lyricist
-
విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ చనిపోయారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాంగ్ రైటర్గా ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు. ఇప్పుడు ఇలా దయనీయ స్థితిలో మృత్యు ఒడికి చేరారు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్పై పోలీసు కేసు)వైజాగ్కి చెందిన కులశేఖర్.. హైదరాబాద్లో తొలుత జర్నలిస్టుగా చేశారు. తర్వాత గీత రచయిత అయ్యారు. అలా 'చిత్రం', ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం, సైనికుడు లాంటి మంచి సినిమాల్లో పాటలు రాశారు. తర్వాత ఈయన కెరీర్ డౌన్ ఫాల్ అయింది. దీంతో మానసికంగా చాలా కుంగిపోయారు. దొంగతనాల వల్ల పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు.గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాలు చేయలేదు. ఇంటర్వ్యూల్లోనూ కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన చనిపోయారని తెలిసి పలువురు సినీ ప్రముఖు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్) -
కొత్త బిజినెస్.. ఫ్రెండ్కు అప్పజెప్పిన నటుడు.. అంతేకాదు!
సినిమా రంగంలో నిజమైన మిత్రులు కొందరే ఉంటారు. నటుడు గంజాకరుప్పు, గీత రచయిత జయంకొండాన్ ఆ కోవలోకే వస్తారు. గంజాకరుప్పు ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు, కథానాయకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. 20 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్ గీత రచయిత జయంకొండాన్.. వేటప్పన్, ఇంద్రసేనా, ఓడుం మేఘంగళ్, ఒరు సంధిప్పిల్, సొక్కు సుందరం తదితర చిత్రాలకు పాటలను రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు గేయరచయితగా పని చేస్తున్న ఈయన స్థానిక కేకే.నగర్లో కవింజర్ కిచెన్ పేరుతో హోటల్ నడుపుతున్నారు. గంజాకరుప్పు, జయంకొండాన్లు 20 ఏళ్లుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఫ్రెండ్కు పెళ్లి చేసే బాధ్యత కూడా! తాజాగా గంజాకరుప్పు త్వరలో ఊరంపాక్కమ్లో ప్రారంభించనున్న హోటల్ నిర్వహణ బాధ్యతలను గీత రచయిత జయంకొండాన్కు అప్పగించనున్నారు. అంతేకాదు ఇంకా అవివాహితుడిగా ఉన్న తన మిత్రుడికి పెళ్లి చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఇందుకోసం డాక్టర్ చదివిన యువతిని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో స్నేహమంటే వీరిదే.. అని కోలీవుడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. కాగా నటుడు గంజాకరుప్పు భార్య కూడా వైద్యురాలు అన్న విషయం తెలిసిందే. చదవండి: ముగ్గురు కుమార్తెలతో భారమైన జీవితం.. లారెన్స్ సాయం.. వీడియో వైరల్ -
'అమ్మాయిలు చప్పట్లు కొడుతుంటే బయటకొచ్చేశా'.. యానిమల్ చిత్రంపై తీవ్ర విమర్శలు..!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. స్వానంద్ కిర్కిరే తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది. యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. शांतराम की - औरत , गुरुदुत्त की - साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की - अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा — Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023 Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes.... now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI — Animal The Film (@AnimalTheFilm) December 6, 2023 -
'నాటు నాటు' రచయిత చంద్రబోస్ గ్రామంలో సంబరాలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ భారత చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీతరచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందనగానే గ్రామస్తులు బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. -
నన్ను లైంగికంగా వేధించారు, కోలుకోలేకపోయా: బాలీవుడ్ నటుడు
సినీరచయిత, సింగర్, నటుడు పీయూశ్ మిశ్రా చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాడు. 7వ తరగతిలోనే తన బంధువొకరు లైంగికంగా వేధించిందని పేర్కొన్నాడు. తుమ్హారీ అక్కత్ క్యా హై పీయూశ్ మిశ్రా అనే ఆటోబయోగ్రఫీ పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచాడు. ఇదే విషయం గురించి నటుడు మీడియాతో మాట్లాడుతూ.. 'శృంగారం అనేది ఆరోగ్యకరమైన విషయం. కానీ అది అభ్యంతరకరంగా, అయిష్టంగా ఉంటే మాత్రం దాని నుంచి కోలుకోవడానికి జీవితమే సరిపోదు. జీవితాంతం మాయని మచ్చలా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏడవ తరగతిలోనే మహిళా బంధువొకరు నన్ను లైంగికంగా వేధించింది. తనే కాదు, మరికొందరి పేర్లను కూడా నేను గుట్టుచప్పుడుగానే ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వారిలో కొందరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు. కాబట్టి ఈ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకోలేను' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పీయూశ్ మిశ్రా గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, మఖ్బూల్, తమాషా వంటి చిత్రాల్లో నటించాడు. బాల్లిమారన్ అనే మ్యూజిక్ బ్యాండ్లో తను పాటలు రాసి వాటిని తనే స్వయంగా ఆలపించాడు. -
వివాదంలో చిక్కుకున్న ప్రముఖ రచయిత.. ఎస్పీకి ఫిర్యాదు
సినీ రచయిత అనంత శ్రీరామ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సదరు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం ఇప్పటికే నిషేదించగా భట్రాజులను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆ కులస్తులు మండిపడుతున్నారు. నిషేధిత పదాన్ని ఉపయోగించినందున అనంత శ్రీరామ్పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అనంత శ్రీరామ్ సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. -
ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సినీ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయనకు ఏడేళ్ల క్రితం సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సింగర్ ముజాబా అజీజ్ తెలిపారు. బాలీవుడ్ సినిమాలు కైట్స్, క్రిష్, బాజీరావ్ మస్తానీ, కాబిల్ వంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. -
ఘంటసాల తెలుగు పాట చిరునామా మాత్రమే కాదు పాటల సౌధానికి పునాది: అనంత్ శ్రీరామ్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా.. మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారమైందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా బాల రెడ్డి ఇందూర్తి శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలుగు పాటకి చిరునామె కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని కీర్తించారు. ఘంటసాలతోనే తెలుగు పాట ప్రపంచవ్యాప్తమైందన్నారు. అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందొ తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందన్నారు. పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యిందని తెలిపారు. నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.. ఘంటసాల గారి పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యం లోని భావం అర్ధం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్ధంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కరించబడింది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. శత గళార్చన నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో తన బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల ఘంటసాల పాటల ద్వారా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొన్నారు. శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు. శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా "ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, గేయ రచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు. శత గళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గీత రచయిత కపిలన్ కుమార్తె ఆత్మహత్య.. సీఎం పరామర్శ
సినీ గీత రచయిత కపిలన్ కూతురు తూరిగై(26) శుక్రవారం సాయంత్రం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక అరుణ్పాక్కంలో నివసిస్తున్న ఈమె కథా రచయిత, సినీ కాసూ్టమ్స్ డిజైనర్గా పని చేస్తోంది. బీయింగ్ ఉమెన్ మ్యాగజైన్ పేరుతో పత్రికను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తూరిగై ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సాలిగ్రామంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అరుంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం తూరిగై మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ ఫోన్లో కపిలన్ను పరామర్శించారు. చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత) -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్పై లీగల్గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
ఎన్నో పాటలు రాశా, కానీ ఒక్క అవార్డు రాలేదు: జొన్నవిత్తుల
భక్తి పాటలు రాయడంలో ఘనుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అంతేనా సందర్భం ఏదైనా సరే దానిమీద అప్పటికప్పుడు పేరడీ పాట రాసి వినిపించగలడు. అంతటి గొప్ప టాలెంట్ ఆయన సొంతం. కానీ ఇంతవరకు తననెవరూ పురస్కారంతో సత్కరించలేదంటున్నాడు జొన్నవిత్తుల. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'వేటూరి, సిరివెన్నెల సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాకో సినిమా ఇచ్చి మొత్తం పాటలు నన్నే రాయమన్నారు. అదే ఆయన నాకు చేసిన మహా ఉపకారం. దేవుడి పాటలు ఎక్కువ రాసే నేను విక్రమార్కుడిలో జింతాత్త జిత్త జిత్త పాట రాశాను. తిట్ల మీద కూడా పాట రాశాను. నేను ఎన్నో పాటలు రాశాను. ప్రతి ఛానల్లో, ప్రతి గుడిలో అందరి బంధువయ, జగదానందకార, మహా కనకదుర్గ.. విజయ కనకదుర్గ, జయజయ శుభకర వినాయక, అయ్యప్ప దేవాయ నమహ.. వంటి ఎన్నో సాంగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. అది నాకు చాలా సంతోషం, కానీ నాకింతవరకు ఏ అవార్డూ రాలేదు' అని చెప్పుకొచ్చాడు జొన్నవిత్తుల. చదవండి: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన డైరెక్టర్ నేను మారిపోయాను, చాలా సంతోషంగా ఉన్నా: నాగచైతన్య -
అక్షర యోధుడు అదృష్టదీపుడు
అతను ‘ఎర్రజెండా నా ఎజెండా’ అని నినదించిన నిబద్ధత గల అభ్యుదయ కవి. సినిమా పాటకు కొత్త బాట వేసిన గేయకవి. నటుడు, గాయకుడు, ఉత్తమ ఉపన్యాసకుడు. చాలామందికి తెలియని అతని పూర్తి పేరు – సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి. విద్యార్థి దశలోనే శ్రీశ్రీని అభిమానించిన దీపక్ శ్రీశ్రీ గేయాలను సభల్లోనూ, సమావేశాల్లోనూ వీరావేశంతో ఆలపించేవాడు. ‘అరసం’, ప్రజా నాట్యమండలి వంటి సంస్థలలో క్రియాశీల పాత్ర పోషించాడు. ‘కోకిలమ్మ పదాలు’తో కలంపట్టిన దీపక్... ‘అగ్ని’, ‘ప్రాణం’, ‘అడవి’ కవితా సంపుటాలనూ, ‘దీపక రాగం’ సాహిత్య వ్యాస సంపుటినీ వెలువరించాడు. అతని కుటుంబ సభ్యులు ప్రచురించిన ‘దీపం’ వ్యాస సంకలనం, అభిమానులు ప్రచురించిన ‘తెరచిన పుస్తకం’ జీవిత చరమాంకంలో వెలుగుచూసిన కానుకలు! ‘సాక్షి’ ఫన్డేలో ‘పదశోధన’ పేరుతో 640 వారాలుగా నిర్వహించిన పదబంధ ప్రహేళిక శీర్షిక తెలుగు భాష మీద దీపక్కు ఉన్న పట్టుకు నిదర్శనం. ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు ‘ప్రాణం’ చదివి ముగ్ధుడై ‘యువతరం కదిలింది’ (1980)లో పాటలు రాయమని పిలవడంతో అయాచితంగా అదృష్ట దీపక్ సినీ రంగంలో అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ అంటూ దీపక్ రాసిన పాట రెండు దశాబ్దాల పాటు నలభై సినిమా పాటల వరకు రాయడానికి దారి దీపమైంది. (చదవండి: శతతంత్రుల మాంత్రికుడు) ‘నేటి భారతం’ చిత్రం కోసం రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం...’ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ‘ఎర్రమల్లెలు’ చిత్రం కోసం రాసిన ‘మేడే’ గీతం నేటికీ ఆ రోజున మారుమోగుతూనే ఉంది. తను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా చవకబారు పాటల్ని రాయడానికి ఇష్టపడక పోవడంవల్ల ‘నేను సైతం’ (2004) చిత్రం తర్వాత అతను చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ‘అక్షరాలే వేళ అగ్ని విరజిమ్మాలి’ అంటూ యువతరాన్ని ఉత్తేజపరిచిన అదృష్ట దీపక్ చిరస్మరణీయుడు. (చదవండి: కైఫియత్తులే ఇంటిపేరుగా...) – డాక్టర్ పైడిపాల, సినీ పరిశోధకుడు (మే 16న అదృష్ట దీపక్ ప్రథమ వర్ధంతి) -
విషాదం: ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ కన్నుమూత
ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్(82)ఇక లేరు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు ఆమె తనయుడు అజయ్ తెలిపారు. 'బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించింది. చికిత్స తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. అయితే గురువారం గుండెపోటు రావడంతో అమ్మ చనిపోయింది' అంటూ అజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మాయా గోవింద్ సుమారు 350 సినిమాలకు పనిచేశారు. ‘ఆంఖో మే బేస్ హో తుమ్’,‘మై ఖిలాడీ తూ అనారీ’,‘ మోర్ ఘటర్ ఆయే సజన్వా, గుటుర్ గుటుర్ వంటి ఎన్నో పాపులర్ పాటలను రాశారు. కాగా మాయా గోవింద్ మృతి పట్ల బీ టౌన్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాయా గోవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. -
‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతిపట్ల చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కందికొండ కుటుంబానికి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ముందు కందికొండ యాదగిరి చిత్రపురి కాలనీలో నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారని, అనారోగ్యం పాలైన తర్వాత ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నాలుగు లక్షలు వెనక్కి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం) అయితే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కందికొండ కుటుంబానికి 20 లక్షల రూపాయలు విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని అందజేయడం జరిగిందని అన్నారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత తండ్రి అనారోగ్యం దృష్ట్యా సింగిల్ బెడ్ రూమ్ తమకు సరిపోవడం లేదని కందికొండ కుమార్తె తమ దృష్టికి తీసుకురావడంతో అది మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. మంత్రివర్యులు కూడా ఆ విషయం మీద సానుకూలంగా స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి అంగీకరించారని వారి కుమార్తెను సమయం చూసుకుని వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. కందికొండ కుటుంబానికి ముందు సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చామని డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామని ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం
Popular Lyricist Kandikonda Yadagiri Passed Away His Life Journey: ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 2012లో ఆయనకు తొలిసారిగా కేన్సర్ నిర్ధారణ అయింది. అప్పట్లోనే సర్జరీ చేయించారు. 2019లో కేన్సర్ తిరగబెట్టడంతో చికిత్సలో భాగంగా చేసిన కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి కందికొండ పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. నోటమాట కూడా రాలేదు. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కందికొండ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, కళాభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింఛాంబర్కు తరలించనున్నారు. కందికొండకు భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు (మార్చి 13) మహాప్రస్థానంలో జరగనున్నాయి. చదువుకునే రోజుల్లోనే.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మలకు కందికొండ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతూర్లో, హైస్కూల్ చదువు నర్సంపేటలో కొనసాగించారు. మానుకోటలో ఇంటర్ పూర్తి చేసి, మహబూబా బాద్లో డిగ్రీ పూర్తి చేశారాయన. ఇంటర్ సెకండియర్లో చక్రి (దివంగత సంగీత దర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఇంటర్లో ఉన్నప్పడు పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్నారు కందికొండ. 1997– 98లో మిస్టర్ బాడీ బిల్డర్గానూ గెలిచారు కందికొండ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యం, సినిమాల పట్ల కందికొండకు ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది. ఇప్పటివరకు కందికొండ పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు.. చక్రి సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో గేయరచయితగా కందికొండ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో ‘మళ్లీ కూయవే గువ్వా’ పాట రాశారు. ‘ఇడియట్’ చిత్రంలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘పోకిరి’లో ‘జగడమే..’, ‘గలగల పారుతున్న గోదారిలా..’, ‘టెంపర్’ చిత్రంలో ‘వన్ మోర్ టైమ్’.. 'లవ్లీ'లో 'లవ్లీ లవ్లీ'.. ఇలా ఎన్నో హిట్ పాటలు కందికొండ కలం నుంచి వచ్చినవే. అలాగే 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాకా శ్రీకాంత్ నటించిన 'కోతలరాయుడు' చిత్రంలో ఒక పాట రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి. అలాగే 2018లో తెలంగాణ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కందికొండ రాసిన ‘వచ్చాడు వచ్చాడు ఒక లీడర్’, 2019లో సంక్రాంతి సందర్భంగా రాసిన పాటలు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి. ఇరవై రోజుల క్రితం నాగుర్లపల్లికి వెళ్లిన కందికొండ తన తల్లిదండ్రులు ఉంటున్న పెంకుటిల్లును తనివి తీరా చూశారట. ‘కన్న కొడుకు మాకన్నా ముందే ఈ ప్రపంచానికి దూరం అవుతాడని అనుకోలేదు’ అని కందికొండ తల్లిదండ్రులు విలపించడం స్థానికుల కళ్లు చెమర్చేలా చేసింది. కందికొండ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత
-
మూగబోయిన కందికొండ గుండె సవ్వడి
-
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆసుపత్రి ఖర్చులు భారీగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సాయం చేశారు. కాగా కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. ఆయన చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వా' పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నారు. కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు రాశారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు ప్రతి గ్రామంలోనూ మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయడంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు. చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు లేటెస్ట్ ఫొటో చూసి షాకవుతున్న ఫ్యాన్స్! -
Arabic Kuthu: అసలు ఆ పాటను ఎలా రాశాడబ్బా?
