Mahela Jayawardene
-
IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా మహేళ జయవర్దనే
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా మహేళ జయవర్దనే మళ్లీ నియమితుడయ్యాడు. జయవర్దనే 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా పని చేశాడు. 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిళ్లు అందించాడు. అనంతరం జయవర్దనే ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ద క్రికెట్గా నియమితుడయ్యాడు. తిరిగి అతను 2025 ఎడిషన్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.జయవర్దనే ప్రస్తుత హెడ్ కోచ్ మార్క్ బౌచర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. బౌచర్ 2023, 2024 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా పని చేశాడు. బౌచర్ ఆథ్వర్యంలో ఎంఐ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నూతన హెడ్ కోచ్గా జయవర్దనే నియామకాన్ని ఎంఐ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ స్వాగతించారు. జయవర్దనే నాయకత్వ లక్షణాలు, క్రికెట్ పరిజ్ఞానం ముంబై ఇండియన్స్కు లబ్ది చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంగా ఆకాశ్ మార్క్ బౌచర్పై ప్రశంసల వర్షం కురిపించారు. గత రెండు సీజన్లలో అతను అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో బౌచర్ సభ్యుడిగా కొనసాగుతడని పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే..టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరనున్నాడు. మాంబ్రే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రాజస్థాన్ రాయల్స్తో చేరిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఇంకా టీమిండియాతోనే కొనసాగుతున్నాడు.చదవండి: ఇంగ్లండ్తో చివరి రెండు టెస్ట్లు.. సీనియర్లపై వేటు -
WC 2023: కోహ్లి సరికొత్త చరిత్ర.. జయవర్దనే రికార్డు బద్దలు! ఇక మిగిలింది..
ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్ కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో పుణెలో గురువారం(అక్టోబరు 19) నాటి మ్యాచ్లో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్లో 21వ ఓవర్ మూడో బంతికి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్తో కలిసి సింగిల్ తీసిన ఈ రికార్డుల రారాజు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో 25958* పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో జయవర్దనే(25957) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లి అధిగమించాడు. ఇక బంగ్లాతో మ్యాచ్లో గనుక ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ మొత్తంగా 77 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 26 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంటుంది. కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు ►సచిన్ టెండుల్కర్(ఇండియా)-34357 ►కుమార్ సంగక్కర(శ్రీలంక)- 28016 ►రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 27483 ►విరాట్ కోహ్లి(ఇండియా)- 25958* ►మహేల జయవర్ధనే(శ్రీలంక)- 25957 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
అంతర్జాతీయ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో వరసగా అత్యధిక ఇన్నింగ్స్లలో రెండు అంకెల స్కోర్ సాధించిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 57 పరుగులు చేసిన హిట్మ్యాన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ టెస్టుల్లో వరుసగా 30 ఇన్నింగ్స్ల్లో రెండంకెల స్కోరు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం మహేలా జయవర్ధనే పేరిట ఉండేది. జయవర్ధనే వరుసగా 29 టెస్టు ఇన్నింగ్స్లలో రెండంకెల స్కోరు నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో జయవర్ధనే రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక రోహిత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన హిట్మ్యాన్.. రెండో టెస్టులో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో రోహిత్ 240 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తమ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్వుడ్(20) పరుగులతో ఉన్నారు. చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! ఇంగ్లండ్కు కూడా సాధ్యం కాలేదు -
భారత్ టెస్టు సిరీస్ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంటుందని జయవర్ధనే జోస్యం చెప్పాడు. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు.. స్వదేశంలో పటిష్టమైన టీమిండియాకు గట్టిపోటీ ఇస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా చివరసారిగా 2004లో భారత గడ్డపై టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. అప్పటినుంచి స్వదేశంలో కంగూరులపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుంది. ఇక ఓవరాల్గా 2015 తర్వాత కూడా ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. చివరగా 2020-21లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. "ఆసీస్-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ఎప్పటికీ చారిత్రాత్మక సిరీస్గా ఉంటుంది. ఇక భారత పరిస్థితులకు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆస్ట్రేలియా వద్ద అద్భుతమైన బౌలింగ్ యూనిట్ ఉంది. కాబట్టి ఆసీస్ బౌలర్లను భారత బ్యాటర్లు ఎంతవరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. అయితే తొలి మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో వాళ్లకి ఒకఅద్భుతమైన ప్రారంభం దొరికొనట్లు అవుతోంది. కానీ సిరీస్ విజేత ఎవరన్నది ఊహించడం చాలా కష్టం. నా వరకు అయితే ఈ సిరీస్లో భారత్పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందని అనుకుంటున్నాను. అయితే భారత్ నుంచి ఆస్ట్రేలియాకు మాత్రం తీవ్రమైన పోటీ ఉంటుంది" అని జయవర్ధనే ది ఐసీసీ రివ్యూ తాజా ఎడిషన్లో పేర్కొన్నాడు. కాగా నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్కు నో ఛాన్స్ -
బంగ్లాతో తొలి టెస్ట్.. విరాట్ కోహ్లిని ఊరిస్తున్న అరుదైన రికార్డు
భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ సిరీస్ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్కు దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టు సారధిగా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ సిరీస్ నుంచి వైదొలగడంతో జట్టులో మూడు మార్పులు జరిగాయి. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రాగా.. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరారు. ఈ మార్పులతో పాటు ముందుంగా ప్రకటించిన జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన రిషబ్ పంత్ బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పంత్ స్థానంలో చతేశ్వర్ పుజారాను ఎంపిక చేసింది. చట్టోగ్రామ్ వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 9 గంటల నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ సాధిస్తే, ఓ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే టీ20 (ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై), వన్డేల్లో (మూడో వన్డేలో బంగ్లాదేశ్పై)సెంచరీలు బాదిన కోహ్లి.. రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. మహేళ జయవర్ధనే (2010), సురేశ్ రైనా (2010), తిలకరత్నే దిల్షాన్ (2011), అహ్మద్ షెహజాద్ (2014), తమీమ్ ఇక్బాల్ (2016), కేఎల్ రాహుల్ (2016), రోహిత్ శర్మ (2017), డేవిడ్ వార్నర్ (2019), బాబర్ ఆజమ్ (2022) సరసన చేరతాడు. బంగ్లాపై తొలి టెస్ట్లో సెంచరీ చేస్తే కోహ్లి తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 73కు పెంచుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి (72) ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు.. శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్దీప్ సైనీ -
T20 WC IND VS BAN: చరిత్ర సృష్టించనున్న కింగ్ కోహ్లి..!
టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (నవంబర్ 2) జరుగునున్న కీలకమైన మ్యాచ్లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించబోతున్నాడా..? కింగ్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే అవుననే చెప్పాలి. ఇంతకీ కోహ్లి సృష్టించబోతున్న ఆ చరిత్ర ఏంటీ అంటే..? టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్ల్లో 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేసిన కోహ్లి.. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో మరో 16 పరుగులు చేస్తే, మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు ప్రస్తుతం శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే టీ20 వరల్డ్కప్ల్లో 31 మ్యాచ్లు ఆడి 1016 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2022 IND VS BAN Live Updates: తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో కింగ్ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. -
కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. తొలి భారత క్రికెటర్గా అరుదైన ఘనత
టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 30) జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 12 పరుగులకే ఔటైనా అతని ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కోహ్లి 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి టీ20 వరల్డ్కప్ల్లో 22 ఇన్నింగ్స్లు ఆడి 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో కోహ్లి 28 పరుగులు చేసి ఉంటే.. శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే వాడు. జయవర్ధనే టీ20 వరల్డ్కప్ల్లో 31 మ్యాచ్లు ఆడి 1016 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి సౌతాఫ్రికాతో మ్యాచ్లో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో కోహ్లి సహా టాపార్డర్ మొత్తం విఫలం కావడంతో టీమిండియా 49 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్ మరోసారి ఆపద్బాంధవుడిలా ఆదుకుని జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్య.. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 115/6గా ఉంది. -
అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్
T20 World Cup 2022: ఆసియా కప్- 2022 టీ20 టోర్నీ ఆరంభ మ్యాచ్లలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ముఖ్యంగా లీగ్ దశలో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో జడ్డూ పాత్ర మరువలేనిది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 35 పరుగులు సాధించాడు. మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సహకారం అందిస్తూ టీమిండియా గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ఇక హాంకాంగ్తో మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక సూపర్-4 స్టేజ్లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో వరుసగా ఓటమి పాలైన రోహిత్ సేన.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా(Twitter Pic) గాయం కారణంగా! ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్ల తర్వాత టీ20 ప్రపంచకప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది టీమిండియా. ఇందుకోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే, ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో జడేజా ఈ ఐసీసీ ఈవెంట్కు దూరమయ్యాడు. జడ్డూ లేకపోవడం తీరని లోటు! అయితే.. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కీలక వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా ప్రపంచకప్ జట్టులో లేకపోవడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి జడేజా చక్కగా సరిపోతాడన్న జయవర్ధనే.. ఆరో స్థానంలో వచ్చే మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేయగలడని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి జోడీ బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేస్తుందని పేర్కొన్నాడు. కానీ జడేజా గాయం కారణంగా జట్టుకు దూరం కావడం టీమిండియాకు తీరని లోటు అని వ్యాఖ్యానించాడు. అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్లో ఉండటం రోహిత్ సేనకు కలిసి వచ్చే అంశమని జయవర్ధనే పేర్కొన్నాడు. కోహ్లి వంటి ప్రమాదకర ఆటగాడి వల్ల ప్రత్యర్థి జట్టుకు తిప్పలు తప్పవని.. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా తయారైందన్నాడు. ఏదేమైనా.. ఆస్ట్రేలియాలో వరల్డ్కప్ టీమిండియాకు గొప్పగా ఉండబోతోందని జయవర్ధనే జోస్యం చెప్పాడు. చదవండి: మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్! ఫెడ్డీలో మనకు తెలియని కోణం! Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే.. -
ముంబై ఇండియన్స్లో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి ప్రమోషన్
ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తమ నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. ప్రధాన కోచ్ మహేళ జయవర్థనేతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్కు ప్రమోషన్ కల్పించి అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయవర్దనేకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పిన యాజమాన్యం.. జహీర్ ఖాన్ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్గా ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 🚨 Head Coach ➡️ Global Head of Performance 🌏 We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance 🙌💙#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ — Mumbai Indians (@mipaltan) September 14, 2022 ఎంఐ యాజమాన్యం ఖాళీ అయిన జయవర్ధనే, జాక్ల స్థానాలకు త్వరలో భర్తీ చేయనుంది. జయవర్ధనే 2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా పని చేస్తుండగా.. జహీర్ ఖాన్ 2019లో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు. 🚨 Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development 🌏 Let's welcome ZAK as our Global Head of Cricket Development 🙌#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J — Mumbai Indians (@mipaltan) September 14, 2022 జయవర్ధనే, జహీర్ ఖాన్ కొత్త బాధ్యతలేంటి.. ఎంఐ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్గా బాధ్యతలు చేపట్టనున్న జయవర్ధనే.. కొత్త పాత్రలో ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), ఎంఐ కేప్టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు సంబంధించిన కోచింగ్ స్టాఫ్కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. జహీర్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ప్లేయర్స్ డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అలాగే న్యూ టాలెంట్ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతలు చూస్తాడు. -
అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే: జయవర్ధనే
కెరీర్లో తాను ఎదుర్కొన్న అత్యంత ఉత్తమమైన, కఠినమైన ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అన్నాడు. అతడితో మ్యాచ్ అంటేనే పీడకలలా ఉండేదని గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో జయవర్దనే క్రికెటర్గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే అద్భుతమైన బౌలర్గా నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక- పాకిస్తాన్ తలపడిన ప్రతిసారి వసీం బౌలింగ్ అంటే తాను భయపడేవాడినంటూ జయవర్ధనే తాజాగా వ్యాఖ్యానించాడు. ఐసీసీ డిజిటల్ షోలో అతడు మాట్లాడుతూ తన అనుభవం గురించి పంచుకున్నాడు. మీరు ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వసీం అక్రమ్. అతడు తన కెరీర్ పీక్లో ఉన్నపుడు నేను అరంగేట్రం చేశాను. తన చేతిలో కొత్త బంతి ఉందంటే అంతే ఇక! అతడిని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని! నిజంగా పీడకలలా అనిపించేది. వసీం బౌలింగ్ యాక్షన్ బాగుంటుంది. బ్యాటర్న ఇబ్బంది పెట్టడం తనకు వెన్నతో పెట్టిన విద్య’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. నిలకడగా బౌలింగ్ చేయడంలో వసీం అక్రమ్ దిట అని ప్రశంసించాడు. కాగా పాక్ మాజీ సారథి వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్లో 916 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టు వికెట్లు 414. వన్డే వికెట్లు 502. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్ను వదిలేస్తే.. చీప్గానే కొనుక్కోవచ్చు! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! -
దిగ్గజ క్రికెటర్ టీ20 జట్టు టాప్-5లో ఉన్నది వీళ్లే!
