Natural gas
-
రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్
మాస్కో/కీవ్: రష్యా నుంచి చౌకగా గ్యాస్ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టంచేసింది. → గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.→ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది 6.9 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. → రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్నకు చేరుతోంది. → యూరప్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెనింగ్ గ్లోస్టీన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. → 2022లో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్ను రష్యా నుంచే పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. → అయితే యూరప్కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం -
మౌలిక రంగం.. మందగమనం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లు, సెల్స్పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్స్టవ్లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్తో ఆరోగ్యం.. ‘ఎన్ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న పీఎన్జీ,సీఎన్జీ గ్యాస్ ధరలు!
సహజ వాయివు (నేచురల్ గ్యాస్) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది. చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ను ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో పీఎన్జీ, సీఎన్జీ గ్యాస్ ధరలు మరింత తగ్గన్నాయి. సాధారణంగా కేంద్రం యూఎస్, కెనడా, రష్యాతో పాటు మిగిలిన దేశాల్లో గ్యాస్ ట్రేడింగ్ హబ్ల్లోని ధరలకు అనుగుణంగా సహజ వాయివు ధరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుతూ వచ్చేది. కానీ ఇంధనం ధరల్ని ముడిచమురు ధరలతో అనుసంధానం చేయడంతో.. ధరల్లో ప్రతినెలా మార్పులు ఉండబోతున్నాయి.. #Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation pic.twitter.com/NRONPAOzzK — Rajesh Malhotra (@DG_PIB) April 6, 2023 తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) 10 శాతం చౌకగా మారుతుందని, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర 6 శాతం నుండి 9 శాతానికి తగ్గుతుందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదంపై శనివారం నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. -
బాబోయ్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
Putin: పుతిన్.. ఏం మెలిక పెట్టావయ్యా!
ఆంక్షలతో రష్యాను ఇరకాటంలో పెట్టాలని అమెరికా, పాశ్చాత్య దేశాలు(ఈయూ దేశాలతో కలిపి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తగ్గేదే లే అనుకుంటూ ఉక్రెయిన్పై మిలిటరీ చర్యలను కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఈ క్రమంలో.. రష్యా ఆర్థిక స్థితి కొద్దికొద్దిగా దిగజారుతోంది. తాజాగా పుతిన్ ‘మిత్రపక్షంలో లేని దేశాలకు’ పెద్ద షాకే ఇచ్చాడు. సహజ వాయువుల ఉత్పత్తులు కావాలంటే చెల్లింపులను రష్యన్ కరెన్సీ రూబుల్స్లో మాత్రమే చెల్లించాలంటూ కండిషన్ విధించాడు. లేదంటే ఉత్పత్తిని ఆపేస్తానని హెచ్చరించాడు. క్రెమ్లిన్ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు, రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. యూరోపియన్ దేశాల కరెన్సీ విశ్వసనీయతపై ప్రభావవంతంగా ఒక గీతను గీయడం, ఆ కరెన్సీల నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా.. తన దారికి తెచ్చుకోవాలన్నది పుతిన్ ఫ్లాన్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యూరోలు, డాలర్లకు బదులు.. రష్యన్ రూబుల్స్లోనే రష్యన్ గ్యాస్ కోసం చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా ఈ షరతు పుతిన్కు పెద్ద అడ్వాంటేజే. ఒకవేళ ఈ షరతు.. రష్యాకు మునుముందు ఇబ్బందికరంగా గనుక మారితే వెంటనే ఎత్తేసే ఆలోచనలోనూ పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ మొత్తం 90 శాతం సహజ వాయువుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. కరెంట్ తయారీకి, ఇళ్ల వెచ్చదనానికి, పరిశ్రమల కోసం ఈ గ్యాస్లనే ఉపయోగించుకుంటున్నాయి. అందులో 40 శాతం ఉత్పత్తి రష్యా నుంచి కావడంతోనే.. ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూబుల్ ఎలా ఉంటుందో తెలీదు ఇదిలా ఉంటే పుతిన్ రూబుల్ షరతుపై యూరోపియన్ యూనియన్ దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. ‘నాకు తెలిసి యూరప్లో.. ఏ దేశానికీ రష్యా రూబుల్ ఎలా ఉంటుందో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రూబుల్స్లో ఎలా చెల్లిస్తారు?’ అని స్వోవేనియా ప్రధాని జనెజ్ జన్సా అంటున్నారు. జర్మన్ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి తదితరులు కూడా ఇవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్జియం లాంటి దేశం.. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పుతిన్ గనుక ఇదే ధోరణితో ముందుకు వెళ్తే గనుక.. కాంట్రాక్ట్ ఉల్లంఘనల కింద చర్యలకు దిగుతామని కొన్ని దేశాలు చెబుతున్నాయి. చదవండి: పుతిన్ పక్కన కూర్చోవడమా? నా వల్ల కాదు! -
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగకపోవడానికి అదే కారణమా..?
యుద్ధ మేఘాలు ఎంతగా కమ్ముకున్నా ఉక్రెయిన్పై రష్యా ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగకపోవడానికి సహజ వాయువు అంశం కూడా ఒక ముఖ్య కారణంగా కన్పిస్తోంది. యూరప్కు అతి పెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యానే. యూరప్ గ్యాస్ అవసరాల్లో 40 శాతానికి పైగా తీరుస్తోంది. యూరప్ ఏటా సుమారు 237 బిలియన్ క్యుబిక్ మీటర్ల (బీసీఎం)కు పైగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంటే 2012లో 168 బీసీ ఎం గ్యాస్ను ఒక్క రష్యానే సరఫరా చేసింది. ముఖ్యంగా జర్మనీకి 60 శాతం దాకా గ్యాస్ రష్యా నుంచే అందుతోంది. ఇక మధ్య, తూర్పు యూరప్లోని పలు దేశాలు తమ గ్యాస్ అవసరాల్లో 90 శాతానికి పైగా రష్యా మీదే ఆధారపడ్డాయి! బాల్టిక్ సముద్రం గుండా జర్మనీ దాకా సాగే నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ద్వారా యూరప్కు ఏటా 55 బీసీఎం గ్యాస్ను రష్యా సరఫరా చేస్తోంది. టర్క్ స్ట్రీమ్ లైన్ల ద్వారా మరో 33 బీసీఎం సరఫరా చేస్తోంది. 110 కోట్ల డాలర్ల ఖర్చుతో తలపెట్టిన కీలకమైన నోర్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్టు పూర్తియితే జర్మనీకి సరఫరాలను రెండింతలు చేయడం రష్యాకు వీలవుతుంది. యూరప్కు చుక్కలే ఈ శీతాకాలంలో యూరప్ తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధమే వస్తే గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయి యూరప్ దేశాలు అల్లాడతాయి. ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే అవకాశమున్నా దూరాభారం తదితరాలన్నీ కలిసి ధరలు చుక్కలను తాకే ప్రమాదముంది. ఎందుకంటే పెరిగిన డిమాండ్తో యూరప్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఇప్పటికే ఏకంగా 8 రెట్లు పెరిగింది. 2021లో మెగావాట్కు 19 యూరోలుగా ఉన్నది కాస్తా 80 యూరోలైంది. యుద్ధమే వస్తే రష్యా నుంచి సరఫరా ఆగిపోతుంది. యూఎస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తే కనీసం మరో మూడు రెట్లు అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. చదవండి: (ఇంకా యుద్ధ మేఘాలే) యూరప్ దేశాలకు ఇది తలకు మించిన భారమే. మరోవైపు యూరప్కు గ్యాస్ సరఫరాను పూర్తిగా ఆపేస్తే రష్యాకు రోజుకు కనీసం 100 కోట్ల డాలర్లకు పైగా నష్టమని అంచనా. పైగా ఒప్పందాలను ఉల్లంఘించినందుకు చెల్లించాల్సి వచ్చే భారీ జరిమానాలు అదనం. అందుకే యుద్ధాన్ని ఎలాగైనా నివారించేందుకు అటు యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటు రష్యా కూడా పైకి దూకుడు ప్రదర్శిస్తున్నా యుద్ధానికి దిగే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా, నాటో కూటమి నుంచి నయానో భయానో తను ఆశించిన హామీలను రాబట్టుకునే ప్రయత్నమే చేస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పెట్రోనెట్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
రష్యా సహజవాయువు సరఫరా ఆపేస్తే?
ఉరిమి ఉరిమి ఎక్కడో పడిందని.. రష్యా, అమెరికా పంతాలకు పోవడం తమకు చేటు తెస్తుందని సన్నకారు యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్ వంకతో అమెరికా ఆంక్షలు పెంచితే ప్రతిగా రష్యా సహజవాయువు సరఫరా నిలిపివేయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలకు నిరసనగా యూరప్కు రష్యా మొత్తం గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? అలాంటప్పుడు యూరప్లో ఇంధన సంక్షోభం తప్పదా? చూద్దాం.. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తే తమకు ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాపై యూఎస్ ఆంక్షలు తీవ్రతరం చేస్తుందని, ఇందుకు ప్రతిగా యూరప్కు సరఫరా అయ్యే సహజవాయువును రష్యా నిలిపివేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్ దేశాలు సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి, యూరప్ సహజవాయు అవసరాల్లో మూడింట ఒక వంతు రష్యా సరఫరా తీరుస్తోంది. పైగా ప్రస్తుతం యూరప్ వద్ద సహజవాయు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తాము ఎగుమతి చేస్తామని అమెరికా యూరప్కు హామీ ఇస్తోంది. అయితే రష్యా నుంచి సరఫరా అయినంత సులభంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో యూరప్లో ఇంధన సంక్షోభ భయాలు పెరుగుతున్నాయి. గతేడాది శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో యూరప్లోని సహజవాయు నిల్వలు చాలావరకు ఖర్చయ్యాయి. పలు దేశాల్లో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తక్కువగా ఉంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి తమను అంధకారంలోకి నెట్టవచ్చని పలు చిన్నాచితకా యూరప్ దేశాలు భయపడుతున్నాయి. పూర్తి నిలుపుదల సాధ్యం కాదా? ఆంక్షలను వ్యతిరేకిస్తూ రష్యా సహజవాయు సరఫరా నిలిపివేయాలనుకున్నా, పూర్తి ఎగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు గ్యాస్ ఎగుమతుల వల్ల చాలా ఆదాయం వస్తోంది. ఇటీవలే ఆ దేశం చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయినా యూరప్ నుంచే రష్యాకు అధికాదాయం లభిస్తోంది. అలాంటప్పుడు పూర్తిగా యూరప్కు ఎగుమతి ఆపితే అది తిరిగి రష్యా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. గతేడాది యూరప్కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ను సరఫరా చేసింది. ఇందులో పావుభాగాన్ని పైప్లైన్స్ ద్వారా పంపింది. ఆంక్షలు ముమ్మరమైతే ఉక్రెయిన్ నుంచి వెళ్లే పైప్లైన్ సరఫరాను మాత్రం రష్యా నిలిపివేయవచ్చని యూఎస్ మాజీ దౌత్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా జర్మనీపై ప్రభావం చూపుతుంది. అప్పుడు జర్మనీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ గుండా గ్యాస్ను సరఫరా చేసేందుకు ముందుకువస్తుందని, ఇది యూఎస్కు మరింత కోపాన్ని తెప్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సాయం ప్రపంచంలో అత్యధిక సహజవాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికా, గ్యాస్ ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉంది. కానీ యూరప్కు అమెరికా సాయం పరిమితంగానే ఉండవచ్చని నిపుణుల అంచనా. రష్యా సరఫరాలను మించి యూరప్కు అమెరికా గ్యాస్ను పంపాలన్నా భౌగోళిక ఇబ్బందులున్నాయి. అందువల్ల ప్రస్తుతం కన్నా కొంతమేర ఎగుమతులను పెంచడం మాత్రమే యూఎస్ చేయగలదు. అందుకే ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, ఆసియాల్లోని తన మిత్రపక్షాల నుంచి యూరప్కు సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పేద దేశాలకు ఎగుమతి చేసే నిల్వలను అధిక ధరల ఆశ చూపి యూరప్కు మరలిస్తోంది. ఉక్రెయిన్ పైప్లైన్ సరఫరాను రష్యా నిలిపివేస్తే యూరప్ దేశాలకు రోజుకు 1.27 షిప్పుల గ్యాస్ను యూఎస్ అదనంగా అందించాల్సిఉంటుంది. యూరప్కు సరఫరా పెంచితే స్వదేశంలో కొరత ఏర్పడవచ్చని కొందరు అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఇప్పటికే పరోక్షంగా గ్యాస్ సరఫరాను నియంత్రిస్తోందని, అందుకే మార్కెట్లో సహజవాయువు ధర పెరుగుతోందని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే చాలారోజులుగా యూరప్ దేశాల్లో ఇంధన బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రజలపై పడకుండా చూసేందుకు పలు దేశాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచాలని అమెరికా యత్నిస్తోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయా? రష్యా నిజంగానే గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? తేలాలంటే ఉక్రెయిన్ పీటముడి వీడాల్సిఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీఎస్టీలోకి గ్యాస్..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ లక్ష్యమైన గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి.. సహజ వాయువును జీఎస్టీ కిందకు తీసుకురావాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. దేశ ఇంధన బాస్కెట్లో సహజవాయవు వాటాను పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్ఐపీఐ) కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఈ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. పైపులైన్ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు, దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ఆధారిత రీగ్యాసిఫికేషన్పై జీఎస్టీని తగ్గించాలని కోరింది. అప్పుడు పర్యావరణ అనుకూల ఇంధన ధరలు తగ్గుతాయని బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతిపత్రంలో కోరింది. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి చేర్చాలన్నది ప్రధాని లక్ష్యంగా ఉంది. -
Budget 2022: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..!