Vijay Beast Arabic Kuthu Song Lyricist Details: గంటలో మిలియన్న్నర వ్యూస్.. అంతే రేంజ్లో లైక్స్. సినిమా వాళ్లంటే పడిచచ్చే తమిళ తంబీలు, విజయ్ ఫ్యాన్స్ హోల్సేల్గా బీస్ట్ ‘అరబిక్ కుతు’ సాంగ్ పాటకి ఫిదా అయిపోతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విజయ్ స్టైలిష్ స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. బీస్ట్ సినిమా కోసం సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్, స్టైలిష్ స్టెప్పులు కంపోజ్ చేసిన జానీ మాస్టర్కు మాత్రమే కాదు.. పాట రాసిన హీరో శివకార్తికేయన్కే మేజర్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు విజయ్ అభిమానులు. యస్.. టీవీ నటుడి నుంచి కష్టపడి నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. ఇండస్ట్రీలో ఇగో లేని హీరోగా అతనికి పేరుంది. అందుకే అతడంటే కోలీవుడ్లో మాత్రమే కాదు.. మిగతా భాషల్లోనూ అతనికి అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో హీరోగా, ప్రొడ్యూసర్గా, నిర్మాతగా, సింగర్గా.. గేయ రచయితగానూ తన టాలెంట్ను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు కొలమావు కోకిల కోసం యోగిబాబు ‘కళ్యాణ వయసు’ సాంగ్, డాక్టర్ కోసం ‘చెల్లమ్మ, సో బేబీ’, సూర్య Etharkkum Thunindhavan కోసం ‘సుమ్మ సుర్రును’ లాంటి హిట్ సాంగ్స్ రాశాడు. ఇప్పుడు బీస్ట్ కోసం అరబిక్ టచ్తో అరబిక్ కుతు సాంగ్ అందించాడు. నిజానికి ఈ పాట షార్ట్ టైంలో ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్ ఇచ్చిన అరబిక్ టచ్. ఇందుకోసం తానేమీ అరబిక్ను అవపోసన, బట్టీ పట్టలేదని అంటున్నాడు శివకార్తికేయన్. తాజాగా ఓ మీడియా బైట్లో మాట్లాడుతూ.. జస్ట్.. అరబిక్ హమ్మింగ్ పదాలను సేకరించి.. వాటికి తమిళ పదాలు మేళవించి రాశానని చెప్పాడు. అలా అరబిక్ కుతుకు తన పని తేలికయ్యిందని అంటున్నాడు శివకార్తికేయన్. ఇక ఈ సాంగ్కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సాంగ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ను సినీ గేయ రచయిత, దివంగత న ముత్తుకుమార్(ఎన్నో అర్థవంతమైన పాటల్ని రాసిన ముత్తుకుమార్.. 2016లో జాండిస్తో చనిపోయారు) కుటుంబానికి అందజేసి మంచి మనసు చాటుకున్నాడు నటుడు శివకార్తికేయన్. దీంతో సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషన్ నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్షన్లో రాబోతున్న బీస్ట్.. ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ పాడిన అరబిక్ కుతు సాంగ్పై మీరూ ఓ లుక్కేయండి మరి. సాంగ్ హిట్ను సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలుగు మీమ్స్ పేజీలు ఈ సాంగ్ లిరిక్స్లోని పదాలతో ట్రోలింగ్ చేస్తూ నవ్వులు పంచుతున్నారు. -
'నేను సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది'
భక్తి చిత్రాల రచయితగా జేకే భారవి ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలు తీసిన ఆయన ఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కెరీర్లో ఎన్నో కార్లు చూసిన నేను ఇప్పుడు బైక్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా ఒకే ఒక్క సినిమా జగద్గురు ఆదిశంకరతో పోయింది. తెలుగు, కన్నడ భాషల్లో నా కథలు ఓకే అయ్యాయి. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోంది. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే నాగార్జున నాకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ చేయి చాచి అడగడం నాకిష్టముండదు అని చెప్పుకొచ్చారు. -
సిరివెన్నెల చివరి కోరిక ఏంటో తెలుసా?
తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ఏకాకి జీవితం నాది అంటూ నిష్క్రమించిన ఈ మహనీయుడికి ఓ కోరిక ఉండేదట! తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడాలని సిరివెన్నెల ఎంతగానో ఆశపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం దర్శకుడు తేజ తెరకెక్కించిన 'కేక' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. తర్వాత 'ఎవడు' సినిమాలో విలన్గా, అనంతరం 'ఫిదా'లో వరుణ్తేజ్ అన్నయ్యగా నటించాడు. కొన్ని మంచి పాత్రలే దక్కినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. దీంతో తన కొడుకు కెరీర్ విషయంలో సిరివెన్నెల మదనపడ్డారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రాజా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే సిరివెన్నెల ఆత్మకి శాంతి చేకూరుతుందని, అది జరగాలని ఆయన అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. -
కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం
కళావెన్నెల విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాలగారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్న (విశ్వనాథ్ని సిరివెన్నెల అలానే పిలిచేవారు)గారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్మెంట్గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వేరే రచయిత కోసం వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. మీ శిష్యుడు రాత్రిపూట పాటలు రాయడం గురించి? సిరివెన్నెల: మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. ఇది చదవండి: సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. 'ట్రెండింగ్ సెర్చ్' ట్వీట్ -
సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ..
సాక్షి, విజయనగరం: సప్తస్వర మాంత్రికుడు ఇకలేరన్న విషయం సాహితీలోకానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. విద్యలనగరమైన విజయనగరం వచ్చినప్పుడల్లా సాంస్కృతిక నగరంలో అడుగుపెట్టడం తన అదృష్టమంటూనే మాటలను ప్రారంభించేవారు. గురజాడ నడయాడిన నేలపై, వందల ఏళ్లనాటి చరిత్ర కలిగిన సంగీత, నృత్య కళాశాలలో విద్యనేర్చుకున్న ఘంటసాల, సుశీలమ్మలను గుర్తుచేసుకుంటూనే తన ప్రసంగాన్ని జిల్లా వాసులకు అందించేవారు. ఆయన సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అటువంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం విజయనగర సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. యాదృచ్ఛికంగా మహాకవి వర్ధంతిరోజునే పాటలబాటసారి అస్తమయం కావడం సాహిత్యలోకాన్ని విషాదంలో ముంచింది. విజయనగరమంటే అమితమైన ప్రేమ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెలకు విద్యలనగరమైన విజయనగరమంటే ఎంతో ఇష్టం. సరిగ్గా నేటికి మూడేళ్ల కిందట 2018లో గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో దర్శకులు క్రిష్కు గురజాడ పురస్కారాన్ని సమర్పించే సందర్భంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రధానవక్తగా పాల్గొని అద్భుతమైన ప్రసంగంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. 2017లో ఎస్.కన్వెన్షన్లో జరిగిన రోటరీ 60 వసంతాల వేడుకలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. బాధాకరం సాహితీ సౌరభం నేలరాలింది. ఆయన రచనలు అజరామరం. ఏ నోట విన్నా ఆయన రాసిన పాటలే. మంచి మనిషిగా, పాటల మాంత్రికునిగా పేరుగాంచి ఎన్నో అవార్డులు పొందిన వెన్నెల అస్తమయం అయిందన్న విషయం బాధాకరం. ఆయన కుమార్తె వివాహానికి విజయనగరంలో పరిచయమున్న బుచ్చిబాబు, ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, అశోక్ మందాకిని, గంటి మురళీ తదితరులను స్వయంగా ఆహ్వానించారు. గురజాడ సమాఖ్య తరఫున ఆయనకు అంజలిఘటిస్తున్నాం. – కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య,విజయనగరం -
సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు
Sirivennela Sitaramasastry Popular Hit Songs: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయన న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రీ. ఆయన 'సిరివెన్నెల' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 'సిరివెన్నెల' చిత్రంలోని 'విధాత తలపున ప్రభవించినది' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో 'సిరివెన్నెల సీతారామశాస్త్రీ'గా స్థానం సంపాదించి పెట్టంది. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది. మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కే. విశ్వనాథ్కు పరిచయం చేశారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే పాట, 'లలిత ప్రియ కమలం విరిసినదీ' అనే పాటలను అద్భుతంగా రాసారు. 'లలిత ప్రియ కమలం' పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన 'అర్ధ శతాబ్దపు' పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా సీతారామ శాస్త్రీ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన 'దోస్తీ' పాటతో కూడా అలరించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ. ఎన్నో వేల అద్భుత గేయాలు అందించి సంగీత ప్రపంచంలో జో కొట్టిన ఆయనకు నివాళిగా ఆ ఆణిముత్యాలు మీకోసం. 1. విధాత తలపున ప్రభవించినది (సిరివెన్నెల) 2. పారాహుషార్ (స్వయంకృషి) 3. నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ) 4. తరలిరాద తనే వసంతం (రుద్రవీణ) 5. ఘల్లు ఘల్లు (స్వర్ణకమలం) 6. బోటనీ పాఠముంది (శివ) 7. కొత్త కొత్తగా ఉన్నది (కూలీ నెం 1) 8. చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు) 9. జాము రాతిరి జాబిలమ్మ (క్షణక్షణం) 10. వారేవా ఏమీ ఫేసు (మనీ) 11. నిగ్గ దీసి అడుగు (గాయం) 12. అమ్మ బ్రహ్మ దేవుడో (గోవిందా గోవిందా) 13. చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం) 14. తెలుసా మనసా (క్రిమినల్) 15. హైలెస్సో హైలెస్స (శుభసంకల్పం) 16. అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్రబంధం) 17. అర్ధ శతాబ్దపు (సింధూరం) 18. జగమంత కుటుంబం నాది (చక్రం) 19. సామజ వరగమన (అల వైకుంఠపురములో) 20. దోస్తీ (ఆర్ఆర్ఆర్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే
సాక్షి, హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త టాలీవుడ్ పెద్దలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. సుదీర్ఘ కరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి సిరివెన్నెలను తలుచుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయన ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు అజరామరమే. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు. ముఖ్యంగా గాయం మూవీలో నిగ్గు దీసి అడుగు అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ తాత్వికతను ప్రదర్శించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు అంకురం : ఎవరో ఒకరు ఎపుడో అపుడు శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ మహర్షి - సాహసం నా పథం రుద్రవీణ - తరలిరాదా తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయినీ కూలీ నెం:1 - కొత్త కొత్తగా ఉన్నదీ రౌడీ అల్లుడు - చిలుకా క్షేమమా క్రిమినల్ - తెలుసా మనసా పెళ్లి - జాబిలమ్మ నీకు అంత కోపమా మురారి మూవీలో అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి పాటతోపాటు, ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా...కిందకొచ్చి నీలా మారిందా’ అనే భావుకత. ‘జామురాతిరి..జాబిలమ్మా...’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ అలవైకుంఠపురంలో ‘సామజవరగమన పాటలు పెద్ద సంచలనం. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చుక్కల్లారా.. చూపుల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’?