Mahela Jayawardene First 5 Players Of His T20 XI: తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ మహేళ జయవర్దనే ప్రకటించాడు. ఇందులో అఫ్గనిస్తాన్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి, ఇంగ్లండ్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్-5గా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్తో వర్చువల్గా మాట్లాడిన జయవర్దనే ఈ మేరకు తన జట్టులోని టాప్-5ని వెల్లడించాడు. ఇంతకీ ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరంటే.. రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్. ది ఐసీసీ రివ్యూలో భాగంగా ఈ ముంబై ఇండియన్స్ కోచ్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... టీ20 క్రికెట్లో బౌలర్లదే కీలక పాత్ర పాత్ర. రషీద్ ఖాన్ విషయానికొస్తే అతడు మంచి స్పిన్నర్. అదే విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఐపీఎల్-2022లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి చెబుతూ.. ‘‘జోస్తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. తను దూకుడైన బ్యాటర్. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఏఈలో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. అద్భుతంగా రాణించాడు’ అని ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్పై జయవర్దనే ప్రశంసలు కురిపించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్గా జయవర్దనే అభివర్ణించాడు. అందుకే అతడిని తన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సంజనాను ఉద్దేశించి.. ‘‘నువ్వు సిగ్గు పడొద్దు సంజనా.. ఎందుకంటే నేను చెప్పబోయేది నీ భర్త పేరే’’ అని జయవర్దనే పేర్కొనడం విశేషం. ఇక బుమ్రాతో పాటు పాకిస్తాన్ స్పీడ్స్టర్ షాహిన్ ఆఫ్రిది, మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు అతడు చోటిచ్చాడు. చదవండి👉🏾IPL 2022: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మూడో అంపైర్ జోక్యం చేసుకోవాలి’
బ్యాటర్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చే ‘నోబాల్స్’ విషయంతో మూడో అంపైర్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఢిల్లీ, రాజస్తాన్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో ‘నోబాల్’ అంశం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ దశను మార్చే కీలక సమయాల్లో అంపైర్లు ఈ విషయాన్ని పరిశీలించమంటూ థర్డ్ అంపైర్ కోరటం సరైందని అతను సూచించాడు. జయవర్ధనే ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజస్తాన్తో మ్యాచ్లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది. చదవండి: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. -
Mumbai Indians: ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది..!
ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా ఎనిమిది ఓటములు చవిచూసి ప్లే ఆఫ్స్ బరి నుంచి దాదాపుగా తప్పుకున్న ముంబై ఇండియన్స్.. జట్టు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 24) లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. తదుపరి మ్యాచ్లకు ముంబై జట్టులో కీలక మార్పులు తప్పవని ఆయన పేర్కొన్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. త్వరలోనే వారివురు సెట్ అవుతారనే ధీమాను వ్యక్తం చేశాడు. కొత్త కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ఆయన కితాబునిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపిస్తున్నా, పోలార్డ్ పేలవ ఫామ్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు. బేబీ ఏబీడి డెవాల్డ్ బ్రెవిస్కు మరిన్ని అవకాశాలిస్తామని క్లూ ఇచ్చాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్లపై తమ బ్యాటింగ్ దళం సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం ఆందోళనకరమేనని అంగీకరించాడు. కోచింగ్ స్టాఫ్ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జట్టులో అవసరమైన మార్పులు ఉంటాయని హింటిచ్చాడు. బౌలర్ల ప్రదర్శన సైతం ఏమంత ఆశాజనకంగా లేదని ఒప్పుకున్నాడు. బుమ్రా ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడని, డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారని, సీనియర్ బౌలర్గా ఉనద్కత్, టీ20 స్పెషలిస్ట్గా పోలార్డ్ రాణించలేకపోతున్నారని వివరించాడు. కొత్త కుర్రాడు హృతిక్ షోకీన్ పర్వాలేదనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. మొత్తంగా ఒత్తిడి, నిలకడలేమి కారణంగా ప్రస్తుత సీజన్లో తమ జట్టు పరాజయాల బాట పట్టిందని తెలిపాడు. చదవండి: కింగ్స్ ఫైట్లో గెలుపెవరిది..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లంక ఆర్థిక సంక్షోభం.. తరలివస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్ Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
IPL 2022: ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలు బంద్
IPL 2022 Broadcast Goes Off In Sri Lanka: తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలు కూడా బంద్ అయ్యాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపి వేశాయి. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నెలకొన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఐపీఎల్ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేసే మూడ్లో లేరని, అందుకే ఐపీఎల్ టెలికాస్ట్పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం మానేశాయి. కనీసం డిజిటల్ పేపర్లలో కూడా ఐపీఎల్ వార్తల ప్రస్తావన లేదు. ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్ల వనిందు హసరంగ (ఆర్సీబీ), భానుక రాజపక్స (పంజాబ్), దుష్మంత చమీర (లక్నో సూపర్ జెయింట్స్), చమిక కరుణరత్నే (కోల్కతా నైట్ రైడర్స్)లను పట్టించుకునే నాధుడే లేడు. మరోవైపు దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లంక మాజీలు గళం విప్పుతున్నారు. చదవండి: మీతో కాకపోతే చెప్పండి.. నేనొస్తా..! సన్రైజర్స్, లక్నో జట్లకు బెంగాల్ మంత్రి ఆఫర్ -
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు
Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు, హెడ్ కోచ్లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం.. వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్లో ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు. కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190, చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్కు లక్నో, గుజరాత్..! -
శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్గా లసిత్ మలింగ!
శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా ఆ జట్టు దిగ్గజం లసిత్ మలింగ ఎంపికయ్యే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్కు మలింగని కన్సల్టెంట్ కోచ్గా నియమించాలని హై-ప్రొఫైల్ క్రికెట్ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక గత ఏడాదిలో అన్ని ఫార్మాట్ల నుంచి మలింగను తప్పుకున్న సంగతి తెలిసిందే. తన టీ20 కేరిర్లో 390 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా తొమ్మిది వన్డేల్లో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించిన మలింగ ఒక్క సారి కూడా జట్టును గెలిపించ లేకపోయాడు. అదే విధంగా 24 టీ20ల్లో సారధ్యం వహించిన మలింగకు 15 సార్లు పరాజయం ఎదురైంది. ఇక అతడితో పాటు మహేల జయవర్ధనే కూడా కన్సల్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. చదవండి: Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్ ఛాన్స్.. ఏకంగా విండీస్తో సిరీస్తో.. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో జయవర్ధనే, పొలాక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ షాన్ పొలాక్లతో పాటు ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్లు ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆరంభానికి ముందు వీరిని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో అధికారికంగా చేరుస్తారు. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్గా షాన్ పొలాక్ ఘనతకెక్కాడు. బ్రిటిన్ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది. -
Mahela Jayawardene: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు..
Mahela Jayawardene Comments On Sri Lanka Defeat: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో జట్ల జయాజయాలపై మంచు ప్రభావం స్పష్టంగా కనబడుతోందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే అన్నాడు. అదే విధంగా టాస్... గెలుపును నిర్దేశించే కీలక అంశంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడే శ్రీలంక వంటి జట్లకు ఇది నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా మెరుగ్గా రాణించిన చోట... శ్రీలంక బౌలర్లు అతడి స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి మంచు కారణమని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయవర్ధనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శ్రీలంక స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ బంతి జారిపోవడం మొదలుపెట్టింది. గ్రిప్ అంతగా దొరకలేదు. ఆడం జంపా ప్రభావం చూపగలిగిన పిచ్పై.. అందుకే వాళ్లు మెరుగ్గా రాణించలేకపోయారు’’ అని జయవర్దనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా... ‘‘దుబాయ్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో టాస్ గెలిచిన కెప్టెన్లనే విజయాలు వరించాయి. రెండో దఫా బౌలింగ్ చేసే జట్లకు.. ముఖ్యంగా స్పిన్నర్లకు పిచ్ ఏమాత్రం సహకరించడం లేదు. టీ20 వరల్డ్కప్ వంటి ప్రధాన టోర్నీల్లో ఇలా జరగడం.. కెప్టెన్లను తప్పక టాస్ గెలవాల్సిన పరిస్థితుల్లోకి నెడుతోంది’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఇక గురువారం నాటి మ్యాచ్లో పవర్ప్లేలో వనిందు హసరంగ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక.. స్కోర్లు శ్రీలంక- 154/6 (20) ఆస్ట్రేలియా-155/3 (17) చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్ -
టీమిండియా కోచ్ పదవి వద్దన్న లంక మాజీ క్రికెటర్!
ముంబై: టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త కోచ్కు సంబంధించి వెతుకులాట మొదలుపెట్టిందని సమాచారం. దీనికి అనుగుణంగానే కోచ్ పదవికి సంబంధించి రోజుకో పేరు బయటికి వస్తుంది. తొలుత ద్రవిడ్, సెహ్వాగ్లలో ఎవరు ఒకరు కోచ్ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుంబ్లే, లక్ష్మణ్ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా బీసీసీఐ శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనేకు కోచ్ పదవి ఆఫర్ కోసం సంపద్రించినట్లు రిపోర్ట్స్ ద్వారా సమాచారం అందింది. అయితే జయవర్దనే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా కోచ్ పదవిపై జయవర్దనేకు ఆసక్తి లేదట. అంతేగాక అతను ప్రస్తుతం శ్రీలంక అండర్-19 క్రికెట్ టీమ్కు కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్ కంటే శ్రీలంక ప్రధానకోచ్గా ఉండేదుకు ఇష్టపడుతున్నట్లు సమాచారం. చదవండి: Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్గా మరోసారి ఆయనే! ఇక జయవర్దనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2017 నుంచి ముంబై ఇండియన్స్కు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయవర్దనే కోచ్గా 2017, 2019లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ రూల్స్ ప్రకారం టీమిండియా ప్రధాన కోచ్గా ఉండాలంటే ఏ జట్టుకు కోచ్గా కొనసాగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జయవర్దనేను వదులుకోవడానికి ఇష్టపడదు. అందులోనూ శ్రీలంక క్రికెట్లో ఇలాంటి రూల్స్ లేవు. ఒక రకంగా జయవర్దనే టీమిండియా కోచ్ పదవి వద్దనడానికి ఇది కూడా ఒక కారణంగా భావించొచ్చు. అయితే ఇప్పటికైతే జయవర్దనే బీసీసీఐకి తెలిపిన విషయంలో క్లారిటీ లేదు. టి 20 ప్రపంచకప్ తర్వతే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుంది. ఇక జయవర్దనే లంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందాడు. బ్యాట్స్మన్గా... కెప్టెన్గా లంక జట్టుకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. లంక తరపున 448 వన్డేల్లో 12560 పరుగులు, 149 టెస్టు మ్యాచ్ల్లో 11814 పరుగులు, 55 టి20 మ్యాచ్ల్లో 1493 పరుగులు చేశాడు. జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 54 సెంచరీలు చేశాడు. దీనితో పాటు ఏడు డబుల్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఐపీఎల్లో 80 మ్యాచ్లాడిన జయవర్దనే 1802 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్కప్ గెలవాలి -
లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే!
