Parrot
-
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
ఒక హంతకుడి బాధితులు!
పదిహేనేళ్ల క్రితం మేము మా ఫార్మ్ హౌస్ లోకి మారే సమయానికి అక్కడే ఉన్న ఒక తాటి చెట్టుని గమనించాము. అది తన పక్కనే ఉన్నపెద్ద మర్రి చెట్టుతో సూర్యరశ్మి కోసం పోటీ పడుతూండటం చూసాము. పగటి పూట ఒక నల్లంచి పక్షి ఆ తాటి ఆకుల మధ్య కట్టుకున్న తన గూటిలోకి వెళ్ళివస్తూ కనిపించేది. సాయంత్రం ఎండిన తాటి ఆకుల మధ్య విశ్రమించిన గబ్బిలాలు ఆహారం కోసం బయటకు వస్తూ కనిపించేవి.తాటి కాయలు బాగా పండి, నలుపు రంగులోకి మారి మంచి వాసన వచ్చే సమయానికి పునుగు పిల్లులు వస్తుండేవి. అవి రాత్రి సమయాల్లో పండిన తాటి కాయలను తినడం కోసం చెట్లు ఎక్కి, ఎండిన తాటి ఆకులపైకి దూకుతూ శబ్దం చేసేవి. ఒకసారి తాటి కాయలను తిన్న తరువాత క్రింద పడేస్తుంటే, ఆ కాయలు నేలపై ఉండే ఎండుటాకులకు తగిలి రాత్రి నిశబ్దానికి భంగం కలిగించేవి. ఒక్కోసారి రెండు మూడు పునుగు పిల్లులు బిగ్గరగా అరుస్తూ పోట్లాడుకుంటుంటే ఆ శబ్దానికి నిద్రాభంగం అయిన నా భర్త రోమ్ నిద్రలేచి “నోర్మూసుకో” అని నా మీద అరిసి అటు తిరిగి చక్కగా గురకపెట్టేవాడు!మంచి ఎండాకాలంలో రాత్రి వేళలో వీచే గాలి, ఆ తాటి చెట్ల ఆకులను కదిలిస్తూ భయపెట్టే శబ్దాన్ని చేసేది. కొంతమంది ఈ శబ్దాలు దెయ్యాలు చేసేవని భ్రమపడుతుండేవారు. ఉదాహరణకు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళల్లో మమ్మల్ని ఇంటి వద్ద దించటానికి వచ్చే టాక్సీ డ్రైవర్లు ఆ పరిసరాలను గమనించి "ఇలాంటి చోట్ల ఉండటానికి మీకు భయంగా లేదా!" అని ఎవరికి వినపడనంత మెల్లగా మమ్మల్నిఅడిగేవారు!కొన్నిదశాబ్దాల క్రితం కొన్ని తాటి చెట్లు వరుసగా మొలకెత్తి పెద్ద చెట్లు అయ్యాయి. కొన్నాళ్లకు ఒక మర్రి చెట్టు వాటిల్లోని ఒక తాటి చెట్టుపై మొలకెత్తి పరాన్నజీవిలా బ్రతకటం మొదలుపెట్టింది. తాటి చెట్లు ఎత్తుగా ఏపుగా పెరుగుతుంటే, వాటితో పాటు మర్రి చెట్టుకూడా తన కొమ్మలను వేర్లను విస్తరిస్తూ దారిలో అడ్డు ఉన్నవాటిని తినేసేడట్లు బలంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్నేళ్ళకు ఆ మర్రి చెట్టు ధాటికి దాదాపుగా అన్ని తాటి చెట్లు చనిపోగా ఒకే ఒక్క తాటి చెట్టు మిగిలింది!కొన్నేళ్లకు ఆ మిగిలిన ఒక్క తాటి చెట్టు కూడా తన తల భాగం వంగిపోయేసరికి, పాపం ఈ చెట్టు కూడా మర్రి చెట్టుతో చేసిన పోరాటంలో ఓడిపోయింది అని మాకు అర్ధమయింది! ఆఖరికి దాని తల భాగం రాలిపోయి కేవలం కాండం మాత్రం ఒకప్పటి చెట్టుకి గుర్తుగా మిగిలిపోయింది.ఇది జరిగిన కొద్ది నెలల్లోనే రెండు బంగారు వర్ణపు వడ్రంగి పిట్టలు చనిపోయిన తాటి చెట్టు మిగిలి ఉన్న కాండాన్ని గుర్తించి వాటిపై రంధ్రాలు చెయ్యడం మొదలుపెట్టాయి. చివరికి ఆ కాండం పైభాగాన ఒక రంధ్రం చేసి గూడు కట్టాయి. కొన్ని వారాలకు ఒక రోజు మాకు తొర్ర వద్ద తల్లితండ్రి తెచ్చే ఆహారం కోసం అసహనంతో ఎదురుచూస్తున్న రెండు వడ్రంగి పిట్టల పిల్లలు కనిపించాయి!పిల్లలు పెద్దవై ఎగిరిపోయాక ఆ వడ్రంగి పిట్టల కుటుంబం ఆ తొర్రను ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కనిపిస్తుండేవి. ఒక రెండేళ్లకు మరికొన్ని పక్షులు ఆ తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కొన్ని రామచిలుకలు ఆ గూటి యజమానులైన వండ్రంగి పిట్టలను తరిమేసి ఆ తొర్రను పెద్దది చేసి, దానిని నివాసానికి అనుగుణంగా చేసుకునే సమయానికి రెండు గుడ్లగూబలు వచ్చి చేరాయి. ఆ రామ చిలుకలు కొన్నిరోజులపాటు ఆ తొర్ర వద్ద ఎంత గోల చేసినప్పటికీ ఆ గుడ్లగూబలు తొణకకుండా, బెణకకుండా ఆ తొర్రను ఆక్రమించేశాయి. చిలుకలు ఎంత కష్టపడ్డప్పటికీ ఆ గుడ్లగూబలను ఏమీ చేయలేకపోయాయి. ఆ గుడ్లగూబలు కాస్త సర్దుకునే సమయానికి ఒక నల్లంచి వచ్చి ఆ గుడ్లగూబలను ఎదో చేసి మొత్తానికి ఆ తొర్ర నుంచి తరిమేసింది. “హమ్మయ్య చివరికి ఒక పక్షి ఈ తొర్రను తన ఇల్లుగా చేసుకుంటుంది” అని మేము సంబరపడేలోపలే ఒక జత గోరింకలు వచ్చి ఆ నల్లంచిని తరిమేసి ఆ గూటిలో స్థిరపడిపోయాయి!ఆ గోరింకలు కొన్నేళ్లపాటు ఆ తాటి చెట్టు తొర్రలో నివసించాయి. పక్షులే కాకుండా ఆ చనిపోయిన చెట్టు కాండం మీద కొన్నిరకాల బల్లులు, కాళ్ళ జెర్రెలు నివసించేవి. కానీ ఒక రోజు ఆ చెట్టు కాండం పడిపోవడంతో ఆ జీవులన్నీ గూడు లేనివి అయిపోయాయి! అయినప్పటికీ ఆ క్రింద పడిపోయిన కాండం మట్టిలో కలిసిపోయే లోపల కొన్ని కప్పలకు, నీటి పాములకు, పెంకు పురుగులకు, చెద పురుగులకు, బల్లి గుడ్లకు ఆశ్రయమిచ్చింది. ఇదంతా జరిగేలోపల మన మర్రి చెట్టు మా వంటింటి వ్యర్ధాల నీటి వలన బలపడి ఐదారు రెట్లు పెరిగి మహా వృక్షమైపోయింది!--జానకి లెనిన్కృష్ణమూర్తి(ఫోటోలు)(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం.. ఇద్దరి అరెస్ట్
చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
పంజరంలో చిలుకలా ఈసీ: రౌత్
ముంబై: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘం కూడా పంజరంలో చిలుకలా మారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కలి్పస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. అదే హామీ విపక్షాలు ఇస్తే వెంటనే షోకాజ్ నోటీసులిచ్చేది’’ అంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో రౌత్ విమర్శించారు. మోదీ హయాంలో భారత క్రికెట్ పూర్తిగా ఆయన స్వరాష్ట్రం గుజరాత్కు తరలిపోయిందని ఆరోపించారు. ‘‘గతంలో దేశ క్రికెట్కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇప్పుడంతా అహ్మదాబాద్మయం! ప్రపంచ కప్ ఫైనల్ కూడా అక్కడే జరుగుతోంది! స్వీయ రాజకీయ లబ్ధి కోసం చివరికి క్రికెట్ను కూడా కూడా మోదీ సర్కారు పొలిటికల్ ఈవెంట్గా మార్చేసింది’’ అని ఎద్దేవా చేశారు. -
చైనా చిలుక.. స్కేటింగ్ చేస్తుందోయ్.!
