Local bodies elections
-
ఓటర్ జాబితా నుంచి మాజీ సీఎం పేరు గాయబ్!
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగ్గా.. డెహ్రాడూన్లో ఓటేయడానికి వెళ్లిన ఆయన పేరు ఓటర్ లిస్ట్లో మిస్ అయ్యింది. దీంతో ఆయన అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయారు.డెహహ్రాడూన్లోని నిరంజన్పూర్లో రావత్ 2009 నుంచి నివాసం ఉంటున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటేసిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు.‘‘ గత 16 ఏళ్లుగా నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నా. కానీ, ఇప్పుడు నా పేరే లేకుండా పోయింది. ఉదయం నుంచి నేను పోలింగ్ స్టేషన్ వద్దే ఉన్నా. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకే ఇలా జరిగిందంటే.. ఇది కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం’’ అని అన్నారాయన.VIDEO | Dehradun Municipal Elections: Congress leader Harish Rawat raises concerns over voting issues."I have been waiting since morning... but my name was not found at the polling station where I voted in the Lok Sabha elections. They are now searching for it... let's see what… pic.twitter.com/ZnNKmaD00n— Press Trust of India (@PTI_News) January 23, 2025 దీనిపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే.. కంప్యూటర్ సర్వర్లో తలెత్తిన సమస్యే ఇందుకు కారణంగా తేలింది. దీంతో రావత్కు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని ఈసీ సమాచారం అందించింది.ఉత్తరాఖండ్లో ఇవాళ 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 43 మున్సిపల్ కౌన్సిల్స్, 46 నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలంటూ సీఎం పుష్కర్సింగ్ ధామి ఉదయం ఓటర్లను అభ్యర్థించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించినా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఆ పార్టీ నుంచి భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూటమి వైపు తిప్పుకొనేందుకు కుట్రలు పన్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపారు. అయినా కూటమి వైపు రావడానికి ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీకి పెడితే ఓడిపోవడం ఖాయమనే అంచనాకు కూటమి నేతలు వచ్చారు. సీఎం చంద్రబాబు రెండుసార్లు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల్లో గెలవడానికి సరిపడా ప్రజాప్రతినిధులు లేరని తేలింది. సరిపడినంతమందిని కూటమి వైపు తెస్తేనే అభ్యర్ధిని ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోటీకి దింపాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీకి దిగడం, మెజారిటీ ప్రతినిధులు వైఎస్సార్సీపీ వైపే ఉండడంతో పీలా గోవిందు చేతులెత్తేశారు. దీంతో గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన అయితే భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైఎస్సార్సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసే లోగా అవకాశాలు మెరుగుపడితే దిలీప్ను పోటీకి దింపాలని చూస్తున్నారు. లేనిపక్షంలో పోటీకి దూరంగా ఉండడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళ, బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నేడు, రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులు వైఎస్ జగన్ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. 220 సర్పంచ్లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5364 వార్డు సభ్యుల ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎన్నికలైతే నిర్వహించాలి కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం.. రెండు వారాలు వాయిదా వేసింది. చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు -
సిపాయి ఎంపికపై హర్షం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరో సారి జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి కల్చరల్/శ్రీకాళహస్తి/రేణిగుంట/ఏర్పేడు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎంపికపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపికయ్యారు. విషయం తెలుసుకున్న వన్నెకుల క్షత్రియ సంఘం నేతలు సంబరాల్లో మునిగి తేలారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడులో బాణసంచా పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భరత్రెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు బుజ్జిరెడ్డి, బీసీ నాయకుఉల వేలాయు«ధం తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్తు రామారావు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మరో బీసీ నాయకుడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టం కట్టారు. ఇచ్ఛాపురంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఎంపిక చేశారు. అట్టడుగు వర్గాలకు చెందిన వారిని సీఎం ఒక్కొక్కరిగా రాజకీయంగా పైకి తీసు కొస్తున్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపిస్తూ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పస్తూనే.. పెద్దల సభలకు కూడా వారినే ఎంపిక చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూనే.. నాయకత్వ లక్షణాలున్న వారికి రాజ్యాధికారాన్ని అప్పగిస్తున్నారు. ఇప్పటికే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడంతో పాటు మంత్రి సీటుపై కూర్చోబెట్టారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతా రాంను ఏకంగా రాష్ట్ర శాసన సభాపతిగా నియమించారు. అదే కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా విజయను జెడ్పీ చైర్పర్సన్గా, దువ్వాడ శ్రీనివాస్ను ఎమ్మెల్సీగా చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావును మంత్రిని చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్కు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పాలవలస విక్రాంత్ను ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీని చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన గొర్లె కిరణ్కుమార్, రెడ్డి శాంతిలకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారు. తాజాగా యాద వ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును ఎమ్మెల్సీ చేస్తున్నారు. కళింగ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళను సుడా చైర్మన్గా, అదే సామాజిక వర్గానికి చెందిన అంధవరపు సూరిబాబును రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ను చేశారు. సామాజిక వర్గాల సమతుల్యత ఎస్సీ, ఎస్టీ, రెడ్డిక తదితర సామాజిక వర్గాల వారికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలకు సంబంధించి సామాజిక సమతుల్యత పాటించారు. ఎలాంటి కుటుంబ చరిత్ర లేకపోయినా దక్షత ఉంటే సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత పదవిలో కూర్చోబెట్టవచ్చని చేసి చూపించారు. తాజాగా నర్తు రామారావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి మరో కీలక పదవి ఇచ్చినట్టు అయింది. -
ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’
Actor Vijay's fans plan to contest urban local body polls: నటుడు విజయ్ రాజకీయ తెరంగేట్రంపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఎం. చంద్రశేఖర్ విజయ్ మక్కల్ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించారు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే విజయ్కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడరాదని ఆంక్షలు విధించినా అభిమానులు గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం వారంతా విజయ్ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) ఇది రాజకీయ వర్గాలను షాక్కు గురి చేసిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని గురించి విజయ్ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. -
22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ రెండు విడతల్లోను బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మునిసిపల్ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్లలోనే పోలింగ్ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద వీవీప్యాట్లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్శాఖ అకారులతో సమావేశమై ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. -
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్స్వీప్
అగర్తలా: త్రిపుర స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్థానిక సంస్థల్లోని మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లోని మొత్తం 51 స్థానాలతోపాటు రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ఏఎంసీలో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీలు అనూహ్యంగా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్ నగర్, అమర్పూర్నగర్ తదితర పంచాయత్లలో బీజేపీ క్లీన్స్వీప్ చేసిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. మతకలహాలు, ఘర్షణలు, కోర్టు కేసులు.. ఎన్నికలను ప్రశాంతంగా జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. సుపరిపాలనకే త్రిపుర ప్రజలు మొగ్గు: ప్రధాని త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో కూడిన రాజకీయాలకే త్రిపుర ప్రజలు మొగ్గు చూపారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో పోటీచేద్దాం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో గతంలో ఆగిపోయిన స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీచేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఆగిపోయిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే టీడీపీలో సందిగ్ధం నెలకొంది. గతంలో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటనే దానిపై కొంత అయోమయం నెలకొంది. చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో పోటీలో ఉంటున్నట్లు చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురవడంతో టీడీపీ కుంగిపోయింది. దీంతో ప్రజా పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. చంద్రబాబు నిర్ణయంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయన్ని ధిక్కరించి అనేకచోట్ల పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ తర్వాత బద్వేలు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవడంపైనా పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. వరుస ఓటములకు భయపడి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపో యిన స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కచ్చితం గా పోటీచేయాలని పార్టీ శ్రేణులు, నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పోటీకి దూరంగా ఉండి గతంలో చేసిన తప్పును మళ్లీ చేయవద్దని సీనియర్లు చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు చంద్రబాబు అంగీకరించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నేతలకు సూచించారు. -
దుర్మార్గం: వెంటపడి చీర కొంగు లాగేసి..
ఉత్తర ప్రదేశ్లో స్థానిక ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. పార్టీల మధ్య, ప్రత్యర్థులతో కుమ్ములాటలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలిగించే ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. నామినేషన్ను అడ్డుకునేందుకు ఓ మహిళను చీరపట్టి లాగారు రాజకీయ ప్రత్యర్థులు. లక్నో: సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ప్రత్యర్థులు చీర కొంగు పట్టిలాగారు. పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్ను ప్రతిపాదిస్తూ ఆమె నామినేషన్ సెంటర్లోకి వెళ్లాల్సి ఉంది. అయితే గడువు దగ్గర పడుతుండడంతో ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లు ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను సైతం లాక్కున్నారు. అక్కడే ఉన్న కొందరు ఆమెకు మద్ధతుగా రావడంతో వాళ్లు ఆగిపోయారు. pic.twitter.com/TqepdO3y4W — Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021 తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఎకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఇక దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్వాదీ పార్టీ అంటోంది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్ ఖేరీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఘటనపై స్పందించాడు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు చెందిన గుండాలు చెలరేగిపోతున్నారు అంటూ క్యాఫ్షన్ ఉంచాడు. యూపీలో 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గురవారం చాలాచోట్ల నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. पीएम साहब और सीएम साहब इसके लिए भी बधाई दीजिए कि यूपी में आपके कार्यकर्ताओं ने ⭐कितनी जगह बमबाजी, गोलीबारी, पत्थरबाजी की ⭐कितने लोगों का पर्चा लूटा ⭐कितने पत्रकारों को पीटा ⭐कितनी जगह महिलाओं से बदतमीजी की कानून व्यवस्था की आंख पर पट्टी बांधकर, लोकतंत्र का चीरहरण चल रहा है। pic.twitter.com/6H9L390frB — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 8, 2021 -
తుదిదశ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం.. నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్ప దని తెలియడం.. వెరసి పల్లెపోరు తుదిదశలోను ఆదివారం టీడీపీ మద్దతుదారులు చెలరేగిపోయారు. కుట్రలకు తెరతీసి వీరంగం వేశారు. ఓవైపు పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలె త్తేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబ డ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతుచూస్తా మంటూ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతోపాటు దాడులు చేశారు. మొదటి మూడు విడతల పోలింగ్లో ఓటమికి ప్రతిగా దాడులు కొనసాగి స్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్యచేశారు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో మహిళ మీద దాడిచేసి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండిళ్లపై దాడిచేసి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపైనా దాడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం ఐదో వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావును ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబురావు కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడు నడవలేకపోవడంతో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి తరఫున ఏజెంట్గా ఉన్న ఫకీరయ్య సాయం చేశారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ మద్దతుదార్ల ఏజెంట్లు ఫకీరయ్యతో వాగ్వాదానికి దిగడమేగాక కుర్చీతో ఆయనపై దాడిచేశారు. దీంతో ఫకీరయ్య వర్గీయులు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన కుర్చీల దాడిలో ఫకీరయ్య గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. దొంగ ఓట్లను.. ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్సీపీ అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారితో టీడీపీ వారు వాగ్వాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పోలీసులు లాఠీలు ఉపయోగించి చెదరగొట్టారు. లక్కరాజు గార్లపాడులో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ అభిమానులతో వాగ్వాదానికి దిగారు. పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడైన ప్రభాకర్తో ఆయన బంధువు సురేశ్ ఓటు వేయించి తీసుకెళుతుండగా పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ వర్గీయులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో సురేశ్ పెదకూరపాడు పోలీస్స్టేషన్లో టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రెండువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ఒక గ్రామస్తుడిని కొట్టడంతో ఆగ్రహి ంచిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అమ రావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రం లోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డు కున్నారు. రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది చావపాడులో ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాలుగు కుటుంబాలపై దాడి సత్తెనపల్లి: దళితులు మా చెప్పుచేతల్లో ఉండాలి.. మాకే ఎదురు నిలబడతారా.. ఏమనుకుంటున్నారు.. అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేశారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారు వల్లెపల్లి శ్రీనివాసరావు సర్పంచి పదవికి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణసంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారురా.., కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి..’ అంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. టీడీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచుమర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను, మరో పదిమంది కర్రలు, రాళ్లతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓడిపోయామని దాడి.. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమాని తిప్పిరెడ్డి వెంకటరెడ్డి.. టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై 353 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీ అభిమానులు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా.. ఓటమి పాలైన సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమాని కె.నర్సిరెడ్డి గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వచ్చిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ఎన్నికల్లో రాజీచేస్తావా.. అంటూ చంపేసిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్ జిల్లాలో దారుణం బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అం టూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగురైన భాస్కర్రెడ్డి గుడిసెకు నిప్పు.. మొక్కజొన్న తోట ధ్వంసం కుప్పంరూరల్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీవారు దారుణంగా ఓడిపోవడంతో తట్టుకోలేని టీడీపీ వారు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తు న్నారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పం చాయతీ ఊరునాయునిపల్లెలో శనివారం రెండు ఇళ్ల మీద దాడిచేయడమేగాక గుడిసెకు నిప్పం టించారు. మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. ఈ పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ï Üపీ అభిమాని ఝాన్సీరాణి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్ర శేఖర్, పవన్కల్యాణ్, చంద్రబాబు, మురుగేష్, లక్ష్మీపతి, కదిరప్ప, మరో ఇద్దరు టీడీపీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అభిమానులైన బాలాజీ, కృష్ణమూర్తి ఇళ్ల మీద దాడిచేశారు. కృష్ణమూర్తి పొలంలోని గుడిసెకు నిప్పుపెట్టి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన కృష్ణమూర్తి, బాలాజీ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఆహుతైన కృష్ణమూర్తి గుడిసె, ధ్వంసమైన మొక్కజొన్న తోట మహిళపై దాడి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెంలో ఆదివారం తాను చెప్పిన వారికి ఓటు వేయలేదని ఓ మహిళపై గ్రామ టీడీపీ నాయకుడు దాడిచేశాడు. ఈ విషయమై బాధితురాలు బోడా మధుబాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ వ్యక్తులు రెండు రోజులుగా గ్రామంలో చిన్నచిన్న గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఆదివారం బోడా శ్రీను.. వైఎస్సార్సీపీ మద్దతదారుడికి ఓటేశావంటు మధుబాలపై దాడిచేశాడు. దుర్భాషలాడుతూ ఆమె ఇంటి ముందు ఉన్న పందిరిని కూలదోసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడు. శ్రీను నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇంటిపై దాడిచేసి కూలదోసిన పందిరి -
గోపాలకృష్ణ, గిరిజాశంకర్ల బదిలీ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్ పంపాల్సిందిగా ఎస్ఈసీ కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వీరిలో ఎస్ఈసీ సూచించిన వారిని ఆ విధుల్లో నియమించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. -
ప్రజల ప్రాణాలతో ఈసీ చెలగాటం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనన్నారు. తమ్మినేని శనివారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డ ప్రెస్మీట్ పొలిటికల్ ప్రెస్మీట్లా ఉందని, బాధ్యత గల అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి, ఏకగ్రీవాలు కూడా అయ్యాక ఎన్నికలు నిలిపేసిన ఎన్నికల కమిషనర్.. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వద్దని ప్రజలు, ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏమవుతుందో గుర్తెరగాలని హితవు పలికారు. నియంతృత్వ పోకడలకు విరుగుడు ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కటేనన్నారు. ఎన్నికలపై ఈసీ పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. -
ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది
సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్లైన్ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. -
మొండిగా ముందుకెళ్తే బహిష్కరిస్తాం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో కోరాయి. లేదంటే ఎన్నికల విధుల్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశాయి. మొండిగా ముందుకెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించాయి. శనివారం విజయవాడలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యి.. ఎస్ఈసీ తీరుపై చర్చించారు. కరోనా సమయంలో ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయా సంఘాల నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రోజుకొక కేసు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు వందలు, వేలల్లో కరోనా కేసులు వస్తున్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు. వెంటనే ఎన్నికలు నిలుపుదల చేయాలి. ఎన్నికల కమిషనర్ మొండిగా ముందుకువెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటి? తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉద్యోగుల్లో 20 – 30 శాతం మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి వుంటుంది. వారందరి ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు సరికాదు. – చంద్రశేఖర్రెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఏకపక్ష నిర్ణయం సరికాదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించలేం. నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలకం. ఇప్పటికే 150 మంది రెవెన్యూ ఉద్యోగులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని పంతం నెగ్గించుకోవడం కోసం ఎస్ఈసీ.. కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. ఎన్నికలకు సిద్ధంగా లేమని సీఎస్ చెప్పినా నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి? – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికల విధుల్లో పాల్గొనడం కష్టం వరదలు, బందోబస్తు విధులు నిర్వర్తిస్తూ 109 మంది పోలీసులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 25 శాతం మంది పోలీసు సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. 75 శాతం మంది పోలీసులే విధులు నిర్వర్తిస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహించాలి. – జనకుల శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు వాయిదా వేయండి ఎనిమిది నెలలుగా కంటి మీద కునుకు లేకుండా పని చేశాం. వ్యాక్సిన్ వస్తుందనే సంతోషంలో ఉండగా దాన్ని తుడిచి వేసేలా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం బాధాకరం. ఇప్పటికే ఎంతో మంది రెవెన్యూ ఉద్యోగులు చనిపోయారు. కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాల్సిందే. – కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాకూ జీవించే హక్కు ఉంది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం మాకూ జీవించే హక్కు ఉంది. కరోనాకు మమ్మల్ని బలి చేయొద్దు. మహిళా ఉద్యోగులుగా ఎన్నో కష్టాలు పడుతూ పని చేస్తున్నాం. విధులు ముగించుకుని ఇంటికి వెళితే పక్కనున్న వాళ్లు మాతో మాట్లాడటానికి భయపడుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ రాకమునుపే ఎన్నికలకు ఎందుకు అంత తొందర? – ఎం మాధురి, తహశీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్ని బహిష్కరిస్తాం ఏకపక్షంగా స్థానిక ఎన్నికలకు ఇచి్చన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్ని బహిష్కరిస్తాం. వ్యాక్సినేషన్తోపాటు ఎన్నో ఏళ్లుగా టీచర్లు ఎదురు చూస్తున్న బదిలీల కౌన్సిలింగ్ ఆగిపోతుంది. అందువల్ల ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదు. – గిరిప్రసాద్, మల్లు శ్రీధర్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వ్యవస్థ కోసం పనిచేయాలి ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరు. ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదు. ఎన్నికల కమిషన్ ఉన్నది వ్యక్తుల కోసం కాదు. వ్యవస్థ కోసం పనిచేయాలి. – సుదీర్బాబు, ఉపాధ్యాయ సంఘాల నేత కొత్త రకం కరోనా వణికిస్తోంది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఓ వైపు బ్రిటన్, అమెరికా వంటి దేశాలు కొత్తరకం కరోనాతో వణికిపోతున్నాయి. అలాంటి కొన్ని కేసులు మన రాష్ట్రంలోనూ నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలని అనుకోవడం సమంజసం కాదు. – డా.జయదీర్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ ప్రజారోగ్య పరిరక్షణకు అడ్డంకి ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎన్నికల ప్రక్రియ చేపట్టడం సమ్మతం కాదు. వైద్య, ఆరోగ్య, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ వంటి శాఖలు వ్యాక్సిన్ పంపిణీ విధులలో నిమగ్నమైన తరుణంలో ఎన్నికలు కచ్చితంగా విఘాతం కలిగిస్తాయి. ప్రజారోగ్య పరిరక్షణకు ఎన్నికల ప్రక్రియ తీవ్ర అడ్డంకిగా మారుతుంది. – కేఆర్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందరి నోటా అదే మాట కరోనా భయపెడుతున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూచిపూడి మోహన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామల సింహాచలం, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్రెడ్డి, ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.బాలభాస్కర్, డి.ప్రవీణ్, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్బాబా, రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్, ప్రభుత్వం డ్రైవర్ల సంఘం సంపాని శ్రీనివాసరావు తదితరులు ఎస్ఈసీ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిమ్మగడ్డకు ఉద్యోగుల ప్రాణాలు పట్టవా?
