OTP
-
ఓటీపీ లేకుండానే రూ.1.90 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ మహిళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లేకుండానే రూ.1.90 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్ అయినట్లు ఫోన్లో మెసేజ్ రాగానే ఆ మహిళ అప్రమత్తమై 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 1930 కాల్ సెంటర్లో ఏజెంట్ కాల్ రిసీవ్ చేసు కుని వెంటనే బ్యాంకింగ్ ఫాలోఅప్ బృందాన్ని అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన బృందం మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి అక్కడున్న రూ.75,69,223లను స్తంభింప చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో రూ.35 లక్షలు వివిధ బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకుల నిధులను కూడా హోల్డ్లో పెట్టించారు. ఈ విధంగా రూ.1.90 కోట్ల నిధుల్లో నుంచి రూ.1,10,70,000లను కేటుగాళ్ల నుంచి రికవరీ చేయగలిగినట్లు రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. మిగిలిన రూ.79.30 లక్షల విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నవారు ఒకట్రెండు గంటల్లోనే (గోల్డెన్ హవర్స్) ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు. -
ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.ఫేక్ కాల్స్, మెసేజ్లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..బల్క్ మెసేజ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
ఇదో కొత్తరకం సైబర్ మోసం!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్కు ఎటువంటి సమాచారం రాకుండా చేస్తూ అకౌంట్లో నుంచి డబ్బు దోచేస్తున్నారు. ఈ తరహా మోసం ఇటీవల బిహార్లోని పూర్నియాలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ), బ్యాంక్ నుంచి కాల్ రాకుండా, ఇలా ఎటువంటి క్లూ కూడా లేకుండా డబ్బులు దోచుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను హర్యానా ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు.No OTP,No phone call,No clue,But money was stolen from the bank account...(with the help of Registry papers)Case is of Purnia Bihar . #CyberFraud pic.twitter.com/jeVGqhMWmV— Pankaj Nain IPS (@ipspankajnain) July 11, 2024బిహార్లోని పూర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వెబ్సైట్ నుంచి భూమి రికార్డుల పత్రాల వివరాలు సేకరించి ఆ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని బ్యాంకులో చొరబడి తారుమారు చేశారు. భూరికార్డుల్లో ఆధార్కార్డు, బయోమెట్రిక్లను తారుమారు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించారు. ఈ విధంగా మొబైల్ ఫోన్కు కాల్, ఓటీపీ రాకుండానే మోసానికి పాల్పడ్డారు’ పోలీసులు తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన!
దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అంతే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అడిషనల్ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ప్రామాణీకరణను తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్సైట్లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్మెంట్లో దీన్ని ప్రస్తావించింది. డిజిటల్ పేమెంట్ లావాదేవీల ప్రామాణీకత కోసం మెరుగైన విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మనం ఏదైన ఆర్థిక లావాదేవీని డిజిటల్గా నిర్వహించినప్పుడు ఆథెంటికేషన్ కోసం ఫిన్టెక్ సంస్థ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తేనే లావాదేవీని పూర్తి చేయడానికి వీలవుతుంది. బ్యాంక్ ఖాతాల భద్రతను నిర్ధారించడానికి, చట్టవిరుద్ధంగా పొందిన ఆర్థిక డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ అడిషనల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ( AFA ) ఒక కీలక దశ. ఆర్బీఐ నిర్దిష్ట ఏఎఫ్ఏని నిర్దేశించనప్పటికీ చెల్లింపుల వ్యవస్థ ఎక్కువగా ఎస్ఎంఎస్-ఆధారిత వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అనుసరిస్తోంది. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ప్రత్యామ్నాయ ప్రమాణీకరణ యంత్రాంగాలు వచ్చాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఇటువంటి యంత్రాంగాల వినియోగాన్ని పరిశీలించాలని ఆర్బీఐ సూత్ర ప్రాయ ప్రతిపాదనలు చేసింది. ఇక ఇదే ప్రకటనలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS)కు సంబంధించిన ప్రతిపాదనలూ చేసింది. బ్యాంకులు అనుసరించాల్సిన AePS టచ్పాయింట్ నిర్వాహకుల కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్బోర్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే మోసాలను నిరోధించే చర్యలను సైతం పరిగణననలోకి తీసుకోవాలని సూచించింది. గతేడాది ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 37 కోట్ల మంది లావాదేవీలు నిర్వహించారు. -
ఆగని టీడీపీ సర్వే నాటకాలు
మార్టూరు: ప్రజలు ఎంత ప్రతిఘటించినా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ మోసాలను మాత్రం విడనాడటం లేదు. ‘మీకు మా పథకాలు వస్తాయి..’ అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ సర్వే పేరిట వారి వివరాలు సేకరించి తమ ఫోన్లలో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి ఫోన్లకు వచ్చిన ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు వారిని నిలదీస్తే పారిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తన్నీరు రాజు, ముక్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. డేగరమూడి గ్రామంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ విప్పర్ల బాలకృష్ణ టీడీపీ కార్యకర్త. అతను రెండు రోజులుగా మరో వ్యక్తితో కలిసి తమ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, పెద్దవారిని కలిసి వారి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. కాలనీ వాసుల సెల్ఫోన్లకు వచ్చిన ఓటీపీలు తెలుసుకుని తమ సెల్ఫోన్లలో నమోదు చేస్తున్నారు. ఇలా ఆది, సోమవారాలు రెండు రోజులలో 50కిì పైగా కుటుంబాల వివరాలు సేకరించారు. ఈ విషయం స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు జంపని వీరయ్య చౌదరి దృష్టికి రాగా, ఆయన స్థానికులతో కలిసి ఆదర్శనగర్ కాలనీకి వెళ్లి సర్వే చేస్తున్న టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. దీంతో వారు బైక్తో పారిపోయారు. ఆ యువకులు ఏం వివరాలు అడుగుతున్నారని వీరయ్య చౌదరి స్థానికులను ఆరా తీయగా... ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో వివరాలు అడిగారని, తమ కుటుంబ వివరాలు సెల్ఫోన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా.. అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో గ్రామానికి చెందిన తన్నీరు రాజు, అన్నం శ్రీను, మరికొందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డేటా చౌర్యం చేస్తున్న పచ్చమూకలు
నూజివీడు: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. బాబు ష్యూరిటీ–భవిష్యత్కు గ్యారంటీ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి.. అమాయకులైన ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టి వారి ఫోన్ల నుంచి సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు తమ ఫోన్లు తీసుకొని ఓటీపీలు ఎందుకు సేకరిస్తున్నారో తెలియడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని గ్రామాల్లో పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రజల ఇళ్లకు వెళ్తున్నారు. వారితో మాటలు కలిపి.. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. అనంతరం వారి ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మెసేజ్లు పంపించి.. ఓటీపీలు సేకరిస్తున్నారు. మెసేజ్లు చూడటం తెలియనివారి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలే ఫోన్లు తీసుకొని ఓటీపీలను తమ ట్యాబ్లలో నమోదు చేసుకుంటున్నారు. రేగుంట గ్రామంలో ఇదే విధంగా జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ మూకలను ఎవరైనా ప్రశ్నిస్తే.. టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ లింక్ పంపించి.. మీ కుటుంబం పలు పథకాలకు అర్హత పొందిందని.. 2024 జూన్ తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయంటూ మభ్యపెడుతున్నారు. నూజివీడుకు చెందిన వాసవికి ఆడబిడ్డ నిధి, ఇతర పథకాల కింద ఏడాదికి రూ.54 వేలు వస్తాయని, ఐదేళ్లకు రూ.2.70 లక్షలు లబ్ధి పొందుతారంటూ చెప్పి.. ఆమె సమాచారమంతా సేకరించారు. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకు? టీడీపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చారు. ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగారు. చెప్పగా.. నా ఫోన్కు ఏదో మెసేజ్ పంపించారు. నాకు చూడటం రాదని చెప్పగా.. వాళ్లే ఏదో నమోదు చేసుకొని వెళ్లారు. ఏదో ఓటీపీ నా ఫోన్ నుంచి తీసుకున్నారని ఆ తర్వాత తెలిసింది. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకో అర్థం కావడం లేదు. – కె.విజయకుమార్, రేగుంట -
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్వర్డ్ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్తో పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్వర్డ్ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
ఆన్లైన్ షాపింగ్లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్లైన్లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులకు ఓటీపీ కష్టాలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్య నెల రోజుల కింద శెట్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో 118 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాడు. అతనికి రూ.2,43,080 సొమ్ము రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సదరు రైతు నర్సయ్య మొబైల్కు ఓటీపీ మెస్సెజ్ రాకపోవడంతో ధాన్యం సొమ్ము ఇప్పట్లో జమ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాకాలం పంటలకు పెట్టుబడి ఎలా పెట్టాలనే సందిగ్ధంలో ఉన్న రైతు నర్సయ్యకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇది ఒక్క రైతు నర్సయ్యకు ఎదురైన సమస్యనే కాదు. ఎంతో మంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కలుగుతున్న కష్టాలు. ఓటీపీ మొబైల్ ఫోన్కు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. జిల్లాలో యాసంగి సీజనుకు సంబంధించిన ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులను ఓటీపీ కష్టాలు వెంటాడుతుండటంతో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను సేకరించారు. దాదాపు 200 లారీల ధాన్యానికి సంబంధించి రైతులకు ఓటీపీ జనరేట్ కావడం లేదు. యాసంగి పంటలకు సంబంధించి క్రాప్బుకింగ్ సరిగా పూర్తి చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే ధాన్యం ఏ మిల్లుకు తరలించాలో అలాట్మెంట్ జరగకపోవడంతో ఓటీపీ రావడం లేదని తెలుస్తుంది. రోజుల తరబడి ధాన్యం డబ్బులు కోసం రైతులు నిరీక్షించడానికి ఓటీపీ ప్రధాన సమస్య అని వెల్లడైతుంది. యాసంగిలో సాగు చేసిన పంటలను ఏఈవోలు క్రాప్బుకింగ్ పూర్తి చేశారు. కొన్ని చోట్ల రైతు సాగు చేసిన విస్తీర్ణానికి నమోదైన ఎకరాలకు తేడా ఉండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం లెక్క, రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి వీలు పడటం లేదు. కమ్మర్పల్లి సహకార సంఘం పరిధిలో క్రాప్ బుకింగ్లో అనేక తప్పులు దొర్లడంతో రైతులకు ఓటీపీ జనరేట్ చేయడం ఇబ్బందిగా మారింది. చివరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయాధికారులతో సంప్రదింపులు జరిపి క్రాప్ బుకింగ్ను సరి చేయాల్సి వస్తుంది. పంటలను సాగు చేసిన సమయంలోనే క్రాప్ బుకింగ్ పక్కాగా చేసి ఉంటే సమస్య వచ్చేది కాదని రైతులు అంటున్నారు. -
వాట్సాప్లో హల్చల్ చేస్తున్న పింక్ లింక్
వైఎస్సార్: ఇటీవల వాట్సాప్లో వాట్పాప్ అప్డేట్ పేరుతో పింక్ లింక్ హల్చల్ చేస్తోంది. దీనిపై పోలీసులు మొబైల్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ మొబైల్ అప్లికేషన్ అయినా అప్డేట్ ప్లేస్టోర్లో మాత్రమే వస్తుంది. లింక్ల రూపంలో రాదు. లింక్ రూపంలో వచ్చిందంటే యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఇలాంటివి ఓపెన్ చేసినప్పుడు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఆ లింక్ షేర్ అవుతుందన్నారు. పొరపాటున ఓపెన్ చేసిన వారు వెంటనే పింక్ కలర్ వాట్సాప్, ఆన్లైన్ స్ట్రీమ్ను అన్ ఇన్స్స్టాల్ చేస్తే లింక్ షేర్ అవ్వకుండా ఆపవచ్చన్నారు. -
ఇన్స్టాల్ చేసే యాప్తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్ఫోన్ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్ఫోన్ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్ఫోన్కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఓటీపీ..డబ్బంతా లూటీ
ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్ వచ్చి.. మీకేదో ఆర్డర్ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్తోనే బుక్ అయిందని’ ఆ మోసగాడు నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు. సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తతే రక్షా కవచం మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు స్మార్ట్ ఫోన్లు వచి్చన తరువాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దర్, ఎస్పీ (సైబర్ క్రైమ్) సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు : ఏపీ సైబర్ మిత్ర : 91212 11100 (వాట్సాప్ నంబర్) టోల్ ఫ్రీ నంబర్లు: 100, 112 జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్: 1930 -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
మొబైల్కు వచ్చిన ఓటిపీ చెప్పమని అడిగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం. కానీ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఆన్లైన్ నేరగాళ్లు ఓటీపీ అవసరం లేకుండానే రూ.50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్కు మిస్డ్ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు నగదు బదిలీ చేశారు. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండీకి కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి పదే పదే కాల్ వస్తోంది. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు ఒకసారి, రూ.4.6 లక్షలు ఒకసారి.. ఇలా పలుమార్లు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఇతర అకౌంట్లలలోకి వెళ్లిపోయాయి. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 'సిమ్ స్వాపింగ్' టెక్నిక్ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నకిలీ సిమ్ కార్డు సృష్టించి దానితోనే లావాదేవీలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. బహూశా జార్ఖండ్ జంతారాకు చెందిన నేరగాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నగదు బదిలీ అయిన అకౌంట్లు కూడా వాళ్లవి కాదని పేర్కొన్నారు. -
400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి!
సైబర్ నేరస్తులు తెలివి మీరారు. యూజర్ల మెటా యూజర్ల ఐడీ, పాస్వర్డ్లను దొంగిలించేందుకు 400 రకాలైన ప్రమాదకర యాప్స్ను తయారు చేశారు. ఆ యాప్స్ను సోషల్ మీడియా యూజర్లను వినియోగించేలా చేశారు. ఈ తరుణంలో మెటా ఆ యాప్స్ను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్స్ చెప్పింది. మెటా యూజర్ల పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారం దొంగించడానికే సైబర్ కేటుగాళ్లు ఇలాంటి యాప్స్ చేసినట్లు వెల్లడించింది. ఫొటో ఎడిటర్స్ గేమ్స్, వీపీఎన్ సర్వీసెస్, బిజినెస్తో పాటు ఇతర సర్వీసులు అందిస్తామంటూ సైబర్ నేరస్తులు యూజర్లకు యాప్స్ నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఒకే వేళ నచ్చి యూజర్ వాటిని డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారి వివరాల్ని సేకరించి.. వాటిని డార్క్ వెబ్లో అమ్ముకోవడంతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా తెలిపింది. సేఫ్గా ఉండాలంటే ఈజీ మనీకోసం సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్స్ రివ్వ్యూ, వాటి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫేక్ రివ్వ్యూలతో యూజర్లను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. ఏదైనా యాప్ మీరు దానిని ఇన్స్టాల్ చేసుకోకముందే లాగిన్ డీటెయిల్స్ అడిగితే వాటి జోలి వెళ్లకపోవడమే మంచిది. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే ఓటీపీ ఆప్షన్ సెట్టింగ్ మార్చుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉మార్క్ జుకర్ బర్గ్ : ‘వర్క్ కంప్లీట్ చేయకపోతే..నిన్ను ఈ కత్తితో నరికేస్తా!’ -
సైబర్ క్రైమ్ నేపథ్యంలో 'ఓటీపీ' చిత్రం
నందితా శ్వేత, రామ్ జంటగా కల్యాణ్ కుమార్ దర్శకత్వంలో ‘ఓటీపీ’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రాన్ని యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్కి చిత్రనిర్మాత కుమార్తె బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీ రామచంద్ర క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కి అందించారు. ‘‘సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ కుమార్. ‘‘తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో శివరాత్రికి మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు గురు ప్రసాద్ రెడ్డి. ‘‘ఈ సినిమాలోని ఎమోషన్స్ గ్రిప్పింగ్గా ఉంటాయి’’ అన్నారు రామ్ మిట్టకంటి. -
కొత్త దారిలో సైబర్ మోసగాళ్లు
-
ఓటీపీతో లూటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్ లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ‘సార్ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్. సరే అని మెసేజ్లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్ స్కామ్ పేరిట సైబర్ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. డార్క్ వెబ్ నుంచి... సైబర్ నేరస్తులు ముందుగానే డార్క్ వెబ్ నుంచి మన ఫోన్ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు. నేను ఆర్డర్ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు ఓటీపీ అనేది ఆన్ లైన్ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. – జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ (చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర) -
సైబర్ దొంగ భలే స్మార్ట్ గురూ!