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ జగత్తంతా సిరివెన్నెల పరచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మనకిక లేరు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న కారణజన్ముడు ఆయన. న్యూమోనియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తిరిగి రాని లోకానికి తరలి పోయారు. దీంతో త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి చేరుకుంటారన్న కోట్లాదిమంది ఆశలు అడియాశలయ్యాయి. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 — dev katta (@devakatta) November 30, 2021 విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు చెంబోలు సీతారామ శాస్త్రి. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల మూవీలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ‘ఆది భిక్షువు’ పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ‘బూడిదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అన్నా అది ఆయనకే చెల్లు. స్వయం కృషి, స్వర్ణ కమలం, సంసారం, ఒక చదరంగం, శ్రుతిలయలు, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలలో అనేక పాటలకు మాటలు రాశారు. 1986, 1987, 1988లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న ఘనత ఆయన సొంతం. స్వరకల్పన, అన్న తమ్ముడు, ఇంద్రుడు చంద్రుడు, అల్లుడుగారు, అంతం ,రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు తన పాటతో ప్రాణం పోశారు. ఆ తర్వాతికాలంలో క్షణ క్షణం, స్వాతి కిరణం, మురారి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ఎలా చెప్పను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శుభలగ్నం, చక్రం, కృష్ణం వందే జగద్గురుం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. ప్రేమ అయినా, విరహమైనా, దేశభక్తిఅయినా, విప్లవ గీతమైనా ఆయన పాట చెరగని ముద్ర. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. ప్రతీ పదమూ హృదయాన్ని తాకేదే. అలనాటి దిగ్గజ రైటర్స్ వేటూరి, ఆత్రేయతో పాటు టాలీవుడ్లో గొప్ప గేయ రచయితగా తన పేరును సార్థకం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, రామ జోగయ్య శాస్త్రి వంటి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటుడు, గాయకుడు కూడా. కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్.. కొక్కొరోకో..’ అంటూ సినీ అభిమానులను నిద్ర లేపిన ఆయన గళం మూగబోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Sirivennela Sitarama Sastry: టాలీవుడ్ ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లిదండ్రులకు అంకితం
సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ డాక్టరేట్ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించిన కాలిఫోర్నియాకు చెందిన ‘న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ’ వారు డాక్టరేట్ అందించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సాయిమాధవ్ గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ‘ఈ పురస్కారాన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ చేసి భర్తను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ పాటల రచయిత కాటికె లక్ష్మణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్తో పాటు రామ్ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్లక్ష్మణ్గా పేర్కొంటారు. రామ్ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్ లక్ష్మణ్ హైదరాబాద్కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్తో సోషల్ మీడియానే ట్రెండింగ్లోకి వచ్చింది. చదవండి: ఒక్క డ్యాన్స్తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు. -
అమ్మాయి పాటలు రాయడమేమిటని ఆశ్చర్యపోయేవారు!
‘బాలీవుడ్లో పదిమంది పాటల రచయితల పేర్లు చెప్పండి?’ అని అడిగితే ‘పదేం ఖర్మ పాతిక పేర్లు చెబుతాం’ అంటాం. ‘ఫిమేల్ లిరిసిస్ట్ల పేర్లు చెప్పండి?’ అంటే మాత్రం నీళ్లు నములుతాం. ఇలాంటి సమయంలో కౌసర్ మునీర్ లాంటి లిరిసిస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుంటే కొత్తదారి కనిపించే స్ఫూర్తి కచ్చితంగా దొరుకుతుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది కౌసర్ మునీర్. నానమ్మ సల్మా సిద్దికీ ఉర్దూ రచయిత్రి. భాషలోని సొగసు ఏమిటో ఆమె ద్వారా తెలుసుకుంది. నాన్న ఒక ఫిల్మ్స్టూడియోలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్. ఆయన నుంచి మంచి మంచి సినిమాల గురించి తెలుసుకుంది. సినిమాలు చూడడం కంటే అందులో పాటలు వినడం ఆమెకు ఇష్టం. జావెద్సాబ్ పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో! వినగా వినగా పదాల గురించి లోతైన పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి తాను కూడా పాట రాయాలనే తపన మొదలైంది. సినిమాలలో ఎన్నో సందర్భాలను ఊహించుకొని వాటికి తగ్గట్టు పాటలు రాసుకొని మురిసిపోయేది. కాని ఎన్నాళ్లు ఇలా తనకు తాను మురిసిపోవడం! ‘సినిమాలో ఫీల్డ్కు వెళ్లి పాటలు రాయాలని ఉంది’ అని తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర చెప్పినప్పుడు నవ్వనివారు తక్కువ. ‘డైరెక్టర్ కావాలనుకుంటారు లేదా కొరియోగ్రాఫర్ కావాలనుకుంటారు. పాటలు రాయడం ఏమిటీ!’ అని ఆశ్చర్యపోయేవారు. ఒక టీవీ సీరియల్కు అసిస్టెంట్ రైటర్గా పనిచేసిన కౌసర్కు మంచి ప్రశంసలు లభించాయి. మరిన్ని సీరియల్స్కు అసిస్టెంట్గా అవకాశాలు వచ్చినా వాటిని నిరాకరించింది. దీనికి కారణం తన మనసులో కోరిక... పాటలు రాయాలని. డైరెక్టర్ విజయ్కృష్ణ ఆచార్యను కలిసి తన మనసులో మాట చెప్పింది. ఇంతకుముందే రచయిత్రిగా తనను తాను నిరూపించుకోవడం వల్ల ఆచార్యను నమ్మించడం పెద్ద కష్టం కాలేదు. అలా ‘తషాన్’ సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. ‘ఫలక్తక్ ఛల్ సాత్ మేరే ఫలక్తక్ ఛల్ సాత్ ఛల్ యే బాదల్ కీ చాదర్ యే తారోం కీ ఆంచల్’... అనే ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. అవార్డ్లు తెచ్చిపెట్టింది. ఇక వెనక్కి తిరిగిచూసుకోనక్కర్లేదు, అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి అనుకుంది. కానీ అదేమీ జరగలేదు. మళ్లీ సినిమా ఆఫీస్ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. అలా యశ్రాజ్ ఫిల్మ్స్ ‘ఇష్క్జాదే’లో పాట రాసే అవకాశం వచ్చింది. ‘ఆడియో ఇండస్ట్రీలో స్త్రీలను చిన్నచూపు చూస్తారనేది అపోహ కాదు. వాస్తవం. అలా అని వెనక్కితగ్గితే వారికి బలాన్ని ఇచ్చినట్లవుతుంది’ అంటున్న కౌసర్ మునీర్ బజ్రంగీ భాయిజాన్, డియర్ జిందగీ, సీక్రెట్ సూపర్స్టార్, గుంజనా సక్సేనా: ది కార్గిల్ గర్ల్... మొదలైన సినిమాలలో పాటలు రాసి తన బలమేమిటో నిరూపించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పాటలు రాయాలనుకునే మహిళలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తోంది. -
ప్రముఖ రచయిత మృతి.. సీఎం సంతాపం
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ గేయ రచయిత పూవచల్ ఖాదర్ (72) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూవచల్లోని జూమా మసీదులో ఖాదర్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించిన కవిత అనే చిత్రంతో రచయితగా ప్రస్థానం మొదలుపెట్టిన ఖాదర్.. నాలుగు దశాబ్దాల కెరీర్లో 350కి పైగా సినిమాలకు పాటలు రాశారు. నాధ నీ వరుమ్ కలోచ (చమరం), పండోరు కట్టిలోరన్ సింహామ్ (సందర్భం), పొన్వీన్ (తలవట్టం) మరియు ఎంటె జన్మమ్ నీయేదుత్తు (అత్తక్కలసం) వంటి పాటలు ఆయన కలంలో వచ్చినవే. మలయాళ పరిశ్రమలో ఇప్పటివరకు ఎన్నో సూపర్హిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు. ముఖ్యంగా 70-80వ దశకంలో ఖాదర్ రాసిన దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. కెవి మహాదేవన్, ఇలయరాజా, శంకర్ గణేష్ వంటి ఎందరో ప్రముఖుల వద్ద పనిచేసిన ఖాదర్ ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఖాదర్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. మలయాళంలో అత్యధిక సినిమా పాటలు రాసి రికార్డు నెలకొల్పిన ఖాదర్ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. చదవండి : MAA Elections: ప్రకాశ్రాజ్ వర్సెస్ మంచు విష్ణు! అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్ప్రైజ్ -
కందికొండకు క్యాన్సర్.. ‘మనందరం అండగా నిలబడదాం’
సినిమా ప్రపంచంలో పాటకున్న ప్రత్యేకత అసాధారణమైనది. ఒక్కో సందర్భంలో పాటల ద్వారానే సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇలాంటి పాటలను రాయడంలో కందికొండ చెయ్యి తిరిగినవాడు. వందలాది పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపను తాకిన వైనం ఈయనది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నాగుర్లపల్లెలో సామాన్య కుమ్మరి కుటుంబం నుండి వచ్చినవారు కందికొండ. మట్టిమనుషుల యాస–గోసను పట్టిన కలం ఈయన సొంతం. ప్రొఫెసర్ అవ్వాలనే కోరికతో డబుల్ యంఏ చదివి 2004లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు మళ్ళీకూయవే గువ్వా అనే పాట ద్వారా సినిమా ప్రపంచంలోకి అడిగిడునాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అసంఖ్యాక పాటలను అందించాడు. తెలుగు సినిమాలో రజనికాంత్, చిరంజీవితో సహా దాదాపుగా అందరు హీరోలకు కలిపి 1,300 పైగా పాటలను అందించారు కందికొండ. ఈయన పాటలు కేవలం సినిమాకే పరిమితం అవ్వలేదు తెలంగాణ పోరులో సైరన్ అయ్యింది. తెలంగాణ అస్తిత్వంలో పాటై కోట్ల గొంతుకలను ఒక్కటిగా చేసింది. బతుకమ్మ పండుగకు కంది కొండ పాటలేనిదే ఊపులేదనే చెప్పాలి. సందర్భం ఏధైనా సరే భక్తి, రక్తి, ప్రేమ, విరహం, ఊపు, అన్నికోణాల్లో పాటలను అందించగల్గిన ఒకేఒక్కడు కందికొండ. తెలంగాణ సినీగేయాలపై ఉస్మానియాలో పీహెచ్డీ చేసి ఇటీవలే డాక్టరేట్ కూడ అందుకున్నారు. తెలుగు సమాజంలో పాట మాత్రమే బ్రతికివుంటుంది, పాడినోడికి, పాట రాసినోడికి రాని గుర్తింపు కేవలం పాటలకే వస్తుంటాయి, పాటలను గన్నవాళ్ళకు జీవనమే దుర్భరమైన సందర్భాలు మనం చూశాము. కళాకారులు ప్రజల ఆస్తిగా బావించాల్సింది ప్రభుత్వాలే. అందుకే వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని అందించడంలో మీనమేషాలు చూడకూడదు. ఇప్పుడు గత కొద్దిరోజులుగా కంది కొండ గొంతు క్యాన్సర్తో చావుతో పోరాడుతున్నారు, సరైన వైద్య సదుపాయం కావాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు. ఇలాంటి సందర్భంలో అరుదైన కళాకారులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అస్థిత్వ ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం మరింత అండగా ముందుకు రావాల్సి ఉన్నది. తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ కందికొండను బతికించుకోవడంలో భాగస్వామ్యం వహించవల్సి ఉన్నది. ప్రభుత్వాలే కాకుండా మనం సైతం ఇప్పుడు కందికొండకు అండగ నిలబడాలని ఉంది. దాతలు గూగుల్ పే ద్వారా 8179310687కి సహాయం అదించగలరు. అలాగే కందికొండ రమాదేవి ఆంధ్రాబ్యాంక్ 135510100174728 (అకౌంట్ నంబర్). IFSC ANDB0001355కి కూడా తమ సహాయాన్ని అందించవచ్చును. - వరకుమార్ గుండెపంగు ప్రముఖ కథా రచయిత మొబైల్: 99485 41711 -
ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్ సాయం!
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రయిత కందికొండ గిరి ఇటీవలే అనారోగ్యానికి గురయ్యాడు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన ఒక్కరోజు వైద్యానికే రూ.70 వేలకు పైగా ఖర్చవుతోందట. అతడి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కుటుంబ సభ్యులు సాయం కోసం చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన కేటీఆర్ ఆయనకు సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా కందికొండ గిరి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు రాశాడు. దేశముదురు, పోకిరి, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో వెయ్యికి పైచిలుకు పాటలు రచించాడు. చదవండి: అదంతా మనం చూసే సంస్కారంలో ఉంది: సిరివెన్నెల -
గీత రచయిత వైరముత్తుకు అరుదైన పురస్కారం
తమిళ సినిమా: ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు అరుదైన పురస్కారం లభించింది. మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. అవార్డు గ్రహీతకు జ్ఞాపికతో పాటు, ధ్రువీకరణ పత్రం, రూ.3 లక్షల నగదు అందజేస్తారు. ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా భావిస్తున్నట్లు వైరముత్తు పేర్కొన్నారు. వైరముత్తును సీఎం స్టాలిన్ అభినందించారు. చదవండి:అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు ‘ఏక్ మినీ కథ’ మూవీపై హీరో శర్వానంద్ కామెంట్స్.. -
25 ఏళ్ల తర్వాత అతడితో పని చేయనున్న రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గీత రచయిత మెహబూబ్ పాతికేళ్ళ తర్వాత కలిసి పని చేయనున్నారు. అహ్మద్ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా ‘హీరో పంతి 2’ అనే సినిమా తెరకెక్కనుంది. 2014లో వచ్చిన ‘హీరో పంతి’ (తెలుగులో వచ్చిన ‘పరుగు’ సినిమాకు హిందీ రీమేక్) సినిమాకు సీక్వెల్గా ‘హీరోపంతి 2’ రూపొందుతోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, మెహబూబ్ కలిసి సినిమా చేయనున్నారు. 1995లో వచ్చిన రామ్గోపాల్ వర్మ ‘రంగీలా’ సినిమా తర్వాత ఏఆర్ రెహమాన్, మెహబూబ్ కలిసి మళ్లీ ‘హీరో పంతి 2’ సినిమాకు చేస్తున్నారు. కృతీసనన్ హీరోయిన్గా నటిస్తున్న ‘హీరోపంతి 2’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 3న విడుదల కానుంది. చదవండి: చారిత్రాత్మక సినిమాలో సూర్య -
దివికేగిన ఎస్పీ బాలు దోస్త్..