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ నిమ్మగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని, ఎస్ఈసీకి ఉద్యోగుల ప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వ్యాక్సినేషన్ పంపిణీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. నిమ్మగడ్డ పునరాలోచించి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ( ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ దుర్మార్గంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేమని ఉద్యోగులు చెప్తున్నారు.. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. వ్యాక్సినేషన్కు సిద్ధమవుతున్న తరుణంలో నిమ్మగడ్డ నిర్ణయం సరికాదు’’ అన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. ‘‘ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదు. చంద్రబాబు చెప్పిందే నిమ్మగడ్డ చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంతో ప్రజలు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు’’ అన్నారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘కరోనా బారిన పడి 109 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహిస్తే మంచిది’’ అని అన్నారు. -
నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. -
మళ్లీ ఏకపక్ష నిర్ణయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేశారు. విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్తో అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్లు సమావేశమై దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోందని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని, ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం అనుకూల వాతావరణం లేదని వివరించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని వి/æ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కోవిడ్ కేసు నమోదైనప్పుడు దాన్ని కారణంగా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేస్తూ గతేడాది మార్చి 15న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ తాజాగా వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అంతా తీరిక లేకుండా ఉన్న తరుణంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం పట్ల ఉద్యోగ వర్గాలు విస్తుపోతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోందని, దాని ప్రభావం దేశంపైనా, రాష్ట్రంపైనా ఉంటుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధికార యంత్రాంగం అంతా ఈ విధుల్లో చురుగ్గా నిమగ్నమైన తరుణంలో ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ నిమ్మగడ్డ ముందే నిర్ణయించుకున్న ప్రకారం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం చేసిన వి/æ్ఞప్తిని తోసిపుచ్చుతూ షెడ్యూలు విడుదల చేయడాన్ని బట్టి నిమ్మగడ్డ ఏకపక్ష వైఖరి, వివాదాస్పద నిర్ణయాలు తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టు ఉత్తర్వులు బుట్టదాఖలు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో అక్టోబర్ 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా అందుకు అనువైన పరిస్థితులు లేవని, ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడగానే తెలియజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ లిఖితపూర్వకంగా తెలియచేశారు. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఈ కార్యక్రమంలోనే నిమగ్నమవుతారని.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు.. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి మూడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఐదో తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో 7వతేదీన ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియచేసింది. వ్యాక్సిన్ సన్నద్ధతపై 11న ప్రధాని సమావేశం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమయ్యాయని, దీనిపై ఈనెల 9న కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని.. ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారని.. ఈ నేపథ్యంలో ఈనెల 13 వరకూ ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్ సన్నద్ధత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని.. అప్పటివరకూ సమావేశాన్ని వాయిదా వేయాలని ఎస్ఈసీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా శుక్రవారమే సంప్రదింపులకు హాజరు కావాలని, లేదంటే తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటానని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా తన విధానాన్ని వెల్లడించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఎస్ఈసీ నిమ్మగడ్డతో సమావేశమైంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆవశ్యకతను వివరించి కనీసం వ్యాక్సినేషన్ మొదటి దశ పూర్తయ్యే వరకైనా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడం గమనార్హం. తన ఉత్తర్వులను తానే ఉల్లంఘించిన వైనం.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2019 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా అధికారులు ఓటర్ల జాబితాను రూపొందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించి 2020 తాజా జాబితాను రూపొందించింది. తాజా జాబితాలో ఉన్న ఓటర్లకూ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా 2020 జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపొందించాలని.. ఆ మేరకు వార్డులను విభజించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, 13 జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ 2020 నవంబర్ 17న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితా రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఓటర్ల జాబితా సిద్ధం కాకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు జారీ చేయడం ద్వారా నిమ్మగడ్డ తాను జారీ చేసిన ఉత్తర్వులను తానే ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. దీన్నేమంటారు.? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిశాక, పురపాలక ఎన్నికల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిశాక కరోనా సాకుతో మార్చి 15న అర్ధాంతరంగా ఆ ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఆ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఆయన వ్యవహారశైలి ఎంత వితండంగా, ఏకపక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు విడతల్లో ‘పంచాయతీ’ పోరు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 5న తొలివిడత 9, 13, 17వ తేదీల్లో విడతలవారీగా పూర్తి 17న ఓట్ల లెక్కింపు.. అదే రోజు సర్పంచి,ఉప సర్పంచి ఎన్నికలు.. నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ వర్తిస్తుందని ఎస్ఈసీ ఉత్తర్వులు -
‘పంచాయతీ’ పోరు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం షెడ్యూల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులంతా ఆ విధుల్లో నిమగ్నమయ్యారని, ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలసి లిఖితపూర్వకంగా తెలియజేసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ ఏకపక్షంగా షెడ్యూల్ను ప్రకటించడం గమనార్హం. ఫిబ్రవరి ఐదో తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు, 9, 13, 17వ తేదీల్లో మరో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు కౌంటింగ్, సర్పంచి, ఉప సర్పంచి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 నుంచి, మిగతా విడతల ఎన్నికలకు ఈ నెల 29, ఫిబ్రవరి 2, 6వ తేదీల నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నేటి నుంచి ఎన్నికల కోడ్: ఈనెల 9 (శనివారం) నుంచే ఎన్నికల నిబంధనావళి (కోడ్) అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కోడ్ వర్తిస్తుందని, పట్టణ ప్రాంతాల్లో వర్తించదన్నారు. -
స్థానిక ఎన్నికలపై సంప్రదింపులు జరపండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో.. ఇరుపక్షాలు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న నాటినుంచి మూడురోజుల్లో సంప్రదింపులు మొదలు పెట్టాలని ఇరుపక్షాలను ఆదేశించింది. సంప్రదింపుల తేదీ, వేదికలను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యకార్యదర్శుల స్థాయికి తగ్గని అధికారులు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాలని స్పష్టం చేసింది. కోవిడ్–19కు సంబంధించి వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలు తదితరాలన్నింటినీ కూడా కమిషన్ ముందు ఉంచవచ్చునంది. ప్రభుత్వం తన వాదనలను లిఖితపూర్వకంగా కమిషన్ ముందు ఉంచవచ్చునని, అందుకు మద్దతుగా ఉన్న రికార్డులను కూడా సమర్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి మంగళవారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతనెల 17న జారీచేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గతవారం విచారణ జరిపిన జస్టిస్ శేషసాయి.. ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ దిశగా ఉత్తర్వులు జారీచేస్తానని చెప్పిన ఆయన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తన ఉత్తర్వులను కోర్టు హాలులో చదివి వినిపించారు. కరోనా కారణంగా మొత్తం మానవాళి ఎంతో బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఎన్నికల కమిషనర్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ చెప్పిన వాదనలను రికార్డ్ చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఇంకేమైనా ఈ ఉత్తర్వులకు జతచేయాల్సి ఉందా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణ నెల గురించి కూడా కమిషన్ వద్ద లేవనెత్తే వెసులుబాటు ఇవ్వాలని తమ వాదనల సందర్భంగా కోరామని గుర్తుచేశారు. రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ను ప్రారంభించనుందన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై రన్ జరగనుందని, అందులో మన రాష్ట్రం కూడా ఉందని చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వివరాలన్నింటినీ సంప్రదింపుల సమయంలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఈ ఆదేశాల ద్వారా ప్రభుత్వ పిటిషన్ను పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికలపై కూర్చొని మాట్లాడుకోండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇరుపక్షాల (ప్రభుత్వం, ఎస్ఈసీ) అధికారులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సంప్రదింపుల ప్రక్రియ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా టీకాల ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అప్పుడు స్థానిక ఎన్నికలు సాధ్యం కాదన్న అభ్యంతరాలన్నింటినీ ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సమస్య పరిష్కారం కావడం అందరికీ మంచిదని, అంతిమంగా అందరికీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఇతర అంశాలేవీ ఈ కోర్టుకు అవసరం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి స్థాయికి తగ్గని హోదా కలిగిన ముగ్గురు అధికారుల బృందం ఎన్నికల కమిషన్ను కలవాలని సూచించింది. సమావేశం వేదికను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని పేర్కొంది. సంప్రదింపులు జరిపి సామరస్యపూర్వకంగా పరిష్కారానికి రావాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అదే రోజు సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అభ్యంతరాలన్నీ ఎస్ఈసీ ముందు ఉంచండి... కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారని విచారణ సందర్భంగా జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని కూడా కోర్టు దృష్టికి తెచ్చారన్నారు. ఈ వివరాలన్నింటితో పాటు అభ్యంతరాలను కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మూడు రోజుల్లోపు ఎన్నికల కమిషన్ ముందుంచాల్సి ఉంటుందని తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారమే ముందుకు.. దీనిపై ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ ఎన్నికల కమిషనర్ మొత్తం ప్రక్రియను ముగించేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల తేదీ ఇంకా నోటిఫై చేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణ నెలను నిర్ణయించేశారని ఏజీ పేర్కొనడంతో నెలతో తమకు సంబంధం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలైనా ఎన్నికల కమిషన్ ముందు ఉంచవచ్చని స్పష్టం చేశారు. సంప్రదింపుల విషయంలో కోర్టు సూచించిన ప్రతిపాదనకు తమకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ తెలిపారు. సదుద్దేశంతో చేపట్టాలి.. సంప్రదింపుల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, స్పష్టతతో చేపట్టాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఫిబ్రవరి నెలపై కూడా చర్చించాలన్నారు. తేదీలకే పరిమితం కాకూడదన్నారు. అన్ని అంశాలపై చర్చిస్తామంటే సంప్రదింపులకు అభ్యంతరం లేదన్నారు. సంప్రదింపుల ప్రక్రియ మొక్కుబడిగా ఉండరాదని, నిజమైన స్ఫూర్తి, సదుద్దేశాలతో చేపట్టాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి విచారణను వాయిదా వేశారు. -
కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్ జయకేతనం
తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. ఎల్డీఎఫ్ 514 గ్రామ పంచాయతీల్లో పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం కార్పొరేషన్ ఎల్డీఎఫ్ పరమైంది. కేరళలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు నిరాశే మిగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ వంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి తాజా ఎన్నికల ఫలితాలు ఊరట కలిగించాయనే చెప్పారు. కేరళలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్ను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ప్రభుత్వం కోరినట్లు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై గత శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో చాలా లోతుగా విచారణ జరపాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఎన్నికలను పూర్తి చేయలేదు. తర్వాత 2019లో రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలవగా.. అందులో ధర్మాసనం పలు ఆదేశాలిచ్చింది. పర్యవసానంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ కోవిడ్వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఈ కోర్టు అడ్డుకోగలదా? అలా అడ్డుకోవడం ధర్మాసనమిచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అన్నది పరిశీలించాలి. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందా? లేక కేవలం వాయిదా పడిందా? అన్నదీ పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైవుంటే.. ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వవచ్చా? అన్నదీ పరిశీలించాలి. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ఇటీవల జారీచేసిన ప్రొసీడింగ్స్ హేతుబద్ధమైన అంశాల ఆధారంగా జారీచేసింది కాదని ఏజీ చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని సంప్రదించాకనే నిర్ణయించామని ఎస్ఈసీ న్యాయవాది అంటున్నారు. కాబట్టి ఈ దశలో ఎస్ఈసీ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనా? కావా? అన్నదానిని ఈ కోర్టు తేల్చజాలదు. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని నిర్ణయిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను ఎన్నికల కమిషనర్ ఈ కోర్టుకు తప్పక వివరించాలి. పైన చెప్పిన అంశాలన్నింటినీ తేల్చేందుకు ఎస్ఈసీ నుంచి పూర్తిస్థాయి కౌంటర్ అవసరం. తుది ఉత్తర్వులిచ్చేముందు ఈ మొత్తం వ్యవహారంలో లేవనెత్తిన పలు అంశాల వాస్తవికతపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కారణాలరీత్యా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోరినట్టుగా మధ్యంతర ఉత్తర్వులివ్వలేమన్నారు. -
‘స్థానికం’పై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అనుమతితోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారం గవర్నర్ హరిచందన్కు లేఖ రాసినట్లు రమేష్ సన్నిహితుల ద్వారా తెలిసింది. అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని.. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, దాన్ని తిరస్కరించాలని లేఖలో నిమ్మగడ్డ పేర్కొనట్టు సమాచారం. అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ నిలుపుదలపై నిర్ణయం వాయిదా