బనశంకరి: ఐటీ సీటీలో సైబర్ కేటుగాళ్లు వంచనకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఫోన్లు చేసి కేవైసీ, ఆధార్ అనుసంధానం పేరుతో ఓటీపీలు తెలుసుకొని నగదు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం కొత్త పంథా అనుసరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయించి ఓటీపీ యాక్సెస్ లేకుండా సులభంగా మీ మొబైల్లో ఉన్న పూర్తిసమాచారం తెలుసుకుని అకౌంట్ నుంచి నగదు కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ వంచకుల బారినపడి లక్షలు పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఫోన్పే, గూగుల్పేలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే ముసుగులో వంచకులు మోబైల్ వినియోగదారులకు ఫోన్ చేస్తారు. ప్లేస్టోర్లో అందుబాటులో ఉండే థర్డ్పార్టీ యాప్లైన ఎనీడెస్క్ టీమ్వ్యూవర్హాస్క్, క్విక్సపోర్ట్, రిమోట్డ్రైడ్, ఏర్మిరర్, రిమోట్ కంట్రోలర్ లేదా స్క్రీన్షేర్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. దీంతో వినియోగదారులు యాప్లను డౌన్లోడ్ చేసుకున్న తక్షణం ఆ సెల్ఫోన్ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ వంచకుల చేతిల్లోకి వెళ్లిపోతాయి. దీంతో సులభంగా నెట్బ్యాంకింగ్ సమాచారం, పాస్వర్డ్స్, ప్రముఖ డేటా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరిస్తారు. బ్యాంకులో నగదు బదిలీకి ప్రయత్నిస్తారు. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వినియోగదారుడికి వెళ్లకుండానే వంచకులు తెలుసుకొని నగదు తమ ఖాతాలకు జమ చేస్తారు. బ్లాక్మెయిల్.. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా స్మార్ట్ ఫోన్లను యాక్సెస్ చేసే సైబర్కేటుగాళ్లు మొబైల్స్లోని డేటా, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి తర్వాత ఫోన్ వినియోగదారులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు: ఫోన్పే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఫోన్పే వినియోగదారులు సహాయవాణి నెంబరు కోసం గాలించరాదు బ్యాంకింగ్ సమస్య లేదా ఏటీఎం వ్యాలిడిటి కొనసాగించే పేరుతో ఫోన్ చేసే వారికి సమాధానం ఇవ్వరాదు ప్లేస్టోర్లో పరిశీలించకుండా ఎలాంటి థర్డ్పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోరాదు మొబైల్లో పరిచయం లేని యాప్లను డిలిట్ చేయాలి ఎవరు ఫోన్చేసి అడిగినా ఓటీపీ, సీవీవీ, పిన్కోడ్ తెలపరాదు ప్రభుత్వం నుంచి లేదా నమ్మకమైన సంస్థ నుంచి అధికారిక యాప్ కాదా అని నిర్ధారించుకోవాలి. (చదవండి: -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్ను ఓపెన్ చేయద్దు. ఫోన్కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్లు లేదా షార్ట్ లింక్లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబుతున్నారా?
పిల్లల పుస్తకాలు సర్దుతుండగా ఫోన్ మోగితే తీసింది మంగ. అవతలి నుంచి ‘మేడమ్ మీ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంది. బ్యాంకు నుంచి మీకో మెసేజ్ వస్తుంది. అందులోని కోడ్ చెప్పాల్సి ఉంటుంది చెప్పండి’ అనడంతో అలాగే అంది మంగ. వచ్చిన మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చిందే కాబట్టి ఫర్వాలేదులే అన్న భరోసాతో ఆ కోడ్ నంబర్ చెప్పేసింది. అవతలి నుంచి ‘సరే, మేడమ్.. థాంక్యూ’ అంటూ ఫోన్ కట్ చేశారు. మంగ ఫోన్ పక్కన పెట్టేసే టైమ్లో వచ్చిన మెసేజ్ అలర్ట్ చూసి ఏంటా అని ఆ మెసేజ్ ఓపెన్ చేసి, చూసింది. బ్యాంకునుంచి మెసేజ్.. తన ఖాతానుంచి ఎవరో అకౌంట్కు రూ.2 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉండటంతో షాక్ అయ్యింది. ∙∙ సుందర్ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్ రావడంతో విసుగ్గా ఆన్సర్ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్ కార్డ్ బోనస్ పాయింట్స్ రిడీమ్ చేసుకోమంటూ కస్టమర్ కేర్ కాల్. కట్ చేద్దామంటే పాయింట్స్ గురించి చెబుతున్నారు. కొంతైనా బెనిఫిట్ ఉంటుంది కదా అని కాలర్ అడిగిన సమాధానం చెబుతూ వచ్చాడు. పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి ధృవీకరణ ప్రశ్నలు అడగడంతో చెప్పాడు. ‘మీ నంబర్కు వచ్చిన మెసేజ్ లింక్ ఓపెన్ చేసి, వివరాలు ఇస్తే, ఐదు నిమిషాల్లో మీకు రిడీమ్ పాయింట్స్ మనీబ్యాక్ వస్తుంది సర్’ అనడంతో అదే పని చేశాడు సుందర్. ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి, తినడం పూర్తయ్యాక ఆఫీసుకు బయల్దేరుతూ ఫోన్ చూసుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ ఉండటంతో సుందర్ కి ఏమీ అర్థం కాలేదు. ∙∙ ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలలో OTP/UPI మోసం ఒకటి. మధ్యవయస్కులు, వృద్ధులే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. మోసగాళ్లు బాధితుల నుంచి ఓటీపిని అడుగుతారు. లేదా స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా బాధితుడి ఫోన్పై వారికి తెలియకుండానే పూర్తి నియంత్రణను సాధిస్తారు. ఫోన్పై పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత, మోసగాడు పాస్వర్డ్లను పట్టుకుని బాధితుడి ఖాతాతో లావాదేవీలు చేయడం ప్రారంభిస్తాడు. ఇటీవలి కాలంలో నగదు చెల్లింపులను సులభతరం చేసే డిజిటల్ లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వేగవంతమైన ప్రక్రియగా మారింది. దీంతో UPI ప్లాట్ఫారమ్లోనూ వివిధ రకాల మోసాలు చోటుచేసుకుంటున్నాయి. మోసగాళ్ల లక్ష్యాలు బాధితుల దృష్టిని ఆకర్షించడానికి, మోసగాళ్ళు బ్యాంక్ సిబ్బందిలా నటించి, అప్డేట్లు, బోనస్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ల వంటి సాధారణ సమస్యల కోసం కాల్ చేస్తారు. కాల్ సహజమైనదే అనిపించడానికి వారు మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్ను ధృవీకరించమని అడగడం ద్వారా బ్యాంకర్లు సాధారణంగా చేసే ప్రక్రియను అనుకరిస్తారు. ►మోసగాళ్లు ఒక కథను రూపొందిస్తారు. తద్వారా బాధితుడు సమస్యను పరిష్కరించడానికి వారికి వ్యక్తిగత సమాచారాన్ని అందజేస్తారు. ►మోసగాడు బాధితుడిని వారి ఫోన్కు స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని అడుగుతాడు. దాంట్లో భాగంగా TeamViewer, AnyDesk వంటివిPlaystore / App store అందుబాటులో ఉన్నాయి. OTP మోసానికి మరొక పద్ధతి ►సంక్షిప్త లింక్లు, గూగుల్ ఫారమ్లతో ఎసెమ్మెస్ ద్వారా లాగిన్, పాస్వర్డ్, OTP/UPI డేటాను పూరించమని అడుగుతారు. ►ప్రత్యామ్నాయంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ మొదలైన అప్లికేషన్లలో మోసగాడు (కొనుగోలుదారులా నటించి) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు చెల్లింపు అభ్యర్థనను పంపుతాడు. ►మోసగాళ్లు (కొనుగోలుదారులా నటించడం) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు త్వరగా స్పందించడానికి క్యూఆర్ కోడ్ చెల్లింపు అభ్యర్థనను పంపుతారు మోసపోకుండా జాగ్రత్తలు ►∙సురక్షిత చెల్లింపు కోసం (https://- URL) ప్యాడ్లాక్ సింబల్ చూడండి ►OTP / MPIN నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ భాగస్వామ్యం చేయవద్దు. ►మీరు ఫోన్కాల్లో ఉన్నప్పుడు హడావుడిగా చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకండి. ►కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. ►∙కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను పూరించవద్దు. ►ఫోన్ కాల్లో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవద్దు, ►ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ఫోన్లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లను అంటే టఛిట్ఛ్ఛn జ్చిట్ఛ, అnyఈ్ఛటజు, ఖ్ఛీ్చఝ Vజ్ఛీఠ్ఛీట మొదలైన వాటిని ఉపయోగించవద్దు. ►గూగుల్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం శోధించవద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ నుంచి కస్టమర్కేర్ నంబర్ను తీసుకోవడం సురక్షితం. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైబర్ బొంకు..బూస్టర్ డోస్ పేరుతో నేరగాళ్ల నయా పన్నాగం
సాక్షి హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమతుంటే.. దీనిని సాకుగా తీసుకుని సైబర్ నేరస్తులు సరికొత్త మోసాలకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నకిలీ లింక్లు పంపిస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి నేరస్తుల వలలో చిక్కి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తాజాగా బూస్టర్ డోస్, ఉచిత ఒమిక్రాన్ పరీక్షల పేరిట మోసాలకు సిద్ధమవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫలానా రోజున, ఫలానా ప్రాంతంలో బూస్టర్ డోస్ కోసం ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ పంపిస్తూ అమాయకులకు వల వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగర ప్రజలూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఓటీపీతో హ్యాంకింగ్.. బూస్టర్ డోస్ ప్రచారాన్ని ప్రజలను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మెడికల్, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల నంబర్లను డిస్ప్లే అయ్యేలా స్పూఫింగ్ చేయడంతో మోసగాళ్లు ఫోన్ చేసినా సరే బాధితుల ఫోన్లో ‘వ్యాక్సిన్ డిపార్ట్మెంట్’ అని సెల్ఫోన్లో కనిపిస్తుంటుంది. దీంతో అటువైపు నుంచి బాధితులు కూడా సులువుగా నమ్మేస్తారు. టీకా కోసం షెడ్యూల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మెసేజ్, వాట్సాప్, ఈ– మెయిల్స్కు నకిలీ లింక్లు పంపిస్తున్నారని తెలిసింది. తమ పేర్ల నమోదు నిర్ధారణ కోసం సెల్ఫోన్కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) తెలపాలని కోరుతున్నారు. ఓటీపీ తెలపగానే.. బాధితుల సె ల్ఫోన్ లేదా కంప్యూటర్కు హానికరమైన సాఫ్ట్వేర్లను పంపిస్తారు. దీంతో బాధితుడి ఎలక్ట్రానిక్ ఉపకరణం హ్యాక్ అయిపోతుంది. ఆపైన సెల్ఫో న్లోని క్రెడిట్, డెబిట్ కార్డ్, యూపీఐ, ఆధార్, పాన్ కార్డ్ నంబర్లు, ఈ– మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారు. వాటి సహాయంతో మోసాలకు పాల్పడే ప్రమాదముంది. 56 కేసులు నమోదు.. కరోనా ప్రారంభ దశలో సైబర్ నేరస్తులు కోవిడ్ మందులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల, కాన్సట్రేటర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే సాధనాలు వంటివి సరఫరా చేస్తామనే మాయమాటలతో ప్రజలను నమ్మించి దోచుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కరోనా మందుల బ్లాక్ మార్కెట్పై 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు బూస్టర్ డోస్ ఇస్తామని వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కోవిడ్ బూస్టర్ డోస్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్లు కూడా ఓటీపీ అడగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటీపీ అడిగితే మోసమే బూస్టర్ డోస్ తీసుకుంటే సురక్షితమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో డోస్ ఇప్పిస్తామని నకిలీ మెసేజ్, ఫోన్లు, లింక్లు పంపించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఎవరైనా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు, యూపీఐ, ఓటీపీ అడిగారంటే మోసమేనని గుర్తించాలి. – డాక్టర్ లావణ్య, డీసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ -
ఓటీపీ ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డుల నుంచి నగదు లూటీ
విజయవాడకు చెందిన మల్లెల శేషగిరిరావు బెంగళూరులో ఉండే తన స్నేహితుడికి పుట్టిన రోజు బహుమతి ఇచ్చేందుకు ఓ వస్తువు కోసం ఆన్లైన్లో వెతికాడు. తన స్నేహితుడి కోరిక మేరకు ఓ వస్తువును కొనుగోలు చేసేందుకు ఓ విక్రయ కంపెనీని మెయిల్ ద్వారా సంప్రదించాడు. తన స్నేహితుడు ఉండే చిరునామాకు సదరు వస్తువును డెలివరీ ఇస్తామని కంపెనీ నుంచి హామీ వచ్చిన తర్వాత శేషగిరిరావు నగదు లావాదేవీలు ప్రారంభించాడు. అయితే రూ. 620 ఖరీదు చేసే వస్తువుకు కంపెనీ రూ. 49,999 బిల్ చేసి శేషగిరిరావును ఓటీపీ అడిగింది. దీంతో అనుమానం వచ్చిన శేషగిరిరావు నగదు లావాదేవీలను వెంటనే ఆపేసి.. వస్తు కొనుగోలును ఉపసంహరించుకున్నాడు. ఈ వ్యవహారం జరిగింది ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన. సీన్ కట్ చేస్తే.. అయితే అదే రోజు శేషగిరిరావు ఉపయోగించే క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 49,999 డెబిట్ అయినప్పటికీ మెసేజ్ మాత్రం రాలేదు. కాగా వారం క్రితం క్రెడిట్ కార్డు సంస్థ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ముంబై కేంద్రంగా నడిచే ప్రముఖ ఆన్లైన్ సంస్థ ద్వారా హరియాణా నుంచి రాజస్థాన్కు ఓ పార్సిల్ డెలివరీ అయ్యిందని దానికి గానూ రూ.49,999 అయినట్లు ఆ మెసేజ్ ఉంది. తనకు సంబంధం లేని వస్తు డెలివరీకి తన ఖాతా నుంచి నగదు పోవడంతో కంగారు పడిన శేషగిరిరావు వెంటనే బ్యాంక్ సిబ్బందిని, క్రెడిట్ కార్డ్ విభాగం అధికారులను, కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజయవాడ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి బాధితులు ఎంతో మంది.. దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకుకు విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ఓ బ్రాంచ్ ఉంది. దీనిలో ఖాతాలు కలిగి.. క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్న 35 మంది ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిర్వాహకులే సైబర్ నేరగాళ్లకు తమ కార్డ్ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నగదు కాజేస్తున్నట్లు బాధితులు అనుమానిస్తున్నారు. పట్టించుకోని సైబర్ క్రైం అధికారులు.. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు బాధితులు క్యూ కడుతున్నా.. కనీసం ఫిర్యాదు సైతం తీసుకోకపోవడంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుండిపోతున్నారు. రూ. 2 లక్షల లోపు మోసం జరిగిన ఫిర్యాదులను తీసుకోమని సైబర్ సెల్ అధికారులు తెగేసి చెప్పడంతో లబోదిబోమంటున్నారు. బాధితులు తమ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లినా కనీసం ఫిర్యాదు తీసుకోవడం లేదనివాపోతున్నారు. బాధితులు వేలల్లో.. కేసులు పదుల్లో.. బాధితులు వేలల్లో ఉంటే గడిచిన ఏడాది కాలంలో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఇక పరిష్కరించిన సమస్యలు ఏడాది కాలంలో రెండు అంకెలు దాటక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే సదస్సులు కూడా అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. క్లిక్ చేస్తే ఖల్లాస్.. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజూ ఎంతో మంది సైబర్ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ యాప్స్ నుంచి ఖాతాదారులకు ‘బ్యాంక్ ఖాతా నిలిచిపోయింది’, ‘గూగుల్ పే, ‘ఫోన్ పే’ ఇకపై వాడలేరంటూ ఫోన్లకు మెసేజ్లు పంపి ఖాతాదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదో అయిపోతుందనే కంగారులో సదరు మెసేజ్ వెబ్ లింక్ను క్లిక్ చేసిన వెంటనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అక్కడ నుంచి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఖాతాలోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు. అయితే మధ్యలో ఉన్న బ్యాంక్ అధికారులకు ఇబ్బందులు రాకుండా ఏదో ఆన్లైన్ డెలివరీ అని సృష్టించి నగదును దోచుకుంటున్నారు. ఖాతాదారులు బ్యాంకులపై న్యాయ పోరాటానికి దిగేందుకు వీలు లేకుండా సైబర్ నేరగాళ్లు బ్యాంక్లకు ఈ విధంగా సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లకు, బ్యాంక్ అధికారులకు సంబంధాలున్నాయనే అనుమానం బాధితుల్లో తలెత్తుతోంది. సైబర్ నేరగాళ్లు తెలివి మీరారు.. పోలీసుల కంటే నేరగాళ్లే ఎక్కువ తెలివిగా, చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రూ. 2 లక్షల పైబడి మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. వాటిలో కొన్ని పరిష్కరించాం. రూ. 2 లక్షల లోపు మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలున్నాయి. అయినప్పటికీ మా దగ్గరకు వచ్చిన వారి వివరాలు సేకరించి.. మరోసారి మోస పోకుండా పలు సూచనలు చేసి పంపుతున్నాం. తక్కువ మొత్తంతో మోసపోయిన వ్యక్తులు వారి ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలి. – కె.శ్రీనివాస్, సీఐ, సైబర్ క్రైం, విజయవాడ -
ఏటీఎం సెంటర్లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా?