-
ఈ చిలుక తెలివి చూస్తే షాక్ అవుతారు...
-
నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు
భోపాల్: సాటి మనిషి మీద దయ చూపని ఈ సమాజంలో కొందరు మాత్రం జంతువులు మీద కూడా అంతులేని ప్రేమను చూపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఉత్తరప్రదేశ్లో సరస్ క్రేన్, ఒక వ్యక్తి మధ్య స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్లోని దామోహ్ నుండి ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీపక్ సోనీ తన తప్పిపోయిన చిలుక కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. అంతేకాకుండా తన చిలుక ఆచూకీతో తెలిపితే ₹ 10,000 నగదు బహుమతిని అందజేస్తూ, పట్టణం అంతటా పోస్టర్లు వేశాడు. తప్పిపోయిన పక్షిని కనుగొనే ప్రయత్నంలో నగరం అంతటా పోస్టర్లు అంటించేందుకు అతను ఒక ఆటోరిక్షా డ్రైవర్లకు సహాయం తీసుకున్నాడు. అందుకు వారికి డబ్బులు కూడా చెల్లించాడు. ‘గత నెలలో ఎగిరిపోయి దానికదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. ఇంకా తిరిగి రాలేదు. వీధి కుక్కలు దానికేమైనా హాని చేశాయోనని భయపడుతున్నాము. చిలక అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. దాని ఆచూకీ తెలిపిన వారికి పదివేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధం. దానిని కనుగొన్న వారు నా నంబర్కు కాల్ చేయగలరు ’ అని వారి ప్రాంతంలో పోస్టర్లు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్గా మారింది. -
సైంటిస్ట్ల అద్భుతం.. ఎడాపెడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న చిలుకలు!
రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు. ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు. చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి? ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముద్దుముద్దుగా పసిపిల్లలు అమ్మా.. అని పిలిస్తే చిలక పలుకులంటూ.. మురిసిపోతాం. అలాంటిది, నిజంగానే రామచిలుకే అమ్మా.. అంటుంటే.. కుటుంబ సభ్యుల్ని వారి పేర్లతో పిలుస్తుంటే.. ఆ ఆనందమే వేరు. వివరాలివి. సిద్దిపేట హౌసింగ్ బోర్డుకాలనీలోని జర్నలిస్ట్ వీధిలో కూతురు రాజిరెడ్డి, వనజ రెడ్డిల ఇంటి పైకి రోజూ ఓ రామచిలుక వచ్చి సందడి చేస్తోంది. నెల రోజులుగా రోజూ ఉదయం 6గంటలకే వచ్చి కుటుంబ సభ్యులను నిద్ర లేపుతుంది. చిన్నారులతో ఆడుకుంటుంది. వనజరెడ్డిని అమ్మా.. అని, పిల్లలను టింకు.. అని పిలుస్తుంది. ఎత్తుకో, టాటా, బాయ్ అంటుంది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీవాసులు సంబరపడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల వరకు ఉండి పాలు, నీరు తాగుతుంది. జామ, మామిడి, ఆపిల్, తదితర పండ్లు, బిస్కెట్లు తిని వెళ్లిపోతుంది. సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి మళ్లీ 6 గంటల వరకు తిరిగి వెళ్లిపోతుంది. ఈ చిలుక ఎక్కడి నుంచి వస్తుంది...ఎక్కడికి పోతుందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నెల రోజులుగా ఈ రామచిలుక రాజిరెడ్డి, వనజరెడ్డిల కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది. శ్రీరాముడే వచ్చినట్టుంది రామచిలుక రోజూ మా ఇంటికి వచ్చి అమ్మా. అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. శ్రీ రామనవమి ముందు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి.. శ్రీ రాముడే వచ్చినట్టు అనిపిస్తోంది. – వనజరెడ్డి, సిద్దిపేట -
లైసెన్స్ ఇచ్చి నల్లమందు సాగు చేయిస్తుంటే..చిలుకలు దొంగలిస్తున్నాయ్!
ప్రతి ఏడాది అక్కడ పెద్ద మొత్తంలో నల్లమందును సాగు చేస్తారు. అయితే రైతుల ఉత్పత్తిని అంతా చిలుకలు దొంగలించేస్తున్నాయ్. దీంతో రైతులు దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది చిలుకలు పెద్ద మొత్తంలో ఈ నల్లమందును ఎత్తుకుపోతున్నట్లు తెలిపారు రైతులు. వాస్తవానికి మధ్యప్రదేశ్లోని మందసౌర్, నీముచ్, రత్లాం జిల్లాలో నల్లమందు సాగు చేస్తారు. అందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సాగుకు లైసెన్సులు ఇస్తుంది. ఈ పంటను పర్యవేక్షించే బాధ్యతలన్నింటిని బ్యూరో తీసుకుంటుంది. నల్లమందు పంటను జనవరి, మార్చి మధ్యలో సాగు చేస్తారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కూరగాయాల మార్కెట్లలో కూడా విక్రయిస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ప్రజలు వాటి విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అంతేగాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రైతుల నుంచి నల్లమందును కొనుగోలు చేస్తుంది. ఈ నల్లమందును ఉపయోగించి కొన్ని గుండె, రక్తం, నిద్రకు సంబంధించిన మందుల తయారీలో వినయోగిస్తారు. ఇటీవల ఈ చిలుకల దాడి కారణంగా నల్లమందు సాగులో రైతులు ఎక్కువుగా నష్టపోతున్నారు. ఈ విషయంలో పోలీసుల సైతం ఏం చేయలేమని చెప్పడంతో ప్లాస్టిక్ వలలను అమర్చడం ప్రారంభించారు. దీంతో ఆ చిలకలు కూడా నల్లమందు కాయలను అందించుకోవడం సాధ్యం కాక నిలబడి ఉన్న పంటకు నష్టం చేయడం ప్రారంభించాయి. (చదవండి: ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..) -
ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన
సాక్షి, బెంగళూరు(తుమకూరు): కొన్నిరోజుల క్రితం తమకు ఇష్టమైన రామచిలుకను పోగొట్టుకొని దానిని పట్టుకోవడం కోసం రూ.80 వేల నజరానా ప్రకటించిన తుమకూరు వాసి కథ తెలిసే ఉంటుంది. అర్జున్, రంజన దంపతులు కొన్నేళ్లుగా బూడిద రంగు రామచిలుకలను ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నారు. వాటికి రుస్తుమా, రియో అనే పేర్లు పెట్టి నిత్యం రకరకాల పండ్లతో పోషిస్తున్నారు. ఇటీవల రుస్తుమా ఎక్కడికో ఎగిరిపోయింది, దానిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పట్టించినవారికి రూ. 80 వేల బహుమానాన్ని ప్రకటించగా, ఓ వ్యక్తి దానిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఉదంతం దేశమంతటా వార్తల్లో నిలిచింది. ఇక వాటిని గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మృగాలయానికి ఇచ్చేస్తామని తెలిపారు. తరచూ ఎగిరిపోతుంటే ఇబ్బందిగా ఉందని చెప్పారు. చదవండి: (లవర్తో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య) -
పక్కింటి చిలుక గోల తట్టుకోలేకపోతున్న కాపాడండి సార్!
