Parliament Budget session
-
వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక.. రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
భారతీయుల తరలింపుపై కేంద్రం రియాక్షన్ ఇదే
Parliament Session Live Updates..అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అక్రమ వలసలపై రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం’ అని జయశంకర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటన..అమెరికా నుంచి భారతీయుల అమానవీయ తరలింపుపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్రంమధ్యాహ్నం రెండు గంటలకి రాజ్యసభ, మూడు మూడు గంటలకి లోక్సభలో ప్రకటన చేయనున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా తరలించడంపై ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్న విపక్షాలుపార్లమెంట్ వద్ద విపక్ష పార్టీ ఎంపీల నిరసన..అమెరికా నుంచి భారతీయుల రాక విషయంపై విపక్ష పార్టీల నేతలు నిరనసలకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. #WATCH | MPs of the opposition parties including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress National President Mallikarjun Kharge, Samajwadi Party chief Akhilesh Yadav hold a protest outside the parliament over the issue of deportation of alleged illegal Indian… pic.twitter.com/aUCpbEOK1Q— ANI (@ANI) February 6, 2025 పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాభారతీయులను అమానవీయంగా అమెరికా బహిష్కరించడం పై ఉభయసభల్లో సభలో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలుఅమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడం, అగౌరవపరచడంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. సభలో చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలుకాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఉభయసభల సభాపతులువాయిదా తీర్మానాలను తిరస్కరించడం పై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ఆందోళనఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై ఉభయ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో, లోక్సభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.Lok Sabha adjourned till 12 noon amid ruckus following Opposition MPs' demand to discuss the issue of deportation of Indian nationals who were allegedly illegally living in the US. pic.twitter.com/UTPMln1Mzp— ANI (@ANI) February 6, 2025 👉పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్, రాజ్యసభలో రేణుకా చౌదరి వాయిదా తీర్మానం అందజేశారు. దీనిపై ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.Congress MP Renuka Chowdhury gives Suspension of Business Notice in Rajya Sabha under Rule 267 to discuss the deportation of Indian nationals who were allegedly illegally living in the US. "The entire exercise of reportedly deporting 20,407 Indian immigrants could have… pic.twitter.com/rQoUbqReYY— ANI (@ANI) February 6, 2025 -
రాజ్యసభలో నోరుపారేసుకున్న ఖర్గే.. బీజేపీ ఎంపీ సీరియస్!
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహంతో కంట్రోల్ తప్పారు. ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి అంటూ కౌంటరిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం, ఖర్గే మాట్లాడుతూ..‘నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నేను నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఖర్గే వ్యాఖ్యల కారణంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. చంద్ర శేఖర్.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు.Kharge ji 🤣🤣🔥pic.twitter.com/7YKfvkwgad— Darshni Reddy (@angrybirdtweetz) February 3, 2025 -
ఈ అన్యాయాన్ని ఆంధ్రా ప్రజలు క్షమించరు: ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు. ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని అన్నారాయన. ‘‘ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? అని ప్రశ్నించారాయన. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి. 👉ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి👉విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలి. 👉విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -
భారత్పై అన్ని దేశాల కన్ను
-
వికసిత భారతమే ఏకైక లక్ష్యం..
-
Watch Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తాం: రాష్ట్రపతి
👉 వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.👉 ఇటీవల 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్ డాకింగ్తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించాం. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. ఎంఎస్ఎంఈ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్పై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్సెల్ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అభవృద్ధి చేశాం. 👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. President Murmu says, "My government is committed to fulfilling the dream of the middle class of having their own house..." pic.twitter.com/Y58sa0z61Z— ANI (@ANI) January 31, 2025 👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు. 👉బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. President Droupadi Murmu to address the joint sitting of both Houses of Parliament, shortlySource: DD News pic.twitter.com/2RVQS79blX— ANI (@ANI) January 31, 2025👉కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్, బ్యాంకింగ్, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్ చేశారు.#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9— ANI (@ANI) January 31, 2025 👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్సభ హాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్సభలో 2025–26 సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతుంది. నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచనమోదీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. సహకరించాలన్న మోదీ సర్కార్శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు.వక్ఫ్ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఢిల్లీ: రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి -
పార్లమెంట్లో నీట్ మంటలు.. ధరేంద్ర ప్రధాన్పై రాహుల్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాడీవేడీ చర్చ జరిగింది.సభలో నీట్ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉంది. మంత్రి(ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారు. డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారు. పేపర్ లీక్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. #WATCH | Congress MP and LoP in Rajya Sabha Rahul Gandhi says "It is obvious to the whole country that there is a very serious problem in our examination system, not just in NEET but in all the major examinations. The minister (Dharmendra Pradhan) has blamed everybody except… pic.twitter.com/GO76I0sLZt— ANI (@ANI) July 22, 2024 ఈ క్రమంలో రాహుల్కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..‘నీట్ పరీక్ష పేపర్లీక్పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. విద్యావ్యవస్థను రాహుల్ అపహస్యం చేయడం దారుణం’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | On NEET exam issue, Samajwadi Party MP Akhilesh Yadav says, "This government will make a record of paper leaks... There are some centres where more than 2,000 students have passed. As long as this minister (Education Minister Dharmendra Pradhan) is there, the students… pic.twitter.com/Sa95rPYZki— ANI (@ANI) July 22, 2024మరోవైపు.. నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు నిరసనలకు దిగాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. అలాగే, ధర్మేంద ప్రధాన్ ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోని కొన్ని సెంటర్లలో రెండు వేల మందికిపైగా విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. -
ఎల్లుండి నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను జూలై 23న ఉదయం 11:00 గంటలకు పార్లమెంట్లో సమర్పించనున్నారు. అంతకంటే ముందు జూలై 22న ఎకనమిక్ సర్వే విడుదల చేస్తారు.ఇప్పటికే 2024-25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది. దీనికి గుర్తుగానే ఇటీవల 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.లోక్సభలో ఆర్థికమంత్రి ఈ నెల 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వికసిత భారత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
బడ్జెట్ పై మెగా కవరేజ్
-
జులై 21న అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ డుమ్మా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జులై 21న (ఆదివారం) పార్లమెంట్ ఉభయసభల్లోని అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని ప్రధాన కమిటీ రూమ్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ ని ర్ణయించుకుంది.కాగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
PM Narendra Modi: మాకది దిష్టి చుక్క!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. దారిచూపే దీపం మన్మోహన్ సింగ్ దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది. -
పార్లమెంట్ లో అడుగుపెట్టిన నిర్మలా సీతారామన్
-
ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది ?
-
మహిళలకు ప్రత్యేక వరాలు
-
నేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
-
నిర్మలమ్మ కరుణించేనా..
ఎదులాపురం: ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచే సీసీఐ (సిమెంట్ ఫ్యాక్టరీ)ని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు నిధులు కేటా యించాలని రాజకీయ అఖిల పక్ష నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు నల్లా గణపతిరెడ్డి అధ్యక్షతన బుధవారం రాజకీయ అఖిల పక్ష స మావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఆదిలాబాద్ అభివృద్ధి సాధన పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ బండి దత్తాత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం విమానా శ్రయం, గిరిజన యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు వంటివి వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకోసం దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కో కన్వీనర్లుగా బాలూరి గోవర్ధన్రెడ్డి (కాంగ్రెస్), విజ్జగిరి నారాయణ (బీఆర్ఎస్), ప్రభాకర్రెడ్డి (సీపీఐ), వెంకట్నారాయణ (న్యూడెమోక్రసీ), జగన్సింగ్ (ప్రజాపంథా), మల్యాల మనోజ్(టీఎమ్మార్పీఎస్), అగ్గిమల్ల గణేశ్ (ధర్మ సమాజ్పార్టీ), గుడుగు మహేందర్ (బీఎస్పీ), కొండా రమేశ్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి (రైతు సంఘం), కమిటీ సభ్యులుగా పూసం సచిన్, బండి దేవిదాస్ చారి, రోకండ్ల రమేశ్, నంది రామ య్య, కుంటాల రాములు, దర్శనాల అశోక్, నక్క రాందాస్, నీరటి ఉదయ్ కిరణ్, మాడవి గణేశ్ ఎన్నికయ్యారు. కై లాస్నగర్: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ను పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నిక ల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర పద్దు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించే బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వే ప రంగా జిల్లాకు కొత్త వరాలు ప్రకటిస్తారా..పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తారా అనే దానిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో విద్య, వైద్యం పరంగా యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ కావడంతో ప్రధానంగా రైతులకు మేలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జిల్లాకు ఏ మేర న్యాయం చేకూరుస్తారనే దానిపై అన్నదాతల్లో ఆసక్తి నెలకొంది. ►ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అయితే దీన్ని ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఆదిలాబాద్–పఠాన్చెరు రైల్వేలైన్ ఏర్పాటుకు సంకల్పించింది. ఇందులో భాగంగా సర్వే సైతం పూర్తయింది. అయితే ఈ పనులను పఠాన్చెరు–ఆదిలాబాద్ చేపట్టాలని నిర్ణయించడంపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడుతూ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ►ఆదిలాబాద్–గడ్చందూర్ బేల మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు మంజూరు చేసింది. సర్వే కూడా పూర్తయింది. అయితే నిధులు కేటాయించాల్సి ఉంది. గత రెండు బడ్జెట్లలో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ►ఆదిలాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్, మహారాష్ట్రలోని ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. పూర్తిస్థాయిలో రైళ్లు లేకపోవడంతో రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాందేడ్ వరకు నడుస్తున్న నాందేడ్– బెంగుళూరు, నాందేడ్–శ్రీ గంగానగర్, నాందేడ్–అమృత్సర్, ధర్మబాద్–ముంబై రైళ్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు పొడిగిస్తే జిల్లా వాసులు ఆయా ప్రాంతాలకు సునాయసంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. రైళ్లను పొడిగించాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ►ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక కేంద్రీయ విద్యాల యం ఉంది. మరిన్ని విద్యాలయాలు మంజూరు చేస్తే పేద విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్తో కూడిన నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. ►జవహర్ నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు జిల్లాలో లేవు. వాటిని ఏర్పాటు చేయాలని పదేళ్లుగా జిల్లావాసులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. వాటిని మంజూరు చేస్తే జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సైనికులుగా దేశ సేవ కోసం ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ►ఆదిలాబాద్.. ఆదివాసీలతో కూడిన జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఉన్నత విద్య అవకాశాలు అందాలంటే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. గిరిజన వర్సిటీని గతంలో మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని వరంగల్కు తరలించారు. దీనిపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ బడ్జెట్లోనైనా గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ►జిల్లాలో ఎయిర్పోర్టు, ఎయిర్ఫోర్స్ స్టేషన్ల కోసం అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. అన్ని విధాలా అనుకూలతలున్నాయి. గతంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి సర్వే చేపట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వీటిలో ఏఒక్క దానికై నా నిధులు మంజూరైతే ఆదిలాబాద్ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. ►జిల్లాలో సాగునీటిని అందించే ప్రాజెక్టులు మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటి ద్వారా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతాంగానికి సా గునీరు అందడం లేదు. కాలువలు లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరని పరిస్థితి. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కోర్టా–చనాఖా బ్యారేజీ నిర్మాణం సైతం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుద ల చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. -
నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది: మోదీ