కరోనా కారణంగా ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ వినియోగదారుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో జరిగే మోసాల్ని అరికట్టేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఏటీఎం సెంటర్లలో జరిగే సైబర్ నేరాల్ని నివారించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/uCbkltrP8T — State Bank of India (@TheOfficialSBI) October 24, 2021 ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్ ►ఏటీఎం సెంటర్లలో రూ.10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేసే వారికోసం ఎస్బీఐ ఈ కొత్త ఓటీపీ రూల్ ను అమలు చేస్తోంది. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఏటీఏం సెంటర్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం మెషీన్లో డెబిట్ కార్డ్ ఇన్ సర్ట్ చేసిన తరువాత కార్డ్ పిన్, విత్ డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. ►ఆ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఇక ఈ ఓటీపీని అనేది ఒక్క విత్ డ్రాల్కి మాత్రమే పనిచేస్తుంది. రెండో సారి విత్ డ్రాల్ చేయాలంటే మరో కొత్త ఓటీపీని ఎంటర్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ -
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా... జర భద్రం
మన ఆశనే ఆసరాగా చేసుకుని చేసే మోసాలలో ‘పే’ యాప్ల ద్వారా క్యాష్ను కొల్లగొట్టడం ఒకటి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ .. ఏ అప్లికేషన్ ద్వారా అయినా మీరు నగదు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి. కుమారి (పేరు మార్చడమైనది) టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. ‘మేడమ్, మీరు ఆన్లైన్ షాపింగ్లో ఫోన్ కొనుగోలు చేశారు కదా! మీకు రూ.4,999 క్యాష్బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఆ మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే నేను చెప్పే పద్ధతులను జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు. ఈ మొత్తం మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది’ అని చెప్పింది అవతలి వ్యక్తి. దాంతో ఫోన్ పే ద్వారా ఫోన్లో అవతలి వ్యక్తి చెబుతున్న విధంగా వివరాలను జాగ్రత్తగా పొందుపరిచింది కుమారి. ‘మీ బ్యాంక్లో నగదు జమ అయింది. చెక్ చేసుకోండి మేడమ్, థాంక్యూ’ అని ఫోన్ కట్ అయింది. పే యాప్లో చెక్ చేసుకుంది కుమారి. క్రెడిట్ అవ్వాల్సిన నగదు కాస్తా డెబిట్ అయ్యింది. తన అకౌంట్లో నుంచి నగదు తగ్గిపోయి, వేరేవాళ్ల అకౌంట్లోకి వెళ్లినట్టుగా యాప్ హిస్టరీలో ఉండటంతో షాక్ అయ్యింది కుమారి. స్మూత్గా కొల్లగొడతారు వేల రూపాయలే కాదు లక్షల్లోనూ డబ్బును యాప్ల ద్వారా కొల్లగొట్టే ఉపాయాలు పన్నుతున్నారు మోసగాళ్లు. ఫోన్ మాట్లాడుతూనే క్రెడిట్ చేస్తామని చెప్పిన నగదు మొత్తాన్ని, మన అకౌంట్ నుంచి మన చేత్తోనే డెబిట్ చేసుకుంటారు. పూర్తిగా వారి మాటలతో మనల్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నిలువునా ముంచేస్తారు. బోనస్ పాయింట్లు వచ్చాయనో, లాటరీ తగిలిందనో, స్క్రాచ్ కార్డులో క్యాష్బ్యాక్ వచ్చిందనో, బ్యాంక్ మేనేజర్ అనో .. ఇలా ఈ కామర్స్ ఫ్రాడ్స్కి తెరలేపుతారు. అకౌంట్లో ఉన్న నగదును దోచేస్తారు. పద్ధతిగా మోసం మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఒక వస్తువు బుక్ చేశారనుకోండి. ఆ వస్తువు డెలివరీ అయిన అరగంటలో మీకో ఫోన్ కాల్ వస్తుంది. అంటే, రకరకాల మార్గాల ద్వారా మీ ఫోన్ నెంబర్ను హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. మీ వివరాలన్నీ తెలియజేస్తూ, వాటి పనితనం గురించి చెబుతూ తిరిగి సర్వీస్ అందించాలంటే ఫలానా ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతారు. ఆ ‘కబుర్ల’ను నమ్మి ఫోన్ చేస్తే, బ్యాంకు వివరాలన్నీ రాబట్టడానికి ఎన్ని పద్ధతులు అవలంబించాలో అన్నీ అమలులో పెట్టేస్తారు. సులభమైన మార్గాలు డిజిటల్ లావాదేవీలు జీవితాన్ని సులభతరం చేశాయి. UPI ఇటీవలి కాలంలో ఎంచుకున్న సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. మీ ఆర్థిక లావాదేవీకి అధికారం ఇవ్వడానికి మీకు కావలసిందల్లా కేవలం 4 అంకెల పిన్, మొత్తం బదిలీ ప్రక్రియ సెకన్లలో జరుగుతుంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాదాపు అన్నిUPI యాప్లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ సాంకేతికంగా సురక్షితమైనవి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్,ఐఎమ్ క్లోన్..ఇతరత్రా మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి మోసగాళ్లు రకరకాల ప్రణాళికలు రచిస్తుంటారు. ఇ–మోసగాళ్లకు సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఉండటం వల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. కబుర్లతో వల మోసగాళ్లు సాధారణంగా ఇతరులను ఆకర్షించడానికి రకరకాల టార్గెట్లను ఎంచుకుంటారు. వాటిలో.. వారు తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగా చెప్పుకుంటారు, కెవైసీ అప్డేట్ చేస్తున్నామని, బోనస్ పాయింట్లు వచ్చాయని, క్యాష్ బ్యాక్లను రిడీమ్ చేస్తున్నామని.. వంటి వాటిని ఫోన్ కాల్ రూపంలో మనతో మాట్లాడుతారు. స్క్రీన్ షేరింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటారు. స్కామర్లు మన ఫోన్కి వచ్చిన OTPని అడగచ్చు. కోడ్ చెప్పిన తర్వాత వారి ఫోన్ నుండే అనుమతిని ఓకే చేయమని కూడా అడగచ్చు. యాప్కు అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్ మన ఫోన్ని మనకే తెలియకుండా పూర్తిగా నియంత్రించడం ప్రారంభిస్తాడు. పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత స్కామర్ పాస్వర్డ్లను దొంగిలించి, UPI ఖాతాతో లావాదేవీని ప్రారంభిస్తాడు. అకౌంట్లో ఉన్న మోత్తాన్ని ఖాళీ చేస్తాడు. సురక్షిత చెల్లింపులకు http: // ప్యాడ్ లాక్ సింబల్తో ఉన్న URL లింక్లను క్లిక్ చేయడం సురక్షితం. కొనుగోలుదారు లేదా విక్రేతకు OTP/ MPIN/UPI నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ముఖ్యంగా మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా షార్ట్ లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను అస్సలు పూరించవద్దు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దు. మీరు స్కాన్ చేస్తున్న సమయంలోనే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు అంటే స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ మొదలైన వాటిని స్మార్ట్ఫోన్ లలో ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి.మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం గూగుల్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వెతకవద్దు. -
కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్
RBI Auto-Debit Payments Rules: డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు ముఖ్యగమనిక. ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధన ఇవాల్టి (అక్టోబర్ 1) నుంచి అమలు అయ్యింది. కొత్త రూల్ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై ఐదు వేలకు మించి ఆటోమేటిక్ చెల్లింపులు జరగవు. కచ్చితంగా ఓటీపీ కన్ఫర్మేషన్ జరగాల్సిందే. ఈ విషయాన్ని గుర్తించాలని చెల్లింపుదారులను ఆర్బీఐ అప్రమత్తం చేస్తోంది. అక్టోబర్ 1, 2021 నుంచి ఐదు వేలకు మించిన ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులు.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ఉంటేనే ఆ ట్రాన్జాక్షన్ సక్రమంగా జరిగేది. అంటే ఆటోమేటిక్గా కట్ కాకుండా.. ఓటీపీ కన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల భద్రత కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ప్యాక్లు, ఫోన్ రీఛార్జీలు, బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్(ఐదు వేలకు మించినవి) ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు ఆటోమేటిక్ కార్డు చెల్లింపులు, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర ఈఎంఐపేమెంట్స్గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిటింగ్ ఫెసిలిటీ ఉండేది ఇన్నాళ్లూ. అయితే ఇకపై ఇలా కుదరదు. మ్యానువల్గా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ తరహా పేమెంట్స్కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అలాంటిదేం లేదని స్పష్టం చేసింది ఆర్బీఐ. కాకపోతే తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకొనున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఆర్బీఐ. ఈ తరుణంలో ఇప్పటికే చాలా బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ మెసేజ్లను, మెయిల్స్ను పెట్టేశాయి. చదవండి: లోన్ తీసుకునేవాళ్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్స్ -
ఈఎంఐ పేమెంట్స్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
Auto-Debit For EMI Payments: హోం లోన్స్ ఇతరత్ర నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్ పేమెంట్ మోడ్ను ఆశ్రయిస్తున్నారా? బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్, మొబైల్ వాలెట్స్ వాడుతున్నారా? అయితే అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతున్న కొత్త నిబంధనలను తెలుసుకోండి. ఈ తేదీ నుంచి బ్యాంకులుగానీ, ఇతరత్ర ఫైనాన్షియల్ సంస్థలుగానీ ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం కస్టమర్ల నుంచి ‘అదనపు ధృవీకరణ’ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేకుంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎలాంటి వాటిపై ప్రభావం అంటే.. ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్ స్స్ర్కిప్షన్, మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్ ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు చెల్లింపుల మీద, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్కు సైతం కొత్త నిబంధనలు వర్తించవు. గడువు తర్వాత తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ. ఎక్స్ట్రా ఛార్జీలు?? హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర పేమెంట్స్గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిట్ మోడ్లో కట్ అయ్యేవిధంగా కొందరు సెట్ చేసుకుంటారు కదా. అయితే వీళ్లు ఇకపై మ్యానువల్గా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుండగా.. యూజర్ల నెత్తిన పిడుగు తప్పదనే మరోప్రచారం మొదలైంది. ఈ తరహా పేమెంట్స్కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే కథనాలు కొన్ని జాతీయ మీడియా వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బీఐతో చర్చలకు.. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన అమలుపై మల్లగుల్లాలు చేస్తున్నాయి. నిజానికి యూజర్ల భద్రత అంశం, ఆన్లైన్ మోసాల కట్టడి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ నిబంధనను రెండేళ్ల క్రితమే ప్రతిపాదించింది. ఏప్రిల్ 1, 2021 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంది. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొంత గడువు కోరడంతో.. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఖాతాదారులు, యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని ప్రకటిస్తూనే.. మరోవైపు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఆర్బీఐతో చర్చలకు సిద్ధం కావడం కొసమెరుపు. చదవండి: నిలువునా ముంచేసిన బ్యాంకు.. ఊరట అందించిన ఆర్బీఐ -
PUBG: గేమ్ ఆడాలంటే ఓటీపీ తప్పనిసరి..!
గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్జీ గేమ్ తిరిగి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత క్రాఫ్టన్ సూచనలు పాటిస్తేనే గేమ్ ఆడగాలరని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా తాజాగా పబ్జీ గేమ్లో లాగిన్లో కావాలంటే మొబైల్తో ఓటీపీ నిర్ధారణ తప్పనిసరని క్రాఫ్టన్ పేర్కొంది. ఓటీపీ నిర్ధారణ చేయకపోతే గేమ్లో లాగిన్ అవ్వలేరని తెలిపింది. ఈ ఓటీపీను కేవలం మూడుసార్లు లాగిన్ కోసం ఎంటర్ చేయవచ్చునని పేర్కొంది. తరువాత ఓటీపీ గడువు ముగుస్తుందని తెలుపగా, ఈ ఓటీపీకి కేవలం ఐదు నిమిషాలపాటు వ్యాలిడిటీ ఉండనుంది. వెరిఫికేషన్ కోడ్ కోసం 24 గంటల్లో పదిసార్లు మాత్రమే రిక్వెస్ట్ పెట్టాలి. తరువాత ఓటిపీ ఫోన్కు రాదు. ఒకే ఫోన్ నెంబర్ను ఉపయోగించి పది అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చును. క్రాఫ్టన్ ఓటీపీ నిర్ధారణ కోసం మొబైల్ నంబర్ను తీసుకొవడంతో డేటా చౌర్యం జరిగే అవకాశం ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు పబ్జీలో ఫేసుబుక్, గూగుల్ అకౌంట్నుపయోగించి యూజర్లు లాగిన్ అయ్యేవారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
ఫోన్కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. తాము టార్గెట్ చేసిన వారిని ఏదో ఒక రకంగా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యవహారంలో చిన్నారులు ఎదురొచ్చినా తగ్గట్లేదు. ఇలాంటి ఓ ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. బాధితులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా మాట్లాడారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఆయన డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలు సంగ్రహించారు. ఓటీపీల కోసం నేరగాళ్లు కాల్ చేసే సమయానికి ఆయన తన ఫోన్ ఇంట్లో వదిలి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆన్లైన్ క్లాస్లు వింటోన్న ఆయన కుమార్తె (ఐదో తరగతి విద్యార్థిని) ఆ కాల్ అందుకుంది. ‘అంకుల్ డాడీ లేరు... బయటకు వెళ్లారు..’ అని చెప్పి ఫోన్ పెట్టేయడానికి ప్రయత్నించింది. ఈలోపు సైబర్ నేరగాళ్లు ‘తెలుసమ్మా... ఆ ఫోన్కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా’ అంటూ హిందీలో సంభాషించారు. ఇలా రెండుసార్లు ఆమె నుంచి ఓటీపీలు తీసుకుని బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.32 వేలు కాజేశారు. బ్యాంకు అధికారుల మాదిరిగానే మూసారాంబాగ్కు చెందిన ఓ వ్యక్తికి కాల్ చేసిన సైబర్నేరగాళ్లు రూ.1.15 లక్షలు కాజేశారు. వివిధ కారణాలతో కొన్ని సంస్థల కస్టమర్ కేర్ నెంబర్ల కోసం ప్రయత్నించిన ఇద్దరు నగర వాసులు ఇంటర్నెట్లో ఉన్న నకిలీ నెంబర్లకు కాల్ చేశారు. అవతలి వారు చెప్పినట్లే చేసి తమ ఖాతాల్లోని రూ.81 వేలు, రూ.96 వేలు పోగొట్టుకున్నారు. మరో ఉదంతంలో ఓఎల్ఎక్స్లో ఉన్న వాహన విక్రయ ప్రకటన చూసిన నగర వాసి అందులోని నెంబర్లో సంప్రదించాడు. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు అడ్వాన్స్ సహా వివిధ పేర్లతో రూ.4 లక్షలు కాజేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: గసగసాల సాగు వెనుక డ్రగ్ మాఫియా! -
జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు
సాక్షి, సిటీబ్యూరో: నమ్మిన సమీప బంధువుకే టోకరా వేసి, ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ పరిధిలో నమోదైన సైబర్ నేరంలో ఈ చర్య తీసుకున్నామని, ఆత్మహత్య కేసును నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో జూలియెట్ అనే మహిళ ఒంటరిగా ఉండేది. ఆమె దగ్గర కుటుంబీకులు లేకపోవడంతో వరుసకు సోదరుడయ్యే జోసెఫ్ చేదోడు వాదోడుగా ఉండేవాడు. తనకు డబ్బు అవసరమైనప్పుడు ఆమె జోసెఫ్కు తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పడంతో పాటు డెబిట్కార్డు ఇచ్చి పంపేది. దీనిని ఆసరాగా చేసుకున్న అతడు సొంతానికి కొంత డబ్బు డ్రా చేసుకున్నాడు. ఆమె ఫోన్లో ఉన్న సదరు బ్యాంకు యాప్ ద్వారా మరికొంత మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకుని కాజేశాడు. ఇలా మొత్తం రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైనట్లు జనవరిగుర్తించిన జూలియెట్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా గత నెల 13న ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసును దర్యాప్తు చేసిన అధికారులు జోసెఫ్ను నిందితుడిగా తేల్చారు. బుధవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
12సార్లు ఓటీపీ చెప్పాడు.. రూ.1.76 లక్షలు గోవింద
సాక్షి, సిటీబ్యూరో: ఎస్బీఐ క్రెడిట్కార్డుకు సంబంధించిన రీడీమ్ పాయింట్లు ఎక్స్పైర్ అవుతున్నాయంటూ నగరవాసికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.76 లక్షలు కాజేశారు. కార్ఖానా ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన నేరగాళ్లు ఎక్స్పైరీ అయ్యే పాయింట్లను వెంటనే రీడీమ్ చేసుకోవాలని సూచించారు. దాని కోసమంటూ అతడి కార్డు వివరాలు తెలుసుకున్నారు. ఆపై బాధితుడి ఫోన్కు వచ్చిన ఓటీపీలను తెలుసుకుంటూ ఖాతా నుంచి డబ్బు కాజేశారు. మొత్తం 12 సార్లు ఓటీపీలు చెప్పిన బాధితుడు రూ.1.76 లక్షలు కోల్పోయాడు. అలాగే ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని భావించిన బోరబండ వాసి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. అందులో కనిపించిన ఓ నెంబర్లో సంప్రదించగా.. వివిధ రకాలైన ఫీజుల పేరు చెప్పిన సైబర్ నేరగాళ్లు రూ.80,800 స్వాహా చేశారు. వీరిద్దరూ వేర్వేరుగా శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! -
ఓటీపీ ప‘రేషన్’.. మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు
సాక్షి, నెట్వర్క్: మొబైల్ ఫోన్కు వచ్చిన వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) చెబితేనే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా కార్డులున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదివరకు అమలులో ఉన్న బయోమెట్రిక్ (వేలిముద్రల) ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. ఇటు ఐరిస్ లేదా మొబైల్ నంబర్కు ఓటీపీ పంపించడం ద్వారా రేషన్ ఇవ్వొచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. దాదాపు దశాబ్దం కిందటనే అందరూ ఆధార్ కార్డులు తీసుకున్నారు. అప్పట్లో చాలామందికి మొబైల్ ఫోన్లు లేకపోవడం, ఉన్నవారు కూడా ఆ తర్వాతకాలంలో ఫోన్ నంబర్లు మార్చడంతో ఆధార్తో అనుసంధానం అటకెక్కింది. ఆహార భద్రతా కార్డులున్నా చాలామందికి మొబైల్ ఫోన్లు లేవు. చదువురాని వారు కూడా ఈ ఓటీపీ విధానంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో సరుకులు తీసుకోవడానికి రేషన్ షాపుల వద్ద ఆలస్యం జరుగుతోంది. క్యూ కట్టిన జనం.. రేషన్ సరఫరాలో వస్తున్న ఇబ్బందులతో మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకోవడానికి మీసేవ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. అయితే మండలానికి ఒక కేంద్రానికే ఆధార్–ఫోన్ నంబర్ లింకు చేసే అనుమతి ఇవ్వటంతో ఆయా కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు పిల్లాపాపలతో అగచాట్లు పడుతున్నారు. ఒక్కో అనుసంధాన ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా రద్దీ ఎక్కువ కావటం, సర్వర్ డౌన్ అవుతుండటంతో అరగంట నుంచి గంట సమయం పడుతోంది. బుధవారం కరీంనగర్, వరంగల్, నల్లగొండ తదితర ఉమ్మడి జిల్లాల్లో అన్ని చోట్లా అనుసంధానం కోసం భారీ క్యూలు కట్టి వృద్ధులు, మహిళలు అనేక అవస్థలు పడ్డారు. ఇటు కార్డుదారుల కళ్లను కొన్ని ఐరిస్ యంత్రాలు సాంకేతిక సమస్యలతో గుర్తించకపోవడం వల్ల కూడా పూర్తిగా రేషన్ ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు మీసేవ కేంద్ర నిర్వాహకులు ఇదే అదనుగా ఆధార్తో ఫోన్ నంబర్ అనుసంధానానికి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు.. వెరసి ప్రజలు మీసేవ కేంద్రాలు, రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది.. ఐరిస్కు ప్రాధాన్యం.. ఆధార్తో మొబైల్ ఫోన్ అనుసంధానం కాకపోయినా సరే.. ఐరిస్కు ప్రాధాన్యతనిచ్చి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ షాప్ డీలర్లంతా ఐరిస్ ద్వారా బియ్యం పంపిణీ సాధ్యం కాని పక్షంలోనే ఓటీపీ అడగాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ఆదేశించారు. ఆధార్ డేటాబేస్లో కార్డుదారుల ఫోన్ నంబర్లను ఈ–పాస్ ద్వారా అనుసంధానం చేయడానికి ఆధార్ సంస్థ అంగీకరించిందని, అందుకోసం డేటాబేస్లో అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఫోన్ నంబర్ ఆధార్తో అనుసంధానించడం ద్వారా రేషన్ డీలర్లకు ఒక్కో దానికి రూ.50 సర్వీసు చార్జీ కింద లభిస్తుందని అనిల్కుమార్ వివరించారు. ఇందుకోసం ఆధార్ సంస్థ ప్రతినిధులు మెగా శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
బయోమెట్రిక్ నిలిపివేత.. పూర్తిగా ఓటీపీ ద్వారానే
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈ– పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టాల్సిన అవసరం లేదిక. ఆహార భద్రత (రేషన్) కార్డు నంబర్ చెప్పి.. దాని ఆధారంగా మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది. సరుకులను డ్రా చేసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా వచ్చే ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్తో మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో పరిశీలించి లింక్ లేకుంటే మీ– సేవ, ఈ– సేవలకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని డీలర్లు చెబుతున్నారు. ఈ– పోస్ ద్వారా సరుకుల పంపిణీలో ఓటీపీ పద్ధతి రెండు నెలల నుంచి ప్రయోగాత్మకంగా అమలవుతున్నా తప్పనిసరి లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్కు తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారా సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో ఆధార్తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటేనే రేషన్ సరుకులు తీసుకునేందుకు సాధ్యపడనుంది. చదవండి: కొత్త కోడళ్లకు నో రేషన్.. తప్పనిసరి.. ► కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల డ్రాకు ఓటీపీ వెసులుబాటు తప్పనిసరిగా మారింది. వాస్తవంగా కరోనా కష్టకాలంలో వరుసగా అయిదు నెలల పాటు థర్ట్ పార్టీ ఐడెంటిఫికేషన్ ద్వారా సబ్సిడీ సరుకులు పంపిణీ చేసిన పౌరసరఫరాల శాఖ నాలుగు నెలలుగా తిరిగి బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. ► గత ఏడాది నవంబర్ నుంచి బయోమెట్రిక్తో పాటు ఓటీపీ పద్ధతి కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తాజాగా వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. 30 శాతం దూరం.. ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల్లో సుమారు 30 శాతం ఆధార్తో మొబైల్ నంబర్ల లింక్ లేనట్లు తెలుస్తోంది. కేవలం రేషన్ కార్డుదారుల్లో సుమారు 70 శాతం మాత్రమే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధార్ నంబర్లు మొబైల్ ఫోన్లను అనుసంధామైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ► ఆహార భద్రత కార్డు లబ్ధిదారుల్లో హెడ్ ఆఫ్ ప్యామీలితో పాటు సరుకుల కోసం దుకాణాలకు వచ్చే లబ్ధిదారుల ఫోన్ నంబర్లు కూడా ఆధార్తో లింక్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. ► వాస్తవంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధార్తో రేషన్ కార్డు నంబర్ల అనుసంధానంతోనే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆధార్తో మొబైల్ నంబర్లు కూడా అనుసంధానమయ్యాయి. ► ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్లకు వచ్చే ఓటీపీ ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ►కొందరు లబ్ధిదారులకు మొబైల్ నంబర్లు లేకపోవడం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు పనిచేయకపోవడంతో సమస్యగా తయారైంది. లింక్ చేసుకునేందుకు ఈ నెలాఖరులోగా వెసులుబాటు కల్పించారు. ఓటీపీ ఇలా.. ► ప్రభుత్వ చౌకధరల దుకాణానికి సబ్సిడీ సరుకులు కోసం వెళ్లే లబ్ధిదారులు డీలర్కు తమ ఆహార భద్రత కార్డుకు సంబంధించిన నాలుగు చివరి నంబర్లు చెప్పాలి. ► ఈ– పాస్ యంత్రంపై కార్డు నంబర్లు ఫీడ్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే డీలర్ దానిని ఫీడ్ చేస్తే సరుకుల పంపిణీకి ఆమోదం లభిస్తుంది. -
పింక్ బాల్ టెస్టు: ఈ నెంబర్స్ చూస్తే షాకే!
అడిలైడ్: 49204084041 ఇది పదకొండు అంకెల బ్యాంకు ఖాతా నెంబర్ కాదు. బ్యాంకుల నుంచి, ఇతర కార్యకలాపాల నిమిత్తం కస్టమర్లకు ఆయా సంస్థలు పంపించే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అసలే కాదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా ఆటగాళ్ల మొత్తం స్కోరు నెంబర్లు ఇవి. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందేమోగానీ, యావత్ క్రికెట్ అభిమానులను ఈ అంకెలు విస్మయానికి గురిచేస్తున్నాయి. పింక్బాల్ టెస్టు మొదటి రోజు ఆస్ట్రేలియా బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోవడంలో సఫలమైన కోహ్లి సేన.. రెండో ఇన్నింగ్స్లో చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేసిన భారత జట్టు 36 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి బౌలర్ల ముందు మోకరిల్లింది. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత జట్టుకు 53 పరుగుల ఆదిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ పరుగులతో కలిసి 89 పరుగుల ఆదిక్యం లభించింది. దీంతో ఆసీస్ విజయ లక్ష్యం 90 పరుగులుగా టీమిండియా నిర్దేశించింది. ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా ఆతిథ్య జట్టు విజయం వైపు దూసుకెళ్తోది. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (51 బంతుల్లో 33; 5 ఫోర్లు), జో బర్న్స్ (50 బంతుల్లో 33; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండు పరుగుల ఎక్స్ట్రాల రూపం వచ్చాయి. ఆస్ట్రేలియా విజయానికి మరో 23 పరుగుల దూరంలో ఉంది. The OTP to forget this is 49204084041 .#INDvsAUSTest — Virender Sehwag (@virendersehwag) December 19, 2020 -
వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ కి ఎక్కువ మంది వినియోగదారులున్నారు. అందుకే ప్రస్తుతం హ్యాకర్లు వాట్సాప్ వినియోగదారులను ఎంచుకొంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మీ వాట్సాప్లోని ముఖ్యమైన, సున్నితమైన డేటాను సేకరించడానికి హ్యాకర్లు వాట్సాప్ కు వచ్చే ఓటీపీని మార్గంగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్ లోకి సులభంగా ప్రవేశించడంతో పాటు కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఏంటీ ఓటీపీ స్కాం వాట్సాప్ ఓటీపీ స్కాంలో భాగంగా.. మీకు మీ స్నేహితుడి పేరుతో తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. తన ఫోన్ నెంబర్ పనిచేయడంలేదని.. వాట్సాప్ ఖాతా వేరే ఫోన్లో ఉపయోగించేందుకు ఓటీపీ కోసం నీ ఫోన్ నంబర్ ఇచ్చానని.. ఆ ఓటీపీని తనకు పంపించాలని దాని సారాంశం. మీరు ఓటీపీని పంపడం కోసం మీ స్నేహితుడికి ఫోన్ చేస్తే నా ఫోన్ బాగానే చేస్తుందని చెప్పడంతో పాటు, నేను ఎవరికీ నా నెంబర్ ఇవ్వలేదని చెప్పడంతో మీరు ఆశ్చర్యపోతారు. మీరు కనుక వెంటనే వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే అది స్కాం అని తెలుస్తుంది. అందుకోసమే మీకు వేరే నెంబర్ నుండి ఓటీపీ వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. (చదవండి: వన్ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్) ఒక వేల మీరు ఓటీపీ కోడ్ను హ్యాకర్కు పంపితే, మీ మిత్రుడు తన స్వంత వాట్సాప్ ఖాతాకు తిరిగి లాగిన్ కాలేరు. అప్పుడు మీ మిత్రుడి ఖాతాపై పూర్తి నియంత్రణ హ్యాకర్ చేతికి వెళ్తుంది. వెంటనే మీ మిత్రుడి ఖాతాలోని ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేయడంతో పాటు మిమ్మల్ని డబ్బులు కూడా అడిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇదేవిదంగా మీ ఇతర స్నేహితుల ఖాతాలను కూడా హ్యాక్ చేయవచ్చు. అందుకని మనం, మనకు తెలియని నెంబర్ నుండి ఎటువంటి సందేశం వచ్చిన స్పందించకపోవడం మంచిది. అలానే మీ వాట్సాప్ ఖాతాకు టూ-స్టెప్ వెరిఫేకేషన్ను ఎనేబుల్ చేసుకోవడం చాలా మంచిది. దాని వల్ల ఓటీపీతో పాటు ఖాతా వెరిఫికేషన్కి ప్రత్యేక పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల పొరపాటున మీరు ఓటీపీ పంపినా పిన్ నంబరు ఉండదు కాబట్టి మీ ఖాతాను హ్యాక్ చేయలేరు. ఒక వేళ ఓటీపీ పంపి మీ ఖాతా హ్యాక్ అయితే వెంటనే మీ వాట్సాప్ని రీసెట్ చేసి తిరిగి లాగిన్ అవ్వండి. -
ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణకు సమయం పొడిగించినట్లు ప్రకటించింది. దీనిని వినియోగదారులు శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి వినియోగించుకోవచ్చు. జనవరిలో నెల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయం కేవలం ఉదయం8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రోజంతా ఆ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీని ద్వారా 10,000 నగదు వరకు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం వద్ద జరిగే మోసలను నివారించడం కోసం ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్కు ఓటీపీ వస్తేనే నగదును తీసుకోవచ్చు. వినియోగదారులు నగదు భద్రత కోసం ఎస్బీఐ తీసుకువచ్చిన గొప్ప సంస్కరణగా దీనిని పేర్కొనవచ్చు. నగదు ఉపసంహరణ ఓటీపీని వినియోగదారుడు బ్యాంకులో నమోదు చేసుకున్న కస్టమర్ మొబైల్ నంబర్కు పంపిస్తారు. దీంతో వినియోగదారుడి అనుమతి లేకుండా ఎవరు నగదు తీసుకునే అవకాశం లేకండా ఉంటుంది. అయితే ఈ సౌకర్యం కేవలం ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు మాత్రమే ఉపయోగపడుతుంది. లావాదేవీలకు ఇది వర్తించదు. ఇది కేవలం ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు మాత్రమే వీలవుతుంది. వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి ఉపయోగపడదు. కార్డ్ హోల్డర్ నగదు ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఎంత డబ్బు డ్రా చేయాలో ఎంటర్ చేసిన తరువాత, ఏటీఎం స్క్రీన్ ఓటీపీ విండోను చూపిస్తుంది. లావాదేవీని పూర్తి చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. చదవండి: ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి! -
ఎస్బీఐ కొత్త నిబంధన రేపటి నుంచే..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) ఎంటర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డుకు లింక్ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి నగదు తీసుకోలేరు. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. (చదవండి: పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట) -
ఓటీపీ చెబితేనే.. వంటగ్యాస్
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ బుక్ చేసినా.. ఇంటికి సిలిండర్ డెలివరీ కాలేదా?. డెలివరీ కాకుండానే పక్కదారి పట్టిందా? డోంట్వర్రీ. ఇక నుంచి ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను నియంత్రించేందుకు, వినియోగదారులకు సక్రమంగా సిలిండర్లు అందించేందుకు ఆయిల్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. వినియోగదారుల ధ్రువీకరణతోనే సిలిండర్ పంపిణీ చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాయి. నగరంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతి అమలు ప్రారంభమైంది. సాధారణంగా మొబైల్ ద్వారా గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేస్తే ఆ మొబైల్కు ఓటీపీ వస్తుంది. అంటే సిలిండర్ బుక్ చేసినట్లు లెక్క. ఇలా బుక్ చేసిన సిలిండర్ సదరు వినియోగదారుడికే చేరుతుందా? లేక బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందా? అనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఇకపై ఓటీపీ చూపిస్తేనే సిలిండర్ డెలివరీ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేశారు. డెలివరీ బాయ్కి ఓటీపీ చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్లో నమోదు చేసుకుని సిలిండర్ అందజేస్తాడు. దీంతో బుక్ చేసుకున్న కస్టమర్కే సిలిండర్ అందుతుంది. అంతేకాదు కరోనా నేపథ్యంలో డోర్ డెలివరీ బాయ్కి నగదును నేరుగా కాకుండా ఆన్లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా గ్యాస్ సరఫరా సంస్థలు కల్పించాయి. ప్రస్తుతం ఆన్లైన్లో బిల్లు చెల్లించిన తర్వాత జనరేట్తో పాటు డెలివరీ అక్నాలెడ్జిమెంట్ కోడ్ (డీఏసీ) వినియోగదారుడి సెల్ఫోన్కు సంక్షిప్త సమాచారం రూపంలో పంపించి దాని ఆధారంగా సిలిండర్ డెలివరీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ గ్యాస్ సిలిండర్ బుకింగ్, బిల్లు చెల్లింపు విధానాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు అప్డెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో డీలర్ కార్యాలయానికి ఫోన్ చేసి గాని, నేరుగా వెళ్లి గాని సిలిండర్ బుక్ చేసుకునే వారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చింది. ఇటీవల యాప్ల ద్వారా బుక్ చేస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాస్ సరఫరా సంస్థలు యాప్లను ప్రవేశపెట్టాయి. అమెజాన్ ద్వారా రీఫిల్ బుక్ చేసిన వారికి రూ.50 రాయితీ కూడా ప్రకటించింది. తాజాగా కొత్తగా ఓటీపీ విధానం అమల్లోకి వచ్చింది. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం తాజాగా ఏజెన్సీలు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సాప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రిజిస్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. వినియోగదారులకు మరింత అవగాహన పెంచడం ద్వారా డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇకపై ఓటీపీ చెబితేనే.. సిలిండర్
సాక్షి, కరీంనగర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల రాయితీలు అందజేస్తున్నాయి. గ్యాస్బండ ధర పెరిగినప్పుడల్లా రాయితీని కూడా పెంచుతూ ఆ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. గరిష్ఠంగా ఒక్కో వినియోగదారుడు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందే అవకాశముంది. అన్ని అవసరం లేకపోయినా కొందరు తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారు. పథకాల్లో ఉన్న లోపాలను అదనుగా చేసుకుని పలు ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో లక్ష్యానికి తీరని విఘాతం కలుగుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ను ఎక్కువగా వాణిజ్య అవసరాలకు వినియోగించడం సర్వసాధారణమైంది. ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. వినియోగదారుడి ధ్రువీకరణతోనే వాణిజ్యానికి వినియోగించే సిలిండర్ల ధరలు అధికంగా ఉండటంతో గృహవసర సిలిండర్లు దారి మళ్లుతున్నాయి. హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. రాయితీ లక్షల్లో దుర్వినియోగమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు చమురు సంస్థలు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వశాఖ వంట గ్యాస్ డెలివరీకి సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఓటీపీ(వన్టైం పాస్వర్డ్)ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తాము రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నుంచి రీఫిల్ బుక్చేసుకుంటే ఓటీపీ వస్తుంది. ఈ నంబర్ చెబితేనే ఇక నుంచి గ్యాస్ సిలిండర్ అందనుంది. ఇలా సదరు వినియోగదారుడి ధ్రువీకరణతోనే సరఫరా చేసే విధానం అమలుకు చమురు సంస్థలు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో భారత్ గ్యాస్, ఇండెన్, హెచ్పీ చమురు సంస్థల ఏజెన్సీలు 35వరకు ఉన్నాయి. మొత్తంగా 5.10 లక్షల కనెక్షన్లుండగా.. ప్రతి నెలా జిల్లాలో లక్షకు పైగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం జిల్లాలో నానాటికి కరోనా కేసులు అధికమవుతునే ఉన్నాయి. ఏజెన్సీలు గ్యాస్ బండలకు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. రిజిష్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్పే, గూగుల్ పేల ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. ప్రజల్లో మరింత అవగాహన పెంచడం ద్వారా చమురు సంస్థలు అమలు చేసే డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుసంధానం చేసుకుంటే మేలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తమ మొబైల్ నంబర్ను లింక్ చేసుకోలేదు. ఇప్పటివరకు మొబైల్ నంబర్ అనుసం«ధానం లేని వినియోగదారులు ఈ నెలాఖరులోపు అనుసంధానించుకోవాలి. లేదంటే ఆ తరువాత ఓటీపీ చెప్పని క్రమంలో గ్యాస్ బండలను పొందే అవకాశం కోల్పొవాల్సి ఉంటుందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. -
‘యాప్’తో ట్రాప్!.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ..