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఉత్తర్వులపై న్యాయస్థానం సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లోగా నిర్వహించాలని 2018లోనే హైకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించిందన్నారు. ఎన్నికల వాయిదాకు అప్పటి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను హైకోర్టు తోసిపుచ్చిందన్నారు. అయితే న్యాయస్థానం ఆదేశించిన విధంగా ఎన్నికల నిర్వహణలో కమిషన్ విఫలమైందని నివేదించారు. అనంతరం 2020లో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసిందని తెలిపారు. ఆ తరువాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వద్దనేందుకు సహేతుకమైన కారణం ఉందని, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, దీని తరువాతే మిగిలినవని తేల్చి చెప్పారు. షెడ్యూల్ రాకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా మొదలవుతుంది? పరిపాలనాపరమైన కారణాల వల్ల గతంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రమైనదని, ఫలానా సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎవరూ శాసించలేరన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు స్పందిస్తూ ఎన్నికల షెడ్యూల్ రాకుండా ప్రక్రియ ఎలా మొదలవుతుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏజీ శ్రీరామ్ నివేదించారు. -
ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్పై హై డ్రామా
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనే నియమ నిబంధనలు, గతంలోనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలపై మొండిగా వ్యవహరిస్తూ వీడియో కాన్ఫరెన్స్లకు సిద్ధం కావడం.. రద్దు చేసుకున్న సమావేశాలను మరుసటి నిర్వహిస్తానంటూ మళ్లీ వెంటనే పేర్కొనడం.. ఇలా ఎవరో ప్రేరేపించినట్లుగా ఆయన లేఖలు రాస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రద్దు చేసి మళ్లీ అంతలోనే... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించాలని భావించిన వీడియో కాన్ఫరెన్స్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ హైడ్రామా మధ్య చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మొండిగా ముందుకెళ్లాలనే యోచనలో ఉన్న ఆయన దీన్ని నేడు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ వివరాల ప్రకారం.. రద్దు చేసుకున్న ఆ సమావేశాన్ని తిరిగి గురువారం నిర్వహిస్తానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఉదయం 10 – 12 గంటల మధ్య దీన్ని నిర్వహించ తలచినట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో సీఎస్కు సూచించారు. చాంబర్కే పరిమితం.. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ఆయా అధికారులందరికీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మంగళవారమే లేఖలు రాశారు. అయితే ఒకదాని వెంట ఒకటిగా రోజంతా చోటు చేసుకున్న పరిణామాల తరువాత నిర్ణీత సమయానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించకుండా నిమ్మగడ్డ తన ఛాంబర్కే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ సమావేశాన్ని నిర్వహించకుండా విరమించుకున్నట్లు అనంతరం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ సాయంత్రం 3 గంటల వరకు కార్యాలయంలోనే అందుబాటులో ఉండి తర్వాత వెళ్లిపోయారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులకు తోడు సెకండ్ వేవ్ రూపంలో మరోసారి వైరస్ ప్రబలుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంపై ప్రభుత్వపరంగా అభ్యంతరాలు తెలియజేస్తూ సీఎస్ సాహ్ని మంగళవారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రత్యుత్తరం రాశారు. గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. అరగంట ముందే రాజ్భవన్ చేరుకున్న ఆయన 20 నిమిషాల పాటు గవర్నర్తో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తగిన చర్యలు చేపట్టాలని గవర్నర్కు లేఖ సమర్పించారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు ప్రత్యుత్తరం ఇవ్వడంపై గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలా వ్యవహరించడం చట్ట విరుద్ధమంటూ అంతకుముందు ఆయన సీఎస్కు ఎస్సెమ్మెస్ చేసినట్లు తెలిసింది. -
ఫిబ్రవరిలో ‘పంచాయతీ’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు ఈమేరకు ఉత్తర్వులు పంపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనరే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణపై ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో తదుపరి ఎన్నికల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించిందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొంటూ దీనికి కొనసాగింపుగా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ను ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత విడుదల చేస్తామని అదే ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేదని, తాము ప్రకటించనున్న ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి కోడ్ అమలులోకి వస్తుందని ప్రొసీడింగ్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని, గతంలో రోజూ 10 వేలకుపైగా నమోదైన కేసులు ఇటీవల 2 వేలకు తగ్గాయని, మొదటిసారిగా కేసులు వెయ్యి లోపు మాత్రమే ఉన్నాయన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈనెల 30వతేదీ వరకు సెలవులో ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మరోవైపు గురువారం ఆయన గవర్నర్ను కలవనున్నట్లు తెలిసింది. ఆకస్మిక ప్రణాళిక రూపొందించండి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అకస్మిక (కంటింజెన్స్) ప్రణాళికలు రూపొందించాలంటూ ప్రొసీడింగ్స్లో కలెక్టర్లకు నిమ్మగడ్డ సూచించారు. కరోనా పరిస్థితులలోనూ బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రస్తావించారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 28న తనకు లేఖ అందజేశారని అయితే రాజకీయ పార్టీలతో జరిపిన సంప్రదింపుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల నిర్వహణకు అత్యధికులు మొగ్గు చూపారన్నారు. గ్రామాల్లో కరోనా కట్టడిలో స్థానిక ప్రభుత్వాల అవసరం, ఆర్థిక సంఘం నుంచి నిధుల విడుదలకు ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అత్యవసరమన్నారు. కరోనా నేపధ్యంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు అవకాశం లేకుండా ఎన్నికలు జరిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు డీజీపీ తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
ఈ సమయంలో ఎన్నికలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా వేలసంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు.. సెకండ్వేవ్ వస్తుందన్న భయాందోళనలు.. కరోనా వైరస్ మరింత పరివర్తన చెందుతోందన్న హెచ్చరికలు.. యూరప్ దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధింపు.. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్.. ఇటీవల రాజకీయ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశం కూడా ఒక్కొక్కరితోనే కావడం గమనార్హం. అంటే ఒకేచోట కొందరు కలిస్తే ప్రమాదమన్న భయం ఆయనకు కూడా ఉందని పేర్కొంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్ని అప్పుడూ ఎన్నికల కమిషనర్గా ఉన్నా పట్టించుకోని రమేష్కుమార్ ఇప్పుడు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ నిర్వహించాలని చూడటం విమర్శనీయంగా ఉంది. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని తెలిసినా.. ఆయన ఆ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ముడిపెట్టడం భావ్యంకాదని పలువురు పేర్కొంటున్నారు. అప్పటికన్నా విజృంభించిన కరోనా కరోనా భయం లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైంది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మరో వారంలో ఎన్నికలు జరుగుతాయనగా కరోనా వ్యాపిస్తోందంటూ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండా రమేష్కుమార్ ఎన్నికల్ని వాయిదా వేశారు. అప్పటికి దేశం మొత్తంమీద వందకు తక్కువగా కేసులు నమోదుకాగా మనరాష్ట్రంలో కేవలం పది కేసులకన్నా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో రోజూ సుమారు మూడువేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమనడం రాజ్యాంగబద్ధంగా తీసుకునే నిర్ణయం ఎలా అవుతుందని పలువురు రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వాయిదా వేసిన ఎన్నికల నిర్వహణకు ముందుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. రమేష్ మాత్రం ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం కూడా చర్చకు తావిచ్చింది. కరోనా భయం కారణంగానే విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించలేదు. దశలవారీగా రోజువిడిచిరోజు పద్ధతిలో తరగతులు మొదలవుతున్నాయి. 65 ఏళ్లు దాటినవారు, పిల్లలు బయటకు వెళ్లవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రధాని మోదీ కూడా మన్కీ బాత్లో సూచించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థానిక పదవులకు హోరాహోరీ.. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, వార్డు కౌన్సిలర్ ఎన్నికలు స్థానిక ప్రజల మధ్య పట్టుదలతో కూడుకుని ఉంటాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఒకటి, రెండు ఓట్లు కూడా గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఇంటింటి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం కల్పించేవేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలంలో మరింత వైరస్ ప్రభావం? రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తొమ్మిది తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో చలికాలంలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల కన్నా చలికాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఈ పరిస్థితులో స్థానిక ఎన్నికల నిర్వహణ సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ బారిన 11,200 మంది పోలీసులు కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దేశంలో మరే రాష్ట్రంలో చేయనన్ని టెస్టులు చేస్తూ రోగులను గుర్తించి వ్యాప్తిని అరికడుతోంది. ఇంతచేస్తున్నా పోలీసుల్లోనే 11,200 మంది వైరస్ బారినపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులదీ అదే పరిస్థితి. బ్యాలెట్ పేపరు ద్వారా జరిగే స్థానిక ఎన్నికల్లో వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులను రక్షించుకునేందుకు కోర్టుకైనా వెళతామన్నారు. చాలా యూరప్ దేశాల్లో సెకండ్వేవ్ మొదలైంది. మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు. మనదేశంలో కూడా ఆ ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కరోనా కారణంగా వాయిదా సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టుకు నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే బ్యాలెట్ బాక్సుల కొరత ఉందని, అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే షెడ్యూల్ను విడుదల చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ఎన్నికలను రద్దు చేసి, వాటిపై విచారణ జరిపించే విషయంలో రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనతో పాటు ఎన్నికల కమిషన్కు భద్రతను పెంచాలన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్, మరికొందరు గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు మరోసారి విచారణకు వచ్చాయి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ తన కౌంటర్లో ఎప్పటి లాగే రాష్ట్ర ప్రభుత్వంపై పలు తీవ్రమైన నిందారోపణలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని శంకించేలా కౌంటర్లో పలు విషయాలు ప్రస్తావించారు. కరోనా వల్ల అప్పుడు వాయిదా వేశాం.. కరోనా తీవ్రత నేపథ్యంలో స్థానిక సంస్థలను అప్పుడు వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. బిహార్లో తొలిదశ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. తెలంగాణలోనూ మున్సిపల్ ఎన్నికలను ప్రకటించిందని వివరించారు. కమిషన్ ఇటీవల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిందని, తగిన జాగ్రత్తలతో ఎన్నికలు కొనసాగించాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించామని, కరోనా సెకండ్ వేవ్ గురించి మౌఖికంగా తెలియచేశారన్నారు. సొంత బ్యాలెట్ బాక్సుల్లేవు... మొదటి దశలో ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుంటే, ఈసారి ఎన్నికల్లో మరింత ఎక్కువ హింస జరిగే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా బ్యాలెట్ బాక్సుల కొరత తలెత్తిందని, ఏపీకి సొంతగా ఎలాంటి బ్యాలెట్ బాక్సులు లేవని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
టీడీపీ డిమాండ్ హాస్యాస్పదంగా ఉంది: అంబటి
సాక్షి, అమరావతి : ఎస్ఈసీని ఓ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేలా నిమ్మగడ్డ రమేష్ బాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ' రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఎన్నికలపై అభిప్రాయాలు తీసుకుంది. ఈ సమావేశానికి మేం వెళ్లడం లేదని, బహిష్కరిస్తున్నామని నిన్ననే స్పష్టంగా చెప్పాం. ఈసీ విడుదల చేసిన నోట్లో మేము చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టారు. ఇదే ప్రక్రియను ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో ఎందుకు పాటించలేదు. ఎన్నికలు వాయిదా వేయాలా..కొనసాగించాలా అని రాజకీయ పక్షాలను ఎందుకు అడగలేదు. ఎన్నికలు వాయిదా వెనుక కుట్ర దాగుంది అనటానికి ఇదే ఉదాహరణ. (చదవండి : రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం) ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయ పక్షాలతో మాట్లాడాలనే నిర్ణయానికి ముందే ఎందుకు ప్రభుత్వంతో చర్చించలేదు. చంద్రబాబు నిమ్మగడ్డల కమిషన్గా ఎస్ఈసీని మారుస్తున్నారు. ఆ రోజు కేవలం మూడు, నాలుగు కరోనా కేసులు ఉంటే ఇవాళ 3వేల కేసులు ఉన్నాయి. ఎన్నికలు జరగాలని, ఆ ప్రక్రియను ప్రారంభిస్తే మీరు అర్థాంతరంగా వాయిదా వేశారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు.. చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్గా మిగిలారు. మీరు కేంద్రానికి రాసిన లేఖలో ఎన్ని మాటలు అన్నారు. ఆ లేఖలో ప్రభుత్వ ఆర్డినెన్స్ గురించి రాశారు. డబ్బు, మద్యం పంపిణీపై చట్టం చేస్తే మీకేమి సంబంధం?(చదవండి : నిమ్మగడ్డ సమావేశానికి వైఎస్సార్సీపీ వెళ్లదు) ఎన్నికల్లో మద్యం, ధనం ప్రభావం లేకుండా చూసేందుకు..తెచ్చిన చట్టంపైనా నిమ్మగడ్డ రమేష్ విమర్శలు చేశారు. చంద్రబాబు రాసిన లేఖలో నిమ్మగడ్డ సంతకం చేశారు.రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం ఎందుకు జరపలేదు. వ్యక్తిగతంగా వన్ టు వన్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు?. ఓ హోటల్లో రహస్య సమావేశాలు నిర్వహించిన వ్యక్తి నిమ్మగడ్డ. టీడీపీతో కుమ్మక్కై ఎస్ఈసీ పనిచేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్సే. కరోనా రెండో దశ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలున్నాయి. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని...టీడీపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదం' అని అన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియచేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని ఆదేశించింది. ఇందులో భాగంగా దానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్, మరికొందరు గతేడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలే నిర్వహిస్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. కరోనా ఉధృతి కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పాల్సి ఉందంటూ.. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం వివరణ కోరింది. అయితే ఆయన వీడియో కాన్ఫరెన్స్లో లేకపోవడంతో ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. -
ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ, 243 యు నిర్దేశించిన ప్రకారం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీన్ని గౌరవించలేదని నివేదించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ పాలనతోపాటు కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పిటిషన్లో తెలిపింది. హై కోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారిని సంప్రదించకుండా ఆపడం తగదని పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరింది. -
‘ఆ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్కుమార్కు ఎవరిచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్ చేత ఆమోదం పొందిన షెడ్యూల్ను గౌరవించకుండా.. ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆయన తన పరిధి దాటి వ్యవహరించి.. రాజ్యాంగ వ్యవస్థలను కాల రాశారని మండిపడ్డారు. (ఫైల్ లేకుండానే నిర్ణయం?) చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారు.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని సురేష్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టు అని ధ్వజమెత్తారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని 2018లో కోర్టు ఆదేశిస్తే ఎందుకు నిర్వహించలేదని సురేష్ ప్రశ్నించారు. ఈసీ రమేష్కుమార్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. (ఎన్నికల నిలిపివేత ఉత్తర్వు రద్దు చేయండి) -
రాజ్యాంగ విలువలు కాల రాశారు..
-
ఆరువారాల కుట్ర!