-
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. వాడీవేడిగా చర్చలు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు. 14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్సభ సభ్యులున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. -
బడ్జెట్ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను(బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై దుమారం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందంటూ గతవారం లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లో రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ తన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోనూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదానీ-హిండెన్ బర్గ్ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు విమర్శించారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. లోక్సభ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్లో భారత్ను అవమానించారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను సభలోని సభ్యులంతా తీవ్రంగా ఖండించాలని.. దేశానికి కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు రాజ్యసభలోనూ రాహుల్ గాంధీ అంశంపై ప్రకంపనలు రేగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ.. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని సీనియర్ నేత అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు పలువురు బీజేపీ మంత్రులు కూడా మద్దతు పలికారు. అయితే దీనిపై స్పందించిన విపక్ష కాంగ్రెస్ మంత్రులు.. గతంలో నరేంద్ర మోదీ కూడా వీదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఏంటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే, నాశనం చేసే వారు దానిని రక్షించాలంటూ మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్, ఆప్ సైతం మద్దతు తెలిపాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. -
బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్
సాక్షి, ఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు సభలు సజావుగా జరుగుతాయని అంతా భావించారు. అయితే టర్కీ, సిరియా భూకంప బాధితుల సంతాపం ప్రకటన అనంతరం.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలంటూ ఇరు సభలను అడ్డుకునే యత్నం చేశాయి. దీంతో ఉభయ సభలు కాసేపటికి వాయిదా పడ్డాయి. తొలుత బీఆర్ఎస్, ఆప్లు మాత్రమే సమావేశాలకు దూరంగా ఉంటాయని అంతా భావించారు. ఈ క్రమంలో మిగతా పార్టీలలో దాదాపుగా అన్నీ పార్లమెంట్ వ్యవహారాలకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ జైరామ్ రమేశ్ ప్రకటించారు. అయితే.. లోక్సభలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా రాజ్యసభలో మాత్రం విపక్షాలు కార్యకలాపాలను ఏమాత్రం ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. Rajya Sabha adjourned till 2 pm as Opposition MPs walked to the Well of the House and demanded that the PM come to the House and respond over #Adani row. pic.twitter.com/OR1nh85pO4 — ANI (@ANI) February 7, 2023 అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హౌజ్ వెల్లోకి వెళ్లాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటల దాకా సభ వాయిదా పడింది. మరోవైపు లోక్సభ ప్రారంభంలో ప్రతిపక్షాల నిరసనతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆపై మరోసారి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రారంభమైన సభ కాస్త సజావుగానే నడిచింది. అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ దర్యాప్తుగానీ, సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తునకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోదీ సైతం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. -
Budget Session: పార్లమెంట్లో మారని సీన్..ఉభయసభలు వాయిదా
సాక్షి, ఢిల్లీ: అదానీ కంపెనీల అవకతవకలపై చర్చ జరపాలని, జేపీసీ దర్యాప్తు డిమాండ్లతో విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వడం లేదు. విపక్షాల వాయిదా తీర్మాన నోటీసులు.. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల తిరస్కరణ.. ఆపై పార్లమెంట్లో నెలకొన్న గందరగోళంతో ఇరు సభలు కూడా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించకుండానే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనా రెండు సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి. బడ్జెట్ సమావేశాల ఐదవ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదానీ కంపెనీపై హిండన్బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు సభ ప్రారంభమైన కాసేపటికే నినాదాలతో గందరగోళం సృష్టించాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా విపక్షాలు అనుమతించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సుమారు 16 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు.. శుక్రవారం ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై జేపీసీ దర్యాప్తు అనే ఏకపక్ష డిమాండ్ను ఉభయ సభల్లోనూ లెవనెత్తాలని నిర్ణయించుకున్నారు. ఆపై శుక్రవారం ఎలాంటి వ్యవహరాలు జరగకుండానే.. సోమవారానికి(ఇవాళ్టికి) పార్లమెంట్ సెషన్ వాయిదా పడింది. అయితే సోమవారం ప్రారంభమైన తర్వాత కూడా అదే సన్నివేశం నెలకొంది. కేంద్రం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి ఒక ప్రాధాన్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది. -
Adani row: ఉభయసభలు సోమవారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై హిడెన్బర్గ్ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగనిచ్చేలా కనిపించడం లేదు. సమావేశాల్లో నాలగవ రోజైన శుక్రవారం ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లోక్సభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తునన్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. సభ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు అదానీ-హిడెన్బర్గ్ విషయంలో పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాల దాడులను ఎలా తిప్పి కొట్టాలి అనే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు బీజేపీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్షాల అత్యవసర సమావేశం జరిగింది. ఆప్, బీఆర్ఎస్లు సైతం ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇరు సభల్లో విడివిడిగా అదానీ-హిడెన్బర్గ్ వ్యవహారంపై వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్. ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు ఆప్ కూడా నోటీసులు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అదానీ-హిడెన్బర్గ్ నివేదికపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. सदन में लगातार हंगामे के कारण Speaker हुए गुस्से से आग बबूला, फिर हुआ ये.. | Liberal TV#RajyaSabha #Loksabha2024 #Loksabha #Parliament #parliamentofindia #Adjourned #LiberalTV #Speaker #Ombirla #anger pic.twitter.com/FQU93r0YBC — Liberal TV (@LiberalTVNews) February 3, 2023 -
పార్లమెంట్లో ‘హిండెన్బర్గ్’ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక గురువారం పార్లమెంట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మార్కెట్ విలువను భారీగా కోల్పోతున్న అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడుల అంశంపై తక్షణమే చర్చించాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు స్తంభించాయి. హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా 9 విపక్షాల ఎంపీలు వెల్లోకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 9 పార్టీల వాయిదా తీర్మానాలు సభా కార్యకలాపాల ఆరంభానికి ముందే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదానీ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చేదాకా సభా కార్యక్రమాలు అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఉభయ సభల్లో 9 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్సభలో కాంగ్రెస్ తరఫున మాణిక్యం ఠాగూర్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ప్రశ్నోత్తరాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, అదానీ అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ స్పీకర్ పదేపదే కోరినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వెల్లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుంటూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. జేపీసీ లేక సీజేఐ నేతృత్వంలో కమిటీ అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇందుకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉదయం ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని విపక్ష ఎంపీలు విజయ్చౌక్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మార్కెట్ విలువ కోల్పోతున్న సంస్థల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారు. దీనిపై చర్చించడానికి మేమిచ్చిన తీర్మానాన్ని సస్పెండ్ చేశారు. అదానీ అంశంపై పార్లమెంట్లో లోతుగా చర్చించాలి. అదానీపై విచారణ వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణతోనే..: నామా, కేకే అదానీ వ్యవహారంపై జేపీసీ లేక సీజేఐ కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కె.కేశవరావు పేర్కొన్నారు. ఎల్ఐసీ సహా బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. జనం సొమ్మును లూటీ చేశారు ఎల్ఐసీ, ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ సంస్థలతో అదానీ గ్రూప్లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. తాజా సంక్షోభం వల్ల ఆయా సంస్థలు భారీగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు పొదుపు చేసుకున్న సొమ్ము ప్రమాదంలో చిక్కుకుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అదానీ అంశంపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వారంతా భయాందోళనకు గురవుతున్నారని సమాజ్వాదీ పార్టీ నేత రామ్గోపాల్ యాదవ్ చెప్పారు. జనం సొమ్మును అదానీ లూటీ చేశారని సీపీఎం నేత ఎలమారమ్ ధ్వజమెత్తారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భారీ కుంభకోణం జరిగితే ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిలదీశారు. -
Union Budget: కర్ణాటకకు కేంద్ర బడ్జెట్లో పెద్ద పీట
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది కేంద్రం. బడ్జెట్-2023లో వరాలు జల్లు కురిపించింది. కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు రూ.5,300 కోట్ల కేటాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగించారు. భద్ర ఎగువ తీర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల గ్రాంట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుందని, చిత్రదుర్గతో సహా మధ్య కర్ణాటకలోని అనేక వర్షాధార వ్యవసాయ జిల్లాలకు వరం అవుతుందని, పైగా.. ప్రాజెక్టును త్వరగా, సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. దీనికి కొనసాగింపుగా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు వస్తాయని అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే వరాలు కురుస్తున్నాయి. -
ముందే ముగియనున్న బడ్జెట్ తొలి దఫా సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల తొలి దఫా బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 13కు బదులు 10వ తేదీనే ముగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పలు పార్టీలు కోరాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ధృవీకరించారు. ‘‘లోక్సభ సభా కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీలో స్పీకర్ వద్ద వారీ విషయాన్ని ప్రస్తావించారు. వారి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా జరగనుంది. తొలి సెషన్ ఫిబ్రవరి 13వ తేదీతో ముగియనుంది. అయితే 11-12 తేదీలు వారాంతం కావడంతో ఎంపీలు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్ ప్రకారం.. రెండో దఫా సమావేశాలు మార్చి 13వ తేదీన మొదలై.. ఏప్రిల్ 6వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి. -
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్.. ముగిసిన తొలిరోజు సెషన్..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు సెషన్ ముగిసింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అమృతకాలంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు పౌరసరఫరాల శాఖ - రూ.2.06 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1.6 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు రూపాయి రాక.. ►2023-24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు ►మొత్తం టాక్స్ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు ►కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ10.22 లక్షల కోట్లు ►ఇన్కం టాక్స్ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు ►GST ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.9.57లక్షల కోట్లు రూపాయి పోక.. ►ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు ►వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44లక్షల కోట్లు ►వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు ►పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13లక్షల కోట్లు వేతన జీవులకు ఊరట ►ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు ►ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను ►0-3 లక్షల వరకు నిల్ ► 3 - 6 లక్షల వరకు 5% పన్ను ►6 - 9 లక్షల వరకు 10% పన్ను ►9 -12 లక్షల వరకు 15% పన్ను ►12- 15 లక్షల వరకు 20% పన్ను ►రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను ►రూ.9లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు ►రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలు ►2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి ►దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి ►ఎంఎస్ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు ►బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి ►మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్పై 7% వడ్డీ ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంపు ►సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంపు ►ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం ►వచ్చే ఏడాది ద్రవ్యలోటు 5.9% ఉండే విధంగా చర్యలు ►2026 నాటికి ద్రవ్యలోటు 5శాతం దిగువకు తీసుకురావాలని లక్ష్యం ►గతేడాది 31 కోట్ల ఫోన్లు భారత్లో తయారయ్యాయి.. ►భారత్లో తయారైన ఫోన్ల విలువ రూ.2.75లక్షల కోట్లు ►లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13% తగ్గింపు ►తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ►టీవీ ప్యానల్స్పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు: నిర్మల ►రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు ►మరిన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్పోర్టులు, హెలీ ప్యాడ్లు ► నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు ►ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు ►లడఖ్లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు ►గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు ►సేంద్రీయ వ్యవసాయం వైపు కోటి మంది రైతులు ►తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత ►మిస్టీ పథకం ద్వారా మడఅడవుల అభివృద్ధి ►వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధుల కేటాయింపు.. ►యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0 ►రైల్వేలకు రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు ►50 ఎయిర్పోర్ట్లు, పోర్టుల పునరుద్ధరణ ►ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రాధాన్యత ►నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ ►ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ రూ.10వేల కోట్లు ►మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభం ►ఈ-కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం మూడో విడత రూ. 