ముంబై: అర్జున్ టెండుల్కర్లో దాగున్న క్రీడా నైపుణ్యాల ఆధారంగానే అతడిని కొనుగోలు చేశామని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటం ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, తను కూడా ఈ లీగ్ ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉందన్నాడు. కాగా గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో భాగంగా, అంబానీ కుటుంబానికి చెందిన ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల బేస్ప్రైస్కు వేలంలోకి రాగా, అదే ధరకు అతడిని సొంతం చేసుకుంది. కాగా ఈ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మెంటార్గా వ్యవహరిన్నాడు. దీంతో అతడి కుమారుడిని జట్టులోకి తీసుకోవడంపై సహజంగానే విమర్శలు వినిపించాయి. ఇందుకుతోడు రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన తీరు, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో జయవర్ధనే మాట్లాడుతూ.. ‘‘అర్జున్ తలపై సచిన్ కుమారుడు అనే అతిపెద్ద ట్యాగ్ ఉండటం సహజం. అయితే అదృష్టవశాత్తూ అతడు బ్యాట్స్మెన్ కాకుండా, బౌలర్ అయ్యాడు. నిజానికి అర్జున్ బౌలింగ్ తీరు పట్ల సచిన్ ఎంతో గర్వపడతారు. అయితే మేం కేవలం బౌలింగ్ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నాం. ఇంతవరకు ముంబై తరఫున ఆడిన అర్జున్, ఇప్పుడు ఎంఐకి ఆడబోతున్నాడు. ఆట పట్ల తనకున్న శ్రద్ధ అమోఘం. తనపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమే మా బాధ్యత. మిగతాది తనే చూసుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ఖాన్ సైతం అర్జున్ నెట్స్లో కఠినంగా శ్రమిస్తాడని, తనొక అంకిత భావం గల యువ ఆటగాడు అని కితాబిచ్చాడు. ఇదిలా ఉండగా.. తనకు ఐపీఎల్ ఆడే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు చెబుతూ అర్జున్ మాట్లాడిన వీడియోను ముంబై షేర్ చేసింది. A ballboy at Wankhede before 🏟️ Support bowler last season 💪 First-team player now 💙 It's showtime, Arjun! 😎#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/OgU4MGTPe1 — Mumbai Indians (@mipaltan) February 18, 2021 చదవండి: ఒక్క హైదరాబాద్ ప్లేయర్కీ చోటులేదు: అజారుద్దీన్ వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు! -
పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు
వన్డేల్లో రెగ్యులర్ బౌలర్లు.. ఆల్రౌండర్లు.. పార్ట్టైమ్ బౌలర్లు ఉండడం సహజం. టీమిండియాలో సచిన్, సెహ్వాగ్ లాంటి వారు పార్ట్టైమ్ బౌలర్లుగా రాణించారు.. మ్యాచ్లు గెలిపించారు. కానీ ఏబీ డివిలియర్స్, మహేళ జయవర్దనే, స్టీఫెన్ ప్లెమింగ్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సయీద్ అన్వర్,మహ్మద్ యూసఫ్ ఇలా ఎవరిని చూసుకున్నా వీరంతా ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్లుగానే పేరు పొందారు. బ్యాట్స్మెన్లుగా ఒకప్పుడు సత్తా చాటినవారు కొందరు ఉంటే.. మరికొందరు ఇప్పుడు కూడా రాణిస్తూనే ఉన్నారు. అయితే కెరీర్ మొత్తం బ్యాటింగ్కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అరుదుగా బౌలింగ్ చేసేవారు. బ్యాట్స్మెన్లుగా తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించిన వీళ్లు అప్పుడప్పుడు బౌలర్ అవతారమెత్తి వికెట్లు కూడా తీశారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఐసీసీ పాతతరం.. కొత్తతరం క్రికెటర్లు తమ జట్లకు బౌలింగ్ చేసిన ఒక మొమరబుల్ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి : స్వదేశంలో కలిసొచ్చింది.. మరి విదేశంలో) ఈ వీడియోలో మనకు ఎప్పుడు బౌలింగ్ చేసినట్లు కనిపించని జయవర్దనే.. ఏబీ డివిలియర్స్.. ఎంఎస్ ధోని..స్టీఫెన్ ప్లెమింగ్ లాంటివారు బౌలింగ్ చేయడమే గాక వికెట్లు తీయడం చూపించారు. మీకు టైముంటే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్సవ్వద్దు అంటూ క్యాప్షన్ జతచేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన వీడియో కాస్త కొత్తగా ఉండడంతో వైరల్గా మారింది. (చదవండి : కూతురును చూసి మురిసిపోతున్న స్టార్ క్రికెటర్) 🤯 Virat Kohli, AB de Villiers, Mahela Jayawardene ... picking up international wickets! Here's a video you don't want to miss 😄 pic.twitter.com/IkROsA3tew — ICC (@ICC) December 16, 2020 -
ఆధారాల్లేవ్
కొలంబో: ఒక రాజకీయ నాయకుడి ఆరోపణలను ప్రామాణికంగా తీసుకొని మ్యాచ్ ఫిక్సింగ్పై విచారణ పేరుతో తమ దిగ్గజ క్రీడాకారులను అవమానిస్తున్నారంటూ దేశంలో తీవ్ర విమర్శలు రావడంతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో లంక పరాజయంపై ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి కనీస ఆధారాలు లేవని, ఇకపై ఎలాంటి విచారణ ఉండబోదని లంక పోలీసులు స్పష్టం చేశారు. మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇక సందేహించేందుకు ఎలాంటి అవకాశం కనిపించలేదని వారు వెల్లడించారు. భారత్ గెలిచిన నాటి ఫైనల్ను కొందరు ఫిక్స్ చేశారంటూ అప్పటి క్రీడా మంత్రి మహిదానంద అలుత్గమగే ఆరోపించారు. ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై విచారించమంటూ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ డివిజన్ను ఆదేశించింది. ‘మహిదానంద చేసిన 14 ఆరోపణల్లో ఒక్కదానికీ కనీస ఆధారం లేదు. మున్ముందు ఆటగాళ్లను ప్రశ్నించాల్సిన అవసరమూ రాదు. మా అంతర్గత చర్చల తర్వాత విచారణను ముగించాలని నిర్ణయించుకున్నాం. మా నివేదికను కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శికి పంపిస్తాం’ అని దర్యాప్తు అధికారి జగత్ ఫొన్సెకా స్పష్టం చేశారు. నాటి చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాతో పాటు కెప్టెన్ సంగక్కర, సీనియర్ బ్యాట్స్మన్ జయవర్ధనే, ఓపెనర్ తరంగలను పోలీసులు విచారించారు. ఫైనల్ మ్యాచ్ చివరి నిమిషంలో తుది జట్టులో నలుగురు ఆటగాళ్లను మార్చడంపై సందేహాలున్నాయని మహిదానంద ఆరోపించారు. ‘దీనిపై కూడా స్పష్టమైన వివరణ లభించింది. కాబట్టి జట్టులోని మిగతా ఆటగాళ్లను విచారించడం కూడా అనవసరమని భావించాం’ అని ఫొన్సెకా చెప్పారు. ఫైనల్ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత ఇలా వ్యవహరించడంపై తొలి రోజునుంచే పలువురు క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శించారు. మాకూ అనుమానాల్లేవు... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కూడా స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగిన తీరును అనుమానించాల్సిన అవసరమే లేదని ఐసీసీ ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ చెప్పారు. ‘ఈ మ్యాచ్ గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలపై మేం కూడా దృష్టి పెట్టాం. కొత్తగా విచారణ జరిపేందుకు కావాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు’ అని ఆయన పేర్కొన్నారు. -
టీమిండియా కోచ్ రేసులో జయవర్థనే..!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే ముందంజలో ఉన్నట్లు సమాచారం. టీమిండియా కోచ్ పదవిపై జయవర్థనే అత్యంత ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే అతడు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు తీసుకొచ్చింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల వయసు మించరాదని పేర్కొంది. ప్రధాన కోచ్ సహా బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ను తిరిగి నియమించుకోనుంది. జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా ఆయా పదవులకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. ప్రస్తుతం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు జయవర్థనేతో పాటు టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిరెస్టన్, టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు మహేలా జయవర్ధనే కోచ్గా ఎంపికైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో రెండుసార్లు ఆ జట్టు ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. దీంతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్కు ప్రపంచకప్ ముగిసే నాటికి పదవీకాలం పూర్తయ్యింది. అయితే వెస్టిండీస్ సిరీస్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ వీరికి 45 రోజుల గడువును పెంచింది. -
ఇప్పుడు చెప్పండ్రా.. మలింగా హేటర్స్!
లండన్ : లసిత్ మలింగా.. ఇప్పుడు శ్రీలంక అభిమానులకు ఆరాధ్య దైవం. శుక్రవారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంకను ఒంటి చేత్తో గెలిపించిన సీనియర్ ఆటగాడు. 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్ను 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించకుండా మట్టికరిపించిన బౌలర్. ప్రపంచకప్ టైటిల్ ఆశలను సజీవంగా నిలిపిన సూపర్ బౌలర్. కానీ వారం రోజుల క్రితం.. ఇదే మలింగా అభిమానుల దృష్టిలో అన్ఫిట్ ఆటగాడు. పొట్ట ఉన్న క్రికెటర్. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన ఆటగాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీకెప్టెన్ మహేల జయవర్థనే ‘ఇప్పుడు చెప్పండ్రా మలింగా హేటర్స్’ అంటున్నాడు. ‘ఓ పుస్తకం కవర్ పేజీ చూసి దానిపై ఓ నిర్ణయానికి రాకుడదూ.. మలింగా నీ బౌలింగ్ అద్భుతం’ అంటూ మలింగా షర్ట్లెస్ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితం ఈ షర్ట్లెస్ ఫొటోపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని శరీరాకృతిని ప్రస్తావిస్తూ అభిమానులు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు మలింగా తన ఆటతోనే బదులిచ్చాడు. తాను ఎంత కీలకమైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. ఇక మలింగా బౌలింగ్ వీరంగానికి బెయిర్స్టో డకౌట్ కాగా.. విన్స్ (14), కెప్టెన్ మోర్గాన్ (21), బట్లర్ (10)లు పెవిలియన్ బాటపట్టారు. టాపర్డర్ను మలింగా దెబ్బతీయగా.. ధనంజయ డిసిల్వా (3/32) లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్టోక్స్ (89 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేసినా.. శ్రీలంక పక్కా ప్రణాళికతో అతన్నికట్టడి చేసింది. స్టోక్స్ బ్యాటింగ్ గురించి మ్యాచ్ అనంతరం మలింగా మాట్లాడుతూ.. స్టోక్స్ ఎంత దాటిగా ఆడగలడో మాకు తెలుసు. అప్పటికే అతను వరుస బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో అతన్ని స్టాక్బాల్స్ వ్యూహంతో కట్టడి చేశాం. లూస్ బంతులు వేయకుండా.. లైన్ అండ్ లెంగ్త్కు బౌన్సర్లతో కూడిన వైవిధ్యమైన బంతులు వేశాం. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్మెన్పై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రణాళిక. దాన్ని విజయవంతంగా అమలు చేశాం.’ అని మలింగా చెప్పుకొచ్చాడు. ఇక మలింగా దిగ్గజమంటూ (4/43) ప్రదర్శనను శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొనియాడాడు. View this post on Instagram Well bowled Mali!!! Thought i would share the most talked about picture last week for all you fans..😉👍👊 A post shared by Mahela Jayawardena (@mahela27) on Jun 21, 2019 at 10:54am PDT -
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు కానీ కప్ గెలిచాం
-
క్యాప్లు సాధించకున్నా.. కప్ గెలిచాం..
హైదరాబాద్: సమష్టి కృషితోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ట్రోఫీని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుందని ఆ జట్టు ప్రధాన కోచ్ మహేళ జయవర్దనే పేర్కొన్నాడు. బహుమతి ప్రధానాత్సోవం అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లును ఉద్దేశించి ప్రసంగించాడు. దీనిక సంబంధించిన వీడియో ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆటగాళ్లు తప్పిదాలు చేశారని.. కానీ త్వరగా కోలుకొని అద్భుత ప్రదర్శనిచ్చారని కొనియాడాడు. టోర్నీ ఆసాంతం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను సొంత కుటుంబ సభ్యుల్లా ఆకాశ్, నీతా అంబానీలు చూసుకున్నారని ప్రశంసించాడు. ‘మన జట్టులో ఒక్క ఆటగాడు కూడా ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు. కానీ కప్ గెలిచాం. సమిష్టిగా ఆడి విజయం సాధించాం. చెన్నై మ్యాచ్లో మనం అనేక తప్పిదాలు చేశాం. కానీ త్వరగా కోలుకొని అత్యుత్తమ ప్రదర్శననిచ్చాం. ఐపీఎల్ 12 గెలవడంలో ప్రతీ ఒక్క ఆటగాడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు’అంటూ జయవర్దనే ప్రసంగించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ పోరులో సీఎస్కేపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు ఐపీఎల్ టోర్నీలు కైవసం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు కానీ కప్ గెలిచాం -
బుమ్రా ఆడాల్సిందే.. ఇంట్లో కూర్చుంటే ఎలా?