ముంబై: రామ చిలుక అంటే ఎవరైనా ఇష్టపడతారు. వీలుంటే దానిని ఒకసారి చేతిలోకి తీసుకుని ముద్దాడాలని అనుకుంటారు. కొందరు వాటిని ఇళ్లల్లో పెంచుకుంటారు. ఎంతో గారాబంగా చూసుకుంటారు. దాని అరుపులు, చేష్టలకు మురిసిపోతుంటారు. కానీ, ఓ వృద్ధుడికి అదే నచ్చలేదు. రామ చిలుక అరుపులు తనకు చికాకు తెప్పించాయి. పక్కింటి రామ చిలుక గోల తట్టుకోలేకపోతున్న కాపాడండి సార్.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పుణెలోని శివాజీనగర్ ప్రాంతంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్లో నివాసం ఉంటున్నారు సురేశ్ షిండే అనే 72 ఏళ్ల వ్యక్తి. ఆయన పక్కింట్లో అంటున్న అక్బర్ అమ్జద్ ఖాన్ అనే వ్యక్తి రామ చిలుకను పెంచుకుంటున్నాడు. అది ఎప్పుడూ అరుస్తూనే ఉందని, అది వృద్ధుడికి చికాకు తెప్పించినట్లు పోలీసులు తెలిపారు. ‘షిండే ఫిర్యాదుతో చిలుక యజమానిపై మనశ్సాంతి లేకుండా చేయటం, బెదిరింపుల వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిబంధనల ప్రకారం ఈ కేసు దర్యాప్తు చేపడతాం.’ అని ఖడ్కి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ! -
చిలుకను తెచ్చిచ్చినందుకు రూ.85 వేల నజరానా
తుమకూరు: ఇంట్లో ఎంతో అపురూపంగా పెంచుకునే కుక్కలు, పక్షులు వంటి జంతువులు తప్పిపోతే వాటి యజమానుల బాధ వర్ణనాతీతం. పగలూ రేయి నిద్రాహారాలు మానేసేవారు ఉన్నారు. అదే కోవకు చెందిన ఓ యజమాని తప్పిపోయిన చిలుకను తెచ్చిచ్చిన వ్యక్తికి రూ.85 వేల బహుమానాన్ని అందించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు నగరం జయనగరలో జరిగింది. అర్జున్ అనే వ్యక్తి అరుదైన 2 ఆఫ్రికన్ బూడిద రంగు రామచిలుకలను ఇంట్లో పెంచుకుంటున్నాడు. వాటికి ఏటా ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపేవాడు. వారం కిందట అందులోని ఒక చిలుక ఎగిరిపోయింది. దీంతో అర్జున్ చిలుకను పట్టిస్తే రూ.50 వేల నజరానా ఇస్తానని పోస్టర్లు వేయించాడు. ఫలితం లేకపోవడంతో ఆ బహుమానాన్ని రూ. 85 వేలకు పెంచాడు. శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ అనే వ్యక్తి బుట్టలో చిలుకను తీసుకువచ్చి అర్జున్కు ఇచ్చాడు. రోడ్డుపై పడి ఉంటే ఇంటికి తీసుకెళ్లి పరిచర్యలు చేశానని పోస్టర్లను చూసి మీ దగ్గరకు పట్టుకువచ్చానని అర్జున్కు చెప్పాడు. దీంతో మాట ప్రకారం శ్రీనివాస్కు రూ.85 వేల నగదును అర్జున్ అందజేశాడు. -
రుస్తంను కనిపెట్టాడు.. జాక్పాట్ కొట్టాడు
వైరల్: రుస్తం.. పర్షియన్ పురాణాల్లో ఓ వీరుడి పేరు. అలాంటి పేరును ఇక్కడో వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలుకకు ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ.. అది కనిపించకుండా పోయేసరికి అల్లలాడిపోయాడు. ఆచూకీ చెప్పినా.. తెచ్చి ఇచ్చినా మంచి పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు పోస్టర్లతో పాటు నగరం అంతటా ప్రకటన ఇచ్చాడు. కనిపించకుండా పోయిన తను రుస్తంను పట్టి తెచ్చిస్తే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించాడు కూడా. ఆ ప్రకటన చూసి శ్రీనివాస్ అనే ఓ స్థానికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫలితంగా.. రుస్తం దొరక్కగా.. ఓ ఓనర్ మరో 35 వేల రూపాయలను అదనంగానే ఇచ్చాడు. కర్ణాటక తుమ్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జున్ అనే వ్యక్తి ఓ ఆఫ్రికన్ చిలుకను రెండున్నరేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి రుస్తం అని పేరు పెట్టారు. అది ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది. అయితే జులై 16వ తేదీ ఇంట్లోంచి ఎగిరిపోయి.. అది మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్జున్ ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్లలో గాయపడి.. ఆకలితో, భయంతో ఉన్న తన రుస్తంను శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారని, అందుకే అదనంగా పారితోషకం ఇచ్చానని అర్జున్ చెప్తున్నాడు. ఇన్స్టంట్ అదృష్టం కూడా ఊరికే రాదు.. అందుకూ ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు ఈ ఘటన చూసిన కొందరు. -
భలే ఆఫర్.. ఆ చిలును తెచ్చిస్తే రూ. 50వేలు ఇస్తారట..
తుమకూరు: ఒకప్పటి పాత సినిమాలలో మాంత్రికుని ప్రాణం ఏడు సముద్రాల అవతల ద్వీపంలో ఉన్న చిలుకలో ఉంటుందని కథ సాగుతుంది. ఆ చిలుక కోసం కథానాయకుడు వేట సాగిస్తాడు. అంత కాకపోయినా ఇక్కడ చిలుకను పడితే రూ.50 వేలు కానుక పొందవచ్చు. తుమకూరు నగరంలోని జయనగర లేఔట్లో నివసిస్తున్న ఒక కుటుంబం రెండు చిలుకలను పెంచుతోంది. ఏటా చిలుకల జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల ఒక చిలుక ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ పక్షి కోసం పగలూ రాత్రి గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. రెండున్నర ఏళ్లుగా ఎంతో ప్రేమగా సాకుతున్న చిలుక తప్పిపోయిందని, దానిని వెతికి తీసుకువస్తే రూ. 50 వేల బహుమతిని అందిస్తామని సదరు కుటుంబం ప్రకటించింది. నగరంలో అక్కడక్కడ బ్యానర్లు కట్టారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. More Video for Missing Parrot -#Tumakuru: A family that rears parrots at home in Tumakuru has announced Rs 50,000 cash for those who can find their favourite bird which went missing.#Karnataka #Missing #Tumakuru pic.twitter.com/C2vfbxz3UU — Chaudhary Parvez (@ChaudharyParvez) July 19, 2022 -
రుస్తుమా ఎగిరిపోయింది.. కనిపెట్టిన వారికి రూ.50వేల నజరానా
బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు. #Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ — IndiaObservers (@IndiaObservers) July 19, 2022 వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’
చాలా మందికి పెంపెడు జంతువులు అంటే ప్రాణం. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి తెగ ఇష్టపడతారు. వాటికి ఏలోటు రాకుండా మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఎక్కువగా కుక్కలు, పిల్లలు, కొంతమంది చిలుకలు కూడా పెంచుకుంటారు. పెంపుడు జంతువులు కూడా తమ యజమానులపై ఎనలేని ప్రేమను చూపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తాము ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఊరంతా గోడలపై పోస్టర్లు అతికించారు. అంతేగాక చిలుకను పట్టించిన వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. గయాకు చెందిన శామ్దేవ్ గుప్తా, సంగీత గుప్తా పిప్పరపాటి రోడ్డులో నివసిస్తున్నారు. వీరు గత 12 ఏళ్లుగా ‘పోపో’ అనే చిలుకను పెంచుకుంటున్నారు. అ క్రమంలో గత నెల ఏప్రిల్ 5న ఆ చిలుక తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు. ఎవ్వరికీ అయినా కనిపిస్తే తమకు అప్పగించాలని కోరుతున్నారు. చిలుకను ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరమితం కాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తన పక్షిని తీసుకెళ్తే దయచేసి తమకు అప్పగించాలని కోరారు. వారికి అదనంగా మూడు పక్షలు కొనిస్తానని ఆఫర్ ఇచ్చారు. అది కేవలం పక్షి మాత్రమే కాదని తమ కుటుంబంలో ఓ సభ్యడని తెలిపారు. -
'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక
టర్నీ: మనం అప్పుడే పుట్టిన నవజాతువు శిశువుల్ని చూడగానే చిన్నతల్లి లేదా చిన్న తండ్రి లేదా మరేదైనా ముద్దు పేరుతో పిలుస్తూ ఆనందిస్తాం కదా. అచ్చం మనిషిలాగేనే టర్కీలోని బుర్సాలో ఒక చిలుక తన పిల్లలను ముద్దు ముద్దుగా పలకరిస్తోంది. కాకాటిల్స్ అనే పక్షి రామచిలుక జాతికి చెందినది. (చదవండి: "సైక్లోథాన్తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ పక్షి మనుషులను చక్కగా అనుకరించడమే కాక మనం ఏదైన శిక్షణ ఇస్తే అత్యంత సులభంగా నేర్చుకోగలదు. ఇది అత్యంత తెలివైన పక్షి. ఆ చిలుకకు ఇష్టమైన ఆట పికాబు కావడంతో ఆ పేరుతోనే తన పిల్లలను చక్కగా పలకరిస్తోంది. పైగా వాటిని పింగాణి పాత్రలో భద్రపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెస్టేక్ కనట్లర్ అనే జంతు ప్రేమికుడు ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. ఎంత చక్కగా తన పిలల్ని పలకరిస్తోందో మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు) -
చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం
వజ్రపుకొత్తూరు: కొబ్బరికాయ నుంచి మొలక బయటకొచ్చి చిలక ఆకారంలో ఆకట్టుకుంటోంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు పంచాయతీ హుకుంపేటలో గ్రామ వలంటీర్ కొండ ఈశ్వరీబాయి తన ఇంట్లో పూజ కోసం కొన్న కొబ్బరికాయ ఇలా చూపరులను ఆకర్షిస్తోంది. చిలక ఆకారంలో ఉండటంతో జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇవీ చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం -
మొబైల్ ఫోన్ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో
సాధారణంగా మనలో చాలా మందికి ఫోటోలు, సెల్ఫీవీడియోలు తీసుకోవడం అంటే మహసరదా. దీనికోసం ప్రత్యేకంగా తయారై మరీ ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఫోటోలు దిగడానికి ప్రత్యేకమైన ప్రదేశాలకు వేళ్తుంటే.. మరికొంత మంది తమ ఇంట్లో లేదా మిద్దేమీదకో వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. మన ఇంట్లోని తినే వస్తువులను కోతులు ఎత్తుకుపోవడం మనకు తెలిసిందే. ఇక్కడో పక్షి ఏకంగా మొబైల్ ఫోన్ను ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి ఇంట్లో మిద్దేమీద తన మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఫోటోలు దిగుతున్నాడో.. మరేంటోకానీ.. కాసేపటికి తన ఫోన్ను కాస్త పక్కన ఉన్న పిట్ట గోడ మీద ఉంచాడు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక రామచిలుక వచ్చింది. ఆ ఫోన్ను తినేపదార్థం అనుకుందో.. మరేం అనుకుందో గానీ దాన్ని తన కాళ్ల మధ్యలో పట్టుకొని తుర్రున గాలిలో ఎగిరింది. ఆ వ్యక్తి , వెంటనే ఏదో అలజడి కావడంతో తన ఫోన్ కోసం అటూ ఇటూ చూశాడు. తన మొబైల్ ఫోన్ను ఒక రామ చిలుక తన కాళ్లలో అదిమి పట్టుకుని గాల్లో ఎగిరిపోతుండటాన్ని గమనించాడు. వెంటనే దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి అది చిక్కలేదు. మొబైల్ ఫోన్ వీడియో ఆన్లోనే ఉండటంతో అది ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడి ఇళ్లు, నగరాలు అన్ని దాటుకుంటు ప్రయాణిస్తున్న దృష్యాలు అందులో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని ఫ్రెడ్జ్ స్కూల్జ్ అనే యూజర్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘భలే చిలుక.. పాపం సెల్ఫీ దిగుతామని తీసుకుందేమో..’, ‘ఇది నిజమైన వీడియో కాదు..’, ‘బరువైన సెల్ఫోన్ను చిలుక ఎలా పట్టుకుందబ్బా.. ’, ‘కింద పడకుండా ఎంత బాగా పట్టుకుంది..’, ‘ఆ ఫోన్ మళ్లి మీకు ఎక్కడ దొరికింది’ ?, అంటూ కామెంట్లు పెడుతున్నారు. Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124 — Fred Schultz (@fred035schultz) August 24, 2021 చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
Big Mango: యే దిల్ ‘మ్యాంగో’ మోర్..
సమ్మర్.. అంటే మామిడి పళ్ల సీజన్.. ఒకదాని మీద ఒకటి ఆపకుండా లాగించేసేవాళ్లు ఎందరో.. అయితే, చిత్రంలోని మామిడి పండును మాత్రం ఒకదాని మీద ఒకటి లాగించేయాలంటే అస్సలు కుదరదు.. ఎందుకంటే.. ఈ పండు బరువే అచ్చంగా 4.25 కిలోలు! చూశారుగా.. మిగతావాటితో పోలిస్తే.. ఏ సైజులో ఉందో.. చివరికి గిన్నిస్ వారు కూడా నోరెళ్లబెట్టేసి.. ప్రపంచంలోనే అత్యంత బరువైన మ్యాంగోగా దీనికి రికార్డు కట్టబెట్టేశారు. గత రికార్డు 3.43 కిలోలుగా ఉంది. పండు ఒకే.. ఇంతకీ అది ఎక్కడ కాసిందో చెప్పలేదు కదూ.. కొలంబియాకు చెందిన జర్మన్ ఒర్లాండో, రీనాలకు చెందిన తోటలోనిది భారీ ఫలం. రికార్డు బద్దలు కాగానే.. పండును కుటుంబమంతా కలిసి ఆరగించారట. -
రామ చిలుకకు ఘనంగా అంత్యక్రియలు
ఖమ్మం : కరెంట్ షాక్తో మృతి చెందిన రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం హై టెన్షన్ కరెంటు వైర్లపై వాలిన రామచిలుక షాక్తో మృతి చెందింది. ఇది చూసిన స్థానికులు చలించి పోయారు. రామచిలుకకు సాంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. రామనామంతో ఉన్న రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించడం వల్ల మంచి కలుగుతుందన్న భావనతో అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ప్రకృతిలో ప్రతీ జీవిపై జాలిని చూపించాలని పశుపక్ష్యాదులపై ప్రేమను కలిగి ఉండాలని జంతు ప్రేమికుడు రావట్ల సత్యనారాయణ అన్నారు. అంతక్రియలు నిర్వహించేటప్పుడు రామ నామాన్ని జపించారు. -
వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక..
చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అయితే రోడ్డుపై ఒక వ్యక్తి చేతిలో కొండచిలువ, భుజంపై రామ చిలుకతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని చోటుచేసుకొంది. వివరాలు.. ఒక రోజు హేలీరోబిన్ అనే మహిళ తన మిత్రులతో కోసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి చూస్తొంది. అప్పుడు రోడ్డుకు ఆవల ఉన్న ఒక వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయింది. వెంటనే తన చేతిలోని మొబైల్ తీసుకొని రికార్డు చేసింది.. కాగా, ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద కొండచిలువను, భుజంపై రామచిలుకతో ఎంచక్కా నడుచుకొంటు వెళ్తున్నాడు. అతడిలో ఏమాత్రం భయంలేదు. తీరిగ్గా డ్యాన్స్ చేసుకొంటూ, ఫోన్ బయటకు తీసి మాట్లాడుకొంటూ వెళ్తున్నాడు. కొండ చిలువను ఒక చేతిలో నుంచి మరొక చేతిలోకి మార్చుకొంటూ ఏదో బటన్ నొక్కాల్సి వచ్చిన క్రమంలో కొండ చిలువను కిందపడేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు ఏదో ర్యాంప్వాక్ చేస్తున్నట్లు ఏంటా నడక అని సరదా కామెంట్లు పెడుతున్నారు చదవండి: బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ -
అన్నీ ఒక్కటవ్వడంతో.. బతుకు జీవుడా అంటూ
సాక్షి, గుడివాడ: మనుషులే కాదు..మాటలు రాని పక్షులు సైతం తమ బిడ్డలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతాయనేందుకు గుడివాడలో జరిగిన ఓ ఘటన సాక్షీభూతంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని వృక్షానికి గల తొర్రలో ఓ చిలుక పిల్లలను పెట్టింది. దానిని పసికట్టిన ఓ పెద్ద పాము తల్లి చిలుక గూటిలో లేని సమయంలో వాటిని మింగేందుకు తొర్ర వద్దకు చేరింది. అదే సమయానికి అక్కడకు చేరుకున్న తల్లి రామచిలుక గట్టిగా అరవడంతో చుట్టు పక్కల ఉన్న చిలుకలన్నీ దీనికి తోడయ్యాయి. అవి మూకుమ్మడిగా పాముపై దాడి చేశాయి. ఆ దెబ్బకు బతుకు జీవుడా అంటూ పాము పలాయనం చిత్తగించింది. తమ బిడ్డలను రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి పామును తరిమికొట్టే వరకు చిలుకలు చేసిన పోరాటాన్ని చూసిన ప్రజలు..పేగు బంధం అంటే ఇదే సుమా అంటూ చర్చించుకున్నారు. -
పలికే చిలుక మూగబోయింది..