7 వేల కోట్లు ►5 జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్ల ఏర్పాటు ►2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం ►త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట ►కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం ►రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కోసం రూ.13.7లక్షల కోట్లు ►పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు ఆర్ధిక సాయం ►మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు ►సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.. ►నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా కేవైసీ విధానం మరింత సులభతరం ►వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్, పాన్కార్డ్, డిజీలాక్ ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ ►సమ్మిళిత అభివృద్ధి ►చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు ►భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ►దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట ►పర్యావరణ అనుకూల అభివృద్ధి ►యువ శక్తి ►పటిష్టమైన ఆర్థిక రంగం ► మిల్లెట్లతో ఆరోగ్య జీవితం.. శతాబ్దాల నుంచి భారతీయుల ఆహారమైన మిల్లెట్లకు పెద్దపీట. ప్రపంచ స్థాయిలో మిల్లెట్ హబ్గా భారత్ను రూపొందించడమే లక్ష్యంగా.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు. ► ఆరోగ్యమే మహాభాగ్యం.. వ్యవసాయానికి పెద్దపీట, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ► 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ► భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెళ్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మల ప్రకటించారు. ► పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ►75 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుస్తున్న వేగుచుక్క ఈ బడ్జెట్ ►కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ►ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ ►ప్రపంచ వేదికపై భారత్ పాత్ర బలోపేతానికి జీ20 సమావేశాలు దోహదపడతాయి ►ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశ వృద్ధిరేటు ఎక్కువ ►ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాల సంఖ్య రెట్టింపై రూ. 27 కోట్లకు చేరింది. ►11.7 కోట్ల గృహాలకు కొత్తగా టాయిలెట్లు నిర్మించాం ►భారత తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు ►2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగింపు ►మా ప్రాధాన్యత అంశాలు యువతకు ప్రాధాన్యత, అభివృద్ధి-ఉద్యోగాల కల్పన, సుస్థిరత మా లక్ష్యం ►మహిళల ఆర్థిక స్వావలంబన మా ప్రాధాన్యత అంశం ►రాష్ట్రాల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ►వృత్తి కళాకారులకు మరింత చేయూత ►11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించాం ►గ్రీన్ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత ►జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ►యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ►క్లీన్ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2వేల కోట్లు ►చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ►ఉద్యానవన పంటలకు ఆర్థిక చేయూత ►చిన్న, మధ్య తరహా రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు ►ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి ►సప్తరిషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యనిస్తూ బడ్జెట్ ►2047 నాటికి రక్తహీనత రూపుమాపడం కోసం ప్రత్యేక ప్రణాళిక ►50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు ►రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయింపు ►మూలధన వ్యయం 33% పెంపు రూ. 10లక్షల కోట్లు ►ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ►మత్స్యశాఖకు రూ. 6 వేల కోట్ల నిధులు ►18 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం ►చిన్నారుల కోసం నాణ్యమైన పాఠ్యాంశాలు, ఉత్తమ పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ ►ఫార్మా రంగంలో పరిశోధనల కోసం కొత్త కార్యక్రమం ►దేశవ్యాప్తంగా సహకార సంఘాల వివరాలతో నేషనల్ కో ఆపరేటివ్ డాటాబేస్ ►సేంద్రీయ సాగుకు పెద్దపీట, కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా మార్గదర్శకాలు ►ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లతో దేశవ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం ►ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ ►740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు, 3.50లక్షల మంది విద్యార్ధులకు బోధన ►ఏకలవ్య స్కూల్స్లో 38,800 టీచర్ల నియామకం ►2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►ప్రారంభమైన పార్లమెంట్ ► కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. బడ్జెట్ ద్వారా భారీగా ఊరట ఉండొచ్చని గంపెడాశలు పెట్టుకున్నారు జనం. ► బడ్జెట్ 2023కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► బడ్జెట్ 2023-24.. బడ్జెట్కు ఆమోదం దృష్ట్యా కేంద్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో పార్లమెంట్కు చేరుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు ► పార్లమెంట్కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ►రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి ► కాసేపట్లో పార్టమెంట్కు ఆర్థికమంత్రి కేంద్ర పద్దుపై కోటి ఆశలతో జనం.. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. వచ్చే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి.. గత ఐదేళ్లుగా ఊరట దక్కని వర్గాలు.. ఈసారి బడ్జెట్పై అంచనాలు పెంచుకున్నాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం మన దేశ పద్దుపైనా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. ఎక్కువ టైమ్ పట్టదు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే కేంద్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. రాష్ట్రపతితో భేటీ ముగిసిన తర్వాత పార్లమెంట్కు చేరుకుంటారు ఆర్థిక మంత్రి నిర్మల. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ముందుగా రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతికి బడ్జెట్ సమాచారం ఇస్తారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అవినీతిపై కేంద్రం నిరంతరం పోరాడుతోంది’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగాన్ని ద్రౌపది ముర్ము.. పార్లమెంట్ సభ్యుల సాక్షిగా దేశానికి వినిపించారు. ఈ క్రమంలో దేశం అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. వన్ నేషన్ వన్ రేషన్ మంచి కార్యక్రమం. భారత్ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పెద్ద భరోసా. పేదల ఉపాధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మంది పేదలకు కేంద్రం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మూడేళ్లలో 11 కోట్ల మందికి ఇంటింటికీ మంచినీరు అందించింది. దేశ ప్రజలకు కోవిడ్ నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం. నిరుపేద కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అన్ని విధాలుగా కోవిడ్ కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేసింది. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాళ్ల అభివృద్ధికి పాటుపడుతోంది. ఓబీసీల సంక్షేమం కోసం కీలక ముందడుగు వేసింది. గిరిజన నేతలకు మంచి గుర్తింపు లభిస్తోంది. బాగా వెనుకబడిన గ్రామాలను కేంద్రం అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. భేటీ బచావ్-భేటీ పడావ్ నినాదం ఫలితాన్నిచ్చింది. దేశంలో తొలిసారిగా మహిళల సంఖ్య పెరిగింది. పీఎం ఆవాస్ యోజన పథకం సత్ఫలితాలు ఇచ్చింది. బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. అంతరిక్ష ప్రయోగాలతో భారత్ అత్యద్భుత ప్రగతి సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అతిపెద్ద శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ ఫార్మా హబ్గా భారత్ ఎదుగుతోందని కొనియాడారామె. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసలు గుప్పించారామె. -
అఖిలపక్ష భేటీ.. బడ్జెట్ సమావేశాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కోరింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకానుంది. అందుకే విపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ సైతం హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక బుధవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. -
నిర్మలమ్మకు 2023–24 వార్షిక బడ్జెట్ వినతులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు విశ్లేషణా సంస్థలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, నివేదికలు, సిఫారసులు కేంద్రానికి సమర్పిస్తున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... ఐదేళ్లు కస్టమ్స్ సుంకాలను మార్చవదు: జీటీఆర్ఐ దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కనీసం ఐదేళ్లపాటు కస్టమ్స్ సుంకాలలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆర్థిక విశ్లేషణా సంస్థ– జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) తన ప్రీ–బడ్జెట్ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ విధానం దేశీయ తయారీ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. విధాన స్థిరత్వాన్ని ఇది సూచిస్తుందని కూడా విశ్లేషించింది. సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. కంపోనెంట్స్పై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలి. గందరగోళాన్ని నివారించడానికి, వ్యాజ్య పరిస్థితులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకం స్లాబ్లను ప్రస్తుత 25 నుండి 5కి తగ్గించాలి. పలు విధాలుగా ఉన్న అధిక స్లాబ్లు ఒకే విధమైన వస్తువులకు వేర్వేరు సుంకాల విధింపునకు దారితీస్తుంది. ఇది వర్గీకరణ వివాదాలకు, ఖరీదైన వ్యాజ్యాలకు దారితీస్తుంది. ఇది పత్రాల ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ను కూడా ఇది కష్టతరం చేస్తుంది. డ్యూటీ స్లాబ్ల సంఖ్య తగ్గింపు వ్యవస్థ పారదర్శకతను తక్షణమే మెరుగుపరుస్తుంది. వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది.డాక్యుమెంట్ల మెషీన్ ప్రాసెసింగ్ను వేగవంతం చేస్తుంది. ఇక సుంకాలను త్వరగా వాపసు చేయడం, పోస్ట్, కొరియర్ ద్వారా ఎగుమతుల విధాన ఆవిష్కరణ వంటి చర్యల ద్వారా ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. గత ఏడాదే ఆయన పదవీ విరమణ చేశారు. వాణిజ్య విధాన రూపకల్పన, డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సమస్యలలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఫోన్ విడిభాగాలపై సుంకాల భారం తగ్గించాలి సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ మొబైల్ ఫోన్ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్ అసెంబ్లీలపై సుంకాలను క్రమబద్ధీకరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలకు చోటివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. అధిక రేటు గల ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో ఆర్థిక మంత్రికి పరిశ్రమ తెలియజేసింది. 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఒక్కో ఫోన్పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని కోరింది. ఉపకరణాలు, విడిభాగాలపై అధిక సుంకం దేశీ తయారీని (మేడ్ ఇన్ ఇండియా) పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 2.75 శాతం టారిఫ్, ఇతర చిన్న సుంకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, నిజమైన తయారీదారులకు ప్రతిబంధకమని పేర్కొంది. మెకనిక్స్పై డ్యూటీ చాలా అధికంగా ఉందని, మెకనిక్స్ తయారీలో వాడే అన్ని విడిభాగాలపై సుంకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టాలి : ఎఫ్ఏఐఎఫ్ఏ ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్ఏఐఎఫ్ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) ప్రభుత్వాన్ని అ భ్యర్థించింది. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు ప్రీ బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. సిగరెట్ స్మగ్లింగ్ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 18.45 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు రూ.2,859 కోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం రూ.13,331 కోట్లు ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారీ గౌడ పేర్కొన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2021–22లో రూ. 93 కోట్ల విలువైన 11 కోట్ల సిగరెట్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు. పీఎల్ఐ పథక విస్తరణ!: వివిధ వర్గాల అంచనా రాబోయే బడ్జెట్లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అధిక ఉపాధి రంగాల పురోగతికి ఉద్దేశించి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా తయారీ రంగం పోటీ పడగలగడం పీఐఎల్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం. లాజిస్టిక్స్ పురోగతి: ఆపరేటర్ల విజ్ఞప్తి రాబోయే కేంద్ర బడ్జెట్ లాజిస్టిక్స్ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్మ్యాప్ను రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలను అనుసరించాలని ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ (మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్కాంటినెంట్ అండ్ ఆఫ్రి కా– ఎంఈఐఎస్ఏ) కమీ విశ్వనాథన్ ఒక ప్రకటన చేస్తూ, అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు వస్తు, సేవల పన్నును తొలగించాలని సిఫారసు చేశారు. అంతర్జాతీయ జీఎస్టీ, వీఏటీ చట్టాలలో అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు చాలా వరకు ’జీరో–రేట్’లో ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్ సీఎఫ్ఓ యోగేష్ పటేల్ కోరారు. ఆర్అండ్డీ వ్యయాలపై పన్ను మినహాయింపు: క్రాప్లైఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం చేసే వ్యయాలపై వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ– క్రాప్లైఫ్ ఇండియా డిమాండ్ చేసింది. టెక్నికల్ రా మెటీరియల్, ఫార్ములేషన్స్ రెండింటికీ 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగ్రోకెమికల్ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం 200 శాతం వెయిటెడ్ డిడక్షన్ను అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు క్రాప్లైఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ దుర్గేశ్ చంద్ర పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పేర్కొంటూ, బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని కోరారు. ఉపాధి కల్పనపై దృష్టి: హెచ్ఆర్ ఇండస్ట్రీ సిఫార్సు మానవ వనరుల (హెచ్ఆర్) పరిశ్రమ రాబోయే బడ్జెట్లో వివిధ చర్యలను అంచనా వేస్తోంది. ఇది ఉద్యోగులకు, ఉపాధి కల్పనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశంలోని నైపుణ్యం సవాళ్లను పరిష్కరిస్తుందని అంచనా వేస్తోంది. కార్మిక చట్ట సంస్కరణలు, అధికారిక ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, స్టాఫింగ్ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టాడ్ ఇండియా తెలిపింది. పీఎల్ఐ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ఊతాన్ని అందిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పన దేశంలో ఇంకా సవాల్గా మిగిలిపోయిందని రాండ్స్టాడ్ ఇండియా ఎండీ సీఈఓ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. -
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్కి ఏపీతోనూ అనుబంధం!