ప్రాదేశికాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పురపోరుకు నామినేషన్ వేసినవారు ఉపసంహరణ కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అదికారులు సమాయత్తమయ్యారు. ఇంతలో ఆరువారాల పాటు ఎన్నికల వ్యవహారాలు వాయిదా వేస్తున్నట్టు వార్త. అది విన్న అభ్యర్థులంతా అవాక్కయ్యారు. కాసేపు నిశ్చేషు్టలయ్యారు. ఆనక అసలు విషయం తెలుసుకుని ఆగ్రహోదగ్రులయ్యారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వందంగా ఖండించారు. రాగధ్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఓ అధికారి ప్రతిపక్షాల ఓటమిని చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం... తాను అనుకు న్నది ఎలాగైనా చేయించుకోవడంలో సిద్ధహస్తుడైన ఓ నాయకుడి దుర్బుద్ధి వల్ల ఇప్పు డు జిల్లా అభివృద్ధి నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో పూర్తిగా నిమగ్నమైన రాజకీయ పారీ్టలకు ఎన్నికల కమిషన్ ఆదివారం పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ను సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ వార్త విని అవాక్కయిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కరోనా కాదు కదా దాని ‘బాబు’ కూడా అడుగుపెట్టలేరని, అలాంటి వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉన్నా... ఎన్నికలు వాయిదా పడటం ఏమిటని ఆయా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కరోనాపై సర్కారు అప్రమత్తం కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇరవై హాస్పిటళ్లను అందుకోసం సిద్ధం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 27 మందిని అబ్జర్వేషన్లో ఉంచాలని గుర్తించారు. 15 మందిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. 12 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ కూడా పూర్తయి వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తేల్చారు. ఇంత వరకూ విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. నిజానికి ఈ వైరస్ సోకిన వంద మందిలో 85 మంది వైద్యం పొంది వైరస్ నుంచి విముక్తి పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే మృత్యువాత పడుతున్నారు. వారిలో కూడా వయసుమీద పడిన వారు, హైపర్ టెన్షన్ ఉన్నవారే. ఈ వైరస్ చిన్నపిల్లల జోలికి పెద్దగా వచ్చింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ వాయిదా వేయడం విమర్శలకు తావిస్తోంది. సంక్షేమానికి అవరోధం ఎన్నికల వాయిదాతో జిల్లాలో సంక్షేమానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజు స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పేదలందరికీ ఇళ్లు అనే పథకంలో భాగంగా జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని 61,781 కుటుంబాలను జిల్లా అధికారులు వలంటీర్ల సాయంతో గుర్తించారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 30,108 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 31,681 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల తర్వాతైనా వస్తాయని పేద ప్రజలు ఆశతో ఉండగా ఎన్నికలు వాయిదా వల్ల కోడ్ ఇంకా కొన్నాళ్లు కొనసాగి, స్థలాలు రావడం ఇంకా ఆలస్యం అవుతోంది. జగనన్న చేదోడు పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు చొప్పున ఐదేళ్లు ఇవ్వాలనుకున్నారు. కోడ్ వల్ల ఈ పథకం ఆగిపోయింది. జగనన్న కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు కాపు సామాజిక వర్గంలోని 45 ఏళ్లు నిండిన మహిళలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనికీ బ్రేక్ పడింది. కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం అందించే రుణాలకు ఇటీవలే ఇంటర్వ్యూలు జరిగాయి. వాటిని మంజూరు చేసేందుకు కోడ్ అడ్డంకిగా మారింది. ఉపాధిహామీ కన్వర్జన్సీ నిధులు రూ.350 కోట్లు జిల్లాలో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకూ కేవలం రూ.50 కోట్లు వరకూ మాత్రమే వినియోగించారు. ఈ నెలాఖరులోగా పనులు మొదలు పెట్టకపోతే మిగిలిన నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. త్వరగా ఎన్నికలు పూర్తయితే ప్రజలకు ఈ పథకాలన్నిటినీ చేరువ చేయాలని, ఉన్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ‘కరోనా కుట్ర’ వల్ల అది సాధ్యమయ్యేలా లేదు. అధికారుల దిగ్భ్రాంతి జిల్లా అధికారులు సైతం ఎన్నికల కమిషన్ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్ నిర్ణయించిన అధికారులతో సమీక్షలను జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ రద్దు చేసుకున్నారు. కరోనా వైరస్పై మాత్రం సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నా రు. కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లాలో మూడు జెడ్పీటీసీ, 55 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో తమ పారీ్టకి ఇదే ప్రజాదరణ రావడాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు కుట్ర పన్నారని వారు విమర్శిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వాయిదా ఏకపక్ష నిర్ణయం ఎన్నికలు వాయిదా విషయం టీవీల్లో చూసి ఆశ్చర్యపోయా. వెంటనే పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్స్పాల్ సెక్రటరీ, డీజీపీలతో మాట్లాడితే ఎవరికీ తెలియదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రమే‹Ùకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ఉంటే అధికారులతో ఎందుకు సమీక్షించలేదు. రాజకీయపారీ్టలతో ముందుగా ఎందుకు సమావేశం ఏర్పా టు చేయలేదు. ప్రజాస్వామ్య వాదులంతా ఆలోచించాలి. ఎన్నికల వాయిదాపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆ నిర్ణయం అప్రజాస్వామ్యం ఎన్నికల వాయిదా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రమేయంతోనే జరిగింది. అన్ని రాజకీయ పారీ్టల సమావేశంలో కరోనా వైరస్ ఉంది ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ, సీపీఐ కోరాయి. ఎన్నికల కమిషనర్ చంద్రబాబు కులానికి చెందిన వారు. ఆయన టైంలో నియమించిన రమే‹Ùకుమార్ కావడంతో వారి ఆలోచన ప్రకారం వాయిదా వేశారు. ఎన్నికల వాయిదా అప్రజాస్వామ్యం. రాష్ట్రానికి రావాల్సిన రూ.5వేల కోట్లు రాకుండా చేయాలన్న రాజకీయ దురుద్దేశంతో వాయిదా వేశారు. రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. – బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు, విజయనగరం -
ఏకగ్రీవాల హోరు.. వైఎస్సార్సీపీ జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 2000 స్థానాలకు పైగా ఏకగ్రీవం అయ్యాయి. మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. ఈ లెక్కన 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం అరుదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల ఆగడాల పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 9 నెలల జనరంజక పాలన పట్ల గ్రామీణ ప్రజలు చూపిస్తున్న ఆదరణతోనే స్థానిక టీడీపీ నేతలు పలుచోట్ల పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. దీంతో ఆయా స్థానాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్న వివరాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు జాబితాలు విడుదల చేశారు. ఒక్కో అభ్యర్థే పోటీలో ఉన్న చోట ఎన్నిక ఏకగ్రీవం ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారులు స్థానికంగా ప్రకటించారు. ప్రజా వ్యతిరేకతతో పోటీకే దూరం.. గత ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 నెలల కాలంలోనే ఎన్నికల ముందు చెప్పిన హామీలలో దాదాపు అన్నీ అమలు చేశారు. ఇందువల్ల ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసినా గెలవమేమోనన్న భయం స్థానిక టీడీపీ నాయకులను వెంటాడటం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పోటీలో నిలబడకపోవడానికి వారి విశ్లేషణలో తేలిన కారణాలు ఇవీ.. – గత 9 నెలలుగా జనరంజక పాలన సాగుతోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఫలితంగా పోటీ చేయడానికి టీడీపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. – టీడీపీ నాయకత్వం మీద ఆ పార్టీ శ్రేణులకు భరోసా సన్నగిల్లింది. టీడీపీ అధినేత మీద విశ్వాసం కొరవడటంతో పోటీకి టీడీపీ శ్రేణులు విముఖత ప్రదర్శించాయి. ఫలితంగా.. స్థానిక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టడానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చింది. – టీడీపీకి పెద్దగా భవిష్యత్ లేదనే నిర్లిప్త ధోరణి టీడీపీ కార్యకర్తల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నాయకుల్లోనూ అదే ధోరణి నెలకొంది. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం కొరవడింది. – గత 5 సంవత్సరాల టీడీపీ పాలన, చంద్రబాబు వ్యవహార శైలి పట్ల సామాన్య ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఈ 9 నెలల్లో టీడీపీ పట్ల, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల వ్యతిరేకత ప్రజల్లో తగ్గలేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భావించారు. ఇంత వ్యతిరేకతలో ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల శ్రమ దండగ తప్ప ఫలితాలు సానుకూలంగా రావని వారంతా భావించారు. ఈ పరిస్థితిలో పోటీ చేయడం అనవసరమనే భావన.. వారిని పోటీ నుంచి దూరంగా ఉంచింది. పది జిల్లాల్లో జెడ్పీటీసీలు ఏకగ్రీవం – శ్రీకాకుళం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాలోనూ జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవ విజయాలు నమోదయ్యాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను 38 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. – ఏకగ్రీవమైన జెడ్పీటీసీ స్థానాల సంఖ్యతో అధికార వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని సునాయసంగా దక్కించుకోగలదు. – చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలకు గాను, 29 స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. – నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రెండంకెల జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా ఎంపీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. వైఎస్సార్ జిల్లాలో కొత్త చరిత్ర సాక్షి ప్రతినిధి కడప: వైఎస్సార్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఏకపక్షంగా మారాయి. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో శనివారం రాత్రికి 39 స్థానాలు, 38 ఎంపీపీలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఏడు జెడ్పీటీసీలకుగాను ఏడూ వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం కావడం విశేషం. పులివెందుల నియోజకవర్గంలో 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 65 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అంతటా ఇదే ఊపు కనిపిస్తోంది. కమలాపురం నియోజకవర్గంలో 58 స్థానాలు ఉండగా 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రొద్దుటూరులో 33 స్థానాలకుగాను 19 స్థానాలు ఏకగ్రీవం కాగా, మైదుకూరులో 61 స్థానాలకుగాను 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బద్వేలు నియోజకవర్గంలో 58 స్థానాలు ఉండగా 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రైల్వేకోడూరులో 74 స్థానాలకుగాను 48 స్థానాలు, జమ్మలమడుగులో 66 స్థానాలకుగాను 15 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మాచర్లలో వైఎస్సార్సీపీ హవా సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రికార్డు సాధించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు (ఒక్కటి మినహా) ఓటింగ్ నిర్వహించే పనిలేకుండానే నియోజకవర్గంలోని 71 ఎంపీటీసీ గాను 70 స్థానాలు, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి, రెంటచింతల, దుర్గి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల మున్సిపాలిటీలో సైతం 31 డివిజన్లకు గాను 31 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. - విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. మాజీ మంత్రి సుజయ్కృష్ణ రంగారావు పట్టు కలిగి ఉన్న సీతానగరం మండలం జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి స్వగ్రామంలోనే ఎదురు దెబ్బ తగలింది. ఆయన స్వగ్రామమైన నార్తురాజుపాళెం–1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పోశింరెడ్డి అనిల్కుమార్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఏ మాత్రం గెలిచే అవకాశం లేకపోవడంతో పరువు కోసం టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. -
'బాబుకు ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు'
సాక్షి, అమరావతి : పల్నాడులో టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై వైసీపీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు నిఘా యాప్పై టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్విఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. నిఘా యాప్పై చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. విజయవాడ కు చెందిన టీడీపీ నేతలు దురుసుగా డ్రైవింగ్ చేయడం వల్ల ఘర్షణ మొదలైందన్నారు. పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉన్నా టీడీపీ నేతల్ని పంపించడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు దిగతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం నిఘా యాప్ను రిలీజ్ చేశారని తెలిపారు. కాగా ఎన్నికల కోడ్ రాకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని ప్రారంభించారన్నారు. సాధారణంగా ఎన్నికల్లో సజావుగా జరిగేందుకు నిఘా పెంచాలని ప్రతిపక్షాలు కోరడం చూస్తాం.. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే నిఘా యాప్ను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈసీని కలిసిన వారిలో వైసీపీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి,ఇతర నేతలు పాల్గొన్నారు -
‘స్థానిక’ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పోటీలో నిలిపితే వారికి బీఫామ్లు ఇవ్వకూడదని రీజినల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. (చదవండి : నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు') కాగా, నేటితో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రకియ ముగియనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రేపు నామినేషన్లను పరిశీలించనునాన్నరు. ఈనెల 14న తుది జాబితాను ప్రకటించి, 21న ఎన్నికల నిర్వహించనున్నారు. ఫలితాలను మార్చి 24న ప్రకటించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి.. 27న ఫలితాలను ప్రకటిస్తారు. -
'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే సహించం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఈసీ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయే వాటి వివరాలు తెలియజేయాలన్నారు. అనుమతి లేని ర్యాలీలు, బైక్ ర్యాలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికల పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.వెంటనే జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులతో పాటు, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాలని వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బును అరికట్టడానికి ఎన్నికల వ్యయ ఖాతాలను తరచూగా తనిఖీ చేయడానికి జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.వివాహం, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు మొదలైన ఏవైనా వ్యక్తి గత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ. 50వేల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు.ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచడం జరిగిందని అధికారులకు వెల్లడించారు. వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరు కావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చెయ్యాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరనే నమ్మకం క్షేత్రస్థాయిలో తీసుకురావాలని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. -
నిఘా యాప్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్ రూపకల్పన చేసింది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో నిఘా యాప్ను ఆవిష్కరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నివారించి, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం, పోలీస్ వ్యవస్ధ తీసుకుంటున్న చర్యలకు అదనంగా నిఘా యాప్ను రూపొందించింది. సామాన్యులెవరైనా ఈ నిఘా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడుతున్న వారి వివరాలతో పాటు చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. యాప్ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు. (ఎన్నికల్లో అక్రమాలకు.. మొబైల్ యాప్తో 'చెక్') -
'జేసీ డబ్బు, మద్యంతోనే రాజకీయం చేశారు'
సాక్షి, అనంతపురం : చంద్రబాబు బీసీల ద్రోహి అని, టీడీపీ నేతలతో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. నిధుల వృధా కాకుండా, అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉండాలన్నదే తమ ద్యేయమన్నారు. కానీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని టీడీపీ కుట్ర పన్నుతుందని పేర్కొన్నారు. బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపని అందుకే బీసీల రిజర్వేషన్లను దుర్బుద్దితో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. జేసీ దివాకర్రెడ్డి ఇన్నాళ్లు డబ్బు, మద్యంతోనే రాజకీయం చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగం, రాజకీయాల పట్ల జేసీకి ఏమాత్రం విలువ లేదని ఎద్దేవా చేశారు. ఇన్నా రోజులు డబ్బు, మద్యం పంచే టీడీపీ గెలిచినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంచినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం పంచుతూ పట్టుబడితే అనర్హత వేటు ఖామమని బొత్స తెలిపారు.(సిద్ధమైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా నాయకులే గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి సీఎం జగన్ నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. బాబు వైఖరి దొంగే దొంగ అన్న చందంగా తయారైందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి గెలిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించిన ఘనత వైఎస్ జగన్దేనని వెల్లడించారు. -
'రిజర్వేషన్లు అడ్డుకుంటూనే మొసలి కన్నీరు'
-
టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి: మంత్రి బొత్స
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తేవడం గొప్ప విషయమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలుతో పాటు, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. బీసీలకు మేలు చేసేందుకే సీఎం జగన్ 58.95 శాతం రిజర్వేషన్లు తెచ్చారని వెల్లడించారు. అయితే బీసీ రిజర్వేషన్లను టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. తన మనుషులతో రిజర్వేషన్లు అడ్డుకొని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ సీపీ గెలుపు చాలా కీలకం అని బొత్స పేర్కొన్నారు. అనంతపురం స్థానిక సమరంలో అన్ని స్థానాలు గెలచి, టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ గెలుపు చాలా అవసరమన్న మంత్రి బొత్స... ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నేతలు గెలవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. వచ్చే ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని వెల్లడించారు. (మేమంటే నీకంత ద్వేషమా.. బాబూ?) (హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం) -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
-
నేడే ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పునకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా గురువారం ఖరారు కానున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా నేటి మధ్యాహ్నంలోగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. జిల్లాలవారీగా గెజిట్ జారీ చేసి ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కాపీని అందచేయడంతోపాటు వెబ్పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు శుక్రవారం రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వెలువడగానే విధివిధానాలపై ఉత్తర్వులు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లోనే ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదించింది. ఆమేరకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పదవుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన విధివిధానాలను ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారులో అనుసరించాల్సిన నియమ నిబంధనలపై హైకోర్టు తీర్పు వెలువడిన 2వ తేదీనే పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల ఖరారులో తాజా విధివిధానాలు.. - ఒక మండలంలో జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఒకే కేటగిరీ రిజర్వేషన్లో ఉంచకూడదు. ఉదాహరణకు ఏదైనా మండలంలో జెడ్పీటీసీ బీసీ జనరల్కు రిజర్వయితే ఎంపీపీ పదవి అదే కేటగిరికీ రిజర్వు చేయకూడదు. ఎంపీపీని బీసీ మహిళ లేదా మరే ఇతర రిజర్వేషన్ కేటగిరీకి రిజర్వు చేయవచ్చు. - జెడ్పీటీసీని ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన మండలంలో ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో జెడ్పీటీసీ అన్ రిజర్వు కేటగిరిలో ఉన్న మండలంలో ఎంపీపీ పదవి అన్ రిజర్వు కేటగిరిలో ఉండవచ్చు. - గ్రామ సర్పంచి, ఎంపీటీసీ పదవులను మండల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - మండలంలో సర్పంచి లేదా ఎంపీటీసీ పదవులను ఏ కేటగిరికి ఎన్ని రిజర్వు చేస్తారన్నది ఆ ప్రాంత ఆర్డీవో ఖరారు చేస్తారు. ఏ స్థానం ఏ కేటగిరికి రిజర్వు చేశారన్నది ఆర్డీవోనే ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. - ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను జిల్లాలోని మొత్తం జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - జిల్లాలోని బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలు మొత్తం స్థానాల్లో సగానికి మించకూడదు. - జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలన్నది కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఏ స్థానాలు ఏ కేటగిరికి కేటాయిస్తారో కలెక్టరే ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. - జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్శాఖ కమిషనర్ నిర్ధారిస్తారు. - రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు మూడు చొప్పున రిజర్వు అవుతాయని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. - ఏడు జడ్పీ చైర్మన్ పదవులు అన్ రిజర్వు కేటగిరిలో ఉంటాయి. - షెడ్యూల్ ఏరియాలో మాత్రం ఎస్టీలకు ఒకే మండల పరిధిలో ఎంపీటీసీ, గ్రామ సర్పంచి పదవులకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ మేరకు రాజ్యాంగంలోనే స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. - షెడ్యూల్ ఏరియాలో ఉండే జెడ్పీటీసీ పదవులను పూర్తిగా ఎస్టీలకే రిజర్వు చేస్తారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే
-
డ్రామాలొద్దు బాబూ
సాక్షి,అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు దాఖలు చేయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నటిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ నేత ప్రతాప్రెడ్డితో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఆయన వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి పేరులో కూడా రెడ్డి అని ఉందని, మరి ఆయన కూడా వైఎస్సార్సీపీకి చెందిన వారేనా? అని ప్రశ్నించారు. బిర్రు ప్రతాప్రెడ్డి వివిధ సందర్భాల్లో చంద్రబాబు, లోకేశ్తో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు ప్రదర్శించారు. జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే.. - చంద్రబాబు హయాంలో ప్రతాప్రెడ్డికి ఉపాధి హామీ పథకంలో నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. - టీడీపీలోని బీసీ నేతలు బాబు తొత్తులుగా మారారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. - బీసీలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినవ పూలేగా ప్రశంసలు అందుకుంటున్నారు. - బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే. - రాష్ట్రంలో 220 మార్కెట్ యార్డు చైర్మన్ పదవులకుగానూ 110 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించారు. - 1,620 పైచిలుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డైరెక్టర్ పదవులు ఇచ్చారు. - బీసీల మనోభావాలను గుర్తించిన ముఖ్యమంత్రికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గడువులేనందునే ‘సుప్రీం’కు వెళ్లలేకపోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలను 59.85 శాతం రిజర్వేషన్లతో నిర్వహించాలని భావించాం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 50 శాతం కోటాతోనే నిర్వహిస్తాం. గడువు లేనందునే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లలేకపోతున్నాం. చట్టసభల్లో బీసీలకు ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. – డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ చంద్రబాబు బీసీల వ్యతిరేకి టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మరోమారు రుజువైంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుందోననే భయంతో చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. – మంత్రి మోపిదేవి -
నెలలో పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిధులు రావాలంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని, అనంతరం ఎన్నికల తేదీలు ఖరారవుతాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే ‘పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ విప్లవాత్మక మార్పుల కోసం ఆర్డినెన్స్ తెచ్చాం. అవినీతిని నిర్మూలించడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని ఎన్నికల వ్యవస్థ నుంచి పూర్తిగా, శాశ్వతంగా తీసేయాలనే దృఢ సంకల్పంతోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. ఈ ఆర్డినెన్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి పోలీసు అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి. డబ్బులు పంచినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా, బాధ్యులపై అనర్హత వేటు పడుతుంది. మూడేళ్ల పాటు జైలుకు పంపుతాం. ఎక్కడా కూడా డబ్బులు, మద్యం పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదనేది చాలా ప్రాధాన్యమైన అంశం. ఒక్క గ్రామంలో కూడా డబ్బులు, మద్యం పంపిణీ చేసి.. ఎన్నికలు నిర్వహించారనే మాట వినిపించ కూడదు. ఈ రెండు అంశాలపై పోలీసు యంత్రాంగం చాలా దృఢంగా పని చేయాలి. దీన్ని చాలెంజ్గా తీసుకోవాలి. ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదు.. ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి, వారికి సేవ చేసే మంచి వ్యక్తులు గెలిచే అవకాశం సృష్టించడానికే ఈ ఆర్డినెన్స్ తీసుకు వచ్చాం. ఈ మార్పులు కనిపించే విధంగా ఎస్పీలందరూ పని చేయాలి. డబ్బులు, మద్యాన్ని అరికట్టడంలో ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రలను, గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇలా చేద్దాం.. – మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. – సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి. – గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్ ఉండాలి. – ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ యాప్లో నమోదు కావాలి. – ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరాలి. – ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపాలి. – ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని గ్రామ సచివాలయాలన్నింటిలో ప్రదర్శించాలి. ఇలా చేద్దాం.. అధికారులతో సీఎం - మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. - సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి. - గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్ ఉండాలి. - ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ యాప్లో నమోదు కావాలి. - ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరాలి. - ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపాలి. - ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని గ్రామ సచివాలయాలన్నింటిలో ప్రదర్శించాలి. -
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు
-
రిజర్వేషన్లు 50% మించొద్దు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని చెప్పింది. (చదవండి: టీడీపీ.. బీసీ వ్యతిరేకి) ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 176, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 6న తీర్పును వాయిదా వేసింది. తీర్పు వెలువరించే దశలో పలు సందేహాలు రావడంతో వాటి నివృత్తి కోసం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను విన్న ధర్మాసనం తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. అసాధారణ పరిస్థితుల్లో 50 శాతం దాటొచ్చు రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చునని ఇందిరా సహాని, రాకేష్ కుమార్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9 (1ఏ), 15(2), 152(1ఏ), 153(2ఏ), 180(1ఏ), 181(2)(బీ)ల గురించి ధర్మాసనం తన తీర్పులో సవివరంగా చర్చించింది. ఈ సెక్షన్ల వల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, అది చెల్లదని తీర్పులో పేర్కొంది. (చదవండి: బడుగుల ద్రోహి చంద్రబాబు) బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని చెబుతున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9 (1ఏ) చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పునకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను నేటి నుంచి నెలలోపు తిరిగి ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర అవుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు.. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మార్చి 3 కల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్ గురించి ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. కాగా, ఈ తీర్పుపై బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. (చదవండి: చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) -
‘స్థానిక’ ఎన్నికల వ్యవధి కుదింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి జరిగే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ కాల వ్యవధిని 27 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్. రమేష్కుమార్ వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుండి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం 20 రోజుల్లో ఈ ప్రక్రియను ముగించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందరరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను, మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలుచేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని రమేష్కుమార్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఓటర్ల జాబితా నవీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు.. ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవడంపై కలెక్టర్లు ప్రధానంగా దృష్టిసారించాలన్నారు. ‘స్థానిక’ ఎన్నికలన్నీ ఏకకాలంలో జరిగినా.. కాగా, మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అదనపు ఎన్నికల మెటీరియల్, యంత్రాంగాన్ని సమకూర్చుకునేలా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రమేష్కుమార్ జిల్లా అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో.. సర్పంచ్ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించాల్సి ఉంటుందని, ఆ దిశగా కలెక్టర్లు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని రమేష్కుమార్ జిల్లాల అధికారులకు తెలిపారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన 10 మున్సిపాలిటీలకు సంబంధించి విడిగా మార్గదర్శకాలను జారీచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ ఏవీ సత్యరమేష్, విశాఖపట్నం నుంచి మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'వారికి ఓట్లు అడిగే అర్హత లేదు'
సాక్షి, మధిర : ప్రజా సమస్యలు పరిష్కరించని అధికార పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాలని్నంటినీ సీఎం కేసీఆర్ కేంద్రీకృతం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అన్నింటికీ సర్వాధికారిగా ముఖ్యమంత్రే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని అధికారాలను తన వద్దనే ఉంచుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసమని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పౌరులకు, అధికారులకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వింత చర్యలను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆరేళ్లుగా ఉద్యోగాల భర్తీ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని చెప్పారు. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మౌలిక వసతులు కరువయ్యాయని, ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే భవిష్యత్ అంధకారమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు అప్పుచేశారని, ఇంకా అప్పులు చేసి ప్రభుత్వం ప్రజలను తాకట్టు పెడుతోందన్నారు. సమగ్ర ప్రణాళికతో, సంపూర్ణ అభివృద్ధితో మధిర అభివృద్ధికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామని, చైర్మన్గా మధిర మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది తూములూరి కృష్ణారావు, సభ్యులుగా వీరమాచనేని శ్రీనివాసరావు, కటుకూరి శ్యామారావు, బిక్కి రాజా, మైనిడి జగన్మోహన్రావు, సయ్యద్ రషీద్ తదితరులు ఉంటారని తెలిపారు. -
మున్సి‘పోల్స్’ కసరత్తు వేగిరం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల కసరత్తు వేగిరమైంది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన 14 రోజుల షెడ్యూల్ను ప్రకటిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల విభజన ప్రక్రియ చేపట్టడం ఇది రెండోసారి. గతంలో కేవలం 7 రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటించి హడావుడిగా ప్రక్రియను ప్రభుత్వం ముగించిందని, ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు కేవలం ఒకేరోజు మాత్రమే కేటాయించిందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం వార్డుల విభజనకు 14 రోజుల షెడ్యూల్ను తాజాగా పురపాలక శాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలు వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రకటనను మంగళవారం ప్రకటించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 9 వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. వీటిని పరిష్కరించి ఈ నెల 17న వార్డుల విభజనకు సంబంధించిన తుది ప్రకటనను ప్రభుత్వం జారీ చేయనుంది. వార్డుల క్రమసంఖ్య వరుసగా ఉత్తరం నుంచి ప్రారంభమై తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల వారీగా సాగేలా మున్సిపాలిటీల మ్యాపుల రూపకల్పనలోజాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించి ఉండరాదని తెలిపింది. రిజర్వేషన్లకు కొత్త రోస్టర్ వార్డుల విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడిన వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు 5 రోజుల సమయం పట్టనుందని పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. అన్ని మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం మున్సిపాలిటీల వార్డు, చైర్పర్సన్ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సైతం ఇలానే ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలిన స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. వార్డు/డివిజన్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటిస్తూ స్థానిక జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. చైర్పర్సన్, మేయర్ స్థానాల రిజర్వేషన్లను మాత్రం పురపాలికల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా జరిగితే జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్)ను అమలు చేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల్లో ఖరారు చేసే రిజర్వేషన్లను మరో రెండు సాధారణ ఎన్నికల వరకు కొనసాగించనున్నారు. -
స్ధానిక పోరులో కాంగ్రెస్ హవా..
జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో జయభేరి మోగించింది. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ప్రభంజనం సృష్టించినా స్ధానిక పోరులో కాషాయ పార్టీకి కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. 17 మున్సిపల్ కౌన్సిల్స్కు గాను 11 కౌన్సిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ మూడు కౌన్సిల్స్కే పరిమితం కాగా మిగిలిన మూడు మున్సిపల్ కౌన్సిల్స్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇక 29 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 15, బీజేపీ ఆరింటిని దక్కించుకోగా మిగిలిన మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. తమ ప్రభుత్వ సామర్ధ్యాన్ని మెచ్చిన ప్రజలు తమకు స్ధానిక ఎన్నికల్లో పట్టం కట్టారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. రాజస్ధాన్ స్ధానిక పోరులో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు స్ధానాలను గెలుచుకుందని ఆ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ వ్యాఖ్యానించారు. -
4న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదట కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుండగా, తర్వాతి దశలో మిగతావాటికి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మున్సిపల్ శాఖ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను తీయనుంది. -
స్థానిక ఎన్నికల తరువాతే నామినేటెడ్ పదవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తరువాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ బుధవారం మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే బాగుంటుందని, ఆశావహులు ఎదురు చూస్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. మరో రెండు నెలల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావాల్సిన తరుణంలో ఇప్పుడు నామినేటెడ్ పదవుల నియామకం సరికాదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... బుధవారం కేబినెట్ భేటీ ముగిశాక వైఎస్ జగన్ కొద్దిసేపు మంత్రులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలన్న జగన్ వాదనతో పలువురు మంత్రులు ఏకీభవించారు. గ్రామ సచివాలయ కార్యదర్శుల నియామకాలపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పోటీ పరీక్షలు నిర్వహించి, సచివాలయ కార్యదర్శులను ఎంపిక చేయడమే అన్ని విధాలా సరైందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదని సీఎం చెప్పారు. ప్రతిభావ ంతులకే అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. పథకాలన్నీ మొదటినుంచే అమలు చేయాలి మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ ఇప్పుడే అమలు చేయడం సరైంది కాదేమోనని ఓ మంత్రి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పథకాలను దశల వారీగా అమలు చేయడం తమ విధానం కాదని, అన్నీ మొదటినుంచే అమలు చేసి తీరాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. వనరులను ఎలాగైనా సమీకరించుకోవాలే తప్ప పథకాల అమలును వాయిదా వేయడం మంచి పద్ధతి కాదన్నారు. మంత్రివర్గం కూర్పును తేలిగ్గా చేసుకోగలిగానని, కానీ తిరుమల టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాన్ని ఖరారు చేసే విషయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వైఎస్ జగన్ తన మంత్రివర్గ సహచరులతో చెప్పినట్లు సమాచారం. -
మున్సిపల్ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం
సాక్షి, హైదరాబాద్ : ‘పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలున్న ప్రాంతీయపార్టీగా అవతరించాం. ఈ నెల 31లోగా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తయ్యేలా చూద్దాం. మున్సిపల్ ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసి ముందుకు నడపడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి నామమాత్ర పోటీయే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం’అని టీఆ ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి సాయం త్రం 4గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం, పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం, మునిసిపల్ ఎన్నికల పై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగా న్ని సమాయత్తం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శనం చేశారు. వచ్చే నెలలో సన్నాహకాలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో.. ఈ నెల 31 లోగా సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే గ్రామ, మండల కమిటీల నిర్మాణం జరగడంతో.. నూతన కమిటీల వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలన్నారు. మునిసిపాలిటీల్లోనూ వార్డు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటును నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలను మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల కోసం ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లను కూడా తప్పనిసరిగా ఆహ్వానించాలని నొక్కి చెప్పారు. భవన నిర్మాణ పర్యవేక్షణకు నలుగురితో కమిటీ జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణాల పనులపై కూడా కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ఇతర కారణాలతో అక్కడక్కడా పనులకు అవాంతరాలు ఎదురవుతున్నా గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు వెల్లడించారు. కార్యాలయ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు నలుగురితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. -
మున్సిపోల్స్లో కాంగి‘రేస్’
సాక్షి, జనగామ : పంచాయతీ నుంచి ప్రాదేశిక ఎన్నికల వరకు, శాసన సభనుంచి లోక్సభ ఎన్నికల వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన క్యాడర్ను కలిగిన ఆ పార్టీ ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్గా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది. కాంగ్రెస్ కంచుకోటగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన జనగామలో ఆ పార్టీ పట్టు నిలుపుకోవడం కోసం తహతహలాడుతోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి నూతనోత్తేజం నింపడానికి సిద్ధమైంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్వత్వ నమోదుతో కార్యకర్తలను సమీకరిస్తుండగా కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారైనా కలిసొచ్చేనా? కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు రాజకీయంగా జన్మనిచ్చిన జనగామ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. నాలుగు దశాబ్దాల పాటు పొన్నాల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనమైన చరిత్రను సొంతం చేసుకుంది. ముఖ్యంగా జనగామ మునిసిపాలిటీ చరిత్రలో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. 1953 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహాయిస్తే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలిసారిగా 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోగా రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 28 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇద్దరు అభ్యర్థులు 1, 2 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తే ఏకపక్షంగానే చైర్మన్ స్థానం దక్కి ఉండేది. కానీ అనూహ్యంగా కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నప్పటికీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోక పోవడంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మొదటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రిజర్వేషన్లలో బీసీ కోటాకు ప్రభుత్వం కోత విధిస్తున్నప్పటికీ పార్టీపరంగా బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీసీ, దళిత, మైనార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ‘పొన్నాల’ మకాం మునిసిపాలిటీ ఎన్నికలు అయ్యే వరకు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కేంద్రంలోనే మకాం వేయనున్నారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే స్థానిక సమస్యలను ప్రచార అస్త్రాలుగా ఎక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వార్డుల వారీగా ఆశావహుల జాబితాను తయారు చేయడం, పార్టీ క్యాడర్కు దిశానిర్ధేశం చేయడం, పట్టణ ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జెండా పండుగలు శనివారం పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా జెండా పండుగను జరుపనున్నారు. రోజుకు 10 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పొన్నాలతోపాటు టీపీసీసీ మునిసిపాలిటీ ఎన్నికల పరిశీలకుడు మక్సూద్ అహ్మద్తోపాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ముఖ్యనేతలను ఆయా వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
జయం మాదే అంటున్న స్థానిక నేతలు !