ఒకరు స్వర మాంత్రికుడు.. మరొకరు సిరా యాంత్రికుడు.. ఇద్దరూ సినీ ప్రపంచంలో హాలికులు.. సింహపురి ముద్దుబిడ్డలు.. ఆ ఇద్దరిదీ గురుశిష్యులు.. అన్నదమ్ములు.. స్నేహితుల అనుబంధం.. సినీ గాయకుడు ఎస్పీ బాలు దివికేగిన కొద్దినెలలకే ఆయన ఆత్మీయుడు, సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. పాటలు పాడే చందమామను వెతుక్కుంటూ వినీలాకాశంలోకి ఈ ‘వెన్నెల’ వెళ్లిపోయింది. చెన్నైలో నివాసం ఉంటున్నా.. నెల్లూరుతో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మాట.. పాట వెన్నెలంత హాయిగా ఉండేదని స్నేహితులు జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఎస్బీఐలో కొలువు కాదనుకుని సినీ రంగంలో చేసిన సాహిత్య ప్రయాణం మరపురానిది.. ‘మాటరాని మౌనమిది..’ అంటూ సింహపురి మూగబోయింది. సాక్షి, నెల్లూరు(బృందావనం): సింహపురి శోకసంద్రమైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణంను పోగొట్టుకున్న విషాదాన్ని మరువకముందే ఈ ప్రాంతానికి చెందిన సినీగేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మృతిచెందడంతో కన్నీటి సంద్రమైంది. డబ్బింగ్ చిత్రాలకు పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్న వెన్నెలకంటి నెల్లూరులో కళాకారులందరికీ వెన్నెల కాంతులను అందించారు. కవిగా, స్నేహితుడిగా ఎన్నో కళాసంఘాలకు అధ్యక్షుడిగా తాను అందించిన ప్రోత్సాహాన్ని స్నేహితులు కంటితడి పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు. నగరంలోని ట్రంకురోడ్డు సీమా సెంటర్, పురమందిరం, టీవీఎస్ కల్యాణసదన్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఏ సంగీత, సాహిత్యసభ అయినా వెన్నెలకంటి జ్ఞాపకాలు గుర్తుతెస్తుంది. ఎస్పీబీతోపాటు వెన్నెలకంటి సినిమా కళాకారులను నెల్లూరుకు తీసుకొచ్చి చేసిన కార్యక్రమాలతో ఎందరో వర్ధమాన కళాకారులు వెలుగులోకి వచ్చారు. కళాంజలి సంస్థకు ఎంతో ప్రోత్సాహం కళాంజలి సంస్థ ప్రతి కార్యక్రమంలో వెన్నెలకంటి ప్రోత్సాహం ఉండేది. సుదీర్ఘమైన ప్రయాణంలో కవిగా, స్నేహితుడిగా ఆయన అందించిన సహాయసహకారాలు మరచిపోలేము. మా సంస్థ తరఫున వెన్నెలకంటిని సన్మానించిన దృశ్యం ఇంకా కళ్లముందే కదిలాడుతోంది. – కళాంజలి అనంత్, బెనర్జీ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి వెన్నెలకంటి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. ఇటీవల టీటీడీకి వెన్నెలకంటి రాసిన పాటను హిందీలోకి అనువదించడం నా పూర్వజన్మ సుకృతం. – డాక్టర్ శైలజ, కవయిత్రి, మరుపూరు కోదండరామిరెడ్డి స్మారక అవార్డు కమిటీ అధ్యక్షురాలు బాధాకరం నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పాటల రచయిత వెన్నెలకంటితో సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నెల్లూరు కళారంగానికి సేవచేసిన ఇద్దరిని కోల్పోవడం బాధాకరం. – వీరిశెట్టి హజరత్బాబు, మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండీ నా ఆరోప్రాణం బాల్యస్నేహితుడు వాడి మరణవార్త తెలియగానే నాకు ఊపిరి ఆగినంతపనైంది. నాకు వాడు ఆరోప్రాణం. స్నేహానికి, ఆత్మీయతకు మరో రూపం వెన్నెలకంటి. కొద్దిరోజుల్లోనే బాల్యమిత్రులు బాలు, వెన్నెలకంటిలను పోగొట్టుకోవడం మరచిపోలేని విషాదం. – యజ్ఞావఝుల శేషగిరీశం, వెన్నెలకంటి బాల్యమిత్రుడు చేదోడువాదోడుగా ఉండేవాడు రాజేశ్వరప్రసాద్ మాకు ఎన్నో కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. మా కమిటీ అ«ధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. ఆయన మరణవార్త నివ్వెరపరచింది. సాహితీలోకానికి తీరనిలోటు. – చిన్ని నారాయణరావు, ప్రధానకార్యదర్శి, డాక్టర్ నాగభైరవ అవార్డు కమిటీ కళలకు తీరనిలోటు వెన్నెలకంటి మరణం కళారంగానికి తీరనిలోటు. ఆయన లేకపోవడం అటు సింహపురికి ఇటు ఆయన్ను అభిమానించే మాలాంటి వారికి ఎంతో విషాదం. – అమరావతి కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, 25 కళాసంఘాలు సాహితీ ప్రియుడిని కోల్పోయాం సింహపురి మధురగాయకుని కోల్పో యిన కొద్దికాలంలోనే మరో సాహితీప్రియుడిని కోల్పోయింది. ఇది సినిమా రంగానికే కాదు సాహిత్యలోకానికి తీరనిలోటు. – పెరుగు రామకృష్ణ, కవి స్ఫూర్తిదాయకం ఇరుగుపొరుగునే ఉండేవారం. ఆ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం. కవిగా, రచయితగా వెన్నెలకంటి ఎదిగిన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇటీవల వెన్నెలకంటితో మాట్లాడాను. ఆయన లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. – వెల్లంచేటి చంద్రమౌళి, అధ్యక్షుడు, ఏపీ బ్రాహ్మణసేవా సంఘం సమాఖ్య మాకు మార్గదర్శి మా సంస్థ కార్యక్రమాల్లో మార్గదర్శిగా వ్యవహరించారు. ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. సంస్థ ఉన్నతిలో తన వంతు తోడ్పాటు ఉంది. – దోర్నాల హరిబాబు, హరివిల్లు క్రియేషన్స్ అధినేత -
మాలీవుడ్లో మరో విషాదం
తిరువనంతపురం: కరోనా ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చింది. ఎందరో సినీ ప్రముఖులను ఇండస్ట్రీకి దూరం చేసింది. తాజాగా ప్రముఖ మళయాళ గేయ రచయిత అనిల్ పనాచూరన్ (55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిల్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనిల్ రాసిన అరబ్బీ కథ, కథ పరయుంబోల్, మాడంబి, మేరిక్కుందోరు కుంజాడు, వెలిపాండింటే పాటలు ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత ) వృతిరీత్యా లాయర్ అయిన అనిల్.. తర్వాత సినిమాల ప్రభావంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అరబిక్కధతో గేయ రచయితగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఈరన్ మేఘమే మరియు చోరా వీణా మన్నిల్ వంటి పాటలు ఇండస్ట్రీ బిగ్ హిట్గా నిలిచాయి. అతి తక్కువ కాలంలోనే 220 కి పైగా పాటలు రాసిన అనిల్ కొన్ని మలయాళ చిత్రాల్లో నటించారు. అనిల్ పనాచూరన్ మృతి పట్ల నటుడు పృథ్వీరాజ్, తోవినో థామస్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. (ఆ సేవలు అభినందనీయం: సోనూ సూద్ ) -
ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత
సాక్షి, చెన్నై : సినీ గీతరచయిత ముత్తువిజయన్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. పలువురు ప్రముఖ నటుల చిత్రాలకు పాటలు రాసిన ముత్తువిజయన్, నటుడు విజయ్ నటించిన తుళ్లాద మనం తుళ్లుం చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అందులో మెఘామాయ్ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్ పాటలు ముత్తువిజయన్కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత పెన్నిన్మనదై తొట్టు చిత్రంలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్ పాట ముత్తువిజయన్ను మరింత పాపులర్ చేసింది. ఈయన 800లకు పైగా పాటలు రాసిన ముత్తుకుమార్ మాటల రచయితగానూ, సహాయ దర్శకుడిగానూ పనిచేశారు. కవయిత్రి తేన్మొళిని ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. స్థానిక వలసరవాక్కంలోని సినీ గీత రచయితల సంఘ కార్యాలయంలోనే బసచేస్తున్న ముత్తువిజయన్ పచ్చ కామెర్ల బారిన పడడంతో కాలేయం దెబ్బతింది. అందుకు వైద్య చికిత్స పొందుతున్న ముత్తువిజయన్ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు అదే రోజు సాయంత్రం వలసవాక్కం శ్మశాన వాటికలో జరిగాయి. -
ప్రముఖ గేయ రచయిత మృతి
సాక్షి, హైదరాబాద్: మ్యూజికల్ హిట్స్గా నిలిచిన ఎన్నో చిత్రాలకు గేయ రచయితగా పనిచేసిన శివగణేష్ గుండెపోటుతో మరణించారు. గురువారం వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, 7జీ బృందావన్ కాలనీ లాంటి సినిమాలకు ఆయన సాహిత్యమందించారు. వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన పాటలు రాశారు. శివగణేష్కు భార్య నాగేంద్రమణి శివగణేష్, కుమారులు సుహాస్, మానస్లు ఉన్నారు. ఆయన మృతికి పలువురు తెలుగు, తమిళ సినిమా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
సినిమా పాటరాయడం చాలా కష్టం..
‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది’.. ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని’.. అంటూ నిరాశా చీకట్లను తరిమేసే స్ఫూర్తిదాయక పాటలు రాయాలన్నా.. పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా... అని తల్లి ప్రేమ మాధుర్యాన్ని గుమ్మరించాలన్నా.. తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చే తల్లి చిరునవ్వులా.. అని అద్భుతమైన గీతం రాయాలన్నా...ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా... అంటూ సమకాలీన రాజకీయాలను స్పృశించాలన్నా..మెగాస్టార్ చిరంజీవి అభిమానుల జాతీయ గీతంగా పేర్కొనే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అని ఉర్రూతలూగించాలన్నా..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది.. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది.. అని చీరకట్టు గొప్పతనానికి జైకొట్టాలన్నా..తెలుగు సినిపరిశ్రమలో ఇప్పుడు ఒక్కరికే సాధ్యం.. ఆ ఒకే ఒక్క రచయిత చంద్రబోస్.. చంద్రబోస్ కాదు.. చంద్ర‘భేష్’ అని తెలుగు సినీ పాట గర్వంగా తలెత్తుకునేలా చేసిన వేటూరి సుందరరామమూర్తితోనే ప్రశంసలు అందుకున్న కవి.మారుమూల పల్లె.. సాధారణ కుటుంబ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్లో జేఎన్టీయూ థర్డ్ ర్యాంక్ సాధించి కూడా కేవలం గానం, కవిత్వంపై మక్కువతో సినిమా పాట బాట పట్టారు చంద్రబోస్.మనిషిలో ప్రేరణ, స్ఫూర్తి రగిలించే సోలో, యుగళగీతాలు, సామాజిక సందేశాలు.. ఇలా ఏపాటైనా ఆలవోకగా రాసేసి సినిమా కవిగా వచ్చే ఏడాది పాతికేళ్ళ ప్రాయంలోకి అడుగుపెడుతున్న చంద్రబోస్ సోమవారం విశాఖలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. చదువు.. చదువు.. చదువు... చదువే ఓ మూలధనం.. విద్యార్ధులే కాదు.. సమాజంలో ఎవరైనా.. ఏ రంగంలోని వారైనా.. వారికిష్టమున్న రంగం కావొచ్చు.. అంశంకావొచ్చు.. చదవాల్సిందే.. అధ్యయనం చేయాల్సిందే. ‘పరుగెత్తు..నడువు.. లేదంటే పాకుతూవెళ్లు.. అంతేకానీ ఒకే చోట కదలకుండా కూర్చోకు’.. అని మహాకవి శ్రీశ్రీఅన్నట్లే నా సృజనతో నేను చెప్పేది ఒకే ఒక్క మాటచదవు.. చదువు.. చదువు.. తెలుగుపాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు తెలుగు సినీ పాటకు జాతీయస్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదనే అభిప్రాయం నాలో ఉంది. జాతీయ అవార్డులు పొందుతున్న మిగిలిన భాషా చిత్రాల పాటలను నేను అనువదించి వింటుంటాను. ఆ సాహిత్యమూ తెలుసుకుంటాను. కచ్చితంగా వాటికంటే మన తెలుగు పాటలేమీ తీసిపోవు. అంతకంటే మంచి సాహిత్యమే మన పాటల్లో ఉంది. కానీ ఎందుకో మొదటి నుంచి తెలుగుపాటకు తగినంత గుర్తింపు దక్కడం లేదు. బహుశా మన పాటను భుజానికెత్తుకునే వాళ్ళు అక్కడ లేకపోవడం వల్లనేమోనని అనుకుంటాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. పాట విషయమే తీసుకుందాం. తమిళ మాతృక సినిమాలో ఆ పాటకు ఎంతో గుర్తింపునిచ్చారు. ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఎన్నో అవార్డులు వచ్చాయి. వాస్తవానికి మాతృకలోని పాట కంటే తెలుగు పాటే ఎక్కువమందికి చేరువైంది. ఆ పాట కంటే మన తెలుగు పాటే బాగుందని విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ జాతీయ స్థాయి అవార్డే కాదు.. రాష్ట్రంలోనూ రాలేదు. కానీ ఆ పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణలోని యువతి ప్రణీత 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఎన్నో రోజులు చికిత్స పొందింది. ఆ సమయంలో ఆమె ప్రతిరోజూ భక్తి గీతాలతో పాటు మౌనంగా ఎదగమనే పాటతో పాటు నేనున్నాను సినిమాలోని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. అనే పాటలు విని సాంత్వన పొందానని చెప్పినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ ఆ రెండు పాటలూ నేను రాసినవే. ఏ అవార్డు ఇంతటి గౌరవాన్ని అందిస్తుంది..చెప్పండి. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు కంటే ప్రజలు ఇచ్చే గుర్తింపునకే విలువ ఎక్కువ జానపదమే... జ్ఞానపథం మన సాహిత్యానికి గానీ. సంస్కృతికి గానీ జానపదమే ప్రధానం.. అందుకే నేను జానపదమే జ్ఞానపథం అంటాను. సాహిత్యం జీవనాడిగా ఉందంటే అందుకు జానపదమే కారణం. నేను ఎదిగిన పల్లె వాతావరణం కావొచ్చు, నేను రాసిన పాట పామరులకీ అర్ధం కావాలనే ఆశ కావొచ్చు.. జానపదమే నన్ను ప్రభావితం చేసింది. నాకు సంగీతం అనువంశికంగా కాదు.. అనుసృజనగా వచ్చింది. రంగస్థలం పాటలు రాయలేదు..