కేంద్ర బడ్జెట్ 2022 ముందు అనూహ్యంగా డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (CEA)గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీకాలం గత డిసెంబర్లోనే ముగియగా.. ఇప్పుడు అనంత నాగేశ్వరన్ను ఆ స్థానంలో నియమించారు. ఈ నేపథ్యంలో ఈయన నేపథ్యంపై ఓ లుక్కేద్దాం. అనంత నాగేశ్వరన్ ఆర్థిక మేధావి మాత్రమే కాదు.. రచయిత, టీచర్, ఎకనమిక్ కన్సల్టెంట్ కూడా. ప్రధాని నేతృత్వంలోని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో 2019-2021 మధ్య పార్ట్టైం మెంబర్గా ఈయన ఉన్నారు. గతంలో క్రెడిట్ సుయిస్సె గ్రూప్ ఏజీ, జూలియస్ బాయిర్ గ్రూప్ల్లోనూ ఈయన ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. అంతకు ముందు బిజినెస్ స్కూల్స్, భారత్లోని కొన్ని మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్స్లో, సింగపూర్లో పని చేశారు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్గా కూడా వ్యవహరించారు. ప్రస్తుత సీఈఏకు ఆంధ్రప్రదేశ్తోనూ అనుబంధం ఉంది. క్రి(క్రె)యా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గానూ కొంతకాలం ఈయన పని చేశారు. తమిళనాడు మధురైలో స్కూలింగ్, కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న నాగేశ్వరన్.. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. 1994లో మస్సాషుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్లో(empirical behaviour of exchange rates మీద) డాక్టరేట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే ఎనకమిక్ సర్వే అనేది సాధారణంగా సీఈఏ ప్రిపేర్ చేస్తారు. కానీ, బడ్జెట్కు ముందు ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ప్రిన్స్పల్ ఎకనమిక్ అడ్వైజర్, ఇతర అధికారులు సర్వే నివేదికను రూపొందించడం గమనార్హం. అంటే.. ఈ దఫా సర్వేలో సీఈఏ లేకుండానే రూపొందగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దానిని ప్రవేశపెట్టారు. సంబంధిత వార్త: బడ్జెట్కు ముందే నాగేశ్వరన్ ఎంపిక.. ఎందుకు? -
బిట్కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బిట్కాయన్పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది. తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్ లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది. అంతేకాదు సొంత క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే రూపాయి డిజిటల్ వెర్షన్ను జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జనవరి 25 న జారీ చేసిన బుక్లెట్లో ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, నష్టాల భయాలను కూడా హైలైట్ చేసింది. అలాదే దీనిపై అనేక అనుమానాలున్నాయని కూడా వ్యాఖ్యానించింది. ప్రతిపాదిత బిల్లు క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 ప్రకారం ఇండియాలో బిట్కాయిన్, ఇథెర్, రిపుల్ సహా ఇతర ప్రైవేటు డిజిటల్ కరెన్సీల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీనిబ్యాన్ చేసే బిల్లు తయారు చేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. అలాగే 2018 లో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ విధించిన బ్యాన్ను సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది. (ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ) సాధ్యం కాదంటున్న నిపుణులు క్రిప్టో పరిశ్రమ నిపుణులు ఈ వార్తలపై స్పందిస్తూ క్రిప్టోకరెన్సీలు 'పబ్లిక్' కనుక ఇవి నిషేధం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి, తమ వాదనలు వినిపిస్తా మంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలను పబ్లిక్ క్రిప్టోకరెన్సీలుగా పరిగణిస్తారు, ఎవరైనా లావాదేవీలను జరుపుకోవ్చని చెబుతున్నారు. భారతదేశంలో 7 మిలియన్లకు పైగా క్రిప్టో హోల్డర్లు ఉన్నారు. 100కోట్ల బిలియన్ డార్లకుపైగా క్రిప్టో ఆస్తులు భారతీయుల సొంతం. ప్రభుత్వం ఈ సంపద మొత్తాన్ని రాత్రికి రాత్రి నిషేధిస్తుందని తాను భావించడం లేదని క్రిప్టోకరెన్సీ మార్పిడి ఎక్సేంజ్ వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. ఆర్బీఐ అధికారిక సమాచారంలో, బిట్కాయిన్ ప్రైవేట్గా, మిగిలిన వాటిని పబ్లిక్ బ్లాక్చైన్లుగా వర్గీకరించారని, ఇది తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వర్గీకరణపై స్పష్టమైన సమాచారం లేదని కాయిన్డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా ట్వీట్ చేశారు.(ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం 20 బిల్లుల జాబితాను సిద్ధం చేసింది. సీసీఐ సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021, మైనింగ్ మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి -
పార్లమెంట్లో హైదరాబాద్ బిర్యానీ ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: రాయితీలు ఎత్తివేయడంతో పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి. రాయితీ ఎత్తేసిన తర్వాత కొత్త ధరలతో మెనూను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ మేరకు క్యాంటీన్ కూడా సిద్ధమైంది. అయితే రాయితీ ఎత్తివేయగా ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అందరి ఫేవరేట్గా ఉండే హైదరాబాద్ బిర్యానీ ఎంత అనే ప్రశ్న వస్తోంది. ఈ క్యాంటీన్లో ప్రస్తుతం రూ.150కి హైదరాబాద్ మటన్ బిర్యానీ లభిస్తోంది. ఈ బిర్యానీ రాయితీతో రూ.65కే వచ్చేది. ఇక నాన్ వెజ్ బఫే కొత్త ధర రూ.700 ఉంది. మెనూలో అత్యధిక ధర ఉన్నది ఈ పదార్థానికే. అతి తక్కువ ధర అంటే చపాతీనే. ఒక చపాతీ రూ.3కు అందుబాటులో ఉంది. కొత్త ధరల ప్రకారం శాకాహార భోజనానికి రూ.100. ఉడకబెట్టిన కూరగాయలు గతంలో రూ.12 ఉండగా ఇప్పుడు రూ.50కి పెరిగింది. అయితే రాయితీలను ఎత్తివేయడంతో లోక్సభ సెక్రటేరియట్కు ఏడాదికి దాదాపు రూ.8 కోట్లు ఆదా అవుతోంది. ఈ క్యాంటీన్లో మొత్తం 58 ఆహార పదార్థాలు ఉన్నాయి. -
బడ్జెట్ సెషన్కు సిద్ధం.. 30న అఖిలపక్ష భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పార్టీల పార్లమెంటరీ నేతలకు ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోషి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న శాసన వ్యవహారాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షాల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడతగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కొత్తగా ఉండనుంది. ఉదయం రాజ్యసభ కొనసాగితే లోక్సభ సాయంత్రం జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. -
రెండో రోజు పార్లమెంట్లో అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. రెండో రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. లోక్సభ, రాజ్యసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో రెండు సభలను వాయిదా పడ్డాయి. లోక్ సభను మధ్నాహం 12 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. రెండో రోజు సమావేశాలు మొదలైన వెంటనే లోక్సభలో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలుపుతూ పోడియం వద్దకు దూసుకొచ్చారు.సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ ఇరు పక్షాలు పట్టించుకోలేదు. సభ్యులెవరూ పోడియం వద్దకు రావొద్దని స్పీకర్ పదే పదే సూచించినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సభ మొదలవగానే ఢిల్లీ అల్లర్లపై దుమారం రేగింది. అల్లర్లపై చర్చ పెట్టాలని విపక్షాలు కోరాయి. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు నిరాకరించారు. దీంతో విపక్షనేతలు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. -
పార్లమెంట్లో ‘ఢిల్లీ అల్లర్ల’ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం సభను మధ్యాహ్నం 2గంలకు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపాయి. ఢీల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్లో ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ హింసకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని, నోటిపై వేల్లు వేసుకొని నిరసన తెలిపారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లు రాజ్యసభను కూడా కుదిపేశాయి. సోమవారం సభ ప్రారంభమవగానే విపక్షాలు ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి. దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఢిల్లీలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంశం గంభీరమైందని, ఇప్పడే దీనిపై చర్చించడం సరికాదన్నారు. సామన్య స్థితి ఏర్పడిన తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ నేత గూలంనబీ ఆజాద్ లేచి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో హింస చెలరేగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినా ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కాగా, ఆజాద్ వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుబట్టింది. ఇరుపక్షాలు పోడియం వైపుకు దూసుకురావడంతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
అన్ని వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగానే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నామని, ఈ సమావేశాల్లో బడ్జెట్పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఉభయ సభల్లో పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నదే తమ అభిమతమన్నారు. ఈ బడ్జెట్లో దళితులు, పేదలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరోవైపు ఆర్థిక సర్వే ప్రతులు పార్లమెంట్కు చేరాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో... పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. (పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన) -
అరుపుల మధ్యే జాతీయ గేయం..