ముంబై : పని భారం పేరిట కీలక ఆటగాళ్లను ఐపీఎల్ ఆడకుండా ఇంట్లో కూర్చోమనడం సరైంది కాదని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ముంబై ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా కచ్చితంగా ఐపీఎల్ ఆడాల్సిందేనన్నాడు. బుమ్రా పనిభారం గురించి భారత క్రికెటర్లు నిద్రలేకుండా ఆలోచించవద్దని, ఆ విషయాన్ని తమ ఫ్రాంచైజీ చూసుకుంటుందని తెలిపాడు. ఇండియా టుడేతో జయవర్దనే మాట్లాడుతూ.. ‘పనిభారం గురించి ఆలోచించాల్సిందే కానీ మంచి పోటీగల క్రికెట్ను ఆడటం కూడా ముఖ్యమే. ఇప్పటికే భారత్ ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించాడానికి బీసీసీఐ వారికి కావాల్సిన విశ్రాంతినిచ్చింది. గొప్ప ఆటగాళ్లు ఎప్పుడు ఆడుతూనే ఉండాలనేది నా అభిప్రాయం. వారు ఇంట్లో కూర్చోవద్దు. ఆడుతూనే ఉండాలి. ఆటగాళ్ల వర్క్లోడ్ విషయంలో మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. బుమ్రా యాక్షన్ వల్ల గాయం అయ్యే అవకాశం ఉందనడం సరికాదు. మారథాన్ రన్నర్స్ టెక్నిక్ వీడియోలు చూసినప్పుడు కూడా మనకు వారికేదో గాయం అయినట్లు అనిపిస్తోంది కానీ.. వారు అద్భుత రికార్డులు సృష్టిస్తారు. బుమ్రా కూడా అలానే. అతను మంచి అటాకింగ్ అప్షన్. డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ ముఖ్యం. అతను కచ్చితంగా గేమ్ చేంజరే.’ అని జయవర్దనే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ముగిసిన రెండు వారాలకే మెగా టోర్నీ ప్రపంచకప్ ప్రారంభం కానుండటంతో ఆయా దేశాలు తమ ఆటగాళ్ల విషయంలో పునరాలోచనలో పడ్డాయి. బీసీసీఐ కూడా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో జయవర్దనే కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు భారత ప్రధాన ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడే విషయమై ఎలాంటి పరిమితి విధించలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ ప్రత్యేకించి ఇన్నే మ్యాచ్లు అడాలని మా వాళ్లెవరికి చెప్పలేదు. నేను ఒకవేళ 10, 12 లేదంటే 15 మ్యాచ్లు ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. అలాగే ఇంకొందరు ఎక్కువైనా ఆడొచ్చు.తక్కువైనా ఆడొచ్చు. ఇది ఆయా ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించిన అంశం. ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదు. ప్రపంచకప్ అనేది ప్రతి ఆటగాడి కల. అందుకే ప్రతి ఒక్కరు దాన్నే లక్ష్యంగా చేసుకుంటారు. అంతేగానీ మెగా ఈవెంట్కు ఎవరు మాత్రం దూరమవ్వాలనుకుంటారు’ అని కోహ్లి పేర్కొన్నాడు. -
ఎందుకు సహకరించలేదు?
కొలంబో: అవినీతి వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తులో సహకరించనందుకు ఐసీసీ ద్వారా రెండేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య వ్యవహారంలో మరో స్టార్ మహేల జయవర్ధనే స్పందించాడు. క్రికెట్పై అభిమానంతోనే శిక్షను అంగీకరిస్తున్నానన్న జయసూర్య వ్యాఖ్యలను తప్పు పట్టిన అతను.. అలా అయితే విచారణకు ఎందుకు సహకరించలేదని సూటిగా ప్రశ్నిం చాడు. ‘దేశానికి చెందిన ముద్దుల కొడుకు ఒకరు ఇవాళ రెండేళ్ల ఐసీసీ నిషేధానికి గురి కావడం శ్రీలంక క్రికెట్లో బాధాకరమైన రోజు. అసలు ఎందుకు సహకరించలేదు? దేశంలో ఎంతో ఆకర్షణీయమైన ఆటను నిజంగా ఎవరైనా అభిమానిస్తుంటే అవినీతిని బయటపెట్టాలి. తర్వాతి తరాన్ని కాపాడుకోవాలి’ అని జయవర్ధనే ట్వీట్ చేశాడు. జయసూర్య కెప్టెన్సీలో జయవర్ధనే 37 టెస్టులు, 114 వన్డేలు ఆడాడు. -
అదొక కపటపు ఎత్తుగడ: మురళీ ధరన్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్గా చేయాలన్న ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆఫర్ను దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ తిరస్కరించాడు. అంతకుముందు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే సైతం కన్సల్టెంట్ ఆఫర్ను తిరస్కరించగా, ఇప్పుడు ఆ జాబితాలో మురళీ ధరన్ చేరిపోయాడు. తనకు శ్రీలంక క్రికెట్ జట్టు సలహాదారుగా చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన మురళీ.. ఇందుకు ప్రస్తుత ఎస్ఎల్సీ విధానం సరిగా లేకపోవడమే కారణమన్నాడు. దీనిలో భాగంగా ఎస్ఎల్సీ నమ్మకాన్ని కోల్పోయిందంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ‘నాకు శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్గా చేయమంటూ వచ్చిన ఆఫర్లో నిజాయితీ లేదు. అదొక కపటపు ఎత్తుగడ. మా బోర్డు ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఎస్ఎల్సీ అవలంభించే విధానంలో విశ్వాసం లోపించింది. ఇప్పుడు మా సహకారం కావాలని శ్రీలంక క్రికెట్ పరిపాలన కమిటీ కోరడం నిజంగా శోచనీయం’ అని మురళీ ధరన్ మండిపడ్డాడు. మరొకవైపు లంక క్రికెట్ కమిటీలో పనిచేసిన జయవర్ధనే సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మా క్రికెట్ బోర్డు విధానం సరిగా లేదు. మమ్మల్ని ఉపయోగించుకోవాలని క్రికెట్ పెద్దలు చూస్తున్నారు. మమ్మల్ని కొనాలని చూస్తే అది ఎంతమాత్రం లాభించదు’ అని జయవర్ధనే వ్యాఖ్యానించాడు. గతేడాది శ్రీలంక క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా ఒక స్పెషల్ ప్యానల్ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో జయవర్ధనే సభ్యుడిగా ఉన్నాడు. అయితే అప్పట్లో జయవర్ధనే సూచించిన ప్రతిపాదనలకి శ్రీలంక క్రికెట్ బోర్డు విలువ ఇవ్వకపోవడంతో మళ్లీ ఆ తరహా అనుభవాన్ని చూడకూడదనే ఆలోచనలో జయవర్ధనే ఉన్నాడు. ఆ క్రమంలోనే తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విన్నపాన్ని మాజీ కెప్టెన్ తిరస్కరించాడు. ఇటీవల కాలంలో విజయాల కోసం తంటాలు పడుతున్న శ్రీలంక జట్టును గాడిలో పెట్టేందుకు సీనియర్ ఆటగాళ్లతో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయాలనే యోచనలో లంక బోర్డు ఉంది. ఇందులో జయవర్ధనే, మురళీ ధరన్, కుమార సంగక్కార పేర్లను కూడా చేర్చింది. ఈ మేరకు కమిటీకి అనుమతి ఇవ్వాలని క్రీడామంత్రికి తమ విన్నపాన్ని పంపింది. అయితే సెలక్టర్లు చేసిన ప్రతిపాదనను మరో ఆలోచన లేకుండా మురళీ ధరన్, జయవర్ధనేలు తిరస్కరించడం లంక బోర్డుకు షాకిచ్చినట్లయ్యింది. -
పాండ్యా చాలా కష్టపడాలి.. ఇలా అయితే కష్టం
ముంబై : టీమిండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్దిక్ పాండ్యా చాలా కష్టపడాలని ఆ జట్టు కోచ్ మహేళ జవవర్దనే అభిప్రాయపడ్డాడు. మంగళవారం సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో స్పల్ప స్కోరును చేధించలేక ముంబై 31 పరుగుల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై జయవర్దనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏ ఒక్క ఆటగాడు బాధ్యత తీసుకోలేదు.. ‘ఈ పరాజయంపై ఎవరిని నిందించదలుచుకోలేదు. కానీ ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేం కొన్ని మ్యాచ్లు ఓడినా.. మంచి క్రికెట్ ఆడుతున్నామనే భావన కలిగింది. కానీ స్పల్ఫ స్కోరు చేధనకు దిగిన మా బ్యాట్స్మన్లో ఏ ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడకపోవడం నిరాశ కలిగించింది. 10 ఓవర్ల అనంతరం ఎవరైనా బాధ్యత తీసుకుంటారని భావించా కానీ అలా ఎవరు చేయలేదు. ఇక పాండ్యా బ్యాటింగ్పై స్పందిస్తూ.. అతని పట్ల ప్రత్యర్థి ఆటగాళ్లు మంచి ప్రణాళికలతో బరిలోకి దిగారని, అతను చాలా కష్టపడాలని, ఇలా అయితే కష్టమని తెలిపాడు. ‘‘ ప్రతి ఏడాది ఒకే శైలిలో బ్యాటింగ్ చేయకూడదు. ఆటలో మెరుగుదల లేకుంటే రాణించడం కష్టం. ఈ విషయాన్ని పాండ్యా నేర్చుకోవాలి. అతను ఇంకా చాలా కష్టపడాలి. కేవలం నైపుణ్యంతో విజయం అందుకోలేం. పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం ఉండాలి. ప్రతి ఆటగాడు ఈ విషయాలను గ్రహించాలి. ఎందుకంటే ఈ టోర్నీకి అంతర్జాతీయ బౌలర్లు వినూత్న పద్దతులతో వస్తారు. వారని సమర్థవంతంగా ఎదుర్కునేలా సిద్ధం కావాలి. అలా లేనప్పుడు స్థిరంగా రాణించలేం’’ అని జయవర్ధనే అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్లో పాండ్యా 19 బంతులాడి కేవలం 3 పరుగులే చేశాడు. ముఖ్యంగా రషీద్ బౌలింగ్లో తెగ ఇబ్బందిపడ్డాడు. -
తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన కుర్రాడు.!
సాక్షి, ముంబై : ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ తాను మాత్రం కల అనుకున్నాడు. స్నేహితులు చెబితే అబద్ధంతో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాడు. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో బ్రావో మెరుపులతో ఈ ఆటగాడి ప్రదర్శన కనబడలేదు. కానీ భవిష్యత్లో భారత జట్టుకు ఓ లెగ్ స్పిన్నర్ దొరికినట్లే. టీ20 ఆడిన అనుభవం ఏమాత్రం లేకున్నా తన అరంగేట్రంలోనే అందరినీ ఆకట్లుకున్నాడు. కీలక సమయంలో రాయుడు, ధోని, చహర్ వికెట్లు తీసి అందరిని తనవైపు తిప్పుకున్నాడు. అతడే.. మయాంక్ మార్కండే. ముంబై కోచ్ ప్రశంసలు తొలి మ్యాచ్లోనే బంతిని గింగిరాలు తిప్పుతూ మూడు వికెట్లు పడగొట్టిన మార్కండేపై ముంబై ఇండియాన్స్ ప్రధాన కోచ్ జయవర్దనే ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ లెగ్ స్పిన్నర్ను ఎంపిక చేసిన వెంటనే అతనికి ట్రయల్స్ నిర్వహించి సాన పెట్టామని, ఇలానే కష్టపడితే భవిష్యత్తులో గొప్ప లెగ్ స్పిన్నర్ అవుతాడని ముంబై కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. షేన్ వార్న్ ఆదర్శం ఫాస్ట్ బౌలర్ అవుదామని క్రికెట్ మొదలెట్టిన మార్కండే.. కోచ్ సలహా మేరకు స్పిన్ బౌలింగ్పై దృష్టి సారించి అద్భుత ప్రతిభ కనబరిచాడు. పంజాబ్ తరుపున పలు మ్యాచ్ల్లో మెరిసాడు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి ఫలితం రాబడుతున్నాడు. అయితే భారత సెలక్షన్ కమిటీ దృష్టి పెట్టి ఉంటే రషీద్ ఖాన్, షాదాబ్ ఖాన్లాగే మార్కండేకు కూడా ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చేది అని విశ్లేషకుల అభిప్రాయం. ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ ఈ ఆటగాడి దేశవాళి ప్రదర్శన నచ్చి ఐపీఎల్ వేలంలో కనీస ధరకే చేజిక్కించుకుంది. ఇక ఇప్పటికే మార్కండేపై అంచనాలు పెరగటంతో ఈ పంజాబీ ప్లేయర్ మిగతా మ్యాచ్ల్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. -
అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్న రోహిత్!
