Margadarsi Chits
-
‘మార్గదర్శి’ని ఎందుకు వదిలేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు. మార్గదర్శికి ఒక మీడియా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరమేంటన్నారు. సోమవారం లోక్సభలో 2025–26 కేంద్ర బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. రూ.2,600 కోట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మార్గదర్శి, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిధులను దారి మళ్లించిందన్నారు.ఈ రకంగా నిధులు సేకరించడం తప్పని ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆదాయ పన్ను విభాగం మార్గదర్శికి రూ.1000 కోట్ల జరిమానా విధించడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. లక్షలాది మంది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి కుంభకోణంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు.17 మెడికల్ కాలేజీల పనుల నిలిపివేశారు వచ్చే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమకు కేటాయించిన మెడికల్ సీట్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మెడికల్ కమిషన్ కు లేఖ రాశారని లోక్సభ దృష్టికి తెచ్చారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారని, అయితే ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్ర స్తుత ప్రభుత్వం ఆపేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి జోక్యం చేసుకుని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.⇒ మిథున్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పురందేశ్వరి అడ్డుపడే ప్రయత్నం చేశారు.. పురందేశ్వరి భౌతికంగా బీజేపీలో ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం టీడీపీలోనే ఉందని మిథున్రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని పురందేశ్వరి.. చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని విమర్శించారు. ⇒ బడ్జెట్లో పోలవరం ఎత్తు తగ్గించమని ఎవరు అడిగారంటూ మిథున్రెడ్డి ప్రశ్నించారు. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల పోలవరం సామర్థ్యం తగ్గిపోతుందని.. జాతీయ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.60 వేల కోట్లలో కేవలం రూ.30 వేల కోట్లు ఇస్తే, మిగతా రూ.30 వేల కోట్ల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ⇒ రైల్వేజోన్ను 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా వాల్తేర్ డివిజన్ను రెండుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా మొత్తం వాల్తేర్ డివిజన్ను కొత్త రైల్వే జోన్లోకి కలపాలని డిమాండ్ చేశారు.⇒ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. -
చట్టం.. కొందరికి చుట్టమైంది మరోసారి!
‘‘చట్టం తన పని తాను చేసుకు పోతూంటుంది’’.. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తరచూ చెప్ప మాటిది. అయితే ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్న వస్తే..! జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలా?.. మీడియా సామ్రాజ్యం ముసుగులో రామోజీరావు అనే వ్యక్తి చేసిన చట్ట ఉల్లంఘనలు. తప్పు చేశాడో లేదో తెలియదు కానీ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఒక మహిళ మృతి ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చెప్పారు. రామోజీ గ్రూప్నకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరించి ఉంటే బాగుండేది. మార్గదర్శి ఫైనాన్స్ వేల కోట్ల రూపాలయను అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ను పరిశీలిస్తే ప్రభుత్వమే చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుకున్నట్లు స్పష్టమవుతుంది. అఫిడవిట్ వేసేందుకే ఆసక్తి చూపని ప్రభుత్వం.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మొక్కుబడిగా ఒక పత్రాన్ని దాఖలు చేసి మమ అనిపించినట్లు కనిపిస్తోంది. వ్యవస్థల మేనేజ్మెంట్లో రామోజీరావు దిట్ట అంటారు. అందుకు తగ్గట్టే తన మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చాలామంది రాజకీయ నేతలను తన దారికి తెచ్చుకున్నారన్నది తెలిసిన విషయమే. తన పత్రిక కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రమాణపూర్వకంగా కోర్టుకు తెలిపిన ఘనత రామోజీరావుది. అయినాసరే.. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయనకు జీ హుజూర్ అంటూంటారు. సన్నిహిత సంబంధాలు నెరిపేవారు కూడా. ఈ జాబితాలో కేంద్ర మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తన దగ్గరి మనిషి అని రామోజీ భావించే వారట. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడి సంగతి సరేసరి. గతంలో వారం వారం హాజరీ వేయించుకుని మరీ చంద్రబాబు ఆయన వద్ద సలహా సూచనలు తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమకాలంలో రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరువాతి కాలంలో చప్పబడిపోయారు.. రామోజీరావుతో సత్సంబంధాలు నెరిపారు. రామోజీకి ఎదురైన చట్టపరమైన ఇబ్బందులకు కేసీఆర్ కాపు కాసిన సందర్భాలూ ఉన్నాయి. వీరితోపాటు పలువురు ఇతర నేతలనూ మచ్చిక చేసుకున్న రామోజీరావు తన వ్యాపారాలకు ఇబ్బందిలేకుండా వ్యూహాత్మకంగా పనిచేసేవారు. అయితే సన్నిహితులందరిలోనూ చంద్రబాబుకే అగ్రతాంబూలం. బాబు ముఖ్యమంత్రి అయితే అధికారం తనదే అన్న ధీమా రామోజీరావుది. అందుకే చంద్రబాబుకు ప్రధాన పోటీదారులపై ఆయన నిత్యం అడ్డగోలు వార్తలు రాయించేవారు. తన పత్రిక ద్వారా విషం చిమ్మేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కావచ్చు... ఆయన తనయుడు వై.ఎస్. జగన్ కావచ్చు. ఎవరూ తన సన్నిహితుడు బాబు మాదిరిగా ముఖ్యమంత్రి గద్దెను ఎక్కకూడదన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అయితే.. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉన్నా, హామీలను తుంగలో తొక్కినా రామోజీకి చెందిన ఈనాడు మీడియా బాండ్ బాజా వాయించడం అలవాటు చేసుకుంది. అదే వైఎస్సార్ ఎంత మంచిగా పాలన చేసినా ఎదో ఒక తొండి పెట్టుకునేది. వైఎస్ ప్రభుత్వంలో జరిగే తప్పులను భూతద్దంలో చూపుతుండేది. ఆయన కుమారుడు జగన్ సాక్షి మీడియాను ఆరంబించడం అసలు నచ్చలేదు. సహజంగానే తన వ్యాపారాలకు పోటీ వచ్చే వారిని ఎలా అణచివేయాలన్న ధోరణి రామోజీది. సీనియర్ నేత, అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీకి అవసరమైన సుమారు పదెకరాల భూమిని మరో పారిశ్రామికవేత్త సంఘీ నుంచి వెనక్కి తీసుకుని ఇచ్చారు. కోట్ల సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో రామోజీ అనుసరించిన శైలిపై ఆయన బాధ పడేవారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొంతమేర సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం ద్వారా తనపై ఏ అభియోగం వచ్చినా ఇబ్బంది లేకుండా రామోజీ చేసుకునేవారు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్సార్ కూడా తొలుత చూసి, చూడనట్లు వ్యవహరించినా, రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు, సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి కూడా భూ సేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే అంటూ వైఎస్ పై మొదటి పేజీలో సంపాదకీయం రాయించారు. అది తీవ్ర విమర్శలకు గురైంది. అదే కాలంలో మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది. వైఎస్ ప్రభుత్వం దీనిపై రంగాచారి అనే ఐఎఎస్ అఫీసర్ తో ఒక కమిటీ వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కృష్ణరాజు అనే పోలీసు అధికారికి ఆ కేసును అప్పగించింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వు బ్యాంక్ చట్టం లోని 45 ఎస్ ను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతం అయింది. రిజర్వు బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాంతో రామోజీ తనకు ఉన్న పరపతిని వినియోగించారు. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గం, బీజేపీ, వామపక్షాలలో తనకు అనుకూలమైన వారిని మేనేజ్ చేస్తుండేవారు. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ చానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోప కారణం అయింది. చట్టం ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లించినా అక్రమ వసూళ్ల నేరాభియోగం పోదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అంతలో వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని, అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు థ్రెట్ అవుతారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. వైఎస్ పై ఉన్న ద్వేషంతో రామోజీరావు ఆ రోజుల్లో జగన్ పై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేవారు. జగన్ ను జైలులో అక్రమంగా నిర్భంధించినా ఈనాడు మీడియా దారుణమైన స్టోరీలు ఇచ్చేది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తి కొమ్ముకాసింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగా, విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విచారణలో ఉన్న మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు వేయలేదు. దానికి కారణం రామోజీకి ఉన్న పలుకుబడే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి, ఏపీకి తరలివెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్తపడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణకుమార్ కు ఆరు నెలలు ఆలస్యంగా ఈ విషయం తెలియడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్టం ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టి చెల్లించవలసి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. రామోజీకి శిక్షపడడం తన లక్ష్యం కాదని, ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలన్నది తన పట్టుదల అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎం లుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయడం కష్టం కాలేదు. 2019లో కూడా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా, జనం వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఈనాడు మీడియా తన పంథా మార్చుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే వైఎస్సార్సీపీ వ్యతిరేక వైఖరితో సాగింది. జగన్ పై విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. దారుణమైన అసత్య కథనాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ దశలో జగన్ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం విచారణ చేసి మార్గదర్శి చిట్స్ ఫండ్స్ లో బ్లాక్ మనీ రొటేట్ అవుతున్నట్లు గుర్తించారు. చిట్స్ నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను కనిపెట్టారు. వాటిపై కేసులు పట్టారు. చివరికి రామోజీని సైతం సీఐడీ విచారణ చేయడం అప్పట్లో సంచలనమైంది. జగన్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కేసులన్నిటిని నీరుకార్చుతున్నారు. అది వేరే సంగతి. ఇక మార్గదర్శి డిపాజిట్ల కేసులో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది.తదుపరి సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. ఉండవల్లి పోరాటం కొనసాగి ఉండకపోతే ఎప్పుడో ఈ కేసు హుష్ కాకి అయి ఉండేదని లాయర్లు చెబుతుంటారు. మామూలు గా అయితే మరొకరి విషయంలో ఉండవల్లి మాదిరి ఎవరైనా పోరాటం సాగిస్తే, ఈనాడుతో సహా మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. ఉండవల్లిని పోరాట యోధుడుగా గుర్తించేవి. కాని మార్గదర్శి ఈనాడు మీడియాకు సంబంధించిన సంస్థ కావడంతో సాక్షి తప్ప ఇతర మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నాయి. అలాగే వైఎస్సార్సీపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఏవీ రామోజీపై విమర్శలు చేయడానికి భయపడుతుంటాయి. కాగా రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ డిపాజిట్లు వసూలు చేసిన హెయుఎఫ్ కర్త మరణించినా, సంబంధిత సంస్థ కొనసాగుతోంది కనుక కేసు ముగియదు. పెనాల్టీ క్లాజ్ వర్తిస్తుందన్నది ఒక అభిప్రాయం. రామోజీకి వ్యక్తిగత శిక్ష గురించి విచారణ జరగదు తప్ప మిగిలిన కేసు యథాతథంగా ఉంటుదని ప్రముఖ లాయర్ ఒకరు చెప్పారు. రామోజీ తదుపరి ఆయన కుమారుడు కిరణ్ ఆ సంస్థ కర్తగా ఉన్నారు. కిరణ్ కూడా వైఎస్సార్సీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాల వారితో అదే విధమైన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఈ డిపాజిట్ల మీద వారి అభిప్రాయాలు తెలియచేయాలని కోరినా, చాలాకాలం ప్రభుత్వాలు స్పందించకపోవడం విశేషం. దాంతో మరోసారి హైకోర్టు అసంతృప్తి చెందింది. గతంలో కేసీఆర్ మాదిరే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేసింది. కాని తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా, అందులో స్పష్టత ఇవ్వకుండా కోర్టు నిర్ణయానికే వదలి వేసినట్లు పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికి సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. 45 ఎస్ సెక్షన్ కింద డిపాజిట్లు వసూలు చేయడం నేరమా? కాదా?అన్నదానిపై అభిప్రాయం చెప్పలేదు. అది నేరమని అంగీకరిస్తే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా? ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ నే నియమించిన రేవంత్ ప్రభుత్వం, కెటిఆర్ పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికి తెలిసిన రహస్యమే. చంద్రబాబు, రేవంత్ లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోంది. వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని పై రేషన్ బియ్యం కేసు పెట్టి వేధిస్తోంది. ఆయన ఈ కేసులో రెండున్నర కోట్లు చెల్లించినా వదలి పెట్టడం లేదు. పేర్ని నాని మహాపరాధం చేసేసినట్లు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చే ఈనాడు మీడియా గురివింద గింజ సామెత మాదిరి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి మాత్రం నోరెత్తడం లేదు. రామోజీ మరణించారు కనుక ఆ కేసు విచారణ అవసరమా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అల్లు అర్జున్ విషయంలో అతిగా వ్యవహరించడమే కాకుండా, శాసనసభలో సైతం రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల అక్రమిత స్థలాలలో నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలలో చట్టం తన పని చేసుకుని పోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసు లో మాత్రం ఉదారంగా ఉందన్నమాట. అందుకే చట్టం కొందరికి చుట్టం అని,అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గర చుట్టం అని భావించాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
-
మార్గదర్శి కేసు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్ కాపీని సోమవారంలోగా ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్ న్యాయవాదిని ఆదేశించింది. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.కాగా, చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు,. -
చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు ఎల్రక్టానిక్ఫార్మాట్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచి్చంది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది. లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం ఈ వ్యవహారంపై జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ఉండవల్లి అరుణ్కుమార్ వర్చువల్గా హాజరయ్యారు. సుప్రీం కోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్డ్రైవ్లో ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించానని, ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎల్రక్టానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. తాను ఎవరి తరఫున వకాలత్ తీసుకోలేదని, సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా అని చెప్పారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్డ్రైవ్లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లుథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. -
మార్గదర్శి కేసు.. వారి వివరాలిస్తే ఇబ్బందేంటీ?: హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది. అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.చదవండి: చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు -
ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘మార్గదర్శి’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నోటీసులు యాడ్స్కు అయ్యే ఖర్చును మార్గదర్శి భరించాలని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. యాడ్స్ ఖర్చు వివరాలు ఇచ్చిన వారంలోపు మార్గదర్శి డిపాజిట్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘చందాదారుల వివరాల కోసం పత్రికల్లో నోటీసులివ్వండి. మొత్తం ఎంత ఖర్చవుతుందో రిజిస్ట్రీ మార్గదర్శికి చెబుతుంది. అప్పటి నుంచి వారంలోగా ఆ డబ్బు డిపాజిట్ చేయాలి. వెంటనే పత్రికల్లో విస్తృతంగా నోటీసులిస్తూ ప్రచారం చేయండి’’ అని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గత విచారణలో రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మార్గదర్శి కోసం ముసుగు తీసేసాడు: Undavalli Arun Kumar
-
ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: రామోజీరావుకు క్లీన్చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావు సంస్థలను చంద్రబాబు కాపాడుతున్నారన్నారు.రామోజీ ఆర్థిక నేరస్థుడు..‘‘డీబీటీ పథకాలన్నీ చంద్రబాబు పక్కనపెట్టారు. దాచుకో.. దాచుకో.. తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్ను హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. చిట్స్ వసూలు చేసి మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. చట్ట వ్యతిరేకంగా రామోజీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రామోజీ ఆర్థిక నేరస్థుడు. రామోజీ పెట్టుబడులన్నీ అక్రమంగా నిర్వహించినవే. చిట్స్ కేసు కొట్టేస్తే పత్రికల్లో వార్త రాకుండా జాగ్రత్తపడ్డారు. అర్ధాంతరంగా కేసును సీఐడీ విత్ డ్రా చేసుకోవడం దారుణం. దీనిపై ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉండవల్లి ఈ కేసును బతికించారు’’ అని అంబటి చెప్పారు.అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? ‘‘మార్గదర్శికి సహాయం చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఇటువంటి పనులకు పాల్పడ్డారు. రామోజీరావు కుటుంబం చట్టాలను ఉల్లంఘించింది. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. మార్గదర్శి మీద అనేక కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కానీ ఈ కేసులను ప్రభుత్వం విత్ డ్రా చేసకోవటం చాలా అన్యాయం. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో. కోర్టులతో పనిలేకుండా ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇస్తోంది. మార్గదర్శి అంటే వైఎస్సార్, జగన్కు కోపం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మార్గదర్శిలోని లోపాల గురించి మాట్లాడటం లేదు. అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? లేదా? అనేదే చూడాలి. ఒక చిట్ వేసేటప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక ఎకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా ఎన్ని చిట్లు వేస్తే అన్ని ఖాతాలు తెరవాలి. కానీ మార్గదర్శి కేసులో ఒకే ఖాతాలో ఎమౌంట్ వేశారు’’ అని అంబటి రాంబాబు వివరించారు. సీఐడీ విత్ డ్రా.. దీని వెనుక కుట్ర ‘‘ఆ డబ్బుని ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ప్రజల సొమ్ముతో పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు. సీఐడీ దీన్ని గుర్తించి రామోజీరావుని కూడా విచారించింది. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ, పీవి నరసింహారావు కూడా కోర్టులో నిలబడ్డారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. 2006లోనే మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమాలను ఆర్బీఐ గుర్తించింది. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. రాష్ట్రం విడిపోయే ముందు రోజు ఎవరికీ తెలియకుండా కోర్టు కొట్టేసింది. ఆనాడు ఏ పత్రికా ఆ వార్త రాయలేదు. ఇవాళ కూడా సీఐడీ విత్డ్రా చేసుకున్న సంగతిని కూడా ఏ పత్రిక రాయలేదు. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్గదర్శిలో డిపాజిట్లు కూడా ఎవరూ వేయకపోవటంతో దివాళా దశగా ఆ సంస్థ నడుస్తోంది. ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకున్నా కేసు ఎక్కడకూ పోదు. గతంలో ఇలాగే చేసినా ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లి కేసును బతికించారు. రామోజీ, చంద్రబాబులకు వ్యవస్థలను మేనేజ్ చేయటం అలవాటు.’’ అని అంబటి దుయ్యబట్టారు.చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే..‘‘నీతి, నిజాయితీ గలవారే రాజకీయాలు చేయగలరు. చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడివారు గట్టిగా నిలబడ్డారు. ఎంపీటీసి, జడ్పీటీసీలను చూసైనా ఈ ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలి. ఎంతమంది వెళ్లినా వైసీపికి 40 శాతం ఓటర్లు ఉన్నారని గుర్తించాలి. చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేశారు. అసలు సజ్జలకు ఈ కేసుతో ఏం సంబంధం ఉంది?. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఈ కేసుతో చంద్రబాబు హడావుడి ఉంది. అదంతా త్వరలోనే భూమ్ రాంగ్ అవుతుంది. జెత్వాని వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. చంద్రబాబు స్కాం చేసినందున అరెస్టు అయ్యాడు. ఆయన్ని అరెస్టు చేశారని కక్ష కట్టి ఐపీఎస్ల మీద పగ సాధిస్తున్నారు. బాలకృష్ణ కాల్పుల కేసును కూడా బయటకు తీస్తారేమో చూడాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
ఈనాడుకు బాబు గిఫ్ట్
పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్ఫండ్స్కు ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్స్ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు. పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... మార్గదర్శి చిట్ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. మార్గదర్శి, శైలజా కిరణ్ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్ఫండ్స్ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుగుతూ వస్తోంది.అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్ఫండ్స్కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.భారీ గురు దక్షిణ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాదిరిగా మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. అంతేకాదు.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్గా, ఆయన కోడలు శైలజా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలలో కొన్ని..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలుఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. -
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి: ఉండవల్లి అరుణ్కుమార్
మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్కు చేరి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్లింది. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. మార్గదర్శిపై పోరాడుతున్న వారిని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్లో ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే.. ఆ కేసు నుంచి బయటడతాను. కేసు వేయడంతో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తోంది. – ఉండవల్లి అరుణ్కుమార్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టులో వాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాల నుంచి కనీస స్పందన కరువైందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతోనైనా వాళ్లలో చలనం కలుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ బుక్ హౌస్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో ఈ కేసుకు బలం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు దివంగత రామోజీరావు, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎలా స్పందిస్తారో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే గౌరవం దక్కుతుందన్నారు. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప.. అన్యాయం జరగదని చెప్పారు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలని కోరారు. మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించిన వడ్డీల గురించి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డిపాజిట్ల సొమ్ము అందరికీ అందిందా? లేదా? అన్న విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించిందన్నారు. డిపాజిట్దారుల వివరాలను పెన్ డ్రైవ్లో నింపి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించానని తెలిపారు. తాము ఎవరికి డబ్బు చెల్లించామన్న వివరాలను మార్గదర్శి 70 వేల పేజీల్లో నింపి సుప్రీంకోర్టుకు అందించిందని చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు నిజమైంది 2006 నవంబర్ 6వ తేదీన అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరానికి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణ విషయంలో తాను ఏం ఫిర్యాదు చేశానో అదే విషయాన్ని ఆర్బీఐ సైతం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొందని ఉండవల్లి చెప్పారు. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్ల వసూళ్లలో 45ఎస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. మార్గదర్శిపై తన పోరాటాన్ని కొందరు తప్పు పట్టారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. కేసు పోరాటంలో తనకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు. చిట్ ఫండ్ చట్టాలకు తాము అతీతం అని మార్గదర్శి భావించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చట్టాలు పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల కాకినాడలో జయలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేశారని ఉదహరించారు. రామోజీ నిబంధనలు పాటించక పోవడంతో మిగిలినవి సైతం అదే దారిలో వెళుతున్నాయన్నారు. విలీన మండలాలను కాపాడుకోవాలి రాష్ట్ర విభజన విషయంలో విలీన మండలాలు తెలంగాణ పరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరçఫున గతంలో వైఎస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో ఇప్పుడు కూడా అదే చేయాలని చంద్రబాబును కోరారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నట్టు విశాఖపట్నంకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నీతి ఆయోగ్కు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైందని, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. ఓట్ల శాతంపై కదలికేదీ? మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా 12.54 శాతం ఓట్లు, ఒడిశాలో 12.4 శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించినట్టు ప్రకటించిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి.. ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డి్రస్టాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలని కోరారు. -
చంద్రబాబూ.. జగన్లా మీరు చేయలేరా? ఉండవల్లి హాట్ కామెంట్స్
తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్ఫండ్ కంపెనీ కూడా చిట్ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్ఫండ్ యాక్ట్ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. .. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.ఏపీ ఎన్నికల ఫలితాలపైనా.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
హైకోర్టు కీలక నిర్ణయం.. మార్గదర్శికి బిగ్ షాక్
-
ఇదీ క్విడ్ ప్రోకో కుట్ర.. ‘మార్గదర్శి’ దందాకు బాబు రక్షణ
సాక్షి, అమరావతి: అసలు సిసలైన క్విడ్ప్రోకో అంటే ఇదే..! చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు, కుంభకోణాలకు ఈనాడు కొమ్ము కాస్తోంది. అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలకు చంద్రబాబు సర్కారు రక్షణగా నిలుస్తోంది!! అందుకే ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్లపై న్యాయస్థానంలో తమ వైఖరి తెలిపేందుకు ససేమిరా అంటోంది. కుట్రపూరితంగా మౌనం పాటిస్తూ సామాన్య డిపాజిట్దారుల ప్రయోజనాలను గాలికొదిలేస్తోంది. మార్గదర్శి యాజమాన్యంతో కుమ్మక్కు కుట్రలో ఇటు చంద్రబాబు సర్కారు అటు తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. బాబు కుట్రపూరిత మౌనం.. ‘మార్గదర్శి’కి వత్తాసుమార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందాకు చంద్రబాబు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఆ కేసు విచారణను తీవ్ర జాప్యం చేసేలా వ్యవహరిస్తుండటమే అందుకు నిదర్శనం. ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఈనాడు రామోజీరావు కుటుంబం యథేచ్ఛగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా ఆధారాలతో సహా బట్టబయలైన విషయం తెలిసిందే. మార్గదర్శి పేరుతో ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది.ఈ నేపథ్యంలో ఆ అక్రమ డిపాజిట్లపై విచారణ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు.. ఏపీ, తెలంగాణలో మార్గదర్శి డిపాజిట్దారుల ప్రయోజనాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. అందుకోసం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్రెడ్డి సర్కారు దీనిపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైనా పూర్తిగా మౌన ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం గమనార్హం.తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనమే వహించారు. ఇదే అదునుగా ‘మార్గదర్శి’ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారు. ‘మార్గదర్శి’ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్బీఐ అఫిడవిట్పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియచేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టులు క్రియాశీలం.. ప్రభుత్వాలు ఉదాశీనం‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. అక్రమ డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్ల పేర్లు, డిపాజిట్ల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించాలని.. ఎంతమందికి డిపాజిట్లు వెనక్కి ఇచ్చారో పరిశీలించాలని కూడా ఆదేశించడం గమనార్హం. ఆరు నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించింది. ఈ క్రమంలో ‘సుప్రీం’ ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సత్వరం చేపట్టింది. కాగా ‘మార్గదర్శి’ డిపాజిట్లు చట్టవిరుద్ధమేనని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.ఈ కేసులో న్యాయస్థానాలు, ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తుండగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ‘మార్గదర్శి’ డిపాజిటర్ల వివరాలను జిల్లాలవారీగా ప్రకటిస్తామని, వారికి డిపాజిట్ల మొత్తం చెల్లించారో లేదో పరిశీలిస్తామని, ఎంతమందికి డిపాజిట్లు తిరిగి చెల్లించారు? ఎంతమందికి చెల్లించ లేదు? అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ హైకోర్టుకు వెల్లడిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది.క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఈ రెండు ప్రభుత్వాలే. అయితే ఆ మాట చెప్పేందుకు ఇటు చంద్రబాబు ప్రభుత్వానికిగానీ అటు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గానీ మనస్కరించడం లేదు. మార్గదర్శి యాజమాన్యానికి పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.నాడు కొట్టివేతకు బాబు ప్రభుత్వ సహకారంకేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సర్కారు అండతోనే ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఉమ్మడి ఏపీలో యథేచ్చగా అక్రమ డిపాజిట్ల దందా సాగించారు. దీనిపై 2006లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఫిర్యాదు చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రామోజీ వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఆయన అనివార్యంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసివేశారు. సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్దారులకు చెల్లించేసినట్లు చెప్పారు.అయితే సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్దారుల వివరాలు, వారికి తిరిగి చెల్లించిన మొత్తం వివరాలను వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమ డిపాజిట్ల దందాకు అండగా నిలిచింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసును కొట్టివేయడం గమనార్హం.అయితే డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. తద్వారా ఆ కేసు నిలిచేలా చేసింది. మళ్లీ అదే కుతంత్రం..రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల దందాకు వత్తాసు పలుకుతోంది. ‘మార్గదర్శి’వి అక్రమ డిపాజిట్లేనని స్వయంగా ఆర్బీఐ నిగ్గు తేల్చడంతో రామోజీ కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించడంతో రామోజీ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో మీ అక్రమాలకు అండగా నేనున్నానంటూ చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరతీశారు. అక్రమ డిపాజిట్లపై ప్రభుత్వ వైఖరిని చెప్పకుండా వీలైనంత జాప్యం చేసేలా కుట్ర పన్నుతున్నారు.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తే ‘గోడ మీద పిల్లి’ వైఖరి అనుసరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక జిల్లాల వారీగా డిపాజిటర్ల వివరాల వెల్లడి, వారికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారో లేదో పరిశీలన ప్రక్రియ చేపట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి డిపాజిటర్లకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పష్టం చేస్తున్నారు. -
రామోజీని జైల్లో పెట్టాలన్నది నా కోరిక కాదు: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఉండల్లి అరుణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను. నేను అడిగింది 45-ఎస్ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావును జైలులో పెట్టాలని లేక శిక్షించాలన్నది నా కోరిక కాదు. ఈ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిలు వల్ల జరిగిందని భావించాలి. ఇప్పుడు 45-ఎస్ ఓపెన్.. దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎక్యుర్డ్ ఇంట్రెస్ట్తో సహా ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని మార్గదర్శి కోర్టు వివరించింది. ఖాతాదారులు అందరికీ కలిపి 55.39 కోట్లు వడ్డీ కింద అందజేశామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపితే 900 కోట్లు వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకును పార్టీలను చేసి తెలంగాణ హైకోర్టుకు ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్ అసిస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్తో జీమెయిల్కి పంపండి. thedepositers@gmail.com అనే జిమెయిల్ ప్రారంభించాను. జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపించమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుగనుంది. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమంది. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
బందిపోటు దొంగల్లా మార్గదర్శి యాజమాన్యం
-
పేద, మధ్య తరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసింది
-
రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?
వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు. ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది. నిజానికి సీఎం జగన్పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్టీఆర్ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎస్సార్ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది. తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. 2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్మోహన్రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్మోహన్రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు. తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు. నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
-
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ► అలాగే, మార్గదర్శి చిట్ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. చందాదారులకు సీఐడీ రక్షణ.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది. -
‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే
ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది నిగ్గు తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీ ఆర్థిక ఉగ్రవాదేనన్నది స్పష్టమైంది. ‘మార్గదర్శి’ ముసుగులో భారీగా నల్లధనం దందా నిర్వహిస్తున్నారన్నదీ రూఢీ అయ్యింది. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తొడుక్కున్న ‘పత్రికా స్వేచ్ఛ’ అనే ముసుగు తొలగిపోయింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ రామోజీ నిజ రూపంలో అవినీతి దిగంబరుడుగా నిలబడ్డారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసిందని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఈ కేసులో తరువాత పరిణామాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అక్రమ డిపాజిట్ల కేసు నిరూపితమైతే ఏకంగా రెట్టింపు జరిమానా అంటే రూ.5,200 కోట్ల జరిమానాతోపాటు కనీసం రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు.. నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు విస్పష్టంగా నివేదించింది. దాంతో రామోజీ అవినీతి ఆట కట్టిందని, ఇక శిక్ష పడటమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాల కథ కమామీషు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2006లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశి్నంచే వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్టు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపిస్తూ ఉండేవి. కానీ ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించేదనే విషయం బయటి ప్రపంచానికి తెలీదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించింది. భారీగా అక్రమ డిపాజిట్లు సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల సేకరణ పేరిట ప్రజలను మోసం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్బీఐ స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించింది. ఆర్బీఐ చట్టంలోని 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ చట్టానికి తాను అతీతం అని భావించే రామోజీ ఈ నిబంధనను నిర్భీతిగా బేఖాతరు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట యథేచ్ఛగా డిపాజిట్లు వసూలు చేశారు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. కాగా మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు ఒప్పుకోక తప్పని రామోజీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. ఈ అక్రమాలపై సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. కాగా తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించేందుకు రామోజీ యత్నించారు. హెచ్యూఎఫ్గా తాము ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవచ్చని అడ్డగోలుగా వాదించారు. కానీ సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దాంతో తాము తప్పు చేసినట్టు రామోజీరావు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్టు కూడా సమ్మతించారు. తమ తప్పును అంగీకరిస్తూ డిపాజిట్దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. వివరాలు చెప్పం అని వితండవాదం తాము అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను సంబంధిత డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని రామోజీరావు న్యాయస్థానానికి తెలిపారు. కాగా అక్రమ డిపాజిట్లు ఎవరెవరి నుంచి సేకరించారు.. ఎవరెవరికి తిరిగి చెల్లించారో ఆ వివరాలు వెల్లడించాలని సీఐడీ, ఉండవల్లి అరుణ్కుమార్ కోరినప్పటికీ రామోజీరావు సమ్మతించ లేదు. ఆ వివరాలు తాము వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. కాగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలని అదీకృత అధికారి కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పనిదినాన కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. డిపాజిట్ దారుల వివరాలు వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం 2022లో ఇంప్లీడ్ అయ్యింది. డిపాజిట్దారుల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు గత ఏడాది పేర్కొంది. కానీ ఇంతవరకు రామోజీరావు తమ డిపాజిట్దారుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. నల్లధనం దందా వల్లే గప్చుప్ ► మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటున్నారు. ► 2006 నాటికే ఏకంగా 32,385 మంది నుంచి రూ.2,600 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. కానీ వారి పేర్లు, వివరాలను మాత్రం వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటుండటం గమనార్హం. ఎందుకంటే ఆ డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చారు. అందుకే సీఐడీతోపాటు న్యాయస్థానం కోరినప్పటికీ వారి వివరాలను వెల్లడించేందుకు సమ్మతించడం లేదు. ► కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు కూడా నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలు రూ.50 వేలకు మించి ఉన్నప్పటికీ వాటిని రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓ లుగా మార్చింది. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అంటున్నారు. -
మార్గదర్శి ఫ్రాడ్ కేసులో రామోజీకి శిక్ష తప్పదు : అడ్వకేట్ శివరామి రెడ్డి
-
రామోజీకి భారీ షాక్.. ఫలించిన ఉండవల్లి పోరాటం
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
మార్గదర్శి స్కాం కేసులో రామోజీ రావుకు సుప్రీం కోర్ట్ షాక్
-
అప్పులంటూ అబద్ధాల డప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రం అప్పులపై ‘ఈనాడు’ రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారని, నిరాధారమైన గణాంకాలతో దు్రష్పచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయటమే లక్ష్యంగా అప్పులపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపోతోందంటూ దుర్మార్గంగా వండి వార్చిన కథనాలను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషం, కక్ష అర్ధం అవుతున్నాయన్నారు. ఈనాడు కథనంలో డొల్లతనాన్ని నిరూపిస్తూ.. ఆర్బీఐ, కాగ్ అధికారిక నివేదికలను దువ్వూరి కృష్ణ బయటపెట్టారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాకు వాస్తవాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే... అబద్ధాలే.. ఆధారాలేవి? ఊహాజనిత గణాంకాలతో, లేని అప్పులు ఉన్నాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను అచ్చు వేసింది. ప్రతి గొంతుతోనూ అబద్ధాలాడే ‘దశకంఠుడి’గా రామోజీ దిగజారిపోయారు. రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకు పరిమితికి లోబడే ఉన్నాయి. కోవిడ్తో రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ హయాంలో కన్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వృద్ధి తక్కువగా ఉంది. మార్కెట్ రుణాలతో పాటు నాబార్డు, విద్యుత్ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, బాండ్ల గ్యారెంటీతో పాటు గ్యారెంటీ ఇవ్వకుండా తీసుకున్న మొత్తం అప్పులు రూ.6.38 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని రూ.10.11 లక్షల కోట్లగా పేర్కొంటూ ‘ఈనాడు’ ఏ అధికారిక నివేదిక ఆధారంగా రాసిందో చెప్పాలి. లేదంటే కాగ్, ఆర్బీఐ అధికారిక నివేదికల ప్రకారం నేను వెల్లడించిన గణాంకాలను ప్రచురించాలి. పెండింగ్ బిల్లులపై సొంత లెక్కలా? పెడింగ్ బిల్లులు రూ.21 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించగా రూ.1.70 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులున్నట్లు రామోజీ పచ్చి అబద్ధాలు ఎలా ప్రచురిస్తారు? ప్రభుత్వం బడ్జెట్లో చేసే అప్పులతో పాటు గ్యారెంటీతో చేసిన అప్పులు, గ్యారెంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు అసెంబ్లీకి సమర్పించాం. ఈనాడు తనకు నచ్చిన ఊహాజనిత గణాంకాలతో అప్పులుపై తప్పుడు కధనాలు రాస్తోంది. అప్పులపై ఎన్నిసార్లు వాస్తవాలు వెల్లడించినా పదేపదే దు్రష్పచారానికి పాల్పడుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. హెచ్చరికలంటూ అవగాహనారాహిత్యం.. ఆర్బీఐ గానీ కేంద్ర ఆర్థికశాఖగానీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు. అసలు నిబంధనల మేరకు అప్పులకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనలు మీరితే అప్పులు ఇవ్వడం నిలిపేస్తారు. అంతేగానీ హెచ్చరికలు ఉండవు. ఈ మాత్రం కనీస అవగాహన కూడా రామోజీరావుకు లేదు. కేంద్రానికి గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ అనధికారిక అప్పులు ఉండవనే సంగతి తెలియకపోవడం ‘ఈనాడు’ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. అనధికారిక అప్పులా? మార్గదర్శి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక డిపాజిట్లు సేకరించడం రామోజీకే చెల్లింది. ప్రభుత్వాలకు బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్ధలు గానీ ఏ అప్పులిచ్చినా అవి అధికారికంగానే ఇస్తాయి. అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? మార్వాడీ దగ్గరకు వెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం కేంద్రంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ప్రభుత్వానికి అప్పులు చెల్లించే ఉద్దేశం లేదంటూ మరో అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. అప్పులను వాయిదాల ప్రకారం ప్రభుత్వాలు తీరుస్తూ ఉంటాయి. తీర్చకపోతే డిఫాల్ట్ అవుతాయి. అది కూడా తెలియదా? గత అప్పులకు ఇప్పుడు కోత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే. వాస్తవానికి గత సర్కారు నిబంధనల కంటే ఎక్కువగా అప్పులు చేసింది. దాంతో కేంద్రం ఇపుడు వాటిని తగ్గిస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల జారీ ద్వారా రుణం తీసుకోవడానికి సెబీ అనుమతించింది. అయితే అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. దీన్ని కూడా వక్రీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధం అన్నట్లు తప్పుడు కథనాలు ప్రచురించారు. పరిమితికి లోబడే గ్యారెంటీలు గ్యారెంటీలు రాష్ట్ర ఆదాయంలో 80 శాతమే ఉన్నాయి. ఇవి నిబంధనల కన్నా తక్కువే. పెండింగ్ బిల్లుల విషయంలో ‘ఈనాడు’వి పచ్చి అబద్ధాలు. జీతాలు గానీ పెన్షన్లు గానీ ఆగలేదు. అలాంటప్పుడు ఇన్ని పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయి? కోవిడ్ కారణంగా రాష్ట్రం రూ.66 వేల కోట్లు ఆదాయం కోల్పోయినప్పటికీ టీడీపీ హయాంతో పోలిస్తే తక్కువగానే అప్పు చేసింది. గత సర్కారు హయాంతో పోల్చితే ఆస్తుల కల్పనకు వెచ్చించిన మూల ధన వ్యయం ఇప్పుడే ఎక్కువ. -
సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై విచారణ
-
రామోజీ, శైలజతో పాటు మరో 13 మందికి నోటీసులు
-
చిట్ఫండ్ చట్టం తెలియదట.. కంపెనీ లా చట్టం వర్తించదట
-
రామోజీ చిత్రహింసలు బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
-
రామోజీ చీకటి చిట్ వ్యాపారానికి ఇక చెక్ పడ్డట్టేనా?