-
పారిపోయిన కేంద్రం; పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెప్పుకున్న ఎన్డీఏ సర్కార్.. చివరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండా పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. వెల్లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు. అరుపుల మధ్యే జాతీయ గేయం..: రెండు విడదలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత లోక్సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. స్పీకర్ అపాయింట్మెంట్: ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి రాజీనామాలు సమర్పించారు. సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్ ఛాంబర్కు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఎంపీలు చెప్పారు. -
రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
-
మహానేత పాదాల వద్ద రాజీనామాలు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్కు బయలుదేరారు.. స్పీకర్ అపాయింట్మెంట్: ప్రత్యేక హోదా కోసం పదవులు త్యజించేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమేరకు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత నేరుగా స్పీకర్ను కలవనున్న ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించిన అనంతరం నేరుగా ఏపీ భవన్కు వెళ్లి ఆమరణ దీక్షలో కూర్చుంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. వైఎస్సీర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు, యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే.. -
బాబ్బాబూ.. మా బాబును కలవరా.. ప్లీజ్..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను నిర్ణయించానని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో ఆదరణ కరువైంది. నోరుతెరిస్తే ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ అని చెప్పుకునే ఆయనతో ..ఏ ఒక్క జాతీయ స్థాయి నేతా పట్టుమని ‘4 నిమిషాలు’కూడా మాట్లాడలేదు. హాస్యాస్పదంగా సాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలో ఇంకా చాలా విశేషాలున్నాయి.. ఏపీలో గడిచిన నాలుగేళ్లూ సాగింది ఎన్డీఏ పాలనే అయినా.. కేంద్ర ఎన్డీఏ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను జాతీయ నేతలకు వివరించడానికే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఇందుకోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, స్లైడ్షోలు, పుస్తకాల వంటి సరంజామాతో భారీగానే ప్రిపేర్ అయ్యారు. కానీ తీరా పార్లమెంట్కు వెళితే.. బాబుగారిని కలవడానికి ఏ ఒక్కరూ ఆసక్తిచూపలేదు. దీంతో ఇతర పార్టీల ఎంపీలను, కొద్దోగొప్పో గుర్తింపు ఉన్న నాయకులను బతిమాలి తీసుకొచ్చే బాధ్యతను టీడీపీ ఎంపీలపై పడింది. బాబ్బాబూ.. ప్లీజ్..: టీడీపీ ఎంపీలు రెండు బృందాలుగా విడిపోయారు. సభ వాయిదా అనంతరం పార్లమెంట్ సెంట్రల్ హాలులో అక్కడక్కడా కూర్చున్న ఎంపీలను, అటుగా వచ్చే కీలక నేతలను కలిసి ‘బాబ్బాబూ.. ఒక్కసారి మా బాబును కలవరా..’ అని ఒక బృందం బతిమాలుకోవడం అక్కడున్నవారికి నవ్వుతెప్పించింది. ఎంత పిలిచినా ఎవరూ రాకపోవడంతో కొంత సేపటికి చంద్రబాబే స్వయంగా వెళ్లి ఆయా నేతలను పలకరించడం మొదలుపెట్టారు. అలా బాబు ఎవరితో మాట్లాడినా ఫోటోలు తీసే పనిని రెండో ఎంపీల బృందం చేపట్టింది. ‘చూడు చూడు.. నేను 48 ఫొటోలు తీశాను..’అని ఎంపీ మురళీమోహన్ అనడం పరిస్థితిని స్పష్టంగా తెలియజేసింది. ఈ విధంగా బాబును బిజీగా ఉంచడానికి టీడీపీ ఎంపీలు పడిన పాట్లు అన్నీ ఇన్నీకావు. బాబు ఎవరెవరిని కలిశారు?: పార్లమెంట్ సెంట్రల్ హాలు బెంచిల మధ్య తిరుగుతున్నా చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. మూడు గంటలపాటు అక్కడ గడిపిన ఏపీ సీఎం.. ఎలాగోలా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పవార్ కూతురైన ఎంపీ సుప్రియా సూలే, ఎన్సీ నేత ఫారూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, జ్యోతిరాదిత్య సిధియాలను మాత్రమే కలవగలిగారు. అప్పటికప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జోలికి పోయే వీలేలేక.. ఏపీకి జరిగిన అన్యాయాలను బాబు బ్రీఫ్ చేశారు. జైరాం ఘాటు కౌంటర్: అదే సెంట్రల్ హాలులో ఎదురుపడ్డ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్తో చంద్రబాబు సంవాదం బెడిసికొట్టింది. ‘రాష్ట్రాన్ని విభజించి అన్యాం చేశారు’ అని బాబు పేర్కొనగా.. ‘అయ్యో, మీరు లేఖ ఇస్తేనేకదా మేం విభజించింది’ అని జైరాం ఘాటు కౌంటర్ ఇచ్చారు. -
చంద్రబాబుకు చుక్కలు చూపించారు..
సాక్షి, న్యూఢిల్లీ: డాబులకు ప్రసిద్ధిగాంచిన చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన ఆద్యంతం హాస్యాస్పదంగా సాగింది. మంగళవారం ఉదయం సమావేశాల సమయంలో పార్లమెంట్ భవనానికి వచ్చిన ఆయన విచిత్రమైన రీతిలో ఫొటోలకు పోజులిస్తూ కాసేపు హడావిడి చేస్తున్నాననుకున్నారు. సభ తొలివిడత వాయిదా అనంతరం సెంట్రల్ హాలులో చాయ్లు తాగడానికి వచ్చిన పలు పార్టీల అధినేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏఐడీఏంకే ఆందోళన నడుమ సభ రేపటికి వాయిదాపడిన తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్..: ఈ సందర్భంగా విలేకరులు మౌళికమైన కీలక ప్రశ్నలు అడగడంతో చంద్రబాబు ఇబ్బందికి గురయ్యారు. ‘‘సార్.. ఏపీకి అన్యాయం జరిగిందంటున్న మీరు నాలుగేళ్లు బీజేపీతో ఎందుకు అంటకాగాల్సి వచ్చింది? కేంద్రం అడిగినట్లు రెవెన్యూలోటు భర్తీ నిధుల లెక్కలు ఎందుకు చూపడంలేదు? ఇప్పడు ప్రత్యేక హోదా కావాలంటున్న మీరు మొన్నటిదాకా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు?అకస్మాత్తుగా ఎన్డీఏ నుంచి బయటికొచ్చి ప్రత్యేక హోదా అడగడంవెనుక మతలబు ఏమైనా ఉందా?..’’ అంటూ విలేకరులు సూటిగా అడిగారు. ఆ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పలేని చంద్రబాబు తనదైన శైలిలో.. ‘వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్..’ అని రివాజుగామారిని సుత్తికొట్టుడు ప్రారంభించారు. తాను బీజేపీని నమ్మానని, వారు మాత్రం ద్రోహం చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చివరి బడ్జెట్ దాకా వేచి ఉన్నానని, ఇక ఉపేక్షించని స్థితిలోనే ఢిల్లీతో పోరాటానికి దిగానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.. -
పెట్రోల్,డీజిల్ భారీ ధరలు; తగ్గాలంటే దారిదే!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం, యావత్ దక్షిణాసియాలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నులు వసూలు చేస్తోన్న దేశంగా భారత్ వెలిగిపోతుండటం తెలిసిందే. దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.73 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.64.58. అదే మన తెలుగురాష్ట్రాల్లోనైతే ఈ వసూళ్లు తారాస్థాయిలో జరుగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78 పైమాటే, ఇక విశాఖపట్నంలోనైతే రూ. 79 దాటింది. నెల్లూరు, చిత్తూరు లాంటి జిల్లాల్లోనైతే ఏకంగా లీటర్ పెట్రోలును రూ.80కి అమ్ముతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోన్న ధరలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ స్పందించారు. ఒక్కటే దారి: సోమవారం పార్లమెంట్ వాయిదా అనంతరం మంత్రి ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ ధరల తగ్గుదలకు ఓ సూచన చేశారు. ‘‘ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ను పలుమార్లు అభ్యర్థించాను.. పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే, అవి వినియోగదారుడికి అందుబాటు దరల్లో లభించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. ఇంకా.. ‘‘పెట్రోలియం ఉత్పత్తులనేవి అంతర్జాతీయ వస్తువులన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకునే ఒడిదుడుకులు దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. వినియోగదారుల పరంగా భారత్ సున్నితమైన దేశం. ధరల తగ్గింపునకు మా వంతు ప్రయత్నాలను చేస్తున్నాం..’’ అని మంత్రి అన్నారు. దేశంలో అన్నిరకాల ఉత్పత్తులకు భిన్నంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసిన విషయం విదితమే. ఏదైనా ఉత్పత్తిపై జీఎస్టీ విధింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడిగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే జీఎస్టీ కౌన్సిల్దే తుది నిర్ణయమన్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్న ధరల నియంత్రణ అధికారాన్ని ఆయిల్ కంపెనీలకు కట్టబెట్టిన తర్వాత.. ఆ సంస్థలు 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. గతేడాది జూన్ నుంచి రోజువారీగా ధరలను సమీక్షించడం ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకింత చొప్పున పెరుగూ తాజాగా నాలుగేళ్ల గరిష్టస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరాయి. -
వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్ష..
సాక్షి, పేరేచర్ల: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ప్రకటించినట్లు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు చేయనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఆ వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఏపీ భవన్లో ఆమరణ నిరశన: ‘‘హోదా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇదివరకే చెప్పాం. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా, చెయ్యకున్నా వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్కు వెళతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీ భవన్లోనే నిరాహార దీక్షకు దిగుతారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు. విద్యార్థులకు వైఎస్ జగన్ విజ్ఞప్తి: ‘‘ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టబోయే నిరాహార దీక్షకు విద్యార్థిలోకం, యువతరం సంఘీభావం తెలపాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ‘‘అక్కడ ఢిల్లీలో మన ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తారు. వారికి మద్దతుగా ఏపీలోని అన్ని మండలాల్లో విద్యార్థులు వారి వారి కళాశాలల ప్రాంగణాల్లో సంఘీభావ దీక్షలు చేపట్టాలని కోరుతున్నాను. టీడీపీ ఎంపీలు కూడా మనతో కలిసి వస్తే, మొత్తానికి మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలుచేసి ఆమరణ దీక్షకు దిగితే.. వారికి మద్దతుగా రాష్ట్రమంతటా నిరసనలు జరిగితే కేంద్రం తప్పక దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ మాదిరి అవకాశాల గనిలా మారుతుంది’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
ఎంపీ గారు.. ఉరితాడా, విషం తాగుతారా?
