనుమూరు మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రతాపరెడ్డి కథనం మేరకు తమిళనాడులోని అంబత్తూరు సమీపంలోని పడగంటి గ్రామానికి చెందిన శివకుమార్(30) వేలూరుకు చెందిన పి.కుమార్ (40) సహా 10 మంది ఎర్ర కూలీలు తిరుపతి శేషాచల అడవుల్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. గురువారం శివకుమార్, కుమార్ ఆరు ఎర్రచందనం దుంగలను గోనెసంచుల్లో దాచుకుని ఆటోలో తమిళనాడుకు తరలిస్తున్నారు. పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం వద్ద పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగ లు సహా ఏపీ03 డబ్ల్యూ 9524 నెంబర్గల ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు పంపారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, ఆటో విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుంది. మాపాక్షి వద్ద మరో ముగ్గురి పట్టివేత చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం కేసులో చిత్తూరు తాలూకా పోలీసులు ముగ్గురు కూలీలను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. చిత్తూరు తాలూకా ఎస్ఐ బి.సుధాకర్ కథనం మేరకు.. బుధవారం చిత్తూరు గ్రామీణ మండలంలోని మాపాక్షి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు అనుమానిత వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సమయంలో ముగ్గురు నిందితులు పోలీసులపై తిరగబడి కత్తులు, కొడవళ్లతో చంపడానికి ప్రయత్నించారు. అనంతరం నిందితులు సెంథిల్, ఓస్లాగ్, ముత్తురాజును పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 111 కిలోల బరువున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.1లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమో దు చేసి గురువారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ పేర్కొన్నారు. రూ.4.5 లక్షల ఎర్రచందనం స్వాధీనం కేవీపల్లి: శేషాచల అడవుల నుంచి అక్రమంగా తరలిస్తు న్న రూ.4.5 లక్షల విలువైన ఎర్రచందనాన్ని కేవీపల్లి పో లీసులు పట్టుకున్నారు. జిల్లేళ్లమంద పంచాయతీ దే వాండ్లపల్లి సమీపంలోని బ్రిడ్జి కింద దాచిన ఎర్రచందనాన్ని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించా రు. వాహనం సహా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గూడూరుకు చెందిన సురేంద్రరెడ్డి, బెంగళూరుకు చెందిన గణేష్, చిక్కబళ్లాపూరుకు చెందిన రమేష్ను అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లికి చెంది న నాగరాజు, హోస్పేటకు చెందిన విజయ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. అరెస్టు చేసిన వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపినట్లు చెప్పారు. 11 మంది ఎర్ర కూలీల అరెస్ట్ చంద్రగిరి: మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో 11 మంది ఎర్రకూలీలను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్ఐ జాన్ కెనడీ విలేకరుల సమావేశం నిర్వహిం చారు. మండలంలోని శ్రీనివాసమంగాపురం శ్రీవారిమెట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవా రం ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు జరిపామని ఎస్ఐ తెలిపారు. దాడుల్లో ప్రధాన సూత్రధారి కుమరన్ పరారయ్యాడని పేర్కొన్నారు. 11 మంది కూలీలతో పాటు వారి నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన కూలీలు తమిళనాడు, ధర్మపురి జిల్లాకు చెందిన వారని ఆయన అన్నారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ హబీబ్ భాయి, సిబ్బంది సుబ్బన్న, బాబు, జయరాం తది తరులు పాల్గొన్నారు. -
ఓల్డ్ మల్లేపల్లిలో జంట హత్యలు