-
కంపెనీనే సొంతంగా చిట్స్ తీసుకుంటుంది: సీఐడీ అడిషనల్ డీజీ
-
అందరికి నీతులు చెప్పే రామోజీకి.. ఈ వయసులో ఇది స్వయంకృతాపరాధమే
ఈనాడు అధినేత రామోజీరావు ఈ వయసులో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఆయన స్వయంకృతాపరాధమే అనిపిస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్కు సంబంధించి సీఐడీ సోదాలలో వెలుగు చూస్తున్న అంశాలు ఆందోళన కలిగించేవే. ఎంత పెద్ద సంస్థ అయినా సిస్టమ్స్ను సరిగా అమలు చేయకపోయినా, స్వయంగా యాజమాన్యమే నిబంధనలను ఉల్లంఘించినా, ఎప్పుడో అప్పుడు సంక్షోభంలోకి వెళతారనడానికి ఇదో ఉదాహరణ. గతంలో కూడా చాలా పెద్ద కంపెనీలు ఇలాగే దెబ్బతిని మూతపడ్డాయి. మార్గదర్శికి ఆ దశ రావాలని ఎవరూ కోరుకోరు. రామోజీ అతీతుడా? కాని అందరికీ నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడమే బాగోలేదు. ఈనాడు పత్రికలో ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాం కాబట్టి కక్ష బూనారని, అందుకే మార్గదర్శి చిట్స్పై దాడులు చేస్తున్నారని వీరి అభియోగం. నిజమే ఎవరిపైన అయినా కక్ష ఉండరాదు. అలాగని ఏదైనా సంస్థలో నిబంధనలు అమలు చేయడం లేదని తెలిస్తే, ఆ సంస్థ ప్రమాదంలో పడుతుందని సమాచారం వచ్చినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకుండా ఎలా ఉంటారు? ప్రభుత్వాలలోని లోపాలు ఎత్తి చూపడానికి మీడియా ఉంది. దానిని ఎవరూ కాదనలేరు. ప్రభుత్వంపై నీచంగా అసత్యాలు, వ్యతిరేక కథనాలు కాని మీడియా ఉంది కదా అని పత్రికలో పచ్చి అబద్దాలు రాసినా అదే పత్రికా స్వేచ్చ అట. మార్గదర్శిలో సోదాలు చేసినా, అక్రమాలు ఉన్నాయని చెప్పినా అది కక్ష అట. ఈనాడు మీడియా గత నాలుగేళ్లుగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత నీచంగా అసత్యాలు, అర్ద సత్యాలు, వ్యతిరేక కథనాలు రాసి ప్రచారం చేసింది, ఇంకా ఎలా విష ప్రచారం సాగిస్తున్నది ఎవరికీ తెలియదా? ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపవచ్చు. కాని అదే పనిగా ఉన్నవి, లేనివి రాయడం మాత్రం పత్రికా స్వేచ్చను దుర్వినియోగం చేయడమే అవుతుంది. గతంలో వాతావరణం అనుకూలంగా ఉండబట్టే ఏమి రాసినా నడిచిపోయింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మార్గదర్శి విషయంలో ఎందుకు చేయలేదు? ఈనాడుకు పోటీగా మరికొన్ని మీడియా సంస్థలు వచ్చాయి. సోషల్ మీడియా ఉండనే ఉంది. అయినా జర్నలిజం విలువలకు కట్టుబడి ఉంటే మార్గదర్శి అక్రమాలను సమర్ధిస్తూ రాయగలుగుతారా? ఇతర చిట్ సంస్థలకు సంబంధించి, ఇలా ఎక్కడైనా సోదాలు జరిగితే చిలవలు, పలవలు చేసి వార్తలు రాశారా? లేదా? అంతదాకా ఎందుకు అగ్రిగోల్డ్ విషయంలో ఎన్ని కథనాలు ఇచ్చారు? ఎక్కడైనా దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతుంటే, వారు పక్కన కూర్చుని చూసినట్లు రాస్తుంటారు కదా! మరి మార్గదర్శి విషయంలో ఎందుకు అలా చేయలేకపోయారు. భుజనా వేసుకొని ప్రచారం చేస్తే ఎలా? పైగా పత్రిక తమ చేతిలో ఉంది కదా అని పేజీల కొద్దీ ఎదురు దాడి. మార్గదర్శి చందాదారులకు భారీగా బాకీ పడి ఉంటుందని సీఐడీ అంచనా అన్నట్లు వార్తలువచ్చాయి..అవి నిజమా? కాదా? వారు చెబుతున్న అంశాలలో ఉన్న మెటీరియల్ ఏమిటి. నల్లదనం యధేచ్చగా ప్రవహిస్తోందా? లేదా? చిట్దారులకు డబ్బు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారా? లేదా? ఘోస్ట్ చందాదారులు ఉన్నారని చెబుతున్నారు. ఇలా సీఐడీ చెబుతున్న వాటి గురించి మార్గదర్శి వివరణ ఇస్తే పర్వాలేదు. కాని ఈనాడు మీడియానే భుజనా వేసుకుని ప్రచారం ఎలా చేస్తోంది. ఆ విషయం ఈనాడుకు తెలీదా? ఇతర సంస్థల విషయంలోనూ అలాగే చేస్తారా? పన్నెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన సాక్షి, భారతీ సిమెంట్ వంటి వాటికి వ్యతిరేకంగా ఈనాడు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తెలియదా? సాక్షిని ఎలాగైనా మూసివేయించాలని విశ్వయత్నం చేశారా? లేదా? ఆ రోజుల్లో సోనియా గాందీ, చంద్రబాబు నాయుడు, సీబీఐఅధికారి ఒకరు, అలాగే రామోజీరావు వంటివారు ఆ కుట్రలో భాగస్వాములా? కాదా? మాట్లాడితే జగన్కు అలా అవుతుంది? ఇలా అవుతుంది? ఆయన ఇక జైలు నుంచి బయటకు రారు. తీహారు జైలుకు తరలిస్తారు.. అంటూ ఎన్ని కథనాలు రాశారు. చట్టాలే మాకు వర్తించవని చెబితే కుదురుతుందా? సీబీఐ విచారణ జరిగిందో, లేదో.. తెల్లారేసరికి ఆ విచారణలో అలా జరిగింది? ఇలా జరిగింది? ఈ ప్రశ్నలకు సమాదానం చెప్పలేదు? అంటూ ఎలా రాశారు. మరి ఇప్పుడు సీఐడీ చేస్తున్న విచారణ గురించి రాయకుండా మార్గదర్శిని వేధిస్తున్నారని ఎందుకు రాస్తున్నారు? పోనీ వేధింపులని ఫీల్ అయ్యి రాస్తే రాశారని అనుకుందాం. మరి సోదాలలో ఏమి బయటపడిందో కూడా వార్తలు ఇవ్వాలి కదా! మార్గదర్శి నిధులను చట్ట విరుద్దంగా ఇతర కంపెనీలకు తరలించారన్నది ఆరోపణ. దానిపై వీరు ఇచ్చే వివరణ ఏమిటి? అసలు చట్టాలే తమకు వర్తించవని చెబితే కుదురుతుందా? కోర్టులలో తాము పెద్ద లాయర్లను పెట్టి రక్షణ పొందగలమన్నది వారి విశ్వాసం కావచ్చు. జర్నలిజం అవుతుందా? గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై ఈనాడు మీడియా అనండి.. రామోజీరావు అనండి..ఎంతలా దాడి చేస్తున్నారు? ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపడం, నిర్దిష్ట ఆదారాలతో ఏవైనా రాయడం మంచిదే.అలా కాకుండా అచ్చం తెలుగుదేశం కరపత్రం మాదిరి తప్పుడు వార్తలను నింపి ప్రజల మనసులను కలుషితం చేయాలని అనుకోవడం జర్నలిజం అవుతుందా? ప్రభుత్వాన్ని అస్దిర పరచాలని అనుకోవడం, కుట్రపూరితంగా ప్రజలలో వ్యతిరేకత పెంచాలని అనుకోవడం వంటివి సరైనదేనా? ఈనాడు వైఖరికి కోపం గతంలో కూడా కొందరు రాజకీయ నేతలు, లేదా ఇతర సంస్థలతో విభేదాలు వస్తే రామోజీరావు ఇలాగే వారిపై విరుచుకుపడేవారు. ఎక్కువ మంది ఈయనతో తగాదా పడలేక వదలివేసేవారు. ఉదాహరణకు ఈనాడు ప్రారంభానికి ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు బాగా ఉపయోగపడ్డారని అంటారు. కాని ఆ తర్వాత కాలంలో విబేధాలు వచ్చాయి. ఈనాడు వైఖరికి కోపం వచ్చిన జలగం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఆఫీస్లో సోదాలు చేయించారు. తదుపరి అది ఏమైందో తెలియదు .అనంతరం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈయన పత్రికను నడిపినా, మరీ అంత అడ్డగోలుగా రాసేవారు కాదు. చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీతో రాయబారం పైగా కాంగ్రెస్లోని ఏదో ఒక గ్రూప్తో బాగుండేలా జాగ్రత్తపడేవారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం సంబంధాలు సజావుగానే ఉన్నా, తదుపరి తేడా వచ్చింది. హైదరాబాద్ అసెంబ్లీ ఎదుట ఉన్న మార్గదర్శి భవనానికి అధిక అంతస్తులకు ఎన్టీఆర్ ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేదని అంటారు. దాంతో వీరిద్దరి మధ్య తగాదా పెరిగిందని అనేవారు. అప్పట్లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు టీడీపీలో ప్రవేశించడం, ఆయన కర్షక పరిషత్ పదవి చేపట్టడం, ఆనాటి కొన్ని పరిణామాలను రామోజీ విమర్శిస్తూ వ్యతిరేక కార్టూన్లు వేయించేవారు. కాని చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీతో రాయబారం చేసుకుని మంచి సాంగత్యం సంపాదించారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్పై విపరీతమైన వ్యతిరేక కార్టూన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మీడియా రంగంలోకి వస్తుండడంపై ఆయనను దెబ్బతీయడానికి మద్య నిషేధ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారని చెబుతారు. ఆ రోజుల్లో కోట్ల విజయ భాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈనాడు ఉద్యమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన సారాను నిషేధించారు. అయినా రామోజీరావు మధ్య నిషేధ ఉద్యమం ఆపకపోవడానికి మాగుంట నుంచి పత్రికాపరంగా వచ్చే పోటీనేనని చాలా మంది నమ్ముతారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ఒక సందర్భంలో రామోజీ గురించి బాధపడ్డారు. రామోజీ ఆడింది ఆట పాడంది పాట ఆయనను గౌరవించి రామోజీ ఫిలింసిటీకి రోడ్డు కోసం సంఘీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని ఇస్తే, దానికి కృతజ్ఞత చూపలేదని బాధపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ ఆడింది ఆట పాడంది పాట అన్నట్లుగా సాగింది. టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు కుమద్దతు ఇవ్వడం, ఎన్టీఆర్ను అవమానించడం వంటి ఘట్టాలతో ఎన్టీఆర్ నేరుగా రామోజీని తీవ్రంగానే విమర్శించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలం పాటు వివాదం లేకుండా చూసుకునే యత్నం జరగకపోలేదు. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. వైఎస్ మీద దారుణమైన సంపాదకీయం రింగ్రోడ్డులో ఆయన భూమి కొంత పోతోందని కోపం తెచ్చుకుని వైఎస్ మీద దారుణమైన సంపాదకీయం రాశారు .దాంతో వారి మధ్య పూర్తిగా సంబంధాలు చెడిపోయాయి. ఇంతలో మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం బయటకు రావడంతో రామోజీ 2600 కోట్ల రూపాయలకు తన టీవీ చానళ్లను అమ్ముకోవలసి వచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి వైఎస్ ఆర్ కుటుంబంపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. సాక్షితో రామోజీకి మరింత ఆగ్రహం ఈ నేపథ్యంలో వైఎస్ తమకు సొంతమీడియా ఉండాలని భావించి సాక్షి పేపర్, టీవీ చానల్ ఆరంభించారు. అది రామోజీకి మరింత ఆగ్రహం తెప్పించింది. ఈనాడుకు సాక్షి గట్టి పోటీ అనే భావన ఏర్పడడం ఆయనకు ఇబ్బందిగా మారింది. దాంతో వైఎస్ కుటుంబంపై ఆయన పగ పెంచుకున్నారు. అంతలో వైఎస్ మరణంతో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో తెలివిగా సత్సంబంధాలు నెరపేవారు. కానీ వైఎస్ కుమారుడు జగన్పై మాత్రం వ్యతిరేక వార్తలు రాయడమే పనిగా పెట్టుకుని జగన్ కేసుల సందర్భంలో విపరీతమైన ద్వేషం ప్రచారం చేశారు. సీబీఐ విచారణను దగ్గరుండి చూసినట్లు రాసేవారు. ఆ ప్రభావం కూడా కొంతపడి 2014లో జగన్ అధికారంలోకి రాలేకపోయారు. ముగ్గురు దొంగలు కలిసి వెంటాడుతున్నారు అయినా జగన్ పోరాటం ఆపకుండా, తనదైన ఎజెండాతో ముందుకు వెళ్లారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్ పై దారుణమైన కథనాలు ఇచ్చినా జనం నమ్మలేదు. జగన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అది రామోజీకి సహించలేదు. ఆయనకు తోడు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 తోడయ్యారు. ముగ్గురు కలిసి గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వన్ని వేంటాడి ,వేటాడుతున్నారు. అయినా జగన్ మొండితనంతో ముందుకు సాగబట్టి వారిని తట్టుకోగలిగారు. చివరికి జగన్ ప్రభుత్వంలో సహనం నశించి రామోజీ మార్గదర్శిలోని అక్రమాలను బయటకు తీసింది. అప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా రామోజీపై , ఆయన కోడలు శైలజపై కేసులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రామోజీ ప్రభుత్వాన్ని వేధిస్తే అది పత్రికా స్వేచ్చ అని ప్రచారం చేసేవారు. మార్గదర్శి అక్రమాలను ప్రశ్నిస్తే మాత్రం అది కక్ష అని వాదిస్తున్నారు. అందులోనే వారి పక్షపాతం తెలిసిపోతుంది. గతంలో రామోజీ దందాకు వైఎస్ సవాల్ విసరగా, ఆయన కుమారుడు జగన్ ఇప్పుడు రామోజీ మూలాలు కదిలేలా చేశారు. మార్గదర్శి లోగుట్టును జనానికి తెలియచేశారు. ఇంతా రామోజీ స్వయంకృతాపరాధం కాదా! --కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉంది: మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రామోజీరావుకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వకేట్లు ఎలా కావాలనుకుంటే అలా చేయగలరంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అపురూప కళాఖండాల విదేశాలకు తరలిస్తున్న కళాంజలి అని ఏబీకే ప్రసాద్ 1996లో రాశారు. భారత ప్రభుత్వం పెట్టిన కేసు గురించి రాస్తే ఏబీకేకి శిక్ష పడింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘చిట్ఫండ్ చందాదార్లకు నోటీసులు ఇవ్వమని కోర్టు చెప్పింది. ఏ కేసుకు సంబంధించిన అఫిడవిట్ లోనైనా మొదట ఆయన నడుపుతున్న పత్రికల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. నర్మగర్భంగా రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏపీ చిట్ఫండ్ యాక్ట్ మార్గదర్శికి వర్తిస్తుందో వర్తించదో కచ్చితంగా తేల్చి చెప్పండి. ఉండవల్లిపై వేసిన డిఫర్ మెషన్ కేసులో రామోజీరావు ఎవరో తెలియదని రాజాజీ స్పష్టం చేశారు. మరో కేసులో రామోజీరావు తమ ఛైర్మన్ అని ఇదే రాజాజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. మార్గదర్శి రూల్ వయలేషన్ చేసినా సరే తప్పు కాదని తేల్చేయండి. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకొన్న డబ్బు పూర్తిగా వాళ్ల దగ్గర ఉండాలి కానీ లేదు. న్యాయవ్యవస్థ తీరు మారాలి. ఎవరికి ఆన్సర్ బుల్గా ఉండటం లేదు’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం ‘‘మార్గదర్శి వ్యవహారాల్లో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం నాకు సహకరించాలి. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు. రాజాజీ అనే వ్యక్తి పై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు వేయరా.. హైదరాబాద్లో ఒక్క చిట్ ఫండ్ కూడా రూల్ ఫాలో కావటం లేదు. రాజు గురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని చంద్రబాబుకు భయం. అందుకే అదిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చి కూడా రామోజీ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు’’ అని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. -
ఉండవల్లి ప్రశ్నలకు సమాధానాలు లేవా రామోజీ?
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారట. ఈనాడు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోందని, అందుకే తమపై కక్ష వహిస్తున్నారని అంటున్నారు.. మీరేమో ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాస్తారు. వారు మీ తప్పులు కనుగొని ఎత్తి చూపుతారు. ఇందులో తప్పేముందని అన్నారట. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి సుప్రీంకోర్టులో రామోజీరావుపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ మార్గదర్శి చిట్ఫండ్ కేసుల్లో ఇరుకునపడ్డారు. ఏపీ సీఐడీ వారు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు వారు సూటీగా సమాధానం చెబుతున్నట్లు అనిపించదు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తమపై దాడి చేస్తోందని వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిపైన అయినా కారణం ఉన్నా, లేకపోయినా, దాడి చేసే హక్కు ఒక్క ఈనాడు మీడియాకు, దాని అధినేత రామోజీరావుకే ఉందని అనుకోవాలి. ఉండవల్లి అంటున్నట్లు ఈ దేశంలో రామోజీ ఎన్ని చట్టాలను అతిక్రమించినా ఆయనను నిలదీసే పరిస్థితి లేదని, ఆయా రాజకీయ పార్టీలు, వ్యవస్థలను అలా మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి. ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు ఏపీకి తరలివెళ్లే చివరి రోజున గౌరవ హైకోర్టు వారితో ఎలా తన కేసును కొట్టివేయించుకోగలుగుతారని ఆయన ప్రశ్నిస్తుంటారు. కనీసం పిటిషనర్ అయిన తనకు కూడా తెలియకుండా చేయగలిగారని ఆయన వివరిస్తుంంటారు. ఆ తర్వాత ఎప్పటికో సమాచారం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. మార్గదర్ళి చిట్ కేసులలో కూడా రామోజీ కోర్టులలో ఎన్ని పిటిషన్లు వేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించగలుగుతున్నారు. నిజంగా తానేమీ తప్పు చేయకపోతే చిట్ రిజిస్ట్రార్ అధికారులు కాని సీఐడీ అధికారులు కాని అడిగిన రికార్డులను ఎందుకు చూపించలేదు. చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా? సుమారు 800 మంది కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంలోని మతలబు ఏమిటి? ఇవన్ని నగదు డిపాజిట్లా? కాదా? చట్టబద్దమైన డిపాజిట్లే అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని ఎందుకు కోరుతున్నారు? దీనికి ఆయన ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఒక్కదానిలోనే సోదాలు చేయలేదు కదా. అన్ని చిట్ ఫండ్ సంస్థలపై సోదాలు చేసి కొన్నిటిపై కేసులు పెట్టిన విషయం మరిచిపోకూడదు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన చిట్ సంస్థలపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టులు కూడా చేశారే. మార్గదర్శి సంస్థలో చిట్ గ్రూప్లు నిలిపివేస్తూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సంస్థ వారు కోర్టుకు వెళితే చిట్ గ్రూపులను నిలిపివేయడానికి ముందు వారికి నోటీసు ఇవ్వాలని ఆదేశం మేరకే ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసినట్లుంది. దానిని ప్రచార ప్రకటన రూపంలో ఇవ్వడం ఈనాడుకు అభ్యంతరం కావచ్చు. అదే వేరే కంపెనీలపై ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తే ఈనాడు తీసుకోకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘనలు వివరిస్తూ ప్రభుత్వ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. దానిని ప్రజాధనంతో దాడి చేస్తారా అని ఈనాడు ప్రశ్నించింది. మరి నిత్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పై అసత్యాలు వండి వార్చుతూ దాడి చేస్తున్న ఈనాడును ఏమనాలి. పాఠకులకు విలువైన వార్తలు ఇవ్వవలసిన పత్రిక స్థలాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఈనాడు మీడియా ఎలా వాడుతోంది. పేజీలకు పేజీలు రాసి ప్రజలపై దాడి చేస్తోంది ఈనాడు కాదా? అదంతా లెక్క వేస్తే ఎన్ని వందల కోట్ల వ్యయం అవుతుంది? ఇలా జర్నలిజాన్ని, వ్యాపారాన్ని కలగలిపి చేయడం విలువలతో కూడిన విషయమే అవుతుందా? ఉండవల్లి మరో ప్రశ్న వేశారు. టివి 9 రవిప్రకాష్పై కేసులు వచ్చినప్పుడు, ఆయనను జైలులో పెట్టినప్పుడు రామోజీపై కేసులు పెట్టకూడదని ఎలా అంటారని ఆయన అడిగారు. రవి ప్రకాష్ కేసులలో రాజకీయ పార్టీలు ఏవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. రవిప్రకాష్కు ఒక న్యాయం, రామోజీకి ఒక న్యాయం ఉంటుందా? అని ఆయన అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చందాదారులకు నిర్దిష్ట సమాచారాన్ని ఇస్తూ ఆ ప్రకటన చేసింది. దానికి ఖండనగా ఈనాడు మీడియా పెద్ద ఎత్తున ఒక పేజీ నిండా వార్తల రూపంలో ప్రచురించింది. అందులో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న బుకాయింపు తప్ప స్పష్టత ఎంత మేర ఉందన్నది సందేహం. చిట్ దారుల డబ్బును ప్రత్యేక ఖాతాలలో ఉంచుతున్నారా? లేదా? అన్నదానికి జవాబు దొరికినట్లు లేదు. తమకు చట్టాలు వర్తించవని రామోజీ భావిస్తే ఏమి చేయాలి. తమపై దాడి అంటూ ఈనాడు రాసిన కథనంలో ప్రభుత్వంపై ఎలా అబద్దపు దాడి చేశారో చూడండి. గోదావరి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైందట. గోదావరికి వరద వచ్చిన మాట నిజం. పలు గ్రామాలు నీటి ముంపునకు గురైన సంగతి వాస్తవం. కాని అంతవరకు రాయకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందని, అయినా మార్గదర్శిపై దాడి చేశారని రాస్తోంది. అంటే రాష్ట్రంలో వారు అనుకున్నవి తప్ప ఇంకేమీ పనులు ప్రభుత్వాలు చేయరాదన్నమాట. నిజంగానే గోదావరి వరదలతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆ వార్తను బానర్గా ఇవ్వకుండా డేటా చౌర్యం అంటూ మరో తప్పుడు వార్తను ఈనాడు ఎలా ఇచ్చింది. ఆ పక్కనే మార్గదర్శి రిజాయిండర్ వార్తను ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభుత్వాన్ని దూషించడానికి కొన్ని కథనాలు ఇచ్చారు. వాటిలో వరద బాధితులకు సహయం అందడం లేదంటూ మరో కథనం అల్లారు. నిజానికి ప్రభుత్వం డెబ్బైవేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించింది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్త ఇవ్వవచ్చు. కాని దానిని చిలవలు, పలవలు చేసి ప్రభుత్వంపై విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు గమనించరా? పడవలలో కూడా వెళ్లి వలంటీర్లు ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్న విషయాన్ని వీరు గుర్తించరా? ఇలా ఒకటి కాదు.. ఎక్కడెక్కడి చెత్త, చెదారాన్ని అంతటిని పోగు చేసుకు వచ్చి ఏపీ ప్రజలపైన రద్దుతున్న ఈనాడును ఏమనాలి. మరి తెలంగాణలో ఎందుకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తడానికే గజగజలాడుతున్నారే. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత బరితెగించి దాడి చేస్తూ వస్తున్నారు. కేవలం తెలుగుదేశం అధికారం కోల్పోయిందని, తమ ఎదుట కూర్చునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్న దుగ్దతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతోనే కదా ఇలా చేస్తున్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా దానిపై చర్య తీసుకోవడమే కదా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఇతరుల అక్రమాలపై చర్య తీసుకోకపోతే ఇంకేముంది .. ప్రభుత్వం కుమ్మక్కైపోయిందని రాసే ఈనాడు మీడియా తమ గ్రూప్ సంస్థలోని మార్గదర్శి అక్రమాలపై వార్తలు ఇస్తే మాత్రం దాడి అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రామోజీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు. అహంకార పూరితంగా, తాను అన్నిటికి అతీతుడను అన్న భ్రమలో ఉండి చట్టాలను ఉల్లంఘించారు. ఒకప్పుడు రామోజీకి మద్దతుగా ప్రజలలో ఒకరకమైన భావం ఉండేది. కాని ఇప్పుడు అదే రామోజీ పై ప్రజలలో సానుభూతి లేకపోగా ఆయన ఏమి చేసినా చర్య తీసుకునే మగాడే లేడా అన్న ప్రశ్న ప్రజలలో తరచుగా వినిపిస్తోంది. వారందరికి జగన్ రూపంలో ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఉండవల్లి కే కాదు.. చాలా మందికి ఇప్పుడు ఒక జవాబు దొరికింది కదా. వైఎస్సార్పై పగబట్టి వార్తలు రాసినా 2009లో ఆయనను రామోజీ ఓడించలేకపోయారు. ఇప్పుడు కూడా రామోజీ ఎంత విషం చిమ్మినా 2024లో కూడా అదే తరహాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి తిరిగి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చందాదారుల సొమ్మును చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం మరోవైపు.. హైదరాబాద్లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్లకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు. చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
A1 రామోజీ, A2 రామోజీ శైలజకు నోటీసులు రండి మాట్లాడాలి..