చెన్నై: ‘‘రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మన ఎంపీగారు చెప్పారు. గడువు ముగిసినా కేంద్రం స్పందిచలేదు కాబట్టి ఆయన మాటమీద నిలబడాలి. ఇదిగో ఉరితాడు.. విషం నింపిన సీసా.. రెండిట్లో మీకు నచ్చింది తీసుకోండి..’అంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన ఈ వ్యక్తిపేరు పుహళేంది. అన్నాడీఎంకే నుంచి బయటికొచ్చేసిన టీవీవీ దినకరన్ వర్గంలో కీలక నేత. శనివారం చెన్నైలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది?: కేంద్ర ప్రభుత్వం తక్షణమే కావేరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు(సీఎంబీ)ని ఏర్పాటు చేయాలంటూ ఏఐఏడీఎంకే ఎంపీలు గత కొద్ది రోజులుగా పార్లమెంట్లో ఆందోళనలను చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సూచన మేరకు మార్చి 29 లోగా సీఎంబీ ఏర్పాటు చేయకుంటే పార్లమెంట్లోనే ఆత్మహత్య చేసుకుంటానని ఎంపీ నవనీత కృష్ణన్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఇప్పుడా గడువు ముగిసిన నేపథ్యంలో ఎంపీగారి చాలెంజ్పై దినకరన్ వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు. రాజీనామాలు చెయ్యండి లేదా చావండి..: కావేరీ బోర్డు ఏర్పాటు కావాలంటే ఏఐఏడీఎంకే ఎంపీలందరూ తక్షణమే రాజీనామాలు చేయాలని, లేదంటే తాము సూచించిన విధంగా ఉరితాడు, విషాన్ని స్వీకరించాలని పుహళేంది అన్నారు. కావేరీ నదీ జలాల పంపిణీపై కొద్ది నెలల కిందట తుది తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ నిర్వహణ సజావుగాసాగేలా రివర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. బోర్డు ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడంతో తమిళ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దినకరన్ వర్గీయుల సవాలుపై ఏఐఏడీఎంకే ఎంపీ నవనీత కృష్ణ స్పందించాల్సిఉంది. -
యూటర్న్ అంకుల్ చంద్రబాబుకు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హోదా వద్దు ప్యాకేజీ అని.. మళ్లీ ప్యాకేజీ వద్దు హోదా అని పూటకో మాట, రోజుకో పాట పాడుతోన్న చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల పంచ్లు విసిరారు. చంద్రబాబు యూటర్న్ అంకుల్అని, ఇకనైనా ఏదోఒక స్టాండ్పై నిలబడటం నేర్చుకోవాలని అన్నారు. బుధవారం పార్లమెంట్ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘యూటర్న్ అంకుల్ చంద్రబాబు నిన్న అఖిలపక్షం నిర్వహించారు. అదికాస్తా విఫలపక్ష సమావేశమైంది. నాలుగేళ్లుగా రోజుకో మాట చెబుతున్న ఆయనను ఏ ఒక్కరూ నమ్మడంలేదు. నిన్నటి సమావేశంతో ఆయన ఏమీ సాధించలేకపోయారు. ప్యాకేజీలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు. తీరా అది కూడా దక్కకపోవడంతో మళ్లీ హోదా కావాలంటున్నారు. మీడియా సాక్షిగా యూటర్న్ అంకుల్ చంద్రబాబుకు నా విజ్ఞప్తి ఒక్కటే.. ఇప్పటికైనా హోదా టాపిక్ను డైవర్ట్ చేయాలనే కుట్రలు మానుకోండి. రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం చేయకండి.. ఒక్క స్టాండ్ మీద నిలబడండి..’ అని విజయసాయి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గొంగళి పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్ మాటలను గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. హోదా విషయంలో చంద్రబాబు అలా వ్యవహరించగలరా అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క వైఎస్ జగనే. ఈ విషయంలో యూటర్న్ అంకుల్ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. హోదా కోసం ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. అంతిమంగా న్యాయనిర్ణేతలు ప్రజలే’ అని విజయసాయి వ్యాఖ్యానించారు. -
చివరిదాకా పోరాడతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించగల ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే అని, ఉద్యమాన్ని నాలుగేళ్లుగా సజీవంగా నిలిపిన ఘనత వైఎస్ జగన్దేనని ఆ పార్టీ ఎంపీలు అన్నారు. హోదా సాధనలో భాగంగా పార్లమెంట్లో తుది వరకూ పోరాడుతామని చెప్పారు. బుధవారం సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. సోమవారం కీలకం: ‘‘సభ నిరవధికంగా వాయిదా పడుతుందన్న ప్రచారానికి భిన్నంగా స్పీకర్ సోమవారానికి వాయిదావేశారు. ఆ రోజు అవిశ్వాసంపై చర్చ జరుగుతుందన్న నమ్మకం మాకుంది. ఇప్పటికే చాలా పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిచాయి. ఒకవేళ సభ నిరవధికంగా వాయిదా పడితే, మరుక్షణమే మా పార్టీ ఎంపీలం రాజీనామాలు సమర్పిస్తాం’’ అని మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. ఎందుకు కీలకమంటే..: ‘‘అవిశ్వాస తీర్మానంపై చర్చను కోరుతూ తొమ్మిదో సారి కూడా మేం నోటీసులు ఇస్తాం. సభను అడ్డుకుంటోన్న అన్నాడీఏంకే ఎంపీలను మేం రిక్వెస్ట్ చేశాం. ఏపీకి ప్రాణాధారమైన హోదా కోసం ఒక్క ఐదు నిమిషాలు సహకరించాలని అడిగా. అందుకు వారివైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది. గురువారం(మార్చి 29న) కావేరీ రివర్ బోర్డుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. ఆ నేపథ్యంలో తమిళ ఎంపీలు ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. సోమవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. మేం తుదిదాకా పోరాడుతాం’’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పార్లమెంట్కు ఎజెండా నిర్ణయించింది వైఎస్సార్సీపీ: ‘‘ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తొలిగా అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్సార్సీపీ ఒక్కటే. అదే ఇప్పుడు.. దేశంలోని మెజారిటీ పార్టీలు మమ్మల్ని అనుసరిస్తున్నాయి. దేశం మొత్తానికి ఇవాళ ఏపీకి హోదా, కేంద్రంపై అవిశ్వాసం అంశాలే కీలకంగా మారాయి. ఒకరకంగా పార్లమెంట్లో ఎజెండాను నిర్ణయించింది వైఎస్సార్సీపీనే. సమావేశాల చివరిరోజు దాకా పోరాడాలనుకుంటున్నాం. ఒకవేళ మధ్యలోనే సభ నిరవదికంగా వాయిదాపడితే అప్పటికప్పుడే రాజీనామాలు చేస్తాం’’ అని ఎంపీ వరప్రసాద్ తెలిపారు. -
అవిశ్వాసంపై చర్చిద్దామన్న స్పీకర్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఎనిమిదో రోజు కూడా బుట్టదాఖలయ్యాయి. బుధవారం వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్సభలో ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనలు కొనసాగించాయి. అవిశ్వాస తీర్మానం నోటీసులు తనకు అందాయని, చర్చను కూడా చేపడతానని స్పీకర్ చెప్పారు. కానీ సభ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తానని స్పష్టం చేశారు. ‘‘అవిశ్వాస తీర్మానంపై తప్పకుండా చర్చిద్దాం. విపక్షాలు, అధికారపక్షం ఇద్దరూ ఇందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సభ సజావుగా జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. దయచేసి సభ్యులు సహకరించండి..’ అని స్పీకర్ చెప్పారు. కానీ తమిళ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్.. లోక్సభను సోమవారానికి(ఏప్రిల్ 2కు) వాయిదావేశారు. -
అవిశ్వాసం; ఎనిమిదో రోజూ..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం డిమాండ్చేస్తూ వైఎస్సార్సీపీ సహా పలు పార్టీలు ఇచ్చిన నోటీసులు ముందుకురానుండగా లోక్సభ వాయిదాపడింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ అప్పటికే పోడియం వద్దకు వెళ్లిన అన్నాడీఎంకే ఎంపీలు.. కావేరి బోర్డు ఏర్పాటుచేయాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలుమార్లు చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో స్పీకర్ లోక్సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. నిరవధిక వాయిదా వేస్తా..: అవిశ్వాసతీర్మానంపై చర్చ లేకుండానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడొచ్చన్న వార్తల నేపథ్యంలో నేడు సభలో స్పీకర్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోడియం వద్ద నినాదాలు చేస్తోన్న ఏఐఏడీఎంకే ఎంపీలను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా.. ‘సభను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు.. వెంటనే వెళ్లి మీమీ స్థానాల్లో కూర్చోండి.. సభను జరుగనివ్వండి.. లేకుంటే సమావేశాలను ముగించేస్తాను.. మీరు సహకరించకుంటే సభను నిరవధికంగా వాయిదావేస్తాను..’ అని అన్నారు. -
అవిశ్వాసంపై ఏడో రోజూ మారని తీరు
-
అవిశ్వాసం; దద్దరిల్లిన లోక్సభ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్సీపీతోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఏడోరోజు కూడా సభ ముందుకు రాలేదు. మంగళవారం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభలో అన్నాడీఎంకే ఎంపీలు నిరసన కొనసాగించారు. సభ ఆర్డర్లో లేకుంటే అవిశ్వాసం నోటీసులను ప్రవేశపెట్టబోనని స్పీకర్ యధావిధిగా అన్నారు. దీంతో విపక్షాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇంకా ఎన్నిరోజులు ప్రభుత్వం ఇలా నాటకాలాడుతుంది? అవిశ్వాసానికి మద్దతుగా ఇంత మంది నిలబడ్డా కనిపించడంలేదా? అంటూ విపక్ష ఎంపీలు గట్టిగా అరిచారు. అయితే, సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లితేగానీ అవిశ్వాసం నోటీసులు ముందుకు తెస్తానని స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పష్టం చేశారు. పదే పదే చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో స్పీకర్.. చివరికి లోక్సభను బుధవారానికి వాయిదావేశారు. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ సహా ఇతర పార్టీలు నిర్ణయించాయి. వాయిదా అనంతరం గలాటా?: కాగా, వాయిదా పడిన తర్వాత కూడా లోక్సభలో ఉద్రిక్తత నెలకొంది. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఆందోళనలను చేస్తోన్న ఏఐఏడీఎంకే ఎంపీలను విపక్ష సభ్యులు తప్పుపట్టారు. ‘బీజేపీకి ఎంతకు అమ్ముడుపోయారు?’ అని తమిళ ఎంపీలను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ ఒకరు వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈక్రమంలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గేపై దాడికి ఏఐఏడీఎంకే ఎంపీలు యత్నించారని వార్తలు వచ్చాయి. -
మోదీ, జైట్లీతో టీడీపీ ఎంపీలు.. రివర్స్సీన్!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..’ అంటూ టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు చేసిన నిర్దేశం దిశ మారింది! బాబు సూచనకు సరిగ్గా రివర్స్సీన్ నేడు పార్లమెంట్ ఆవరణలో చోటుచేసుకుంది. సర్వత్రా ఆసక్తిరేపిన ఆ దృశ్యాల వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్సీపీతోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నేడు లోక్సభ ముందుకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇవాళ పార్లమెంట్కు వచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మోదీ సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ అటుగా వెళ్లారు. ఆ ఇద్దరు పెద్దలతో ఎంపీలు చర్చ జరిపే ప్రయత్నం చేశారు. ఒక దశలో సుజనా.. జైట్లీ చేతులు పట్టుకుని మరీ ఏవేవో వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానికి కూడా నమస్కారం పెట్టారు. ఆసక్తికరమైన ఈ దృశ్యాలపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. (చదవండి: నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..) నిలదీయమంటే ఇదేంది?: మంగళవారం ఉదయం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఆదేశించారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, గతంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తనపై నిందలు వేయడాన్ని నిలదీయమన్నారు. బాబు ఘాటు సూచనల వార్తలు అన్ని జాతీయ చానెళ్లలోనూ ప్రసారమయ్యాయి. అయితే ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించడం పార్లమెంట్ ఆవరణలో చర్చనీయాంశమైంది. -