భారత్ను గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పురోగతిని సాధించేందుకుగాను నేచురల్ గ్యాస్ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోలియం ఇండస్ట్రీ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేచురల్ గ్యాస్ జీఎస్టీ పరిధికి వెలుపల ఉంది. ఈ ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు వర్తిస్తాయి. జీఎస్టీ పరిధిలోకి..! ఆర్థిక మంత్రిత్వ శాఖకు తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (FIPI), పర్యావరణ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి పైప్లైన్ ద్వారా సహజ వాయువు రవాణాపై అలాగే దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ తిరిగి గ్యాసిఫికేషన్పై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. దేశంలో ప్రాథమిక ఆయిల్ వ్యవస్థలో సహజవాయువు వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచాలనుకున్న లక్ష్యాలు నేరవేరాలంటే కచ్చితంగా నేచురల్ గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆశించింది. నేచురల్ గ్యాస్పై పలు రాష్ట్రాలు 24.5 శాతం నుంచి 14 శాతం వరకు వ్యాట్ను విధిస్తోన్నాయి. నేచురల్ గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. COP-26 లక్ష్యాలే ..! 2030 నాటికి నేచురల్ గ్యాస్ వాటాను 6.2 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సహజ వాయువును ఎక్కువగా ఉపయోగించడంతో ఇంధన ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా భారీ ఎత్తున కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. COP-26 కట్టుబాట్లను చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది. చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..! -
గెయిల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 131 శాతం దూసుకెళ్లి రూ. 2,863 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,240 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 57 శాతం పురోగమించి రూ. 21,515 కోట్లకు చేరింది. నేచురల్ గ్యాస్ అమ్మకాలు టర్న్అరౌండ్ కావడం ఫలితాల మెరుగుకు దోహదపడింది. ఈ విభాగం రూ. 1,079 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించింది. అంతక్రితం క్యూ2లో రూ. 364 కోట్ల పన్నుకుముందు నష్టం ప్రకటించింది. గ్యాస్ పంపిణీ పన్నుకు ముందు లాభం సైతం రెట్టింపై రూ. 363 కోట్లను అధిగమించింది. గ్యాస్ పంపిణీ 107.66 ఎంఎంఎస్సీఎండీ నుంచి 114.32 ఎంఎంఎస్సీఎండీకి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 149 వద్ద ముగిసింది. -
భారత్లో అవకాశాలను సొంతం చేసుకోండి
న్యూఢిల్లీ: భారత్లో సహజవాయువు, చమురు అన్వేషణ అవకాశాలను సొంతం చేసుకోవాలంటూ అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వనం పలికారు. చమురు, గ్యాస్ రంగంలో అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలకు భారత్తో చేతులు కలపాలని కోరారు. అంతర్జాతీయ చమురు కంపెనీల సీఈవోలు, ఈ రంగానికి చెందిన నిపుణులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇంధన వనరుల పెంపు, అందుబాటు ధరలు, ఇంధన భద్రత దిశగా భారత్ చేపట్టిన చర్యలను పరిశ్రమకు చెందిన వారు మెచ్చుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి వారికి ప్రధాని వివరంగా తెలియజేసినట్టు ప్రకటించింది. ఈ రంగంలో భారత్ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ సంస్కరణల లక్ష్యమని తెలియజేసినట్టు.. ముడి చమురు నిల్వ సదుపాయాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రస్తావించినట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న గ్యాస్ అవసరాలను తీర్చేందుకు వీలుగా గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, పట్టణ గ్యాస్ పంపిణీ, ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు చర్యలను వారికి తెలియజేసినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. -
సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుంటే మరోపక్క ఎల్పీజీ గ్యాస్, వంట నూనె వంటి నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడు బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, సామాన్యులపై వచ్చే నెలలో మరో భారం పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. వచ్చే నెల అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు ఏకంగా 57 - 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!) ఒకవేల గ్యాస్ సిలిండర్ ధరలు నిజంగానే పెరిగితే ఇక వాటిని కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ నియమాల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి నేచురల్ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంది. అయితే, ఈ సమీక్షలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే వచ్చే నెలలో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర మీ.మీ.బీ.టీ.యుకు 1.79 డాలర్గా ఉంటే ఇది వచ్చే నెల 3 డాలర్ల పైకి పెరగవచ్చు అనే అంచనాలున్నాయి. విదేశీ మార్కెట్లో నేచురల్ గ్యాస్ ధర సెప్టెంబర్ 8న ఒక్క రోజే 8 శాతం పెరిగింది. -
రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్’ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ నాటికి.. మేఘా గ్యాస్ 7 జియోగ్రాఫికల్ ఏరియాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్లో మొత్తం 250 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ పి.వెంకటేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!
బీజింగ్ : సాధారణంగా ఎప్పుడైనా మంటలు అంటుకుంటే నీళ్లు పోసి ఆర్పడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నీళ్లతో మంటలు వస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో కుళాయి తిప్పగానే ఒక వ్యక్తి నీళ్ల దగ్గర ఒక లైటర్ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా నీటికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు స్థితికి చేరుకుంది. కాగా వీడియోను పీపుల్స్ డెయిలీ తన ట్విటర్లో షేర్ చేయడంతో చూసినవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. నీళ్లలో మంటలా ఇదెలా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు. చైనాకు చెందిన వెన్ అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయని వెన్ తెలిపింది. కేవలం మా ఇంట్లో మాత్రమే కాదు.. ఇక్కడున్న దాదాపు వంద ఇళ్లలో తరచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం అని పేర్కొంది. కాగా వీడియోపై అక్కడి జలవనరులశాఖ అధికారులు స్పందించారు. 'వాస్తవానికి గ్రామాన్ని మొత్తం అండర్గ్రౌండ్ వాటర్తో కనెక్టివిటీ చేశాం. ఆ సందర్భంలో ఒక దగ్గర నేచురల్ గ్యాస్కు సంబంధించిన పైప్లైన్ పగిలి కొద్దిపాటి గ్యాస్ లీకై అండర్గ్రౌండ్ వాటర్తో కలిసిపోయింది. దీంతో ఇలా తరచుగా నీళ్లకు మంటలు అంటుకుంటున్నాయని అసలు విషయం బయటపెట్టారు. కాగా ప్రస్తుతం నీళ్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి మరమత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Videos of flammable tap water in Panjin, NE China's Liaoning have gone viral. The odd scene is caused by natural gas infiltration due to temporary underground water supply system error, which is now shut down. Normal supply has resumed. Further probe will be conducted: local govt pic.twitter.com/a5EOA5SATU — People's Daily, China (@PDChina) November 24, 2020 -
సహజ వాయువుపై పన్ను పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ముడి చమురు పై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.(చదవండి: పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన భార్య) కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 2020 నెలకు 4480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
దశాబ్ద కనిష్టానికి గ్యాస్ రేటు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ధర దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. గ్యాస్ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను బట్టి చూస్తే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) ధర 1.9–1.94 డాలర్ల స్థాయికి తగ్గొచ్చని, ఇది దశాబ్దంపైగా కనిష్ట స్థాయి. అక్టోబర్1న జరిగే గ్యాస్ ధర సమీక్షలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ఎరువులు, విద్యుదుత్పత్తితో పాటు వాహనాల్లో సీఎన్జీగా, వంట గ్యాస్ అవసరాల కోసం ఉపయోగపడే గ్యాస్ రేటును ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఓఎన్జీసీకి కష్టకాలం.. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లను ప్రామాణికంగా తీసుకుని 2014 నవంబర్లో ప్రభుత్వం కొత్తగా గ్యాస్ ఫార్ములాను ప్రవేశపెట్టినప్పట్నుంచీ దేశీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్పై ఓఎన్జీసీ నష్టాలు చవిచూస్తోంది. బ్రేక్ ఈవెన్ రేటు (లాభ నష్టాలు లేని ధర) 5–9 డాలర్లుగా ఉంటోందని, ప్రస్తుతం నిర్ణయించిన 2.39 డాలర్ల ధర గిట్టుబాటు కాదంటూ కేంద్రానికి ఓఎన్జీసీ ఇటీవలే తెలిపినట్లు సమాచారం. గతంలో గ్యాస్ విభాగంలో నష్టాలను చమురు విభాగం ద్వారా ఓఎన్జీసీ కాస్త భర్తీ చేసుకోగలిగేది. కానీ ప్రస్తుతం చమురు వ్యాపారం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండడం కంపెనీకి ప్రతికూలాంశం. -
అదానీ గ్యాస్తో ఫ్రెంచ్ దిగ్గజం డీల్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ గ్యాస్లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీలో 37.4 శాతం వాటా కొనుగోలుకి ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఎస్ఏ అంగీకరించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం మొత్తం విలువను వెల్లడించలేదు. ఈ మేరకు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ సమాచారం అందించడంతో అదానీ గ్యాస్ లిమిటెడ్ కౌంటర్లో కొనుగోళ్ల జోరందుకుంది. 10శాతం లాభంతో 151 వద్ద ముగిసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీపీ, పీఎల్సి, షెల్ తరువాత దేశీయ గ్యాస్ రంగంలోకి ప్రవేశించిన మూడవ విదేశీ చమురు మేజర్ టోటల్ ఎస్ఏ. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 25.2 శాతం ఈక్విటీ షేర్లను అదానీ నుండి కొనుగోలు చేయడానికి ముందు టెండర్ ఆఫర్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే 10 సంవత్సరాలలో గ్యాస్ పంపిణీని భారతీయ జనాభాలో 7.5 శాతం, పారిశ్రామిక, వాణిజ్య, దేశీయ వినియోగదారులకు మార్కెట్ చేస్తుంది, 6 మిలియన్ల గృహాలను లక్ష్యంగా చేసుకుని 1,500 రిటైల్ అవుట్లెట్ల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. భారతదేశంలో సహజవాయువు మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధ్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లేయర్ టోటల్, భారతదేశంలో అతిపెద్ద ఇంధన, మౌలిక సదుపాయాల సమ్మేళనం అదానీ గ్రూపుతో తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు టోటల్ చైర్మన్ , సీఈవో సిఇఒ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశంలో తమ అభివృద్ధి వ్యూహానికి మూలస్తంభం లాంటిదన్నారు. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో నేచురల్ గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నసంగతి తెలిసిందే. -
రుణభారం తగ్గించుకోడానికి కసరత్తు: కంట్రీక్లబ్
ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని బేగంపేట్, కర్ణాటకలోని సర్జాపూర్ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ (సీసీహెచ్హెచ్ఎల్) చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి వెల్లడించారు. వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్మెంట్ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140 కోట్ల దాకా లభించగలవని ఆయన చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా తమ రుణభారం రూ. 275 కోట్లని, రూ.1,500 కోట్ల మేర ఆస్తులున్నాయని చెప్పారాయన. -
దేశీయ సహజవాయువు ధర 10 శాతం పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరను 10 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో గ్యాస్ ఆధారిత విద్యుత్, ఎరువుల తయారీ వ్యయాలు పెరిగి అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీయనుంది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధరను అక్టోబర్ 1 నుంచి 3.36 డాలర్లకు పెంచింది. ఇది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇది 3.06 డాలర్లుగా ఉంది. అమెరికా, రష్యా, కెనడా దేశాల్లో సగటు ధరను ఆధారంగా చేసుకుని ప్రతీ ఆరు నెలలకు ప్రభుత్వం దేశీయంగా ధరలను నిర్ణయిస్తుంటుంది. మన దేశ గ్యాస్ అవసరాల్లో సగం మేర దిగుమతి చేసుకుంటున్నాం. దీని ధర దేశీయ గ్యాస్ ధర కంటే రెట్టింపు ఉంటోంది. ధరల పెంపుతో ఓఎన్జీసీ, రిలయన్స్ ఆదాయాలు పెరగనున్నాయి. క్లిష్టమైన ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను సైతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 6.78 డాలర్ల నుంచి 7.67 డాలర్లు చేసింది. -
కుంగుతున్న‘ధాన్యాగారం’