-
ఖాతాదారుల హక్కుల పరిరక్షణకే.. ‘మార్గదర్శి’పై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్ : మార్గదర్శి చిట్ఫండ్స్ ఖాతాదారుల హక్కుల పరిరక్షణ, ఆర్థిక భద్రత కోసమే ఆ సంస్థలో అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామని, అది తమ బాధ్యత అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లిస్తుండటంతో ఖాతాదారులకు నష్టం కలగకుండా ఇప్పటికే రూ.1,035 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచ్వల్ ఫండ్స్ పెట్టుబడులను అటాచ్ చేసినట్టు తెలిపారు. మార్గదర్శి కంపెనీ ఏ కారణంగానైనా మూతపడితే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీపై ఉంటుందని తెలిపారు. మార్గదర్శి సంస్థ ప్రతి చట్టాన్ని, నిబంధనను అతిక్రమించిందని, ఇంకా అతిక్రమిస్తూనే ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 9 బ్రాంచ్లలో 23 గ్రూప్ చిట్స్ను, వాటికి సంబంధించి రూ. 604 కోట్ల టర్నోవర్ నిలిపివేసినట్టు చెప్పారు. ఇదే తరహాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ఇతర బ్రాంచ్ల్లోనూ అక్రమాలపై ఆధారాలు లభిస్తే.. వాటిలోని చిట్ గ్రూప్ల టర్నోవర్ నిలిచిపోతుందని చెప్పారు. చివరకు మార్గదర్శి పడిపోతుందన్నారు. సంజయ్ మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్గదర్శి చిట్ఫండ్స్లో మూడేళ్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించి, అక్రమాలపై ఆధారాలు సేకరించామన్నారు. ఏపీతోపా టు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 108 బ్రాంచ్లలో కార్యకలాపాలపై ఆరా తీస్తున్న ట్టు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీలకు కూడా ఈ అక్రమాల సమాచారమిచ్చామని, తెలంగాణ, ఇతర రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ శాఖ ఫిర్యాదు మేరకే ఏపీ సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పూర్తి నిబంధనలు పాటిస్తూనే ఈ కేసులో ఏ–1 రామోజీరావును, ఏ–2 శైలజాకిరణ్ను ప్రశ్నించామన్నారు. వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మభ్యపెడుతున్నారు మార్గదర్శి అక్రమాలపై ఖాతాదారుల నుంచి ఫి ర్యాదు లేకుండానే కేసు దర్యాప్తు చేస్తున్నారంటూ ఒక సెక్షన్ మీడియా ఆరోపణలు చేస్తోందని, ఖాతాదారులకు వడ్డీని ఆశజూపి ఆ సంస్థ నిబంధన లకు విరుద్ధంగా నిధులను మళ్లిస్తుండటాన్ని తాము వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రజలు మోసపో యి ఫిర్యాదు చేసేకంటే ముందే తాము వారి సొమ్ము కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏ బాధితుడి విషయంలో అయినా ఇదే పద్ధతి అని తెలిపారు. చాక్లెట్ ఇచ్చి బాలికను కిడ్నాప్ చేస్తే.. సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు కానీ, బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేవరకు కూర్చోరని.. అదే తరహాలో లక్షల మంది ఖాతాదారుల సొమ్మును కాపాడేందుకు మార్గదర్శిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు న్యాయం చేస్తుంటే మార్గదర్శిపై కక్షసాధింపు అంటూ ఆ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తమ దర్యాప్తు చట్టానికి లోబడి ఉన్నట్టే.. చిట్ఫండ్స్ కంపెనీ నిర్వహణలో రామోజీ సైతం చట్టానికి లోబడి ఉండాలన్నారు. నిబంధనలున్నా.. వారికి అనుకూలంగా వాడారు మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ లావాదేవీలు చిట్ఫండ్ యాక్ట్ ప్రకారం కాకుండా రామోజీ, శైలజా కిరణ్ వారికి అనుకూలంగా కంపెనీ యాక్ట్ ప్రకారం చూపు తున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. తమకు ఆ నిబంధనలు వర్తించవన్న తరహాలో సమాధానాలిచ్చారన్నారు. ఖాతాదారుల నుంచి సొమ్ము వసూలుకు చిట్ఫండ్స్ చట్టాన్నే వాడుకొంటున్నారని చెప్పారు. ఇదే తరహాలో చీరాలలో రూ. 65 లక్షల డిఫాల్ట్ కేసులో ష్యూరిటీగా ఉన్న వ్యక్తి నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తిని అటాచ్ చేయించా రని తెలిపారు. ఇలాంటి ఎన్నో అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయన్నారు. సంస్థలోని అంతర్గత లుకలుకలు బయటపడతాయనే చిట్ఫండ్స్ యాక్ట్ ను అమలు చేయడంలేదన్నారు. చిట్ సెటిల్మెంట్లోనూ నిబంధనలు పాటించడంలేదన్నారు. చిట్ ముగిసిన వారి వివరాలతో, కొన్నింటిలో మానేసిన ఖాతాదారుల పేర్లు వాడి మళ్లీ చిట్లు నడుపుతున్నారని తెలిపారు. చిట్ డబ్బు బ్రాంచ్లో లేకపోవడంపై ప్రశ్నిస్తే.. మీరెవరు ప్రశ్నించేందుకు అన్న రీతిలో సమాధానాలు ఇస్తున్నారన్నారు. చట్టానికి వారు సహకరించడం లేదని చెప్పారు. చిట్ఫండ్స్ చట్టం అమలు కాకుండా ఏకంగా 26 ఏళ్లు అడ్డుకున్నారు మర్గదర్శి చిట్ఫండ్స్ సంస్థను చిట్ఫండ్ యాక్ట్ 1982 మేరకు నడపడంలేదని అన్నారు. చిట్ఫండ్స్ సొమ్ముతో వేరే వ్యాపారం చేయకూడదన్నారు. చిట్ఫండ్ యాక్ట్ ప్రకారమే బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉన్నా.. కంపెనీ యాక్ట్స్ ప్రకారం నడుచుకుంటున్నామని ఈ కేసులో ఏ–2 శైలజాకిరణ్ అవివేకంతో కూడిన సమాధానాలు చెప్పారని తెలిపారు. ఒక గ్రూప్ డబ్బు మరో గ్రూప్కు వాడొద్దని చట్టం చెబుతున్నా.. మార్గదర్శి బ్రాంచ్లన్నింటిలోని డబ్బు అక్రమంగా హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. చిట్ఫండ్ యాక్ట్ రావడానికి ముందే మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ప్రారంభమైందన్న వింత వాదన తెస్తున్నారన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1982లో చిట్ఫండ్ యాక్ట్ పాస్ చేస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో పాస్ చేయాల్సి ఉందన్నారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2008లో అమలు చేశారని, ఇన్నేళ్లూ రామోజీరావు పలుకుబడితో అడ్డుకున్నారని వివరించారు. చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఏపీలో అద్భుత సౌకర్యాలు' -
కిల్ బిల్ రామోజీ.. పీక్స్కు చేరిన ఫ్రస్ట్రేషన్
కిల్ బిల్ పాండే తెలుసు... ఫ్రస్ట్రేషన్ ఎక్కువై ఏం చేయాలో తెలియక, దాన్ని ఎలా చూపాలి అర్థం కాక ఏదోటి చేసేసి రిలాక్స్ అవుతాడు ... తేడా వస్తే దొరికినోళ్లందర్నీ కాల్చేసి.. ఫైర్.. ఫైర్ అని అరుస్తుంటాడు.. ఈపాటికే మీకు గుర్తుకు వచ్చింది కదా బ్రహ్మీ అలియాస్ కిల్ బిల్.... ఇప్పుడు తెలుగు సమాజంలో కూడా రామోజీ రావు అచ్చం కిల్ బిల్ పాండేలా తయారయ్యారు. ఒకవైపు కమ్ముకొస్తున్న మార్గదర్శి కేసులు, మరోవైపు అటు చిట్ చందాదారులు, డిపాజిట్ దారులు తమ డబ్బు కోసం చేస్తున్న డిమాండ్లు, ఇంకోవైపు పెద్ద కోడలు చేస్తున్న పరువు తక్కువ కామెంట్లు... ఇవన్నీ ఒక ఎత్తు కాగా తనకు పుట్టు విరోధి అయిన జగన్ మోహన్ రెడ్డి తనకు ఎంతకూ కొరుకుడు పడకుండా వందే భారత్ ట్రైన్ మాదిరిగా దూసుకుపోతుండడంతో ఆ ట్రైన్ను ఆపడం రామోజీకి సాధ్యం కావడం లేదు. ఇక అక్క ఆరాటమే తప్ప బావ బతికేది లేదు అన్నట్లుగా తానూ ఈనాడులో జాకీలు వేసి లేపడం తప్ప ఎక్కడా చంద్రబాబు .. లోకేష్ బలపడక పోవడంతో రామోజీకి భవిష్యత్ అర్థం అయిపోతోంది. దీంతో ఫ్రస్ట్రేషన్ తన్నుకువస్తోంది. అందులో భాగంగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని స్టోరీలతో గాయి గత్తర చేద్దాం అని బయలుదేరుతున్నారు. జగన్ వచ్చాక పోలవరం కట్టలేదు... అమరావతి లేదు... ఇతర ప్రాజెక్టులు లేవు... అంటూ నోటొకొచ్చినట్లు రాస్తూ పోతున్నారు. ఐదేళ్ళలో జగన్ అది చేయలేదు.. ఇది లేదు అని రాస్తూ వస్తున్న రామోజీకి మరి ముప్పయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పదిహేనేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవనీ ఎందుకు గుర్తుకు రాలేదో తెలీదు. చంద్రబాబు ఏటా దావోస్ వెళ్లి ఫోటోలు దిగి రావడం తప్ప ఇన్నేళ్ళలో ఆంధ్రాలో ఒక అప్పడాలు, అటుకుల మిల్లు అయినా పెట్టించలేదు గతంలో ఏపీ సీఐడీ విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్ఫోటో) పైగా పదుల సంఖ్యలో ప్రభుత్వ సంస్థలు మూసేసారు. మరి ఆనాడు రామోజీ నోరు లేవలేదేం. అహో అమరావతి అని హెడ్డింగులు పెట్టి గ్రాఫిక్స్ చూపించిన పత్రికలు అదే అమరావతికి చంద్రబాబు తూట్లు పొడిచి తాత్కాలిక రాజధానిగా పేర్కొంటూ వర్షానికి కారిపోయేలా భవనాలు కడితే ఎందుకు ప్రశ్నించలేదు. ఐదేళ్ళలో అమరావతి ఎందుకు పూర్తి చేయలేదు. పులిచింతల ఏమైంది, పోలవరానికి ఉసురు తీసి దాన్ని ఏటీఎం మాదిరిగా వాడుకున్నది ఎవరు.? మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తున్నదేం ? రైతు రుణమాఫీ ఎగ్గొట్టినపుడు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఎగ్గొట్టినపుడు... అలవిమాలిన దోపిడీ, టిడిపి నాయకుల అరాచకాలు..ఇవన్నీ అప్పుడు ఎందుకు కనిపించలేదు. పైగా జగన్మోహన్రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళ ఆంధ్ర అప్పులపాలు అయిపోతుంది అంటూ దారినబోయే దానయ్యలతో చెప్పిస్తూ పేజీలు నింపేసే రామోజీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మ్యానిఫెస్టో చూడలేదా.. అవన్నీ ఇచ్చుకుంటూ పొతే ఆంధ్ర శ్రీలంక అవ్వదా ? వెనిజులా అవ్వదా..? మరి అవన్నీ ఇవ్వడానికి ఎక్కడ అప్పులు చేస్తారు.. ఇవన్నీ ఎందుకు రాయడం లేదు.. ఓహో... తమకు నచ్చినవాళ్లు అప్పులు చేస్తే ఫర్లేదా.?తమకు నచ్చనివాళ్ళు చేస్తేనే అప్పులు... ఇబ్బందుకు.. ఆర్థిక కష్టాలు వస్తాయా.? వయసు పెరగ్గానే సరిపోదు పెద్దాయన.. కాస్త బుద్ధి కూడా పెరగాలి.. జీవితంలో ఒక్కసారైనా ప్రజల పక్షాన నిలవండి.. జీవితాన్ని అంత్యదశలో అయినా సార్థకత చేసుకోండి. -
తొంగి చూసినట్లే రాతలు!.. ఆ ప్రశ్నలకు బదులేవీ?
మనిషికి , మనిషికి కొలమానాలు ఎలా మారిపోతాయో చూడండి. వివేకా కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏడుసార్లు విచారించినా.. మళ్లీ ,మళ్లీ విచారణ చేయాలనడం కరెక్టట!. అదే మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తే మాత్రం తప్పట!. ఏమి లాజిక్!. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ. దాని జోలికి వెళ్లకుండా.. సీబీఐ వాళ్లు అలా చేశారు... ఇలా చేశారు.. అవినాశ్.. దానికి సమాధానం చెప్పలేదు.. దీనికి చెప్పలేదు అంటూ ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. చివరికి ఎంతవరకు వెళ్లారంటే అవినాష్కు బెయిల్ ఇవ్వకుండా చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో మీడియాలోని ఒక వర్గం ఏకంగా న్యాయ వ్యవస్థకే కళంకం ఆపాదిస్తూ చర్చలు జరిపింది. ✍️ అవినాష్ రెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారిస్తున్న తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కోణంలోనే విచారణ సాగుతోందని, రెండో కోణంలో దర్యాప్తు జరగడం లేదన్న అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో.. గౌరవ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సిబిఐ నీళ్లు నమిలింది. కాగా, మార్గదర్శి ఆర్దిక లావాదేవీల అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ అయినా శైలజా కిరణ్ను సీఐడీ విచారిస్తుంటే.. అది కక్ష అని ప్రచారం చేస్తున్నారు. తమ చేతిలో మీడియా ఉంది కనుక సీఐడీపై ఆరోపణలు గుప్పించారు. అదే మరోచిట్ ఫండ్ సంస్థ కాని, ఇంకో ఆర్థిక సంస్థ కాని ఇలా కేసులో చిక్కుకుంటే, ఆ కంపెనీ ఎండీని, డైరెక్టర్లను సీఐడీ విచారిస్తుంటే ఇదే ఈనాడు మీడియా ఎన్ని రకాల కథనాలు వండి వార్చేది?. ✍️ కొన్నేళ్ల క్రితం అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసును తీసుకుంటే ఈనాడు మీడియా ఎన్ని వార్తలు ఇచ్చి ఉంటుంది!. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబులు కలిసి కేసులు పెట్టినప్పుడు సీబీఐ విచారణ సందర్భంలో ఎంత ఘోరంగా ఈనాడు మీడియా వార్తలు ఇచ్చింది గుర్తు లేదా!. జగన్ పై కేసు నిలబడుతుందా?లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా, ఏకపక్షంగా.. సీబీఐ అధికారి ఇచ్చిన లీకులు, తమకు ఏది తెలిస్తే దానిని మొదటి పేజీలలో పుంజీలకొద్ది కథనాలు ఇచ్చారే!. ఏకంగా జగన్ పై ఈడీ కేసులు వచ్చాయని, తీహారు జైలుకు తరలిస్తారని పలుమార్లు వార్తలు ఇచ్చారే! అప్పుడు సీబీఐ వాళ్లకు గొప్పసంస్థగా కనిపించింది. ఆ దర్యాప్తు సంస్థ అధికారిని గొప్ప ఆఫీసర్గానూ పబ్లిసిటీ చేశారు. తీరా ఆ అధికారి ఆ తర్వాత కాలంలో ఒక రాజకీయ పార్టీలో చేరి ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందారు. అంతగా ఆ మీడియా ఆయనను ప్రభావితం చేసిందన్నమాట. ✍️ ఇప్పుడు మార్గదర్శి కేసులో ఏమి రాస్తున్నారు?.. ఏమి చెబుతున్నారు?.. మార్గదర్శిని దెబ్బ తీయడమే అసలు లక్ష్యం అని హెడ్డింగ్లు పెడుతున్నారు. ఏడు గంటల పాటు ఎండీ శైలజా కిరణ్ను విచారించిన సీఐడీ, మళ్లీమళ్లీ అవే ప్రశ్నలు. పొంతనలేని అంశాలు అంటూ ఈనాడు వార్త ఇచ్చింది. మరి సీబీఐ అవినాష్ను కాని, ఆయా కేసులలో కాని పలుమార్లు విచారించినప్పుడు ఇలా ఎందుకు రాయదు!. సీబీఐ వేసిన ప్రశ్నలు వేయడం కాకుండా కొత్త ప్రశ్నలు వేసిందని ఈనాడు కనిపెట్టిందా!. ఏ దర్యాప్తుఅధికారి అయినా, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పదే,పదే ఒకే ప్రశ్న అడుగుతుంటారట. తద్వారా ఏదో టైమ్ లో భిన్నమైన సమాచారం వస్తుందేమోనని పరిశీలిస్తుంటారట. వేధింపులే లక్ష్యంగా అధికారులు వ్యవహరించారని ఈనాడు ఆరోపణ. ✍️ సాధారణంగా నిందితులు పోలీస్ స్టేషన్ లేదా, నిర్దిష్ట పోలీసు కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరు కావల్సి ఉంటుంది. కాని ఇక్కడ ఏపీ సీఐడీ రామోజీరావును కాని, ఆయన కోడలు శైలజా కిరణ్ ను కాని వారి ఇంటికే వళ్లి విచారిస్తున్నారే!. దేశంలో ఎంత మందికి ఇలాంటి గౌరవం లభిస్తుంది. అయినా వేధింపులే అని వీరు వాపోతున్నారు. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించారని అంటున్నారు. అవేమిటో చెప్పలేదు. అవినాష్ కేసు అయినా, మరోకేసు అయినా, దర్యాప్తు సంస్థ వేసిన ప్రశ్నలు, వీరు ఇచ్చిన జవాబులు అంటూ వార్తలు ఇచ్చే మీడియా శైలజా కిరణ్ విషయంలో అలా ఎందుకు చేయలేదు?. ఏ ప్రశ్నకు ఆమె ఏ సమాధానం ఇచ్చారో రాసి ఉంటే వాస్తవాలు తెలిసేవి కదా!. ✍️ గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై విపరీతమైన దాడి చేస్తూ , నిత్యం తప్పుడు వార్తలతో నింపుతున్న ఈనాడు మీడియాకు తమదాకా వచ్చేసరికి అమ్మో,అబ్బో అంటున్నారే. సీఐడీ వారు మార్గదర్శిలో ఫలానా అక్రమాలు జరిగాయని అంటున్నారు. వందల కోట్లో, వేల కోట్లో బ్లాక్ మనీ సర్కులేట్ అయిందని చెబుతున్నారు. వాటికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. వాటిని శైలజా కిరణ్ కు కూడా చూపించి ప్రశ్నిస్తే, ఆమె వాటికి జవాబు ఇవ్వలేకపోయారని వేరే మీడియాలో వార్తలు వచ్చాయే!. డిపాజిట్ దారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారా?లేదా? అన్నదానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వవచ్చు కదా?. అన్నిటికి మించి CID వారు మార్గదర్శి ఆఫీస్ లలో సోదాలు జరిపినప్పుడు వారు అడిగిన రికార్డులు అన్నింటినీ ఇచ్చేసి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు కదా!. ✍️ ఏపీలో జరిగిన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. మార్గదర్శి నిధులను మళ్లించిన విషయాన్ని ఒప్పుకున్నారు. కాని, ఎక్కడికో తెలియదని ఆమె అన్నారట. ఆ డబ్బును షేర్లలో పెట్టారా?లేదా? అందుకు చట్టం అనుమతిస్తుందా? అలాగే ఆ నిధులను రామోజీ గ్రూపు ఇతర సంస్థలలో పెట్టారా?లేదా? అది చెల్లుతుందా? నల్లధనం మార్పిడికి మార్గదర్శిని వాడుకున్నారన్న అభియోగానికి ఏమి సమాధానం ఇచ్చారు?. ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదన తప్ప, చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా అనేవాటికి జవాబు ఇవ్వడం లేదు. విచారణకు శైలజ సహకరించలేదని అధికారులు అంటున్నారు. అయితే ఒక అధికారి సహకరించారని అన్నారని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. నిజంగానే శైలజా సహకరించి ఉంటే మంచిది!. సీఐడీకి కాని, ఇతరత్రా సాధారణ ప్రజలకు కాని వస్తున్న సందేహాలను తీర్చే విధంగా తమ మీడియాలో ప్రముఖంగా ఇస్తే అంతా తేలిపోతుంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఇదీ చదవండి: ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే.. -
శైలజా కిరణ్ను మరోసారి విచారించాల్సి ఉంది: సీఐడీ