-
పలికే చిలుక మూగబోయింది..
సాక్షి, ఆదిలాబాద్ : బైంసాలోని సాయిబాబా మందిరంలో 18 సంవత్సరాలుగా పెంచిన పలికే చిలుక మృతి చెందింది. ఈ జాతి రామ చిలుకలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ చిలుకను ఆలయ పరిసరంలోని దశరత్ కుటుంబం పెంచుకున్నారు. ఈ చిలుకతో ఎవరైనా కాసేపు మాట్లాడితే కొద్ది సమయానికి ఆ పదాలను తిరిగి పలుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. చిలుకను చూడడానికి రోజు చాలా మంది వస్తూ ఉండేవారు. అయితే చిలుక మృతితొ కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలొ ఒకరిగా ఉన్న చిలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం) -
అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం
వాషింగ్టన్: అత్యాచార కేసులో చిలుక సాక్ష్యంగా మారనుంది. తన యజమానురాలి చివరి మాటలను నోటి వెంట పలుకుతూ ఆమె చావుకు కారణమైన వారిని కటకటాల వెనక్కు నెట్టనుంది. ఈ అరుదైన ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది. సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజబెత్ టోలెడొ అనే మహిళ ఇంటిపైభాగంలో ముగ్గురు వ్యక్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్దరు దుండగులు అద్దెకిచ్చిన మహిళపైనే కన్నేశారు. 2018 డిసెంబర్లో ఓ రోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా వారికి "ప్లీజ్, నన్ను వదిలేయండి" అంటూ అర్థిస్తున్న శబ్ధాలు వినిపించాయి. శబ్ధాల ఆధారంగా ఇంట్లోకి వెళ్లి చూడగా.. నగ్నంగా, విగతజీవిగా పడి ఉన్న మహిళ శవం పక్కన బోనులో ఉన్న చిలుక పలుకులు వినిపించాయి. (యాజమాని వద్దు! స్వేచ్ఛే ముద్దు) మహిళను హింసిస్తూ, అత్యాచారం చేసినప్పుడు ఆమె వేడుకున్న ఆర్తనాదాలను చిలుక గ్రహించి వాటినే ఉచ్ఛరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటన కన్నా ముందు నిందితులు ఇంట్లోకి చొరబడిన వెంటనే చిలుక "నన్ను ఎందుకు కొడుతున్నారు?" అంటూ యజమాని మాటలను తిరిగి పలికింది. ఈ మాటలను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో చిలుక పలుకులను సాక్ష్యంగా చేర్చారు. మరోవైపు పోస్టుమార్టంలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. త్వరలోనే కేసు విచారణకు రానుండగా చిలకను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు -
చిలుక నిర్ణయం: యాజమాని షాక్!
లక్నో : ఓ చిలుక తీసుకున్న నిర్ణయానికి దాని యాజమాని షాక్ తిన్నాడు. తనను కాదని వెళ్లి పోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ క్రిపాల్ ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. గత మంగళవారం ఆ చిలుక కనిపించకుండా పోయింది. అయితే ఎదురింటికి చెందిన వాళ్లు తన చిలుకను దొంగిలించారన్న అనుమానంతో వారిని నిలదీశాడు క్రిపాల్. తాము ఏ చిలుకనూ దొంగలించలేదని, ఆ చిలుక తాము పెంచుకుంటున్నదేనని వాళ్లు చెప్పారు. దీంతో ఈ సమస్య ఏషియానా పోలీస్ స్టేషన్కు చేరింది. స్టేషన్ ఇన్ఛార్జ్ ఈ సమస్యను అక్బర్-బీర్బల్ కథలోలా తెలివిగా పరిష్కరించాలని భావించాడు. ( ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి ) పంజరాన్ని తెరిచినపుడు చిలుక యాజమాని దగ్గరకు వెళుతుందని, తద్వారా యాజమాని ఎవరో తెలుస్తుందని అనుకున్నాడు. ఈ విషయం వాళ్లకు చెప్పి, యాజమాని దగ్గరకు వెళ్లమని చిలుక పంజరాన్ని తెరిచాడు. అయితే ఆ చిలుక నిజమైన యాజమానికి కూడా షాక్ ఇస్తూ.. పంజరంలోంచి బయటకు రాగానే అక్కడినుంచి తుర్రుమని ఎగిరిపోయింది. చేసేదేమి లేక ఆ ఇద్దరు నిరాశతో ఇళ్లకు వెళ్లిపోయారు. ( ఈ రెండూ ఉంటే చాలు.. గులాబ్ జామూన్ రెడీ ) -
ఇంటికి చేరిన చిలుక..
తిరుపతి: ఆఫ్రికల్ కాంగో గ్రే పారెట్ ఎట్టకేలకు తన యజమాని చెంతకు చేరింది. ఈ చిలుక గురించి శుక్రవారం సాక్షిలో ‘ఎచ ట నుంచి వచ్చెనో..’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన మధురానగర్ వాసి జీవన్ ప్రకాష్రెడ్డికి ప్రాణం లే చి వచ్చినట్లైంది. చిలుక కథనం తాలూ కు క్లిప్పింగ్ను పలువురికి చూపిస్తూ దాని కోసం గాలించారు. ఆయన ఈ చిలుకను 3 నెలల క్రితం బెంగళూరులో రూ.36 వేలకు కొన్నారట! గురువారం ఇంటి వద్ద చిలుక తెరచి ఉన్న కిటికీలోంచి చిలుక తుర్రుమంది. దీనికోసం పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సాక్షిలో వచ్చిన చిలుక కథనంతో ఆయన మరోసారి అన్వేషించారు. ఎట్టకేలకు తన ఇంటికి అరకిలోమీటరు దూరంలోని ఓ ఇంట చెట్టు మీద ఉన్న చిలుకను కొందరి సాయంతో ప్రకాష్ గుర్తించారు. విజిల్ వేయడం ఆలస్యం..ఎగిరొచ్చి ఆయన చేతిపై వాలడం చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు! -
చిలుక అరిచింది.. పోలీసులొచ్చారు!