సాక్షి , వరంగల్ : ఓ వైపు పలు మునిసిపాలిటీలకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. మరోవైపు మునిసిపల్ సంస్కరణలకు నో చెప్పిన గవర్నర్ నరసింహన్.. ఇంకోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకున్నా మొదలైన రాజకీయ సందడి! వెరసి ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనవే అన్నట్లుగా ఎవరికి వారు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వక్కడ.. నేనక్కడ.. మన పార్టీ అధ్యక్షుడు ఫలానా వార్డు.. ఎస్సీ రిజర్వు అయితే ఆయన.. మహిళకు కేటాయిస్తే ఆయన భార్య.. బీసీ, జనరల్ అయితే ఫలానా వాళ్లు’ అంటూ అప్పుడే సమీకరణలు, వార్డు సభ్యులు, మునిసిపల్ చైర్మన్ బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు కూడా షికారు చేస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రకటన కోసం రాజకీయ పార్టీల నేతలు, ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... మరోవైపు పట్టణ పాలక వర్గాల్లో పాగా వేయాలని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం కాగా.. రిజర్వేషన్ల ప్రకటన వెలువడడమే ఆలస్యం అన్నట్లుగా మారింది. అయితే, భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తుండగా ఇక్కడ ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ ‘గులాబీ’కే దక్కాలి.. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలు దఫాలుగా ఎన్నికలపై చర్చించారు. అన్ని మునిసిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేయాల ని పార్టీ కేడర్కు సంకేతాలి చ్చారు. ఈనెల 20 పెరిగిన ఆసరా ఫించన్ ప్రొసీడింగ్లు అందజేసే సమయంలో మునిసిపాలిటీల పరిధిలో సభ్యత్వ నమోదు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నిర్దేశించింది. పూర్వ వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన అధినేత.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు కూడా మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగించారు. ఆరు జిల్లాలకు విడివిడిగా బాధ్యులను కూడా టీఆర్ఎస్ తరఫున నియమింఆరు. వీరు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా జిల్లాకు బాధ్యులుగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఫోన్ ద్వారా ఏ రోజుకారోజు సమీక్ష జరుపుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సంగారెడ్డి సమావేశంతో కాంగ్రెస్లో ఉత్సాహం జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నేతలతో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల సంగారెడ్డిలో సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర బాధ్యులు కుంతియా, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తదితరులు హాజరుకాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యే సీతక్క, పి.వీరయ్య పాల్గొన్నారు. మున్సిపల్ చట్టంలోని లోటుపాట్లు, బీసీల రిజర్వేషన్లు, అభివృద్ధి, సంక్షేమం పేరుతో అధికార పార్టీ తరఫున జరుగుతున్న తప్పులను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఉమ్మడి వరంగలో జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఇన్చార్జ్లను కూడా నియమించింది. ములుగు ఎమ్మెల్యే స్థానం కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగా.. పూర్వ వరంగల్ జిల్లాలోని మిగిలిన 11 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఇన్చార్జ్లు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ పెద్దలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, విలీనం చేయడం తదితర విషయాలను కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దీంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల అధ్యక్షులు పార్టీ కేడర్తో సమావేశం ఏర్పాటు చేయగా, మిగతా జిల్లాల్లోనూ జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగానే తలపడాలని ‘హస్తం’ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మెజార్టీ మునిసిపాలిటీలపై బీజేపీ గురి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు సీట్లు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ మునిసిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కుమార్ పూర్వ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ అర్బన్ జిల్లా, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్ నేతలు వరంగల్ అర్బన్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి ఇటీవల రెండు రోజుల పాటు పూర్వ వరంగల్ జిల్లాలో పర్యటించారు. దీంతో ఆ పార్టీ ఆరు జిల్లాల అధ్యక్షులు, పట్టణ కమిటీలు మరింత ఉత్సాహంగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పార్టీల సీనియర్ నాయకులు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో మాజీ మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పరకాల, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి, వర్ధన్నపేట తదితర మున్సిపాలిటీలపై గురి పెట్టిన బీజేపీ.. అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉండగా తాజా పరిస్థితుల ప్రకారం సీపీఐ, సీపీఎం, టీడీపీ తదితర పార్టీలు వారి ప్రాబల్యం ఉన్నచోట పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం మున్సిపాలిటీ ఎన్నికలకు ఉమ్మడి వరంగల్ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలో నోటిఫికేషన్ విడుదల చేసినా ఎన్నికల నిర్వహణకు సిద్ధమే అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 మున్సిపాలిటీలకు షెడ్యూల్ ప్రకారం ఎన్ని కల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఇతర జిల్లాల్లో పలు ముని సిపాలిటీల్లో చోటు చేసుకున్న తప్పుల కారణంగా కొందరు కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇవ్వగా... పూర్వ వరంగల్లో ఒక్క భూపాలపల్లి లో ఆ పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు అభ్యంతరాలు లేని మిగిలిన ఎని మిది మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వార్డుల పునర్విభజన, డివిజన్ల వారీగా ఓటర్లకు లగణన, పోలింగు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాలపై ముసాయిదా జాబితాను ప్రకటించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం వాటికి సంబంధించిన తుది జాబితా ప్రకటించారు. ఆ జాబితా ప్రకారమే అధికారులు ఎన్నికలకు వెళ్లనున్నారు. పోలింగ్ కేం ద్రాల వారీగా ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికా రుల జాబితాను సిద్ధం చేశారు. రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉన్నారు. -
'మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్వే'
సాక్షి, సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించడం వల్ల రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే బాగుటుందని తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, మాజీ సీఎల్పీ నేత షబ్బీర్ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, వంశీచందర్ రెడ్డి, సలీమ్ తదితరులు పాల్లొన్నారు. -
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికకు బ్రేక్
సాక్షి, కరీంనగర్ : నిర్ధిష్ట ప్రమాణాలు పాటించకుండా.. మాజీ కార్పొరేటర్లకు ప్రయోజనం చేకూరేలా అధికార యంత్రాంగం హడావుడిగా చేసిన వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదటికే మోసం తెచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల కుల గణనలో అవకతవకలపై సాక్ష్యాధారాలతో పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సవరించేంత వరకు ఎన్నికలు నిర్వహించరాదని స్టే జారీ చేసింది. దీంతో కరీంనగర్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. పునర్విభజన అనంతరం ఏర్పాటైన 2, 3, 18 డివిజన్లలో అవకతవకలు జరిగాయని, ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్లను తారుమారు చేశారని మాజీ కార్పొరేటర్ కూర తిరుపతి, హౌజింగ్బోర్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు వాడె వెంకటరెడ్డితోపాటు ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి రిట్ పిటిషన్లలో మరో 26 మంది వరకు ఇంప్లీడ్ అయినట్లు సమాచారం. శుక్రవారం హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజనపై విచారణ జరగగా, కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలను సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు పిటిషనర్లు ‘సాక్షి’కి తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రతులు రాకపోవడంతో సోమవారం ఈ స్టేకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా పునర్విభజన, ఓటర్ల తుది జాబితా ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోనే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ముందుగా డివిజన్ల సంఖ్యను ప్రకటించిన అధికారులు, ఆ సంఖ్యకు అనుగుణంగా ఓటర్లను నిర్ధారిస్తూ హద్దులను నిర్ణయించారు. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. కరీంనగర్లో 50 డివిజన్లు గతంలో ఉండగా, చుట్టుపక్కలున్న 8 గ్రామాలను విలీనం చేయడంతో వాటి సంఖ్య 60కి పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కో డివిజన్లో ఓటర్ల సంఖ్య 3,700 నుంచి 4,600 వరకు ఉండాలని మునిసిపల్ అధికారులు నిర్ణయించారు. తదనుగుణంగా తొలుత డివిజన్లను పునర్విభజించినప్పటికీ, ఇంటి నెంబర్ల ఆధారంగా విభజన జరపడంతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో మార్పులు చేసి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతోపాటు రిజర్వేషన్ల ముసాయిదా కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. రాజకీయ జోక్యంతో అస్తవ్యస్తం డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరించినప్పుడే రాజకీయ జోక్యం మొదలైంది. తాజా మాజీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. డివిజన్ల రిజర్వేషన్లు ప్రభావితం అయ్యేలా ఓటర్లను ఇష్టానుసారంగా మార్చివేశారు. తాజా మాజీలైన కార్పొరేటర్లు చెప్పినట్టే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది డివిజన్లలో ఓటర్లను చేర్చడం, తొలగించడం జరిగిందనేది వాస్తవం. శాస్త్రీయ పద్ధతి లేకుండా కొంతమంది ప్రయోజనాల కోసమే ఓటర్లను మార్చడంతో ఏకంగా 26 మంది వరకు కోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు బీసీగానో, జనరల్గానో ఉన్న డివిజన్ ఎస్సీ లేదా ఎస్టీ అయితే పదేళ్ల వరకు తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం రాదనే ఉద్దేశ్యంతో ఓ మాజీ కార్పొరేటర్ రాష్ట్ర స్థాయిలో పైరవీ చేసి, ఒక వర్గం ఓటర్లను పక్క డివిజన్లోకి మార్పించారనే విమర్శ ఉంది. కౌన్సిల్లో మొన్నటిదాకా కీలకస్థానంలో ఉన్న ఓ నాయకుడు తన డివిజన్లో కొత్తగా వేరే డివిజన్ల ఓట్లు చేరకుండా జాగ్రత్త పడడంతో అతితక్కువ ఓటర్లుగా నమోదయ్యాయి. ఆ పక్కనే ఉన్న డివిజన్లో దాదాపు రెట్టింపు ఓటర్లు ఉండడం గమనార్హం. ఎస్టీ డివిజన్లో మొదలై.. మిగతా ప్రాంతాలకు పాకి.. 3వ డివిజన్లో ఎస్టీ ఓటర్లు 350కి పైగా ఉండగా, అవన్నీ రాత్రికి రాత్రే 2వ డివిజన్లోకి చేరాయి. కేవలం ఎస్టీ ఓటర్లున్న ఇళ్లను మాత్రమే 2వ డివిజన్లో కలిపి, మిగతా ఓటర్లను యధాతథంగా 3వ డివిజన్లో ఉంచడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ కావలసిన ఈ డివిజన్ జనరల్గానో, బీసీగానో చేసే కుట్ర జరిగిందని మాజీ కార్పొరేటర్ కూర తిరుపతి వాదన. ఇదే అంశాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్న 2వ డివిజన్లో ఎస్టీ ఓటర్లను చేర్చడం వల్ల తమకు కేటాయించాల్సిన రిజర్వేషన్ కాకుండా పోతుందని ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 18వ డివిజన్లో ఏకంగా 600 అగ్రవర్ణ ఓటర్లను బీసీలుగా చూపించారని హౌజింగ్బోర్డుకు చెందిన వాడె వెంకటరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. డివిజన్లో 4,600కు మించకుండా ఓటర్లు ఉండాలనే నిబంధనను పక్కన బెట్టి 4,813 మంది ఓటర్లతో డివిజన్ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 24వ డివిజన్లో ఏకంగా 2900 మంది ఓటర్లు మాత్రమే ఉంటే, పక్కనున్న 25వ డివిజన్లో 5,100 మంది ఓటర్లు ఉన్నారు. 19వ డివిజన్లో కూడా ఓటర్లను చేర్చడంలో అవకతవకలు జరిగాయని మాజీ కార్పొరేటర్ సతీష్ సైతం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 40వ డివిజన్లో ఒకే ఇంట్లో వంద మంది ఓటర్లు ఉన్నారని బీజేపీ నాయకులు చిట్టిబాబు, రాజేష్ సైతం కోర్టుకు విన్నవించారు. కోర్టు స్టే కాపీ కోసం అధికారుల నిరీక్షణ శాస్త్రీయత లేకుండా ఇష్టానుసారంగా డివిజన్ల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు హైకోర్టు ఆగ్రహంతో తల పట్టుకుంటున్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసినా, ఏయే అంశాలపై కోర్టు అభ్యంతరం తెలియజేసిందో హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వస్తే గానీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులు డివిజన్ల విభజన విధానాన్ని మరోసారి పరిశీలించే పనిలో పడ్డారు. ప్రధానంగా 2,3, 18, 19 వార్డులతోపాటు అభ్యంతరాలు వ్యక్తమైన ఇతర డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో జరిగిన లోటుపాట్లను సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. కాగా కోర్టు ఆదేశాల మేరకు డీలిమిటేషన్లో హైకోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, లోపాలను సవరించి కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మునిసిపాలిటీలతోపాటే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం
సాక్షి, పాలమూరు: మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు కీలక సంగ్రామంగా భావిస్తున్న పుర పోరుపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్టు చేజారకుండా ముఖ్యనాయకులపై ఒత్తిడి పెంచుతున్నారు. బరిలో ఉంటామనేలా.. మున్సిపాలిటీ ఎన్నికల వార్డుల రిజర్వేషన్లు ఇంకా ప్రకటించలేదు. అయినా కొందరు ఔత్సాహికులు పార్టీ నుంచి తనకే టికెట్ ఖాయమనే తీరును ప్రదర్శిస్తున్నారు. ఈనెల 14లోగా రిజర్వేషన్లు తేలిపోనుండటంతో ఆశావహుల జోరు అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్కు ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ను దక్కించుకోవడానికి ఇప్పటికే లాబింగ్లు మొదలెట్టారు. మొన్నటి వరకు వరకు పాలకవర్గంలో బాధ్యతలు నిర్వర్తించిన నాయకులతోపాటు కొత్తగా టికెట్ను ఆశిస్తున్న వారి తాకిడి ఈ పార్టీలో అధికంగానే కనిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు కూడా మహబూబ్నగర్ పుర పీఠాన్ని కైవసం చేసుకునేలా ముందుకు అడుగులేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల తరఫున రంగంలో నిలిచేందుకు నాయకగణం ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో గెలిచి పాలనతీరులో భాగమైన సిట్టింగుల్లో ఎక్కువ మంది మరోసారి తమకు రిజర్వేషన్ అనుకూలిస్తుందని.. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలనే భావనను కనబరుస్తున్నారు. ఆశించిన వార్డుతోపాటు అనుకూలంగా ఉండే ఇతర స్థానాల్లోనూ పోటీకి సై అనేలా చతురతను చూపిస్తున్నారు. కొత్తగా పోటీపట్ల ఆసక్తిని చూపించే వారి సంఖ్య కూడా పట్టణంలో క్రమంగా పెరుగుతోంది. ప్రజలతో ఉన్న సత్సంబంధాలు తమకు కలిసి వస్తాయనే తీరుతో పోటీ దిశగానే దృష్టిని చూపిస్తున్నారు. అనుచరుల వద్ద టికెట్ పొందుతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కాలనీల్లో, బస్తీల్లోని పెద్దలు సహా కుల సంఘాల వారికి పోటీ ఖాయమనే తీరుని మాటల్లో చెప్పకనే చెబుతున్నారు. అయితే తాను లేదంటే తన భార్య పోటీలో ఉంటుందనే విషయాన్ని కూడా ముందుస్తుగానే తెలియపరుస్తున్నారు. వలసలపై దృష్టి పట్టణ ప్రాంతంలో కీలకమైన కౌన్సిలర్ పోటీ చేయడాన్ని ఆయా పార్టీల నాయకులు సవాలుగా తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనే ఆశాభావంతో ముందస్తుగానే జోరును పెంచుతున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న సొంత పార్టీలోనే టికెట్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పక్క పార్టీలోకి మారైనా పోటీకి సమాయత్తమవుతున్నారు. ఉన్నఫలంగా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎక్కువగా సమయం ఉండకపోవడం అప్పటికప్పుడు అభ్యర్థుల వెతుకులాట సహా ఇతరత్రాలుగా ఎదురయ్యే ఇక్కట్లను తట్టుకునేందుకు ముందస్తుగానే అభ్యర్థుల విషయంలో ఓ అంచనాలున్నాయి. తమ పార్టీలోని బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వడం లేదా అనివార్యమైన చోట పక్క పార్టీలోని మంచి నాయకుడికి గాలం వేసి పార్టీలోకి ఆహ్వానించడం లాంటి ప్రయత్నాల్ని అన్ని పార్టీలు చేపట్టబోతున్నాయి. మరోవైపు నాయకులు కూడా తమ కళ్లముందున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వలసలకు తెరతీయనున్నారు. తమ సొంత పార్టీలో టికెట్ వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పలు వార్డులపై దృష్టి మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉన్న కొన్ని వార్డులపై అధికార పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల నుంచి కౌన్సిలర్లుగా ఉంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పిస్తున్న కొందరిని వచ్చే కౌన్సిల్కు రాకుండా చూడాలని ప్రణాళిక రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయా వార్డుల్లో ఆకర్ష్ మంత్ర ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడంలో విఫలం అయిన ఈ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది. అధిష్ఠానం సూచనల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ తన కార్యాచరణను ప్రకటించనుంది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ తరుఫున టికెట్ తీసుకుని గెలిచాక నాయకులు అధికార పార్టీలోకి వెళ్లకుండా ఆచూతూచి వ్యవహరిస్తూ నమ్మకస్తులను ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జోరుమీదున్న కారు.. అధికార పార్టీ టీఆర్ఎస్ భారీ అంచనాలతో ఉంది. వంద శాతం జెడ్పీ పీఠాలను సాధించినట్లే జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో సత్తా చాటి.. పదవులను కైవసం చేసుకోవాలని చూస్తోంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా గెలుపు గుర్రాలను పోటీలో నిలుపుతామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో మహబూబ్నగర్ పట్టణంలో మంత్రి శ్రీనివాస్గౌడు వార్డుల్లో అధికారులను వెంటబెట్టుకుని కలియదిరుగుతున్నారు. సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని కాలనీల్లో చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఆశ పడుతున్నా ద్వితీయ శ్రేణి నాయకులు కష్టపడి పని చేస్తున్నారు. కమల వ్యూహం గతంలో పట్టణంలో బీజేపీ ఆరుసీట్లు దక్కించుకుంది. ఒకప్పుడు ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచాక జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని వ్యూహం రచించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కంటే 4500ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంట్లో పట్టణంలో అధికంగా ఓట్లు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తున్నారు. గతసారి కాంగ్రెస్కు మద్దతు పలకడంతో మహబూబ్నగర్ మున్సిపాలిటీలో బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఈసారి వార్డుల సంఖ్య పెంచుకొని చైర్మన్ పదవి దక్కించుకోని సంస్థాగతంగా బలోపేతం కావాలనే యోచనలో బీజేపీ నాయకులు ఉన్నారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ!