అవిశ్వాసంపై చర్చకు సిద్ధమే.. కానీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం మరోసారి వాయిదా పడింది. హోదాపై తాము ఇచ్చిన నాలుగో నోటీసు కూడా చర్చకు రాకపోవడాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు గర్హించారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటికే టీఆర్ఎస్, ఏఐడీఏంకే ఎంపీలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహంలు ఇచ్చిన నోటీసులను చదివిన స్పీకర్.. సభ ఆర్డర్లో లేనికారణంగా చర్చను చేపట్టలేనని స్పష్టం చేశారు. సభ్యులు ఎవరిస్థానాల్లో వారు కూర్చోవాలని కోరినా ఫలితం రాకపోవడంతో సభను గురువారానికి వాయిదావేశారు. పరీక్షకు సిద్ధమే కానీ: సభ ఆర్డర్లో లేని కారణంగా అవిశ్వాస తీర్మానం చర్చ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ నేడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ సిద్ధంగా ఉందని, ఓటింగ్లోనూ నెగ్గుతామని, అయితే చర్చ జరగాలంటేమాత్రం సభ ఆర్డర్లో ఉండితీరాల్సిందేనని మంత్రి అన్నారు. ‘‘సభ్యులంతా మీమీ స్థానాల్లో కూర్చుంటే ఎలాంటి చర్చనైనా చేపట్టొచ్చు. అవిశ్వాసం తీర్మానంలో మేమే గెలుస్తాం. సభ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని స్పీకర్ ద్వారా కోరుతున్నాను’’ అని అనంతకుమార్ పేర్కొన్నారు. మళ్లీ నోటీసులు: అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ తాము ఇచ్చిన నాలుగో నోటీసులపైనా చర్చ జరగకపోవడంతో మరోమారు నోటీసులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీలు భావిస్తున్నారు. చర్చ జరిగేదాకా నోటీసులు ఇస్తూనే ఉంటామని ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం చర్చకు వచ్చేలా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఆయా పార్టీలు చేస్తోన్న ఆందోళలను గౌరవిస్తూనే, వారి సమస్యలను అర్థం చేసుకుంటూనే.. ఏపీ ప్రజల ఆకాంక్షకు గుర్తించాలని కోరారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న ఆయన మంగళవారం ఉదయం ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా జీవన్మరణ సమస్య. హోదా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం. సభలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అవిశ్వాసంపై చర్చజరగాల్సిన అవసరంఉంది. ఇందుకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. SCS is AP’s lifeline! We humbly appeal to all parties in the House to cooperate in this crucial discussion on No Confidence Motion, moved against the Central Government for not granting SCS to AP (1/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) 20 March 2018 While we acknowledge issues raised by other parties, we request for an un-disrupted discussion on SCS, that was promised on the floor of the house as a precondition to bifurcate our State. YSRCP will continue its fight for the people of AP to ensure SCS is granted(2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) 20 March 2018 విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ: ప్రత్యేక హోదా హామీని అమలు చేయని కారణంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై నేడు సభ ముందుకు రానుంది. అయితే హౌస్ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే చర్చకు అవకాశం ఉంటుంది. ఇంతకుముందు రెండు సార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని దరమిలా సోమవారం మూడోసారి వైఎస్సార్సీపీ ఎంపీలు అవిశ్వాసం నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాసానికి మద్దతు తెలపాలంటూ పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ విప్ జారీచేసింది. -
జనం క్షమించరు
కొత్త సంవత్సరం ప్రారంభమయ్యాక జరిగే పార్లమెంటు తొలి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అంతకన్నా ముందు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం కూడా ఆచారంగా వస్తున్నదే. కేంద్ర కేబినెట్ చర్చించి ఖరారు చేసే ఆ ప్రసంగంలో గడిచిన ఏడాది ప్రభుత్వం సాధించిన విజయాలు, రాగల సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉంటాయి. సారాంశంలో అది ప్రభుత్వ విధాన పత్రం. కనుకనే అందులోగానీ, ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లోగానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల ఊసు లేదేమని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిలదీశారు. అటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంటున్న తెలుగుదేశం సభ్యులు కూడా విపక్ష సభ్యుల్లా హడావుడి చేయడం జాతీయ మీడియాను సైతం విస్మయపరిచింది. ఆ సంగతలా ఉంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ జవాబిచ్చిన తీరు, ఆయన ప్రసంగిస్తుండగా లోక్సభ నినాదాలతో హోరెత్తడం, వాటిని ఖాతరు చేయకుండా మోదీ గంటన్నరపాటు సుదీర్ఘ ప్రసంగం చేయడం వంటివి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి. ప్రసంగం పొడవునా ప్రత్యర్థులపై పిడుగులు కురిపించి వారిని గుక్కతిప్పుకోకుండా చేయడంలో మోదీకెవరూ సాటిరారని తెలిసిందే. ఈసారి ప్రసంగంలో సైతం అలాంటివి దండిగానే ఉన్నాయి. అంతకుమించి అదొక భారీ బహిరంగసభను ద్దేశించి చేసిన ప్రసంగాన్ని తలపించింది. కేవలం ఆయన స్వరం పెంచి మాట్లా డటం వల్ల మాత్రమే కాదు... అందులో స్వాతంత్య్రోద్యమం నాటినుంచీ ఇంత వరకూ కాంగ్రెస్ వల్ల జరిగిన తప్పుల్ని ఏకరువు పెట్టడం వల్ల కూడా అది బహిరంగ సభ ప్రసంగాన్నే గుర్తుకు తెచ్చింది. గుజరాత్ ఎన్నికలు, రాజస్థాన్ ఉప ఎన్నికలలో వెలువడిన ఫలితాలు, మరికొన్ని నెలల్లో జరగబోయే కర్ణాటక ఎన్నికలు అలాంటి ప్రసంగం చేయడానికి కారణం కావొచ్చు. కానీ ప్రధాని నుంచి దేశ ప్రజలు... మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురుచూసింది ఈ మాదిరి ప్రసంగం కోసం కాదు. ప్రధాని ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన బాగానే వచ్చింది. రాజీవ్గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సొంత పార్టీ ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించడం, అది తెలుగుదేశం ఆవిర్భావానికి కారణం కావడంతో మొదలుపెట్టి రాష్ట్ర విభజన వరకూ జరిగినవి ఆయన గుర్తు చేశారు. అది ఏక పక్షంగా జరి గిందని, లోక్సభ తలుపులు మూసి ఆ తీర్మానం ఆమోదించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకూ విభజన ఇప్పుడు గతించిన అంశం. ఆ సమయంలో ఏం జరిగిందో, ఎవరి పాత్రేమిటో రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఎవరూ చెప్పనవసరం లేదు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఏకం కావడం వల్లే ఆ విభజన సాధ్యమైంది. రాజ్యసభలో విభజన బిల్లు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విపక్షంలో ఉండి అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి రాబట్టిన ప్రత్యేక హోదా హామీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. వాటినే నెరవేర్చమని ప్రజలు అడుగుతున్నారు. నాలుగేళ్లు కావస్తున్నా వాటి అతీగతీ లేకపోవడాన్ని నిరసిస్తున్నారు. తమకు అధికారం అప్పగిస్తే రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ, టీడీపీలు చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఆ పార్టీల మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా అంశం ప్రముఖంగా ఉన్న సంగతిని జ్ఞాపకం తెచ్చు కోమంటున్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందని నరేంద్రమోదీ చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు ఒరిగేదేమీ లేదు. అందుకు బదులు పునర్విభజన చట్టం అమలుకు దాదాపు ఈ నాలుగేళ్ల కాలంలోనూ వచ్చిపడిన అడ్డంకులేమిటో, ఆ విషయంలో ఎందుకు విఫ లమయ్యారో మోదీ చెప్పాలి. ప్రత్యేక హోదా సంగ తేమి చేశారో వివరించాలి. దానికి సమానమైన స్థాయిలో ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇచ్చామని, హోదా గతించిన అంశమని ఇన్నాళ్లుగా బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయి. కానీ అది చెల్లదు. ఆ అరకొర ‘ప్యాకేజీ’ సైతం ఏమీ అమలు కాలేదని కేంద్ర బడ్జెట్ సాక్షిగా ఇప్పుడు రుజువైంది. విభజన సమయంలో ఆడిన కపటనాటకాలను తెలుగుదేశం ఇప్పుడు కూడా పునరావృతం చేసి జనాగ్రహం నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తోంది. పాలక ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూ అదే ప్రభుత్వంపై ఆందోళన సాగిం చడం అనైతికమని ఆ పార్టీకి తోచలేదు. దాన్నయినా చిత్తశుద్ధితో చేస్తే వేరే విషయం. బడ్జెట్పై తొలుత కేంద్ర కేబినెట్లో చర్చ జరుగుతుంది. అక్కడ ఆమోదం పొందాకే దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు. గత మూడు బడ్జెట్ల మాదిరే ఈసారి కూడా కొత్త బడ్జెట్లో రాష్ట్రానికిచ్చింది ఏమీ లేదని కేబినెట్ భేటీ సమయంలోనే టీడీపీకి అర్ధమై ఉండాలి. ఆ క్షణంలోనే నిరసన తెలిపి, ప్రభుత్వం నుంచి బయటకు రావాలి. అది చేయలేదు సరిగదా... వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనకు పూనుకొనేసరికి ఎక్కడ వెనకబడిపోతామోనన్న ఆత్రుతతో సభలోనూ, సభ వెలుపలా డ్రామాలాడటం ఎవరి కళ్లు కప్పడానికి? పోనీ ఆ ఆందోళన నిజమైందే అనుకుంటే జైట్లీ హామీకి సంతృప్తిపడి దాన్ని కాస్తా విరమించిన వారు 24 గంటలు గడవకుండానే ప్రధాని ప్రసంగం సమయంలో దాన్ని మళ్లీ ప్రారంభించడం, మధ్యలో విరమించడంలోని ఔచిత్యమేమిటి? ఒకపక్క ఢిల్లీలో ఇలా బహు పాత్రాభినయం చేస్తూ, రాష్ట్రంలో గురువారం బంద్ తలపెట్టిన ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడం నీతిమాలినతనం కాదా? ఇప్పుడు టీడీపీ, బీజేపీలు రెండూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన స్థితిలో పడ్డాయి. వాటిలో ఒక పార్టీ నిరసన నాటకాన్ని నడిపించి, మరో పార్టీ మౌనం పాటించి తప్పించుకోలేవు. తక్షణం విభజన చట్టంలోని హామీల అమలు ప్రారంభించడం, ప్రత్యేక హోదా ప్రకటించడం మినహా మరేవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరచలేవు. రెండు పార్టీలూ ఆ సంగతి గుర్తించాలి. -