Updates: శైలజా కిరణ్ను మరోసారి విచారించాల్సి ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే నోటీసులిస్తామని సీఐడీ డీఎస్సీ రవికుమార్ తెలిపారు. నేటి విచారణలో కొంతమేర సమాధానాలు మాత్రమే ఇచ్చారని, అందుచేత మరోసారి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యం సమస్య ఉందనడంతో శైలజాకిరణ్ను వైద్యులు పరీక్షించారని సీఐడీ డీఎస్పీ పేర్కొన్నరు. ► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈరోజు(మంగళవారం) ఈ కేసులో ఎ-2లో ఉన్న మార్గదర్శ ఎండీ శైలజా కిరణ్ను సుదీర్ఘంగా విచారించారు. నేటి ఉదయమే శైలజా కిరణ్ ఇంటికి చేరుకున్న అధికారులు సుమారు 10 గంటల పాటు ఆమెను విచారించారు. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు సీఐడీ అధికారులు. ►మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎ-2గా ఉన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు గత ఎనిమిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఐవో రవికుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. విచారణలో సీఐడీ ఎస్పీలు హర్షవర్ధన్రాజు, అమిత్ భర్ధర్లు పాల్గొన్నారు. ఒక మహిళా ఏసీపీ సహా మొత్తం 30మంది అధికారులు విచారణలో పాల్గొన్నారు. మార్గదర్శి ఖాతాదారుల నగదు దారి మళ్లింపుపై విచారణ చేపట్టారు. నిబంధనలు ఉల్గంఘనలపై సీఐడీ ప్రశ్నిస్తోంది విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న మార్గదర్శి చైర్మన్ రామోజీరావును సీఐడీ ఇప్పటికే ప్రశ్నించింది. ► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్ దారి మళ్లింపుపై విచారణ జరుగుతుండగా.. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్నారు. విచారణను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి సీఐడీ ప్రశ్నిస్తోంది. సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్ఫండ్ కేసులో ఎండీ శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. మార్గదర్శికి సంబంధించిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు, చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్ గ్రూప్లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్) నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించిన సీఐడీ.. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్మెంట్ నిర్ణయం తీసుకుంది. చిట్ఫండ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపిన విషయం తెలిసిందే. చదవండి: మార్గదర్శి కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయండి -
కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదా రులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వీటిలో మార్గదర్శి చిట్ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులున్నాయి. చిట్టీలు వేసిన చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్ఫండ్స్ చెల్లించే స్థితిలో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సీఐడీ అధికారులు చర్యలు చేపట్టనున్నా రు. ఇదే విషయాన్ని వివరిస్తూ 50 బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు కూడా సమాచారం అందించారు. బ్యాంకులు, ఇతర సంస్థల్లోని నిధుల ను మార్గదర్శి మళ్లించకుండా, డిపాజిట్దారుల ప్ర యోజనాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టాన్ని పాటించేందుకు నిరాకరణ కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. దీంతో గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్ కొత్త చిట్టీలు నిలిపివేసింది. ఆరు నెలల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన టర్నోవర్ నిలిచిపోయింది. మరోవైపు పాత చందాదారులకు మార్గదర్శి చిట్ఫండ్స్ సకాలంలో చిట్టీల మొత్తాన్ని చెల్లించకపోవడంతో చందాదారులు పెద్ద సంఖ్యలో చిట్స్ రిజిస్ట్రార్, సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన సీఐడీ మార్గదర్శి చిట్ఫండ్స్ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: ఆర్డినెన్స్ వివాదం.. ఆప్కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్.. -
Margadarsi Case: పేపర్లలో వచ్చిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ఫండ్స్లో అవకతవకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చేస్తున్న తనిఖీలపై పత్రికల్లో వచ్చిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి తనిఖీలు జరిపితే.. సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఐడీని ఆదేశించింది. తనిఖీల పేరిట రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మార్గదర్శి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ముమ్మినేని సుధీర్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీపీ ఏబీ లలితా గాయత్రి వాదనలు వినిపించారు. తనిఖీల సమయంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడంలేదని చెప్పారు. చట్ట ప్రకారమే తనిఖీలు జరిగాయన్నారు. పారదర్శకంగా సాగుతున్న దర్యాప్తును అడ్డుకునేందుకు మార్గదర్శి ఇప్పటికే పలు పిటిషన్లు వేసిందన్నారు. పత్రికలో ఏవో ఫొటోలను ప్రచురించి ఖాతాదారులను అడ్డుకుంటున్నామని చూపించే యత్నం చేస్తోందని తెలిపారు. చదవండి: అప్పులంటూ అబద్ధాలా? అలాంటి ఫొటోలను, ప్రచురణలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. ఏపీలో నమోదవుతున్న కేసులపై ఈ కోర్టు నుంచి ఉపశమనం పొందాలని భావిస్తోందని తెలిపారు. పరిధి లేని పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని, పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పత్రికల్లోని ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టంచేశారు. ఈ పిటిషన్ కూడా ఇప్పటికే పెండింగ్లో ఉన్న పిటిషన్లకు కలుపుతూ విచారణను వాయిదా వేశారు. చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’ -
‘వ్యక్తిగత విభేదాలు లేవు.. అక్రమాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా’
సాక్షి, విశాఖ: తనకు రామోజీరావుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం ఆయన చేసిన అక్రమాలని మాత్రమే ప్రశ్నిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్. చట్టాలు, నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు ఉండవల్లి. ‘రామోజీరావు సంస్థల చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది - రామోజీరావుకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. మార్గదర్శి చిట్ఫండ్ డబ్బును మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో పెట్టారు. ఇదే విషయం ప్రశ్నిస్తే నాపై పరువునష్టం దావా వేశారు. రామోజీరావుకు చట్టం, నిబంధనలు వర్తించవా? రామోజీ కేసులో వాస్తవాలు వెలుగుచూడాలన్నదే నా ఆకాంక్ష. రామోజీకి వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలు మద్ధతు పలుకుతున్నాయి. ప్రజల నుండి మద్ధతు ఉండబట్టే నా పోరాటం కొనసాగుతోంది. దేశంలోని ఆర్థిక నేరాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పడాలి. రామోజీరావు అయినా రూల్స్ పాటించాల్సిందే. చట్టాలు అందరికీ వర్తించాలన్నదే మా డిమాండ్ - చట్టాలకు లోబడే మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందా? ఈ అంశాన్ని ప్రశ్నించినందుకే ఉండవల్లిని ఈనాడు బ్యాన్ చేసింది. ఈ పోరాటంలో ఉండవల్లికి అన్ని వర్గాల మద్ధతు ఉంది. 17 ఏళ్లుగా ఉండవల్లి చేస్తున్న పోరాటం చాలా గొప్ప విషయం. తప్పులను ఎత్తిచూపాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఉండవల్లి పోరాటం వల్లే రామోజీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి వ్యవహరిస్తోంది. డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బు తన దగ్గరే పెట్టుకుంది. డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తే ఆ వివరాలను వెల్లడించవచ్చు కదా. చెల్లించాల్సిన డబ్బు మార్గదర్శి దగ్గర ఉందా?. అక్రమాలను నిరోధించేందుకే చర్యలు చేపట్టింది. వ్యవస్థలోని లోపాలను పత్రికలు ఎత్తిచూపాలి. ప్రభుత్వంలోని తప్పులను పత్రికలు చెప్పాలి. ఒక వ్యక్తి వ్యవస్థగా మారితే మార్గదర్శిలాంటి పరిస్థితి వస్తుంది. వ్యక్తికి, పార్టీకి కొమ్ముకాసే విధంగా పత్రికలు వ్యవహరించకూడదు పొలిటికల్ మాఫియాతో మీడియా మాఫియా చేతులు కలిపిందిమార్గదర్శిలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. 1980 నుంచి మార్గదర్శిలో అవకతవకలు జరిగాయి. కొందరు గ్యారెంటీస్ ఇవ్వకపోవడం వల్ల చిట్ పాడుకున్న తర్వాత కూడా డబ్బు ఇచ్చేవారు కాదు. మార్గదర్శిలో అవకతవకల పై ప్రశ్నించేందుకు సీఐడీ వెళ్లినప్పుడు మంచం పై ఉన్నా సహకరించాననే చెప్పుకునేందుకే రామోజీ యత్నం. చంద్రబాబు లేకుండా రామోజీ లేరు.. రామోజీ లేకుండా చంద్రబాబు లేరు’ అని ఉండవల్లి తెలిపారు. -
‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్గా ఎలా మారుతోంది?
చిట్ఫండ్ కంపెనీలు నల్లధనం కేంద్రాలా? ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని ఏపీ సీఐడీ జరుపుతున్న విచారణలో బయటపడుతున్న విషయాలు గమనిస్తే ఆ చిట్ సంస్థలు నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చుతున్నాయో అర్ధం అవుతుంది. ఈనాడు అధినేత రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఒకటే ఈ పనిలో ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రామోజీరావుపై కక్ష కట్టారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వారికి సమాధానం దొరికి ఉంటుంది. రాజమహేంద్రవరంలో మరో చిట్ ఫండ్ కంపెనీ కూడా అదే పనిలో ఉందని విచారణలో తేలింది. కాకపోతే రామోజీరావు శక్తిమంతుడు కనుక తెలంగాణ హైకోర్టు ద్వారా కొంత రక్షణ పొందగలిగారు. కాని రాజమహేంద్రవరంలోని జగజ్జనని చిట్ సంస్థకు అంత పరపతి లేదో, లేక టైమ్ దొరకలేదో కాని, ఆ కంపెనీ డైరెక్టర్లు అరెస్టు కావల్సి వచ్చింది. వీరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కావడంతో ఆ పార్టీవారు దీనిని రాజకీయంగా వాడుకోవడానికి యత్నిస్తున్నారు. రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు, మామ అప్పారావులు ఈ కేసులో అరెస్టు అయ్యారు. ఇది కక్ష కూడా అని ఆమె కూడా ఆరోపించారు. చదవండి: రామోజీరావును పెంచి పోషించింది మా నాన్నే అంతే తప్ప తమ కంపెనీ తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. సహజంగానే తప్పు లేదా స్కామ్ కు పాల్పడినవారు తెలుగుదేశం కు సంబంధించినవారైతే ఆ పార్టీ నేతలే కాకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి 5 వంటి మీడియా సంస్థలు స్కామస్టర్ లకు మద్దతు ఇస్తూ వంత పాడుతున్నాయి. మార్గదర్శి కేసు బయటకు రాకపోతే ఈనాడు వారు ఈ జగజ్జనని పై కథలు, కథలుగా రాసేవారేమో! ఇప్పుడు సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిందని ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. సీఐడీ వారు చేసిన పరిశోధనలో ఈ కంపెనీ చిట్ల రూపంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుతోందట. కంపెనీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అధికారులకు ఇచ్చిన చిట్ల వివరాలకు, వాస్తవంగా ఉన్న చిట్లకు మధ్య చాలా తేడా ఉందట. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్నారట. అనధికారికంగా కాకినాడలో కూడా ఒక బ్రాంచ్ నడుపుతున్నారట. మరి ఇవన్ని తప్పులా?కావా? అన్న విషయాన్ని టీడీపీ అధినేత, పదమూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చెప్పగలగాలి కదా? ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. అంటే ప్రజల డబ్బుతో అడ్డగోలుగా వ్యాపారాలు చేసేవారు తెలుగుదేశం వారైతే చాలు.. అండగా ఉంటామని చెబుతారా?ఇప్పటికే మార్గదర్శిలో సుమారు 600 కోట్ల మేర నల్లధనం సర్కులేట్ అయిందని సీఐడీ అంచనా వేసిందని వార్తలు వచ్చాయి. ఈ చిట్ కంపెనీలు డిపాజిట్లు వసూలు చేసే అదికారం లేకపోయినా, డిపాజిట్లు తీసుకుంటున్నాయి. ఏదైనా తేడా వస్తే డిపాజిట్ దారుల పరిస్థితి, చిట్ కట్టినవారికి ఎదురయ్యే సమస్యలు వీటన్నిటి గురించి చంద్రబాబు కు పట్టవా? పైగా ఆయన టైమ్ లోనే డిపాజిట్ దారుల రక్షణ చట్టం వచ్చిన సంగతి మర్చిపోయారా?నిజంగానే మార్గదర్శిలో తప్పులేమీ జరగకుండా ఉంటే రామోజీ రావు ఎంత గగ్గోలు చేసి ఉండేవారు. ఆయనకు మద్దతుగా చంద్రబాబు తన పార్టీవారితో ఎన్ని ర్యాలీలు తీయించేవారో! అక్కడికి తనకు మీడియా ఉంది కనుక , ఎవరు అనుకూల ప్రకటన చేసినా దానిని తన పత్రికలో పరుస్తున్నారు. టీవీలలో గంటల కొద్ది ప్రసారం చేస్తున్నారు. అయినా వారు ఆశించిన విధంగా ప్రజలలో తమకు అనుకూలంగా ఆందోళన కనిపించకపోవడంతో వారికి ఎటూ పాలుపోవడం లేదు. కాకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా కేసుల తీవ్రత తగ్గించే యత్నం చేసుకుంటున్నారు. చివరికి మార్గదర్శిలో ఆధారాలు దొరకకుండా ఎలా ధ్వంసం చేయాలో జూమ్ మీటింగ్లో చెప్పే దశకు వెళ్లారంటే ఏమనుకోవాలి. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక తెల్లవారి లేస్తే రామోజీరావు ఎన్ని నీతులు చెబుతారు. ఇతరులపై ఎంత దారుణమైన కదనాలు రాస్తుంటారు. కాని తన వద్దకు వచ్చేసరికి అంతా గప్ చుప్గా ఉండాలని ఆయన కోరుకుంటారు. తన రహస్యాలు ,గుట్టుమట్లు ఎవరికి తెలియరాదని, తను పోగు చేసిన నల్లధనం, దానిని తన ఇతర కంపెనీలలో వాడుకున్న తీరు ఇవేవి జనానికి తెలియకూడదని ఆయన కంగారు పడుతున్నారు. ఇప్పుడు జగజ్జనని కేసులో డైరెక్టర్లు అరెస్టు అవడం వారికి భయం కలిగించే పాయింటే. ఇంతకాలం మార్గదర్శి ఒక్క సంస్థ అవకతవకలపైనే సీఐడీ దృష్టి పెట్టిందన్న విమర్శలకు ఆస్కారం లేకుండా పోయింది. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం జగజ్జనని చిట్ ఫండ్ కంపెనీపై వచ్చిన అభియోగాలకు ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వలేదు.. సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిందని, నోటీసులు ఇవ్వలేదని, కుటుంబ సభ్యులకు చెప్పలేదని ఇలా ఏవేవో కుంటిసాకులకు ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప, సీఐడి చెబుతున్న ఆరోపణలలో వాస్తవం ఉందా? లేదా? అన్న విశ్లేషణ మాత్రం చేయడం లేదు. ఇలా ప్రతి విషయంలోను ఈ మీడియా ఇలాగే చేస్తోంది. చివరికి తెలుగుదేశం నాయకుడు ఒకరికి లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు పడితే ఆ వార్తను కూడా కనబడకుండా చేయడానికి ఈ మీడియా చేసిన ప్రయత్నం చూస్తే, ఇంత నీచంగా వీరు మారారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక పత్రిక అయితే ఆ తీర్పు వార్తలో శిక్ష పడిన టిడిపి నేత పేరు కూడా రాయకుండా వార్త ఇచ్చింది ఈ రకంగా జర్నలిజం స్థాయిని రోజురోజుకు మరింతగా దిగజార్చుతూ రికార్డు సృష్టిస్తున్నారు. వైసీపీవారిపై ఏవైనా ఆరోపణలు వస్తే దానిని తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేసే వీరు టీడీపీ చిన్న నేతకు సంబందించిన అక్రమాల వార్తలను కప్పిపుచ్చడానికి కృషి చేస్తున్నారు. తద్వారా వచ్చే శాసనసభ ఎన్నికలలో టిడిపికి నష్టం కలగకుండా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. ఏది ఏమైనా మార్గదర్శి, జగజ్జనని వంటి చిట్ సంస్థల అక్రమాలకు ముకుతాడు వేసే విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక లాజికల్ ముగింపును తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు సి.ఆర్.ఎపి మీడియా అకాడమీ చైర్మన్ -
రామోజీరావు అంటే ఆయన కుమారుడు సుమన్కి నచ్చదు.. ఎందుకంటే?
చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని చంద్రబాబు, రామోజీ చూస్తే తెలుస్తుందంటూ రామోజీరావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వ్యాఖ్యానించారు. రామోజీ అంటే ఆయన కుమారుడికి నచ్చరని, సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి ఏం జరిగేందో వంటి ఆసక్తికరమైన విషయాలు సాక్షికి వెల్లడించారు. ఆశ్చర్యమనిపించింది.. మార్గదర్శిపై సీఐడీ దాడులతో రామోజీ భయపడ్డారు. అందుకే మంచం పట్టినట్లు కనిపించారు. దాని వల్ల ఎక్కువగా ప్రశ్నించరని అనుకున్నారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ ఫొటో (మంచంపై పడుకున్న రామోజీని సీఐడీ విచారిస్తున్న) చూశాక నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ స్థితిని చూసినప్పుడు ఈ మధ్య చంద్రబాబు ఏడ్చిన విషయం గుర్తొచ్చింది. గతంలో ఆరోగ్యం కూడా బాగోలేని ఎన్టీఆర్ని చంద్రబాబు, రామోజీ కలిసి ఏడిపించారు. చాలా మానసిక వేదనకు గురిచేశారు. రామోజీ మంచంపై పడుకోవడానికి.. చంద్రబాబు ఏడవడానికి కారణం కూడా అదే. చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని వీళ్లని చూస్తే తెలుస్తుంది. సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి అప్పుడే గొడవలు జరిగి ఉండేవేమో. ఎందుకంటే సుమన్కి ఈ తరహా మోసాలు అసలు నచ్చవు. రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు? వచ్చిన చిట్స్ మొత్తాన్ని రామోజీ ఇష్టం వచ్చినట్లు మళ్లించేస్తుంటే.. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా లక్షల మందికి ఎలా చెల్లించగలరు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మార్గదర్శి డిపాజిటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం మార్గదర్శిపై విచారణ ప్రారంభించడం చాలా మంచిపని. ఇన్నాళ్లూ మోనార్క్గా వ్యవహరించి.. మన మీదకు ఎవరు విచారణకు వస్తారనే ధీమాతో రామోజీ ఉండేవారు. ఇప్పుడు ఇలా ఒక్కసారిగా విచారణకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు? అహం పెరిగిపోయింది.. ఇదంతా.. తన సామ్రాజ్యం.. ఇందులో వేరెవరికీ చోటుండకూడదని రామోజీరావు ఎప్పుడూ భావిస్తుంటారు. దీనికి చంద్రబాబు సహకారం అందించారు. ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేశాక ఇద్దరూ ఒక్కటైపోయారు. అప్పటి నుంచి రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది. ఫిల్మ్సిటీని 1,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ చెప్పడంతో.. ఆయనను మభ్యపెట్టేందుకు కేసీఆర్తో చర్చలు జరిపారు. ఓం సిటీ కడతానని ప్లాన్లు చూపించారు. ఇది ఫిల్మ్సిటీని మించిపోతుందని నమ్మించారు. దాన్ని మోదీకి కూడా చూపించారు. కానీ.. ఓం సిటీ ఏమైంది..? పేపర్లకే పరిమితమైంది. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
Margadarsi: అక్రమాలు నిజం!