అశువుగా చెప్పా వాస్తవానికి నేను పాటలు పాడదామనే సినీరంగానికి వచ్చాను. మొదట లక్ష్యం అదే.. కానీ ఆ వైపు అవకాశాలు రాకపోవడంతో ఓ మిత్రుడి సలహా మేరకు పాటలు రాశా ను. మొదటిసారి 1995లో డి రామానాయుడు నిర్మించిన తాజ్మహల్ సినిమాలో పాట రాసేందుకు దర్శకుడు ముప్పలనేని శివ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా పాటలు రాస్తూనే ఉన్నాను. 24 ఏళ్ళ కెరీర్లో 3300 పాటలు రాశాను. ఒక్కోసారి ఓ పాట రాసేందుకు నాలుగైదు రోజు లు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రంగస్థలం సినిమాలోని అన్ని పాటలూ నేనే రాశాను. విచిత్రమేమిటం టే పేపర్పై పెన్ను పెట్టి ఒక్క పాట కూడా రాయలేదు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నేను కూర్చుంటే... ఆశువుగా అర్ధగంటలో ఒక్కో పాట చెప్పేస్తే.. వాళ్లు రికార్డ్ చేసేశారు. ఆ పాటల్లో ఎంతటి సాహిత్యముంది.. స్ఫూర్తి రగిలించే పాటలు నేనే ఎక్కువ రాశా నా లిరిక్స్లో నవరసాలూ ఉంటాయి. హాస్యం, శృంగారం, క్రోధం, శాంతం, కరుణ భయం,. బీభత్సం.. అన్నీ ఉంటాయి. కానీ నాకు మనిషికి ప్రేరణనిచ్చి.. స్ఫూర్తిని రగిలించి సందేశాన్నిచ్చి ముందుకు నడిపించే పాటలంటేనే ఇష్టం. నిరాశ, నిస్పృహలను పారదోలే స్ఫూర్తి సాహిత్యంతో 35పాటలు రాశాను. బహుశా తెలుగు సినిమా సాహిత్యంలో అలాంటి పాటలు ఎక్కువ రాసింది నేనే అని అనుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ వచ్చిందని భావిస్తాను.. కొత్త రచయితలూ... సినిమా రంగంలోకి రావాలనుకునే కొత్త రచయితలూ ముందు బాగా చదవండి. కవిత్వానికి మూమూలు మాటకు తేడా ఏమిటో తెలుసుకోవాలి. మాట కవిత్వం ఎలా అవుతుంది.. ఎందుకు అవుతుంది. అయ్యేందుకు మనం ఏం ప్రయోగం చేయాలో ఆలోచించాలి. సినిమా పాటలకు ఉండే నాలుగు లక్షణాలు క్లుప్తత, గాఢత, స్పష్టత, సరళత.. ముందుగా ఇవి అలవర్చుకోవాలి. ఇక సినిమా పాటలకు ఛందస్సు అవసరం లేదు..యతిప్రాస ఉంటే చాలు. ఉదాహరణకు.. ’ మా బాధలను ఓదార్చే తోడుండేవాడివిరా... ఇది మామూలు మాట.. ’’మా బాధలను ఓదార్చే నువ్వుంటే బాగుండురా... ’ ఇది కవిత్వం.. బాలసాహిత్యమే మనిషికి పునాది బాలసాహిత్యమే ఏ మనిషికైనా పటిష్ట పునాది వేస్తుంది. అంతకుమించిన సాహితీ సంపద లేదు. బాలలకు లేతప్రాయంలో శబ్దసంపద, ఊహాశక్తిని పెంపొందించే నైతిక రుజువర్తనను అందించాలి. నీతి కథలు చదివించాలి. సాహిత్యం మనల్ని పరిపుష్టం చేస్తుంది. బాల్యంలో బొమ్మరిల్లు, బుజ్జాయి, చందమామ, బాలమిత్ర.. భాగవతం, బాలసాహిత్యం వంటివి చదివితే ఎదుగుదలలో తిరుగుండదు. ఒకప్పుడు పిల్లలకు వాటితోనే విద్యాభ్యాసం మొదలుపెట్టించేవారు. మాతృభాషకు మించింది ఏదీ లేదు.. ♦ భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్టు.. ♦ మాతృభాషతోనే వేగంగా బుద్ధి వికాసం ♦ తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదు ♦ మన పాటను భుజానికెత్తుకునే వాళ్లు అక్కడ లేకపోవడం వల్లనేమో.. ♦ జాతీయ అవార్డులు సాధిస్తున్న ఇతర భాషల పాటల కంటే తెలుగు పాటేం తీసిపోదు ♦ సినిమా పాట రాయడం అవధానం కంటే పెద్ద ప్రక్రియ ♦ పాటలు పాడదామని వచ్చి రచయితగా మారాను ♦ చిరంజీవి సైరాలో పాట రాస్తున్నా విశాఖలో ఉండి ఎన్నో పాటలు రాశాను మాతృభాషను నిర్బంధంగా చదివించాలి మాతృభాషకు మించింది ఏముంది.. భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్లే.. నాన్నా అన్న పిలుపులో ఉండే గాఢత డాడీలో ఉండదు. అమ్మా అన్న పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీలో ఉండదు. పిలుపు మారినప్పుడు బంధం కూడా మారుతుంది. మాతృభాషతో బుద్ధి వికాసిస్తుంది. ఆలోచనలు విస్తరిస్తాయి. పరభాషతో బుద్ధి వికాసం అంత త్వరగా రాదు. అందుకే మాతృభాషను నిర్బంధంగా చదివించాలని నేను భావిస్తాను. కనీసం ప్రాధమిక విద్యాబోధనైనా తెలుగులో కచ్చితంగా> జరిగి తీరాలి. ఆస్ట్రేలియాలో మాతృభాషలో చదువుకున్న వారికి అక్కడి ప్రభుత్వం 130 డాలర్లు బహుమతిగా అందిస్తోంది. అక్కడ స్థిరపడిన ఏ భాషకు చెందిన వారైనా వారి మాతృభాషలో చదువుకుంటే ప్రోత్సాహం అందిస్తోంది. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే కాదు.. మనందరిదీ. సినిమా పాటరాయడం చాలా కష్టం.. మామూలు పాటలు రాయడం వేరు.. సినిమా పాటలు రాయడం వేరు. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ను పట్టుకుని. దర్శకుడు ఇచ్చే సందర్భాన్ని అర్ధం చేసుకుని, హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను మెప్పించేలా సినిమా పాట ఉండాలి. అందుకే సినిమా పాట రాయడం చాలా కష్టం. అది ఓరకంగా అవధానం కంటే పెద్ద ప్రక్రియ. ఇటీవలికాలంలో సినిమా కవులకు సోషల్ మీడియా సాహిత్యం సవాల్ విసురుతోంది. వాట్సాప్లో ప్రపంచస్థాయి కవిత్వాలు నీతులు, శుభాషితాలు. ఛలోక్తులు.. ఇలా పలు రూపాల్లో కవిత్వం వెల్లువెత్తుతోంది. దాన్ని మించి సినిమాలో చెప్పాలి. అందునా ఇప్పుడు కాలం మారింది. వేగం పెరిగింది. సినిమాకు మహారాజపోషకులైన యువత ఆలోచనలు మారాయి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కవిత్వం రాయాలంటే కత్తిమీద సాములా అయింది. సినిమాల్లో యుగళగీతాలు తగ్గాయి,, సిట్యుయేషన్ సాంగ్స్ వస్తున్నాయి. పాట సినిమాలో అంతర్భాగంగా వచ్చేదే అయినప్పటికీ అది సినిమా కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చైతన్యపరుస్తుంది. ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం ♦ సినీ కవుల్లో ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే ఎన్నో పాటలు రాశాను. నాలుగైదు మాటలతోనే గొప్ప అర్థం వచ్చేలా.. అందరికీ అర్థమయ్యేలా రాయడం ఆత్రేయ సాహిత్యం నుంచే నేర్చుకున్నాను. ఓ సందర్భంలో ఆయన రాసిన సాహిత్యం గురించి.. ప్రియుడి సన్నిహితులు చనిపోతే ప్రేయసి ఇలా ఓదారుస్తుంది.. ♦ ‘రారయ్య పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు’ ఇదీ సాహిత్యం గొప్పతనం మరో సందర్భంలో ♦ నీకు నాకూ పెళ్ళంట...నింగీ నేలకు కుళ్ళంట...ఎందుకంటేయుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసింది ఎప్పుడూ లేవంట..మరో సందర్భంలో నీకూ నాకూ పెళ్ళంట.. నదికి కడలికి పొంగంట..యుగయుగాలు వేరైనా అవి కలవనది ఎపుడూ లేదంట ♦ ఇలా అనల్పమైన అర్ధం ఇవ్వాలనే స్ఫూర్తిని ఆత్రేయ నుంచే పొందాను. పెద్ద పెద్ద సమాసాలతో సంక్లిష్టమైన పదాలతో పాటలు రాయను. నేను రాసిన ప్రతి మాట అమ్మకు అర్ధమవ్వాలని అనుకుంటా.. అమ్మకు అర్ధమైతే అందరికీ అర్ధమైనట్టే. సైరాకు రాస్తున్నా...విశాఖలో ఎన్నో పాటలురాశాను సుందరమైన విశాఖ నగరంలో నాకు వృత్తిరీత్యా ఎంతో అనుబంధముంది. ఆర్య, బన్ని సినిమాల్లోని పాటలతో పాటు ఇటీవల ట్రెండింగ్ సాంగ్గా మారిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఫ్రెండ్షిప్పై వచ్చే ట్రెండు మారినా ఫ్రెండు మారడే పాటను ఇక్కడే రాశాను. ఇలా ఎన్నో పాటలను విశాఖలో కూర్చుని రాశాను. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాకి రాస్తున్నాను. పాట రాయాలని నేను వైజాగ్లో ఉన్నప్పుడే పిలుపువచ్చింది. -
సినీ గేయ రచయిత రంగభట్టర్ కన్నుమూత
తిరుపతి కల్చరల్: సంస్కృత అధ్యాపకుడు, సినీగేయ రచయితగా సంగీత సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తనదైన శైలిలో అద్భుత పాటలతో ఆధ్యాత్మిక చిత్రాలకు నిండుదనం తెచ్చిన సాహితీవేత్త, సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రంగభట్టర్ ఊపిరితిత్తుల సమస్యతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కన్నుమూశారు. గురువారం బైరాగిపట్టెడలోని ఆయన స్వగృహం నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రంగభట్టర్ పూర్వీకులది తమిళనాడులోని శ్రీరంగం. శ్రీవైష్ణవి ఆచార్య పీఠానికి చెందిన పూర్వీకులు సమాజాన్ని ఆధ్యాత్మికతlవైపు నడిపించాలన్న సంకల్పంతో కొన్ని శతాబ్దాల క్రితం వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో స్థిరపడ్డారు. 1946లో ఆయన జన్మించినా అదే గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1968లో టీటీడీలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య అధ్యాపకులుగా బోధన రంగంలోకి ప్రవేశిం చారు. సాహిత్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్గా పనిచేశారు. సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి వేదవ్యాస రంగభట్టర్కు స్వయాన తమ్ముడు కావడం గమన్నార్హం. వృత్తి రీత్యా తిరుపతిలో స్థిరపడ్డా ప్రస్తుతం బైరాగిపట్టెడలో ఆయన నివాసముంటున్నారు. వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకుడు కావడంతో సాహిత్యంలో మంచి పట్టు సాధించారు. 1986లో రంగవల్లి చిత్రానికి ఆయన తొలిసారిగా పాటలు రచించారు. మూడు దశాబ్దాలుగా సాహితీ సేవ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన శ్రీమంజునాథ, పాండురంగడు, రామదాసు, షిరిడీసాయి, అనగనగా ఒక ధీరుడు, ఝుమ్మంది నాదం, జగద్గురు ఆదిశంకర, వెంగమాంబ, ఓం నమో వేంకటేశాయ వంటి 13 చిత్రాలకు అద్భుతమైన ఆధ్యాత్మికతను రేకెత్తించే పాటలను రచించి గొప్ప సినీ రచయితగా పేరు గడించారు. ‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే సంగీత పుస్తకాన్ని రచించి సులభతరంగా సంగీతం నేర్చుకునేలా దోహదపడ్డారు. తద్వారా పలు రికార్డులు సాధించారు. భూమన ప్రగాఢ సంతాపం ప్రముఖ సాహితీవేత్త రంగ భట్టర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రంగభట్టర్ మృతి రాష్ట్ర ప్రజలకు తీరనిలోటన్నారు. తిరుపతి నాటక రంగానికి ఆయన వెన్నెముకగా నిలిచారని తెలిపారు. కళాకారులను అన్ని విధాలా ప్రోత్సహించారన్నారు. అనేక దేవుళ్లకు సుప్రభాత కీర్తనలను రాసిన విధూషీమణిగా కీర్తించారు. సాహితీవేత్తగా, అద్భుతమైన సినీ గేయ రచయితగా ఎనలేని గుర్తింపు పొందారన్నారు. రంగభట్టర్ అనన్య సామాన్యమైన ప్రతిభా మూర్తిగా భూమన పేర్కొన్నారు. -
క్రీడంటే ప్రాణం.. కళంటే లక్ష్యం
నెల్లూరు ,వెంకటగిరి: కళల కాణాచి అయిన వెంకటగిరిలో కళాకారులు, క్రీడాకారులకు కొదవలేదు. ఈ రెండు రంగాల్లోనూ రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. ఏ రంగంపై అయినా మక్కువ, సృజన ఉంటే రాణించవచ్చునని నిరూపిస్తున్నాడు. ఒక్క పక్క గేయ రచయితగా మరో పక్క చెస్ క్రీడాకారులను ఉనత్న స్థాయికి చేర్చేలా వెంకటగిరికి చెందిన నర్రా విజయ్కుమార్ అవిరళ కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు నర్రా మురళీకృష్ణ, వేదవతి దంపతుల కుమారుడు విజయ్కుమార్కు చిన్నతనం నుండే చెస్ ఆట అంటే మక్కువ. ఆ రోజుల్లో తన కుటుంబ పరిస్థితుల కారణంగా చెస్ క్రీడలో ఉన్నత స్థాయికి వెళ్లలేకపోయాడు. చెస్లో ప్రావీణ్యం సంపాదించుకుని వెంకటగిరి ప్రాంతంలోని బాల, యువ చెస్ క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలనే సంకల్పంతో దాతల సహకారంతో ఉచితంగా నిస్వార్థంగా శిక్షణ ఇస్తున్నాడు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహన్ని అందించేందుకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చెస్ పోటీలను వెంకటగిరిలో నిర్వహిస్తున్నారు. 2019లో జాతీయ స్థాయి చెస్ పోటీలను వెంకటగిరిలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకేసారి 50 మంది చెస్ క్రీడాకారులు ఒక వైపు తను ఒక వైపు ఉండి ఆడి గెలవగల అసమాన నైపుణ్యం కలిగిన విజయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. గీత రచయితగా ప్రస్థానం విజయ్కుమార్ ఓ వైపు చెస్ క్రీడాభివృద్ధికి పాటు పడుతూనే మరో వైపు అతనిలో ఉన్న మరో కోణం గేయ రచయిత గా అడుగులు వేస్తున్నాడు. 2008లో సినీ గేయ రచయితగా సినీ రంగంలో అరంగేట్రం చేసి పదేళ్లలో 9 తెలుగు చలన చిత్రాలకు గేయ రచయితగా, మరో 30 చిత్రాలకు సహాయ రచయితగా పనిచేశారు. పదహారేళ్ల వయసు (కొత్తది) సినిమా గేయ రచయితగా తన మొదటి చిత్రం కాగా ఉదయ్కిరణ్ నటించిన చిత్రం చెప్పిన కథ, ప్రేమ ప్రయాణం, శ్రీరంగనాయక వంటి చిత్రాలకు రాసిన పాటలకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. తన తల్లి వేదవతి పేరును తాను రాసిన మొదటి పాటకు పెట్టుకున్నాడు. సినీ రంగంలో ప్రముఖ గీత రచయితలు అయిన భోలేషావలి, కాసర్ల రాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో సినీ కళాకారులు నిర్వహించే కచేరీలు, ఇతర కార్యక్రమాలకు అసిస్టెంట్ ఈవెంట్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి పాటలకు రచయితగా, సహాయ రచయితగా పనిచేశాడు. అగ్రహీరోల చిత్రాలకు పాటలు రాయడమే ధ్యేయం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోల చిత్రాలకు గేయ రచయితగా పనిచేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నా. తెలుగు చలన చిత్రగీతాకు మంచి సాహిత్యాన్ని అందించి గేయ రచయితగా గుర్తింపు పొందాలన్నదే సంకల్పం. -
సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోయా..