సాక్షి, జోగిపేట(సంగారెడ్డి) : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. సాధ్యమైనంత తొందరలోనే పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు అధికారులు ఓటర్ల గణనను చేపట్టారు. గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 14న పూర్తి కానుంది. అధికార ఏర్పాట్ల విషయాన్ని అటుంచితే ఇటు మున్సిపల్ చైర్మన్గిరిపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఓటర్ల గణన తర్వాత ఏ మున్సిపాలిటీ రిజర్వేషన్ ఎవరికి కలిసి వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే చాలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఇప్పటికే యత్నాలు ముమ్మరం చేశారు. ఒకవేళ ‘పుర’ పీఠం మహిళలకు కేటాయిస్తే తమ బంధువులనూ బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోతోంది. జిల్లాలో సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్, సదా శివపేట మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెలుసుకున్న ఆశావహులు కౌన్సిలర్గా పోటీ చేసి ‘పుర’ పీఠంపై దృష్టి సారించారు. తొలి చైర్మన్లు ఎవరో..? జిల్లాలో కొత్తగా ఏర్పడిన అమీన్పూర్, నారాయణఖేడ్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు మొదటిసారిగా జరిగే ఎన్నికల్లో చైర్మన్లుగా ఎవరు ఎన్నికవుతారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో తామే కొత్త మున్సిపాలిటీలపై జెండా ఎగురవేస్తామన్న ధీమాను అధికార పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఏవి వస్తాయోనన్న టెన్షన్లో ఉన్నారు. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తమకు అనూకూలంగా రిజర్వేషన్లు వస్తాయా లేదా అన్న ఉత్కంఠతతో ఉన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎక్కడా ప్రస్తావన తీసుకురాకపోవడంతో పరోక్ష ఎన్నికలే జరగవచ్చని అంటున్నారు. పాత పాలకవర్గం ఆశలు గత ఎన్నికల్లో కొనసాగిన పాలకవర్గాలు తిరిగి మరోసారి ఎన్నిక కావాలన్న ఆశతో ఉన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట మున్సిపాలిటీల్లో మహిళలే చైర్పర్సన్లుగా కొనసాగారు. జరగబోయే ఎన్నికల్లో వారి భర్తలు ఆశలు పెంచుకుంటున్నారు. ఏదిఏమైనా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాలోని 8 మున్సిపాలిటీలను సాధించుకునేలా ముందుకు సాగుతోంది. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందరి కంటే ముందే మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సుమారుగా రూ.10 కోట్ల విలువ చేసే పనులను చేపట్టేందుకు నిర్ణయించుకొని శంకుస్థాపనలు చేశారు. -
అంతా.. గందరగోళం!
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల్లో జరిగిన వార్డుల పునర్విభజనపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజించారని విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో గతంలో ఉన్నవార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వార్డులను ఏర్పాటు చేయడానికి పాత వార్డులను పునర్విభజన చేయక తప్పలేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ నాయకులకు మేలు జరిగేలా వార్డులను విభజించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని కోసం కనీసం వార్డుల సరిహద్దులు తేల్చకుండానే, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారని పేర్కొంటున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో గతం కన్నా ఓటర్లసంఖ్య తగ్గించి చూపారని, దీంతో పెద్ద సంఖ్యలోనే ఓట్లు గల్లంతు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం1.60 లక్షల జనాభా ఉండింది. మున్సిపాలిటీలో నల్ల గొండ శివారు పంచాయతీలను విలీనం చేశారు. అంటే ఆ పంచాయతీల జనాభాను కలిపితే మున్సిపాలిటీ జనాభా పెరగాలి. కానీ, పెరిగినట్లు లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, గతంలో పట్టణంలో 45వేల మందిదాకా ఓసీలు ఉంటే.. వారి సంఖ్య 27వేలకు తగ్గిపోయిందని, ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. భర్త ఓసీగా ఉంటే.. భార్యను బీసీ వర్గంలో కలిపారని, ఎస్సీలను బీసీలుగా చూపించారని, పెద్ద సంఖ్యలో ఇలా కులాలు, వర్గాలు మారిపోయాయని అంటున్నారు. మొత్తంగా జిల్లాలోని మున్సి పాలిటీల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితాల తయారీలో ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. సరిహద్దు దాటిన ఓటర్లు నల్లగొండ మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై విమర్శలు ఉన్నాయి. ఓటర్ల జాబితాను సరిగా రూపొందించక పోవడంతో ఓటర్ల వివరాలకు పొంతనలే కుండా పోయింది. మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన పునర్విభజన ప్రక్రియ వార్డు మ్యాపు, సరిహద్దులు, ఓటర్లకు మధ్య ఎక్కడా సామ్యమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరుగా రెండు, మూడు వార్డుల పరిధిలోకి చేరిపోయాయి. భార్యా భర్తలు, పిల్లల ఓట్లు చెల్లా చెదరయ్యాయి. ఉదాహరణకు 9వ వార్డులో భర్తల ఓట్లుంటే, 13వ వార్డులో భార్యల ఓట్లు చేరాయి. 39వ వార్డులో నివాసం ఉన్న వారివి దాదాపు 80 ఓట్ల వరకు 40వ వార్డులోకి వెళ్లిపోయాయి. 9వ వార్డులో నివాసం ఉంటున్న వారికి చెందిన 245 ఓట్లను 8వ వార్డులోకి చేర్చారు. 4వ వార్డులో నివాసం ఉంటే 2వ వార్డులోకి 110 ఓట్లు వచ్చి చేరాయి. 43వ వార్డు నుంచి 42వ వార్డులోకి 242 ఓట్లను మార్చారు. 9 వార్డులో ఉండాల్సిన 197 ఓట్లు 6వ వార్డులో పరిధిలోకి మార్చారు. కొన్ని కాలనీలను పార్ట్లుగా విభజించి రెండు, మూడు వార్డులోకి చేర్చడంతో ఈ సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు. పోలింగ్ బూత్లను, ఓటర్ల సంఖ్యను చూసుకొని నిబంధనల ప్రకారమే చేర్చినట్లు వార్డులను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 42వ వార్డు రైల్వే ట్రాక్కు ఇరువైపులా కాలనీలు ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. అదే విధంగా దేవరకొండ రోడ్డులోని 24వ వార్డు సైతం ప్ర«ధాన రహాదారికి ఇరు వైపుల ఉన్న కాలనీలతో వార్డు ఏర్పాటు చేశారు. అస్తవ్యస్తంగా వార్డుల పునర్విభజన మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా చేశారు. పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా వార్డులను విభజించారు. గతంలో 36 వార్డులు ఉన్న మున్సిపాలిటీనీ 14 వార్డులను పెంచి 48 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డుల పునర్విభజన చేపట్టారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం 54 ఫిర్యాదులు రాగా కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే సక్రమంగా ఉన్నాయని వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేయడం వల్ల శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు కమిషనర్ సత్యబాబు సెలవుపై వెళ్లారు. ఇదీ... కథ మిర్యాలగూడ పట్టణంలోని 1వ వార్డులో ఉన్న చైతన్య నగర్లో రెండు అపార్ట్మెంట్లతో పాటు మొత్తం 300 ఓట్లను నల్లగొండ రోడ్డుకు అవతలివైపున ఉన్న 48వ వార్డు (రామచంద్రగూడెం)లో కలిపారు. తాళ్లగడ్డలో ఉన్న 2వ వార్డు పక్కనే 3వ వార్డు కాకుండా 8వ వార్డుకు సంబంధించిన ఓట్లు కలిపారు. బంగారుగడ్డలోని 44వ వార్డుకు సంబంధించిన ఓట్లను గెజిట్లో ప్రకటించిన డోర్నంబర్లకు చెందినవి కాకుండా సుమారుగా 450 ఓట్లను 48వ వార్డు (ఏడుకోట్లతండా)లో కలిపారు. ఈదులగూడెంలో ఉన్న 9వ వార్డులోని ఓట్లను పక్కనే ఉన్న కాలనీతో 440 ఓట్లను ఈదులగూడెంలోని కొంత భాగాన్ని 18వ వార్డుగా చేశారు. గాంధీనగర్లోని సుమారు 300 ఓట్లను పక్కన ఉన్న వార్డులోకి కాకుండా 18వ వార్డు (తాళ్లగడ్డ) లో కలిపారు. గతంలో 24వ వార్డుగా ఉన్న అశోక్నగర్ ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులలో కలపడం వల్ల పాత వార్డు లేకుండా పోయింది. రెడ్డికాలనీ నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులుగా విభజించారు. బాపూజీనగర్ కాలనీకి సంబంధించిన ఓట్లను ఇందిరమ్మ కాలనీకి సమీపంలో ఉన్నట్లుగా కలిపారు. 48వ వార్డుగా ఉన్న రామచంద్రగూడెంలో బాగ్యనగర్ కాలనీ ఓట్లు కలిపారు. తప్పుల తడకగా ఓటర్ల జాబితా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా మారింది. ఒకే కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేగా ఉండడం, భర్త ఓటు ఒక వార్డులో ఉంటే భార్య ఓటు మరో వార్డులో ఉండడం, వారి పిల్లల ఓట్లు ఇంకో వార్డులో నమోదై ఉండడంతో పాటు ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు కలిగి ఉండడం వంటి చమత్కారాలు చోటు చేసుకున్నాయి. తప్పుల తడకకగా రూపొందిçస్తున్న జాబితా కారణంగా ఓటు హక్కుకు దూరమవుతున్న వారు అనేక మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా వార్డును విభజించారు. 9 వార్డులు ఉన్న మున్సిపాలిటీని 12 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డులను పునర్విభజన చేశారని, ఓటర్ల ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని కాంగ్రెస్ నాయకులు హాలియా మున్సిపాలిటీ కమీషనర్ సమ్మద్కి వినతి ప్రతం అందజేశారు. హాలియాలోని రెడ్డికాలనీని 5వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 250 ఓట్లను 7వ వార్డులో కలిపారు. సాయిప్రతాప్నగర్ను 3వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 21 ఓట్లు 4వ వార్డు అయిన వీరయ్యనగర్, అంగడిబజార్లోకి కలిపారు. సాయి ప్రతాప్నగర్ 3వ వార్డులో ఉన్న వివిధ కుటుంబాలకు చెందిన 150 ఓట్లను వేర్వేరుగా 2వ వార్డులోని ఇబ్రహీంపేట, అలీనగర్లోకి కలిపారు. గోడుమడక బజారు, శాంతినగర్, గంగారెడ్డి నగర్ కలుపుతూ 9వ వార్డుగా విభజించారు. ఈ వార్డులో ఉన్న 70 ఓట్లను పక్కనే ఉన్న 7వ వార్డు వీరబ్రహేంద్రనగర్లోకి కలిపారు. నందికొండ (నాగార్జున సాగర్) మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న టీజీ జెన్కో, భాగ్యనగర్ కాలనీ, ఇ–1 టైప్, ఇ టైప్, బీ11టైప్, పీ టైప్ను కలుపుతూ 11వ వార్డుగా విభజించారు. మున్సి పాలిటీకి సంబంధం లేనటువంటి 50 ఓట్లను ఈ వార్డులోకి చేర్చారు. 11వార్డులోని జెన్కోకి సంబందించిన ఓట్లను 10వ వార్డులోకి చేర్చారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 20 వార్డులే ప్రస్తుతం ఉన్నాయి. ఒక్కో వార్డుకి 1050 నుంచి 1150లకుపైగా ఓట్లను విభజిస్తూ వార్డుల వారీగా జాబితాను ప్రకటించారు. గతంలో ఆయా వార్డుల్లో కుటుంబ సభ్యులందరి ఓట్లు నమోదు కాగా, ఇటీవల అధికారులు వెలువరించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఓట్ల బదలాయింపు జరిగింది. మరికొన్ని వార్డుల్లో మరణించిన వారి ఓట్లు నమోదు కాగా, ఇంకొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదై ఉన్నాయి. గతంలో అధికారులు ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టిన ఓటర్ల గణన పారదర్శకంగా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా వార్డుల్లో అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా ఉన్న ఓటర్లను నమోదు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్కో వార్డులో 10 నుంచి 20కి మందికిపైగా ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదవుతుండడంతో వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తాం ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి అభ్యంతరంపై ఇంటింటికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా చేస్తాం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా ఫైనల్ చేస్తాం. ఓటర్లు సామాజిక వర్గం గురించి తప్పుడు సామాచారం ఇచ్చినా.. దానిని విచారించి సరిచేస్తాం. – దేవ్సింగ్, మున్సిపల్ కమిషనర్ -
మున్సిపాలిటీలపై ‘కమలం’ కన్ను
సాక్షి, వికారాబాద్: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. గత పురపాలక ఎన్నికల్లో.. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కేవలం రెండు కౌన్సిలర్ స్థానాలకే పరిమితమై.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి పట్టణ ఓటర్లు, యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు వచ్చాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకుని మున్సిపాలిటీల్లో పాగా వేయాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మూడు ఎంపీ సీట్లు దక్కాయి. దీనికితోడు కేంద్రంలో కమలనాథులు అధికారంలోకి వచ్చారు. దీంతో ఆ పార్టీ ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గతంలోకన్నా ఎక్కువగా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించింది. జిల్లాలో ఇటీవల డీకే అరుణ పర్యటించి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వం ఓవైపు సభ్యత్వ నమోదు చేపడుతూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ త్వరలో జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో వీలైనన్ని ఎక్కువ వార్డుల్లో గెలవాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం ద్విముఖ వ్యూహంతో ముందుకువెళ్లాలని యోచిస్తోంది. వార్డుల్లో బలమైన నాయకులను గుర్తిస్తూనే మరోవైపు ఇతర పార్టీల్లో బలమైన నాయకులను గుర్తించి తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల కోసం ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్చార్జ్ను నియమించనుంది. రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు లేదా మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. రాబోయే వారం రోజుల్లో ఇన్చార్జ్ల నియామకం పూర్తి కానున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. అలాగే ఈనెల 14 లేదా 15వ తేదీన మున్సిపాలిటీల్లోని నాయకులు, కార్యకర్తలతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించనున్నారు. వ్యతిరేకత కలిసొచ్చేనా.. ప్రభుత్వ వ్యతిరేకత మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పాలనలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేయలేదని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తోంది. అలాగే యువ ఓటర్లపైనా ఆశలు పెట్టుకుంది. ఇటీవల బీజేపీ పట్ల యువత ఆకర్శితులు అవుతున్నారు. దీంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉన్న యువ ఓటర్లను టార్గెట్గా చేసుకుని ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు కాషాయ నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. -
మున్సిపల్ ఎన్నికల ముసాయిదా విడుదల
సాక్షి, ఆదిలాబాద్: కుల గణన, ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సిద్ధం చేస్తున్నారు. పుర ఎన్నికలకు సంబంధించి అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 13న మొత్తం అభ్యంతరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 14న తుది జాబితా ప్రకటిస్తారు. అనంతరం మున్సిపల్ అధికారులు వార్డుల రిజర్వేషన్లను ఈనెల 15న లేదా 16న ప్రకటించనున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వమే ప్రకటించనుంది. పెరగనున్న పోలింగ్ కేంద్రాలు.. గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 100 పోలింగ్ కేంద్రాలు ఉండగా, విలీనమైన గ్రామాల్లో 38 పోలింగ్ కేంద్రాలతో ఆ సంఖ్య 138కి చేరింది. ప్రస్తుతం ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 చొప్పున ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే దీంతో దాదాపు 152 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మూడు వార్డులకు ఒక ఎన్నికల అధికారి మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తి చేశారు. మూడు వార్డులకు కలిపి ఒక ఎన్నికల అధికారి, ఒక సహాయ ఎన్నికల అధికారిని నియమించనున్నారు. గెజిటెడ్ హోదా కలిగిన వారిని ఎన్నికల అధికారులుగా నియమించగా, నాన్గెజిటెడ్ వారికి సహాయకులుగా బాధ్యతలు అప్పగించారు. వార్డుల వారీగా నామపత్రాల స్వీకరణ, పరిశీలన, తదితర ప్రక్రియను సంబంధిత అధికారులే పర్యవేక్షించనున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా ఆ పెట్టెలను జిల్లా నుంచే తీసుకోనున్నారు. బ్యాలెట్ పత్రాలు మాత్రం ఇతర చోట్ల ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నోడల్ అధికారుల నియామకం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ అధికారులతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని నియమించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 10 మంది ఉన్నతాధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది నియామకం, బ్యాలెట్ పెట్టెల సేకరణ, పర్యవేక్షణ, రవాణా సౌకర్యం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల సామగ్రి తయారీ, నిర్వహణ, బ్యాలెట్పత్రాల తయారీ, ఎన్నికల ఖర్చుల వివరాలు పర్యవేక్షించడం, ఎన్నికల కసరత్తు పరిశీలన, మీడియా సమాచారం, సమన్వయ, సహాయ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ తదితర పనులు నిర్వహించే బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు. ఓటరు నమోదుకు అవకాశం.. మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు 18 ఏళ్ల వయస్సు గల వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాలో మున్సిపాలిటీలో 1,21,977 మంది ఓటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో కొత్తగా కొంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారని, మరికొంత మంది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, దీంతో ఓటర్ల సంఖ్య మరింతగా పెరగనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాజకీయ పార్టీల నేతలతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించనున్నారు. ముసాయిదాకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. -
‘బస్తీ’మే సవాల్
సాక్షి, మహబూబ్నగర్: ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో కులగణన.. వార్డుల పునర్విభజన పూర్తయిన నేపథ్యంలో ఆయా పురాల్లో పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అదనంగా కొత్తగా కొలువుదీరిన మరో తొమ్మిది మున్సిపాలిటీల పీఠాల కైవసం కోసం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నారు. గత ఎన్నికలకు ఈసారి జరగనున్న ఎన్నికలకు పాత మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరగడం.. అదనంగా కొత్తగా మరో తొమ్మిది మున్సిపాలిటీలు కొలువుదీరడం అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పాత మున్సిపాలిటీలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 2న కొత్తగా ఏర్పడిన అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్ మున్సిపాలిటీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా అచ్చంపేట మున్సిపాలిటీకి 2016 మార్చి 6న ఎన్నికలు జరగగా.. ఆ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉంది. ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్ గత ఆరు నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో గెలుపు ధీమా నింపుతున్నాయి. అసెంబ్లీ, పంచాయతీ, లోక్సభ.. ప్రాదేశిక ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్ధానాలు కైవలం చేసుకుని ఎదురులేని శక్తిగా అవతరించింది. ఇదే స్పూర్తితో ‘పుర’ ఫలితాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లందరూ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పట్టణ ప్రజలూ మళ్లీ తమనే ఆశీర్వదిస్తారనే ధీమాతో నేతలున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంతో పాటు పట్టణ సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను ప్రధాన అజెండాగా చేసుకుని ప్రచారం చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇదిలాఉండగా అధిష్టానం ఈసారి కొత్తగా ఏర్పడిన తొమ్మిది మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యతలు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకే అప్పగించింది. దీంతో వారు ఆయా పుర పీఠాల కైవసానికి యత్నాలు మొదలుపెట్టారు. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట వరుస ఓటములతో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనైనా అత్యధిక స్ధానాలు గెలుచుకుని ఉనికి కాపాడుకునే యత్నం చేస్తోంది. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో విశ్వాసం నింపడం ద్వారా పని చేసేవారికే టిక్కెట్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు పార్టీని పట్టణాల్లో బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సీనియర్లు పలువురు పార్టీని వీడి నాయకత్వలోపంతో ఉన్న ‘హస్తా’నికి చేయూతనిచ్చే వారు కరువయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత నాగర్కర్నూల్ లోక్సభ స్ధానం నుంచి పోటీ చేసిన మల్లు రవి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీచంద్రెడ్డి మాత్రం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలూ చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ఓటర్లను మచ్చిక ఎలా చేసుకుంటారోననే చర్చ జరుగుతోంది. బీజేపీలో బలమైన క్యాడర్ లోక్సభ ఎన్నికల సమయంలో అప్పటి సిట్టింగ్ ఎంపీ జితేందర్రెడ్డి, డి.కె.అరుణలతో పాటు పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకోవడంతో బీజేపీ క్యాడర్లో గెలుపు ధీమా పెరిగింది. లోక్సభ ఎన్నికల్లో కాస్త సత్తా చాటినా ప్రాదేశిక ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించని ఆ పార్టీ తమకు గ్రామాల కంటే పట్టణాల్లోనే బలమైన క్యాడర్ ఉందని భావిస్తోంది. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్నగర్, నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో ఈసారి గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ గెలుపును ప్రభావితం చేసే అంశాలపై ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇక ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన డి.కె.అరుణ తన సొంత ఇలాకా గద్వాల మున్సిపాలిటీలో ఎలాంటి చక్రం తిప్పుతారు? అక్కడ బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ను ఎలా ఢీ కొంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ మున్సిపాలిటీల్లో కాషాయ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందో వేచిచూడాలి. -
ఇక పరిషత్ పోరు షురూ!