ముంబై : ఈ సీజన్ ఐపీఎల్లో తన అభిమానులకు సరప్రైజ్ ఇవ్వనున్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక రేపటి(శనివారం) డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో ఈ సీజన్ ఐపీఎల్కు తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ సీజన్లో అభిమానులకు నా బ్యాటింగ్ ఆర్డర్ మార్పుతో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మా మిడిలార్డర్ బలంగా ఉంది. అద్భుతమైన ఓపెనర్లు ( ఎల్విన్ లూయిస్ (వెస్టిండీస్), ఇషాన్ కిషాన్లు) ఉన్నారు. అయితే నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నాననేది ఏప్రిల్ 7నే తెలుస్తోంది. ఇదే నేను అభిమానులకిచ్చే సర్ప్రైజ్. ముంబై గొప్ప ఆటగాళ్లతో కూడిన ఓ అద్భుతమైన జట్టు. బయట ఏం జరుగుతోంది మాకు అనవసరం జట్టుగా ముందుకెళ్లి లక్ష్యాన్ని సాధించడమే మా పని. ఈ స్పూర్తినే మేం గత పదేళ్లుగా కొనసాగించి విజయవంతమయ్యాం’. అని పేర్కొన్నాడు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ‘ఇక డిఫెండింగ్ చాంపియన్స్గా మేం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడం లేదు. అది మా బాధ్యతగా భావిస్తూ.. గర్వంగా ఫీలవుతున్నాం. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు.. వికెట్లు తీసే బౌలర్లు, పరుగుల వరద పారించే బ్యాట్స్మెన్ మా జట్టులో ఉన్నారు. కేవలం మ్యాచ్లో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు కొనసాగడమే మా పని. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలర్. తమ జట్టుకు అతను అదనపు బలం. గత రెండు, మూడేళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. గత సీజన్లో మలింగా ఫామ్లో లేకున్నా రాణించాడు ’అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. మేం ఫేవరేట్ కాదు: జయవర్దనే డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న మాజట్టు ఫేవరేట్ కాదని , ఇతర జట్లలాగే బరిలో దిగుతున్నామని ముంబై ఇండియన్స్ మెంటార్ మహేల జయవర్దనే తెలిపాడు. ప్రస్తతం మా జట్టు మంచి దశలో ఉందని, చెన్నైతో తొలి మ్యాచ్ ఆడేందుకు పూర్తిగా సిద్దమయ్యామని స్పష్టం చేశాడు. -
హింసాత్మక ఘటనలపై క్రికెటర్ల ఆందోళన
సాక్షి, స్పోర్ట్స్ : శ్రీలంకలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఆ దేశ సీనియర్ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్దనేలు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, బుద్దుల మధ్య హింస చెలరేగడంతో అల్లర్లు దేశవ్యాప్తంగా విస్తరించకుండా లంక ప్రభుత్వం పదిరోజుల ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై జయవర్ధనే, సంగక్కరలు ట్విటర్లో ఖండించారు. ‘ ఏదో ఒక జాతి, మతాన్ని లక్ష్యంగా చేసుకొని భయపెట్టడం, హింసకు పాల్పడటం మంచిది కాదు. ఒకే దేశం.. ఒకే ప్రజలం అనే భావనతో కలిసి ఉండాలి. ప్రేమ, నమ్మకం, ఆదరణ అనేవి అందరి సాధారణ మంత్రంగా ఉండాలి. జాత్యహంకారం, హింసకు చోటులేదు. వాటిని ఆపేయండి. అంతకలిసి నిలబడి.. బలమైన దేశంగా నిలవాలని’ సంగక్కర ట్వీట్ చేశాడు. ‘ఇటీవల సంభవించిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నా. జాతి, మతంతో సంబంధం లేకుండా ఈ ఘటనలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరిని శిక్షించాలి. 25ఏళ్ల పాటు కొనసాగిన సివిల్ వార్ నడుమ పెరిగాను. వచ్చే తరం ఇలాంటి వాతావరణానికి లోనుకాకుడదని కోరుకుంటున్నా.’ అని జయవర్దనే ట్వీట్ చేశాడు. వీళ్లతో పాటు లంక స్టార్ క్రికెటర్ ఎంజెలో మాథ్యూస్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తదితరులు అల్లర్లను ఖండించారు. ప్రస్తుతం నిదహాస్ టీ20 ట్రై సిరీస్లో భాగంగా కొలంబోలో ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. I strongly condemn the recent acts of violence & everyone involved must be brought to justice regardless of race/ religion or ethnicity. I grew up in a civil war which lasted 25 years and don’t want the next generation to go through that. — Mahela Jayawardena (@MahelaJay) 7 March 2018 No one in Sri Lanka can be marginalized or threatened or harmed due to their ethnicity or religion. We are One Country and One people. Love, trust and acceptance should be our common mantra. No place for racism and violence. STOP. Stand together and stand strong. — (@KumarSanga2) 7 March 2018 -
ధోనిపై జయవర్ధనే సెటైర్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే సెటైర్ వేసి వార్తాల్లో నిలిచాడు. ఇందుకు జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కారణమయ్యాడు. లండన్ లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో భాగంగా 100 మీటర్ల రేసులో బోల్ట్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాంతో బోల్ట్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో కొద్దిపాటి విమర్శలు వెలుగచూశాయి. దీనికి జయవర్ధనే స్పందిస్తూ.. బోల్ట్ ను గౌరవించండి అంటూ ట్వీట్ చేశాడు. దానికి బదులుగా ఒక అభిమాని బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తే ధోనిని కూడా గౌరవించండి అంటూ జయవర్ధనే ట్వీట్ పై సరదాగా స్పందించాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జయవర్ధనే..ధోని తన బైక్ మీదా? బోల్ట్ వేగాన్ని అధిగమించేది అంటూ సెటైర్ వేశాడు. అంటే బోల్ట్ వేగాన్ని అందుకోవాలంటే ధోని బైక్ పై వెళ్లినా అందుకోలేడనే ఉద్దేశం జయవర్ధనే ట్వీట్ ద్వారా స్పష్టమైంది.ఒక అభిమాని చేసిన ట్వీట్ కు జయవర్దనే ఇంతలా స్పందిచాల్సిన అవసరముందా?అనేది ధోని అభిమానుల ప్రశ్న. Was Dhoni on his bike? https://t.co/4G92pBh8yi — Mahela Jayawardena (@MahelaJay) 7 August 2017 -
జయవర్ధనే సరిపోడు..!
కొలంబో:చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత శ్రీలంక క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి గ్రాహం ఫోర్డ్ గుడ్ బై చెప్పడంతో ఆ జట్టులో ఒక్కసారిగా అనిశ్చిత ఏర్పడింది. శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) అధ్యక్షుడు తిలంగా సుమతిపాలతో విబేధాల కారణంగా ఉన్నపళంగా కోచ్ పదవి నుంచి ఫోర్డ్ వైదొలిగాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎస్ఎల్సీ వేట ప్రారంభించింది. అయితే శ్రీలంక క్రికెట్ జట్టుకు కోచ్ గా ఆ దేశ మాజీ క్రికెటర్ జయవర్ధనే ఎంపిక అవుతాడనే వార్తలు తొలుత వినిపించాయి. ఇప్పటికే కోచ్ గా కొంత అనుభవం సంపాదించిన జయవర్ధనే ఎంపిక ఖాయంగా కనబడింది. కాగా, ఆ వార్తలను తిలంగా సుమతిపాల ఖండించారు. శ్రీలంక ప్రధాన కోచ్ పదవిని చేపట్టడానికి జయవర్దనే ప్రస్తుత అనుభవం సరిపోదని సుమతిపాల అభిప్రాయపడ్డారు. 'మహేలకు సీనియర్ కోచ్ గా కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉంది. ట్వంటీ 20 బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ గా జయవర్ధనే సెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రధాన కోచ్ రేసులో మాత్రం అతను లేడు'అని సుమతిపాల తేల్చిచెప్పారు. -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా మహేల
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేను నియమించారు. రికీ పాంటింగ్ స్థానంలో మహేలను నియమిస్తున్నట్టు ముంబై జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ముంబై ఇండియన్స్ ట్విట్టర్ పేజీలో ఈ విషయం వెల్లడించింది. నాలుగు సీజన్లలో ముంబై కోచ్గా పాంటింగ్ వ్యవహరించాడు. వచ్చే ఏడాది మహేల బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మహేల గతంలో ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, కోచి టస్కర్స్ కేరళ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2014 టి-20 ప్రపంచ కప్ విజేత శ్రీలంక జట్టులో అతను సభ్యుడు. అలాగే 2007 వన్డే ప్రపంచ కప్లో మహేల సారథ్యంలో లంక ఫైనల్కు చేరింది. ముంబై జట్టు కోచ్గా నియమించినందుకు మహేల సంతోషం వ్యక్తం చేశాడు. ఆ జట్టుతో కలసి పనిచేస్తానని, విజయపథంలో నడిపేందుకు కృషి చేస్తానని, కోచ్గా కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని మహేల అన్నాడు. అతను త్వరలో ముంబైకి వచ్చి జట్టు మేనేజ్మెంట్తో సమావేశం కానున్నాడు. -
జయవర్ధనేపై శ్రీలంక బోర్డు గుర్రు
కొలంబో: మహేలా జయవర్ధనే.. శ్రీలంక మాజీ కెప్టెన్. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి తనదైన ముద్రను సంపాదించుకున్న ఆటగాడు. 2014 చివర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు మెంటర్గా పనిచేస్తున్నాడు. ఇదే జయవర్ధనేకు కష్టాలు తీసుకొచ్చేటట్లు కనబడుతోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జయవర్ధనే అప్పుడే వేరే జట్టుకు సలహాదారుగా పనిచేయడమేమిటని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) పెద్దలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒక జట్టుకు కోచ్ తదితర పాత్రలు పోషించాలంటే ఏ క్రికెటర్ అయినా వీడ్కోలు సమయం నుంచి కనీసం రెండేళ్లు కాల వ్యవధి తీసుకుంటాడని జయవర్ధనే తీరును ఎస్ఎల్సీ చైర్మన్ తిలంగా సుమిథిపాలా తప్పుబట్టారు. ఈ రకంగా చేయడం వల్ల ఒక జట్టులోని బలంతో పాటు బలహీనతల కూడా అవతలి జట్టుకు చేరే వేసే ప్రమాదం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది స్పోర్ట్స్ ఎథిక్స్ కు విఘాతం కల్గిస్తుందని పేర్కొన్నారు. తన దృష్టిలో కోచ్ గా పని చేసే సామర్థ్యం ఉండాలంటే జట్టు నుంచి బయటకొచ్చిన తరువాత రెండేళ్లు కాలపరిమిత తీసుకోవాలని తిలంగా స్పష్టం చేశాడు. మరోవైపు క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై జయవర్ధనే స్పందించాడు. తాను కేవలం ఇంగ్లండ్ క్రికెటర్లకు సాంకేతికంగా సాయపడటానికి మాత్రమే ఈ బాధ్యతను తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకంగా స్పిన్ విషయంలో వీక్ గా ఉండే ఇంగ్లండ్ను తీర్చిదిద్దడం తన కర్తవ్యంలో ఒక భాగమని స్పష్టం చేశాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్లో ఇంగ్లండ్ కు జయవర్ధనే మెంటర్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు బలహీనతల్ని చేరేవేస్తాడనే భయం క్రికెట్ బోర్డు పెద్దల్లో పట్టుకోవడమే ఈ తాజా వ్యాఖ్యలకు కారణం. -
లెజెండ్స్ టి20 లీగ్లో జయవర్ధనే!