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా – గోదావరి బేసిన్... 23 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలతో కళకళలాడే అన్నపూర్ణ... రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే కంచం. ఇప్పుడా కంచం మెల్లమెల్లగా కుంగుతోంది. గోదావరి బేసిన్లో విచక్షణారహితంగా సహజవాయువు నిక్షేపాల తవ్వకాలతో డెల్టా అంతకంతకూ కిందకు జారుతోంది. 20 ఏళ్లలో ఏకంగా అడుగున్నర నుంచి 5అడుగుల వరకు భూమి కుంగిందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ... పంటలను దెబ్బతిస్తూ... భవిష్యత్లో ఆహార, తాగునీటి కొరత దుస్థితిని కలిగిస్తూ పెనుప్రమాదం ముంచుకొస్తోంది. అయినా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎందుకు కుంగుతోందంటే... భూగర్భంలో భారీగా గడ్డకట్టి ఉండే రాతి పొరల కింద సహజవాయువు ద్రవరూపంలో నిక్షిప్తమై ఉంటుంది. సున్నపురాయి, ఇసుకరాయి అనే రెండు రకాల రాళ్లు భూగర్భంలో ఉంటాయి. సున్నపురాతి పొరల కింద ఉండే సహజవాయువును వెలికితీస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. సున్నపురాతి గుట్టలు తమంతటతాముగా సర్దుబాటు చేసుకుంటాయి. రాష్ట్రంలో గోదావరి బేసిన్ భూగర్భంలో 3కి.మీ. నుంచి 4కి.మీ. లోపల ఇసుకరాతి గుట్టల పొరల్లో సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. భూగర్భంలోని ఇసుకరాతిలో జియో స్టాటిక్ ప్రెషర్ అనే ఒత్తిడి ఉంటుంది. ఇసుకరాతి పొరల్లో ద్రవరూపంలో ఉండే సహజవాయువులో హైడ్రో స్టాటిక్ ప్రెషర్ అనే ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్లు భూ ఉపరితలాన్ని మోస్తూ ఉంటాయి. సహజవాయువును వెలికితీసినప్పుడు హైడ్రో స్టాటిక్ ప్రెషర్ తొలగిపోయి ఖాళీ ఏర్పడుతుంది. ఫలితంగా భూఉపరితలం కిందకు కుంగుతుంది. 20 ఏళ్లలో అడుగున్నర నుంచి 5 అడుగులు కుంగింది... 20 ఏళ్లలో డెల్టాలో అడుగున్నర నుంచి 5 అడుగుల వరకు కుంగిందని ప్రొఫెసర్ కృష్ణారావు అధ్యయనంలో వెల్లడైంది. తీరం నుంచి 20కి.మీ. వరకు ఈ పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం వెయ్యి మీటర్లు భూగర్భంలోకి తవ్వితే వంద కేజీ సెంటీమీటర్ల ఒత్తిడి ఉంటుంది. గోదావరి బేసిన్లో దాదాపు 4కి.మీ. వరకు తవ్వుతున్నారు. అంటే అక్కడ దాదాపు 400 కేజీ సెంటీమీటర్ల ఒత్తిడి ఉంటుంది. అక్కడ ఉన్న సహజవాయువును తీసివేయడంతో ఆమేరకు భూమి కుంగుతోంది. ఒక్కో చమురు బావిలో తవ్వకాల ప్రభావం ఆ పరిసరాల్లో కొన్ని చ.కి.మీ. వరకు ఉంటుంది. ఇవిగో తార్కాణాలు... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి గుంటూరు జిల్లా బాపట్ల వరకు భూమి కుంగుతున్న ప్రభావం కనిపిస్తోంది. కాకినాడ– భీమవరం ఇది మరింత ఎక్కువుగా ఉంది. ఆ ప్రాంతంలో భూ ఉపరితలం ఒకప్పుడు సముద్ర మట్టానికంటే 3అడుగుల నుంచి 7అడుగుల వరకు ఎత్తులో ఉండేది. ప్రస్తుతం దాదాపు సరిసమానం కావడంతో సముద్రం తరచూ భూమిపైకి చొచ్చుకు వచ్చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, ఉప్పాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని బొండాడ, సఖినేటిపల్లి, నరసాపురం, మొగల్తూరు, పి.గన్నవరం మొదలైన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువుగా ఉంది. 1986లో వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 23.60 అడుగలకు నీటిమట్టం చేరితే పశ్చిమ గోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్పై నుంచి వరదనీరు పారింది. కానీ 2009 వరదల సమయంలో ధవళేవ్వరం బ్యారేజీ వద్ద 19అడుగులకు నీరు చేరగానే పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్పైకి నీరు చేరింది. అంటే ఆ ప్రాంతంలో భూమి నాలుగు అడుగల వరకు కుంగిందనే విషయం నిర్ధారణ అవుతోందని ప్రొఫెసర్ కృష్ణారావు చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే పదేళ్లలో సముద్ర మట్టం కంటే భూ ఉపరితలం కిందకు దిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా విధానం ఆదర్శం కావాలి అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా భూగర్భంలో ఇసుక రాతి పొరల్లో ఉన్న సహజవాయువును వెలికితీస్తున్నారు. అయితే అక్కడ సహజవాయువును వెలికితీయగానే... ఎక్కువ పీడనంతో నీటిని ఆ ఇసుకరాతి పొరల్లోకి పంపి హైడ్రో స్టాటిక్ ప్రెషర్ తగ్గకుండా చేస్తున్నారు. ఫలితంగా భూ ఉపరితలం కుంగడం లేదు. మన ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మేల్కోనకపోతే వినాశనమే: ప్రొఫెసర్ జి.కృష్ణారావు, శాస్త్రవేత్త ‘విచక్షణారహితంగా సహజవాయువు వెలికితీయడంతో డెల్టాలో భూమి అంతకంతకూ కుంగుతూ ముప్పు ముంచుకొస్తోంది. దీనిపై 1998లోనే అప్రమత్తం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా శాస్త్రీయంగా తగిన నివారణ చర్యలు చేపట్టకుపోతే భవిష్యత్ తరాలకు తీవ్రహాని చేసినవారమవుతాం.’ శాస్త్రవేత్తల సూచనను పట్టించుకోని చంద్రబాబు విచక్షణారహితంగా సహజవాయు నిక్షేపాల వెలికితీతపై శాస్త్రవేత్తలు, కృష్ణా– గోదావరి డెల్టా పరిరక్షణ సమితి మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నాయి. 1998లోనే ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ) భూవిజ్ఞాన విభాగం ప్రొఫెసర్ జి.కృష్ణారావు దీనిపై లేఖ రాసినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై డెల్టా పరిరక్షణ సమితి ఆందోళనలు నిర్వహించీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. దాంతో ఓఎన్జీసీ ఏయూకు చెందిన డెల్టా స్టడీస్ విభాగంతో పరిశోధనలు నిర్వహించింది. మరోవైపు రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారావు నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం కూడా అధ్యయనం కొనసాగించింది. ఆరు నెలల పాటు పరిశోధనలు నిర్వహించిన డెల్టా స్టడీస్ విభాగం 2017లో నివేదిక సమర్పించింది. ఇవీ నష్టాలు – 23లక్షల ఎకరాల ఆయకట్టుతో రాష్ట్రానికి ధాన్యాగారంగా ఉన్న గోదావరి–కృష్ణా డెల్టాకు పెనుముప్పు వాటిల్లుతోంది. – సముద్రం తీరప్రాంతాన్ని దాటి భూమిపైకి చొచ్చుకు వస్తే వేలాది ఎకరాలు మునిగిపోతాయి. మరెన్నో భూములు ఉప్పునీటి కయ్యలుగా మారిపోతాయి. ఫలితంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. – భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సముద్రతీరానికి 20కి.మీ.వరకు బావులు తవ్వుతుంటే ఉప్పునీరే వస్తోంది. – నదులు, కాలువల్లో నీటి ప్రవాహ వేగం బాగా తగ్గిపోయి ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరిగా అందదు. – తీరప్రాంతానికి సమీపంలో నిర్మించే రోడ్లు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి. -
జీఎస్టీలోకి సహజవాయువు, ఏటీఎఫ్?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్), సహజవాయువు(సీఎన్జీ)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ వారంలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో పరిశీలించనున్నారు. గతేడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ను మాత్రం దీన్నుంచి మినహాయించారు. జీఎస్టీలోకి చేరిస్తే కేంద్ర, రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో మినహాయించారు. అయితే, సహజవాయువు, ఏటీఎఫ్ను జీఎస్టీలోకి తీసుకురావడం అనుకూలమేనన్న ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 21న జరిగే సమావేశంలో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం జీఎస్టీలో గరిష్ట పన్ను రేటు 28గా ఉంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ను ఈ శ్లాబులోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రాల పన్నులు కలిపి ఏటీఎఫ్పై 39–44 శాతం స్థాయిలో ఉన్నాయి. జీఎస్టీ రేటుకు అదనంగా రాష్ట్రాలు వ్యాట్ను లెవీగా విధించుకునే అవకాశం కల్పించడమే మార్గమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సహజవాయువు విషయంలోనూ ఇబ్బంది ఉంది. జీఎస్టీలో చేర్చి 12 శాతం పన్ను రేటు విధిస్తే ఆదాయ లోటును ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 18 శాతం విధిస్తే విద్యుత్తు, ఎరువుల పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. -
ఇక ‘కుకింగ్’ సబ్సిడీ..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సబ్సిడీ స్థానంలో కుకింగ్ సబ్సిడీని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. పైపుల ద్వారా సహజవాయువును వినియోగించేవారు, వంట కోసం బయో ఇంధనాలను వినియోగించే వారికీ సబ్సిడీ ప్రయోజనాలను విస్తరించాలనే ఆలోచనే ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. వంట కోసం వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ ప్రయోజనాలు వర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్పీజీ వినియోగదారులకే సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ‘‘వంటకు వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ వర్తించాలి. ఎందుకంటే కొన్ని పట్టణాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా జరుగుతోంది. అందుకే సబ్సిడీని వారికి కూడా అందించడమే సరైనది’’ అని కుమార్ పేర్కొన్నారు. సబ్సిడీని కేవలం ఎల్పీజీకే పరిమితం చేయడం అన్నది చౌక ఇంధనాలు, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఇంధనాలు, పట్టణాల్లో పీఎన్జీ (పైపుల ద్వారా సహజవాయువు) వినియోగాన్ని నిరుత్సాహపరిచే చర్యగా వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కుకింగ్ సబ్సిడీ ప్రతిపాదన ‘నేషనల్ ఎనర్జీ పాలసీ 2030’ ముసాయిదాతో వెల్లడైంది. గత వారమే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలతో ఎదురయ్యే ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ 7–7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఆమర్థ్యసేన్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి... ప్రముఖ ఆర్థిక వేత్త ఆమర్థ్యసేన్ కొంత కాలం పాటు దేశంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని రాజీవ్ కుమార్ సూచించారు. మోదీ సర్కారు పనితీరును ఆమర్త్యసేన్ తప్పుబట్టిన నేపథ్యంలో కుమార్ ఇలా స్పందించడం గమనార్హం. ‘‘ప్రొఫెసర్ ఆమర్థ్యసేన్ కొంత సమయాన్ని భారత్లో వెచ్చించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఆ విధమైన ప్రకటనలు చేసే ముందు గడిచిన నాలుగేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పనులను సమీక్షించాలి’’ అని కుమార్ పేర్కొన్నారు. -
జీఎస్టీ పరిధిలోకి గ్యాస్..?
సాక్షి, న్యూఢిల్లీ: సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ప్రయోగాత్మక ప్రతిపాదనను చర్చించనుందని జీఎస్టీ జాయింట్ సెక్రటరీ ధీరజ్ రాస్తోగి శుక్రవారం వెల్లడించారు. జీఎస్టీ వర్క్షాపులో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు, సహజ వాయువు, విమానయాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ లాంటి ఐదు వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేనున్నామన్నారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) సహా అయిదు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని ధీరజ్ రస్తోగి ప్రకటించారు. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నాటికి ఇందులో లాభనష్టాలను బేరీజు వేసుకుని కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ముందుగా పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేఅవకాశం ఉందన్నారు. అయితే ఈ పక్రియ అమలుకు ఏలాంటి గడువును ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో గ్యాస్ ధర తగ్గే అవకాశముందనీ, త్వరలోనే ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. -
రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర?
న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి. -
జిల్లాలో సహజవాయు నిక్షేపాలు?
–ఏడాది కాలంగా ఓఎన్జీసీ అన్వేషణ – ఆత్మకూరు పట్టణ శివార్లలో పరిశోధనలు ఆత్మకూరురూరల్: కర్నూలు జిల్లాలో చమురు, సహజవాయు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయా? బొగ్గు నిక్షేపాలు కూడా ఉండవచ్చా? ఈ ప్రశ్నలకు త్వరలో సమాధానమిచ్చేందుకు చమురు సహజవాయు సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కర్నూలు జిల్లా తూర్పు భాగమైన ఆత్మకూరు మొదలుకుని మహానంది, పాణ్యం, ఓర్వకల్ మండలాల పరిధిలో భారీ మొత్తంలో చమురు సహజవాయు నిక్షేపాలు ఉండవచ్చని ఇటీవల ఉపగ్రహ సమాచారం మేరకు ఓఎన్జీసీఓ నిర్ధారణకు వచ్చింది. సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు పలు బృందాలను రంగంలోకి దించింది. తొలుత ఈ ప్రాంతంలో హెలికాప్టర్ సహాయంతో çసర్వే జరపగా ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తూ వివిధ బృందాలు తమ సర్వేను కొనసాగిస్తున్నాయి. ఆత్మకూరు పట్టణ శివార్లలోని సాధుల మటం పరిసరాల్లో మంగళవారం ఓఎన్జీసీ సర్వేయర్ల బృందం సర్వే చేస్తూ కనిపించింది. ఈ ప్రాంతంలో కొన్ని పాయింట్లను గుర్తించిన ఈ బృందం ఆ కేంద్రాలపై సూచికలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆధునిక పరికరాలను ఉంచి భూగర్భంలో ఉండే సహజవాయు, బొగ్గు నిక్షేపాల సాంధ్రతను నమోదు చేస్తున్నారు. భూమిలో ఎంత లోతులో ఈ నిక్షేపాలున్నాయి. వాటిని తవ్వితే పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందా లేదా అన్న అంశాలపై ఓఎన్జీసీ సమగ్ర సమాచారాన్ని శాస్త్రీయ పద్ధతిలో సేకరిస్తోంది. ఇదిలా ఉండగా ఓఎన్జీసీ ప్రయోగాల ఫలితాల గురించి అక్కడి సర్వేయర్లను ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. -
సహజ వాయువు ధర 2.48 డాలర్లకు కట్
రెండేళ్లలో ధర తగ్గటం ఇది ఐదోసారి న్యూఢిల్లీ: సహజ వాయువు యూనిట్ (మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్– ఎంబీటీయూ) ధర స్వల్పంగా తగ్గి 2.48 డాలర్లకు చేరింది. ఇప్పటిదాకా ఈ రేటు యూనిట్కు 2.50 డాలర్లుగా ఉంది. కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్కు ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు ఈ ధర వర్తిస్తుంది. సహజ వాయువు ధరలు తగ్గినందువల్ల ముడి వనరు రేటు.. అంతిమంగా రిటైల్ ధర (గృహాలకు పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్, ఇతరత్రా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మొదలైనవి) తగ్గుతాయి. అలాగే విద్యుదుత్పత్తికి, ఎరువుల తయారీకి కూడా చౌకగా ముడివనరు లభిస్తుంది. కాగా గడిచిన రెండేళ్లలో గ్యాస్ రేటు తగ్గడం ఇది ఐదోసారి. 2014 అక్టోబర్లో కేంద్రం ఆమోదించిన ఫార్ములా ప్రకారం గ్యాస్ ధరలను ఆరు నెలలకోసారి సవరిస్తున్నారు. అప్పట్లో గ్యాస్ రేటు 4.66 డాలర్లుగా ఉండగా.. తాజాగా 2.48 డాలర్లకు తగ్గింది. 2016 అక్టోబర్ 1న చివరిసారిగా గ్యాస్ రేటు 18 శాతం తగ్గించారు. గ్యాస్ రేటు డాలరు తగ్గితే ఓఎన్జీసీ లాంటి ఉత్పత్తి కంపెనీలకు వార్షికంగా రూ. 4,000 కోట్ల మేర ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరోవైపు, సముద్ర లోతుల్లోని సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి వెలికితీసే ప్రత్యామ్నాయ ఇంధనాల ధరను మాత్రం యూనిట్కు 5.3 డాలర్ల నుంచి 5.56 డాలర్లకు పెంచుతున్నట్లు పీపీఏసీ తెలిపింది. -
సహజవాయువు ధర 8 శాతం పెంపు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధర 8 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రావచ్చని పరిశ్రమ వర్గాల సమాచారం. ఇక్కడి గ్యాస్ ధరకు ప్రామాణిక మార్కెట్లయిన యూఎస్ హెన్రీ హబ్ వంటి చోట్ల రేట్లు పెరగడమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో యూనిట్(ఎంఎంబీటీయూ) సహజ వాయువు ధర 2.5 డాలర్లగా ఉంది. ఇది 2.7 డాలర్లకు పెరగనుంది. ఇదే జరిగితే గడిచిన రెండేళ్లలో దేశీ గ్యాస్ రేట్లు పెరగడం ఇదే తొలిసారి అవుతుంది. మోదీ సర్కారు కొలువైన తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త ధరల విధానం ప్రకారం ప్రతి ఆర్నెల్లకు దేశీ సహజ వాయువు రేట్లను సవరించాల్సి ఉంటుంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం(2017–18, అక్టోబర్–మార్చి)లో కూడా రేట్లు పెరగవచ్చని.. యూనిట్కు 3.1 డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
20 శాతం తగ్గనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు ధరలు మరోసారి తగ్గనున్నాయి. అక్టోబర్1 నుంచి యూనిట్కు (ఎంబీటీయూ) 20 శాతం మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం 3.06 డాలర్ల నుంచి 2.45 డాలర్లకు దిగి రానున్నాయి. తగ్గించిన ధరలు అక్టోబర్ 1వ తేది నుంచే అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా గత 18 నెలలుగా ఇది నాలుగవ తగ్గింపు. 2014 లో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట ఫార్ములా ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. గత ఏప్రిల్ లో 3.82 డాలర్లనుంచి 3.06 డాలర్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ధరలు తగ్గనున్నాయి. ఈ పథకం అమలు తరువాత గ్యాస్ ధరలు దాదాపు 39 శాతం క్షీణించాయి.గత ఏడాది ప్రభుత్వం ఆమోదించిన ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే తాజాగా మార్పులు జరగనున్నాయి. -
మౌలిక రంగం మెరుపు..