సాక్షి, సిటీబ్యూరో: కవాడిగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చింతల్ వాసి మంగళవారం మధ్యాహ్నం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు ఎవరూ కాల్ చేయలేదని, తాను ఓటీపీ కూడా చెప్పలేదని అయినా తన ఖాతా నుంచి రూ.1.8 లక్షలు పోయాయని పేర్కొన్నాడు. ఆయన ఫోన్ను పరిశీలించిన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ అందులో ‘క్విక్ వ్యూ’ అనే యాప్ ఉండటాన్ని గమనించారు. దీని ద్వారానే సైబర్ నేరగాళ్ళు ఖాతా ఖాళీ చేసినట్లు తేల్చారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. జమ్తార కేంద్రంగా మోసాలు... జార్ఖండ్లో రాష్ట్రంలో ఉన్న జమ్తార జిల్లాలోని ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలు చేయడమే తమ ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్తార యువత తామే ప్రస్తుతం సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్ళకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్తార యువకులు వీటిని వినియోగించడానికి ఎప్పటికప్పుడు కొత్త సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్కార్డుల్ని వినియోగిస్తున్న జమ్తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే జమ్తార సైబర్ నేరగాళ్లు అందుకు వినియోగించిన సెల్ఫోన్, సిమ్కార్డు ధ్వంసం చేస్తున్నారు. యాప్స్ డౌన్లోడ్ చేయించి... ఓ ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునే లోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. అయితే ప్రతి లావాదేవీకీ ఒక ఓటీపీ మాత్రం కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే డబ్బు కట్ కావడాన్ని గమనించి చెప్పకపోవచ్చు అని జామ్తార నేరగాళ్ళు కొత్త పంథా మొదలెట్టారు. తాము టార్గెట్ చేసిన వారిలో స్పార్ట్ఫోన్ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్స్ లేదా లింకులు పంపడం ద్వారా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన వీటికి సంబంధించి ఓ పాస్వర్డ్ చెప్తున్న నేరగాళ్లు దాని యాక్టివ్ చేసుకునేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్యాంకునకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, ఈ తరహా అప్డేట్స్, లింకేజ్లు ఆటోమేటిక్గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు. బాధితుడు ఈ యాప్ను ఇన్స్టల్ చేసుకుని యాక్టివ్ చేసిన వెంటనే ఇతగాడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ఫోన్/ల్యాప్టాప్లో కనిపిస్తుంటుంది. ఫలితంగా వచ్చిన ప్రతి ఓటీపీను అడగాల్సిన పని లేకుండా చేసేస్తూ వీలున్నంత వరకు ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అసలు విషయం తెలుసుకునేలోపు బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు బాధితులకు విషయం తెలియకుండానే వివిధ లింకుల ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలలు, వాలెట్స్ బోగస్ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్గా పిలిచే వీరి నుంచి సైబర్ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టమని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికి 11 యాప్స్ గుర్తించాం ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటేనే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్గ్రేడ్ కోసం ఓ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఎదుటి వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదు. అపరిచులు సూచించే ఎలాంటి యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడం, లింకులు క్లిక్ చేయడం కూడదు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ప్రతి వీటిని అసవసరంగా ఎవరూ డౌన్లోడ్ చేసుకోవదు. ఇప్పటికే ఫోన్లలో ఉన్నాయా? అనే అంశాన్నీ ఓసారి పరిశీలించుకోవాలి. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ -
ఓటీపీతో ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే. మిగతా వేళల్లో ఇప్పటి మాదిరే ఓటీపీ లేకుండా నగదును తీసుకోవచ్చు. అలాగే, రూ.10వేల లోపు నగదును ఇక ముందూ ఓటీపీ లేకుండా రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. జనవరి 1 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది. ఓటీపీ విధానం ఇలా.. ► కార్డును ఏటీఎం మెషీన్లో ఉంచి చివర్లో నగదు మొత్తాన్ని టైప్ చేసి ఓకే చేసిన తర్వాత ఖాతాదారుల రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్పై ఓటీపీ అడుగుతుంది. నంబర్ను ప్రవేశపెట్టడం ద్వారానే నగదు ఉపసంహరణకు వీలవుతుంది. ► ఎస్బీఐ ఏటీఎంలలోనే ఈ విధానం. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు ఓటీపీ విధానం ఉండదు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఈ విధానంలోకి మళ్లితే అప్పుడు అన్ని చోట్లా ఓటీపీ అవసరపడుతుంది. ► ఖాతాదారులు తమ కార్డును పోగొట్టుకున్నా లేదా కార్డు వివరాలను మరొకరు తెలుసుకుని అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేద్దామనుకుంటే కుదరదు. ఎందుకంటే కచ్చితంగా ఓటీపీ ఉంటేనే పని జరుగుతుంది. దీంతో ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. -
ఎస్బీఐ ఏటీఏం సేవలు; కొత్త నిబంధన
సాక్షి, ముంబై: కొత్త ఏడాది నుంచి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగదు అక్రమలావాదేవీలు, ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రా సేవలను తీసుకొస్తోంది. సురక్షితమైన ఏటీఎం సేవలకు అందించడంతోపాటు, మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ ట్విటర్లో వెల్లడించింది. అన్ని ఎస్బీఐ ఏటీఎంలలోనూ 2020 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఏటీఎం క్యాష్ విత్డ్రాయెల్స్కు సంబంధించి కొత్త ఏడాదిలో ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బు ఉపసంహరణకు ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్ అకౌంట్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినపుడు మాత్రమే డబ్బులు తీసుకోవడం వీలవుతుంది. ఈ ఓటీపీ ఏటీఎం క్యాష్ విత్డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్బీఐ ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు తీసుకోవాలని భావిస్తే ఈ ఓటీపీ విధానం వర్తించదు. కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రాకు ప్రయత్నించినపుడు మాత్రమే ఓటీపీ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రా సేవలు అన్ని ఏటీఎం లావాదేవీలకు వర్తించవు. కేవలం రూ.10,000కు పైన లావాదేవీలకు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఎస్బీఐ ఏటీఎం నెట్వర్క్కు అంతటికీ ఓటీపీ విధానం అమలులోకి వస్తుంది. Introducing the OTP-based cash withdrawal system to help protect you from unauthorized transactions at ATMs. This new safeguard system will be applicable from 1st Jan, 2020 across all SBI ATMs. To know more: https://t.co/nIyw5dsYZq#SBI #ATM #Transactions #SafeWithdrawals #Cash pic.twitter.com/YHoDrl0DTe — State Bank of India (@TheOfficialSBI) December 26, 2019 -
దక్షిణాదివారికి ఆశ ఎక్కువ..
సాక్షి, సిటీబ్యూరో: ‘దక్షిణాది వారికి ఆశ ఎక్కువ సార్..! వీళ్లను మోసం చేయడం చాలా తేలిక. ఒకవేళ కేసులు నమోదైనా మమ్మల్ని పట్టుకోవడం కోసం ఉత్తరాది వరకు వచ్చే పోలీసులు తక్కువ. అందుకే ఇక్కడి వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాం’సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఓఎల్ఎక్స్ నేరగాడు విచారణలో వెల్లడించిన విషయం ఇదీ. ♦ ‘రజోర్పే’ సంస్థ అధ్యయనం ప్రకారం డిజిటల్ కరెన్సీ వాడకం, ఆన్లైన్ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముంబై పుణే నిలిచాయి. ♦ సైబర్ క్రైమ్ పోలీసుల అభిప్రాయం ప్రకారం సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల విశాఖపట్నం, విజయవాల్లోనూ ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ♦ కంటికి కనిపించకుండా అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ప్రధానంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులనే టార్గెట్గా చేసుకుంటున్నారు. ఉత్తరాదిలో మకాం వేసి దక్షిణాదిని టార్గెట్గా చేస్తున్న ఈ ముఠా లు నమ్మి న వారిని నిలువునా ముంచేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా వీరి వల్లో పడి మోసపోతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా తక్కువ ధరకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాల బారినపడుతున్న వారి సంఖ్య మరీ పెరిగిందని వివరిస్తున్నారు. ప్రధానంగా ఓఎల్ఎక్స్, ఓటీపీ నేరాలే.. సైబర్ క్రైమ్ పోలీసులు రిజిస్టర్ చేసే సైబర్ నేరాల్లో 18 రకాలైనవి ఉన్నాయి. అయితే హైదరాబాద్కు సంబం«ధించి నమోదు అవుతున్న వాటిలో ఓఎల్ఎక్స్, ఓటీపీ క్రైమే అధికంగా ఉంటోందని పోలీసులు పేర్కొంటున్నారు. రాజస్థాన్లోని భరత్పూర్, అల్వార్, హర్యానాలోని మేవత్, ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్, ఫిరోజ్పూర్ జిక్రా ఒకే రీజియన్లో పక్కపక్కనే ఉంటాయి. ఈ ప్రాంతాలకు చెందిన ముఠాలు ఆర్మీ ఉద్యోగుల మాదిరిగా నటిస్తూ ఈ కామర్స్ సైట్స్లో కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఓటీపీ క్రైమ్ ఉంటోంది. బ్యాంకు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్డేట్ చేయాలని, ఆధార్ లింకేజ్ పేరుతో మాట్లాడుతున్నారు. వినియోగదారుల నుంచి వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్ సైతం సంగ్రహించి అకౌంట్లోని డబ్బు దోచేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారిలో జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తార వాసులే ఎక్కువగా ఉంటున్నారు. చదువుకున్న వారే.... ఈ తరహా సైబర్ నేరగాళ్ల వల్లో పడుతున్న వారిలో నిరక్షరాస్యులు/తక్కువగా విద్యనభ్యసించిన వారి కంటే చదువుకున్న వారు, విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అంతగా చదువుకోని వారు ఈ కామర్స్ యాప్స్ జోలికి పోవట్లేదని, ఈ కారణంగానే ఆ సంబంధిత నేరగాళ్లు వీరిని టార్గెట్ చేయలేకపోతున్నారని పేర్కొంటున్నారు. తక్కువ చదువుకున్న వాళ్ళు ఏటీఎం కార్డులను వినియోగిస్తుంటారు. అయితే కేవలం కార్డ్ స్వైప్ చేసి, పిన్ నెంబర్ ఎంటర్ చేసి లావాదేవీలు పూర్తి చేయడం వరకే వీరికి తెలుస్తోంది. ఈ కారణంగానే ఎవరైనా బ్యాంకు అధికారులం అంటూ ఫోన్లు చేస్తే వీరు స్పం దించట్లేదు. అవతలి వ్యక్తులు అడిగే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఈ కేటగిరీకి చెందిన వారు చెప్ప లేకపోతున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరగాళ్లు వారి జోలికి వెళ్లడం లేదని వివరిస్తున్నారు. విద్యాధికు లు, స్మార్ట్ఫోన్, యాప్స్ వినియోగిస్తున్న వారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోతున్న ట్లు తెలిపారు. ఓఎల్ఎక్స్ నేరాల బారిన పడిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఆరు నగరాల్లోనే ఎక్కువ సైబర్ నేరాలబారిన పడుతున్న వారిలో దక్షిణాది వారే ఎక్కువగా ఉంటున్నారు. ఉత్తరాది వారికి ఎవరైనా బ్యాంకు మేనేజర్లమంటూ ఫోన్ చేసి ఓటీపీ వంటివి అడిగితే వారు తిట్టి ఫోన్ పెట్టేస్తుంటారు. దక్షిణాది వారి విషయంలో ఇలా జరగట్లేదు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్లోనూ వీరు ఎలాంటి తనిఖీలు లేకుండా నగదు అడ్వాన్స్గా డిపాజిట్ చేస్తున్నారు. సైబర్ నేరాల బాధితుల్లో దేశంలోనే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నా వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో మోసం పోవడం ఎంత తేలికో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం అంత కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో లావాదేవీలు వద్దు. పరిచయం లేని వారు చెప్పిన మాటలు నమ్మి ఒక్క రూపాయి కూడా కోల్పోవద్దు. – సైబర్ క్రైమ్ పోలీసులు స్మార్ట్ ఫోన్ వినియోగదారులే ఎక్కువ... వివిధ రకాలైన నేరాల్లో సైబర్ నేరగాళ్లకు టార్గెట్గా మారుతున్న వారిలో స్మార్ట్ఫోన్ వినియోగదారులే ఎక్కువగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, వీసా మోసం సహా ఏదైనా ఫోన్ నుంచే ప్రారంభమవుతోందంటున్నారు. ఒకప్పుడు ఇంటర్నెట్ వాడటానికి కంప్యూటర్ తప్పనిసరి. అయితే స్మార్ట్ఫోన్ వినియోగంలోకి వచ్చాక ‘అరచేతి’ నుంచే యాక్సిస్ చేస్తున్నారు. మరోపక్క సెల్ఫోన్ సర్వీసు ప్రొవైడర్ల మధ్య పోటీ పెరగటంతో ఒకరిని మించి ఒకరు తక్కువ ధరకు మొబైల్ డేటాను అందిస్తుండటంతో అవసరం ఉన్నా, లేకపోయినా నెట్ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇలా అనవసరంగా కొన్ని యాప్స్ను వినియోగిస్తూ మోసగాళ్ల బారినపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. తమ వద్దకు వస్తున్న ఫిర్యాదుదారుల్లో 95 శాతం ఫోన్ నుంచి ఇంటర్నెట్ను యాక్సస్ చేస్తూ మోసపోయిన వారే ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ విషయమే తీసుకుంటే కంప్యూటర్ ద్వారా ఆ సంస్థ సైట్ను చేరుకుని మోసపోయిన వారు నూటికి ఇద్దరు ముగ్గురు కూడా ఉండట్లేదని తెలిపారు. స్మార్ట్ ఫోన్లో యాప్ వాడుతూ బుట్టలో పడిన వారే ఎక్కువని సైబర్ క్రైమ్ అధికారులు పేర్కొన్నారు. -
రైలు ప్రయాణీకులకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : రేల్వేవినియోగదారుల కోసం ఇటీవల అనేక సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్న ఇండియన్ రైల్వే తాజాగా మరో తీపి కబురు అందించింది. తన టికెట్ బుకింగ్ ప్లాట్ఫాం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ)అధీకృత టికెటింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే విషయంలో సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. అంటే ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఓటీపీ ఆధారంగా వెంటనే,సంబంధిత నగదును ఖాతాదారుని అకౌంట్లో జమ చేయనుంది. ఐఆర్సీటీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇ-టిక్కెట్ల విషయంలో పారదర్శకత , యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకురావడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా ఈ విధానంలో ప్రయాణికుల రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో ఈ ఓటీపీ వస్తుంది. దీంతో పాటు రిఫండ్ అమౌంట్ వివరాలు కూడా వస్తాయి. అది ఏజెంట్లకు చూపిస్తే వెంటనే డబ్బు వాపస్ ఇచ్చేస్తారు. అయితే ఈ సిస్టమ్ ఐఆర్సీటీసీ అధికారిక ఏజెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరి ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. టికెట్ డబ్బులు రిటన్ పొందాలంటే.. ఇ-టికెట్లకు మాత్రమే ఓటీపీ రిఫండ్ రూల్స్ వర్తిస్తాయనే విషయాన్ని గమనార్హం. సరైన మొబైల్ నంబర్ను ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్కు వినియోగదారుడు అందించాలి. బుకింగ్ సమయంలో ఏజెంట్లు సంబంధిత నంబరును సరిగ్గా రికార్డ్ చేశారో లేదు చెక్ చేసుకోవాలి. ఈ కొత్త ఓటీపీ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఎంత రిఫండ్ వస్తుందో వెంటనే తెలిసి పోతుందని రైల్వే శాఖ వెల్లడించింది. -
ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే. -
నాలుగు విడతలుగా.. నాలుగైదు నిమిషాల్లోనే..