వాషింగ్టన్: చిలుకలకు మాటలు నేర్పిస్తే అవి బాగా నేర్చకోగలవని తెలిసిందే. అయితే, ఇలా మాటలు నేర్చుకున్న ఓ చిలుక ఏకంగా పోలీసులను పరుగులు పెట్టించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగు రోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి నుంచి ఎవరో మహిళ ‘హెల్ప్... హెల్ప్..’అని అరుస్తున్నట్లు వినిపించడంతో పక్కింటాయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఇంటికొచ్చారు. అరుపులు వినిపించిన ఇంటికెళ్లి ఆరాతీశారు. విషయం తెలుసుకొని, నవ్వుకొని వెనుదిరిగారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సాయం చేయమని అరిచింది ఓ చిలుక! దాని పేరు ర్యాంబో. దాని యజమాని మొదట్లో ఆ చిలుకను పంజరంలో ఉంచి ‘హెల్ప్.. నన్ను బయటకు విడిచిపెట్టండి’అనే పదాలు నేర్పించాడు. కొన్నాళ్లకు దాన్ని పంజరం నుంచి స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. కానీ, అది మాత్రం ఆ పదాలు మరిచిపోలేదు. దీంతో ఆ చిలుక అరుపులు విన్న పొరుగింటి వ్యక్తి ఎవరో మహిళా ప్రమాదంలో ఉందని అనుమానించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రావడం దగ్గర నుంచి వాళ్లు వెళ్లేంత వరకు జరిగిన ఘటనంతా ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. Our Deputies in Lake Worth Beach came to the help of someone screaming for help. Hilarity ensued. https://t.co/6fO5n3OkxC — PBSO (@PBCountySheriff) January 4, 2020 -
చిలుకను తెచ్చిస్తే రూ.20వేల నజరానా
లక్నో : ఓ రామచిలుకను పట్టిస్తే రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని ఓ రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది. ఉత్తర్ప్రదేశ్లోని రామ్పూర్కు చెందిన ఓ రాజకుటుంబ వారసురాలు సనమ్ అలీఖాన్ పౌలీ అనే రామచిలుకను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. అది చెప్పే ముద్దుముద్దు మాటలంటే ఆమెతోపాటు ఆ కుటుంబానికి ఎంతో ఇష్టం. వారి బంధువులు స్కైప్ ద్వారా దానితో మాట్లాడుతూ ముచ్చట పడిపోతుండేవారు. అయితే కొద్దిరోజుల కిందట కుటుంబమంతా ఢిల్లీకి వెళ్లినప్పుడు కేర్ టేకర్ చిలుకను సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ చిలుక ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిలుక జాడ కోసం వెతకని ప్రదేశం లేదు. ప్రాణంగా పెంచుకున్న చిలుక అదృశ్యం కావడంతో యజమాని కుటుంబం చిన్నబోయింది. ఇల్లు బోసిపోయింది. తప్పిపోయిన ఈ చిలుక ఇప్పుడు యూపీలోని రామ్ పూర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇక లాభం లేదని చిలుక యజమాని సనమ్ అలీ ఖాన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. చిలుక జాడ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎవరైతే చిలుక పట్టి తెస్తారో వారికి రూ.20వేల రివార్డు ఇస్తామంటూ ఆటో రిక్షాపై లౌడ్ స్పీకర్ తో చాటింపు వేయించారు. ప్రస్తుతం రామ్పూర్లోని అనేక వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఆ చిలక ఫోటోలు వైరల్గా మారాయి. చిలుక జీవితం ఆధారంగా వచ్చిన హాలీవుడ్ మూవీ పౌలీ (1998) చూసిన తర్వాత తాము పెంచుకునే చిలుకకు.. పౌలీ అని పేరు పెట్టినట్టు సనమ్ తెలిపారు. -
చిన్నోడికి ‘చిలుక’ కష్టాలు
రాంచీ : చిలుక చాలా అందమైన రంగుల పక్షి. దాన్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. దాని పలుకులు వింటే నవ్వోస్తుంది. అది కనిపిస్తే పట్టుకోవడానికి ట్రై చేస్తాం.. పారిపోతే వదిలేస్తాం. కానీ మనోడు మాత్రం చిలుక కోసం ఏకంగా 40 ఫీట్ల పొడవు ఉన్న చెట్టు ఎక్కి.. చేతిని విరగ్గొట్టుకొని.. చివరకు చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్లోని గధ్వాకు చెందిన బబ్లూ అనే వ్యక్తికి గత మంగళవారం ఉదయం ఓ చిలుక కనిపించింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ బబ్లూ.. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ చిలుక దగ్గర్లో ఉన్న చెట్టు తొర్రలోకి తుర్రుమని పారిపోయింది. వెంటనే మనోడు 40 అడుగుల ఎత్తు ఉన్న చెట్టును చకచకా ఎక్కేశాడు. చిలుక కోసం తొర్రలో చెయ్యి దూర్చాడు. కానీ ఆ తొర్ర నుంచి అతగాడి చెయ్యి రాలేదు. దీంతో గట్టిగా చేతిని లాగే ప్రయత్నం చేశాడు. బబ్లూ ఒక్కసారిగా చేతిని లాగడంతో బ్యాలెన్స్ తప్పి కొమ్మ నుంచి కిందకు జారాడు. అదృష్టం కొద్ది కిందపడకుండా కొమ్మ భాగాన్ని పట్టుకొని గాల్లో వేలాడుతూ కన్పించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్ సహాయంతో బబ్లూను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. చెట్టు తొర్ర నుంచి చేతిని లాగే క్రమంలో చేతి మణికట్టు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు చిలుక కోసం చిన్నోడు పడ్డ కష్టాలు చూసి స్థానికులు తెగ నవ్వుకుంటున్నారు. -
ప్రాణవాయువుపైనా సాయి ప్రాభవం