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ల కలయికలో రానున్న లెజెండ్స్ టి20 లీగ్లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్ధనే కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు అతడిని సంప్రదించినట్టు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన అతను ప్రైవేట్ టి20 లీగ్ల్లో ఆడాలని చూస్తున్నాడు. లెజెండ్స్ టి20 లీగ్ మ్యాచ్లకు ఎలాంటి అధికారిక హోదా ఉండకుండా ఎగ్జిబిషన్ మ్యాచ్లుగానే పరిగణిస్తారు. భారత్ నుంచి కుంబ్లే, గంగూలీ, లక్ష్మణ్లు కూడా బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే ఆడే అవకాశాలున్నాయి. -
దిగ్గజాల వీడ్కోలు
ఒకటి, రెండేళ్లు కాదు... సుమారు దశాబ్దంన్నర కాలం పాటు ఆ ఇద్దరు శ్రీలంక క్రికెట్ బాధ్యతలు మోశారు. విజయాల్లో, పరాజయాల్లో అండగా, తోడుగా నిలిచారు. రికార్డు భాగస్వామ్యాల్లో కలిసి సాగారు. సీనియర్లు తప్పుకున్న దశలో జట్టును నిలబెట్టి...ఆ తర్వాత జూనియర్లకు దిశానిర్దేశం చేశారు. గత పదిహేనేళ్ల కాలంలో సంగక్కర, జయవర్ధనే లేని లంక జట్టును ఊహించలేము. మైదానం బయట కూడా ‘బెస్ట్ ఫ్రెండ్స్’, వ్యాపార భాగస్వాములు అయిన సంగక్కర, మహేల బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికారు. టెస్టులనుంచి గత ఆగస్టులోనే తప్పుకున్న జయవర్ధనే కెరీర్ ఇప్పుడు పూర్తిగా ముగియగా... ఈ ఏడాది ఆగస్టులో భారత్తో టెస్టు సిరీస్ తర్వాత సంగక్కర కూడా పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడు. కళాత్మక బ్యాటింగ్ నైపుణ్యమే కాదు... పోరాటపటిమకు, పట్టుదలకు మారుపేరుగా వీరు లంక క్రికెట్ స్థాయిని పెంచారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తమ అద్భుత ఆటతో ఆదుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ సమఉజ్జీలుగా నిలిచారు. ఇద్దరు దిగ్గజాలు తప్పుకోవడం లంకకే కాదు ప్రపంచ క్రికెట్కూ తీరని లోటు. ఇకపై ఆ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టునుంచి రావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అయితే ఈ దిగ్గజాలు ఓటమితో నిరాశగా కెరీర్ను ముగించడం బాధాకరం. రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు సచిన్ టెండూల్కర్ సహా పలువురు ఆటగాళ్లు అభినందలు తెలిపారు. ఇటు వన్డేలు, అటు టెస్టుల్లోనూ ఇద్దరు ఆటగాళ్లు జంటగా నెలకొల్పిన భాగస్వామ్యాలు చూస్తే సంగక్కర, జయవర్ధనేలు రెండో అత్యుత్తమ జోడీగా నిలుస్తారు. వన్డేల్లో వీరిద్దరి మధ్య 151 ఇన్నింగ్స్లలో 41.61 సగటుతో 5992 పరుగులు వచ్చాయి. ఇందులో 15 సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. టెస్టుల్లో ఈ ఇద్దరు కలిసి 120 ఇన్నింగ్స్లలో 56.50 సగటుతో 6554 పరుగులు జత చేశారు. వీటిలో 19 శతక భాగస్వామ్యాలు ఉండటం విశేషం. - సాక్షి క్రీడావిభాగం వన్డే కెరీర్ రికార్డ్ వన్డేలు పరుగులు సగటు అత్యధిక స్కోరు 100 50 సంగక్కర 404 14234 41.98 169 25 93 జయవర్ధనే 448 12650 33.37 144 19 77 -
టీమిండియాదే సిరీస్
హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవశం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. 243 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. భారత ఓపెనర్లు అజ్యింకా రహానే, శిఖర్ ధవన్ లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. రహానే(31) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరినా..ధవన్ మరోసారి చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న ధవన్ (91; 79 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంబటి రాయుడి (35) పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం భారత కెప్టెన్ కోహ్లీ (53), సురేష్ రైనా(18 *) పరుగులు చేసి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో సాహా (11) పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 44.1 ఓవర్లో లక్ష్యాన్ని సాధించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, పెరీరా, దిల్షాన్ లకు తలో వికెట్టు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను మహేలా జయవర్ధనే, దిల్షాన్ లు ఆదుకున్నారు. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. జయవర్ధనే సెంచరీ, దిల్షాన్ అర్ధ సెంచరీలతో బయటపడ్డ లంకేయులు 48.2 ఓవర్లలో 242 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, ఏఆర్ పటేల్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. -
టీమిండియా విజయలక్ష్యం 243
హైదరాబాద్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కరా(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. అనంతరం మహేలా జయవర్ధనే సెంచరీ, దిల్షాన్ అర్ధ సెంచరీలతో బయటపడ్డ లంకేయులు 48.2 ఓవర్లలో 242 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, ఏఆర్ పటేల్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ వన్డేలో జయవర్ధనే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. వన్డేల్లో 17 సెంచరీలు, భారత్ పై నాలుగు సెంచరీలు చేసిన జయవర్ధనే 12 వేల పరుగుల క్లబ్ చేరాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జయసూర్య, సంగక్కార లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. -
థర్డ్ వన్డే ఎట్ హైదరాబాద్
-
హైదరాబాద్ వన్డేలో జయవర్ధనే సెంచరీ
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో జయవర్దనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. లంకేయులు వరుసగా వికెట్లు చేజార్చుకున్నా జయవర్ధనే ఒంటరిగా పోరాటం చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ చేసిన జయవర్ధనే భారత బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. అంతకుముందు దిల్షాన్(53) పరుగుల మాత్రమే మహేలాకు సహకరించాడు. వన్డేల్లో 17 సెంచరీలు చేసిన మహేలా.. భారత్ పై నాల్గో సెంచరీ నమోదు చేశారు. ఇదిలా ఉండగా జయవర్ధనే వ్యక్తిగత స్కోరు 116 పరుగుల వద్ద ఉండగా 12 వేలు పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జయసూర్య, సంగక్కార లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. -
రెండో వన్డేలో పాక్ చిత్తు
77 పరుగులతో శ్రీలంక విజయం హంబన్టోట: కెప్టెన్ మాథ్యూస్ (115 బంతుల్లో 93; 8 ఫోర్లు), తిసార పెరీరా (36 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో పాకిస్థాన్తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. మంగళవారం ఇక్కడి రాజపక్స స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లంక 77 పరుగుల తేడాతో పాక్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. మహేళ జయవర్ధనే (74 బంతుల్లో 67; 8 ఫోర్లు) తో నాలుగో వికెట్కు 122 పరుగులు జోడించిన మాథ్యూస్... ఏడో వికెట్కు పెరీరాతో 9.3 ఓవర్లలోనే 87 పరుగులు జోడించి తమ జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం పాకిస్థాన్ 43.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. మొహమ్మద్ హఫీజ్ (49 బంతుల్లో 62; 9 ఫోర్లు), అహ్మద్ షహజాద్ (80 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... మిస్బా (36), ఫవాద్ (30) ఫర్వాలేదనిపించారు. బౌలింగ్లోనూ రాణించిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి మ్యాచ్ శనివారం దంబుల్లాలో జరుగుతుంది -
‘విజయ’వర్ధనే
టెస్టు క్రికెట్కు మరో గొప్ప ఆటగాడు వీడ్కోలు పలికాడు. గత రెండేళ్ల వ్యవధిలో పాంటింగ్, కలిస్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ బ్యాటింగ్ విన్యాసాలను కోల్పోయిన ఈ ఫార్మాట్ ఇప్పుడు శ్రీలంక సీనియర్ ఆటగాడు మహేళ జయవర్ధనే అద్భుత ఆటతీరుకూ దూరం కానుంది. ఈ కళాత్మక ఆటగాడు కూడా తప్పుకోవడం అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించేదే. అయితే సహచరుల నుంచి మాత్రం మహేళకు అద్భుత కానుక అందింది. పాకిస్థాన్తో జరిగిన సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి ఘన వీడ్కోలు పలికారు. టెస్టు కెరీర్కు మహేళ వీడ్కోలు పాక్పై 2-0తో సిరీస్ నెగ్గిన శ్రీలంక కొలంబో: దాదాపు రెండు దశాబ్దాలుగా తన ఆటతీరుతో క్రికెట్కు వన్నె తెచ్చిన శ్రీలంక సీనియర్ బ్యాట్స్మన్ మహేళ జయవర్ధనే.. విజయంతో టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులతో పాటు శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స కూడా స్టేడియానికి తరలివచ్చారు. అలాగే మహేళ తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలు కూడా సాక్షులుగా నిలిచారు. జయవర్ధనేను మ్యాచ్ ముగియగానే తోటి ఆటగాళ్లు భుజాలపైకి ఎక్కించుకుని స్టేడియమంతా కలియతిరిగారు. పెవిలియన్కు చేరగానే దేశాధ్యక్షుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 17 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడిన ఈ మాజీ కెప్టెన్ను జట్టు సహచరులతో పాటు పాక్ ఆటగాళ్లు కూడా అభినందించారు. బంగారంతో కూడిన చిన్న బ్యాట్ను లంక అధ్యక్షుడు.. జయవర్ధనేకు అందించారు. అలాగే లంక జట్టుతో పాటు పాక్ జట్టు కూడా ఈ దిగ్గజ ఆటగాడికి మెమొంటో అందజేసింది. ఇప్పటికే టి20 ప్రపంచకప్ విజయంతో ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగిన తను ఇక 2015 ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడనున్నాడు. అచ్చొచ్చిన సొంత మైదానం సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్సీ)లోనే తొలినాళ్లలో తన కెరీర్ను మెరుగు పర్చుకున్న మహేళ ఇదే మైదానంలో సంగక్కరతో కలిసి దక్షిణాఫ్రికాపై 624 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో ఈ స్టార్ ఆటగాడు 374 పరుగులు సాధించాడు. అలాగే ఎస్ఎస్సీలో తను సాధించిన పరుగులు 27 టెస్టుల్లో 2,921. ఇందులో 11 సెంచరీలున్నాయి. 2006 నుంచి 2009 వరకు ఆ తర్వాత 2012లో శ్రీలంక తరఫున కెప్టెన్గా వ్యవహరించిన మహేళ 38 టెస్టులకు నాయకత్వం వహించాడు. ఇందులో 18 విజయాలు, 12 పరాజయాలు, 8 డ్రాలు ఉన్నాయి. సిరీస్ గెలిచిన లంక పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టును శ్రీలంక 105 పరుగుల తేడాతో గెలుచుకుంది. తద్వారా 2-0తో సిరీస్ దక్కించుకుంది. 127/7 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన పాక్... గెలిచేందుకు మరో 144 పరుగులు సాధించాల్సి ఉండగా కేవలం 38 పరుగులకే మిగిలిన వికెట్లను కోల్పోయింది. కనీసం గంట కూడా ఆడలేకపోయిన మిస్బా సేన 52.1 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది. సర్ఫరాజ్ అహ్మద్ (89 బంతుల్లో 55; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. గాయం కారణంగా జునైద్ ఖాన్ బ్యాటింగ్ చేయలేదు. ఈ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన హెరాత్ మొత్తం 14 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు. దేశం తరఫున ఆడడం గర్వంగా ఉంది ‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అయితే ఈ సమయంలో కన్నీళ్లు పెట్టుకోనని హామీ ఇస్తున్నాను. మాజీ ఆటగాళ్ల సాహచర్యంలో మంచి క్రికెటర్గా రూపొందాను. వారితో పాటు ప్రస్తుత ఆటగాళ్లకు కూడా కృతజ్ఞతలు. అధ్యక్షుడు రాజపక్స ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఇంకా నాలో కొద్దిపాటి క్రికెట్ మిగిలే ఉంది. కచ్చితంగా దీన్ని వన్డే ప్రపంచకప్ సాధించేందుకు వినియోగిస్తాను. ఇన్నేళ్లుగా శ్రీలంకకు ఆడడం గర్వంగా ఉంది. నా కోసం కష్టపడిన కుటుంబసభ్యులకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే. గర్వంతో పాటు అంతులేని ఆపేక్షతో లంక క్యాప్ను ధరించాను’ - మహేళ జయవర్ధనే. -