సెల్కు ఓటీపీ రావడం లేదు. అయినా ఖాతాల్లో సొమ్ములు క్షణాల్లో మాయమవు తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరు తీస్తున్నారో తెలుసుకునే లోపు మొత్తం నగదు మాయమవుతున్నాయి. నిన్న రాజమహేంద్ర వరంలోని పలువురి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు మాయం కాగా.. తాజాగా మరో బాధితుడు చేరాడు. మామిడికుదురుకు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోని సుమారు రూ.31 వేల నగదు మాయం కావడంతో అతడు లబోదిబోమంటున్నాడు. మామిడికుదురు (పి.గన్నవరం): బ్యాంకు ఖాతా నుంచి రూ.31,676 చోరీ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు విడతలుగా రూ.7900 వంతున తన ఖాతా నుంచి చోరీ జరిగిందని మామిడికుదురుకు చెందిన శిరిగినీడి శ్రీరామకృష్ణ నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల పదో తేదీ రాత్రి 9.38 గంటల సమయంలో ఈ చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రామకృష్ణకు అమలాపురం కె.అగ్రహారం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఈ ఖాతా నుంచి ముందుగా రూ.76వేలు డ్రా చేశారు. వెనువెంటనే ఆ మొత్తం తిరిగి అక్కౌంట్కు జమ అయ్యిందని రామకృష్ణ తెలిపారు. వెను వెంటనే రూ.7900 వంతున నాలుగు విడతల్లో రూ.31,676 తన ఖాతా నుంచి విత్డ్రా అయ్యిందని చెప్పారు. దీనికి సంబంధించి తన సెల్కు మెసేజ్ వచ్చిందన్నారు. వెంటనే తన ఖాతాను బ్లాక్ చేయించానని చెప్పారు. ఆన్లైన్లో స్టేట్మెంట్ తీయగా డెబిట్ కార్డు ఉపయోగించి ఈ మొత్తాన్ని డ్రా చేసినట్టుగా వచ్చిందన్నారు. తన సెల్కు ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకుండానే ఆన్లైన్ ద్వారా ఈ మొత్తాన్ని చోరీ చేశారని వాపోయాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ లావాదేవీలపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై బ్యాంకు అధికారులకు, నగరం పోలీసులకు ఫిర్యాదు చేశానని రామకృష్ణ తెలిపారు. ఇటువంటి మోసాలు జరగకుండా బ్యాంకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. -
‘ఓటీపీ అడిగితే.. అభినందన్ డైలాగ్ చెప్పండి’
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడానికి భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ చెప్పిన డైలాగ్తో ప్రచారం చేశారు. శత్రు చెరలో బందీగా ఉండి కూడా దైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్ను చూసి దేశం మొత్తం గర్వించిన సంగతి తెలిసిందే. మాతృ దేశంపై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను తిప్పికొడుతున్న క్రమంలో ఆయన విమానం పాక్ భూభాగంలో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆయన.. పాక్ సైన్యం చేతికి చిక్కారు. ఆ తర్వాత ఆయన్ని బందీగా చేసుకుని పాక్ సైన్యం నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. దాయాది దేశం ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ఆయన వాటికి తట్టుకుని నిలబడ్డారు. పాక్ సైనిక అదికారులు అభినందన్ను విచారిస్తున్న సమయంలో తన మిషన్ గురించి వివరాలు రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించిన అభినందన్ మాత్రం ‘అవన్నీ నేను మీకు చెప్పకూడదు(I am not supposed to tell you this)’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు కూడా తాను శత్రు దేశం చెరలో ఉన్నానని భయపడకుండా, ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్ను రోజున భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్పూర్ పోలీసులు ‘ఓటీపీ’లతో జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అభినందన్ చెప్పిన మాటలను ఉపయోగించారు. దుండగులు బ్యాంకుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ చేసి వినియోగదారుల నుంచి ఓటీపీలను సేకరించి వారి ఖాతాల నుంచి డబ్బును దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇటువంటి మోసాలు అధికంగా జరుగుతుండటంతో.. ఇకపై ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే.. అభినందన్ చెప్పినట్టు ఈ వివరాలు నేను మీకు చెప్పకూడదనే సమాధానం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు నాగ్పూర్ పోలీసుల చేసిన ట్వీట్ వైరల్గా మారింది. పోలీసులు ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. When someone asks for your OTP : "I am not supposed to tell you this"#WelcomeHomeAbhinandan 🇮🇳#NagpurPolice — NagpurCityPolice (@NagpurPolice) March 1, 2019 -
ఓటీపీ నంబర్ను ఊహించి..
ఒంగోలు: ఆశపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్ ఫోన్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిండా మునిగినట్లే. ఏటీఎం కార్డుల వినియోగంలో జరుగుతున్న పలు లోపాలను పోలీసు శాఖ ప్రధానంగా ప్రస్తావిస్తూ అవగాహన కలిగిస్తుండటంతో సైబర్ నేరస్తులు కొత్త రకం దందాకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నగరంలోని ఓ వ్యక్తి తన మొబైల్కు వచ్చిన మెసేజ్లను గమనించి ఆశ్చర్యపోయి బ్యాంకర్ను కలిస్తే అది సైబర్ క్రైం నేరస్తుల పని..అంటూ సూచించారు. ఏం..జరిగిందంటే ఈ నెల 20వ తేదీన ఎస్బీఐ ఖాతాదారుడు ఒకరి మొబైల్కు వరుసగా మెసేజ్లు వచ్చాయి. రూ.12990 ఫ్లిప్ కార్టులో వస్తువులు కొనుగోలు చేసినట్లు ఆ మెసేజ్లో సారాంశం ఉంది. ఆ అకౌంట్కు బ్యాంక్ అకౌంట్ లింకై ఉండటంతో ఒన్టైం పాస్వర్డు జెనరేటై ఖాతాదారుని మొబైల్కు సమాచారం వచ్చింది. తాను ఎటువంటి వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయకున్నా తనకు ఎందుకు సమాచారం వస్తుందంటూ కార్డు చివరి నాలుగు అంకెలను పోల్చి చూసుకుంటే అది తన ఏటీఎం కార్డు నంబర్గానే స్పష్టమైంది. బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి మెసేజ్లను చూపడంతో వారు పరిశీలించి మీ ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకున్న వారు ఎవరో మీ అకౌంట్ను హ్యాక్ చేసి ఆన్లైన్ లావాదేవీలకు యత్నించారని, ఇది తప్పకుండా సైబర్ క్రైం అని పేర్కొన్నారు. అందువల్ల తాము ఏమీ చేయలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయమంటూ సలహాలు ఇచ్చారు. ఖాతాదారుడు మాత్రం తన ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకొని దాని ద్వారా ఆన్లైన్ వస్తువులు కొనుగోలు చేసేందుకు యత్నించారని, అయితే పాస్వర్డు ఊహించి టైప్ చేయడంతో వారి యత్నం వృథా అయిందని పేర్కొన్నారు. తాను ఏర్పాటు చేసుకున్న పాస్వర్డు క్లిష్టంగా ఉండటంతో వారి యత్నం వృథా అయినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. జాగ్రత్త పడాలంటున్న బ్యాంకర్లు ♦ పెట్రోలు బంకులు, మాల్స్, పెద్ద పెద్ద షోరూంల్లో ఏటీఎం కార్డులను ప్రజలు ఎక్కువుగా వినియోగిస్తుంటారు. తాము కొన్న వస్తువులకు ఏటీఎం కార్డు ద్వారా నగదు చెల్లిస్తుంటారు. అయితే ఈ నగదు చెల్లించే సందర్భంలో ఏటీఎం పిన్ నంబర్ నొక్కుతాం. సమయంలో 14 అంకెల ఏటీఎం కార్డు నంబర్, వెనుక సీవీసీ నంబర్ను ఇతరులు ఫొటోలు తీసుకోవడం లేదా నోట్ చేసుకుంటున్నారేమో అనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ♦ బార్లు, వైన్ షాపులు, రెస్టారెంట్లు వంటి వాటిలో బిల్ పే చేసేందుకు సహజంగా వెయిటర్ల మీద డిపెండ్ అవుతుంటారు. ఏటీఎం కార్డు ఇచ్చేసి పిన్ నంబర్ చెబుతారు. ఇది సరైన విధానం కాదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఏటీఎం కార్డును ఎక్కడ ఉపయోగించినా తమ సమక్షంలో వినియోగించుకోవడం మంచిదని పేర్కొంటున్నారు. ♦ అదే విధంగా ఇటీవల ఆండ్రాయిడ్ మొబైల్స్ మినీ బ్యాంకుల్లా మారాయి. చాలామంది ఇప్పటికి తమ ఏటీఎం కార్డులకు వెనుక వైపున పాస్వర్డు నోట్ చేసుకుంటున్నారు. ఏటీఎం కార్డు 14 అంకెల నంబర్తో పాటు సీవీసీ నంబర్ తెలుసుకున్న వారికి మీ మొబైల్ గనుక దొరికితే ఇక క్షణాల్లో మీకు ఏమాత్రం తెలీకుండానే మీ అకౌంట్లో ఉన్న డబ్బును మాయం చేయవచ్చు. అయితే చాలామంది తప్పుడు చిరునామాలతో ఇటువంటి కొనుగోళ్లు చేయడం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. అందువల్ల ఏటీఎం కార్డులైనా, ఆండ్రాయిడ్ మొబైల్స్ అయినా వాటి వినియోగంలో రహస్య సమాచారాన్ని ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం సుస్పష్టం. -
ఓటీపీ’ ఫ్రాడ్ కేసులో ముగ్గురి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డులకు సంబంధించిన వివరాలతో పాటు వన్టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు నిందితుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పశ్చిమ బెంగాల్కు చెందిన వారని డీసీపీ అవినాష్ మహంతి సోమవారం పేర్కొన్నారు. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా సేకరిస్తున్న ఈ మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకుని వీటినే వినియోగించి కార్డుల డేటాలోని ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్కార్డుల్ని వినియోగిస్తున్న జమ్తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడతారు. క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే సైబర్ క్రిమినల్స్ ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై కార్డు వివరాలను సీవీవీ కోడ్ సహా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుందని, అది కూడా చెప్తేనే లింకేజ్, అప్గ్రేడేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం ద్వారా టోకరా వేస్తున్నారు. ఈ మోసగాళ్ళ చేతిలో సిటీకి చెందిన ఇద్దరు రూ.1.75 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్ళిన ఓ ప్రత్యేక బృందం ‘కాల్ కేటుగాళ్లై‘న ఎండీ సలామత్ ఇస్లాం సర్దార్, సమీర్ హజ్రా, శంకర్ హల్దార్లను అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై సిటీకి తీసుకువచ్చి సోమవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. -
జమ్తారలో సూత్రధారులు.. ఢిల్లీలో పాత్రధారులు!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డులకు సంబంధించిన వివరాల తో పాటు వన్టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సం గ్రహించి... అందినకాడికి దండుకునే జమ్తార ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఏ దశలోనూ తమ ఉనికి బయటపడకుండా పక్కాగా వ్యవహారాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఢిల్లీ చెందిన వ్యక్తుల ఖాతాలు వాడుకుంటున్నాయి. ఇందుకుగాను సదరు ఏజెంట్లకు కమీషన్లు ఇస్తున్నాయి. ఈ తరహాలో ప్రధాన సూత్రధారులకు సహకరిస్తున్న ఓ పాత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి సిటీకి తరలించిన ఇతడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నగరంలో నమోదవుతున్న ఈ ‘కార్డ్ క్రైమ్’లో 98 శాతం జమ్తార ప్రాంతానికి చెందిన వారే నిందితులు. జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతం ఇది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా సేకరిస్తున్న జమ్తార మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకుని వాటిని ద్వారా కార్డుల డేటాలోని ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్కార్డులను వినియోగిస్తున్న జమ్తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలిగి తేలిగ్గా బుట్టలో పడతారు. క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే ‘జమ్త్రాగాళ్లు’ ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెబుతూ ఆపై కార్డు వివరాలను సీవీవీ కోడ్ సహా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుందని, అది కూడా చెబితేనే లింకేజ్, అప్గ్రేడేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం ద్వారా టోకరా వేస్తున్నారు. వీరు వినియోగించే సిమ్కార్డులు ఎలానూ బోగస్ వివరాలతో ఉంటాయి. బాధితుడి ఖాతా నుంచి నగదు మళ్లించుకునే ఖాతాలు తమ పేరుతో, తమ ప్రాంతంలో ఉంటే తేలిగ్గా దొరికేస్తామనే ఉద్దేశంతో వీరు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కొందరిని ఆకర్షించి ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆ డబ్బును మళ్లిస్తున్నారు. ఈ ఏజెంట్లకు 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తూ ఆ నగదు తమ వద్దకు చేరేలా చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడికి ఎర వేసిన జమ్తార నేరగాళ్లు రూ.79 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఏజెంట్లు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం సైబర్ నేరగాళ్లకు తన బ్యాంకు ఖాతా ఇచ్చి సహకరించిన ప్రేమ్చంద్ అనే నిందితుడిని అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై సిటీకి తరలించింది. సోమవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. ఈ స్కామ్ సూత్రధారుల కోసం జమ్తారకు ఓ బృందం వెళ్తోంది. వీరు మరెందరినో మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఓటీపీలు లేకుండానే రూ.లక్షలు కొట్టేశారు
సాక్షి, సిటీబ్యూరో: వారు ముగ్గురు బిహార్ యువకులు. పదో తరగతి వరకు చదివిన వారు ప్లంబర్లుగా పని చేసేవారు. బతుకుదెరువు నిమి త్తం నగరానికి వలసవచ్చిన వీరు యూట్యూబ్ వీడియోల ద్వారా ఓటీపీ నంబర్లు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసే వెసులుబాటు ఉన్న ఈ–కామర్స్ సైట్లపై అధ్యయనం చేశారు.డెబిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు, సీవీవీ తెలిస్తే చాలు కార్డు కాలపరిమితి చెప్పే ఆన్లైన్ అప్లికేషన్లపై పట్టు సాధించారు. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినట్లుగా నటిస్తూ ముందున్న ఖాతాదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో కార్డు వివరాలను సోల్డర్ సర్ఫింగ్ ద్వారా తెలుసుకుని ఆన్లైన్ షాపింగ్ చేసేవారు. ఇలా దాదాపు 200 మంది నుంచి దాదాపు రూ.15లక్షలకు పైగా కాజేసిన ఈ మిత్ర త్రయాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 18 సెల్ఫోన్లు, ఐదు సిమ్కార్డులు, రూ.1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లతో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం వివరాలు వెల్లడించారు. బాధితుల డబ్బుతోనే విమానయానం... బిహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లా, బంతారియా–జగదీశ్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్ తొమ్మిదో తరగతి చదివాడు. ఆన్లైన్పై పట్టు సాధించిన అతను అదే గ్రామానికి చెందిన స్నేహితుడు వినోద్ కుమార్, సెమర్ గ్రామానికి చెందిన మంజేష్ కుమార్తో కలిసి ఫిబ్రవరిలో బతుకు దెరువు కోసం షాద్నగర్కు వలస వచ్చి ఓ ప్రైవేట్ పైపులైన్ కంపెనీలో ప్లంబర్లుగా చేరారు. జీతం చాలకపోవడంతో మనీష్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ మోసాలను ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో షాద్నగర్లోని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బులు చేసేవారిలా నటిస్తూ ముందున్న వారి కార్డు వివరాలు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్కు ఫోన్ చేసి ఖాతాదారునిగా చెప్పుకుని ఖాతాలో నగదు వివరాలు తెలుసుకునేవారు. అనంతరం ‘బ్యాంక్ కార్డు వాలిడిటర్స్’ యాప్ ద్వారా ఆ డెబిట్ కార్డు కాలపరిమితి తెలుసుకొని, ఓటీపీ నంబర్ అవసరం లేని ఈ–కామర్స్ వెబ్సైట్ల నుంచి సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసేవారు. ఇందుకుగాను తరచూ సెల్ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు మారుస్తూ వేర్వేరు చిరునామాలు ఇచ్చేవారు. తాము బుక్ చేసిన వస్తువులను తెచ్చుకునేందుకు ఇతర నగరాలకు వెళ్లేందుకోసం విమాన టికెట్లను కూడా బాధితుల డబ్బులతోనే బుక్ చేసుకునేవారు. నాలుగు నెలలుగా షాద్నగర్ నుంచి తమకు తెలియకుండా బ్యాంక్ ఖాతాల నుంచి షాపింగ్ చేస్తున్నట్లు తన సెల్కు ఎస్ఎంఎస్లు వస్తున్నాయని పేర్కొంటూ దాదాపు 75 బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న రూ.3,89,500 పోయినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. దొరికిపోయింది ఇలా... సైబరాబాద్ సైబర్ క్రైమ్కు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా షాద్నగర్ నుంచే ఉండటంతో ఆయా బ్యాంక్ ఖాతాదారులతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం మాట్లాడింది. శంషాబాద్, షాద్నగర్ బస్టాండ్లు, షాద్నగర్ ఏటీఎంకు సమీపంలో డెలివరీ చేసిన వస్తువుల వివరాలపై డెలివరీ బాయ్లను విచారించారు. ఏటీఎంలలోని సీసీటీవీ కెమెరాల పుటేజీల ఆధారంగా మనీష్, వినోద్లను పట్టుకున్న పోలీసులు వారి వివరాల ఆధారంగా మంజేష్ కుమార్ను అరెస్టు చేశారు. ‘ఇప్పటివరకు వీరి సెల్ఫోన్ ద్వారా లభ్యమైన సమాచారాన్ని బట్టి 200 మంది వరకు బాధితులు ఉన్నారు. వీరు పాత డేటాను డిలీట్ చేయడంతో ఇంకా చాలా మంది బాధితులు ఉండొచ్చు. పోలీసు కస్టడీకి తీసుకొని విచారించి పూర్తి విషయాలు తెలుసుకుంటామ’ని సీపీ సజ్జనార్ తెలిపారు. ‘బ్యాంక్ కార్డు వాలిడిటర్స్’ కు నోటీసులు జారీ చేస్తామన్నారు. బ్యాంక్లు కూడా ఫిర్యాదు అందినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్ స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్ఐ గౌతమ్, హెడ్కానిస్టేబుల్ సిద్దేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో తహసీల్దార్