బడ్జెట్-2018 ; నేడు ఆల్పార్టీ మీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్.. ఎన్నికలకు ముందు రానున్న ప్రజాకర్షక బడ్జెట్.. ఇలా ఎన్నోవిశేషణాలను సొంతం చేసుకున్న బడ్జెట్-2018 మరో మూడు రోజుల్లో ప్రజల ముందుకు రానుంది. రేపటి(జనవరి 29) నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభంకానున్నాయి. ఫిబ్రవకి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర ప్రభుత్వాలు ఆదివారం సాయంత్ర విడివిడిగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి : ఆదివారం ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఎఫ్ఆర్డీఏ బిల్లు తదితర అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీలు గళంవిప్పనున్నారు. రెండు విడదల్లో బడ్జెట్ సమావేశాలు : ఆనవాయితీ ప్రకారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో రేపు(సోమవారం) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడతగా పార్లమెంట్ భేటీ కానుంది. -
31 నుంచే బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీసీపీఏ సిఫారసు సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచే ప్రారంభించాలని, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సీసీపీఏ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీన్ని త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే రైల్వేకు కేటాయింపులతో సహా సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెడతారు. దాదాపు 92 ఏళ్లుగా రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి ఈ బడ్జెట్తో మంగళం పలకనున్నారు. జనవరి 31న పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ పథకాలకు త్వరితగతిన కేటాయింపులు చేసేందుకు వీలుగా దాదాపు నాలుగు వారాలు ముందుగానే బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. -
'నన్ను చూసి ప్రభుత్వం భయపడుతోంది'
న్యూఢిల్లీ: తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం తనను పార్లమెంట్ లో మాట్లాడనీయడం లేదని విమర్శించారు. బుధవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో ఆయన మాట్లాడారు. 'అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. కానీ పార్లమెంట్ లో నన్ను మాట్లాడనీయడం లేదు. నేను మాట్లాడేటప్పుడు మీరే చూడండి. పార్లమెంట్ లో గళం విప్పకుండా నన్ను ప్రభుత్వం అడ్డుకుంటోంది. నేనేం మాట్లాడతానోనని ప్రభుత్వం భయపడుతోంద'ని రాహుల్ గాంధీ అన్నారు. జేఎన్ యూ వివాదం, హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్లమెంట్ లో కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జేఎన్ యూ వివాదంపై మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. -
23 నుంచి బడ్జెట్ పార్లమెంట్
25న రైల్వే బడ్జెట్.. 29న కేంద్ర బడ్జెట్ * రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు * ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకూ తొలి విడత * ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకూ రెండో విడత భేటీ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఈ సమావేశాల్లో ఈ నెల 25న రైల్వే బడ్జెట్ను, నెలాఖరు రోజైన 29వ తేదీన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టటానికి ముందు ఈ నెల 26న ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేవాలు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడత ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకూ.. రెండో విడత ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 24 వరకూ పార్లమెంటు సమావేశాలకు విరామం ఉంటుంది. ఈ సమయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాలు వివిధ బడ్జెట్ బిల్లులను పరిశీలిస్తాయి. మొత్తం 81 రోజుల పాటు బడ్జెట్ సెషన్ కాలం ఉండగా.. అందులో 31 రోజులు పార్లమెంటు సమావేశమవుతుంది. ఈ నెల 23వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సూచనలు, సెలవులు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం... బడ్జెట్ సమావేశాల షెడ్యూలును గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాలపై మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య మీడియాకు తెలిపారు. లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లు కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యేందుకు వీలుగా, వివిధ పార్టీల నేతల సూచనలు, ఏప్రిల్లో సెలవులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ భేటీ తేదీలను నిర్ణయించినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల ప్రక్రియ మొదలుకానుందని.. పార్లమెంటు సమావేశాల్లో విరామం వద్దని తమకు సలహాలు అందాయని చెప్పారు. 2011లో బడ్జెట్ సమావేశాల సమయంలో పలు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించరాదని నిర్ణయించిందని వెంకయ్య ప్రస్తావించారు. పనిదినాలు తగ్గించొద్దు: ప్రతిపక్షాలు బడ్జెట్ సమావేశాల ఖరారుపై సీసీపీఏ భేటీకి ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలకు కోత పెట్టరాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘‘సమావేశాల పనిదినాలను తగ్గించరాదు. మంత్రిత్వశాఖలకు చేసిన బడ్జెట్ కేటాయింపులను స్థాయీ సంఘాలు పరిశీలించేందుకు వీలుగా సమావేశాల మధ్యలో పూర్తి విరామం ఇవ్వాలి’’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మీడియాతో పేర్కొన్నారు. పార్లమెంటు పనిదినాలను తగ్గించరాదన్న అంశంపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందని జేడీయూ నేత శరద్యాదవ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి ఏటా కేలండర్ను రూపొందించి ప్రకటించాలని.. దానివల్ల పార్లమెంటు సమావేశాలు జరిగే తేదీలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను నిర్ణయించటానికి వీలుంటుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి సూచించారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి సహకరించాలి ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుతో పాటు రియల్ ఎస్టేట్ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందుతాయని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ బిల్లులు దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించినవి కాబట్టి వాటిని ఆమోదించటానికి సహకరించాలని ప్రతిపక్షాలకు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, కీలక సంస్కరణల బిల్లులను అడ్డుకున్న గత రెండు సమావేశాల తరహాలో కాకుండా.. రాబోయే బడ్జెట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా, సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్నక్వీ పేర్కొన్నారు. ‘‘ఈ సమావేశాలు సరైన రీతిలో సాగేందుకు వీలుగా మేం అందరితో చర్చిస్తున్నాం. అన్ని పార్టీలతోనూ అధికారికంగా, అనధికారికంగా మాట్లాడుతున్నాం’’ అని చెప్పారు. -
23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి దఫా బడ్జెట్ సమావేశాలు మార్చి 16వరకూ జరుగుతాయి. తొలిరోజు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఫిబ్రవరి 29న సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. అలాగే ఫిబ్రవరి 26న రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. 26న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకు వస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ అనంతరం, వివిధశాఖల పద్దులపై ఆయాశాఖల అధికారులు నివేదికలు రూపొందించేందుకు తొలి విడత సమావేశాలు మార్చి 16న వాయిదా పడతాయి. తిరిగి ఏప్రిల్ 25 నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. -
నెలాఖరుకల్లా సరళీకృత ఐటీఆర్ ఫారాలు
న్యూఢిల్లీ: సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాల(ఐటీఆర్)ను ఈ నెలాఖరుకల్లా తీసుకొచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐటీఆర్లలో పన్ను చెల్లింపుదార్లు(అసెస్సీ) తమ విదేశీ ప్రయాణాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించాలని పేర్కొనడంపై అటు పార్లమెంటు సభ్యులతో పాటు పరిశ్రమవర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. దీంతో వీటిలో మార్పుచేర్పులు చేసి కొత్త ఫారాలను తీసుకొస్తామని ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో ప్రకటించారు. ఈ నెలఖరులోగా సరళీకృత ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారాలపై జైట్లీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అంతర్గత సమావేశం జరగనుందని కూడా వెల్లడించారు. కాగా, కొత ఫారాల్లో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు, కనీస బ్యాలెన్స్లేని ఖాతాల వివరాల వెల్లడిని మినహాయించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన సమాచారానికి కూడా వెసులుబాటు ఇవొచ్చని భావిస్తున్నారు. వేతనజీవులు... వ్యాపారం/వృత్తిగత ఆదాయాలు లేని వ్యక్తులు ఐటీఆర్-1/ఐటీఆర్-2లతో తమ రిటర్న్లను జూలై 31కల్లా సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఫారాలు 14 పేజీలు ఉన్నప్పటికీ.. సాధారణ పన్ను చెల్లింపుదారులు తొలి 2-3 పేజీల్లో వివరాలిస్తే సరిపోతుందని.. మిగతావి అధిక ఆదాయవర్గాల కోసం మరిన్ని వివరాలకు సంబంధించినవిగా అధికారులు చెబుతున్నారు. -
పార్లమెంట్ వెలుపల గందరగోళం
న్యూఢిల్లీ : పార్లమెంట్ వెలుపల సోమవారం గందరగోళం ఏర్పడింది. తృణమూల్ ఎంపీ తపస్ పాల్ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎంపీకి చట్టసభలో కొనసాగే అర్హత లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం తపస్పాల్ సీపీఐ మహిళ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
లోక్సభలో ధరల పెరుగుదలపై రభస
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ధరల పెరుగుదలపై లోక్ సభ దద్దరిల్లింది. నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు మొదటి రోజే వాడీవాడీగా సాగుతున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగానే విపక్షాలు ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ధరల పెరగుదలపై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు పట్టుబట్టేసరికి సభలో గందరగోళం నెలకొంది. దాంతో సమావేశాలకు అంతరాయం ఏర్పడటంతో లోక్సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. కాగా మొదటిరోజు లోక్సభ మొదలైన వెంటనే రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద మృతులతో పాటు, చెన్నై భవన ప్రమాద ఘటన మృతులకు సంతాపం ప్రకటించింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు రాజ్యసభలో సభ మొదలైన వెంటనే ఛైర్మన్ హమీద్ అన్సారీ.... సభ్యుల ప్రమాణ స్వీకార తీర్మానాన్ని వినిపించారు. అనంతరం పలువురు సభ్యులు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.