శ్రీనగర్కాలనీ: ఆమె చదివింది ఎంటెక్.. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం..ప్రవృత్తి మాత్రం కవిత్వం, పాటలు రాయడం. సినీ గేయ రచయిత్రిగానూరాణిస్తున్నారు లక్ష్మీ ప్రియాంక. ఆమె కలం నుంచి ఎన్నో గీతాలు జాలువారాయి. తన పాటల ప్రస్థానం గురించి ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. నేను ప్రస్తుతం టీసీఎస్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను. నా ప్రాథమిక విద్య తెలుగు మీడియంలో సాగింది. దీంతో తెలుగుపై మంచి పట్టు వచ్చింది. సమాజం, జీవిత సత్యాలు, జీవన విధానంపై ఎక్కువగా నా మనసులో భావాలను స్నేహితులతో పంచుకునేదాన్ని. ఆ ఆలోచనలతోనే కవిత్వం రాసేదాన్ని. ప్రముఖ రచయిత చలం రచనలు అంటే ఎంతో ఇష్టం. నా తమ్ముడు అనారోగ్యంతో చనిపోయిన సమయంలో చాలా డిప్రెషన్కు లోనయ్యాను. ఆ కాలం మిగిల్చిన ఆ గాయం నుంచి తేరుకోవడానికి నా మనసును రచనల వైపు మళ్లించాను. ‘మా’ టీవీలో వన్ డే డీజే ప్రోగ్రాం చేశాను. అదే మొదటిసారి నన్ను నేను కెమెరాలో చూసుకోవడం. నా కవితలు, రచనలకు సోషల్మీడియలో పోస్ట్ చేసేదాన్ని. అలా సినిమా వారితో పాటు చాలా మంది సన్నిహితులు, స్నేహితులుగా మారారు. వీరిలో ముఖ్యంగా లక్ష్మీభూపాల, కన్నన్లు. సప్తగిరి ఎల్ఎల్బీ ఆడియో వేడుకలో లక్ష్మీప్రియాంక వందేమాతరం వీడియో సాంగ్కు లిరిక్స్.. ఐడ్రీమ్స్ మీడియా 2016లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి వీడియో పాటను చేశారు. వందేమాతం పేరుతో ఓ పాట రాశాను. కార్తీక్ కొడకండ్ల సంగీతం వహించిన ఈ పాటను ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉషా, పృథ్వీచంద్ర, దినకర్, మోహన భోగరాజు, దీపు, రమ్య బెహరలు పాడారు. ఆ తర్వాత ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రంలో విజయ్ బుల్గాని సంగీతంలో ఏక్ దమ్ మస్తుందే.. అనే మాస్ పాట రాశాను. ఈ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది. గౌతమి చిత్రానికి పాట రాశాను. నటి గౌతమి ఫోన్ చేసి అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది. అమీర్పేట టు అమెరికా, సూపర్ స్కెచ్, ఇట్లు అంజలి చిత్రాలకు పాటలను రాశాను. హవా చిత్రంలో అన్ని పాటలనూ రాసే అవకాశాన్ని మధుర శ్రీధర్ అందించారు. రవీంద్రభారతిలో సినీవారం ఆధ్వర్యంలో మహిళా రచయిత్రిగా నన్ను సత్కరించారు వృథా వస్తువులతో కళారూపాలు పాటలు రాయడంతో పాటు వాల్ ఆర్ట్స్, వృథా వస్తువులతో విభిన్న కళారూపాలను తయారు చేస్తుంటాను. ఇది నా హాబీ. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కళారూపాలను రూపొందించాను. వాల్ ఆర్ట్స్ కూడా వేస్తాను. -
వైరముత్తుపై యువ రచయిత సంచలన ఆరోపణలు!
కోలీవుడ్లో హిట్ మూవీగా నిలిచిన విజయ్ సేతుపతి- త్రిషల ‘96’ సినిమాలో ‘అంతాతీ నీ సాంగ్తో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చాడు యువ రచయిత కార్తిక్ నేత. గతేడాది విడుదలైన చిత్రాల్లోని ఉత్తమ పాటల్లో ఒకటిగా నిలిచిన పాటతో కార్తిక్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో పలు ఎంటర్టేన్మెంట్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జాతీయ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ రచయిత వైరముత్తుపై కార్తిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ‘వాగై సోడా వా’ అనే సినిమాలో ‘సారా సారా సరకాత్తు’ అనే పాటను రాసింది తానైతే.. టైటిల్ కార్డ్స్లో మాత్రం వైరముత్తు తన పేరు వేయించుకున్నారని కార్తిక్ వ్యాఖ్యానించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన పాటలకు ఆయన క్రెడిట్ కొట్టేశారంటూ ఆరోపించాడు. ఈ క్రమంలో అతని ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో కార్తిక్ వెనక్కి తగ్గాడు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ... ‘ ఇటీవల నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అప్పుడు నేనేం మాట్లాడానో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను నా మాటలను అంగీకరించలేను అలాగే తిరస్కరించలేను కూడా. ప్రస్తుతం నేను సిటీలో లేను. ఈ విషయం గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను’ అని పేర్కొన్నాడు. కాగా మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద కార్తిక్కు మద్దతుగా నిలిచారు. ‘ కార్తిక్ నేత తనకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పడం హర్షించదగ్గ విషయం’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
పూజారులు వెలివేశారు.. భార్య వదిలేసింది
సాక్షి, హైదరాబాద్: ‘నేను బ్రాహ్మణుడిని.. నా తండ్రి వైజాగ్లోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేసేవారు. ఆ సమయంలో నేను బ్రాహ్మణులపై రాసిన పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణసమాజం నన్ను వెలివేసింది. అప్పటి నుంచి మానసిక క్షోభకు గురయ్యాను. వ్యవస్థపై కక్ష పెంచుకున్నాను. అందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లను చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శఠగోపాన్ని ఎత్తుకెళ్లా. నాలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కసితోనే ఇలా చేస్తున్నాను’ అని ఆలయాల్లో పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లు, శఠగోపాలు తస్కరిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన ప్రముఖ సినీ గేయరచయిత తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ పేర్కొన్నారు. చోరీ కేసులో అరెస్టైన కులశేఖర్ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. విశాఖపట్నం జిల్లా, సింహాచలం బృందావన్కాలనీకి చెందిన కులశేఖర్ నగరంలోని మోతీనగర్లో అద్దెకుంటున్నాడు. ఒకవైపు బ్రాహ్మణ సమాజం వెలివేయగా మరో వైపు కట్టుకున్న భార్య కూడా అతడిని వదిలేసి పిల్లలతో సహా వెళ్లిపోయింది. దీంతో తాను పిచ్చివాడినయ్యానని చెప్పుకొచ్చాడు. తరచూ పోలీసులకు చిక్కుతున్నా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా అది మరింత పెరుగుతున్నట్లు తెలిపాడు. ప్రముఖ సినీ గేయ రచయితగా గుర్తింపు పొందిన కులశేఖర్ వంద సినిమాలకు పాటలు రాశాడు. అందులో 50 శాతం సూపర్ హిట్ కావడం విశేషం. రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినా అతని వైఖరిలో మార్పు రాలేదు. 2008 నుంచి మెదడుకు సంబంధించిన వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడమే కాకుండా తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
క్యాస్టింగ్ కౌచ్పై ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాకింగ్ నిజాలు
సాక్షి, సినిమా: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమని ఊపేస్తున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఈ అంశాన్ని నటి శ్రీరెడ్డి తెరపైకి తీసుకొచ్చి పలువురిపై ఆరోపణలు చేస్తూ టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే తాజాగా ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’ సినిమా పాటల రచయిత శ్రేష్ఠ క్యాస్టింగ్ కౌచ్పై షాకింగ్ నిజాలు బయటపెట్టారు. శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని తెలిపింది. ఏకంగా ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు ఆమెను పంపే ప్రయత్నం చేశారని తెలిపింది. అదేవిధంగా ఓ మహిళా దర్శకురాలు ఓ వ్యక్తి నిన్ను ఇష్టపడ్డాడని నీకు ప్రపోజ్ చేయడానికి గోవాలో పార్టీ ఏర్పాటుచేశాడని తనతో చెప్పిందని తెలిపారు. కానీ నేను ఆమె మాటలు ఏ మాత్రం లెక్కచేయకపోవడంతో.. ఆ వ్యక్తి శ్రేష్ఠకు ఫోన్ చేసి దారుణంగా తిట్టాడని పేర్కొన్నారు. దీని వల్ల ఇండస్ట్రీలో మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా వేధింపులకు గురిచేస్తారని తెలిసిందన్నారు. తనకు ఎదురైన ఇలాంటి కొన్ని సంఘటనల వలనే కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. శ్రేష్ఠ ఇప్పటివరకు ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘మధురం మధురం’, ‘యుద్ధం శరణం’ సినిమాలకు గేయ రచయిత్రిగా పనిచేశారు. -
తలవంచని ధిక్కారస్వరం
మూడు వేల సంవత్సరాల అణచివేతను, అవమానాలను, హింసను భరిస్తూ వున్న జాతి.. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బతికే పాఠాలు నేర్పాలి అని చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్. బహుజనుల బతుకుల్లో వెలుగుల కోసమే బతికాడు. నిరంతరం బహుజనుల కోసమే రాశాడు. కవితైనా పాటైనా, వ్యాసమైనా, అనువాదమైనా, విమర్శయినా తన శైలిలో పాఠకుల బుర్రల్లో ఆలోచనల సెగలు పుట్టిస్తూ, కన్నీటి చుక్కల్లో నుంచి చురకత్తుల వీరులు రావాలనీ దళిత తల్లుల గుండెకోతలు, మంటలు మండే ఆవేదనలే రాశాడు కలేకూరి. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటూ దళిత మ్యానిఫెస్టో కవిత రాసీ దేశ దళితుల గాయాల చరిత్రను, ధిక్కార తిరుగుబాటు కవిత్వంలో రికార్డ్ చేశాడు కంచికచర్ల కోటేశు ఘటన, కీలవేణ్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు దళితులపై దాడులను మొత్తంగా ఈ కవితలో రాశారు. కలేకూరి రాసిన ఒక పాట దేశం మొత్తం మార్మోగింది. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా / విరిసీ విరియని ఓ చిరునవ్వా/కన్నుల ఆశల నీరై కారగ/కట్నపు జ్వాలలో సమిధై పోయావా...’ ఈ పాట తెలియని వారు ఉండరు.ఎక్కడ దళితులపై దాడి జరిగినా తక్షణం స్పందించి పాల్గొంటూ, కవితలు, పాటలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో ఆ ఉద్యమపోరాటంలో పాల్గొనేవాడు. అదిగదిగో ఇప్పుడు ‘కలేకూరి ప్రసాద్’ వస్తున్నాడు, ప్రశ్నించడానికీ, ధిక్కరించడానికీ, ‘అదిగదిగో తూర్పున సూర్యుడులా మండుతూ వస్తున్నాడు’ కలేకూరి ‘వస్తున్నాడు’. (మే 17న కలేకూరి ప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా, చిలకలూరిపేటలో స్మారక సాహిత్య సభ) తంగిరాల–సోని, కంచికచర్ల మొబైల్ : 96766 09234దల -
కిషోర్ దా
-
కొత్త అవతారమెత్తిన ప్రభుదేవా
చెన్నై: నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న ప్రభుదేవా ప్రస్తుతం పాటల రచయిత అవతారమెత్తారు. ‘దేవి’ చిత్రం తర్వాత ప్రభుదేవా నటిస్తున్న చిత్రం ‘ఎంగ్ మంగ్ సంగ్’. ఎం.ఎస్.అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అమ్రీష్ సంగీత దర్శకత్వంలో ‘అయ్యనారా వందుటాంగ ఇంగ పారు’ అనే పాటను ప్రభుదేవా రాయగా శంకర్ మహాదేవన్ పాడారు. కుంభకోణంలో ప్రభుదేవా, 150 మంది నృత్య కళాకారులతో ఈ పాటకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. వాసన్ విజువల్ వెంచర్స్ సంస్థ పతాకంపై కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభుదేవా పాట రాయడం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిత్రంలో ఓ భారీ ఉత్సవం జరిగే సన్నివేశం ఉందని, ఆ సందర్భంగా ఓ పాట కూడా ఉందని తెలిపారు. అలాంటి పాటను ఓ ప్రసిద్ధ గీత రచయితతో రాయించాలని ముందుగా అనుకున్నామని, ప్రభుదేవాతో చెప్పగా ఆ పాటలో ఏ అంశాలు ఉండాలనే విషయాన్ని వివరించారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన అంశాలు బాగుండటంతో ఆ పాటను రాయమని ప్రభుదేవాకు చెప్పానన్నారు. అయితే మొదట సంకోచించినప్పటికీ తర్వాత ఆయన పాటను రాశారని తెలిపారు. -
అనంత శ్రీరామ్తో సరదాగా కాసేపు
-
సినీ గేయ రచయిత అన్నామలై ఇకలేరు
తమిళసినిమా: ప్రముఖ యువ సినీ గీతరచయిత అన్నామలై(49)మంగళవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నై పచ్చైయప్పన్ కళాశాల విద్యార్థి అయిన ఈయన అదే కళాశాలో కవితలు, గీతాలపై ఎంఫిల్ చేశారు. పీహెచ్డీ కూడా చేస్తున్నారు. టీవీ సీరియల్స్తో గీతరచయితగా తన పయనాన్ని ప్రారంభించిన అన్నామలై 50 సీరయళ్లకుపైగా పాటలు రాశారు. పలు కవితలను, భక్తిగీతాలను రాసిన ఈయన 1992లో విడుదలైన పుదువయల్ చిత్రం ద్వారా సినీ గీతరచయితగా పరిచయం అయ్యారు. నాంజల్ కెన్నడీ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో తన తొలి పాటను మనో, చిత్ర పాడారు. అన్నామలై 60 చిత్రాలకు పైగా పాటలు రాశారు. అందులో పలు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అన్నామలైకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది విజయ్ నటించిన వేట్టైక్కారన్ చిత్రంలోని ఎన్ ఉచ్చిమండైయిల్ చురుంగుదు అనే పాట. ప్రస్తుతం 20 చిత్రాలకు పైగా పాటలు రాస్తున్న అన్నామలై హఠాన్మరణం తమిళ చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలే మరణించిన గీతరచయిత నా.ముత్తుకుమార్ దుఃఖఛాయలు వీడక ముందే గుండెల్ని పిండే మరణ వార్తను చిత్రపరిశ్రమ వినాల్సివచ్చింది. అన్నామలై మృతి తమిళ చిత్రపరిశ్రకు తీరని లోటే అవుతుంది. ప్రముఖ సంగీతదర్శకులందరితోనూ అన్నామలై పని చేశారు. అదే విధంగా ప్రముఖ కథానాయకులందరికి పాటలు రాశారు. స్థానిక హారింగ్టన్ రోడ్డులో నివహిస్తున్న అన్నామలై మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య నాలుగేళ్ల పాప ఉన్నారు. అన్నామలై అంత్యక్రియలు బుదవారం జరిగాయి. ఆయన భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. -
తమిళ సినిమా కల చెదిరింది..