సార్వత్రిక పోరు ముగిసింది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. పాలనలో తమ మార్కుచూపిస్తూ గెలిపించిన జనానికి న్యాయం చేస్తోంది. ఇప్పుడు స్థానిక పోరుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ సారీ విజయోత్సాహంతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదన రంగంలోకి దిగేందుకు పోటీపడుతుంటే... పరాజయ భారంతో జనానికి దూరమైన టీడీపీ ఈ సారి అభ్యర్థులకోసం అన్వేషణ మొదలుపెట్టింది. సీనియర్లు పోటీకి విముఖత చూపుతుంటే... కొత్తముఖాలతో ఉనికి చాటుకోవాలనే యోచనతో పార్టీ జిల్లా నాయకత్వం యోచిస్తోంది. సాక్షి, విజయనగరం : పంచాయతీరాజ్తో పాటు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలకు, నెల్లిమర్ల నగర పంచాయతీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. గత నెల 20న పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురించిన అధికారులు ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియను జూలై 3వ తేదీకల్లా పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో జూలై 4తో జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియనుంది. 920 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి కూడా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాననుసరించి మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తయారుచేస్తున్నారు. వాటిని జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శనకు కూడా ఉంచనున్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ నుంచి బరిలో దిగేందుకు సిట్టింగ్లు, సీనియర్లు వెనకంజ వేస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యం 1979లో ఏర్పడ్డ విజయనగరం జిల్లా పరిషత్లో ప్రస్తుతం 34 జెడ్పీటీసీ, 549 ఎంపీటీసీ స్థానా లున్నాయి. 2014 జూలై నెల 4వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. వీరి పదవీకాలం ఈ జూలై 4వ తేదీతో ముగియనుంది. గడిచిన ఈ ఐదేళ్ల కాలంలో జిల్లా పరిషత్కు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.21.71 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 18 కోట్లు, తాగునీటి పథకాల నిర్వహణకు రూ.21 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తం నిధులు ఖర్చయిపోయాయి. కానీ అభివృద్ధి ఎక్కడా కానరాలేదు. ఇక జిల్లా పరిషత్ పాలక వర్గంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని అధిక సంఖ్యలో అక్రమ డిప్యూటేషన్లు వేశారనేది వాటిలో ఒకటి. ఎంపీడీఓలుగా టీడీపీకి అనుకూలంగా ఉన్నవారిని నియమించారు. సొంత మండలానికి చెందిన వారిని అదే మండలం ఎంపీడీఓగా నియమించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా వ్యవహరించారు. రూ.40 లక్షలతో జిల్లా పరిషత్ చైర్మన్ నివాసగృహం ఒకటి కట్టించారు. శిక్షణ భవనం నిర్మించారు. అంతకు మించి చేసిందేమీ లేదు. నిస్తేజంలో టీడీపీ కేడర్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని విజయనగరం పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జిల్లా టీడీపీ దిక్కులేకుండా ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా భావించే కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు కూడా పార్టీని పట్టించుకోలేదు. బొబ్బిలి రాజైన రాష్ట్ర మాజీ మంత్రి సుజయ్కృష్ణ రంగారావు ఎన్నికల తర్వాత ఇంత వరకూ పార్టీ కేడర్ను కలవనే లేదు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన కురుపాం రాజు వైరిచర్ల కిశోర్చంద్రదేవ్ ఓటమి తర్వాత పత్తాలేకుండా పోయారు. మిగిలిన నియోజకవర్గాల్లోని పరాజిత నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లి భవిష్యత్ను చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు, జిల్లా పరిషత్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని జిల్లాలో నడిపించే నాథుడు లేకుండా పోయాడు. పార్టీ అధిష్టానం చెప్పడంతో కొందరు నేతలు కనీసం పోటీకి అభ్యర్థులనైనా చూడాలని భావించి వారి కోసం వెదుకుతున్నారు. సిట్టింగ్లు, సీనియర్లు వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు ఓటమి తప్పదని భయపడి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రాజకీయాల్లోకి కొత్తగా రావాలనుకుంటున్నావారిని, తొలిసారి పోటీలో నిలవాలనుకునేవారిని బరిలోకి దింపాలనుకుంటున్నారు. వారైతే ఓడిపోయినా పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదనేది సీనియర్ల ఆలోచన. ఇక వైఎస్సార్సీపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల విజయోత్సాహంతో స్థానిక పోరుకు సిద్థమవుతోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా క్లీన్ ఇమేజ్ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తోంది. మరోసారి ఆ పార్టీ జిల్లాలో విజయదుందుభి మోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఎమైనా జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు చేయాలి
-
తెలంగాణలో ముగిసిన తొలివిడత పరిషత్ పోలింగ్
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం
-
‘పరిషత్’ ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ జోరు
సాక్షి, హైదరాబాద్: తొలిదశ పరిషత్ ఎన్నికల ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ జోరు ప్రదర్శించింది. వివిధ జిల్లాల పరిధిలో ఏకగ్రీవమైన 69 ఎంపీటీసీల్లో టీఆర్ఎస్ 67, కాంగ్రెస్ 2 కైవసం చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు జెడ్పీటీసీ, నిజామాబాద్ జిల్లా మాక్లూరు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవగా వాటిని కూడా టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 96 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 10 స్థానాలు టీఆర్ఎస్ పక్షాన ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆరేసి ఎంపీటీసీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో చెరో ఎంపీటీసీ సీటును కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఈ నెల 6న (సోమవారం) మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా గత నెల 28న నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాక ఎక్కడెక్కడ ఒక్కో అభ్యర్థే మిగిలారన్న దానిపై స్పష్టత వచ్చింది. సాధారణంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఏదైనా స్థానంలో చెల్లుబాటయ్యే నామినేషన్ ఒక్కటే మిగిలితే సదరు అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. సీట్ల వేలం మొదలుకొని నామినేషన్లు వేయకుండా అభ్యర్థులకు బెదిరింపులు, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈ పరిణామాలతో ఏకగ్రీవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు నివేదికలు పంపించారు. వాటిని పూర్తిస్థాయిలో సమీక్షించాక ఏకగ్రీవాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్ణయం ప్రకటించారు. -
లోలక్ వార్
-
లోక వార్
-
నేడో రేపో సీఎల్పీ విలీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీన ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించిన 11 మంది ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ ఆదేశించింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించగానే మొత్తం 13 మంది సంతకాలు సేకరించి శాసనసభ స్పీకర్కు లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగే మే 6వ తేదీకి ముందే ఈ విలీన ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో 13 మంది ఎమ్మెల్యేలు కలిసి ఆ పార్టీని వీడి, మరో పార్టీలో చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సరదు పార్టీలో విలీనం చేసినట్లుగా గుర్తిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస మొదలైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పి.సబితారెడ్డి, హరిప్రియా నాయక్, కె.ఉపేందర్రెడ్డి, డి.సుధీర్రెరెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికకు ముహూర్తం ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.వారిద్దరూ చేరిన వెంటనే విలీన ప్రక్రియ పూర్తవుతుంది. నేడు గవర్నర్ వద్దకు కాంగ్రెస్... ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ వైఫల్యాలపై ఫిర్యాదు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేతలు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ నరసింహన్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నారు. -
ఏప్రిల్ 20న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
-
ఈ నెల 20లోపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
-
‘ఆమె’కే జెడ్పీ చాన్స్
సాక్షి,సిద్ధిపేట్: ఇంతకాలం ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న పలువురు కొత్త జిల్లా పరిషత్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 22 మండలాల్లో అక్కన్నపేట జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు ఎస్టీకి రిజర్వ్ చేశారు. బెజ్జంకి, కొమురవెల్లి, మిరుదొడ్డి, గజ్వేల్ ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన వాటిలో రాయప్రోలు, కొండపాక, వర్గల్, మర్కుక్, ములుగు, చేర్యాల బీసీలకు కేటాయించగా మిగిలిన 11 స్థానాలు జనరల్కు కేటాయించారు. జనరల్ స్థానాలతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ, జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలో దింపి జెడ్పీ చైర్పర్సన్ పదవికి పోటీ పడే అవకాశం ఉంది. 22 మండలాలతో ఏర్పడిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొంత భాగంతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పలు మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. అయితే జిల్లా పరిషత్ పీఠం కోసం ప్రాంతాల వారిగా కూడా పోటీ పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సతులను పోటీలో దింపనున్న పతులు జిల్లా పరిషత్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇప్పటికే ఆ స్థానం కోసం పోటీ పడుతున్న నాయకులు తమ సతులను పోటీలో దింపేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్తోపాటు వివిధ పార్టీల నుండి టికెట్ ఆశించి భంగపడిన నాయకులు, ఓటమి పాలైన నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందుగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండగా.. జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్ల ఆధారంగా ఏ మండలం నుండి తమ సతులను లేదా కుటుంబ సభ్యులను పోటీలో దింపితే బాగుంటుందనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తగ్గక ముందే పార్లమెంట్, ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో మరోసారి జిల్లాలోని పల్లెలు హోరెత్తనున్నాయి. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా.. మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీ 1 అక్కన్నపేట ఎస్టీ(మహిళ) ఎస్టీ( మహిళ) 2 బెజ్జంకి ఎస్సీ(మహిళ) ఎస్సీ( జనరల్) 3 గజ్వేల్ ఎస్సీ(జనరల్) ఎస్సీ(మహిళ) 4 కొమురవెల్లి ఎస్సీ(జనరల్) ఎస్సీ( మహిళ) 5 మిరుదొడ్డి ఎస్సీ(మహిళ) ఎస్సీ(జనరల్) 6 రాయప్రోలు బీసీ(జనరల్) బీసీ( జనరల్) 7 కొండపాక బీసీ(మహిళ) బీసీ(మహిళ) 8 వర్గల్ బీసీ( జనరల్) బీసీ(మహిళ) 9 మర్కూక్ బీసీ(మహిళ) బీసీ(జనరల్) 10 ములుగు బీసీ(మహిళ) బీసీ(మహిళ) 11 చేర్యాల బీసీ(జనరల్) బీసీ( జనరల్) 12 జగదేవ్పూర్ అన్రిజర్వుడ్ అన్రిజర్వుడ్ 13 చిన్నకోడూర్ అన్రిజర్వుడ్(మహిళ) అన్రిజర్వుడ్ 14 నంగునూరు అన్రిజర్వుడ్(మహిళ) అన్రిజర్వుడ్(మహిళ) 15 తొగుట అన్రిజర్వుడ్ అన్రిజర్వుడ్(మహిళ) 16 సిద్దిపేటఅర్బన్ అన్రిజర్వుడ్(మహిళ) అన్రిజర్వుడ్(మహిళ) 17 సిద్దిపేట రూరల్ అన్రిజర్వుడ్ అన్రిజర్వుడ్ 18 కోహెడ అన్రిజర్వుడ్(మహిళ) అన్రిజర్వుడ్(మహిళ) 19 దుబ్బాక అన్రిజర్వుడ్ అన్రిజర్వుడ్ 20 దౌల్తాబాద్ అన్రిజర్వుడ్(మహిళ) అన్రిజర్వుడ్(మహిళ) 21 మద్దూరు అన్రిజర్వుడ్ అన్రిజర్వుడ్ 22 హుస్నాబాద్ అన్రిజర్వుడ్ అన్రిజర్వుడ్(మహిళ) -
‘పుర’లో కుల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. వచ్చే జూలైతో పాలకవర్గాల గడువు ముగియనున్న మునిసిపాలిటీలతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పడిన 71 మునిసిపాలిటీలతో సహా మొత్తం 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన వాటిలో వార్డుల పునర్విభజన చేపట్టిన పురపాలక శాఖ..తాజాగా పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బీసీ ఓటర్ల గుర్తింపునకు పురపాలక శాఖ ఆదేశించగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను మాత్రం 76 మునిసిపాలిటీల్లో గుర్తించాలంది. వాటిల్లో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాలు జనవరి 9న ప్రకటించనున్నారు. అన్నీ జనవరి 10న కులాల వారీగా ఓటర్ల జాబితాలను పురపాలక శాఖకు సమర్పించాల్సి ఉండనుంది. 19 రోజుల షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించి ఓటర్ల గణన పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయడంలో కులాల వారీగా ఓటర్ల గుర్తింపు కీలకం కానుంది. 2011 జనాభా గణాంకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల దామాషా లెక్కలను పరిగణనలోకి తీసుకుని మునిసిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్/మేయర్, కౌన్సిలర్/కార్పొరేటర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.