♦ మార్చిలో 6.4 శాతం వృద్ధి ♦ 16 నెలల గరిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన కీలక మౌలిక రంగం మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తిలో 6.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2015 మార్చిలో ఈ పరిశ్రమల గ్రూప్ అసలు వృద్ధిని నమోదుచేసుకోకపోగా -0.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్లతో కూడిన ఈ మౌలిక రంగం ఉత్పత్తి వాటా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38 శాతం. మార్చి ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో వెలువడతాయి. తాజా సమీక్ష నెలలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తిలో మంచి ఫలితం నమోదయ్యింది. రంగాల వారీగా వేర్వేరుగా చూసే... దూసుకుపోయినవి... ♦ రిఫైనరీ ప్రొడక్టులు: 2015 మార్చి నెలలో ఈ రంగం -1.5 శాతం క్షీణతలో ఉంది. అయితే 2016 మార్చిలో భారీగా 10.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ♦ ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 5.2 శాతం నుంచి 22.9 శాతానికి ఎగసింది. ♦ స్టీల్: -6.5% క్షీణత నుంచి 3.4% వృద్ధికి మళ్లింది. ♦ సిమెంట్: ఈ రంగం కూడా -3.7 శాతం క్షీణత నుంచి 11.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ♦ విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 2 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా... ♦ కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) ఈ గ్రూప్ ఉత్పత్తి వార్షికంగా 4.5 శాతం నుంచి 2.7 శాతానికి పడింది. తయారీ రంగం... 4 నెలల కనిష్టానికి న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్లో 50.5 శాతానికి పడింది. కొత్త ఆర్డర్లు భారీగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. ఆర్బీఐ రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సూచీ సూచిస్తున్నట్లు మార్కిట్ ఎకనమిస్ట్ డీ లిమా పేర్కొన్నారు. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దానిని విస్తరణ దశగానే పరిగణించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. -
మెరిసిన మౌలిక రంగం
♦ ఫిబ్రవరిలో 5.7% వృద్ధిరేటు ♦ 15 నెలల గరిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్ ఫిబ్రవరిలో మంచి పనితనాన్ని కనబరిచింది. 2015 ఫిబ్రవరితో పోల్చిచూస్తే... 2016 ఫిబ్రవరి ఉత్పత్తిలో 5.7 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది 15 నెలల గరిష్ట స్థాయి. 2014 నవంబర్లో ఇది 6.7 శాతంగా ఉంది. ఎనిమిది రంగాల్లో సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, క్రూడ్ ఆయిల్, బొగ్గు, స్టీల్ రంగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక విభాగాల వాటా 38 శాతం. గత ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్ వృద్ధిరేటు 2.3 శాతం. కాగా ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-ఫిబ్రవరి) 11 నెలల కాలంలో రేటు ఐదు శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది. -
17% తగ్గనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి యూనిట్కు (ఎంబీటీయూ) 17 శాతం మేర తగ్గనున్నాయి. 3.82 డాలర్ల నుంచి 3.15 డాలర్లకు దిగి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా వర్తించేలా సవరించిన గ్యాస్ రేట్లను ప్రభుత్వం సత్వరం ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2014 అక్టోబర్లో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర ను ప్రతి ఆరు నెలలకోసారి సవరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే తాజాగా మార్పులు జరగనున్నాయి. -
జనవరిలో కీలక పరిశ్రమల వృద్ధి 2.9 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జనవరిలో 2.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గడచిన మూడు నెలల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఈ గ్రూప్లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ రంగాల వాటా 38 శాతం. మార్చి రెండవ వారం చివర్లో జనవరి ఐఐపీ ఫలితాలు వెలువడనున్నాయి. కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ కీలక గ్రూప్ వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. -
జ్వాలాముఖి
తెలుసుకుందాం జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలాదేవతల పేర్లు. జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ కొలువుదీరడాన్ని గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి, దేవతలను బాధించసాగారు. దేవతలంతా శ్రీమహావిష్ణువుకి మొరపెట్టుకోగా, విష్ణువు దేవతలందరినీ కలసి రాక్షసుల పీడ వదిలించడానికై ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవతలందరూ వారి వారి శక్తులను కొండమీదకి ప్రసరింపజేశారు. అందరి శక్తులు ఏకమై ఒక జ్వాల ఏర్పడింది. అందులో నుండి ఒక బాలిక జన్మించింది. ఆమే జ్వాలాముఖి. ఈ అమ్మవారిని సేవించడం వల్ల సర్వపాపాలూ తొలగి, సకల శుభాలు చేకూరతాయని విశ్వాసం. - బాచి -
ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’
► వార్షిక ప్రాతిపదికన నవంబర్ ఉత్పత్తిలో వృద్ధి శూన్యం... ► 1.3 శాతం క్షీణిత (మైనస్) నమోదు ► ఇదే నెల ఐఐపీ గణాంకాలపై ► ప్రతికూల ప్రభావం చూపే అవకాశం! న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి 2015 నవంబర్లో పూర్తి నిరాశను మిగిల్చింది. 2014 నవంబర్తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్)ను నమోదుచేసుకుంది. గడచిన ఏడు నెలల కాలంలో ఇంత దారుణమైన ఫలితం ఎన్నడూ రాలేదు (ఏప్రిల్లో 0.4 శాతం క్షీణత). మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. జనవరి రెండవ వారంలో వెలువడనున్న నవంబర్ ఐఐపీ ఫలితంపై తాజా ఫలితం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2014 నవంబర్లో గ్రూప్ ఉత్పత్తి రేటు 8.5 శాతం. 2015 అక్టోబర్లో 3.2%. కాగా 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 6 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన నవంబర్ గణాంకాల ప్రకారం 8 రంగాల పనితీరునూ వార్షిక రీతిన వేర్వేరుగా చూస్తే... క్షీణతలో... క్రూడ్ ఆయిల్: ఉత్పత్తి క్షీణత మరింత పెరిగింది. -0.1%క్షీణత మరింతగా-3.3% క్షీణతకు జారింది. సహజ వాయువు: ఈ రంగంలో కూడా -2.3 శాతం క్షీణత మరింతగా - 3.9 శాతానికి దిగింది. సిమెంట్: వృద్ధిలేకపోగా -1.8 శాతం క్షీణత నమోదయ్యింది. స్టీల్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా 8.4 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. వృద్ధి రేట్లు డౌన్... విద్యుత్: ఉత్పత్తి 9.9 శాతం నుంచి నిశ్చల స్థాయి (0 శాతం)కి చేరింది. బొగ్గు: వృద్ధి రేటు 14.6 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి 8.1 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. ఒకే ఒక్కటి... ఎరువులు: ఈ రంగం మాత్రం మంచి పనితీరు కనబరిచింది. 2.8 శాతం క్షీణత (మైనస్) 13.5 శాతం వృద్ధికి చేరింది. -
రూ.1,400 కోట్లతో న్యాచురల్ గ్యాస్ పైప్లైన్
► కృష్ణపట్నంపోర్టులో ప్రత్యేక బెర్తు ఏర్పాటు ► 2017లో పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా ముత్తుకూరు/చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా భారీ సహజ వాయువుల పైపులైను ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్ఎస్ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ సంస్థ రూ. 1,400 కోట్ల అంచనాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టులో ఎల్ఎన్జీ(లిక్విడ్ నాచురల్ గ్యాస్) బెర్తు నిర్మిస్తారు. ఇక్కడ నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకే కాకుండా ఇఫ్కో, శ్రీసిటీ, మేనకూరు సెజ్లు, తొట్టంబేడు, ఏర్పేడు, మాంబట్టు, గుమ్మడిపూడి, మనాలి పారిశ్రామికవాడలకు గ్యాస్ సరఫరా చేస్తారు. 2017లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నూరు, నెల్లూరు, కృష్ణపట్నం, సుళ్లూరుపేట, రేణిగుంట వరకు పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు. తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు ట్రక్కుల ద్వారా గ్యాస్ రవాణా జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో, జపాన్, చైనా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. రివర్బే గ్రూపు, కేఈఐ గ్రూపులు ఈ ఎల్ఎన్జీ భారత్ టెర్మినల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్యాస్ కొరతను తీరుస్తాం: మూర్తి కృష్ణపట్నం పోర్టులో తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో 5 ఎమ్ఎమ్టీపీఏ సామర్థ్యం ఉన్న ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజి యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్ఎస్ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ ఎండీ మూర్తి మంగళవారం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా విద్యుత్, ఎరువుల పరిశ్రమలకు గ్యాస్ను అందించే వీలుంటుందన్నారు. భారతదేశ గ్యాస్ మార్కెట్లో సుమారు 45 ఎంఎంఎస్సీ ఎండీ కొరత ఉందని, డిమాండ్కు తగ్గట్టుగా అందించడానికి కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఎన్ఎన్జీ స్టోరేజీ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారుగా 1.30 లక్షల ఎల్త్రీ ఎల్ఎన్జీని నిల్వచేసే ఒక ఎఫ్ఎస్యూ(నిల్వలతో తేలియాడే యూనిట్ షిప్)ను కృష్ణపట్నంలోని ప్రత్యేక జట్టీతో కలిపి ఉంచుతామన్నారు. దీనివలన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కాలుష్యం ఉండదని తెలిపారు. -
క్రీస్తుపూర్వమే వంటగ్యాస్..
చాలామంది వంటగ్యాస్ను ఆధునిక ఆవిష్కరణలలో ఒకటిగా భావిస్తారు గానీ, నిజానికి క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలోనే చైనాలో వంటగ్యాస్ వాడేవారు. అప్పట్లో హాన్ వంశీయుల హయాంలో చైనా వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించారు. సహజ వాయువు కోసం విరివిగా తవ్వకాలు జరిపి ఎట్టకేలకు సాధించారు. అప్పట్లోనే వంటగ్యాస్ను పైపులైన్ల ద్వారా సరఫరా చేసి, వంటచెరకుకు ప్రత్యామ్నాయంగా వాడటం ప్రారంభించారు. గ్యాస్ సరఫరా కోసం తొలినాళ్లలో వారు గ్యాస్ బావుల నుంచి నేరుగా వెదురు గొట్టాలను వాడేవారు. వెదురు గొట్టాలు తరచు ప్రమాదాలకు దారితీస్తుండటంతో కొంతకాలానికి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు. భారీ కొయ్య పీపాల్లో గ్యాస్ను బంధించి, వాటిని భూమిలో పాతర వేసి, వాటికి గొట్టాలను అమర్చి గ్యాస్ సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ పద్ధతి కాస్త సురక్షితంగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండటానికి పొడవాటి ఎగ్జాస్ట్ పైపును వాడేవారు. -
సహజవాయువు ధర 9% కట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు (గ్యాస్) ధర లు ఏప్రిల్ 1 నుంచి 9 శాతం మేర తగ్గనున్నాయి. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) ధర ప్రస్తుతం 5.05 డాలర్లుగా ఉండగా ఇకపై 4.56 డాలర్లకు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధంగా గ్యాస్ రేట్లు తగ్గించడం ఇదే తొలిసారి కానుంది. దీని వల్ల విద్యుత్, ఎరువుల రంగాల కంపెనీలకు ప్రయోజనం చేకూరనుండగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. గతేడాది ప్రకటించిన ఫార్ములా ప్రకారం ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయని, ప్రభుత్వం నిర్దిష్టంగా రేటును నిర్ణయించడం ఉండదని ఆయా వర్గాలు వివరించాయి. గ్యాస్ ధర ను తగ్గించడం వల్ల సహజ వాయువు నిక్షేపాలను కనుగొనేందుకు చేయబోయే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఓఎన్జీసీ సీఎండీ దినేష్ కే సరాఫ్ చెప్పారు. సబ్సిడీలపై ఓఎన్జీసీ, ఆయిల్కు ఊరట.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సబ్సిడీ చెల్లించనక్కర్లేంకుండా మినహాయింపునిస్తున్నట్లు పెట్రోలియం శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. క్యూ4లో చమురు ఉత్పత్తి కంపెనీలపై సబ్సిడీ భారం ఉండబోదంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మౌఖికంగా తమకు హామీ లభించినట్లు ఆయన వివరించారు. ఎల్పీజీ, కిరోసిన్లను నిర్దేశిత రేట్లకు విక్రయించడం వల్ల చమురు, గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం, చమురు ఉత్పత్తి సంస్థలు సబ్సిడీ రూపంలో భర్తీ చే స్తాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రిటైలర్ల అండర్ రికవరీలు రూ. 74,773 కోట్లు ఉంటాయని అంచనా. తొమ్మిది నెలల్లో ఇప్పటికే రూ. 67,091 కోట్లు సబ్సిడీ అందించడం జరిగింది. మిగతాది భరించనున్న ప్రభుత్వం .. కొంత మొత్తాన్ని వచ్చే 2015-16 ఆర్థిక సంవత్సరానికి బలదాయించే అవకాశం ఉంది. -
సిటీ గ్యాస్కు ప్రాధాన్యత!