సింగరాయకొండ : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వీరి ఉచ్చులో అమాయక ప్రజలతో పాటు చదువుకున్న వారు, ఉద్యోగులు చిక్కుకుంటూ తాము బ్యాంకు అకౌంట్లో దాచుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తన బ్యాంకు అకౌంట్లోని 7 వేల రూపాయలు పోగొట్టుకోగా ఇప్పుడు తాజాగా తహసీల్దార్ కామేశ్వరరావు వారి ఉచ్చులో చిక్కుకున్నారు. కామేశ్వరరావు కార్యాలయంలో పని ఒత్తిడిలో ఉండగా బుధవారం ఫోన్ వచ్చింది. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, పేరు, అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ చెప్పి తనపై నమ్మకాన్ని ఏర్పరచుకున్న ఆ వ్యక్తి చివరకు ఓటీపీ నంబర్ అడిగాడు. పని ఒత్తిడిలో ఉన్న కామేశ్వరరావు బ్యాంకుకు చెందిన వ్యక్తి అనే నమ్మకంతో ఓటీపీ నంబరు చెప్పారు. సాయంత్రానికి తహసీల్దార్ సెల్కు మెసేజ్ వచ్చింది. జరిగిన పొరపాటు అప్పుడుగానీ తహసీల్దార్కు అర్ధం కాలేదు. తెలిసింది. ఫోన్ చేసింది బ్యాంకు సిబ్బంది కాదని, సైబర్ నేరగాడని అర్థమైంది. ఆ మెసేజ్లో తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.89 వేలు డ్రా అయినట్లు ఉంది. సదరు నేరగాడు తెలివిగా ఇతని అకౌంట్తో పాటు ఫోన్ నంబరును హ్యాక్ చేయడంతో ఎప్పుడు బ్యాంకు లవాదేవీలు జరగినా మొబైల్కు మెసేజ్ వస్తుండగా తహసీల్దార్కు సాయంత్రానికిగాని మెసేజ్ రాలేదు. వెంటనే సీఐ ఆర్.దేవప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్.దేవప్రభాకర్ తెలిపారు. సైబర్ నేరగాడు స్థానికుడు కాదని సీఐ చెప్పారు. -
ఓటీపీ చెబితే.. ఖాతాలు ఖాళీ
ఇప్పుడు నగదు లావాదేవీలు సులభంగా మారాయి. బ్యాంకులో అడుగు పెట్టకుండా ఖాతాలోని డబ్బుల్ని వివిధ రకాలు వాడుకునే వెసులుబాటు కలిగింది. ఆన్లైన్లో వస్తువులను కొనడం, మన ఖాతా నుంచి మరో ఖాతాలోకి డబ్బులు పంపడం, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయడం సులువైంది. దీనికి అంతటికీ కారణం ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్). దీన్ని ఆసరాగా తీసుకున్న నేరగాళ్లు చాలా మంది ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులను డీజీపీ ఆదేశించారు. చిత్తూరు అర్బన్: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతా తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల్లో ఎలాంటి నగదు నిల్వ చేయాల్సిన అవసరం లేదని, జీరో బ్యాలెన్స్లో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జ న్ధన్ పేరిట జిల్లాలో 5.70 లక్షల ఖాతాలు ప్రారంభించారు. ఆ ఖాతాలు ప్రారంభించిన వారిలో మ హిళా సంఘాల్లోని సభ్యులు, కూలి పనిచేసేవాళ్లు, పెద్దగా చదువుకోనివాళ్లు ఉన్నారు. 80 శాతం ఖాతా దారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాం కింగ్పై ఏ మాత్రం అవగాహన లేదు. ఖాతాదారుల ప్రమేయం లేకుండా సాధారణ ఖాతాలతో పాటు జన్ధన్ ఖాతాలున్న 60 శాతం మంది వినియోగదారులకు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాం కింగ్ వ్యవస్థను కొన్ని బ్యాంకులు యాక్టివేట్ చేసే శాయి. తమ బ్యాంకు ఖాతాలకు ఈ సదుపాయాలున్నాయని, వీటితో ఏమి చేయొచ్చో ఖాతాదారులకు ఏమాత్రం తెలియదు. ఇలా మోసం... ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ను ఉపయోగించేటప్పుడు ప్రతి ఒక్క లావాదేవీకి బ్యాం కు ఖాతాదారుడి మొబైల్ నెంబరుకు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఫ్లిప్ కార్ట్, ఈ–బే, అమేజాన్ వంటి ఈ–కామర్స్ సంస్థల నుంచి నేరగాళ్లు కొనుగోళ్లు జరుపుతారు. ఇందుకోసం ఢిల్లీ, ముంబయి, జార్ఖండ్ లాంటి ప్రాంతాల నుంచి ఖాతాదారులకు ఫోన్ చేసి తాము బ్యాంకు ప్రధా న శాఖ నుంచి మాట్లాడుతున్నామని, మీ ఏటీఎం కార్డు నెంబరు, సీవీవీ నెంబరు చెప్పమంటారు. ఇవి చెప్పిన తరువాత మీ మొబైల్కు ఓటీపీ వస్తుం దని, దాన్ని కూడా చెప్పమంటారు. ఇలా మనం చెబుతున్న ప్రతిసారీ మన ఖాతా నుంచి ఎంత మొత్తం డబ్బులు అయిపోతున్నాయో సెల్ఫోన్కు మెసేజ్లు వ స్తుంటాయి. వీటిని ఏ మాత్రం చూడకుండా ఓటీపీలు చెప్పాలని మాయమాటలతో బ్యాంకు ఖాతాలోని డబ్బంతా కాజేస్తున్నారు. ఏం చేయాలి... ఏ ఒక్క బ్యాంకు అధికారి కూడా ఖాతాదారుడికి ఫోన్ చేసి బ్యాంకు వివరాలు, ఏటీఎం కార్డు, ఓటీ పీ నెంబరు అడగరనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేకున్నా యాక్టివ్లో ఉన్నట్లయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి వాటిని డీ–యాక్టివ్ చేసుకోవాలి. ఇక ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యా దు చేయడం వల్ల నేరగాళ్లు కొనుగోలు చేసిన వస్తువులు డెలివరీ కాకుండా ఆపడానికి సాధ్యమవుతుంది. బ్యాంకర్లతో మాట్లాడాం.. ఆన్లైన్ మోసాలపై ఇప్పటికే జిల్లాలోని ప్రధాన బ్యాంకు అధికారులతో మాట్లాడాము. ఖాతాదారుడి రిక్వెస్ట్ లేకుండా యాక్ట్వ్ చేసిన మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ను డీ–యాక్టివ్ చేయమన్నాం. ప్రజలు కూడా లావాదేవీలు చేసేటప్పుడు వచ్చే మెసేజ్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మీ వ్యక్తిగత బ్యాంకు, ఏటీఎం వివరాలను ఏ ఒక్కరికీ చెప్పకండి.. పంచుకోకండి. -
అమెజాన్లో ఫోన్ లేదా ల్యాప్టాప్ కొంటున్నారా...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ లేదా ఇతర ఏదైనా ఖరీదైన వస్తువు కొంటున్నారా? అయితే ఇక నుంచి డెలివరీని ధృవీకరించడానికి ఆరు అంకెల ఓటీపీ అవసరమట. మరింత సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కోసం అత్యంత విలువైన ఆర్డర్లకు వన్ టైమ్ పాస్వర్డ్(ఎటీపీ)ని ఇవ్వడం ప్రారంభించింది అమెజాన్ ఇండియా. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్లు డివైజ్లో నమోదుచేసి, డెలివరీని ధృవీకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కేటగిరీల్లో ఎక్కువ విలువున్న ఉత్పత్తుల కోసం ఈ కొత్త ఓటీపీ ఫీచర్ను అమెజాన్ ఇండియా తీసుకొచ్చింది. ఆర్డర్ను ధృవీకరించడానికి అమెజాన్ ఇండియానే ఆరు అంకెల ఓటీపీని మెసేజ్ రూపంలో అందిస్తోంది. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్ల డివైజ్లో కస్టమర్లు నమోదు చేసి, తమ ప్రొడక్ట్ను తీసుకోవాలి. ఈ విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి గాడ్జెట్స్ 360కి ధృవీకరించారు. ‘కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అయిన అమెజాన్, కస్టమర్లందరికీ సురక్షితంగా డెలివరీని అందజేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని ఆర్డర్లకు ప్రస్తుతం ఓటీపీ ఆధారిత డెలివరీ మెకానిజం తీసుకొచ్చాం. కస్టమర్ రిజిస్ట్రర్ చేసిన మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్ అడ్రస్కు ఈ ఓటీపీ పంపుతాం. దీన్ని డెలివరీని అంగీకరించినట్టు తెలుసుకునేందుకు వాడుతున్నాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నెల మొదట్లోనే అమెజాన్ ఇండియా తన ఐదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ పేమెంట్ ద్వారా తమ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో వెయ్యి రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి 250 రూపాయల క్యాష్బ్యాక్ అందిస్తోంది. గత రెండేళ్ల కాలంలో భారత్లో ఎక్కువగా సందర్శించిన సైట్ల్లో అమెజాన్.ఇన్ను నిలిపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అమెజాన్ ఇండియా సైట్లో సీఈవో జెఫ్ బెజోస్ లేఖ పోస్టు చేశారు. -
డాక్టర్నే మోసం చేసిన ఘనుడు
సాక్షి, గుంటూరు: సైబర్ నేరగాడి చేతిలో డాక్టర్ మోసపోయారు. ఓటీపీ షేర్ చేయడంతో ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ. 19,500 మాయమయ్యాయి. జరిగిన మోసంపై ఆమె అర్బన్ ఎస్పీని సోమవారం ఆశ్రయించారు. గుంటూరు మెడికల్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్కు వారం రోజుల క్రితం రాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్ అధికారులం మాట్లాడుతున్నాం... మీ క్రెడిట్, డెబిట్ కార్డు గడువు ముగుస్తోందని.. కార్డులు బ్లాక్ అవుతాయని మాయమాటలు చెప్పారు. మీ నంబర్కు వచ్చిన ఓటీపీ నెంబర్ షేర్ చేస్తే ఆన్లైన్లో కార్డులు రీ జనరేట్ చేస్తామని తెలిపారు. వారి మాటలు నమ్మిన ఆమె ఓటీపీ షేర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత బ్యాంకు ఖాతా నుంచి రూ.19,500 ట్రాన్స్ఫర్ అయినట్టు డాక్టర్కు మెసేజ్ వచ్చింది. అది చూసి ఆమె కంగు తిని వెంటనే ఆ నంబర్కు ఫోన్ చేయగా అందుబాటులో లేదు అని వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ చేశారు..డబ్బు లాగేశారు
రొంపిచర్ల: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఎకౌంట్లోని నగదు మాయం చేసిన ఘటన రొంపిచర్లలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... రొంపిచర్లకు చెందిన అంగలూరి ఏడుకొండలుకు మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫోన్ (95700 24985) వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీ ఎకౌంట్ను ఆధార్తో అనుసంధానం చేయాల్సి ఉందని ఓ వ్యక్తి మాట్లాడాడు. బ్యాంకు ఎకౌంట్ నంబరు, ఆధార్ నంబరు, ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్లు చెప్పాలని కోరాడు. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.42,400 దుండగుడు తన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అనంతరం ఏడుకొండలు ఫోన్కు డబ్బులు విత్డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో కంగారుపడిన అతను బ్యాంకుకు వెళ్లి పాస్బుక్లో ఎంట్రీలు నమోదు చేయించుకున్నాడు. అందులో డబ్బులు ఎనిమిది విడతలుగా వేరే ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయినట్లు వచ్చింది. తాను కష్టపడి కూలి నాలీ చేసుకున్న డబ్బును ఫోన్ కాల్తో లాగేసుకోవడంతో లబోదిబోమన్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఓటీపీ అడిగారు.. ఉన్నదంతా ఊడ్చేశారు!
ఆదోని: ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) అడిగి సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేశారు. దీంతో బాధితుడు బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు..పట్టణంలోని కల్లుబావికి చెందిన ఎం నాగరాజు తాపీమేస్త్రీగా పని చేసేవాడు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న స్థలం అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు చెల్లించాడు. మిగిలిన మొత్తాన్ని స్థానికంగా ఉన్న కరూర్ వైశ్యాబ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. గత నెల 22 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 11 ఫోన్కాల్స్ వచ్చాయి. ‘తాము హైదరాబాద్ బ్యాంకు హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, దాన్ని అప్డేట్ చేసేందుకు సెల్ఫోన్కు వచ్చే ఓటీపీ నంబరు చెప్పాడంటూ’ సూచించారు. దీంతో ఫోన్ వచ్చిన ప్రతిసారి నాగరాజు గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ నంబరు చెప్పుకొచ్చాడు. ఈక్రమంలో మంగళవారం తాను కొన్న మరో ఫ్లాట్కు డబ్బు చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అదే సమయంలో మళ్లీ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అయితే అతడు బ్యాంకులోనే ఉండడంతో బ్యాంకు మేనేజరు విష్ణువర్ధన్రెడ్డి చేతికి ఫోన్ ఇచ్చాడు. మేనేజరు ప్రశ్నించగానే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. కొన్ని రోజులుగా ఇలాగే తనను ఓటీపీ నంబర్లు అడిగారని నాగరాజు చెప్పడంతో అనుమానం వచ్చిన మేనేజరు వెంటనే ఖాతాలో లావాదేవీలు పరిశీలించారు. మొత్తం రూ.2.5 లక్షలు డ్రా అయినట్లు గుర్తించారు. ముంబైలో పలు దుకాణాల్లో ఆ వ్యక్తులు విలువైన వస్తువులు కొని నాగరాజు ఖాతా నుంచి చెల్లింపులు జరిపినట్లు తేలింది. న్యాయం చేయాలని బాధితుడు బ్యాంకు మేనేజర్ను కోరాడు. అనంతరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆమె అలా చెప్పకూడదని తెలియక...
ముంబై : ఇటీవల ఆన్లైన్ మోసాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం. బ్యాంకు అధికారులమంటూ కాల్ చేస్తున్న వారికి, అకౌంట్ వివరాలు, ఫోన్కు వచ్చిన ఓటీపీ వంటి కోడ్లు చెప్పకూడదని పలుమార్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ముంబైలో ఓ మహిళ తన అమాయకత్వంతో సైబర్ నేరగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న అని పోలీసులు ప్రశ్నించగా.. అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదంటూ బిక్కమొహం వేసేసింది. తనకసలు ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి అసలేం తెలియదని చెప్పింది. నావీముంబైలోని నెరూల్కు చెందిన తస్నీమ్ ముజకర్ మోడక్ అనే మహిళ తనకున్న జాతీయ బ్యాంకులో ఇటీవలే 7.20 లక్షల రూపాయలు క్రెడిట్చేసింది. మే 17న తస్నీమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తను ఎస్బీఐ మేనేజర్గా పరిచయం చేసుకున్నాడు. కొన్ని సాంకేతిక సమస్యలతో మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందని చెప్పాడు. అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాలన్నాడు. అతడు చెప్పినట్టే చేసిన తస్నీమ్ అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. వారం వ్యవధిలో అలా 28 సార్లు ఆ ఆన్లైన్ మోసగాడికి తన ఓటీపీ చెప్పింది. ఇలా ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98, 973 కాజేశాడు. పాస్బుక్లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన తస్నీమ్కు తన అకౌంట్ నుంచి రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసింది. దీంతో వెంటనే నెరూల్ పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ నేరగాడు మొత్తం మూడు సిమ్ కార్డులతో తస్నీమ్కు ఫోన్ చేసి, ఓటీపీ వివరాలు రాబట్టినట్టు తెలిపారు. ముంబై, నోయిడా, గుర్గావ్, కోల్కతా, బెంగళూరుల నుంచి ఈ లావాదేవీలు సాగించినట్టు పేర్కొన్నారు. 16 అంకెల డెబిట్ కార్డు నెంబర్, కార్డుపై ప్రింట్ అయిన పేరు, 3 అంకెల సీవీవీ నెంబర్ అన్నీ చాలా రహస్యంగా ఉంచుకోవాలని ఆమెకు పోలీసులు చెప్పారు. తన భర్త కువైట్లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. -
ఓటీపీ అడిగారు..రూ.20 వేలు కాజేశారు
హనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం) : హనుమాన్ జంక్షన్కు చెందిన గేదల లక్ష్మణ ఓ లారీ డ్రైవర్. లారీకి మరమ్మతులు చేయిస్తుండగా సెల్ఫోన్ మోగింది. హిందీలో మాట్లాడటంతో అర్ధం కాక ఫోన్ పెట్టేశాడు. పదేపదే ఫోన్చేసి బ్యాంకు అకౌంట్ వెరిఫికేషన్ అనడంతో పేరు, ఊరు, తదితరాల వివరాలు మొత్తం చెప్పారు. ఆ తర్వాత మీ ఫోన్కు ఓటీపీ నంబర్లు పంపించాం. త్వరగా చూసి చెప్పండని హడావుడి చేశారు. అంతంత మాత్రం చదువు కావటంతో లక్ష్మణ ఓటీపీ నంబరే కదా అని చెప్పేశాడు. ఫోన్ పెట్టిన తర్వాత చూస్తే నగదు డ్రా చేసినట్లుగా మేసేజ్లు వచ్చాయి. ఇదేంటని గురువారం బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని చూస్తే అకౌంట్లో నుంచి నాలుగు దఫాలుగా రూ.5 వేలు చొప్పున మొత్తం రూ. 20 వేలు పేటీఎం ద్వారా డ్రా చేసినట్లుగా ఉంది. దీంతో లక్ష్మణ లబోదిబోమంటూ వాపోయాడు. ఇదీ హనుమాన్ జంక్షన్లో చోటు చేసుకున్న సైబర్ నేరం. ఎంతో గోప్యంగా ఉండాల్సిన బ్యాంకు అకౌంట్ వివరాలు పక్కదారి పట్టడం, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కటంతో అమాయకుల జేబుకు చిల్లు పడుతున్నాయి. స్థానిక హనుమాన్నగర్కు చెందిన గేదల లక్ష్మణ ఈ సైబర్ నేరంపై జంక్షన్ పోలీసులతో పాటు ఎస్బీఐ అధికారులను ఆశ్రయించాడు. నాలుగైదు రోజులుగా తరచూ ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అంటూ హిందీలో మాట్లాడుతూ పేరు, వివరాలు చెబుతుండటంతో బ్యాంకు అధికారులే అని నమ్మి మోసపోయానని, అసలు ఓటీపీ అనే నంబర్ ఉంటుందని, దాని ద్వారా కూడా మన ప్రమేయం లేకుండా డబ్బులు డ్రా చేసే యవచ్చనే అవగాహన తనకు ఇప్పటి వరకూ తెలీదని బాధితుడు వాపోయాడు. -
సిమ్ స్వాపింగ్!