సాక్షి, అమరావతి: ప్రతి ఏటా మార్చి 31న రూపొందించే బ్యాలెన్స్షీట్లో... చెల్లించాల్సిన బకాయిలు, ఇతర అప్పులకు సమానంగా తమ వద్ద వందల కోట్ల రూపాయల చెక్కుల రూపంలో, మరికొన్ని వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు చూపిస్తున్నారు. వాటిని తమ ఆస్తులుగా పేర్కొంటున్నారు. మరి ఆ చెక్కుల్ని తదుపరి కాలంలో ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి కదా? ఆ నగదును సంస్థ అవసరాల కోసం ఖర్చు చేయాలి కదా? విచిత్రమేంటంటే అందులో పేర్కొన్న చెక్కుల్లో ఒక్క చెక్కు కూడా తరువాతి కాలంలో సంస్థ ఖాతాలోకి వచ్చిన దాఖలాలు ఉండటం లేదు. నగదు పరిస్థితి కూడా అంతే!!. అంటే ఆ చెక్కులు గానీ, ఆ నగదు కానీ వాస్తవంగా కంపెనీ దగ్గర ఉన్నవి కావన్న మాట!!. వాటిని అప్పటికే వేరే సంస్థల ఖాతాల్లోకో, ఇతరత్రా అవసరాలకో మళ్లించేశారు. కానీ... అవన్నీ తమ వద్దే ఉన్నట్లుగా తప్పుడు బ్యాలెన్స్షీట్ ద్వారా మభ్య పెడుతున్నారు. తమ సంస్థ తగిన ఆస్తులతో బలంగానే ఉన్నదని ఒకవైపు చిట్లు వేస్తున్న చిట్ దారులను, మరోవైపు నియంత్రణ సంస్థలను నమ్మిస్తున్నారు. ఇదీ.. రామోజీరావు నడిపిస్తున్న ‘మార్గదర్శి’ అసలు కథ. మార్గదర్శి సంస్థను ఆడిట్ చేస్తున్న ఆడిటింగ్ సంస్థల ప్రతినిధి నేరుగా దర్యాప్తు సంస్థ ఎదుట అంగీకరించిన వాస్తవం. ఇదే కాదు. తనిఖీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న మార్గదర్శిలో... ఎక్కడ ఏ సోదా జరిపినా నివ్వెరపోయే నిజాలే వెలుగుచూస్తున్నాయి. వాస్తవాలను బయటకు వెల్లడించకపోవటం ద్వారా.. చిట్లు వేస్తున్నవారికి తమ సొమ్ము ఎంత భద్రంగా ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి సృష్టిస్తున్నారు. అంతేకాదు.. డిపాజిట్లు తీసుకోవటాన్ని నిషేధించినా సరే... వాటిని ఇతరత్రా రూపాల్లో తీసుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. చట్టాలను పరిహాసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని మార్గదర్శి ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో కంపెనీలో సీఐడీ జరిపిన తనిఖీల్లో వెల్లడైన పలు అక్రమాలు బయటపడ్డాయి. చార్టర్డ్ అకౌంటెంట్కు 14 రోజుల రిమాండ్... మార్గదర్శి చిట్ఫండ్స్ బ్యాంకు లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో పలు అవకతవకలున్నట్లు మార్గదర్శి చిట్స్కు ఆడిటర్గా వ్యవహరిస్తున్న బ్రహ్మయ్య అండ్ కో ప్రతినిధి సీఐడీ విచారణలో వెల్లడించారు. దాంతో బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం విజయవాడలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా... చందాదారుల సొమ్మును తరలించటం, మ్యూచ్వల్ ఫండ్స్లోను, షేర్లలోను అక్రమంగా పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు సేకరించడం చేసినట్లు ఇప్పటికే సీఐడీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే బ్రహ్మయ్య అండ్ కో సంస్థ రికార్డులను తనిఖీ చేసి, ఆ సంస్థ సీఏ శ్రావణ్ను విచారించారు. ఈ విచారణలో మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి ఖాతాలు సవ్యంగానే ఉన్నాయని ఏటా ఆడిట్ నివేదిక ఇస్తున్న ఈ సంస్థ... అసలు మార్గదర్శి చిట్స్ బ్యాంకు ఖాతాలు, రికార్డులు, లావాదేవీలను సమగ్రంగా పరిశీలించకుండానే ఈ నివేదిక ఇస్తున్నట్లు సదరు చార్టర్డ్ అకౌంటెంట్ వెల్లడించటం గమనార్హం. ఇలాంటి డిపాజిట్లు ప్రమాదకరమే? ► చిట్లు వేసేవారిలో కొందరు చిట్ను పాడుకుంటారు కానీ... ఆ డబ్బును తీసుకోవటానికి అవసరమైన ష్యూరిటీలను కంపెనీకి సబ్మిట్ చేయలేరు. మరికొందరైతే రకరకాల కారణాల వల్ల పాడుకున్న మొత్తాన్ని తీసుకోకుండా భవిష్యత్తులో తాము చెల్లించాల్సిన చిట్ మొత్తానికి సంబంధించి దాన్ని సదరు చిట్ఫండ్ సంస్థ వద్దే వదిలిపెడతారు. ఇంకొందరైతే ఓ రెండు మూడు నెలలు ఉంన్నపుడు చిట్ను పాడుకుని... ఆ మిగిలిన నెలల ఫ్యూచర్ చిట్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని సంస్థ దగ్గరే వదిలేస్తారు. అయితే ఏ చిట్ఫండ్ సంస్థయినా తమ ప్రతి బ్రాంచి కార్యాలయంలోనూ... అక్కడి చిట్టీలకు సంబంధించిన ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రత్యేకంగా రెండో బ్యాంకు ఖాతాను నిర్వహిస్తుండాలి. ఇలా ఫ్యూచర్ చిట్ల మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ఏ ఒక్క బ్రాంచిలోనూ ఇలా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వేరే బ్యాంకు ఖాతా తెరవలేదు. అన్నిచోట్ల నుంచీ ఆ మొత్తాన్ని హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తోంది. దానికో రశీదు ఇస్తూ 4–5 వడ్డీ చెల్లిస్తోంది. ఇది అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయటమే. చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ డిపాజిట్లను గనక ఏ ఆర్బీఐనో జప్తు చేస్తే..? చిట్దారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. అయినా సరే మార్గదర్శి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లు సక్రమమేననే రీతిలో బ్రహ్మయ్య అండ్ కో సంస్థ నివేదిక ఇవ్వటం విస్మయం కలిగించేదే!!. ► ఇక మార్గదర్శి చిట్ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల ఖాతాలు, తమ పెట్టుబడలు వివరాలను బహిర్గతం చేయటం లేదు. గోప్యంగా ఉంచుతోంది. ఇది చిట్ఫండ్ చట్టానికి విరుద్ధం. అయినా సరే బ్రహ్మయ్య అండ్ కో ఇది పట్టించుకోకుండా అంతా సక్రమంగానే ఉందని ఆడిట్ నివేదిక ఇచ్చేస్తోంది. అక్రమాలు వాస్తవమే: బ్రహ్మయ్య సంస్థ సీఏ శ్రావణ్ సీఐడీ దర్యాప్తు సందర్భంగా బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ కీలక విషయాలు వెల్లడించారు. తాము అసలు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక జారీ చేస్తున్నామని అంగీకరించారు. మార్గదర్శి చిట్స్ ఆదాయ– వ్యయాలు, ఆస్తి– అప్పులకు సంబంధించిన ఎలాంటి వివరాలనూ ఆయన సీఐడీ అధికారులకు చెప్పలేకపోయారు. ఒక్కో బ్రాంచి బ్యాంకు ఖాతాల్లో అప్పుడప్పుడు చూపిస్తున్న వందల కోట్ల రూపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తరువాత అవి ఎక్కడికి మాయమయ్యాయి? అనేది ఆయన ఏమాత్రం చెప్పలేకపోయారు. ఆ వివరాలేవీ తనకు తెలియవని ఆయన అంగీకరించారు. -
‘మార్గదర్శి’ అక్రమాల కేసులో కీలక అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసులో మార్గదర్శి చిట్స్ చార్టెడ్ అకౌంటెంట్ కూడరవల్లి శ్రవణ్ను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, మోసాలు, నిధుల మళ్లింపు కేసులో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ల్యాప్టాప్, పలు రికార్డులను సీఐడీ పోలీసులు సీజ్ చేశారు. మార్గదర్శి చిట్స్ ఆడిటింగ్ నిర్వహించే బ్రహ్మయ్య అండ్ కో లో అఫీషియల్ పార్టనర్గా కూడరవల్లి శ్రవణ్ ఉన్నారు. విజయవాడ 3వ మెట్రో పొలిటన్ కోర్టు మేజిస్ట్రేట్.. శ్రవణ్కి 14 రోజులు రిమాండ్ విధించింది. మార్గదర్శి మోసాలపై సంచలన విషయాలను శ్రవణ్ బయటపెట్టారు. వందల కోట్లకు డిపాజిట్లకు సంబంధించిన వివరాలను శ్రవణ్ వెల్లడించలేకపోయారు. మార్గదర్శి చిట్స్ బ్యాంక్ బ్యాలన్స్ల ఆడిటింగ్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు శ్రవణ్ అంగీకరించారు. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాల ఆడిటింగ్లో నిబంధనలు పాటించలేదని సీఐడీ వద్ద శ్రవణ్ అంగీకరించారు. చదవండి: ‘అందులో ఈనాడు రామోజీరావు పాత్ర ఉంది’ -
మార్గదర్శి అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నోటీసులు
గుంటూరు: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు(మంగళవారం) మార్గదర్శి చిట్స్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటకొచ్చాయి. నేటి తనిఖీల్లో ఖాళీ చిట్ల నిర్వహణలో మార్గదర్శి గోల్మాల్ను గుర్తించారు. గుంటూరు 5 చిట్ గ్రూప్లను పరిశీలించగా 6 కోట్ల 98 లక్షల చెల్లింపుల రికార్డులను అధికారులకు మార్గదర్శి చూపించలేదు. శ్రీకాకుళం బ్రాంచ్లో 28 చిట్స్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. 2 కోట్ల 88 లక్షల పేమెంట్స్కి మార్గదర్శి ఆధారాలు చూపలేదు. ఇక విజయనగరంలో 12 చిట్లను పరిశీలించగా, 54 లక్షల 85 వేల చెల్లింపులకు సైతం ఆధారాలు చూపించలేదు మార్గదర్శి. ఈ అక్రమాలపై మార్గదర్శికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. -
మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం
విజయవాడ: మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.మార్గదర్శి చిట్ ఫండ్ లో నిధుల మల్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. మార్గదర్శి చిట్ఫండ్ 37 బ్రాంచ్లలో ఆడిటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దానిలో భాగంగా ప్రత్యేక ఆడిటర్ నియమించింది. కాగా, మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సీఐడీ విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
‘మార్గదర్శి’ అక్రమాలు: ఇదో పోంజీ తరహా స్కామ్.. చందాదారుల సొమ్ముతో దందా!
సాక్షి, అమరావతి: మార్గదర్శి యాజమాన్యం చందాదారుల డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చట్ట ప్రకారం చిట్ఫండ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే చిట్స్ రిజిస్ట్రార్కు మార్గదర్శి యాజమాన్యం సహకరించడం లేదని తెలిపారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తమ బాధ్యతని, ఇదే ధోరణి కొనసాగితే మార్గదర్శి చిట్ఫండ్స్పై కఠిన చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో నిధుల దుర్వినియోగం, మోసం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తాము నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు న్యాయస్థానం కూడా రిమాండ్కు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో చందాదారుల సొమ్మును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. అందుకు ఇక్కడ బాధ్యులు ఉండరు. ఇతర రాష్ట్రాల్లో అడిగితే మీకు సంబంధం లేదంటున్నారు. అంటే చందాదారులు చెల్లిస్తున్న సొమ్ముకు ఎలాంటి భద్రతా లేదు’ అని పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను వివరించారు. చిట్ఫండ్ చట్టం సామాజిక, ఆర్థికపరమైన చట్టమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. చందాదారుల హక్కుల పరిరక్షణ, చిట్ఫండ్ కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఈ చట్టం చేశారని పేర్కొంది. చిట్ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చిట్ఫండ్ కంపెనీ బ్రాంచిలోని మేనేజర్ (ఫోర్మేన్) చందాదారులు చెల్లించే సొమ్ముకు పరిరక్షకుడు. చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్యవేక్షకుడు. బ్యాంక్ లావాదేవీల నిర్వహణ, నిధుల చెల్లింపులన్నీ ఫోర్మేన్ నిర్వహించాలి. రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉన్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో తనిఖీలు చేశాం. చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదన్న విషయం అందులో వెల్లడైంది. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేశారు. మార్గదర్శి ఫోర్మేన్కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తోసహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. ఇక్కడున్న చందాదారుల సొమ్ముల భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే తెలంగాణలో ఉన్న ప్రధాన కార్యాలయం ఏపీ అధికారుల పరిధిలోది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన చందాదారులు చెల్లిస్తున్న డబ్బులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. సొమ్ము రాష్ట్ర ప్రజలది...పెత్తనం పక్క రాష్ట్రంలో వారిది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులకు చెందిన సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చారెŠట్డ్ అకౌంటెంట్ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో మార్గదర్శి చిట్ఫండ్స్ ఫోర్మెన్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. గుంటూరు మినహా మిగతా మూడు చోట్లా న్యాయస్థానాలు నిందితులకు రిమాండ్ విధించాయి. నిందితులపై సీఐడీ మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని రిమాండ్కు అనుమతిస్తూ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సీఐడీ కేసు డైరీలో పేర్కొన్న అంశాలతో తాము సంతృప్తి చెందినట్లు, వారిని అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొన్నాయి. మార్గదర్శి యాజమాన్యం నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ, చిట్స్ రిజిస్ట్రార్కు సహాయ నిరాకరణ కొనసాగిస్తే చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్న అంశంతో మాకు నిమిత్తం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే మా విధి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. కేసు దర్యాప్తులో పురోగతికి అనుగుణంగా ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 చెరుకూరి శైలజను కూడా విచారించడంతోపాటు ఇతర చర్యలను తగిన సమయంలో తీసుకుంటాం. ఇదో.. పోంజీ తరహా స్కామ్ మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమాన్యం పోంజీ స్కామ్ తరహా అక్రమాలకు పాల్పడుతోంది. చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15 వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. చదవండి: ఆడియో మార్చి అభాండాలా..? చందాదారుల నుంచి ఫిర్యాదులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ చిట్ఫండ్ చట్టం, ఇతర చట్టాలను అనుసరించి మార్గదర్శిపై స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఒక్క చిట్ఫండ్ చట్టమే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించారు. సీఐడీ కేసు నమోదు చేయగానే పలువురు చందాదారులు తాము మోసపోయామని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 8 మంది చందాదారులు ఫిర్యాదు చేశారు. ఓ చందాదారుడు తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలను ఆర్నెల్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. -
మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 120బి, 409, 420,477(ఏ) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఏ1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజ, ఏ3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ పేర్కొంది. 1982 చిట్ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదైంది. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. నరసరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచ్ల మార్గదర్శి ఫోర్మెన్లు పరారీలో ఉన్నారు. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరులో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఫోర్మెన్లను విచారించిన సీఐడీ.. వారి వాంగ్మూలం నమోదు చేసింది. చిట్ ఫండ్ నిధులు, మ్యూచువల్ ఫండ్ను స్పెక్యులేటివ్ మార్కెట్కి మార్గదర్శి మళ్లించింది. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అక్రమాలను ఆడిటింగ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించింది. చదవండి: నల్లధనం చేర్చింది ఆ నలుగురే.. సింగపూర్ రూటులో ‘స్కిల్’ లూటీ! -
మార్గదర్శి చిట్ఫండ్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది
సాక్షి, అమరావతి: చిట్ఫండ్ చట్టం నిబంధనలను అనుసరించనందుకు తమకు ఎలాంటి పెనాల్టీ విధించకుండా, అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకునేలా ఆదేశించాలంటూ మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో వాదనలు శుక్రవారం ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తమ వ్యవహారంలో అధికారులు నిబంధనల మేరకు నడుచుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ అధీకృత అధికారి బి.శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్, అనుబంధ వ్యాజ్యాలపై జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం వల్లే సోదాలు చేపట్టామన్నారు. ఇటీవల చాలా కంపెనీలు ప్రజల నుంచి సేకరిస్తున్న సొమ్ము విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని, అలాంటి పరిస్థితులు ప్రజలకు రాకూడదన్న ఉద్దేశంతోనే మార్గదర్శి వ్యవహారంలో చర్యలు చేపట్టామన్నారు. ప్రజల నుంచి చిట్ రూపంలో సేకరించిన డబ్బును ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, మార్గదర్శి అందుకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. ఆ సొమ్మును ఉషాకిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, ఉషోదయా పబ్లికేషన్స్, రమాదేవి ట్రస్ట్ వంటి అనుబంధ కంపెనీలకు, ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ఎన్నో ఏళ్ల నుంచి ఈ తంతు సాగుతోందని నివేదించారు. ఇది ప్రజలను, చట్టాన్ని మోసం చేయడమేనన్నారు. ప్రతి చిట్ ఆస్తి, అప్పుల పట్టీని రిజిస్ట్రార్కు సమర్పించాలని, మార్గదర్శి ఆ పని కూడా చేయడంలేదని చెప్పారు. ప్రజలు ఏ రకంగానూ మోసపోకూడదనే ఉద్దేశంతోనే మార్గదర్శి రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నామని, చిట్ఫండ్ కంపెనీ రికార్డులను పరిశీలించే అధికారం అధికారులకు ఉందని తెలిపారు. మార్గదర్శి హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేయకూడదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ చట్ట నిబంధనలూ వర్తించవన్నట్లు మార్గదర్శి వ్యవహరిస్తోందన్నారు. కొత్త చిట్ ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు సమర్పించినప్పుడు పాత చిట్ రికార్డులు పరిశీలించే అధికారం రిజిస్ట్రార్కు ఉందన్నారు. కొత్త చిట్కు అనుమతివ్వాలా లేదా అన్నది పూర్తిగా రిజిస్ట్రార్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. చిట్కు అనుమతివ్వాలని రిజిస్ట్రార్ను ఆదేశించడానికి వీల్లేదన్నారు. ప్రజల క్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు కక్ష సాధింపు ఎలా అవుతుందని అన్నారు. రికార్డులు అడుగుతుంటే కుంటి సాకులతో తప్పించుకుంటున్నారని వివరించారు. రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వద్ద అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన తరువాత వ్యాపారం కొనసాగించవచ్చని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతకు ముందు మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రిజిస్ట్రార్ నిబంధనల ప్రకారం నడుచుకోవడంలేదన్నారు. కార్పొరేట్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీసుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోరజాలరన్నారు. చిట్ డబ్బుపై సెక్యూరిటీ మొత్తాన్ని రిజిస్ట్రార్ వద్ద జమ చేస్తున్నామని తెలిపారు. ఫోర్మెన్ సెక్యూరిటీ ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా అధికారులు సోదాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ముందుగా నోటీసు ఇవ్వకుండా, కారణాలు చెప్పకుండా కొత్త చిట్కు అనుమతిని తిరస్కరించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. -
మార్గదర్శి కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రవి
సాక్షి, అమరావతి: చిట్ఫండ్ చట్టం నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సమాచారం, రికార్డులు ఇవ్వకపోవడమే కాక అధికారులు చట్టబద్ధంగా చేస్తున్న సోదాలను తప్పుపడుతూ మార్గదర్శి చిట్ఫండ్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ తప్పుకోగా, గురువారం జస్టిస్ చీమలపాటి రవి కూడా ఈ వ్యాజ్యాన్ని విచారించలేనని చెప్పారు. వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని జస్టిస్ రవి రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ తిరిగి ఈ వ్యాజ్యం ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాజ్యం విచారణను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డికి అప్పగించారు. శుక్రవారం మార్గదర్శి వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపే అవకాశం ఉంది. సుబ్బారెడ్డి ముందున్న కేసుల విచారణ జాబితాలో మార్గదర్శి పిటిషన్ 170వ కేసుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మధ్యాహ్నం విచారణ చేపట్టాలని మార్గదర్శి న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. చదవండి: (బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా..) -
మార్గదర్శి కార్యాలయంలో 3వ రోజు ముగిసిన సోదాలు
-
మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు..