కొత్త గ్యాస్ కేటాయింపుల విధానంపై చమురు శాఖ కసరత్తు న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ సహజ వాయువు కేటాయింపుల విధానాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం సీజీడీ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అటు పైన ఆటమిక్ ఎనర్జీ.. స్పేస్ రీసెర్చ్కి అవసరమయ్యేవి సరఫరా చేసే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చమురు శాఖ భావిస్తోంది. ఇక పెట్రోకెమికల్స్ మొదలైనవి వెలికితీసే ప్రాజెక్టులకు రోజుకి 1.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్ఎండీ) గ్యాస్ను ఇవ్వాలని, నాలుగో ప్రాధాన్యత కింద గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు కేటాయించాలని యోచిస్తోంది. నియంత్రిత టారిఫ్ల కింద విద్యుత్ను సరఫరా చేసే షరతుపై పవర్ ప్లాంట్లకు తర్వాత స్థానం దక్కుతుంది. ఇక దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేం దుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది. ఈ మేరకు ప్రతిపాదనను చమురు శాఖ.. కేంద్ర క్యాబినెట్ ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ కేటాయింపుల్లో ప్రస్తుతం యూరియా తయారీ ప్లాంట్లకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, వాహనాలు.. గృహాలకు గ్యాస్ సరఫరా చేసే సీజీడీ ప్రాజెక్టులు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సహజవాయువు ధర పెంపు 50 శాతమే!
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల కొత్త విధానంపై ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. నివేదికలో గ్యాస్ ధరను 50%మేర పెంచేందుకు వీలుగా సూచనలు చేసినట్లు అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్యాస్ ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 8.4 డాలర్లకు పెంచుతూ ఈ ఏడాది జనవరిలో వెలువడ్డ నోటిఫికేషన్ను సవరించేందుకు ప్రభుత్వం గత నెలలో ఒక కమిటీని నియమించింది. దీనిలో ఆయిల్ శాఖలోని అదనపు కార్యదర్శితోపాటు విద్యుత్, ఎరువులు, వ్యయ కార్యకలాపాల కార్యదర్శులుసభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయిల్ శాఖ సమీక్షించాక క్యాబినెట్కు పంపనున్నట్లు ప్రభుత్వాధికారి చెప్పారు. నివేదికలో విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, గ్యాస్ ధరను రెట్టింపు చేయకుండా 50% వరకూ పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్ను ప్రస్తుతం ఒక ఎంబీటీయూకి 4.2 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్కు సరఫరాకు మధ్య సమతుల్యాన్ని సాధించేలా కార్యదర్శుల కమిటీ గ్యాస్ ధరపై విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ రకాల క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్పై వ్యయాలనూ, విద్యుత్, ఎరువుల పరిశ్రమల డిమాండ్నూ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరికల్లా గ్యాస్ ధరను ప్రకటించే అవకాశమున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గ్యాస్ ధరను ఒక ఎంబీటీయూకి 2 డాలర్ల చొప్పున పెంచితే యూరియా, విద్యుత్, సీఎన్జీ ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వానికి మాత్రం పన్నులు, రాయల్టీ రూపంలో రూ.12,900 కోట్లు అదనంగా లభిస్తాయి. -
రిలయన్స్పై 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానా
లక్ష్యానికి అనుగుణంగా గ్యాస్ను ఉత్పత్తి చేయకపోవడమే కారణం పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్ వెల్లడి న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో లక్ష్యాల కంటే తక్కువగా సహజవాయువును ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై కేంద్రం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని సోమవారం లోక్సభకు తెలిపారు. ఏప్రిల్ 1, 2010 నుంచి నాలుగేళ్ల కాలంలో ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడంలో ఆర్ఐఎల్ విఫలమైందని.. తాజా జరిమానాతో కలిపితే ఈ మొత్తం 2.376 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.14,250 కోట్లు) చేరినట్లు ఆయన పేర్కొన్నారు. కంపెనీ వెనక్కితీసుకునే పెట్టుబడి వ్యయాల్లో కోత రూపంలో ఈ జరిమానా ఉంటుంది. గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ, పెట్టుబడి వ్యయాలన్నింటినీ ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్లు వెనక్కి తీసుకునేందుకు ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు అనుమతిస్తోంది. ఆతర్వాతే ప్రభుత్వంతో లాభాలను పంచుకోవాలని నిర్దేశిస్తోం ది. గత, తాజా జరిమానాల విధింపు నేపథ్యంలో 2010-11 నుంచి 2013-14 మధ్య ప్రభుత్వానికి 19.5 కోట్ల డాలర్ల మేర అధికంగా లాభాల వాటా లభించనుందని ప్రధాన్ చెప్పారు. ఈ నెల 10న నోటీసు...: 2013-14 ఏడాదిలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోనందుకు తాజా జరిమానా విధించినట్లు చమురు శాఖ మంత్రి వెల్లడించారు. ఆర్ఐఎల్ పెట్టుబడుల వ్యయంలో 57.9 కోట్ల డాలర్లు వెనక్కితీసుకునేందుకు నిరాకరిస్తూ ఈ నెల 10న నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ) ప్రకారం కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు(ఎంసీఎండీ)గా ఉండాలని.. అయితే, వాస్తవ ఉత్పత్తి 2011-12లో 35.88 ఎంసీఎండీ, 2012-13లో 20.88 ఎంసీఎండీ, 2013-14లో 9.77 ఎంసీఎండీలకు పరిమితమైనట్లు ప్రధాన్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ఏడాది(2014-15)లో ఉత్పత్తి కేవలం 8.05 ఎంసీఎండీ స్థాయిలోనే ఉందని కూడా తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడం వైఫల్యానికిగాను గతంలో ప్రభుత్వం 1.797 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(2010-11 నుంచి 2012-13 కాలానికి) జరిమానాగా విధించిందని.. ప్రస్తుతం ఈ అంశం మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్) ప్రక్రియలో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. -
సిటీ గ్యాస్కు మంచిరోజులు!
న్యూఢిల్లీ: సహజవాయువు కేటాయింపు విధానంలో సమూల మార్పులకు మోడీ సర్కారు తెరతీయనుంది. ఇప్పటివరకూ ఉన్న ప్రాధాన్యత రంగాల్లో త్వరలోనే భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ కేటాయింపుల్లో యూరియాను తయారుచేసే ఎరువుల ప్లాంట్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతర్వాత ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు వరుసలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్న సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) ప్రాజెక్టులకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), అదేవిధంగా నగరాల్లో ఇళ్లకు నేరుగా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ని సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వంటి సీజీడీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఇక నుంచి ముందుగా గ్యాస్ను సరఫరా చేయాల్సి వస్తుంది. సీఎన్జీ, పీఎన్జీల వల్ల కాలుష్యం చాలావరకూ తగ్గుతుందని... అంతేకాకుండా సబ్సిడీతో విక్రయిస్తున్న డీజిల్, వంటగ్యాస్ల స్థానంలో వీటిని పెద్దమొత్తంలో అందించేందుకు వీలుందని ఆయావర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశీయంగా రోజుకు 77 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) గ్యాస్ సరఫరాల్లో ఐజీఎల్ వంటి సీజీడీ సంస్థలకు 8.32 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తోంది. కొత్త నగరాల్లో కూడా సిటీ గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ రంగం వృద్ధికి వీలుగా ప్రభుత్వం కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిపాదిత కొత్త కేటాయింపుల విధానం ప్రకారం ఇప్పటివరకూ ప్రాధాన్య రంగాలకు కాకుండా ఇతర రంగాలకు చమురు శాఖ నిర్ణయించిన కేటాయింపుల నుంచి కోత విధించి సీజీడీకి అవసరమైన సరఫరాలకు మొదటి ప్రాధాన్యం కింద ఇవ్వనున్నారు. సహజవాయువు నుంచి అధికంగా ఉపఉత్పత్తులను సంగ్రహించే ప్లాంట్లకు రెండో స్థానం లభించనుంది. ఇక అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి వ్యూహాత్మక రంగాలకు గ్యాస్ను సరఫరా చేసే ప్లాంట్లకు కొత్త విధానంలో రెండో ప్రాధాన్య స్థానం దక్కనుంది. ఇక గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు నాలుగో స్థానం, విద్యుత్ ప్లాంట్లకు ఐదో ర్యాంక్ లభించనున్నాయి. ఉత్పత్తి పడిపోవడంతో... ప్రస్తుతం దేశీ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో సీజీడీ, ఎల్పీజీ రంగాలకు తప్ప ఇతర రంగాలన్నింటికీ కేటాయింపులను 2013-14 ఏడాదికి సరఫరా స్థాయిలవద్దే నిలిపేయాలని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2013-14లో ఎరువుల ప్లాంట్లకు 29.79 ఎంసీఎండీలు, విద్యుత్ ప్లాంట్లు 25.59, ఎల్పీజీ సంగ్రహణ ప్లాంట్లకు 1.83 ఎంసీఎండీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లకు 3.32, రిఫైనరీలకు 1.89, స్టీల్ ప్లాంట్లకు 1.32 ఎంసీఎండీల చొప్పున గ్యాస్ లభించింది. కాగా, కేజీ-డీ6 తదితర నెల్ప్ బ్లాక్లు, గుజరాత స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ)కు చెందిన దీన్దయాళ్ గ్యాస్ల నుంచి భవిష్యత్తులో పెరగనున్న ఉత్పత్తిని గతేడాది ఆగస్టు 23న సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యుత్ ప్లాంట్లకు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, మోడీ సర్కారు ఈజీఓఎంల్ను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రాధాన్య రంగాల జాబితాలను కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) ఖరారు చేసి, త్వరలోనే తుది ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
4 నెలల కనిష్టానికి ‘ఇన్ఫ్రా’ వృద్ధి
మేలో 2.3 శాతం ఏప్రిల్-మే నెలల్లో ఈ రేటు 3.3% న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 2014 మే నెలలో 2.3 శాతంగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. జనవరి తరువాత (1.6 శాతం వృద్ధి) ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ రంగాల పేలవ పని తీరు మొత్తం పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటును వెనక్కు లాగింది. 2014 ఏప్రిల్ నెలలో 8 పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతం. 2013 మే నెలలో వృద్ధి రేటు 5.9 శాతం. 2013 మే నెలతో పోల్చితే 2014 మేలో 8 పరిశ్రమల పనితీరు ఇలా... వృద్ధి బాటలో 4... బొగ్గు: క్షీణతలోంచి వృద్ధి బాటకు మెరుగుపడింది. -3.3 క్షీణత 5.5 శాతం వృద్ధిలోకి మళ్లింది. ఎరువులు: ఎరువుల పరిశ్రమ -2.0 శాతం క్షీణత నుంచి 17.6 శాతం వృద్ధికి ఎగసింది. సిమెంట్: ఈ రంగం వృద్ధి 2.5 శాతం నుంచి 8.7 శాతానికి మెరుగుపడింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి స్వల్పంగా పెరిగి 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. క్షీణతలో 4... క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే కొనసాగుతోంది. అయితే ఇది -2.5% నుంచి -0.3 శాతానికి మెరుగుపడింది. సహజ వాయువు: క్షీణతలోనే కొనసాగుతున్నా... ఇది -18.7 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి బాట నుంచి క్షీణ బాటకు పడిపోయింది. 4.9% వృద్ధి నుంచి -2.3%కి పడింది. స్టీల్: రిఫైనరీ ప్రొడక్టుల తరహాలోనే 22.4 శాతం వృద్ధి, -2.0 శాతానికి జారిపోయింది. రెండు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్, మే) మౌలిక వృద్ధి రేటు 3.3%గా ఉంది. 2013 ఇదే నెలల్లో ఈ రేటు 4.9%. మొత్తం పారిశ్రామికోత్పిత్తిలో ఈ 8 పరిశ్రమల గ్రూప్ వెయిటేజ్ దాదాపు 38 శాతం. -
వారి యవ్వారమంతా గుట్టే..