హతుల్లో యువకుడు, యువతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం నాంపల్లి, న్యూస్లైన్: అనుమానాస్పదస్థితిలో యువకుడు, యువతి దారుణహత్యకు గురయ్యారు. స్థానికంగా కలకలం రేపిన ఈ జంట హత్యలు హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. హబీబ్నగర్ ఓల్డ్ మల్లేపల్లికి చెందిన పి.నాగేశ్వరరావు (ఇ.నం.11-1-962/ఎ)కు ఆరు పోర్షన్ల ఇల్లు ఉంది. ఇందులో ఒక పోర్షన్లో శ్రీకాకుళానికి చెందిన కుమార్(28) అనే యువకుడు పది నెలలుగా అద్దెకుంటున్నాడు. అబిడ్స్లోని బృందావనం లాడ్జిలో కార్మికుడిగా పని చేసే ఇతడు ఉదయాన్నే పనికి వెళ్లి.. అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు. గత ఐదు రోజులుగా ఇతడి పోర్షన్కు తాళం వేసి ఉంది. దీంతో కుమార్ ఊరెళ్లి ఉండవచ్చని ఇంటి యజమాని భావించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు కుమార్ ఉంటున్న గదిలోంచి దుర్వాసన రావడంతో యజమాని తాళం తెరిచి చూడగా కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గొంతును కత్తితో కోసిన గుర్తులుండగా.. తలపై బలమైన గాయాలున్నాయి. అతడి మృతదేహం పక్కనే ఉన్న గోనె సంచిని తెరిచి చూడగా 28-30 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం బయటపడింది. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ హత్యలు ఐదు రోజుల క్రితమే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి యజమాని పి.నాగేశ్వరరావుతో పాటు మరికొందరిని స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కుమార్ గదిలో లభ్యమైన మహిళ మృతదేహం ఎవరనేది తెలియరాలేదు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నామని గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్రావు పేర్కొన్నారు. క్లూస్టీమ్ పరిశీలన.. జంట హత్యలు జరిగిన గదిని క్లూస్ టీమ్ పరిశీలించి కొన్ని వేలి ముద్రలను సేకరించింది. గదిలో ఖాళీ మద్యం సీసాలు లభించాయి. హత్య జరిగిన రోజు ఇద్దరే కాకుండా ఇంకా ఇతరులెవరైనా ఉన్నారా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి చిరునామా లభించగా, మహిళ చిరునామా లభించాల్సి ఉందని ఏసీపీ తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ నాయకులపై దౌర్జన్యం
నగరి, న్యూస్లైన్: నగరి మూడో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ సందర్భంగా కేసే కుమార్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వివ రాలు... మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ భార్య శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఈ వార్డులో పోటీచేస్తున్నారు. ఈ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 23, 1 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 3వ వార్డులోకివచ్చి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు. దీనిని వైఎస్ఆర్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. వీరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. వైఎస్ఆర్ సీపీ నాయకులు కేజే కుమార్, ఆయన కుమారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవిరెడ్డి, బాబురెడ్డి, పంచాక్షర రెడ్డి మధ్య తోపులాటలు జరిగాయి. ఈ సమయంలో మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె బూత్ వద్దకు రావడంతో ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ కుమారుడు రామ్కుమార్కు రక్తగాయాలయ్యూరుు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకొన్న ట్రైనీ డీఎస్పీ చంద్ర ఘర్షణ పడుతున్నవారిని చెదరగొట్టడానికి లాఠీకి పని చెప్పారు. ఈ సందర్భంలో కేజే కుమార్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఆర్కే రోజా, మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె సత్యస్వరూప ఇందిరతో డీఎస్పీ కృష్ణకిషోర్రెడ్డి చర్చలు జరిపారు. రెండు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. -
ఫీట్ చేస్తుండగా గొంతులోకి దిగబడిన కత్తి
హైదరాబాద్ : హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ విభాగంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి వచ్చిన కుమార్, గొంతుపై కత్తి ఉంచుకుని ఫీట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు కత్తి గొంతులోకి దిగబడింది. దీంతో అతడికి స్వల్పగాయమైంది. అయితే మార్షల్ ఆర్ట్స్కు ఎంతలేదన్నా 20 నిమిషాలైనా ఇవ్వాలని, కానీ నిర్వాహకులు తక్కువ సమయం ఇచ్చినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని కుమార్ ఆరోపిస్తున్నాడు. అందరికీ ఇచ్చినంత సమయమే ఇచ్చామని నిర్వాహకులు వాదిస్తున్నారు. -
ఐకేపీ ఏపీడీ ఆకస్మిక బదిలీ!