జయవర్ధనేకు చిరస్మరణీయమైన కానుక
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్మన్ మహేళ జయవర్ధనేకు జట్టు సభ్యులు మరిచిపోలేని విధంగా వీడ్కోలు చెప్పారు. 17 ఏళ్ల టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పిన జయవర్దనేకు ఘనవిజయంతో చిరస్మరణీయమైన కానుక ఇచ్చారు. పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 105 పరుగులతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 165 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఆటగాళ్లలో సర్ఫరాజ్(55) ఒక్కడే రాణించాడు. షఫిక్ 32 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో రంగన హెరాత్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్ రెండు వికెట్లు తీశాడు. పెరీరా, వెలెగెదర చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రెండూ హెరాత్ సొంతమయ్యాయి. -
నేడే ‘ఆఖరు’
ఓటమి అంచున పాక్ లంక విజయం లాంఛనమే కొలంబో: 17 ఏళ్ల టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పబోతున్న శ్రీలంక సీనియర్ బ్యాట్స్మన్ మహేళ జయవర్ధనేకు జట్టు ఆటగాళ్లు చిరస్మరణీయ కానుక ఇవ్వబోతున్నారు. పాకిస్థాన్తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టును ఆతిథ్య జట్టు గెలుచుకోవడం ఇక లాంఛనమే. ఇప్పటికే ఈ సిరీస్లో లంక 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే. 271 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ను స్పిన్నర్ రంగన హెరాత్ (4/46) మరోసారి చావుదెబ్బ తీశాడు. ఫలితంగా 40 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. చివరి రోజు సోమవారం విజయానికి మరో 144 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో సర్ఫరాజ్ (63 బంతుల్లో 38 బ్యాటింగ్; 1 ఫోర్), రియాజ్ (2 బ్యాటింగ్) ఉన్నారు. 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును షఫీఖ్ (62 బంతుల్లో 32; 5 ఫోర్లు)తో కలసి సర్ఫరాజ్ ఆదుకున్నాడు. ఆరో వికెట్కు వీరు 55 పరుగులు జోడించారు. హెరాత్ మిడిలార్డర్ పనిబట్టడంతో పాక్ కోలుకోలేకపోయింది. స్లిప్లో జయవర్ధనే రెండు క్యాచ్లు తీసుకున్నాడు. జయవర్ధనే అర్ధ సెంచరీ అంతకుముందు శ్రీలంక 177/2 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించి 109 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటయ్యింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్ను జయవర్ధనే (137 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముగించి అభిమానులను అలరించాడు. ఈ ఇన్నింగ్స్తో ఓవరాల్గా 149 టెస్టుల్లో 11,814 పరుగులు సాధించినట్టయ్యింది. అజ్మల్ వరుస ఓవర్లలో సంగక్కర (130 బంతుల్లో 59; 4 ఫోర్లు), జయవర్ధనే అవుట్ కావడంతో లంక ఇబ్బంది పడింది. కెప్టెన్ మాథ్యూస్ (119 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు) రాణించాడు. రియాజ్, అజ్మల్లకు మూడేసి వికెట్లు దక్కాయి. -
శ్రీలంక 261/8
తరంగ సెంచరీ మిస్ పాక్తో రెండో టెస్టు కొలంబో: సీనియర్ బ్యాట్స్మన్ మహేల జయవర్ధనే చివరి టెస్టులో శ్రీలంక జట్టు ఎదురీదుతోంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్థాన్తో జరుగుతున్న ఈ రెండో టెస్టులో లంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 261 పరుగులు చేసింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (179 బంతుల్లో 92; 12 ఫోర్లు) కొద్దిలో సెంచరీ కోల్పోగా... మరో ఓపెనర్ సిల్వ (106 బంతుల్లో 41; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్కు 79 పరుగులు జోడించింది. మిడిలార్డర్లో కెప్టెన్ మాథ్యూస్ (86 బంతుల్లో 39; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జునైద్ ఖాన్కు నాలుగు, వహాబ్ రియాజ్కు మూడు వికెట్లు పడ్డాయి. జయవర్ధనే విఫలం ఇక సొంత మైదానంలో కెరీర్కు గుడ్బై చెబుతున్న జయవర్ధనే కేవలం నాలుగు పరుగులు చేసి నిరాశపరిచాడు. అంతకుముందు తమ ఆరాధ్య క్రికెటర్కు ఘన వీడ్కోలు చెప్పేందుకు స్టేడియంలో అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేశారు. తను చుదువుకున్న కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక స్టాండ్లో కూర్చున్నారు. 37 ఏళ్ల ఈ క్రికెటర్ క్రీజులోకి వస్తున్న సమయంలో పాక్ ఆటగాళ్లు వరుసగా నిలబడి ఆహ్వానం పలుకగా 3 వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో స్వాగతించారు. -
చివరి టెస్టులో జయవర్ధనే విఫలం
కొలంబో: పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 85.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న శ్రీలంక సీనియర్ క్రికెటర్ మహేళ జయవర్ధనే 4 పరుగులు మాత్రమే చేశాడు. తరంగ(92) ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. జేకే సిల్వా 41, మాథ్యూస్ 39, డిక్వెల్లా24, సంగక్కర 22, తిరిమానే 20 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4, వహబ్ రియాజ్ 3 వికెట్లు పడగొట్టారు. సయీద్ అజ్మల్ ఒక వికెట్ తీశాడు. -
మహేళ... వీడ్కోలు వేళ
నేటి నుంచి జయవర్ధనే ఆఖరి టెస్టు ఆటను ఆరాధించే వారుంటారు.. ఆస్వాదించే వారుంటారు. క్రికెట్నే శ్వాసిస్తూ.. క్రికెట్ కోసమే జీవించేవారు కొందరే ఉంటారు. అలా రెండో కోవకు చెందినవాడే శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్ధనే. ప్రపంచ క్రికెట్ను దిగ్గజాలు ఏలుతున్న తరంలోనే అరంగేట్రం చేసినా.. ఆట పట్ల అంకితభావం, ఆటగాడిగా పరిపూర్ణత్వంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్గా, అద్భుతమైన ఫీల్డర్గా, 17 ఏళ్లుగా శ్రీలంక క్రికెట్కు వెన్నెముకగా నిలుస్తూ వచ్చిన జయవర్ధనే.. టెస్టు క్రికెట్కు ఇక దూరమవుతున్నాడు. పాకిస్థాన్తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టే అతనికి చివరి టెస్టు. సాక్షి క్రీడావిభాగం: బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతున్నప్పుడు ఆదుకోవాలన్నా.. పరుగుల వేగం మందగించినప్పుడు చెలరేగి ఆడాలన్నా.. మైదానంలో పాదరసంలా కదులుతూ క్యాచ్లు అందుకోవాలన్నా.. గందరగోళంలో ఉన్న కెప్టెన్కు సలహా కావాల్సివచ్చినా.. శ్రీలంక జట్టు ఆ ఒక్కడి వైపే చూసేది. జట్టు సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ సారథ్య బాధ్యతల బరువు అతని నెత్తినే మోపేది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులెదురైనా.. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగిన జయవర్ధనే ఇక అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నాడు. టి20 ఫార్మాట్ నుంచి ఇంతకుముందే రిటైరైన మహేళ.. టెస్టులకూ గుడ్బై చెప్పి, వన్డేల్లో మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. దిగ్గజాల సరసన.. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వ, సనత్ జయసూర్య వంటి మహామహులు ఉన్న సమయంలోనే (1997లో భారత్పై మ్యాచ్తో) శ్రీలంక క్రికెట్లో అడుగు పెట్టిన మహేళ.. అతితక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడయ్యాడు. ఆడిన రెండో సిరీస్లోనే భారీ సెంచరీ సాధించి (167-న్యూజిలాండ్పై) అందరినీ ఆశ్చర్య పరిచాడు. అనుభవజ్ఞులకు మాత్రమే సాధ్యమయ్యే డబుల్ సెంచరీని (242-భారత్పై కొలంబోలో) రెండో ఏడాదే సాధించి శ్రీలంక క్రికెట్కు భవిష్యత్తు తానేనని చాటుకున్నాడు. కెప్టెన్లు ఎవరైనా.. మైదానంలో ఫీల్డింగ్కు మాత్రమే పరిమితం కాకుండా వారి నిర్ణయాల్లో పాలుపంచుకుంటూ బాధ్యతను పంచుకున్నాడు. 2006లో ఇంగ్లండ్లో తాత్కాలిక సారథిగా వ్యవహరించి విదేశాల్లో తొలి సిరీస్లోనే ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్ను శ్రీలంక 1-1తో డ్రాగా ముగించింది. దీంతో పూర్తిస్థాయి కెప్టెన్ అయిన జయవర్ధనే.. మూడేళ్లపాటు జట్టును విజయపథంలో నడిపించాడు. బోర్డు రాజకీయాల కారణంగా కెప్టెన్సీని వదులుకున్నా.. సంక్షోభ సమయంలో మళ్లీ తానే దిక్కై 2012లో తిరిగి బాధ్యతలు చేపట్టాడు. అయినా దాన్నే పట్టుకొని వేలాడకుండా భవిష్యత్ కెప్టెన్ను తాముండగానే తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాథ్యూస్కు పగ్గాలప్పగించి గౌరవంగా తప్పుకున్నాడు. టి20 ప్రపంచకప్ను శ్రీలంక గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించినా.. మరో యువ ఆటగాడికి చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఘనమైన రికార్డులు సహచరుడు సంగక్కరతో కలిసి రికార్డులతో పాటు శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. ఫార్మాట్ ఏదైనా.. తనదైన శైలిలో చెలరేగి అడాడు. ఈ క్రమంలో పలు రికార్డుల్ని తన సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 374 పరుగులు చేసి శ్రీలంక తరపున అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు. అదే మ్యాచ్లో సంగక్కరతో కలిసి 624 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి లంక బ్యాట్స్మన్గా నిలవడంతోపాటు ఇటు వన్డేల్లోనూ ఆ మైలురాయిని దాటాడు. ఓ ట్రిపుల్ సెంచరీతోపాటు రికార్డు స్థాయిలో ఆరు డబుల్ సెంచరీలు సాధించాడు. రెండుసార్లు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునూ అందుకున్నాడు. జయవర్ధనే సామాజిక సేవలోనూ ముందున్నాడు. 16వ ఏటనే తన సోదరుణ్ని బ్రెయిన్ ట్యూమర్ కారణంగా పోగొట్టుకున్న మహేళ.. క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగస్వామి అవుతున్నాడు. శ్రీలంకలోని మహారాగమ ప్రాంతంలో గల ఆస్పత్రిలో 750 పడకల క్యాన్సర్ యూనిట్ను ప్రారంభించనున్నాడు. -
జయవర్ధనే అజేయ శతకం
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్మన్ మహేల జయవర్ధనే టెస్టుల్లో 34వ సెంచరీని సాధించాడు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల ఈ వెటరన్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక తమ తొలి ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 5 వికెట్లకు 305 పరుగులు చేసింది. క్రీజులో జయవర్ధనే (225 బంతుల్లో 140 బ్యాటింగ్; 16 ఫోర్లు; 1 సిక్స్), డిక్వెల్లా (30 బంతుల్లో 12 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. -
టెస్ట్ క్రికెట్ కు జయవర్ధనే గుడ్ బై!