- చమురు సంస్థల కార్యకలాపాల తీరు - ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యం - ఏమైనా జరిగితే.. అధికారులదే బాధ్యత అమలాపురం : ‘కోట్లు మాకు... పాట్లు మీకు’ అన్నట్టుగా ఉంది చమురు సంస్థల తీరు. చమురు, సహజ వాయువులను వెలికితీసి తరలించుకుపోయి జేబులు నింపుకొంటున్న ఆ సంస్థలు.. ఏ చిన్న ప్రమాదం జరిగినా బాధ్యతంతా స్థాని క ప్రభుత్వ అధికారులపైకి వేసి పలాయన మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రమాదాలను ఎదుర్కోవడంలోనే కాదు, ప్రమాదాల నివారణలో కూడా స్థానికాధికారులకు, చమురు సంస్థలకు మధ్య సమన్వయం కొరవడింది. ప్రమాదం జరిగితే చమురు సంస్థల పలాయానం కేజీ బేసిన్ పరిధిలో బ్లోఅవుట్లు, పైపులైన్ల లీకేజీలు వంటి సంఘటనలు జరిగినప్పుడు చమురు సంస్థలు పలాయనమంత్రం జపిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళితే బాధితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందని తప్పించుకుని, ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై వదిలేస్తున్నారు. నగరం లో గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు గెయిల్ సంస్థే కాకుం డా గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్), మినీ ఆయిల్ రిఫైనరీ నిర్వహిస్తున్న ఓఎన్జీసీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కనీసం అగ్నిమాపక శకటాలు కూడా పంపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితు లు తమపై దాడి చేస్తారన్న భయంతో గెయిల్ ఉద్యోగులు బయటకు అడుగు పెట్టలేదు. దీంతో మంటలను అదుపు చేయాల్సిన బాధ్యత స్థానిక అగ్నిమాపక శాఖపై పడింది. వారు రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నుంచి వచ్చేసరికే పెనునష్టం జరిగిపోయింది. నిర్వహణపై సమన్వయం లేదు ఓఎన్జీసీతో పాటు ఇతర సంస్థలకు చెందిన గ్యాస్, చము రు పైపులైన్లు కోనసీమలో విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణపై చమురు సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వీటి పనితీరు, భద్రత విషయంలో స్థానికాధికారులు, చమురు సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంది. అయితే చమురు సంస్థలు ఒంటెద్దు పోకడలకు పోతున్నాయి. రెవెన్యూ, పోలీసు, ఫైర్, పంచాయతీ శాఖల అధికారులను సమన్వయం చేసి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత చమురు సంస్థలపై ఉన్నా.. అలాంటి దాఖలాలు లేవు. పైపులైన్ల భద్రతపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు ప్రతీ రెండు నెలలకు ఓసారి సమీక్ష చేయాల్సి ఉన్నా, ఒక్కసారి కూడా జరగలేదు. పైపులైన్ల వెంటే నివాస గృహాలు ‘గ్యాస్ పైపులైన్లకు 18 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. ఇక్కడ పైపులైన్ల చుట్టూ ఇళ్లను చూస్తే ఆశ్చర్యమేస్తోంది’ అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పీ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం నగరంలో ఆయన పర్యటించినప్పుడు పైపులైన్లపైనే ఇళ్ల నిర్మాణం జరగడాన్ని చూసి విస్తుపోయారు. గ్యాస్ పైపులైన్ ప్రాంతాల్లో ‘నో కన్స్ట్రక్షన్ జోన్’ ఎంతవరకు విస్తరించి ఉందనే దానిపై చమురు సంస్థల నుంచి సరైన సమచారం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
మూడు వారాల కనిష్టం
251 పాయింట్లు పతనం 25,063 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఆయిల్, రియల్టీ రంగాలు బోర్లా అదే బాటలో బ్యాంకింగ్, మెటల్ మళ్లీ భారీగా పెరిగిన టర్నోవర్ 7,493కు దిగిన నిఫ్టీ-76 పాయింట్లు డౌన్ సహజవాయువు ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్రం 3 నెలలు వాయిదా వేయడంతో ఆయిల్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు జూన్ డెరివేటివ్ కాంట్రాక్ట్ల ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో కొనుగోళ్లు కరువయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 25,063 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో ఇదే గరిష్ట పతనంకాగా, ఒక దశలో కనిష్టంగా 25,021ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 76 పాయింట్లు క్షీణించింది. 7,500 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 7,493 వద్ద నిలిచింది. మంగళవారంనాటి స్థాయిలో మరోసారి ఎక్స్ఛేంజీలలో టర్నోవర్ భారీగా పుంజుకుంది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్వోలో రూ. 4.29 లక్షలకోట్లకుపైగా నమోదుకాగా, బీఎస్ఈలో రూ. 2.31 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ రూ. 6.83 లక్షల కోట్లకు చేరింది. ఇది మార్కెట్ చరిత్రలో రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం! వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా సెంటిమెంట్ను దెబ్బకొట్టినట్లు అంచనా. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ డీలా..: ఆయిల్ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6% పతనంకాగా, ఆర్ఐఎల్ 4% దిగజారింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, హెచ్పీసీఎల్, ఐవోసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ 5-2% మధ్య నీర సించాయి. బీఎస్ఈ ఆయిల్ ఇండెక్స్ 4% పడిపోగా, రియల్టీ 3% క్షీణించింది. రియల్టీ షేర్లలో డీబీ దాదాపు 7% పతనంకాగా, యూనిటెక్, డీఎల్ఎఫ్, అనంత్రాజ్, ఇండియాబుల్స్, హెచ్డీఐఎల్ 4-3% మధ్య నష్టపోయాయి. కాగా, బ్యాంకింగ్, మెటల్ రంగాలు సైతం 1% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు..: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ట్రేడైన షేర్లలో 1,539 నష్టపోగా, 1,490 లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్లో ఎస్ఈ ఇన్వెస్ట్మెంట్స్, శ్రేయుంజ్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్, బీఈఎంఎల్, సియట్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టీల్ 7-4% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు కేశోరాం, బాష్, దివాన్ హౌసింగ్, శ్రేయీ ఇన్ఫ్రా, టాటా ఎలక్సీ, ఎస్సార్ ఆయిల్, హెచ్సీసీ, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్, అబాన్ ఆఫ్షోర్, పేజ్ ఇండస్ట్రీస్, జీఎస్పీఎల్, యూనికెమ్ 8.5-4.5% మధ్య పుంజుకున్నాయి. -
కేజీ బేసిన్లో కొత్త బావులపై ఓఎన్జీసీ దృష్టి
40 బావుల్లో వెయ్యి ఎంఎంసీఎండీ నిక్షేపాలు రూ. 440 కోట్లతో డ్రిల్లింగ్కు ప్రణాళిక సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా, గోదావరి బేసిన్లో కొత్తగా ఆఫ్షోర్ నుంచి చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీయవచ్చని ఓఎన్జీసీ గుర్తించింది. మూడు జిల్లాల్లో విస్తరించిన ఈ బేసిన్ పరిధిలో 40 కొత్త బావులను ఎంపిక చేసి, వాటి డ్రిల్లింగ్ ద్వారా రోజుకు వెయ్యి మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంసీఎండీ) ఆయిల్ లేదా చమురుతో కూడిన సహజ వాయువు లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ డ్రిల్లింగ్ కోసం రూ.440 కోట్లు వెచ్చించాలనే నిర్ణయానికి వచ్చింది. గత కొంతకాలంగా ఈ బేసిన్లో నిర్వహిస్తున్న సెస్మిక్ సర్వే ఫలితాలను బట్టి అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందనే అంచనాకు వచ్చింది. డ్రిల్లింగ్ చేపట్టేందుకు పర్యావరణ అనుమతి కోసం శుక్రవారం రాజోలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఈ బేసిన్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధప్రాతిపదికన డ్రిల్లింగ్ నిర్వ హించనుంది. ఎకడెక్కడ ఎన్ని బావులు.. కృష్ణా జిల్లాలో ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 22, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 బావుల్లో నిక్షేపాలు ఉన్నట్టుగా ఓఎన్జీసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కృష్ణా జిల్లా కైకలూరులో మూడు, ముదినేపల్లి మండలం పెద్దకామనపల్లిలో ఒకటి, బంటుమిల్లి మండలం ముంజులూరులో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఏలేటిపాడులో రెండు, పెనుగొండ మండలం చిన్నంవారిపాలెంలో ఎనిమిది, అదే మండలం సిద్ధాంతంలో ఒకటి, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఒకటి, పెరవలి మండలం పి.వేమవరంలో ఒకటి, తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో మూడు, మండపేటలో ఐదు, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఒకటి, మలికిపురం మండలం కేశనపల్లి వెస్ట్ పరిధిలో ఐదు, రాజోలు మండలం శివకోడు కమ్మపాలెం పరిధిలో ఏడు, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో ఒక బావిలో ఆయిల్, గ్యాస్ ఉన్నట్టు గుర్తించారు. గతంలో ఫలించిన అంచనాలు తూర్పు గోదావరిలో 22 బావుల్లో డ్రిల్లింగ్ కోసం రూ.242 కోట్లు, కృష్ణా జిల్లాలో ఐదు బావులకు రూ.55 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 బావులకు రూ.143 కోట్లు కేటాయించారు. 40 బావుల ద్వారా వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు లేదా ఆయిల్తో కూడిన గ్యాస్ లభిస్తుందని ఓఎన్జీసీ అంచనా. ఇదే మాదిరి రెండేళ్ల క్రితం కేజీ బేసిన్ పరిధిలోని మూడు జిల్లాల్లో డ్రిల్లింగ్ చేపట్టగా అంచనాలు నిజమయ్యాయి. అప్పట్లో ఆ బావుల్లో రోజుకు 840 టన్నుల ఆయిల్, 3.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు గ్యాస్ లభిస్తుందనే అంచనాలు ఫలించాయి. ఈ సారి కూడా అదే స్థాయిలో చమురు, సహజవాయువు నిక్షేపాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. భూ సేకరణ కోసం... ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కార్యక్రలాపాలు నిర్వహించేందుకు ప్రతి బావి కోసం ఐదు నుంచి ఆరు ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు ఓఎన్జీసీ ప్రతిపాదనలు పంపింది. పూర్తిస్థాయిలో చమురు అన్వేషణ చేపట్టి మూడు నుంచి నాలుగు నెలల్లో డ్రిల్లింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. -
సహజవాయువు ధర అక్కడే..
- పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్ర కేబినెట్ - మరో 3 నెలల వరకూ ప్రస్తుత రేట్లే... న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఎదురుచూపులు ఫలించలేదు. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధర పెంపుపై నిర్ణయాన్ని కేంద్రం మరో మూడు నెలలు వాయిదా వేసింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) భేటీలో ధరల పెంపు అంశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గతేడాది ఆమోదించిన వివాదాస్పద గ్యాస్ ధరల పెంపు ఫార్ములాపై విస్తృతస్థాయిలో సమీక్ష జరపడం కోసం ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టినట్లు ఆయన చెప్పారు. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను ప్రస్తుతం ఉన్న 4.2 డాలర్ల స్థాయి(ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్కు) నుంచి 8.8 డాలర్లకు పెంచాల్సి ఉంది. వాస్తవానికి దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాల్సిఉన్నప్పటికీ... ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జూలై 1 నుంచి పెంపు అమలుచేయవచ్చని కంపెనీలు భావించాయి. అయితే, గ్యాస్ ధర పెంపు విషయంలో గతంలో యూపీఏపై ఎదురుదాడి చేసిన బీజేపీ... ఇప్పుడు ఎకాఎకిన గత ప్రభుత్వం నిర్ణయాన్నే అమలుచేస్తే తమపై ప్రతికూలతకు దారితీయొచ్చనే కారణంతో వాయిదా మంత్రాన్ని జపించింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాం... ‘కేబినెట్ భేటీలో గ్యాస్ ధరను సెప్టెంబర్ చివరివరకూ ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించాం. ఈ అంశంపై అన్ని పక్షాలతోనూ మరింత విస్తృతంగా సంప్రదింపులు జరపాలని కేబినెట్ భావించింది. ముఖ్యంగా ధర పెంపు విషయంలో ప్రజాప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాన్ చెప్పారు. గత శుక్రవారం నుంచి ఈ విషయంపై ప్రధాని మోడీతో మూడుసార్లు ప్రధాన్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, మరోసారి సమీక్ష కోసం నిపుణుల కమీటీ లేదా మంత్రుల బృందం వంటివి ఏర్పాటు చేస్తారాలేదా అనేది ప్రధాన్ చెప్పలేదు. అయితే, ప్రధాని కార్యాలయం(పీఎంఓ), చమురు శాఖలు ఈ సమీక్ష యంత్రాంగాన్ని నిర్ణయిస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే, పూర్తిగా కొత్త ఫార్ములాను ప్రతిపాదిస్తారా లేదంటే రంగరాజన్ ఫార్ములాలోనే మార్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ధర పెంపును 7-7.5 డాలర్లకు పరిమితం చేయడం, కొత్త బ్లాక్ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్కు మాత్రమే ధర పెంపును వర్తింపజేయడం ఇతరత్రా కొన్ని ప్రతిపాదనలను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత గ్యాస్ ధరలతో కొత్త క్షేత్రాల అభివృద్ధి తమకు లాభసాటికాదని.. తక్షణం రేట్లు పెంచాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్న రిలయన్స్.. దాని భాగాస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లకు మోడీ సర్కారు వాయిదా నిర్ణయం మింగుడుపడని అంశమే. ఏప్రిల్ 1 నుంచి ధర పెంపును అమలు చేయనందుకుగాను రిలయన్స్ ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) నోటీసును కూడా జారీ చేసింది. ధర పెంపుతో ప్రజలపై తీవ్ర ప్రభావం రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం సహజవాయువు ధరను 8.8 డాలర్లకు గనుక పెంచితే అది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు ఒక్కో యూనిట్కు రూ.2 వరకూ ఎగబాకవచ్చని అంచనా. దీంతోపాటు వాహనాలకు వాడే సీఎన్జీ రేట్లు కూడా ఒక్కో కేజీకి రూ.12 వరకూ(ఢిల్లీలో) పెరిగే అవకాశాలున్నాయి. పైపుల ద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధర కూడా పెరిగిపోనుంది. ఎరువుల కంపెనీలకు గ్యాస్ ధర భారం కావడంతో వాటికి ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీలు కూడా ఎగబాకేందుకు దారితీయనుంది. ఒక్కో డాలరు గ్యాస్ ధర పెంపుతో యూరియా ఉత్పత్తి ధర టన్నుకు రూ.1,370 చొప్పున ఎగబాకుతుంది. ఈ పరిణామాలతో ద్రవ్యోల్బణం దూసుకెళ్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. -
గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్ మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది. -
సహజ వాయువుకు జూలై 1 నుంచి కొత్త రేట్లు!