సాక్షి, హైదరాబాద్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజూ విస్తృత సోదాలు నిర్వహించారు. పంచనామా రిపోర్ట్ తీసుకునేందుకు మార్గదర్శి సిబ్బంది నిరాకరించారు. దీంతో రిపోర్టును గోడకు అధికారులు అతికించారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు సేకరించారు. మార్గదర్శి నిబంధనలకు విరుద్దంగా ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిధుల మళ్లింపుపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇతర కంపెనీల్లో పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల పేర్కొన్నాయి. చదవండి: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష -
మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల పాటు తనిఖీలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించిన మార్గదర్శి చిట్ఫండ్ వ్యవహారాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అధికారుల తనిఖీలను వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు. సొంత మీడియాతో అధికారుల విధులకు మార్గదర్శి యాజమాన్యం ఆటంకం కలిగించింది. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారం అధికారులు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్ డిపాజిట్లు సేకరించినట్టు అనుమానం వ్యక్తమవుతుంది. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మర్గదర్శి నిధుల మళ్లింపుపై అధికారులు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం -
‘మార్గదర్శి’ ప్రధాన కార్యాలయంలో సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సోదాలు నిర్వహించాక కూడా ఎలాంటి రికార్డులు ఇవ్వలేదని, 8 ఏళ్లుగా ఎలాంటి రికార్డులు సమర్పించలేదని అధికారులు తెలిపారు. డిపాజిటర్ల సమాచారం సైతం ఇవ్వలేదన్నారు. మరోవైపు.. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధులు మళ్లింపుపై దర్యాప్తు చేపట్టనున్నారు. తనిఖీల అనంతరం మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో 35 కంపెనీలలో అక్రమాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో 18 యూనిట్స్లో సోదాలు నిర్వహించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు. ఇదీ చదవండి: ‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు -
‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ చిట్స్ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా, అడిగిన సమాచారం ఇవ్వకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఏమిటని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి రామకృష్ణ ప్రశ్నించారు. తాము అడిగిన సమాచారం వారు ఇచ్చి ఉంటే, అది తాము సంతృప్తి చెందేలా ఉంటే సంతోషించే వారిలో తానే ప్రథముడినని చెప్పారు. అలా జరగనందునే పలు సందేహాలొస్తున్నాయని, అందువల్ల చిట్స్ వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన చిట్ఫండ్ చట్టంపై చిట్స్ డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నమ్మకం, అవమానం, నిప్పు, అబద్ధాలు.. వంటి కొన్ని పదాలు వాడారని, వాటితో తమకు పని లేదన్నారు. నిజాలు, సమాచారం, అంకెలు ఆధారంగానే తాము పని చేస్తామని చెప్పారు. వాస్తవాలు చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు ఇచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటే సరిపోదని, తాము అడిగిన సమాచారం ఇవ్వాలని, బ్యాలెన్స్ షీట్లు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐజీ ఇంకా ఏమన్నారంటే.. అది మా బాధ్యత.. – ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేయాలని లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు మేము ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చు.. చేస్తాం కూడా. ప్రతి ఏడాది వారు వివరాలు సమర్పించాలి. మేము అడిగిన సమాచారం ఇవ్వనందునే ఇదంతా చెప్పాల్సి వస్తోంది. వారు సమాచారాన్ని ఇవ్వక పోవడం వల్లే సందేహించాల్సి వస్తోంది. తప్పులు జరిగాయని భావించాల్సి వస్తోంది. అందువల్ల చిట్లు వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఒకవేళ ఫిర్యాదు వస్తే.. సీబీఐ, ఈడీ, పోలీసు వంటి సంస్థలు దర్యాప్తు చేస్తాయి. – మార్గదర్శి కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీకి సమాచారం ఇచ్చేది లేదని ప్రకటనలో పేర్కొంటే కుదరదు. ఏపీలో మార్గదర్శి కంపెనీ లక్ష మంది చందాదారులతో 2,345 చిట్లు నిర్వహిస్తోంది. వాటన్నింటినీ ఇక్కడి నుంచి నిర్వహిస్తూ బ్యాలెన్స్ షీట్లు ఎక్కడ ఇస్తారు? రిజిస్ట్రార్కి రికార్డులు ఇచ్చామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ లెక్కన వాటిని తెలంగాణ, కర్ణాటక అధికారులకు ఇచ్చారా? – మార్గదర్శి యాజమాన్యం వారికి అనుకూలంగా నిబంధనలను చూపిస్తోంది. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 21ని చూపిస్తూ తమ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీకి జవాబుదారీ కాదనడం సరికాదు. సెక్షన్ 19, 24లను కూడా వారు చదవాలి. ఇక్కడి కార్యకలాపాలకు మాకు బ్యాలెన్స్ షీట్లు ఇవ్వాల్సిందే. ఫోర్మెన్స్కు అధికారాలు లేవంటే ఎలా? – ఏపీలో మార్గదర్శి నిర్వహించే కార్యకలాపాలపై ఏదైనా సమస్య వస్తే తెలంగాణ, కర్ణాటక అధికారులు చూస్తారా? ఫోర్మెన్స్కు ఎటువంటి అధికారాలు లేవని చెబుతున్నారు. ఇది సరికాదు. అలాగైతే కొత్త చిట్స్కు అనుమతి ఇవ్వం. డిపాజిట్లు ఎక్కడున్నాయో, వాటిని ఎలా వినియోగిస్తున్నారో ఫోర్మెన్లకు తెలియాల్సిందే. – ఎవరూ అడక్కుండానే చిట్ఫండ్ కంపెనీలు తమ కార్యకలాపాలు, బ్యాలెన్స్ షీట్ల వివరాలను చిట్స్ రిజిస్ట్రార్లకు ఇవ్వాలి. కానీ ఎనిమిదేళ్లుగా మార్గదర్శి రికార్డులను సమర్పించడం లేదు. అందువల్ల త్వరలో హైదరాబాద్లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో నిపుణులతో ఆడిట్ నిర్వహిస్తాం. – అన్నీ సక్రమంగా నిర్వహిస్తుంటే ఎందుకు భయపడుతున్నట్లు? ఆ కంపెనీ పబ్లిక్ డొమైన్లో ఉంచిన డాక్యుమెంట్ ప్రకారం చిట్ఫండ్ నిధులు ఇతర సంస్థలకు మళ్లించినట్లు స్పష్టమైంది. మార్గదర్శి సహా రాష్ట్రంలోని 35 చిట్ఫండ్ కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించాం. ఒక్క మార్గదర్శి తో తప్ప మిగిలిన కంపెనీలతో ఎటువంటి సమస్యా రాలేదు. ఈ ప్రశ్నలకు బదులేదీ? – చిట్స్ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఏమిటి? – అందులో మీకు అనుకూలంగా చెప్పుకుంటారా? మీకు మీరే సెల్ఫ్ సర్టిఫికేషనా? – మీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంటే ఏపీలో రికార్డులు చూపరా? – మీరు ఏపీలోనూ చిట్ఫండ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది నిజం కాదా? – ఏ రిజిస్ట్రార్కు బ్యాలెన్స్ షీట్లు ఇచ్చారు? కర్ణాటక రిజిస్ట్రార్కా.. లేక తెలంగాణ రిజిస్ట్రార్కా? – ఎలాంటి అధికారాలు ఇవ్వకుండానే ఫోర్మెన్ (మేనేజర్ తరహా పోస్టు)లను నియమించారా? – రాష్ట్ర విభజన తర్వాత నుంచి మీరు ఏపీలో రికార్డులు చూపక పోవడం నిజం కాదా? – చిట్ఫండ్ నిధులు ఇతర సంస్థలకు మళ్లించడం నిజం కాదా? – రాష్ట్రంలో 35 చిట్ఫండ్ కంపెనీల్లో మీరొక్కరే ఎందుకు సహకరించడం లేదు? – అంతా సరిగ్గా ఉంటే ఎందుకు భయపడుతున్నారు?. -
మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా?.. ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: మార్గదర్శిలో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ అన్నారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉంది. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్ చేయలేదని.. మార్గదర్శి ఆర్థికస్థితిపై అనుమానాలున్నాయి. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుంది. ఒక చిట్కు సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదని ఐజీ తెలిపారు. ‘‘ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టినట్టు పేర్కొన్నారు. మార్గదర్శి ప్రజలను చీట్ చేసినట్టుగానే పరిగణించాలి. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని తప్పుడు వార్తలు రాశారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇస్తాం. మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్ ఆడిట్ చేయాలని ఆదేశించాం’’ అని ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. ‘‘తెలంగాణ అధికారుల సహకారంతో హైదరాబాద్ సంస్థలో తనిఖీలు చేస్తాం. మాకు ఏ సంస్థపైనా వివక్ష ఉండదు. 2018లో కపిల్చిట్ఫండ్స్పై చర్యలు తీసుకున్నాం. 2022 వరకు కపిల్ చిట్ఫండ్స్కు కొత్త చిట్కు అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఈ రోజుకి కూడా మార్గదర్శి సెకండ్ అకౌండ్ వివరాలు ఇవ్వలేదు’’ అని ఐజీ రామకృష్ణ తెలిపారు. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? -
చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరిపై అయినా కేసులు నమోదు చేస్తాం
-
‘మార్గదర్శి’ మోసాలు.. మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలది చవకబారు రాజకీయం అంటూ దుయ్యబట్టారు. ‘‘ఇప్పటంలో చిన్న విషయంలో గగ్గోలు పెట్టారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని భ్రమ కల్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు విచారణలో నిజాలు బయటకొచ్చాయి. కోర్టును మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నట్టు తేలిపోయింది. చివరకు 14 మందికి రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది. పవన్ కల్యాణ్ అయితే ప్రభుత్వాన్నే కూల్చిపడేయాలన్నారు. కోర్టులనే మోసం చేసేందుకు కూడా వెనకాడలేదని’’ మంత్రి నిప్పులు చెరిగారు. చిట్ఫండ్ కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మార్గదర్శి చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతోంది. రామోజీ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగా నిర్మితమయ్యాయని ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయని మంత్రి అన్నారు. ‘‘ప్రస్తుతం మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. రామోజీరావు చట్ట వ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారు మార్గదర్శి కూడా విచ్చలవిడిగాని నిబంధనలు ఉల్లంఘించింది. ష్యూరిటీలు లేని కారణంగా ఇవ్వడం లేదని మార్గదర్శి చెబుతుంది. పాడుకున్న వారి డబ్బులు మార్గదర్శిలోనే ఉండిపోతాయి. ఆ డబ్బులను తమ ఇతర సంస్థల్లోకి పెట్టుబడులుగా పెడుతోంది. పైసా లేకుండా వ్యాపారాలు చేసే వ్యక్తి రామోజీరావు. గత 50-60 ఏళ్లుగా రామోజీరావు ఇదే చేస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ‘‘రామోజీరావు చట్టవ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారు. మొన్న జరిగిన సోదాల్లో మోసాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చిట్స్ సొమ్మును ప్రత్యేక ఖాతాలో వేయాలి. ప్రతి చిట్కు ఒక ఖాతా ఉండాలని చట్టంలో ఉంది. సోదాల్లో అధికారులు ఆ విషయాన్ని గుర్తించారు. చిట్ పాడుకున్న వారిని షూరిటీల పేరుతో వేధించి.. కొంతకాలం నగదును హోల్డ్ చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ‘‘మార్గదర్శి ఖాతాదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిట్టీలు వేసే వారు ఆలోచన చేసుకోవాలి. చట్టాలను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటాం. ఏ కంపెనీ అయినా నిబంధనలు పాటించాల్సిందే. రామోజీరావు చట్టానికి అతీతుడు కాడు. మేం కక్ష సాధిస్తున్నామనడం సరికాదు. అక్రమంగా డిపాజిట్లు తీసుకోబోమని కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసి ఇంకా డిపాజిట్లు తీసుకుంటూనే ఉన్నారు’’ అని మంత్రి రాంబాబు దుయ్యబట్టారు. చదవండి: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే -
ఏది నిజం ?: రామోజీ.. రామ రామ!
ద్రోణాచార్యుడిని పడగొడితే తప్ప తాము బతకజాలమని తెలుసుకున్నాకే అశ్వత్థామ మరణించాడనే అబద్ధాన్ని గట్టిగా చెప్పి... అది మనిషి కాదు ఆ పేరున్న ఏనుగనే సత్యాన్ని వినిపించనంత మెల్లగా చెప్పాడు ధర్మరాజు. అది ధర్మాన్ని గెలిపించడం కోసం!!. ఇక్కడ పూర్తిగా వలువలూడదీసుకుని పత్రికనే అడ్డంపెట్టుకున్న రామోజీరావు వై.ఎస్.జగన్ మోహన్రెడ్డిని పడగొట్టడం తన తరంకాదనే నిజాన్ని దిగమింగుకోలేక రోజూ ఆరు కాలాల్లో అబద్ధాలనే అచ్చేస్తుంటాడు. ఆ అక్షరాల్లో నిజమనేది చచ్చిపోయిందన్నదే ఇక్కడ పచ్చి నిజం!. ... ఒక కుట్ర ప్రకారం... రెండు రోజులుగా ‘దివాలా మాటున దోపిడీ... 10వేల కోట్ల ఆస్తుల్ని 500 కోట్లకు అమ్మేస్తారా..’ అంటూ రకరకాల వార్తలు వండుతున్న రామోజీరావుకు గానీ... ఆయన చెప్పినట్టల్లా పలికే తెలుగుదేశం గోబెల్స్కు గానీ వేస్తున్న ప్రశ్న ఒక్కటే?. మీరు చెబుతున్నట్లే ఆ ఆస్తుల విలువ 10వేల కోట్లే అనుకుందాం. ఓ 3వేల కోట్లకో... 2వేల కోట్లకో... వెయ్యి కోట్లకో.. పోనీ ఇంతెందుకు... కనీసం 550 కోట్లకు బిడ్ వేసినా మీకే దక్కేవి కదా? ఈ ఓపెన్ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చంటూ 2019 మార్చి 8న మీ ‘ఈనాడు’ పత్రికలోనే ఎన్సీఎల్టీ ప్రకటన ఇచ్చింది కదా? అప్పుడేం చేశారు రామోజీరావు గారూ? మీరెందుకు టెండర్ వేయలేదు? మీ తెలుగుదేశం మిత్రులచేత టెండర్ ఎందుకు వేయించలేదు? ప్రతి వాక్యం అబద్ధమే. టెండర్లలో పాల్గొన్న కంపెనీల నుంచి... టెండరు గెలుచుకున్న కంపెనీకి దక్కే ఆస్తుల వరకూ అన్నీ అశ్వత్థామ తరహా అర్థసత్యాలే. ఇదీ... రామోజీ పెంచి పోషించిన పాత్రికేయం. తొలి నుంచీ ఈ టెండర్లలో వై.ఎస్.జగన్ నీడ కనిపిస్తోందంటూ... రాంకీ ఎస్టేట్స్, శ్యామరాజు కంపెనీ వంటివి పాల్గొన్నాయని, ఇందులో రాంకీ సంస్థకు జగన్ కేసుతో సంబంధం ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఇదే టెండర్లలో హైదరాబాద్ ఇన్వెస్టరు శ్రీని రాజుకు చెందిన ఐల్యాబ్స్ సంస్థ, జాతీయ స్థాయి బ్యాంకింగ్ కంపెనీ అయిన కోటక్ మహీంద్రా, ఢిల్లీకి చెందిన ప్రుడెంట్ ఏఆర్సీ, రుద్రవీర్య డెవలపర్స్, యూవీ ఏఆర్సీ వంటివి కూడా పాల్గొన్నా... వాటి పేర్లు రాయలేదు. అనిల్ అంబానీకి చెందిన టెలికం సంస్థలు ఇలాగే దివాలా బారినపడితే యూవీ సంస్థ రూ.16,000 కోట్లకు బిడ్ వేసింది కూడా. ఇవన్నీ ఒకవేళ ‘ఈనాడు’ ప్రస్తావించి ఉంటే... ఇతర కంపెనీల్లానే ఈ కంపెనీకి కూడా దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బిడ్లు వచ్చాయనే వాస్తవం పాఠకులకు అర్థమయ్యేది. ఐబీసీ (దివాలా చట్టం) అనేది కేంద్రం తెచ్చిన చట్టమని... దాని కింద దివాలా తీసిన కంపెనీల విషయంలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకునేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్కు (ఎన్సీఎల్టీ) తగు అధికారం ఉందని వారికి తెలిసేది. అదే రామోజీరావు భయం కూడా. అందుకే అపోహలు పెరిగేలా రెండు కంపెనీల పేర్లు మాత్రమే రాశారు. 10 వేల కోట్ల ఆస్తులు... 500 కోట్లకా? ఇక విలువ విషయానికొద్దాం. నిజంగానే 10వేల కోట్ల విలువైన ఆస్తులు రూ.500 కోట్లకు కట్టబెట్టేశారా? చాలా అమాయకంగా.. సిగ్గూఎగ్గూ వదిలేసి మరీ ‘ఈనాడు’ రాసిన అంశమిది. ‘ఇంత చౌకగా విక్రయించేయడానికి బ్యాంకులు కూడా ఎందుకు అంగీకరించాయన్నది అంతు పట్టని అంశం. వీటిని విడివిడిగా వేలం వేసినా ఇంతకు మించిన ధర వచ్చేది కదా?’’ అంటూ అమాయకత్వం ముసుగులో తన మనసులోని దౌర్భాగ్యపు కుట్రలన్నిటినీ బయటపెడుతూ రామోజీ వేసిన ప్రశ్నలివి. నిజమే? ఒక్కొక్క ఆస్తినీ విడిగా విక్రయిస్తే బోలెడంత విలువ వచ్చేది. బ్యాంకులకు తమ అప్పుల కన్నా అధికంగా వేల కోట్లు వచ్చేవి. ఏం? మరి బ్యాంకులకు ఈ సంగతి తెలియదా? అన్ని వేల కోట్లు వదిలేసుకుని ముష్టి రూ.541 కోట్లకు ఎందుకు ఆశపడ్డాయి? ఎందుకంటే అందులో పేర్కొన్న ఏ ఒక్క ఆస్తి కూడా బహిరంగ వేలంలో విక్రయించేందుకు అవకాశాలు లేవు కాబట్టి. ప్రతి ఆస్తీ రకరకాల కక్షిదారులతో బోలెడన్ని కేసులతో ముడిపడి ఉంది కాబట్టి. ఒకవేళ అంతా సజావుగా జరిగి... ఎన్సీఎల్టీ ఉత్తర్వుల ప్రకారం రూ.541 కోట్లకు ఎర్తిన్ ప్రాజెక్ట్స్ సంస్థ వీటిని దక్కించుకున్నా... అది ఇంకా రకరకాల కేసుల్లో గెలవాల్సి ఉంది. వీటిలో పేర్కొన్న ఆస్తుల్లో చాలా వాటి లీజుల్ని, భూ కేటాయింపుల్ని ఇప్పటికే స్థానిక ప్రభుత్వాలు రద్దు చేశాయి. ఇవన్నీ చూశాక... తమకు నికరంగా దక్కేది, అది కూడా కేసులన్నీ తేలి ఎప్పటికి దక్కుతుందో తెలియని ఆస్తుల కోసం అన్ని కోట్లు ఎవరైనా ఎందుకు పెడతారు? అందుకే పాల్గొన్న వారిలో... ఎర్తిన్ ప్రాజెక్ట్స్ రూ.541 కోట్లతో అధిక మొత్తాన్ని కోట్ చేసిన సంస్థగా నిలవగా... మిగిలినవి అంతకన్నా చాలా తక్కువ మొత్తాన్ని కోట్ చేశాయి. రామోజీకి నిజాలతో పనిలేదు కాబట్టి... ఇవేవీ చెప్పకుండానే చాలా విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కట్టబెట్టేశారంటూ కారుకూతలకు దిగారు. మిగతా కంపెనీల గురించి మీకు తెలియదా? కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం... 2016లో వచ్చిన దివాలా చట్టం ప్రకారం పరిష్కారమైన కేసుల్లో 47 శాతం లిక్విడేషన్ ప్రక్రియ ద్వారానే సాధ్యమయ్యాయి. లిక్విడేషన్ అంటే ఆస్తుల్ని వేలం వెయ్యటం ద్వారా. 14 శాతం కేసులు మాత్రం పరిష్కార ప్రక్రియ ద్వారా పూర్తయ్యాయి. అంటే... బిడ్లు పిలిచి విజయవంతమైన బిడ్డరుకు ఏకమొత్తంగా కంపెనీని అప్పగించటం. ఇలా అప్పగించిన సందర్భాల్లో బ్యాంకులు తమకు రావాల్సిన బకాయిల్లో అత్యధికంగా 90 శాతం మొత్తాన్ని కోల్పోయినట్లు కోటక్ సంస్థ తెలియజేసింది. అంటే.. 10వేల కోట్ల బకాయిలుంటే వాటికి దక్కింది వెయ్యికోట్లే అన్నమాట. తాజా ఇందూ ప్రాజెక్ట్స్ విషయం చూసినా అంతే. రూ.4,138 కోట్ల రుణాలకు గాను ఎర్తిన్ ప్రాజెక్ట్స్ వేసిన బిడ్ 541 కోట్లు. అంటే దాదాపు 13 శాతం. ఈ లెక్కన చూస్తే బ్యాంకులు తమ రుణాల్లో 87 శాతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీన్నిబట్టి తేలేదేమిటి? వీలు కుదిరిన ప్రతి కేసులో బ్యాంకులు గానీ, పరిష్కార నిపుణుడు గానీ తమకు ఎక్కువ మొత్తం రావటానికి ఆస్తుల వేలానికే మొగ్గు చూపుతాయి. కానీ ఆయా ఆస్తులు రకరకాల కేసులతో ముడిపడి, వేలానికి సాధ్యం కానప్పుడే తమ అప్పును రాబట్టుకోవటానికి రిసల్యూషన్ ప్రక్రియకు అవి అంగీకరిస్తాయి. ఇంత చిన్న విషయం రామోజీకి తెలియదా? తెలియక కాదు. తామేం రాసినా తమ పాఠకులు అమాయకంగా నమ్మేస్తారన్నదే ఆయన ధైర్యం!. ముఖ్యమంత్రి మేనమామ కొడుకు చేరితే..? నిజానికి ఎర్తిన్ ప్రాజెక్ట్స్ వేసిన బిడ్కు పరిష్కార నిపుణుడు ఓకే అన్నాక... ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ దీన్ని ఆమోదిస్తూ గతేడాది అక్టోబరు 1నే ఉత్తర్వులిచ్చింది. తరవాత ఆ కంపెనీ మెల్లగా చెల్లింపులు చేస్తూ... దానికోసం ఇన్వెస్ట్మెంట్లు కూడా సమీకరిస్తోంది. దీన్లో భాగంగానే ఈ ఏడాది మేలో తాము ఇన్వెస్ట్మెంట్ చేశామని, తమ కుమారుడు డైరెక్టరుగా చేరాడని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మామ రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం చెప్పారు కూడా. అయినా టెండర్లో ఆస్తులు దక్కించుకున్న సంస్థలో ఏడు నెలల తరవాత ఓ వ్యక్తి డైరెక్టరుగా చేరితే... అదంతా ముఖ్యమంత్రి చక్రం తిప్పితేనే సాధ్యమైందన్న దౌర్భాగ్యపు రాతలు రాసిన వారిని ఏమనాలి? మేనమామ కొడుకు డైరెక్టరుగా చేరాడని దాన్ని ముఖ్యమంత్రికి అంటగడితే ఎలా? మీ ఆస్తులు మీ మేనమామ కొడుకులకు ఇచ్చేస్తారా రామోజీరావు గారూ? అందరూ మీలా బినామీలను నమ్ముకుని రాజ్యం చేస్తుంటారనుకున్నారా? ఉద్యోగులను సైతం బినామీగా వాడుకుని మీరు సృష్టించుకున్న ఫిలిం సిటీ గురించి తెలియనిదెవరికి? చట్టాల ఉల్లంఘనకు పక్కదార్లు వెతకటంలో మీ తరవాతే కదా ఎవరైనా? లీజుల పేరిట బయటివారితో పాటు సొంత తోడల్లుడి ఆస్తుల్ని సైతం కబ్జా చేసిన చరిత్ర మీది. బంధువుల గురించి మీకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదన్నదే నిజం కూడా!!. అసలు లేపాక్షి కథ ఇదీ... లేపాక్షి నాలెడ్జ్ సిటీ గురించి రాసిన రాతల్లోనూ వాస్తవాలు దేవతా వస్త్రాలే. ఈ భూములన్నీ బెంగళూరు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉంటాయని, చాలా విలువైనవని, సరిహద్దు వీటితోనే ఆరంభమవుతుందని ఊహలను అచ్చేశారు. వాస్తవానికి అనంతపురం– బెంగళూరు మధ్య దూరం 240 కిలోమీటర్లు. వీటికి మధ్యలో ఉంటుంది చిలమత్తూరు. దాన్ని ఆనుకునే గోరంట్ల మండలం. ఎటు చూసినా 120 కిలోమీటర్ల దూరం. రెండూ చిత్రావతి పరివాహక ప్రాంతాలే అయినా... 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పరగోడు వద్ద కర్ణాటక ఓ బ్యారేజీ నిర్మించింది. దీంతో ఈ ప్రాంతం ఎండిపోయి బోర్లలోనూ నీరు పడని స్థితికి చేరింది. పంటలు లేక, భూగర్భ జలాలు లేక అల్లాడుతున్న ఆ గ్రామాల్లో పరిశ్రమలొస్తే తప్ప పరిస్థితి మారదని భావించి వైఎస్సార్ ప్రభుత్వం 2006లో సైన్స్ సిటీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీఐఐసీ భూసేకరణకు ప్రకటనలివ్వగా... నీటి వసతి లేని భూములు తమకెందుకంటూ సైన్స్ సిటీ వెనక్కి వెళ్లిపోయింది. ఇతర పరిశ్రమల్ని ఆహ్వానించగా ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో... భూసేకరణ నిలిపేశారు కూడా. తరవాత లేపాక్షి సంస్థ ముందుకు రావటంతో... వారిచ్చిన డబ్బుతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. ఈ వాస్తవాల్ని ఎక్కడా చెప్పని ‘ఈనాడు’... అడుగడుగునా అసత్యాలతో అదో పెద్ద కుంభకోణమని, చాలా విలువైన భూముల్ని ఆనాడే వైఎస్ ప్రభుత్వం లేపాక్షికి కట్టబెట్టేసిందని రాసుకొచ్చింది. మరీ ఇంత దుర్మార్గమా రామోజీ? మీ రాతల్లో నిజమెంతని మిమ్మల్ని మీరు ఎన్నడైనా ప్రశ్నించుకున్నారా? 100 కిలోమీటర్లంటే అంత దగ్గరా? విశాఖ– శ్రీకాకుళం మధ్య దూరం 100 కిలోమీటర్లు. మరి విశాఖకు అత్యంత సమీపంలో ఉన్నట్టేనా? విశాఖలో ఉన్న రేట్లే శ్రీకాకుళంలోనూ ఉంటాయా? ఎందుకీ దగుల్బాజీ రాతలు? నిజానికి అప్పట్లో ఎకరా 20వేలు చెప్పినా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే భూగర్భ జలాలు లేవు. వర్షం ఊసే ఉండదు. అలాంటి జిల్లాలో పరిశ్రమలొస్తాయంటే... వాటికోసం నీటి వసతి కల్పించటమూ నేరమేనట రామోజీ దృష్టిలో!!. నీళ్లు లేకుంటే పరిశ్రమలు ఎందుకొస్తాయి రామోజీరావుగారూ? ఇలాంటిదేదో మీ చంద్రబాబు చేస్తే భూమీ ఆకాశం బద్దలైపోయేటట్లు ఆయన విజన్ని పొగిడేసేవారు కాదూ? ఎక్కడో అనంతపురంలో ఎకరా 70– 80 వేలు కూడా చేయని భూములు ఎకరా రూ.1.75 లక్షల చొప్పున విక్రయించటమే నేరంగా కనిపించిందా? హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ కట్టానని చెప్పే మీ మిత్రుడు.. దాని పక్కనే గచ్చిబౌలిలో 500 ఎకరాలను ఊరూపేరూ లేని బిల్లీరావు, పేట్రావులకు ఎకరా రూ.50వేల చొప్పున క్రీడల కోసం కట్టబెట్టేస్తే మీకు అదో మహాద్భుతంలా కనిపించడం నిజం కాదా? రాష్ట్రంలో క్రీడలకు మహర్దశ పట్టిందని, ఇక ఒలింపియన్లు కూడా తయారవుతారంటూ రంగురంగుల గ్రాఫిక్స్ చూపిస్తూ మీరు చెలరేగిపోలేదా? ఆంధ్రప్రదేశ్ ఇక క్రీడా రాజధాని కాబోతోందని చెప్పి ఎంతమంది క్రీడాకారుల్లో ఆశలు పుట్టించి చిదిమేయలేదు? ఊరూపేరూ లేని సూట్కేసు కంపెనీకి అంతర్జాతీయ కంపెనీతో ఎంఓయూ ఉందంటూ రాష్ట్రంలోని స్టేడియాలను కూడా దోచిపెట్టేందుకు తెరతీసిన మీ నీతి... నిజాయితీ గురించి తెలియనిదెవరికి రామోజీరావు గారూ!!. ఆ ఆస్తుల వెనక కేసులివీ... లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం: మర్రిమాకులపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా విస్తీర్ణం: 8,648 ఎకరాలు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ను అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీ 8,648 ఎకరాలు కేటాయించింది. ఈ భూములకు సంబంధించి రైతులతో కొన్ని సమస్యలున్నాయి. పైపెచ్చు వీటి విక్రయాలు/ రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. సీబీఐ 2013లో ఛార్జిషీటు నమోదు చేసింది. తరవాత 8,648 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది కూడా. వీటన్నిటికీ తోడు ఈ భూములను అభివృద్ధి చేయలేదనే కారణంతో లేపాక్షి కేటాయింపులను నాటి ప్రభుత్వం రద్దు చేసింది కూడా. దీనిపై లేపాక్షి సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాము తనఖా పెట్టిన 4,396 ఎకరాలకు సంబంధించి... ప్రభుత్వ రద్దుపై స్టే తెచ్చుకుంది. విచారణ కొనసాగుతోంది. అస్తిత్వ రియల్టర్స్ అండ్ సింధూర ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం: బాచుపల్లి, కుత్బుల్లాపూర్ మండలం, మల్కాజ్గిరి జిల్లా, తెలంగాణ విస్తీర్ణం: 11.5 ఎకరాలు హైదరాబాద్లోని మియాపూర్లో... సింధూర ప్రాపర్టీస్తో కలిసి ఏకమొత్తంగా హౌసింగ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ అర్బన్ ల్యాండ్ సీలింగ్, రహదారి విస్తరణ తదితర సమస్యలున్నాయి. ఆ భూమిలో కొంత భాగం రహదారి విస్తరణలో పోయింది కూడా. సుందరీ థీమ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం: కొల్తూరు, మల్కాజ్గిరి జిల్లా, తెలంగాణ విస్తీర్ణం: 35 ఎకరాలు షామీర్ పేటలో గృహనిర్మాణ ప్రాజెక్టు కోసం 35 ఎకరాలు కొన్నారు. అందులో కొంత భూమి కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తోంది. దాంతో చాలా తక్కువ భూమి మాత్రమే హౌసింగ్కు అందుబాటులో ఉంది. వీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం: మాదాపూర్, శేరిలింగంపల్లి మండలం, తెలంగాణ. విస్తీర్ణం: 5.27 ఎకరాలు హైదరాబాద్లోని హైటెక్ సిటీకి సమీపంలోని దుర్గం చెరువును ఆనుకుని ఉన్న 5.27 ఎకరాల స్థలం ఇది. కానీ ఆ భూములు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం నోటీసులివ్వటంతో ఈ ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయి. రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం: బాచుపల్లి, హైదరాబాద్. తెలంగాణ విస్తీర్ణం: 90 ఎకరాలు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో కలసి జాయింట్ వెంచర్ కింద బాచుపల్లిలో టౌన్షిప్ నిర్మించాలి. హౌసింగ్ బోర్డ్కుచెందిన డెక్కన్ ఇన్ఫ్రా అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) నుంచి ఈ భూములను కంపెనీ పొందింది. 90 ఎకరాల కోసం ‘దిల్’కు రూ.280కోట్లు చెల్లించారు. అందులో అత్యధిక భాగాన్ని ‘ఆర్ఏపీపీఎల్’లోని జాయింట్ వెంచర్ భాగస్వామి చెల్లించారు. దాంతో ఈ భూముల కేటాయింపుపై న్యాయ వివాదాలు తలెత్తాయి. జాయింట్ వెంచర్ కంపెనీ ‘ఆర్ఏపీపీఎల్’కు అనుకూలంగా ఆర్బిట్రేషన్ తీర్పు వచ్చింది. కానీ ఈ తీర్పును కోర్టులో ‘దిల్’ సవాల్ చేసింది. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు పెండింగులో ఉంది. ఇందూ టెక్జోన్ ప్రైవేట్ లిమిటెడ్ స్థలం: మామిడిపల్లి, çరంగారెడ్డి జిల్లా, తెలంగాణ. విస్తీర్ణం: 150 ఎకరాలు టీఎస్ఐఐసీ శంషాబాద్ వద్ద కేటాయించిన 150 ఎకరాల్లో ఇందూ టెక్జోన్ ప్రై వేట్ లిమిటెడ్ ఐటీ సెజ్ను నిర్మించాలి. ఈ కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ 150 ఎకరాలను ఈడీ జప్తు చేసింది. అనంతరం ఈ కేటాయింపును టీఎస్ఐఐసీ రద్దు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని 2015, సెప్టెంబరు 24న ప్రకటించింది. దీనిపై కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందింది. ఈ కేసుతో పాటు... భాగస్వాములు దాఖలు చేసిన ఇతరత్రా కేసులూ ఉన్నాయి. ఎస్పీఆర్ ప్రోపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇందూ టెక్జోన్ ప్రైవేట్ లిమిటెడ్) స్థలం: మామిడిపల్లి,, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. విస్తీర్ణం: 100 ఎకరాలు టీఎస్ఐఐసీ శంషాబాద్ వద్ద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ (సేల్ డీడ్ కాలేదు) కింద కేటాయించిన 100 ఎకరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్ట్ను చేపట్టాల్సి ఉంది. ఈ కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ భూములను ఈడీ జప్తు చేయడంతో ప్రాజెక్టు సాధ్యపడలేదు. దీంతో టీఎస్ఐఐసీ ఈ కేటాయింపును రద్దు చేసి వాటిని స్వాధీనం చేసకుంటామని 2015, సెప్టెంబరు 24న ప్రకటించింది. ఈక్విటీ కేర్ ఇండియా లిమిటెడ్ స్థలం: నాగ్పూర్, మహారాష్ట్ర విస్తీర్ణం: 74 ఎకరాలు కేర్ హాస్పిటల్స్తో జాయింట్ వెంచర్ కింద నాగ్పూర్లో టౌన్షిప్ నిర్మించే ప్రాజెక్ట్ ఇది. 74 ఎకరాల కేటాయింపు కోసం మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఏడీసీ)కు నిధులు చెల్లించారు. కానీ ఎంఏడీసీ ఆ భూములను అప్పగించ లేదు. దాంతో అయితే భూమి ఇవ్వాలని, లేదంటే తమ నిధులను తిరిగి చెల్లించాలని ఎంఏడీసీని ఈక్విటీ కేర్ ఇండియా లిమిటెడ్ సంస్థ 2008 నుంచీ అడుగుతోంది. ఆ అంశం ఇప్పటికీ పెండింగులోనే ఉంది. ‘ఇందు’కేనా ఆ చిందులు? అయినా ఎప్పుడో 11 నెలల కిందట 2021 అక్టోబరు 1న ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల్ని పట్టుకుని... ఏదో ఇవ్వాళే జరిగినట్లుగా పేజీలకు పేజీలు విషం చిమ్మారెందుకు? మీ కథనాన్ని పట్టుకుని టీడీపీ గోబెల్స్ రెచ్చిపోతున్నారెందుకు? శివాలెత్తిపోతున్నారెందుకు? ‘మార్గదర్శి’ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసినందుకా? హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి... ఇక సుప్రీంకోర్టులో ఎవరూ సవాల్ చేయకపోతేæ ఏ కేసూ ఉండదనుకున్నారేమో!!. ఆ హైకోర్టు తీర్పు సరికాదని, మీరు ఎలా తీరుస్తారో కూడా తెలియకుండా 2,600 కోట్ల ప్రజాధనాన్ని చట్టవిరుద్ధంగా సేకరించారని, ఇదేమీ చూడకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి సమీక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేసరికి మీ అంచనాలన్నీ తలకిందులయినట్లున్నాయి. ఆగ్రహంతో ఊగిపోతూ రాత్రికిరాత్రి ఎప్పుడో పాత ఎన్సీఎల్టీ ఉత్తర్వులు తీసి... ప్రభుత్వం ఏదో చేసేస్తోందంటూ పతాక శీర్షికల్లో పేజీలకు పేజీలు బురద నింపేశారు. బంధువుల్ని సైతం న్యాయస్థానాలకీడ్చి కోర్టు పోరాటాల్లో పీహెచ్డీ చేసిన మీరు... ఈ మాత్రం ఎందుకు ఊహించలేకపోయారు? భూముల విలువ గురించి మీరే చెప్పాలా? భూముల విలువ గురించి మీలాంటి వాళ్లు ఎంత తక్కువ చెబితే అంత మంచిది రామోజీరావు గారూ!!. అక్కడ భూముల విలువ ఎకరా రూ.15 లక్షలు పలుకుతుండగా 1.75 వేలు మాత్రమే చెల్లించి ఏపీఐఐసీ సమీకరించిందంటూ నంగనాచి కబుర్లెందుకు? అక్కడ 2008 సమయంలో ఎకరా కనిష్ఠంగా 20వేలు– గరిష్ఠంగా 70 వేలు మాత్రమే పలికిందంటూ స్థానిక అధికారులు ఇచ్చిన పత్రాలు మీరెప్పుడూ చూడలేదా? అయినా ప్రభుత్వ అండతో రెవెన్యూ అధికారుల్ని ఫిలింసిటీ భూముల్లో కూర్చోబెట్టి మరీ బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న మీకు... పేదల గురించి, వారి భూముల గురించి మాట్లాడే హక్కు ఉందనుకుంటున్నారా? అయినా సీబీఐ ఛార్జిషీటులో పేర్కొన్నంత మాత్రాన అది నిజమైపోతుందా? ఛార్జిషీటులో సీబీఐ ఏం చెప్పినా అవన్నీ ఆరోపణలే కదా? అవే నిజమైనట్లు పేజీలకు పేజీలు విషం చిమ్మటం దేనికి నిదర్శనం? పన్ను కట్టకుండా ఎగ్గొట్టినందుకు మీకు ఐటీ శాఖ నోటీసివ్వటమే కాదు. ఐటీ ట్రిబ్యునల్ కూడా దాన్ని నిర్ధారించింది. అయినా సరే... పై కోర్టుకు... ఆ పైకోర్టుకు అంటూ న్యాయపోరాటాలు సాగించటమే కదా మీకు తెలిసిందల్లా!!. -
ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అవడం శుభపరిణామం: ఉండవల్లి
-
సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. సోమవారం మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. ఈ కేసులో తప్పక ఫలితం తేలుతుంది. మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుంది. కోర్టు ముందు అందరూ సమానమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. చదవండి: (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తం) -
‘మార్గదర్శి’ విచారణపై స్టే ఇవ్వలేం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థలో డిపాజిట్ల వ్యవహారంపై ఇక విచారణ కొనసాగించరాదని, ఆ మేరకు ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, సిటీ క్రిమినల్ కోర్టు–హైదరాబాద్లో ఉన్న క్రిమినల్ కంప్లయింట్పై(సీసీ) స్టే కొనసాగించాలని కోరుతూ దాఖలైన మధ్యంతర దరఖాస్తును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ దరఖాస్తును శుక్రవారం విచారించింది. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ(అన్ ఇన్కార్పొరేటెడ్ బాడీ) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, డిపాజిట్ల సేకరణకు అర్హత లేకున్నా దాదాపు రూ.2,300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంతో ఇదే చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబరు 19న జీవో నెంబరు 800, జీవో నెంబరు 801ను జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా జీవో నెంబరు 800 ద్వారా అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్.రంగాచారిని ఈ ఫైనాన్షియర్స్ సంస్థ డిపాజిట్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు నియమించింది. అలాగే జీవో 801 ద్వారా అప్పటి సీఐడీ ఐజీ కృష్ణరాజును ఈ సంస్థపై ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసేందుకు అధీకృత అధికారిగా నియమించింది. ఎన్.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 2008 జనవరి 23న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్(సీసీ) నెంబరు 540ను దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సీసీ నెంబరు 540లో క్రిమినల్ ప్రొసీడింగ్స్పై మధ్యంతర స్టే ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఏషియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేటు లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో 2018 మార్చి 28న ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ కేసులోనైనా, సివిల్ గానీ, క్రిమినల్ ట్రయల్లో గానీ స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది. విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కూడా స్టే ఉత్తర్వులకు కాలం చెల్లింది. ఈ నేపథ్యంలోనే స్టే పొడిగించాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతవారం ఈ మధ్యంతర దరఖాస్తు విచారణకు రాగా ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్కు నోటీసులు ఇచ్చింది. ఈ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే తాజాగా శుక్రవారం మరోసారి విచారణకు రాగానే కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది పాల్వాయి వెంకటరెడ్డి నివేదించారు. అయితే, మధ్యంతర దరఖాస్తులోని అభ్యర్థనకు అనుగుణంగా స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. సదరు దరఖాస్తును తోసిపుచ్చింది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్ సివిల్ అప్పీల్ అని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తును సివిల్ అప్పీల్లో భాగంగా విచారించడం కుదరదని స్పష్టం చేసింది. కాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ అభ్యర్థన మేరకు హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛనిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఉండవల్లి అరుణ్కుమార్ తరపున న్యాయవాది అల్లంకి రమేష్ విచారణకు హాజరయ్యారు. -
మార్గదర్శి లక్ష్యం రూ.20 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మార్గదర్శి చిట్ఫండ్ రూ.10,204 కోట్ల టర్నోవర్ను చేరుకుంది. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.10,800 కోట్లు.. 2025 నాటికి రూ.20 వేల కోట్ల టర్నోవర్ను లకి‡్ష్యంచామని కంపెనీ ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. మార్గదర్శి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారమిక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు. ‘‘1962లో హిమాయత్నగర్లో బ్రాంచీతో ఆరంభమైన మార్గదర్శికి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 105 బ్రాంచీలున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో ఆరింటిని ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. ప్రస్తుతం రూ.50 వేల నుంచి రూ.80 లక్షల వరకు చిట్స్ ఉన్నాయని త్వరలోనే కోటి రూపాయల చిట్ను ప్రారంభిస్తామని తెలియజేవారు. చిట్గ్రూప్ను బట్టి ఏడాదికి ఒకో చిట్పై 6–8 శాతం రాబడి ఉంటుందన్నారు. తమ వ్యాపారంలో 70 శాతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచేనన్నారు. ప్రస్తుతం సంస్థలో 15,786 మంది ఏజెంట్లు, 4,300 మంది ఉద్యోగులు ఉన్నారు. ఎన్బీఎఫ్సీగా.. చిట్ఫండ్ నుంచి బ్యాంక్కు మారే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘‘బ్యాంక్ ఏర్పాటు వైపు ఆలోచనైతే లేదు గానీ.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ (ఎన్బీఎఫ్సీ) రంగంలోకి అడుగుపెట్టే అవకాశముందని చెప్పారామె. దీనికి కొంత సమయం పట్టొచ్చన్నారు. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల వడ్డీ ఆదాయంపై జీఎస్టీ విధించడం లేదని, చిట్ఫండ్కు మాత్రం 12 శాతం పన్ను విధించడం సరైంది కాదని, కస్టమర్లకు భారంగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. చిట్ఫండ్ పరిశ్రమకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించామని గుర్తుచేశారు. -
మార్గదర్శి చిట్స్లో రూ. 11 లక్షలు చోరీ
శివమొగ్గ : శివమొగ్గ నగరంలోని నెహ్రు రోడ్డులో గల మార్గదర్శి చిట్ఫండ్ కార్యాలయంలో రూ.11.50 లక్షలు చోరీకి గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నెహ్రు రోడ్డులో గల మార్గదర్శి చిట్ఫండ్ కార్యాలయంలో దుండగులు కమలానెహ్రు కాలేజీ వెనుకభాగం ద్వారా చిట్ఫండ్ కార్యాలయం కిటికీ బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో నగదు ఉంచిన స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచి అందులో ఉన్న సుమారు రూ.11 లక్షల 50 వేలు తీసుకెళ్లారు. గ్యాస్కట్టర్ కారణంగా చెలరేగిన స్వల్ప మంటలతో గదిలో ఉన్న ఉన్న విలువైన చెక్కులు, కొంత నగదు అగ్నికి ఆహుతయ్యాయి. ఎస్పీ.కౌశలేంద్రకుమార్, కోటే పోలీస్స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపక్ హెగ్డే, ఎస్ఐ చిన్నప్ప సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేయించారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపే ఈ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. సోమవారం కార్యాలయానికి సెలవు. మంగళవారం కార్యాలయానికి సిబ్బంది రావడంతో చోరీ వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.