ఇతరుల బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు దండుకునేందుకు సైబర నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆన్లైన్లో అందినకాడికి కొల్లగొట్టడానికి ఇప్పుడు ‘సిమ్ స్వాపింగ్’కు పాల్పడుతున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పని వినియోగదారులను ఈ తరహాలో బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ను వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఈ పంథాలో రూ.లక్ష కోల్పోయిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకుల కాల్సెంటర్ల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఆన్లైన్లో అందినకాడికి కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పని వినియోగదారులను ‘సిమ్ స్వాపింగ్’తో బురిడీ కొట్టిస్తున్నారు. వినియోగిస్తున్న సిమ్కార్డులను వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఈ పంథాలో రూ.లక్ష కోల్పోయిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ’ఈ’ రకంగా బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి ఖాతాలు ఖాళీ చేసే నేరాలు మూడునాలుగేళ్లుగా జోరుగా సాగుతున్నాయి. జుమ్తార, ఢిల్లీ కేంద్రాలుగా వ్యవస్థీకృతంగా ‘ఈ–నేరాలు’ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆయా ప్రాంతాల్లో దీని కోసం ప్రత్యేకంగా కాల్సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు ఫోన్లు చేయిస్తుంటారు. తాము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకునే నేరగాళ్లు క్రెడిట్/డెబిట్ కార్డ్ను అప్గ్రేడ్ చేస్తామనో, ఆధార్ సీడింగ్ అనే చెప్తూ వినియోగదారుల నుంచి కార్డ్, పిన్ నెంబర్లతో పాటు ఓటీపీ సైతం తీసుకుంటున్నారు. ఆపై ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వారి ఖాతాల్లో ఉన్న నగదు స్వాహా చేయడం, ఈ–కామర్స్ సైట్స్లో ఖరీదు చేయడం, ఈ–వ్యాలెట్స్లోకి బదిలీ చేసుకోవడం చేసి మోసం చేస్తున్నారు. వివిధ మార్గాల్లో డేటా సంగ్రహణ... వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగదారుల డేటాను సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో చేజిక్కించుకుంటున్నారు. ఆయా బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్ల ద్వారా కార్డు నెంబర్, వినియోగదారుడి పేరు ఇతర వివరాలతో పాటు కొన్ని సందర్భాల్లో సీవీవీ కోడ్స్ కూడా సంగ్రహించేస్తున్నారు. అయితే ఖాతాల్లో ఉన్న నగదు కాజేయడానికి ఓటీపీ తప్పనిసరి. సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఈ తరహా సైబర్ నేరాలు, నేరగాళ్లు చేసే మోసాలపై వినియోగదారులకు కొంతమేర అవగాహన ఏర్పడింది. ఈ కారణంగానే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు మోసపోయామంటూ ఒకరు సంప్రదిస్తుంటే.. తమను మోసం చేయడానికి ప్రయత్నించారంటూ ఐదారుగురు సమాచారం ఇస్తున్నారు. బ్యాంకుల పేరుతో కాల్స్ చేస్తున్న కేటుగాళ్లకు అనేక వివరాలూ చెప్తున్నప్పటికీ... ఓటీపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనుమానిస్తున్నారు. దీంతో ఆ నెంబర్ చెప్పకుండా ఫోన్లు కట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘నష్టపోతున్నామని’ గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఇటీవల సిమ్ స్వాపింగ్ ఎత్తు వేస్తున్నారు. కొత్త సిమ్కార్డులు తీసుకుంటున్నారు.. సిమ్ స్వాపింగ్ కోసం సైబర్ నేరగాళ్లు ఉత్తరాదికి చెందిన కొన్ని సిమ్కార్డుల విక్రయ కేంద్రాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలాంటి గుర్తింపుకార్డులు సమర్పించకుండానే వారి నుంచి టార్గెట్ చేసిన వినియోగదారుడి సెల్ నెంబర్తోనే మరో సిమ్కార్డు తీసుకుంటున్నారు. ఇది యాక్టివేట్ కావాలంటే అసలు వినియోగదారుడు అప్పటికే వినియోగిస్తున్న సిమ్ నుంచి కొత్త సిమ్పై ఉన్న నెంబర్లను సర్వీస్ ప్రొవైడర్కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే కొత్త సిమ్ యాక్టివేట్ కావడంతో పాటు పాత సిమ్ బ్లాక్ అవుతుంది. సరిగ్గా ఇదే విధానాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ‘మీ సిమ్ బ్లాక్/డ్యామేజ్ అయింది. ఇబ్బందులు సరిదిద్దడానికి మీ సెల్కు వచ్చే నెంబర్కు ఫలానా నెంబర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్కు పంపండి’ అంటూ వివిధ నెంబర్ల నుంచి వినియోగదారులకు సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగా ఎస్సెమ్మెస్లు పంపిస్తున్నారు. అనుమానం రాకుండా ‘పని’ పూర్తి... సదరు ఎస్సెమ్మెస్ సర్వీసు ప్రొవైడర్ నుంచే వచ్చిందని భావిస్తున్న వినియోగదారులు సదరు సిమ్ నెంబర్ను కాల్సెంటర్కు ఎస్సెమ్మెస్ చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటికే ఈ సిమ్ బ్లాక్ కావడంతో పాటు నేరగాళ్ల దగ్గర ఉన్న సిమ్ యాక్టివేట్ అవుతోంది. అప్పటికే సదరు వినియోగదారుడికి సంబంధించిన కార్డ్, పిన్ వివరాలు వారి వద్ద ఉండటంతో వాటితో ఆన్లైన్ లావాదేవీలు మొదలుపెడుతున్నారు. అసలు వినియోగదారుడి సెల్ నెంబర్కు రావాల్సిన ఓటీపీ సైబర్ నేరగాళ్లు స్వాపింగ్ చేసిన నెంబర్కు చేరిపోతోంది. ఇలా వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా కొల్లగొట్టేస్తున్నారు. కస్టమర్కు ఈ విషయం తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎవరైనా వినియోగదారుడు తన సిమ్ బ్లాక్ అయినట్లు గుర్తించినా.. సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించడం, ఫిర్యాదు చేయడం జరిగేసరికే సైబర్ నేరగాళ్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారికి ఈ తరహాలో టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు మూడు విడతల్లో ఆయన ఖాతాలో ఉన్న రూ.లక్ష కాజేశారు. ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తతే పరిష్కారం ‘ఇలాంటి నేరాల బారినపడకుండా ఉండలంటే సెల్ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండమే ఉత్తమమైన మార్గం. ఇటీవల కాలంలో సిమ్ బ్లాక్ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు. అలా ఎవరి సిమ్కార్డ్ అయినా బ్లాక్ అయినట్లు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాలి. తక్షణం బ్యాంకులను సంప్రదించి క్రెడిట్/డెబిట్ కార్డులనే కాకుండా ఆ ఖాతాలనే బ్లాక్ చేయించాలి. ఫలానా నెంబర్ను కాల్ సెంటర్కు పంపండి అంటూ వచ్చే ఎస్సెమ్మెస్లనూ అనుమానించాల్సిందే. సదరు సర్వీసు ప్రొవైడర్ కాల్ సెంటర్ను సంప్రదించకుండా ఇలాంటివి పంపకూడదు. మోసపోయిన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి’. – సిటీ సైబర్ క్రైమ్ అధికారులు -
ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని..
కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన బాచం వెంకటశివారెడ్డి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయాడు. ఇతను ఈనెల 19న కొలిమిగుండ్ల స్టేట్ బ్యాంక్లో డీడీ తీసేందుకువచ్చాడు. ఈక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ను మాట్లాడుతున్నానని శివారెడ్డి సెల్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని సూచించాడు. కార్డు బాగానే ఉందని చెప్పినా వరుసగా ఫోన్ చేస్తూ వచ్చాడు. చివరకు బెలుంకు వెళ్లాక మరోసారి ఫోన్ వచ్చింది. దీంతో నిజమే అనుకొని ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు, ఆతర్వాత ఓటీపీ నంబర్ కూడా చెప్పాడు. దీంతో శివారెడ్డి అకౌంట్ నుంచి రెండు విడతల్లో రూ.15,500 డ్రా అయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం బ్యాంకు అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఒక్క ఓటీపీతో ఆధార్-సిమ్ లింక్, అదెలా?
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు సిమ్ కార్డుతో ఆధార్ లింకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. ఓటీపీ సాయంతో ఈ లింకింగ్ను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ ప్రక్రియ కోసం టెలికాం సంస్థలు సమర్పించిన బ్లూప్రింట్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆమోదించింది. మొబైల్తో ఆధార్ లింక్కు డెడ్లైన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి ఈ ఓటీపీతో ఆధార్ ఆధారిత సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొబైల్ నెంబర్లను ఆధార్తో లింక్ చేసుకునే ప్రక్రియకు మూడు కొత్త విధానాలను గత నెలలోనే ప్రభుత్వం ఆమోదించింది. అందులో ఓటీపీ కూడా ఒకటి. మరో రెండు యాప్ లేదా ఐవీఆర్ఎస్ సౌకర్యం. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఆధార్తో మొబైల్ నెంబర్లను లింక్ చేసుకునే ప్రక్రియ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ నెల చివరిలోగా ఓటీపీ ఆధారిత లింకింగ్ ప్రక్రియను మొదలుపెడతామని టెలికాం కంపెనీలు హామీ ఇచ్చాయని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఓటీపీ ఆధారిత విధానం వల్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు, దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలైన వ్యక్తులకు ఇంటి వద్దనే మొబైల్తో ఆధార్ లింక్ ప్రక్రియను చేపట్టాలంటూ ప్రభుత్వం, కంపెనీలను ఆదేశించింది. అయితే స్టోర్స్కు వెళ్లి ఆధార్ను లింకు చేసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలిసింది. -
ఓటీపీ ఉంటేనే..!
సాక్షి, సిటీబ్యూరో: ఓ యువకుడి నుంచి అమెరికాలో రూ.4 లక్షల జీతం వచ్చే ఉద్యోగమంటూ రూ.86 లక్షలు గుంజారు... ఫార్వర్డ్ ట్రేడింగ్లో పెట్టుబడి పేరుతో నగరానికి చెందిన జయరాజ్ నుంచి రూ.11 లక్షలు కాజేశారు... సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాస్తో విత్తుల సరఫరా వ్యాపారమంటూ నేరగాళ్లు రూ.8.5 లక్షలు స్వాహా చేశారు.. వడ్డీ లేని రుణం పేరుతో నారాయణగూడకు చెందిన ఫారూఖ్ను రూ.62 లక్షలు ముంచారు... రూ.3.6 కోట్ల లాటరీ పేరుతో బంజారాహిల్స్ వాసి ఫిరోజ్ ఖాన్ నుంచి రూ.22 లక్షలు కాజేశారు... తమ ఆస్తిని ఇస్తామంటూ ఫేస్బుక్ ద్వారా ఎర వేసి ఓ వ్యక్తి నుంచి రూ.76 లక్షలు దండుకున్నారు... ఇటీవల కాలంలో నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లతో కాజేసిన మొత్తాలివి. ఈ పంథాలో రెచ్చిపోతున్న క్రిమినల్స్ను కట్టడి చేసేందుకు బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనల అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీటిలో ప్రతి లావాదేవీకి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఏర్పాటు కీలకమని అభిప్రాయపడుతున్నవారు ఇదే విషయాన్ని త్వరలో జరుగనున్న సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. బ్యాంకు ఖాతాలే కీలకం... ఈ తరహా మోసాలను నైజీరియా, సోమాలియా తదితర దేశాల నుంచి వచ్చి మెట్రో నగరాల్లో స్థిరపడిన నల్లజాతీయులే ఎక్కువగా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, ఈ–మెయిల్ ద్వారా ఎర వేస్తున్న ఈ సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అయితే వీరు అత్యంత అరుదైన సందర్భాలు మినహాయిస్తే బాధితులను నేరుగా కలవరు. కేవలం తమ మాటలు, తప్పుడు పత్రాలతో ఎర వేసి ఎదుటి వారిని పూర్తిగా తమ ముగ్గులోకి దింపుతారు. ఆపై వివిధ రకాలైన పన్నులు తదితరాల పేర్లు చెప్పి వారి నుంచి నగదును డిపాజిట్, ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇందుకు వీరికి బ్యాంకు ఖాతాలు అత్యంత కీలకం. అయితే పోలీసులకు చిక్కే, బ్యాంకు సిబ్బంది అనుమానించే అవకాశం ఉండటంతో వీరు ఎప్పుడూ తమ బ్యాంకు ఖాతాలను నేరాలు చేయడానికి వినియోగించరు. ‘మనీమ్యూల్స్’ను ఏర్పాటు చేసుకుని... ఈ బ్యాంకు ఖాతాల కోసం సైబర్ నేరగాళ్లు మనీమ్యూల్స్ను ఏర్పాటు చేసుకుంటారు. నేరాలకు సంబంధించిన డబ్బు డిపాజిట్ చేసుకోవడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ ఖాతాల్లో పడిన సొమ్మును డ్రా చేసి నేరగాళ్లుకు ఇవ్వడమో, డెబిట్ కార్డు వంటివి అందించడమే చేసే వారికి సాంకేతికంగా మనీమ్యూల్స్ అంటారు. ఇలా సహకరించినందుకు వీరికి సైబర్ నేరగాళ్లు కొంత కమీషన్ చెల్లిస్తుంటారు. ఈ మనీమ్యూల్స్లో అత్యధికులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. ఆయా మెట్రో నగరాల్లో నివసించినప్పుడు వారిని మనీమ్యూల్స్గా మారుస్తున్న నైజీరియన్లు ఆ తర్వాత వారి ఖాతాలను వాడుకుంటున్నారు. ఇలాంటి మనీమ్యూల్స్లో కొందరికి ప్రస్తుతం సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఉండట్లేదు. ఓటీపీ పక్కా చేస్తే... బాధితుల ద్వారా మనీమ్యూల్స్కు చెందిన ఖాతాల్లో పడిన డబ్బును వారి నుంచి సేకరించిన డెబిట్కార్డు ద్వారా సైబర్ నేరగాళ్ళు డ్రా చేసుకుంటున్నారు. ఆన్లైన్ కార్యకలాపాల మాదిరిగా ఏటీఎంలో డ్రా చేయడానికి ఓటీపీ ఏర్పాటు చేస్తే ఇలాంటి వారిని కట్టడి చేసే ఆస్కారం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఖాతాలో పడిన డబ్బు డ్రా చేయాలంటూ ఓటీపీ తప్పనిసరి అయితే అప్పటికే వాడుతున్న మనీమ్యూల్స్ ఖాతాలు సైబర్ నేరగాళ్ళకు అక్కరకు రాకుండా పోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు నేరగాళ్లు డబ్బు డ్రా చేయడానికి అవసరమైన ఓటీపీ కోసం ఖాతాదారులను సంప్రదిస్తే ఆ ఆధారాలను బట్టి వారిని పట్టుకోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజ్తో పాటు ప్రతి లావాదేవీకీ ఓటీపీని సైతం పక్కా చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్బీఐ అధికారులతో జరిగే త్రైమాసిక సమావేశంలో దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు చేయాలని యోచిస్తున్నారు. -
ఓటీపీలో అగ్రస్థానంలో స్పైస్జెట్
హైదరాబాద్: షెడ్యూల్ సమయాలకనుగుణంగా విమాన సర్వీసులందించే దేశీయ విమానయాన కంపెనీగా(హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో) స్పైస్జెట్ నిలిచింది. హైదరబాద్ ఎయిర్పోర్ట్లో గత నెలలో 82 శాతం ఆన్టైమ్ డిపార్చర్(ఓటీపీ) సాధించామని స్పైస్జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ బంబార్డియర్ క్యూ 400 విమానాల వేగాన్ని వృద్ధి చేయడం ద్వారా ఈ ఘనత సాధించామని స్పైస్జెట్ సీనియర్ జనరల్ మేనేజర్ రోహిత్ పాల్ పేర్కొన్నారు. నిర్వహణ పరంగా అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నామని, గత నెలతో సహా వరుసగా తొమ్మిది నెలల పాటు తమ ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 90 శాతంగా ఉందని వివరించారు.