త్వరలో నిర్ణయం తీసుకోనున్న కొత్త కేబినెట్ న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేట్ల పెంపు, కొత్త ధరలను ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. మోడీ కొత్త సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో కేబినెట్ త్వరలోనే ఇందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని పెట్రోలియం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. వాస్తవానికి రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం రిలయన్స్ కేజీ-డీ6 సహా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న దేశీ గ్యాస్ రేటును ఇప్పుడున్న 4.2 డాలర్ల(ఒక్కో యూనిట్కి) నుంచి దాదాపు రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచుతూ యూపీఏ ప్రభుత్వం గతేడాదే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పెంపు వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త సర్కారు కూడా రావడంతో కొత్త రేట్ల అమలు అనివార్యం కానుంది. మార్చి 31తో కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ... పాత రేటు ప్రకారమే గ్యాస్ను విక్రయిస్తున్న రిలయన్స్కు జూలై 1 నుంచి కొత్త రేట్ల అమలు ఉండొచ్చని తాము చెప్పామని.. ఈ నేపథ్యంలో అంతకుముందే కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉందన్నారు. అయితే, రంగరాజన్ కమిటీ ఫార్ములాపై తమకు ఒక స్పష్టత వచ్చాకే కొత్త రేటును చమురు శాఖ మళ్లీ ప్రకటిస్తుందని.. దీన్ని కూడా కేబినెట్ ఆమోదించాకే వర్తింపజేస్తామని ఆ అధికారి చెప్పారు. త్వరలో చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి చమురు శాఖ తెలియజేయనుంది. ఆతర్వాత గ్యాస్ ధరల విధానంపై స్పష్టమైన దిశానిర్దేశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
8 కీలక పరిశ్రమలు ఓకే
ఏప్రిల్లో వృద్ధి 4.2 శాతం విద్యుత్, ఎరువులు, సిమెంట్ బెటర్ న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పరిశ్రమల గ్రూప్ ఏప్రిల్లో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2014 మార్చిలో ఈ రేటు 2.5 శాతంకాగా, 2013 ఏప్రిల్ నెలలో 3.7 శాతం. విద్యుత్, ఎరువులు, సిమెంట్, బొగ్గు రంగాలు మంచి ఫలితాలను ఇవ్వడం వృద్ధి కొంత మెరుగ్గా ఉండడానికి కారణమయ్యింది. ఇంకా ఈ గ్రూప్లో క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ ఉన్నాయి. సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును 2013 ఏప్రిల్తో పోల్చిచూస్తే... బొగ్గు: వృద్ధి రేటు 1.2% నుంచి 3.3%కి ఎగసింది. ఎరువులు: ఈ రంగం క్షీణత నుంచి బైటపడింది. ఈ రంగం మైనస్ (-) 2.4 శాతం నుంచి 11.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. సిమెంట్: వృద్ధి 5.2% నుంచి 6.7 శాతానికి ఎగసింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 3.5 శాతం నుంచి 11.2 శాతానికి ఎగసింది. క్రూడ్ ఆయిల్: వృద్ధి క్షీణతలోనే ఉన్నా (-1.2 శాతం) ఇది కొంత తగ్గి మైనస్ (-) 0.1 శాతంగా ఉంది. సహజ వాయువులు: క్షీణత (-) 17.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: 6.2% వృద్ధి రేటు క్షీణతలోకి జారిపోయింది. ఈ రేటు -2.2%గా నమోదయ్యింది. ఉక్కు: వృద్ధి రేటు 10.1% నుంచి 3.1%కి పడింది. ఐఐపీ నిరుత్సాహమే: ఇక్రా అంచనా కోర్ ఇన్ఫ్రా పరిశ్రమల పనితీరు బాగున్నప్పటికీ, ఏప్రిల్ 2014 ఐఐపీ వృద్ధి మాత్రం ఒక శాతం లోపే ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. ఈ గణాంకాలు ఈ నెల రెండవ వారం చివర్లో రానున్నాయి. ఐఐపీ గణాంకాలు వరుసగా రెండవనెల మార్చిలో క్షీణ దిశలో ఉన్నాయి. మార్చిలో ఈ రేటు -0.5 శాతంగా నమోదయ్యింది. -
ఓఎన్జీసీలోని కొన్ని శక్తుల పనే ఇది: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ చోరీకి పాల్పడి ఉండవచ్చంటూ ఓఎన్జీసీ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఘాటుగా స్పందించింది. పదమూడేళ్లుగా కనుగొన్న నిక్షేపాలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు సంస్థ సీఎండీ కె.సరాఫ్ను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన కేజీ డీ6 బ్లాకు పక్కనే ఉన్న తమ క్షేత్రం నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన గ్యాస్ను ముకేశ్ అంబానీ సంస్థ చోరీ చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ ఓఎన్జీసీ ఈ నెల 15న ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ‘ఈ ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో సంస్థ సీఎండీని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇదని భావిస్తున్నాం..’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. సరాఫ్ను తప్పుదోవ పట్టించిన శక్తుల పేర్లను రిలయన్స్ వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై ఓఎన్జీసీ గతేడాది ఆగస్టులో తమను సంప్రదించిన నాటి నుంచీ స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించడానికి తాము యత్నిస్తున్నామని తెలిపింది. -
భారత్ భవిత బంగారం!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం భారత్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశం ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చని రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దేశాభివృద్ధి 6.8 శాతం ఉంటుందని బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ తాజాగా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఈ మేరకు ఆయా సంస్థలు విడుదల చేసిన విశ్లేషణా పత్రాలను వేర్వేరుగా పరిశీలిస్తే- క్రెడిట్ పాజిటివ్: మూడీస్ ఎన్నికల ఫలితాలు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని మూడీస్ పేర్కొంది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయని మూడీస్ వివరించింది. ఇది భారత్కు ‘క్రెడిట్ పాజిటివ్’అని సంస్థ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం దేశానికి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఉంది. స్టేబుల్ అవుట్లుక్తో కొంత క్రెడిట్ రిస్క్ ఉన్నట్లు ఈ రేటింగ్ సూచిస్తుంది. అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్ రంగానికి ఈ విజయం క్రెడిట్ పాజిటివ్ అని వివరించింది. బ్యాంకింగ్ రంగానికి సైతం ఇది శుభసూచకమని అభిప్రాయపడింది. చిదంబరం తన తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన మూలధన పెట్టుబడులను మోడీ సర్కారు పెంచవచ్చని విశ్లేషించింది. ఇది బ్యాంకుల క్రెడిట్ పాజిటివ్కు దోహదపడుతుందని వివరించింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ తక్షణం మెరుగుదలకు ఇది దోహపదడిందని వివరించింది. కార్పొరేట్, మౌలిక రంగాల విషయంలో నిలిచిపోయిన విధానాల పునరుద్ధరణకు ఈ ఫలితాలు దోహదపడతాయని మూడీస్ వైస్ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ వికాశ్ హలాన్ అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సన్నిహిత సహకారం వల్ల పెట్టుబడుల్లో ప్రస్తుతం ఉన్న నిరుత్సాహ ధోరణి తొలగిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వం సహజ వాయువు ధరలను పెంచే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. ఇదే జరిగితే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ కంపెనీలకు లాభదాయకమని పేర్కొంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది ఊతమిచ్చే అంశంగా దీనిని విశ్లేషించింది. ఏప్రిల్లోనే గ్యాస్ ధరలు పెరగాల్సి ఉన్నా, దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పక్కనబెట్టింది. మోర్గాన్ స్టాన్లీ ఇలా... వచ్చే కొద్ది త్రైమాసికాల్లో దేశం స్టాగ్ఫ్లేషన్ నుంచి బైటపడుతుంది. వృద్ధి కనిష్ట స్థాయి వద్ద కొనసాగుతూ, ధరల పెరుగుదల తీవ్రంగా ఉండే పరిస్థితిని స్టాగ్ఫ్లేషన్గా వ్యవహరిస్తాం. ఈక్విటీ మార్కెట్ ఊపుమీదుంటుంది. 2015 జూన్ నాటికి మోర్గాన్ స్టాన్లీ సెన్సెక్స్ టార్గెట్ 26,300. దీనికి సంబంధించి క్రితం టార్గెట్ 21,280 పాయింట్లు. భారత్ వృద్ధికి సంబంధించి ఎన్నికల ఫలితాలు కీలకమైనవి. వచ్చే రెండేళ్లలో జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పెరగవచ్చు. ద్రవ్యోల్బణం 6 శాతం దిశగా కిందకుదిగే అవకాశం ఉంది. భారత్ సంస్థాగత అంశాలు ఇప్పటికే పటిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వృద్ధికి ఊతం ఇస్తూ, సంస్కరణల ప్రక్రియ వేగం పెంచవచ్చు. వ్యాపార సెంటిమెంట్కు ఫలితాలు ఊపిరులూదాయి. కార్పొరేట్ రంగ లాభదాయకతకు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికి ఈ ఫలితాలు దోహదపడే అవకాశం ఉంది. ఫలితాలు దేశాభివృద్ధికి సంబంధించి మా విశ్వాసాన్ని పెంచాయి. రానున్న పదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతానికి పైగా నమోదవుతుంది. జీడీపీ విలువ ప్రస్తుత 1.9 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఇబ్బందులూ ఉన్నాయ్ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ పొంచి ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక విశ్లేషించింది. రానున్న 12 నెలల్లో ఎల్నీనో, ఎగుమతుల స్పీడ్ తగ్గుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మధ్యకాలికంగా ఎదురయ్యే సవాళ్లలో ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకటి. సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడం మరొకటి. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు
Reliance Industries Q4 PAT up 2.3% at Rs 5630 crore, in line with estimates Read more at: http://economictimes.indiatimes.com/articleshow/33913963.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst గత ఆర్థిక సంవత్సరం రిలయన్స్కు కు చాలా సంతృప్తికరంగా సాగింది. జీఆర్ఎంలు భారీగా పుంజుకోవడంతో రిఫైనింగ్ వ్యాపారంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయి లాభాలను ఆర్జించగలిగాం. పాలిమర్స్, వీటి ఉత్పత్తుల అమ్మకం మార్జిన్లు పెరగడంతో పెట్రోకెమికల్స్లో లాభాలు కూడా భారీగా వృద్ధిచెందాయి. దేశీయంగా చమురు-గ్యాస్ ఉత్పత్తిలో కొన్ని సాంకేతికపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం గణనీయమైన వృద్ధిని నమోదుచేసుకుంది. రిటైల్ వ్యాపారం విషయానికొస్తే దేశంలోనే అతిపెద్ద రిటైల్ చైన్గా ఆవిర్భవించాం. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతోకూడిన 4జీ టెలికం సేవలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కసరత్తును వేగవంతం చేశాం. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గడచిన రెండేళ్లకు పైగా కాలంలో అత్యధిక స్థాయిలో త్రైమాసిక లాభాన్ని ఆర్జించింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2013-14, జనవరి-మార్చి-క్యూ4)లో రూ.5,631 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,589 కోట్లతో పోలిస్తే లాభం నామమాత్రంగానే(0.8 శాతం) వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ4లో 13 శాతం పెరుగుదలతో రూ.97,807 కోట్లకు ఎగసింది. కాగా, 2012-13 క్యూ4లో డాలరుతో రూపాయి మారకం విలువ 54.2 స్థాయిలో ఉండగా.. 2013-14 క్యూ4లో రూపాయి సగటు విలువ 61.8గా ఉంది. రూపాయి భారీ క్షీణత కూడా కంపెనీ రాబడులు పుంజుకోవడానికి దోహదం చేసింది. జీఆర్ఎంల జోరు... మార్చి క్వార్టర్లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం-ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేయడం ద్వారా వచ్చే రాబడి) మెరుగైన రీతిలో 9.3 డాలర్లుగా నమోదైంది. అంతక్రితం క్వార్టర్(క్యూ3)లో 7.6 డాలర్లతో పోలిస్తే 1.7 డాలర్లు(22 శాతం) ఎగబాకింది. అయితే, క్రితం ఏడాది క్యూ4లో నమోదైన 10.1 డాలర్లతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం. సీక్వెన్షియల్గా చూస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో నమోదైన రూ.5,511 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో లాభం 2.2 శాతం మేర పెరిగింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.1.03 లక్షలతో పోలిస్తే 8 శాతం తగ్గింది. పూర్తి ఏడాదికి ఇలా...: గతేడాది(2013-14) రిలయన్స్ నికర లాభం రూ.21,984 కోట్లుగా నమోదైంది. దేశంలోని ఒక ప్రైవేటు రంగ కంపెనీ ఒక ఏడాదిలో ఆర్జించిన అత్యధిక లాభంగా నిలిచింది. 2012-13 ఏడాదిలో ఆర్జించిన రూ.21,003 కోట్లతో పోలిస్తే 4.7% పెరిగింది. మొత్తం ఆదాయం కూడా పూర్తి ఏడాదికి 8.1% పెరుగుదలతో రూ.4,01,302 కోట్లకు వృద్ధి చెందింది. ఇది కూడా రికార్డు గరిష్టస్థాయి. అంతక్రితం ఏడాదిలో ఆదాయం రూ.3,71,119 కోట్లు. అతిపెద్ద రిటైల్ చైన్గా ఆవిర్భావం.. రిలయన్స్ రిటైల్... దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్గా ఆవిర్భవించిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. 2013-14 పూర్తి ఏడాదికి రిటైల్ వ్యాపార విభాగం రూ.363 కోట్ల పన్ను ముందు(ఎబిటా) లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.14,496 కోట్లకు ఎగబాకింది. గతేడాది అన్ని విభాగాల్లో కలిపి కొత్తగా 225 రిటైల్ సోర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. దీంతో మార్చి చివరినాటికి రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 146 నగరాల్లో 1,691కి చేరింది. కాగా, మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో సంస్థ ఆదాయం 19.27% వృద్ధితో రూ.3,051 కోట్ల నుంచి రూ.3,639 కోట్లకు పెరిగింది. ఇతర ముఖ్యాంశాలివీ... పెట్రో కెమికల్స్ వ్యాపార విభాగం లాభం క్యూ4లో రూ.2,096 కోట్లకు పెరిగింది. అంతక్రిత ఏడాది ఇదే కాలంలో రూ.1,895 కోట్లతో పోలిస్తే 10.6 శాతం ఎగసింది. చమురుశుద్ధి(రిఫైనింగ్) విభాగం లాభం రూ.3,520 కోట్ల నుంచి రూ.3,954 కోట్లకు చేరింది. 12.3 శాతం పెరిగింది. అయితే, చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం లాభం మాత్రం 17.8 శాతం దిగజారి రూ.460 కోట్ల నుంచి రూ.378 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.1,597 కోట్ల నుంచి రూ.1,417 కోట్లకు క్షీణించింది. అంటే 11.2 శాతం తగ్గింది. ప్రధానంగా కేజీ-డీ6 బ్లాక్లో గ్యాస్ ఉత్పత్తి భారీగా దిగజారడమే దీనికి కారణంగా నిలిచింది. భౌగోళికపరమైన అడ్డంకులతోపాటు అంచనాకంటే బావుల్లోకి అధికంగా నీరుచేరడం ఇతరత్రా సమస్యలు గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయేలా చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది. క్యూ4లో షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.17.3 నుంచి స్వల్పంగా రూ.17.4కు చేరింది. పూర్తి ఏడాదికి చూస్తే... రూ.65.8 నుంచి రూ.68కి వృద్ధి చెందింది. ఇతర ఆదాయం క్యూ4లో రూ.2,040 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇది రూ.2,240 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జామ్నగర్లోని జంట రిఫైనరీల నుంచి 41.1 బిలియన్ డాలర్ల పెట్రో ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది ఇది 39.3 బిలియన్ డాలర్లు. మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.89,968 కోట్లకు పెరిగిపోయింది. క్రితం ఏడాది మార్చి ఆఖరికి రూ. 72,427 కోట్లు మాత్రమే రుణభారం ఉండటం గమనార్హం. ఇక మార్చి చివరికల్లా రిలయన్స్ వద్ద మొత్తం రూ.88,190 కోట్ల నగదు తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. ఒక్కో షేరుకి రూ.9.50 చొప్పున డివిడెండ్ను ప్రకటించింది. కంపెనీ షేరు ధర గురువారం(శుక్రవారం స్టాక్ మార్కెట్ టేడ్రింగ్ సెలవు) 1.88 శాతం పెరిగి రూ.959 వద్ద ముగిసింది. -