చెన్నై: గీత రచయిత నా.ముత్తుకుమార్ కలం ఆగింది. కవిత కంట తడిపెట్టింది. తమిళ సినిమా కల చెదిరింది. చిత్ర పరిశ్రమ ఒక గొప్ప గీత రచయితను కోల్పోయి దిగ్భ్రాంతికి గురైంది. నా.ముత్తుకుమార్ ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధ పడుతున్న ఆయన అన్నానగర్ వెస్ట్ పార్క్ రోడ్డు, మొదటి అవెన్యూలోని స్వగృహం సింబా ఫ్లాట్లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన నా.ముత్తుకుమార్కు వైద్య పరిశోధనలో పచ్చకామెర్లు అని తెలియడంతో ఇంటి వద్దే వైద్య చికిత్సలు పొందుతున్నారు. అయితే వైద్యం ఫలించకపోవడంతో మృతి చెందారు. నా.ముత్తుకుమార్ సొంత ఊరు కాంచీపురం జిల్లా కన్నికాపురం. చిన్న వయసులోనే కవితలు రాసే ప్రతిభ కలిగిన ఆయన సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వచ్చారు. దర్శకులు బాలు మహేంద్రన్ వద్ద నాలుగేళ్లు శిష్యరికం చేశారు. ఆ సమయంలో తన సహచరుడైన సీమాన్ దర్శకత్వం వహించిన వీరనడై చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అయితే ఆయన 32వ చిత్రంగా వీరనడై చిత్రం తెరపైకి వచ్చిందన్నది గమనార్హం. నా.ముత్తుకుమార్ మిన్సార కన్నా, సామి, కాదల్కొండేన్, పిదామగన్, కోవిల్, సింగం, మదరాసుపట్టణం, అవన్ ఇవన్, మెరీనా, బిల్లా-2, తెరి వరకూ 100కు పైగా చిత్రాలకు పాటలు రాశారు. రెండు జాతీయ అవార్డులు: వెయ్యికి పైగా సినీ గీతాలను రాసిన నా.ముత్తుకుమార్ తంగమీన్గళ్ చిత్రంలోని ఆనంద మళై మీట్టుగిరాయ్ అనే పాటకు, సైవం చిత్రంలోని అళగే అళగే ఎదువుమ్ అళగే అనే పాటకు రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. 2005లో అయన్ చిత్రానికి గానూ తమిళనాడు ప్రభుత్వ అవార్డును, వెయిల్, అయన్ తదితర చిత్రాలకు గాను నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులను, ఒక సైమా అవార్డును అందుకున్నారు. గత నాలుగైదేళ్లుగా ప్రతి ఏడాది అత్యధిక చిత్రాలకు పాటలు రాసిన గీత రచయితగా రికార్డు సాధించిన నా.ముత్తుకుమార్ 2012 సంవత్సరంలో 103 పాటలు రాశారు. ఒక్క ఏడాదిలో ఇన్ని పాటలు రాసిన మరో గీత రచయిత లేరన్నది గమనార్హం. ప్రముఖుల నివాళులు: కాగా నా.ముత్తుకుమార్ మృతి తమిళ చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరాజన్ తదితర రాజకీయనాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడు కమలహాసన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. నటుడు విజయ్, జయంరవి, దర్శకుడు సీమాన్, విక్రమన్, భాగ్యరాజన్, బాలా, చేరన్, పాండిరాజన్, యువన్ శంకర్రాజా, నడిగర్సంఘం అధ్యక్షుడు నాజర్, గీత రచయిత వైరముత్తు,స్నేహన్, పా.విజయన్ మొదలగు పలువురు నివాళులర్పించారు. నా.ముత్తుకుమార్కు భార్య జీవలక్ష్మి, కొడుకు ఆదవన్(9), కూతురు యోగలక్ష్మి ఉన్నారు. ఆయన భౌతికకాయానికి న్యూ ఆవిడి రోడ్డు,వేలంకాడు శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. -
తమిళ రచయిత నా ముత్తుకుమార్ మృతి
చిన్న వయసులోనే రెండు జాతీయ అవార్డులు సాధించిన తమిళ గేయ రచయిత నా ముత్తుకుమార్(41) ఆదివారం ఉదయం చెన్నైలో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన జాండీస్తో బాధపడుతున్నారు. దాదాపు 1000కి పైగా పాటలు రాసిన ముత్తుకుమార్ అజిత్ హీరోగా తెరకెక్కిన కిరీడం చిత్రానికి మాటలు కూడా అందించారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టిన నా ముత్తుకుమార్ సీనియర్ దర్శకులు బాలు మహేంద్రన్ దగ్గర నాలుగేళ్ల పాటు దర్శకత్వ శాఖలో పనిచేశారు.అదే సమయంలో గేయరచయితగా అవకాశాలు రావటంతో దర్శకత్వ ప్రయత్నాలను పక్కన పెట్టి పాటల రచయితగా కొనసాగుతున్నారు. సిల్క్ సిటీ పేరుతో ఓ నవలను కూడా రాసిన ముత్తుకుమార్, తమిళనాట బిజీ గేయరచయితల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమిళ సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. -
భువనచంద్రకు డాక్టరేట్
ప్రదానం చేసిన అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ సంస్థ సాహిత్య సేవకు గాను అందజేత చింతలపూడి : మారుమూల పల్లె నుంచి ప్రసిద్ధ సినీ గేయ రచయితగా ఎదగడమే కాక సాహిత్యంలోనూ తన ప్రతిభ చూపుతున్న మెట్ట ఆణిముత్యం భువనచంద్రకు అరుదైన గౌరవం దక్కింది. కర్నాటకలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఈ నెల 11న గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ విషయాన్ని చింతలపూడి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లంశెట్టి సత్యనారాయణ గురువారం విలేకరులకు తెలిపారు. డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. విద్యాభ్యాసం అంతా చింతలపూడిలోనే.. పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడికి చెందిన ఊరకరణం గుర్రాజు(భువనచంద్ర) సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా సినీ మాటల రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా కూడా రాణిస్తున్నారు. ఆయన రచించిన ‘వాళ్లు’ అనే ఆధ్యాత్మిక నవల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భువనచంద్ర రచించిన అనేక కథలు స్వాతి, నవ్య వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి. భువనచంద్ర పుట్టింది కృష్ణాజిల్లా గుళ్లపూడి గ్రామంలో. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, చంద్రమౌళీశ్వరీదేవి. భువనచంద్రకు రెండేళ్ల వయస్సులో కుటుంబంతో సహా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన విద్యాభ్యాసం చింతలపూడిలోనే సాగింది. సైనికులకు అంకితం ఇస్తున్నా.. డాక్టరేట్ రావడం సంతోషంగా ఉంది. అయితే నేనెప్పుడూ అవార్డుల కోసం ఏదీ రాయలేదు. అవార్డు అనేది ఒక అలంకారం మాత్రమే. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి బోర్డర్లో కాపు కాస్తున్న సైనికులే కారణం. ఒక సినిమా రచయితగా కాకుండా సైనికుడికి ఇచ్చిన గౌరవంగా నాకు అందిన డాక్టరేట్ను భావిస్తున్నాను. అందుకే అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ ఇచ్చిన డాక్టరేట్ను 18 ఏళ్లు సైనికుడిగా పని చేసిన నేను భారత సైనికులకు అంకితమిస్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, లైబ్రరీలో నేను ఎక్కువ పుస్తకాలు చదివి ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన లైబ్రేరియన్ దాశరథి, మేడుకొండూరి రామకృష్ణలకు కృతజ్ఞతలు. వచ్చేనెలలో మరో నాలుగు పుస్తకాలు ఎమ్మెస్కో వారు విడుదల చేస్తున్నారు. వాటిలో చింతలపూడి ఆశ్రమానికి చెందిన శ్రీ బోధ, బోధానందామృతం నవలలు కాగా, మిగిలిన రెండు పుస్తకాలు కథా సంపుటాలు. ఆశ్రమంలో నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు, స్వామీజీ చెప్పిన మంచి మాటలను ఈ పుస్తకాల్లో పొందు పరిచాను. భావి తరాలకు ఈ పుస్తకాలు మార్గదర్శకమవుతాయి. -భువనచంద్ర, ప్రసిద్ధ సినీ గేయ రచయిత -
యువతరం అభిరుచుల్లో మార్పు రావాలి
‘సాక్షి’తో సినీగేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు రాజమహేంద్రవరం :‘నాటి పాట హృదయాన్ని తట్టిలేపేది. నేటి పాట శరీరాన్ని పట్టి ఊపుతోంది. యువతరం అభిరుచుల్లో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమా పాటలు వస్తాయ’ని ప్రముఖ సినీ గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి, తెలుగు వెలుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో యువచైతన్య పురస్కారం అందుకోవడానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన సినీ గేయ ప్రస్థానాన్ని ఇలా వివరించారు. ‘‘మాది గుంటూరు జిల్లా రేపల్లె. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎమ్మెస్సీ చదివాను. డి.రామానాయుడి ‘ప్రేయసి రావే’ సినిమాలో తొలిసారిగా ‘తెంచుకుంటే తెగి పోతుందా దేవుడు చేసిన బంధం’ అనే పాట రాశాను. ‘మీ శ్రేయోభిలాషి’ సినిమా కోసం ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ తదితర పాటలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటివరకూ సుమారు 60 సినిమాలకు వందకు పైగా పాటలు రాశాను. ఇటీవల విడుదలయిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా కోసం ‘నీతోనే ఉంది ప్రపంచం.. నీ తీరు మార్చు నేడు కొంచెం’ పాట విమర్శకుల మెప్పు పొందింది.’’ -
గోదావరిని చూస్తే అమ్మ గుర్తుకొస్తుంది
సినీ గేయ రచయిత భువనచంద్ర తెలుగు సినీ రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి భువనచంద్ర. ఆయన స్వస్థలం చింతలపూడి. 12 సంవత్సరాల తరువాత వస్తున్న పుష్కరాలతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆయన ఇలా వివరించారు.. గలగల పారే గోదావరిని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మగారు చంద్రమౌళీశ్వరి రాజమండ్రిలో చనిపోయారు. ఆమె దహన సంస్కారాలు, కర్మకాండలు అన్నీ గోదావరి ఒడ్డునే చేశాం. అందుకే నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా మా అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. అందుకేనేమో గోదావరి అంటే నాకు అంత ప్రాణం. చిన్నప్పుడు అమ్మ చిటికెన వేలు పట్టుకుని గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పటి సంఘటనలు నాకు అంతగా గుర్తు లేకపోయినా పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యం తెలిసింది. అమ్మతో కలిసి పుష్కర స్నానం అయ్యాక ఒడ్డుకు వస్తుంటే ఒక సంఘటన జరిగింది. బారు గెడ్డం, తెల్లటి వస్త్రాలు, భుజంపై పసుపు ఉత్తరీయం వేసుకున్న సాధువు ఒకాయన నా తలమీద చెయ్యి పెట్టి ‘మీ అబ్బాయి మంచి పేరు తెచ్చుకుంటాడు’ అని ఆశీర్వదిస్తూ మా అమ్మగారితో అనడం నాకు ఇంకా గుర్తుంది. పుష్కరాల్లో విక్రయించే జీళ్లు, పూతరేకులంటే నాకు చాలా ఇష్టం. జీళ్లు మా ఊళ్లో కూడా దొరుకుతాయి. కానీ, పూతరేకులు మాత్రం ఇక్కడ తినాల్సిందే. ఈ ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు కూడా అమ్మ దగ్గరికి వస్తాను. అమ్మ ఆశీర్వచనాలు తీసుకుంటాను. అమ్మ భౌతికంగా లేకపోయినా గోదారమ్మ రూపంలో బతికే ఉందనిపిస్తుంది. అందుకే పుష్కరాలు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఇక్కడే ఉండాలని ఉంది. ఇంతవరకూ గోదావరిని కీర్తిస్తూ పాట రాసే భాగ్యం కలగలేదు. అయితే త్వరలో ఒక ఆధ్యాత్మిక నవల రచించే ఆలోచన ఉంది. భగవంతుని ఆశీస్సులతో గోదావరి చెంతనే ఉండి ఈ నవల పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నా చిరకాల కోరిక. - చింతలపూడి (పశ్చిమ గోదావరి) -