గాలే: శ్రీలంక ఆటగాడు మహేలా జయవర్ధనే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతకముందు ట్వంటీ20 క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న జయవర్ధనే.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత ఏప్రిల్ లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను శ్రీలంక గెలిచిన అనంతరం ఆ ఫార్మెట్ నుంచి మహేలా తప్పుకున్నాడు. ఇదిలా ఉండగా, తాను వన్డే జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే త్వరలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లతో జరిగే టెస్టు సిరీస్ ల అనంతరం రిటైర్ అవుతానని పేర్కొన్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్ అరవింద డిసిల్వాకు లేఖలో స్పష్టం చేశాడు. 'గత 18 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇది కాస్త కఠిన నిర్ణయమైనా రాజీనామాకు ఇదే సరైన సమయం' అంటూ లేఖలో తెలిపాడు.1997లో భారత్ తో టెస్ట్ కెరీర్ ను ఆరంభించిన జయవర్ధనే.. 11,493 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ అతను ఆడిన 145 టెస్టు కెరీర్ లో 33 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
ఆట తర్వాతే ఎవరైనా
నాలో ఇంకా చాలా క్రికెట్ ఉంది ఈ ప్రపంచకప్తో వెలితి తీరింది మహేళ జయవర్ధనే ఇంటర్వ్యూ ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఉండే ఆనందం ఏమిటో శ్రీలంక క్రికెటర్లను చూస్తే తెలుస్తుంది. మ్యాచ్ ముగిసి హోటల్కు వెళ్లిన తర్వాత కూడా ఆటగాళ్లంతా ఇంకా ఆ విజయం తాలూకు ‘మత్తు’ను ఆస్వాదిస్తూనే ఉన్నారు. యువ క్రికెటర్ల ఉత్సాహం అంబరాన్నంటితే... సీనియర్ క్రికెటర్లలో మాత్రం పెద్ద రిలీఫ్. ఐదుసార్లు ప్రపంచకప్ (వన్డే, టి20 కలిపి) ఫైనల్స్ ఆడటం సామాన్యమైన విషయం కాదు. అయినా చివరి ప్రయత్నంలో టైటిల్ గెలవడంలో లభించే ‘కిక్’ ఇంకా మధురంగా ఉంటుంది. ఈ ప్రపంచకప్తో తనలో ఉన్న ఓ ‘వెలితి’ తీరిందంటున్న శ్రీలంక స్టార్ క్రికెటర్ మహేళ జయవర్ధనే ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి. విజయంతో వీడ్కోలు పలకడంపై కామెంట్? అద్భుతమైన ఫీలింగ్. మాటల్లో చెప్పలేని ఆనందం. సుదీర్ఘ కెరీర్లో చాలా వ్యక్తిగత రికార్డులు సాధించినా ఓ ప్రపంచకప్ లేదనే వెలితి ఉండేది. అది దీనితో తీరిపోయింది. నాలుగు ఫైనల్స్లో ఓడిపోవడం, ఆఖరి మ్యాచ్ అని తెలిసి ఆడటం ఎలాంటి ఒత్తిడి? ఫైనల్స్లో ఓడిపోవడం సహజంగానే నిరాశను కలిగిస్తుంది. అలాగే పెద్ద మ్యాచ్ ఆడే సమయంలో ఒత్తిడి ఉంటుంది. కానీ అనుభవంతో దానిని జయించగలిగే సామర్థ్యం వస్తుంది. ఆఖరి మ్యాచ్ అనే భావన మైదానంలో దిగాక ఉండదు. క్రీజులో ఉన్నంతసేపు ఫోకస్ ఆట మీదే ఉండాలి. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ఒత్తిడి లేదు. ఎలాగైనా గెలవాలనే తపన మాత్రం ఉంది. లంక క్రికెట్కు సంగక్కర సేవల గురించి? అద్భుతమైన క్రికెటర్. నా జీవితంలో మైదానంలో ఎక్కువసేపు గడిపింది అతనితోనే. లంక క్రికెట్లో చెరగని ముద్ర సంగక్కరది. వ్యక్తిగా కూడా చాలా మంచివాడు. ఎంతో పరిణతి చెందిన క్రికెటర్. జట్టు కోసం ఎప్పుడూ ముందుంటాడు. సంగక్కర ఆడుతున్నాడంటే మాలో ఒక రకమైన ధీమా. టి20 ఫైనల్లో సంగక్కర ఇన్నింగ్స్ గురించి? మ్యాచ్కు ముందు అతని ఫామ్ గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. కానీ ఫామ్ కంటే క్లాస్ శాశ్వతం. అతని సామర్థ్యం ఏమిటనేది మాకు తెలుసు. అతను క్రీజులో ఉన్నంతసేపు విజయం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. అందులోనూ లక్ష్యం చిన్నదే కాబట్టి మరింత ధీమాగా ఉన్నాం. టి20ల్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరై ఉండి ఈ ఫార్మాట్ వదులుకోవడం ఎందుకు? టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్లకే నా ప్రాధాన్యం ఎక్కువ. నాలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. అయితే ఈ ఫార్మాట్లో కొత్త క్రికెటర్లు రావడం ద్వారా వాళ్లకి అంతర్జాతీయ క్రికెట్లో ఎక్స్పోజర్ వస్తుంది. దీనిలో అనుభవంతో క్రమంగా వన్డేలు, టెస్టుల్లోకీ వస్తారు. మీ స్థానాలని భర్తీ చేయగలవారు ఉన్నారా? ఏ రంగంలో అయినా కొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్లిపోవాల్సిందే. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఆట తర్వాతే ఎవరైనా. శ్రీలంక క్రికెట్లో నైపుణ్యానికి కొదువలేదు. కచ్చితంగా యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే నమ్మకం నాకుంది. ఫైనల్లో గెలుస్తామనే నమ్మకం ఎప్పుడు కలిగింది? భారత్ అంత తక్కువ స్కోరు దగ్గర ఆగిపోతుందని అనుకోలేదు. 130 పరుగులు ఎలాంటి పిచ్పైనైనా ఈ ఫార్మాట్లో చేయొచ్చు. మా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కాబట్టి విజయంపై పూర్తి విశ్వాసం వచ్చింది. దేవుడు మీవైపు ఉన్నాడన్న స్యామీ, కోహ్లి వ్యాఖ్యలపై కామెంట్? నిజమేనేమో. వాళ్లిద్దరూ గొప్ప క్రికెటర్లు. ప్రత్యర్థి జట్టులోని క్రికెటర్లను గౌరవించడం వారి సంస్కారం. -
టీ20 ప్రపంచకప్ విజేత శ్రీలంక
మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత్ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కుమార సంగక్కర అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 52 పరుగులు చేశాడు. మహేల జయవర్థనే 24, పెరీరా 23, దిల్షాన్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రైనా, మొహిత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సంగక్కర, జయవర్థనేను సహచరులు తమ భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. వీరిద్దరూ టీ20ల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సహచరుడి బాటలోనే...
టి20లకు జయవర్ధనే గుడ్బై వరల్డ్కప్తో కెరీర్ ముగింపు అంతర్జాతీయ టి20లకు గుడ్బై చెప్పిన సీనియర్ ఆటగాడు కుమార సంగక్కర బాటలోనే మరో వెటరన్ మహేల జయవర్ధనే కూడా నడిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు మహేల సోమవారం ప్రకటించాడు. సంగక్కర రిటైర్మెంట్ ప్రకటన తర్వాతి రోజే జయవర్ధనే ఇది చెప్పడం విశేషం. ‘రిటైర్ అయ్యేందుకు సంగక్కర చెప్పిన కారణమే నాకూ వర్తిస్తుంది. మా వయసును బట్టి చూస్తే వచ్చే టి20 వరల్డ్ కప్ ఆడలేం. అప్పటి వరకు జట్టును అట్టి పెట్టుకొని ఉండటం అనవసరం. యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు’ అని జయవర్ధనే అన్నాడు. టి20ల్లోనూ మెరుపులు అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ టెస్టు, వన్డే ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జయవర్ధనే టి20 క్రికెట్లోనూ మెరిశాడు. ఫార్మాట్కు అనుగుణంగా అతను తన శైలిని మార్చుకోవడం విశేషం. 49 టి20 మ్యాచ్ల్లో అతను 31.78 సగటుతో 1335 పరుగులు చేసి శ్రీలంక టాపర్గా నిలిచాడు. జయవర్ధనే స్ట్రయిక్ రేట్ 134.17 కావడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన తొమ్మిది మంది ఆటగాళ్లలో అతను కూడా ఒకడు. కెప్టెన్గా ఆడిన 19 మ్యాచుల్లో 12 మ్యాచుల్లో లంక గెలిచింది. ఉత్తమ జోడి శ్రీలంక జట్టు టి20 విజయాల్లో సంగక్కర, జయవర్ధనే కీలక పాత్ర పోషించారు. టి20ల్లో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం (166) సంగక్కర-జయవర్ధనే జోడి పేరిటే ఉంది. ఓవరాల్గా ఎక్కువ పరుగులు జోడించిన జాబితాలో ఈ జంట మూడో స్థానంలో (20 ఇన్నింగ్స్లలో 792) ఉంది. సంగక్కర సారథ్యంలో శ్రీలంక 2009 ప్రపంచ కప్ ఫైనల్లో... జయవర్ధనే కెప్టెన్సీలో 2012 ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం పాలైంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత సంగక్కర నిష్ర్కమణ! మరోవైపు టి20 అంతర్జాతీయ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కుమార సంగక్కర... ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్కు కూడా గుడ్బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. ఆ సమయానికి తాను 37 ఏళ్లకు చేరుకుంటాను కాబట్టి కొనసాగలేనని, ఇది సహజ పరిణామమని అతను స్పష్టం చేశాడు. -
సంగక్కర బాటలో జయర్థనే
ఢాకా: శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పనున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి అతడు వైదొలగుతాడని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ట్విటర్ ద్వారా వెల్లడించింది. కుమార సంగక్కర బాటలోనే జయవర్థనే పయనించనున్నాడని తెలిపింది. ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు సంగక్కర నిన్న ప్రకటించాడు. 36 ఏళ్ల జయవర్థనే వరుసగా ఐదు టి20 ప్రపంచకప్లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 49 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన జయవర్థనే.. 31.78 సగటు, 134 స్ట్రైక్ రేట్తో 1335 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది అర్థ సెంచరీలున్నాయి. -
రూ.12.5 కోట్లు పలికిన దినేష్ కార్తీక్
బెంగళూరు: ఐపీఎల్-7 వేలం ఆసక్తికరంగా సాగుతోంది. దేశీయ, జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లలో హేమాహేమీలను కొనేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడలేదు. గత ఐపీఎల్లో రాణించిన తమిళనాడు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్కు ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.12.5 కోట్లకు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. రాబిన్ ఊతప్పను రూ. 5 కోట్లను కోల్కతా నైట్ రైడర్స్, అమిత్ మిశ్రాను రూ. 2.25 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు మహేల జయవర్థనే(రూ. 2 కోట్లు), దిల్షాన్(రూ. 2కోట్లు), మాథ్యూస్(రూ.2కోట్లు), రాస్ టేలర్(రూ. 2 కోట్లు), నాథన్ మెకల్లమ్(రూ. కోటి), డేవిడ్ హసీ(రూ. కోటి)లను ఎవరూ కొనలేదు. భారత ఆటగాళ్లు ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, మురళీ కార్తీక్, బద్రీనాథ్, నమన్ ఓజా కూడా అమ్ముడుపోని జాబితాలో ఉన్నారు. -
జయవర్ధనే డబుల్ సెంచరీ
ఢాకా: మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్తో... బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 187.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 730 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 498 పరుగుల ఆధిక్యం లభించింది. వితనగే (103 నాటౌట్) సెంచరీ చేశాడు. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆతిథ్య బంగ్లాదేశ్ 463 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అత్యధిక పరుగుల్లో ఆరో స్థానానికి... టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక స్టార్ క్రికెటర్ జయవర్ధనే (11,236 పరుగులు) ఆరో స్థానానికి చేరాడు. ఈ మ్యాచ్ ద్వారా బోర్డర్ (11,174), చందర్పాల్ (11,219)లను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్, పాంటింగ్, కలిస్, ద్రవిడ్, లారా మాత్రమే జయవర్ధనేకంటే ముందున్నారు. శ్రీలంక తరఫున అత్యధిక టెస్టు సెంచరీల (33) సంగక్కర రికార్డును జయవర్ధనే సమం చేశాడు.జయవర్ధనేకు కెరీర్లో ఇది ఏడో డబుల్ సెంచరీ కావడం విశేషం.