ప్రస్తుత ధరకే రిలయన్స్ కేజీ డీ6 గ్యాస్ విక్రయం
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం నాచురల్ గ్యాస్ ధరల సవరణపై నిర్ణయం తీసుకునేంత వరకు కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత రేటుకే విక్రయించనుంది. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే, ఎన్నికల సంఘం సలహా మేరకు, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ధరల పెంపును వాయిదా వేయాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిర్ణయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ వంటి సంస్థలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు గ్యాస్ను 4.2 డాలర్ల ధరకే అమ్ముతాయి. అయితే, కేజీ డీ6 గ్యాస్పై రిలయన్స్తో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవాలంటే ఇరు పక్షాలూ సంతకాలు చేయాల్సి ఉంది. నూతన విక్రయ ఒప్పందాలకు సంబంధించిన అనేక అంశాలను రిలయన్స్ - కేజీ డీ6 గ్యాస్ కొనుగోలుదారుల సమావేశంలో పరిష్కరించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత గ్యాస్ అమ్మకం, కొనుగోలు ఒప్పందం (జీఎస్పీఏ) మాదిరే కొత్త జీఎస్పీఏ కూడా ఐదేళ్లపాటు అమల్లో ఉండడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించిందని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
కేజీ-డీ6లో మళ్లీ తగ్గిన గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి మళ్లీ రెండు నెలల తర్వాత తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో రోజుకు 13.63 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు పెరిగిన ఉత్పత్తి ఈ నెలలో 13.28 ఎంసీఎండీలకు తగ్గింది. చమురు శాఖకు సమర్పించిన స్థాయీ నివేదికలో నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరిలో తొలివారంలో కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాలతో పాటు ఎంఏ చమురు క్షేత్రం నుంచి 13.58 ఎంసీఎండీల గ్యాస్ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసింది. ఆతర్వాత వారంలో ఇది 13.68 ఎంసీఎండీలకు పెరిగింది. అయితే, ఈ నెల 9తో ముగిసిన వారంలో గ్యాస్ ఉత్పత్తి 13.28 ఎంసీఎండీలకు తగ్గిందని డీజీహెచ్ తెలిపింది. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.17 ఎంసీఎండీలు, ఎంఏ చమురు క్షేత్రం నుంచి 5.11 ఎంసీఎండీల ఉత్పత్తి నమోదైంది. ఇంకా సగానికిపైగా బావుల మూత... అంతకంతకూ పడిపోతున్న ఉత్పత్తిని తిరిగి పెంచే ప్రణాళికలో భాగంగా ఆర్ఐఎల్ జనవరిలో ఎంఏ చమురు క్షేత్రంలోని ఎంఏ-8 బావిలో మళ్లీ గ్యాస్ వెలికితీతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉత్పత్తి గత నెలలో 1.5 ఎంసీఎండీలు పెరిగి 5.33 ఎంసీఎండీలకు చేరింది. మూడేళ్లపాటు వరుస తగ్గుదలకు బ్రేక్పడింది. అయితే, మళ్లీ తాజాగా ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. కేజీ-డీ6 బ్లాక్లో ఆర్ఐఎల్కు 60 శాతం, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు 30 శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్కు 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పటిదాకా డీ1, డీ3 క్షేత్రాల్లో 22 బావులను తవ్విన ఆర్ఐఎల్ కేవలం 18 బావుల్లోనే ఉత్పత్తిలోకి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం 8 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోందని, 10 బావులు మూతబడేఉన్నాయని డీజీహెచ్ తాజా నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ఎంఏ క్షేత్రాల్లో మొత్తం 7 బావులకుగాను 5 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోంది. ఒక బావి(ఎంఏ-6హెచ్)లో మరమ్మతులు చేపడుతోందని నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2009 ఏప్రిల్లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 2010 మార్చిలో గరిష్టంగా 69.43 ఎంసీఎంసీలను తాకింది. ఇప్పుడు 80 శాతం పైనే ఉత్పత్తి దిగజారినట్లు లెక్క. కాగా, వచ్చే నెల 1 నుంచి గ్యాస్ రేటు రెట్టింపు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 4.2 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 8 డాలర్లకు ఎగబాకనుంది. ధర పెరిగాక అనూహ్యంగా లాభాలు దండుకోవడగానికే రిలయన్స్ అక్రమంగా గ్యాస్ను దాచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
గౌతమి పవర్ ప్రాజెక్టులో హెచ్ఎస్డీకి అనుమతించండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేజీ బేసిన్ నుంచి తమకు గ్యాస్ సరఫరా ఆగిపోయిన నేపథ్యంలో గౌతమి పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తికి హై స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)ని ఉపయోగించేందుకు అనుమతించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను జీవీకే గ్రూప్ కోరింది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, హెచ్ఎస్డీని భారీగా వినియోగించడం పర్యావరణానికి మంచిది కాదని భావించిన పర్యావరణ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ .. దీనిపై చమురు శాఖ అభిప్రాయాలు తెలుసుకోవాలని కంపెనీకి సూచించింది. గౌతమి పవర్ ప్రాజెక్టు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉంది. కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్లో రోజుకు దాదాపు 1.96 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) పరిమాణాన్ని కేంద్రం గతంలో ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. 2009 నుంచి 2011 దాకా ప్లాంటు పూర్తి స్థాయిలో పనిచేసింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి నానాటికి తగ్గిపోతుండటంతో.. గతేడాది మార్చ్ నుంచి విద్యుత్ కంపెనీలకు గ్యాస్ సరఫరా నిల్చిపోయింది. దీంతో జీవీకే సహా పలు పవర్ ప్రాజెక్టులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. -
56 చమురు-గ్యాస్ బ్లాక్ల వేలం
న్యూఢిల్లీ: భారత్లో మళ్లీ పెద్దయెత్తున చమురు-గ్యాస్ బ్లాక్ల వేలానికి రంగం సిద్ధమైంది. కొత్త అన్వేషణ లెసైన్సింగ్ విధానం పదో విడత(నెల్ప్-10)లో కనీసం 56 బ్లాక్లను వేలం వేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి వివేక్ రే సోమవారమిక్కడ వెల్లడించారు. వచ్చే వారంలో జరగనున్న పెట్రోటెక్ సదస్సులో ఈ క్షేత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నామని చెప్పారు. అయితే, వేలంలో బిడ్లకు ఆహ్వాన నోటీసులను ఫిబ్రవరి నెలలో జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకే... చమురు-గ్యాస్ బ్లాక్ల కాంట్రాక్టుల విషయంలో సమూలంగా మార్పులు చేసిన నిబంధనలతో ఈ నెల్ప్-10 వేలం ప్రక్రియను చేపడుతున్నట్లు వివేక్ తెలిపారు. ప్రధానంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజునుంచే సంబంధిత చమురు-గ్యాస్ బ్లాక్ల నుంచి ఎంతపరిమాణంలో ప్రభుత్వానికి ఉత్పత్తిలో ఎంత వాటాను ఆఫర్ చేయనున్నారనేది వేలంలో పాల్గొనే కంపెనీలు తమ బిడ్డింగ్లో తెలియజేయాల్సి ఉంటుంది. అత్యధిక మొత్తంలో చమురు-గ్యాస్ ఉత్పత్తి వాటాను ఆఫర్ చేసే కంపెనీకే బిడ్డింగ్లో బ్లాక్లు దక్కుతాయని వివేక్ రే వివరించారు. భవిష్యత్తులో చమురు-గ్యాస్ బ్లాక్ల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకే ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన మొత్తం 9 విడతల నెల్ప్ బిడ్డింగ్లలో 254 బ్లాక్లను వివిధ కంపెనీలకు కేంద్రం కేటాయించింది. కాగ్ అక్షింతల ప్రభావం... ప్రస్తుత నిబంధనల ప్రకారం చమురు కంపెనీలు ప్రభుత్వంతో లాభాలను పంచుకోవడానికి ముందే తమ అన్వేషణ, ఉత్పాదక వ్యయాలను రికవరీ చేసుకునే వీలుంది. అయితే ఈ నిబంధనల వల్ల కంపెనీలు తమ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచుకునేలా దారితీస్తోందని, ప్రభుత్వానికి రావాల్సిన లాభాల పంపకంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లో ఆడిటింగ్ సందర్భంగా పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచిచూపిందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ కాగ్ తేల్చిచెప్పింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులకు పెట్రోలియం శాఖ నడుం బిగించింది. పారదర్శకత పెరుగుతుంది... ‘ఇక నుంచి ఉత్పత్తి పంపకం విధానాన్ని కాకుండా ఆదాయాల పంపకం విధానాన్ని అవలంభించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. దీనివల్ల ఆదాయాలను ముందే రికవరీ చేసుకోవడం, పెట్టుబడులను పెంచిచూపడం వంటి అంశాలకు ఇక తావుండదు. నెల్ప్-10 నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో కేబినెట్ ఆమోదముద్ర కోసం మేం కసరత్తు మొదలుపెట్టాం’ అని వివేక్ వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల విధానం వల్ల మరింత పారదర్శకతతో పాటు కంపెనీల అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాల్లో తమ జోక్యం కూడా తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కొత్త నిబంధనల ఖరారుపై కేబినెట్దే తుది నిర్ణయమని వివేక్ పేర్కొన్నారు. -
గ్యాస్ ధర.. మూడేళ్లలో 10 డాలర్లకు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం యూనిట్కు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు (గ్యాస్) రేటు రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం వచ్చే మూడేళ్లలో దాదాపు 10 డాలర్లకు పెరగనుంది. ఫలితంగా ఎరువుల రంగానికి ఇచ్చే సబ్సిడీ కన్నా ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం లభించనుంది. పలు కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఈ మేరకు వివిధ అంచనాలు ప్రకటించాయి. బార్క్లేస్ ఈక్విటీ రీసెర్చ్ అంచనాల ప్రకారం 2014-15లో గ్యాస్ రేటు 8.3 డాలర్లుగాను, అటు పై ఏడాది 9.1 డాలర్లుగా, 2016-17లో 9.4 డాలర్లుగాను ఉండనుంది. మరోవైపు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ ధర 10 డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటుందని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ రేటు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 8.4 డాలర్లకు పెరగనున్న సంగతి తెలిసిందే. ఈ రేటును ద్రవీకృత గ్యాస్ (ఎల్ఎన్జీ) ధరలకు అనుసంధానించడం వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ రేటు 10 డాలర్ల మేర మారితే దేశీయంగా 0.1-0.5 డాలర్ల మేర మారగలదని బార్క్లేస్ ఒక రీసెర్చ్ నోట్లో పేర్కొంది. అధిక ధరల వల్ల గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు 2014-15 నుంచి 4 బిలియన్ డాలర్ల మేర ఆదాయాలు రాగలవని.. ప్రభుత్వానికి రాయల్టీ, లాభాల్లో వాటా, పన్నులు, డివిడెండ్ల రూపంలో అదనంగా 505 మిలియన్ డాలర్లు లభించగలవని అంచనా వేసింది. ఇక, నిర్దిష్ట స్థాయిలో గ్యాస్ అమ్మకాలు ఉంటే 2014-15లో ఓఎన్జీసీకి రూ. 16,400 కోట్ల ఆదాయం, రూ. 9,700 కోట్ల లాభాలు అదనంగా లభించగలవనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. ఆయిల్కు రూ. 2,000 కోట్లు, రిలయన్స్కి రూ. 3,400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది. గ్యాస్, విద్యుత్ రేట్లు పెరుగుతాయ్.. దేశీయంగా రోజుకు 86 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) మేర ఉత్పత్తయ్యే గ్యాస్లో దాదాపు 67 ఎంసీఎండీని విద్యుత్, ఎరువులు, ఎల్పీజీ రంగ కంపెనీలే వినియోగిస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. కొత్త రేటు వల్ల వీటిపై అదనంగా రూ. 19,700 కోట్ల భారం పడుతుందని వివరించింది. ఈ భారాన్ని గాని వినియోగదారులకు బదలాయించిన పక్షంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ రేట్లు 45 శాతం పెరుగుతాయని, యూరియా రేట్లు 60% మేర పెరగగలవని పేర్కొంది. -
భారత్లో సహజ వాయువుతో నడిచే రైళ్లు
భారత్లోనూ సహజ వాయువుతో నడిచే రైళ్లు త్వరలో రానున్నాయి. ఇంధనంగా ప్రస్తుతం వాడుతున్న డీజిల్కు బదులు సహజ వాయువును ఉపయోగించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే ఈ మేరకు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే శాఖ ఈ మేరకు ప్రతిపాదించినట్టు తెలిపారు. సహజ వాయువు వాడటం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఖర్గే చెప్పారు. దీనివల్ల వాతావరణాన్ని కలుషితం చేసే కర్బన రసాయనాలు వెలువడకుండా నియంత్రించవ్చని తెలిపారు. ఇక కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల మేర లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు డబ్లింగ్ పనులు, కొత్త రైళ్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన రూపొందించినట్టు ఖర్గే చెప్పారు. -
రిలయన్స్కు డీజీహెచ్ మరో షాక్!
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) మరోసారి షాక్ ఇచ్చింది. గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించాలన్న ప్రతిపాదనను పరిశీలించేందుకు డీజీహెచ్ నిరాకరించింది. డీజీహెచ్ డెరైక్టర్ జనరల్ ఆర్ఎన్ చౌబే నేతృత్వంలోని బ్లాక్ నిర్వహణ కమిటీ(ఎంసీ) దీనికి ‘నో’ చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్వతంత్ర నిపుణుల కమిటీ అవసరమేనని ఎంసీ భేటీలో చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే అభిప్రాయపడగా... ఇతర సీనియర్ అధికారులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో నిర్ణయం తీసుకోలేదు. స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలని ఆర్ఐఎల్ చాన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్న విషయం విదితమే. గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి బావుల్లోకి నీరుచేరడం, ఇసుక మేటలు వేయడం వంటి భౌగోళిక సమస్యలే కారణమని ఆర్ఐఎల్ చెబుతూవస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గ్యాస్ ధర పెంపు తర్వాత లాభాలు దండుకోవడానికి ఆర్ఐఎల్ గ్యాస్ను దాచిపెట్టి, మాయచేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిలో నిజానిజాలను తేల్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తగినన్ని బావులను తవ్వకపోవడంవల్లే గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి దిగజారిందని డీజీహెచ్ పదేపదే స్పష్టం చేసింది.