తాపీ లేని మేస్త్రీ
-
దర్శకేంద్రుడు, సుద్దాలకు డాక్టరేట్లు
విశాఖపట్నం: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. మంగళవారం విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అగ్నిక్షిపణుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త, డి.ఆర్.డి.వో డైరెక్టర్ జనరల్ అవినాష్ చందర్కు డాక్టర్ ఆఫ్ సైన్స్ను ప్రకటించింది. ఈ నెల 13న జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు గీతం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వివిధ రంగాలకు చెందిన రాఘవేంద్రరావు (సినీ రంగం), సుద్దాల అశోక్ తేజ (సాహిత్యం), శైలజాకిరణ్ (పారిశ్రామిక)లకు గౌరవ డాక్టరేట్లకు... అవినాష్ చందర్ (శాస్త్ర సాంకేతిక) డాక్టర్ ఆఫ్ సైన్స్ కి ఎంపిక చేసినట్లు గీతం పేర్కొంది. -
కొన్ని పాటలు కారు డీజిల్ కోసమే
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ‘‘సినీ పరిశ్రమలో రెండు రకాల పాటలు రాస్తాం. కారు డీజిల్ కోసం కొన్ని ఇష్టం లేని పాటలు రాయకతప్పదు. వాటిని పెన్నుతోనే రాస్తా. సమాజం కోసం మంచి పాటలు రాయడంలో తృప్తి ఉంటుంది. వాటిని మాత్రం గుండెతో రాస్తా. పాలకులు తెలుగును రాష్ట్ర అధికార భాషగా చేయకపోవడం మన దౌర్భాగ్యం’’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న పదిహేనేళ్ల ‘స్పెషల్ జెక్ఫెస్ట్- 14’ వేడుకల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : రాష్ట్రంలో తెలుగు అమలుపై మీ అభిప్రాయం? జవాబు : ఇద్దరు తెలుగోళ్లు కలిస్తే ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. చదువుకున్నవారు తెలుగు మాట్లాడటం నామోషీగా భావిస్తున్నారు. పాలకులు కూడా ఆంగ్లంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఇద్దరు తమిళులు కలిస్తే కచ్చితంగా తమిళంలో మాట్లాడకపోతే చిన్నతనంగా భావిస్తారు. ప్ర: తెలుగు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? జ : తెలుగును కంప్యూటరీకరిస్తే ప్రపంచ భాషగా వర్ధిల్లుతుంది. కంప్యూటకరణతోనే 365 అక్షరాలున్న చైనా భాష, 26 అక్షరాలున్న ఇంగ్లిషు ప్రపంచ ఖ్యాతి పొందినప్పుడు 56 అక్షరాల తెలుగును ప్రపంచ వ్యాప్తి ఎందుకు చేయలేం. ప్ర: మీ పాటలకు ప్రేరణ? జ : మా నాన్న హనుమంతే. ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఆయన అడుగుజాడల్లోనే మా అమ్మ జానకమ్మ ఉద్యమంలో పనిచేశారు. 1951లో తెలంగాణ సాయుధ పోరాటంలో నా తల్లిదండ్రులు సహా 4 వేల మంది ప్రాణాలు అర్పించారు. ఆ పోరాటం స్ఫూర్తితోనే నా పాటల్లో ఉద్యమం, చైతన్యం పుట్టాయి. ప్ర: ఏ సినిమాకు తొలిపాట రాశారు? జ : 1994లో ‘నమస్తే అన్న’ సినిమాకు ‘గరం గరం పోరీ’ పాటరాశా. ఇప్పటివరకు 700 సినిమాలకు 1,700 పాటలు రాశా. త్వరలో వచ్చే బాహుబలి, మనసును మాయ చేయకే తదితర సినిమాల్లో రాస్తున్నా. ప్ర: కొత్త సినిమాల పాటల్లో సాహిత్యం పరిస్థితి? జ : ప్రస్తుత జనరేషన్ను బట్టే సినిమా పాటలు ఉంటున్నాయి. ఏది వదిలేయాలి, ఏది స్వీకరించాలనేది ప్రేక్షకుల నిర్ణయం. ప్ర: ఏఏ సినిమాల్లో నటించారు? జ : శ్రీహరి నటించిన కుబుసంలో నటించా. కొత్తగా వస్తున్న ఆయుధం, అదీ లెక్క సినిమాల్లో నటిస్తున్నా. ప్ర: మీ లక్ష్యం ఏమిటి? జ : పరిశ్రమకు వచ్చిన మూడేళ్లకు నంది, ఐదేళ్లకే జాతీయ అవార్డు తీసుకోవాలనేది నా లక్ష్యం. నంది అవార్డు పొందిన రెండేళ్లకు జాతీయ అవార్డు అందుకున్నా. శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉంది. ప్ర: సినీ పరిశ్రమలో మీ టర్నింగ్ పాయింట్ జ : ఒసేయ్ రాములమ్మ. దాసరి వలనే నాకు పునర్జన్మ వచ్చింది. ఆ సినిమాల్లోని పాటల్లో పల్లెదనం, ఆవేశం, విప్లవం నా పాటలకు ప్రాణం పోశాయి. పాపులర్ అయ్యాను. ప్ర: ప్రైవేట్గా ఎన్ని పాటలు రాశారు? జ : రెండు వేల పాటలు రాశా. నాటికలు, నవలలు కూడా రాశా. 1985లో వెలుగురేఖలు నవలకు విశాలాంధ్ర వారు స్టేట్ ప్రైజ్ ఇచ్చారు. త్వరలో శ్రమపై ఒక కావ్యాన్ని విడుదల చేస్తున్నా. -
నచ్చిన రంగంలోనే మెచ్చుకోలు
పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు గౌరవించాలి ‘శ్రీప్రకాష్’ ముఖాముఖిలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాయకరావుపేట, న్యూస్లైన్: యువత ఆశయాలకు తగ్గట్లుగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత్ శ్రీరామ్ అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థలో బుధవారం సాయంత్రం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు బదులిస్తూ.. అబ్బాయి డాక్టర్, అమ్మాయి ఇంజనీర్ కావాలన్న దృక్పథంతో తల్లిదండ్రులు ఉండటంవల్ల 20 ఏళ్లపాటు అభివృద్ధి జరగలేదన్నారు. ప్రతి విషయంపై అవగాహన ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునన్నారు. ఎవరికి ఇష్టమైన వృత్తి వారు ఎంచుకుంటే 75 శాతంమంది సంతోషంగా ఉంటారన్నారు. ఇదే దృక్పథంతో ఇంజనీరింగ్ విద్య మధ్యలో మానివేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి పదేళ్ల క్రితం వచ్చానన్నారు. ఇప్పటి వరకు 558 పాటలు రచించానని, మొదటి సినిమాతోనే సింగిల్ కార్డు రచయితగా నిలిచానన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, లోక్సత్తా పార్టీలకు ప్రచార గీతాలు రాశానన్నారు. ప్రస్తుత రాజకీయాలు తప్పును ప్రోత్సహిస్తున్నాయని, ఓట్లు అమ్ముడుపోవడం విచారకరమన్నారు. ప్రతి విద్యార్థి పదిమందిలో మార్పు తీసుకువస్తే చాలావరకూ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. అనంతరం శ్రీప్రకాష్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సీహెచ్ విజయ్ ప్రకాష్ అనంత్ శ్రీరామ్కు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వేటూరి సేవాపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కె.ఆర్.జె.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది!
చందమామ సినిమాలో ‘సక్కుబాయినే...’ అనే పాటతో గేయ రచయితగా పరిచయమయ్యాను. దాదాపు 20కి పైగా పాటలు రాశా. వీటన్నింటికి పరోక్షంగా నాపై ప్రభావం చూపిన రచయిత వేటూరి. సాధారణంగా రచయితలందరూ మనకు తెలిసిన విషయాన్ని ఇంకొక కోణంలో చె బుతారు. తెలిసిందే కొత్తగా చెప్పడం కాదు... తెలియని విషయాలు కూడా కొత్తగా, అర్థమైనట్లుగా చెప్పడమే ఆయన కలం బలం. ఒక దళిత కులానికి చెందిన హీరో, ఒక అగ్రకులానికి చెందిన హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమకథ ఆధారంగా డెరైక్టర్ కె.విశ్వనాథ్ కులమతాలకు వ్యతిరేకంగా తీసిన సినిమా ‘సప్తపది’. ఈ సినిమాలో వేటూరిగారి కలం కులాన్ని ఎండగట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఆ మహానుభావుడి కలం నుండి జాలువారిన ఒక ఆణిముత్యం ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’ అనే పాట. ఈ పాట చరణాల్లో ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది/అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది... ఏడు రంగులు కలిస్తేనే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అలాగే అన్ని కులాల వారు కలిసిమెలసి జీవిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఏ కులంలో పుట్టినా భూమ్మీదే పుడతారు, చనిపోయినప్పుడు అందరూ పైకే వెళతారు అనే జీవిత సత్యాన్ని అందంగా చెప్పారు. ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లిధరణి మూగది/నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... అనే వాక్యాల్లో నాకు అర్థమైందేంటంటే అనాది నుండీ ఉన్న ఆకాశం, భూమి అలాగే ఉన్నాయి. ఆ నింగికి, ఈ నేలకు మధ్యలో వచ్చిన మబ్బులు ఎలా అయితే వచ్చి ఉరిమి మాయమైపోతూంటాయో... అలాగే మనం కూడా శాశ్వతం కాదు... అలాంటప్పుడు ఈ కులాల గురించి కొట్లాడుకోవడం ఎందుకు? అని కవి ఈ సమాజాన్ని ప్రశ్నించిన తీరు అమోఘం. వేటూరిగారు రాసిన మరొక పాట కూడా ఈ వర్ణవ్యవస్థను ఎత్తి పొడిచేలా ఉంటుంది. అది గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన/ గోధూళి ఎర్రన ఎందువలన... ఈ పల్లవిలో గోవులు తెల్లగా ఉంటాయి, కృష్ణుడు నల్లగా ఉంటాడు. అలాగే పొద్దుపోయేటప్పుడు గోవులన్నీ ఇంటికి చేరే సమయంలో ఎర్రటి నేలపై అవి వెళ్తునప్పుడు పైకి లేచే ధూళి, ఆ సూర్యుడి కాంతికి మరింత ఎర్రగా మారుతుంటుంది. అన్ని వర్ణాలు ఎందుకని అమాయకంగా చిన్నపిల్లాడిలా కవి ప్రశ్నించాడు. గోపయ్య ఆడున్నా గోపెవ్ము ఈడున్నా/ గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా... అనే వాక్యాలలో గోవుల వెంట ఉన్న ఆ గోపయ్య అక్కడ ఉన్నా, గోపెమ్మ ఇంట్లో ఉన్నా... ఆ గోధూళి ఈ గోపెమ్మకి కుంకుమలాగ అంటదా అని నర్మగర్భంగా చెప్పారు. ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా... అనే దానిలో పొద్దుపొడవడం అంటే సూర్యాస్తమయం కోసం గోపయ్య ఎదురుచూడటం, పొద్దుగడవడం అంటే గోవులను తోలుకెళ్లిన గోపయ్య ఆలోచనల్లో గోపెమ్మకు కాలం గడవకపోవటం అని మనిషికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని కవితాత్మకంగా చెప్పారు. పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు/అల్లన మోవికి తాకితే గేయాలు... అనే వాక్యాలలో ఆ మురళికి ఉండే ఏడు రంధ్రాలు గాయాలు అనగలిగే ధైర్యం ఉన్నవారు వేటూరి మాత్రమే. ఆ మురళి మూగైనా... ఆ పెదవి మోడైనా... లో ఆ మురళి మూగదైపోయినా, మన పెదాలు మోడై పోయినా...ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా అని ప్రశ్నించడంలోనే వేటూరి అంతరంగం అర్థమవుతుంది. అదేవిధంగా ‘ఈ కడిమి పూసేనా... ఆ కలిమి చూసేనా’ లో కడిమి పూలు త్వరగా పూయవు... అలాగే ఐశ్వర్యం వెనువెంటనే రాదు... అంటే చెట్టుకు పూలే అందం కదా, మోడువారిన ఆ చెట్టు పూలు పూయడమంటే అన్నీ కోల్పోయి నిరుపేదగా మిగిలిన వాడు కూడా తిరిగి ఐశ్వర్యంతో తులతూగడం లాంటిదే! అది ఎందుకూ అంటే దైవలీల అంటూ అలవోకగా దైవం మీదకు దృష్టిని మళ్లించేశారు కవి. నాకు తెలిసి పాటె లా రాయాలో తెలియనివారికీ వేటూరి చూపించిన... ‘వే’టూరిస్టు గైడులాంటిది ఈ పాట. లక్ష్మీభూపాల్ సినీ గేయ రచయిత