సీతంపేట, న్యూస్లైన్ : సీతంపేట ఐటీడీఏలో ఐకేపీ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్(ఏపీడీ)గా పనిచేస్తున్న కె.సావిత్రిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో డ్వామా ఏపీడీ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సావిత్రిని శ్రీకాకుళంలో ల్యాండ్ ఏపీడీగా నియమించారు. 11వ తేదీతో జారీ అయిన ఈ ఉత్తర్వులు బుధవారం ఇక్కడకు అందాయి. అధికారులను బదిలీ చేయటం సాధారణమే అయినా.. పనితీరు బాగోలేదన్న కారణంగా సావిత్రిని బదిలీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొనటం ఉద్యోగ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఐకేపీ కార్యకలాపాల నిర్వహణలో సీతంపేట ఐటీడీఏ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఇందుకోసం సావిత్రి ఎంతో కృషి చేశారు. వాస్తవానికి, పనితీరు బాగోకపోతే తొలుత సంజాయిషీ అడుగుతారు. కింది స్థాయి ఉద్యోగులను సైతం ఇందుకు బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తారు. అవేమీ లేకుండా ఏపీడీని ఏకంగా బదిలీ చేయడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం డీఆర్డీఏలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న సావిత్రి ఈ ఏడాది జనవరి ఒకటిన ఇక్కడకు బదిలీపై వచ్చారు. స్వయంశక్తి సంఘాల జమాఖర్చులను సకాలంలో ఆడిట్ చేయించడం, బ్యాంకు లింకేజీ, పీవోపీ లబ్ధిదారులకు రుణాల మంజూరు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. అలాంటిది ఆమెను పనితీరు బాగోలేదంటూ బదిలీ చేయటం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదని ఉద్యోగులు అంటున్నారు. -
భర్త హత్య కేసులో భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు
ముజాఫ్నగర్: భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడికి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. రీనా అనే మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబధం కొనసాగిస్తూ భర్తను అడ్డు తొలిగించుకోవాలని దురుద్దేశంతో హత్య చేసిందని కోర్టులో రుజువు కావడంతో శిక్ష ఖరారైంది. ఈ మేరకు సోమవారం విచారించిన జిల్లా అడిషనల్ జడ్జి చంద్ర భూషణ్ వారికి జీవిత ఖైదుతో పాటు, 25, 000 చెల్లించాలని తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. ముజాఫర్ నగర్ లో నివాసముంటున్న రీనా అనే మహిళకు రోషన్ ను పెళ్లి చేసుకుంది. కొంత కాలం వీరి జీవనం సజావుగానే సాగిన తరువాత వారి మధ్య విభేదాలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె కుమార్ అనే అతనితో వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలు పెట్టింది. జనవరి 2 వతేదీ, 2012 సంవత్సరంలో భర్తకు జబ్బు చేయడంతో అదే అదునుగా భావించిన ఆమె హత్యకు పథకం రచించింది. వీరివురూ కలిసి హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువు కావడంతో వారికి జీవిత ఖైదును కోర్టు ఖరారు చేసింది. -
వెట్టిచాకిరి నుంచి పది మందికి విముక్తి
తిరువళ్లూరు, న్యూస్లైన్: పదేళ్ల పాటు కట్టెలు కొట్టే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న పది మందికి సబ్ కలెక్టర్, ఆర్డీవో అభిరామి ఆదివారం విముక్తి కల్పించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని ఉట్కోట్టం ప్రాంతానికి చెందిన కుమార్(45) అదే ప్రాంతంలో కట్టెల దొడ్డిని నిర్వహిస్తున్నాడు. ఇతను కడంబత్తూరు ప్రాంతంలోని అదిగత్తూరు ప్రాంతానికి చెందిన పది మందితో పదేళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తమకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ బాధితులు ఆదివాసి సంక్షేమ సంఘం ప్రతినిధులను ఆశ్రయించారు. సంఘం ప్రతినిధులు తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి రహస్య సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఆదివారం ఉదయం కట్టెల దొడ్డిపై ఆమె తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరి చేస్తున్న పది మంది కి విముక్తి కల్పించారు. అనంతరం కుమార్పై కేసు నమోదు చేశారు. పది మంది బాధితులకు తాత్కాలిక సహాయం కింద రూ.1000 అందజేశారు. స్వయం ఉపాధి చేసుకోవడానికి రూ.25 వేల చొప్పున అందజేస్తామని ఆర్డీవో అభిరామి వివరించారు.