ఏ దైవానికి సంబంధించిన ఒక లీలని (మహిమని చూడగల ఒక సంఘటన) విన్నా, ఏ భక్తునికి సంబంధించిన ఒక అనుభవాన్ని తెలుసుకున్నా వాటిని ‘అవి ఎవరికో జరిగినవి’ అనుకోకూడదు. ‘మనకి కూడా ఆ దైవానుగ్రహం గనుక ఉంటే ఇలాంటి సంఘటనలే జరిగే అవకాశముందన్నమాట’ అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అవగాహన కలగాలంటే సద్గురువు (నిస్వార్థంగా జ్ఞానబోధని చేసి కళ్లు తెరిపించేవాడు) లభించాలి. ఓ చిన్న ఉదాహరణని గమనించుకుని లోపలికి వెళ్తాం! చిలుక ఉంది. అది చక్కగా మాట్లాడుతోంది. అందంగా.. ఆకర్షణీయంగా.. ఉందనే ఆలోచనతో మనం దాన్ని తెచ్చి ఓ పంజరంలో ఉంచి, దానికి కావలసినవన్నీ సకాలంలో పెడుతూ ఉంటాం. అది కూడా వాటిని తింటూ.. మనతో ఆడుకుంటూ.. మనల్ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఎక్కడికీ ఎగరాల్సిన అవసరం లేకుండా తనకి ఇష్టమైన పళ్లూ తినుబండారాలూ తన దగ్గరికే వస్తున్నాయని మహా ఆనందపడిపోతూ ‘ఈ జీవితం ఇలాగే జరిగిపోతే చాలునురా భగవంతుడా!’ అనుకుంటుంది. ఎవరో ఒక పిల్లవాడో లేక ఇంట్లో ఎవరో ఆ చిలుకకి ఆహారాన్ని పెట్టి పొరపాటున పంజరపు తలుపుని వేయకుండా ఉన్నారనుకుందాం! ఆ చిలుక కాస్త ఎగిరి ఆ చెట్టు మీదా ఈ చెట్టు మీదా వాలుతూ విశాలవిశ్వాన్ని తన ఆటస్థలంగా భావిస్తూ తన రెక్కల సత్తువ కొద్ది దూరదూరాలు వెళ్తూ విన్యాసాలు చేసుకుంటూ తన జాతి చిలుకలతో ఆడుతూ పాడుతూ గంతులేస్తూ అడవులకీ తోటలకీ వెళ్తూ అనుకుంటుంది ‘అయ్యో! ఎంత జీవితకాలాన్ని నష్టపోయాను. ఆ పంజరంలో బంధింపబడి ఇంత విశాలవిశ్వముంటే నేను ఓ చిన్న పంజరంలోనే ఉంటూ.. దాన్నే గొప్పగా భావిస్తూ.. అందరూ నన్ను ఆదరిస్తున్నారనుకున్నాను గానీ ఇంత స్వతంత్రతనీ, ఇంతటి ఆనందాన్నీ కోల్పోయానా ఇంతవరకూ!?’ అని తీవ్రంగా బాధపడుతుంది. ‘ఇప్పటివరకూ నన్ను చూడదలిచినవారి ఇష్టాలకి అనుగుణంగా ఉంటూ దానికి అలవాటుపడి అదే నిజమైన ప్రపంచం అనేసుకున్నానా? నిజమైన ఆనందమంటే.. ఎవరి సంతోషానికో నేను అనుగుణంగా ఉండటం కాదు. నా ఆనందాన్ని నేను పొందడానికి అనుగుణంగా నేనెలా ఉండాలో, ఉంటే బాగుంటుందో అలా ఉండటం మాత్రమే!’ఇదంతా ఎందుకంటే జీవుడు (ప్రతివ్యక్తీ) కూడా అంతే! ఈ కోరికలు, ఆ కోరికలు, ఆ ధనం, ఈ ఐశ్వర్యం (ఈశ్వరస్య భావరి – అధికారం హోదా అనేది సరైన అర్థం), సంతానం, సౌకర్యాలూ... అనే ఈ పంజరంలో బంధింపబడి ఎంతగొప్పగా ఉన్నాను అనుకుంటాడు. పై ఉదాహరణలో పంజరపు తలుపుని ఎవరో తీస్తే బాహ్య ప్రపంచాన్ని చూసి తానెంత నష్టపోయిందో ఆ చిలుక గమనించినట్లే ఇక్కడ కూడా జీవునికి సరైన గురువు (సద్గురువు) గాని దొరికితే నిజమైన మానసిక ఆనందాన్ని (హ్లాదం అంటారు. అలాంటి హ్లాదం యొక్క అతీతస్థితే ప్రహ్లాదం. అది కలిగినవాడే ప్రహ్లాదుడు) పొందుతూ జీవితాన్ని ఎంత నష్టపోయిందీ, నష్టపోగొట్టుకుందీ తెలుసుకోగలుగుతాడు. అలా హ్లాదాన్ని పొందిన సాయి భక్తులందరికీ సాయి తన జీవితాలని ఎలా రక్షించి ఒడ్డున పడేసిందీ స్పష్టంగా తెలుసు. ఉదాహరణతో చూద్దాం! ప్రాణవాయువు మీద ఆధిపత్యం మన శరీరంలో (పిండ అండంలో) 5 వాయువులున్నాయి. వాటిలో మొదటిది మన ప్రాణాలని నిలిపి ఉంచే వాయువు. అదే ప్రాణవాయువు. ‘హృదిప్రాణః’ అన్నారు కాబట్టి ఈ ప్రాణవాయువు ప్రతి జీవునిలోనూ (జీవించి ఉన్నవారు) హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుండి ప్రాణవాయువు తొలిగిపోయిన క్షణంలో ఆ జీవుడు నిర్జీవుడు అవుతాడు. ఆ ప్రాణం– సామాన్యులమైన మన అందరి భావనలోనూ ఎప్పుడుపోతుందో – తెలియదు. అయితే సాయికి స్పష్టంగా తెలుసు ఎవరి ప్రాణం ఎప్పటికి గతిస్తుందో! అందుకే ఫలానవాని ప్రాణాలు నిలిచి ఉండాలని తనకి అనిపించినప్పుడు ఆ పోబోయే ప్రాణవాయువుని కూడా పోకుండా ఆపుచేసి ఆ జీవుడ్ని మరికొంతకాలం జీవింపజేశాడు. ఇలా ప్రాణవాయువుని ఆపి ఉంచగలిగాడంటే తనకి ప్రాణవాయువు మీద ఆధిపత్యం ఉన్నట్లే కదా! శ్యామాని పాము కరిచింది! పైన అనుకున్న చిలుక కథలోని చిలుకలా పంజరం నుంచి బయటపడి సద్గురువు పర్యవేక్షణలో స్వతంత్ర జీవనాన్నీ హ్లాదాన్ని పొందుతున్న వాడు శ్యామా(మాధవరావు శ్యామా అనేది పూర్తి పేరు). బాబాకి నీడలాగా ఉంటూ ఉండేవాడు. సాయి కూడా శ్యామాని అంతగానూ దగ్గరగా ఉంచుకుని చూసుకుంటూ ఉండేవాడు. సాయి నిత్యం చేసే అగ్నిహోత్ర కార్యక్రమం (ధుని) కోసం కట్టెలని తేవాలనే ఉద్దేశ్యంతో శ్యామా కట్టెలన్నీ పెద్ద ఎత్తున ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి కట్టెల్ని లాగుతూ ఉంటే ఆ పెద్ద ఎత్తు మోపులా ఉండే కట్టెల సమూహం నుండి ఓ పొడవాటి పాము(మరాఠీలో బవా అంటారు) శ్యామా చిటికెనవేలి మీద బలంగా పడగ ఎత్తి మరీ కాటేసింది. క్షణాల్లో శ్యామా చిటికెన వేలంతా విషాగ్నితో నిండిపోయి తీవ్రమైన మంటనీ నొప్పినీ కలుగజేసాయి శ్యామాకి. ఎప్పుడూ అలాంటి పాముకాటు అనుభవం లేని కారణంగానూ, తాను ఒంటరిగా వచ్చి ఉన్న కారణంగానూ శ్యామా భయాందోళనలతో వణికిపోసాగాడు. బాధా భయమూ ఆందోళనా నిస్సహాయతా వంటివి ఆవరించినప్పుడు దైవాన్ని స్మరించుకోవాలనే విషయాన్ని అందరూ చెప్పే మాట నిజమే గాని, ఆ బాధలో ఆందోళనలో అంతటి సాయి భక్తునికీ నిరంతరం సాయితో మెలిగేవానికీ కూడా సాయి గుర్తు రానూ లేదు. సాయి జపం చేయాలనే ఆలోచన కలగనూ లేదు. ఇది సర్వసాధారణం. ఒకవేళ ఏ ధ్యానమో చేద్దామని ఏ క్షణంలోనో అనిపించినా అది సాధ్యమయ్యే విషయమేనా ఆ బాధలో ఆందోళనలో ప్రాణభయంలో ఉన్న సమయంలో? పెద్దగా అరిచిన అరుపులకి దగ్గరగా ఉన్న బంధువులూ కొందరు మిత్రులూ అతని వద్ద కొచ్చారు. శరీరమంతా క్రమంగా ఎర్రని రంగుతో నిండిపోతూ కనిపిస్తోంది. అతని ప్రాణాలు ఇక పోతాయేమోననే భయం శ్యామాతో పాటు అందరికీ దాదాపుగా కలిగింది. ఆ ఎర్రగా మారుతున్న శరీరపు రంగూ, విషబాధతో శ్యామా మెలికలు తిరిగిపోతున్న దృశ్యమూ చూడగానే. షిర్డీలో పాముల సంచారం ఎక్కువనే చెప్పాలి. ఓ సారి సాయిని భక్తులు కొందరు ‘బాబా! పాముల సంచారం ఎక్కువగా ఉంటోంది. దీనికి ఏదైనా నివారణోపాయం – పరిష్కారమార్గం నువ్వే చెప్పాలి’ అనడిగితే ఆయన నవ్వి.. ‘షిర్డీ ఒక అడవి ప్రాంతం. అడవి అనేది పాములు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే ప్రదేశం. మనం మెల్లిగా ఇక్కడి కొచ్చి ఇళ్లు కట్టుకున్నాం. ఉంటున్నాం. అంటే ఏమన్నమాట? అవి ఉన్న ప్రదేశానికి మనం వచ్చాం గానీ, మనమున్న ప్రదేశానికి అవి రావడం లేదు. ఆ కారణంగా వాటిని చంపకూడదు’ అన్నారు. అంచేత ఎవరైనా పాములు కనిపించినా దూరంగా తొలిగిపోతూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరికైనా పాము కాటు సంభవిస్తే షిర్డీలోనే విఠోబా మందిరం (అది ఒక శివాలయానికున్న పేరు) అని ఒకటుంది. అక్కడికి తీసుకెళ్లేవారు బాధితుడ్ని. అక్కడ ఉండే ఒక అర్చకుడు మంత్రాన్ని వేస్తే బతుకుతూ ఉండేవారు సాధారణంగా. అలాగే గడుస్తూ ఉండేవి రోజులు. షిర్డీ వాసులకి పాముల విషయంలో ధైర్యం ఉండటానికీ, రాత్రయినా తెల్లవారుజామైనా ఎక్కడికైనా వెళ్తూ ప్రజలుండగలగడానికీ ఆ విఠోబా మందిరముందనే నమ్మకమే కారణం. ఆ ధైర్యాన్నిచ్చే విఠోబా మందిరానికి తీసుకెళ్లబోతుంటే శ్యామా స్నేహితుడు ‘నిమోణ్కర్’ అనే ఆయన ‘ఇదంతా ఎందుకు? ముందు బాబా దగ్గర కెళ్లి ఆయనిచ్చే ఊదీ (ధునిలో కట్టెలు మండగా వచ్చిన బూడిద– విభూతి అన్నమాట) తీసుకో: అని సూచించాడు. ఆ మాటని వింటూనే శ్యామా ఆ సాయి ఉండే మందిరానికి పరుగులాంటి నడకతో ఎలాగో ఓపిక కూడగట్టుకుని వెళ్లాడు. ఫో! ఫో! మేడమీద బాబా ఉన్నాడని తెలిసిన శ్యామా.. ఆ బాబా సన్నిధికి వెళ్లి పామువిషం దిగిపోయి తాను బతకగలననే ధైర్యంతో విశ్వాసంతో ఉన్నాడో లేదో ఆ సమయంలో బాబా ఈ శ్యామాని చూస్తూనే తీవ్రకోపంతో ... భతుర్ధ్యా(హేయమైన ప్రవర్తన అథమనీచ లక్షణాలు కలిగిన బ్రాహ్మణుడా!) మేడమెట్లు ఎక్కావో ఊరుకోను! పైకెక్కావో జాగ్రత్త! దిగిఫో! ఫో! ఫో!’ అంటూ పెద్ద గొంతుతో అరిచాడు. శ్యామాకే కాదు అతడ్ని అనుసరించి వెళ్లిన అందరికీ ఆశ్చర్యమనిపించింది! విడ్డూరంగా సాయి అలా అనడమేమి? అనే సంశయంతో భక్తులందరూ ఆలోచనలో పడిపోయారు. శ్యామాకయితే మతిపోయింది. ఏం చేయాలో ఆలోచించగల స్థితిలో తన బుద్ధి లేనే లేదు. తీవ్ర శారీరక బాధా, దానికి తోడు సాయిబాబా కంఠస్వరం దాని నిండుగా నిందలూ తిట్లూ కారణం! ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో శారీరకంగానూ మానసికంగానూ కుంగిపోయి నిరాశతో కుప్పకూలిపోయిన శ్యామా గట్టిగా ఎగశ్వాస పీల్చసాగాడు. బలంగా గాలిని పీల్చడమంటే విష తీవ్రత ఊపిరితిత్తుల దాకా వెళ్లి గాలిని సుఖంగా పీల్చుకోలేని స్థితికి రోగిని తీసుకెళ్తోందన్నమాట. సాయి భక్తులందరూ ఈ పరిస్థితిని ఏ తీరుగానూ విశ్లేషించుకోలేక ఉంటూ ఉంటే, కన్నబిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా పోతే పోనీ! అన్నట్లుగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి? అనే తీరు నిరాశా నిస్పృహలతో ఆ సాయి మందిరాన్ని వెర్రివానిలా చూస్తూ ఉండిపోయాడు. ఈ మసీదు(ద్వారకామాయి) నా పుట్టిల్లు. నేను సాయి కన్నబిడ్డని. సాయి దర్శనానికొచ్చే అందరూ నా సోదరసమానులు. ఏనాడూ అధర్మంగా ప్రవర్తించి ఎరుగను... అనుకుంటూ గుండెనిండుగా దుఃఖాన్ని అనుభవిస్తూ మౌనంగా లోలోపలే కుతకుతలుడికిపోయాడు శ్యామా. బతికే ఆశని వదులుకుని తన జీవితం ముగియబోతోందని గ్రహించుకుని మెల్లగా మేడ దిగేసాడు శ్యామా. ఎప్పుడైతే తాను మేడ దిగేసి సాయికి కనిపించకుండా ఉన్నాడో అప్పుడు సాయి గొంతు అరవడం మానింది. ఆయన శాంతించినట్లుగా శ్యామాకి తోచింది. ప్రాణాలు పోతే పోనీ! అదేదో సాయి సన్నిధిలోనే సాగనీ! తన జీవిత సర్వస్వమూ సాయే అయ్యున్నప్పుడు ఈ మేడ కింద శరీరాన్ని త్యజించడమెందుకు? అనుకుంటూ ఓపిక కూడగట్టుకుని మళ్లీ మేడపైకి వెళ్లాడు. సాయికి కనిపిస్తూ ఆయన దర్శనాన్నే చేస్తూ కింద కూర్చున్నాడు. సాయినే చూస్తూ ఉండిపోయాడు. సాయి శ్యామాని చూస్తూ .. ‘ఈ ఫకీరు నిన్ను రక్షిస్తాడు! ధైర్యంగా ఉండు! నా మీద నమ్మకం ఉంచుకో! ప్రశాంతంగా ఉండు! నీకేమీ కాదు! కలవరపడకు! ఇంటికి వెళ్లు! ఇంటి బయటికి మాత్రం వెళ్లకు!’ అన్నాడు మెత్తని కంఠ స్వరంతో అనుగ్రహిస్తున్నాడనే నమ్మకాన్ని అదే కంఠస్వరంతో కలిగిస్తూ. శ్యామా బాబామాటనే విశ్వసిస్తూ త్రోవలో’ పాముకాటుకి గురైన బాధితులు వెళ్లే విఠోబా మందిరం మీదుగానే వెళ్తూ కూడా ఆ మందిరానికి వెళ్లకుండా తన ఇంటికే చేరాడు. శ్యామా తన ఇల్లు చేరాడో లేదో ‘తాత్యా’ అనే భక్తుడు ఇంటి వద్ద కనిపించాడు శ్యామాకి. ‘శ్యామా! సాయే నన్ను పంపిస్తే వచ్చాను! నిన్ను నిద్రపోవద్దని చెప్పాడు. నీకు నిద్ర రాబోతే నిద్రపోనీయకుండా చూడాల్సిందిగా చుట్టూ ఉన్నవారిని చూడవలసిందన్నాడు. తిండి విషయమా? ఇష్టమైన వేటినైనా సరే తినమన్నాడు! ఒక వేళ నిద్రమత్తుగాని వస్తే పచార్లు చేయవలసిందే తప్ప నిద్ర పోనే పోరాదన్నాడు’ అని చెప్పాడు బాబా మాటలని. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్)ని ధైర్యం కోసం రక్షణకోసం ఉండవలసిందని సాయే చెప్తే వచ్చాడు! గమనించు! అని కూడా చెప్పాడు ‘తాత్యా’. సాయి చెప్పినట్లు నచ్చినది తిని – నిద్ర వస్తున్నా కూడా నిద్రపోకుండా నిద్ర వస్తోందన్న అనుమానం వస్తే ‘కాకా’ సహాయంతో పచార్లు చేస్తూ ఎలాగో రాత్రిని నిద్రలేకుండా నిద్రరాకుండా చూసుకుని గడిపేసాడు శ్యామా.తెల్లారేసరికి అతని బాధ తగ్గిపోయింది గానీ ఆ పాము కరిచినచోట మాత్రం కొద్దిగా మంట ఉంది. అప్పుడప్పుడు చురుక్కుమంటూ తానున్నానంటోంది. కొంత పొద్దెక్కేసరికే పూర్తిగా తగ్గిపోయింది. ఎలా తగ్గింది? ఏ మందూ మాకూ వాడలేదు. పైగా బాబానే నమ్ముకున్న శ్యామాని బాబా ఆదరించలేదు సరికదా బిగ్గరగా అరుస్తూ ‘దిగిఫో!’ అన్నాడు కూడా. విఠోబా మందిరంలో ప్రవేశించలేదు కూడా. ఎలా తగ్గినట్టు? బాబా ప్రవర్తనకి లో అర్థమేమిటి?బాబా తన వద్దకొచ్చిన శ్యామాని తిట్టలేదు. ‘భతుర్ధ్యా!’ ‘దిగిఫో’ అన్నాడు. పాముల్లో నాలుగు వర్ణాలు ఉంటాయి. ఏదో తప్పు చేసిన కారణంగా ఓ బ్రాహ్మణునికి మహర్షి ఎవరో ఇచ్చిన శాపం కారణంగా పాముగా జన్మనెత్తిన ఆ పాము ఈ రోజున శ్యామాని కరిచింది. జన్మజన్మల సంబంధాన్ని తెలుసుకోగల జ్ఞాని బాబా. ఈ విషయం రాబోయే కొన్ని భాగాల్లో ఓ భాగంలో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోబోతున్నాం. అందుకని ఓ బ్రాహ్మణ సర్పమా! అప్పుడు తప్పు చేసి పాముగా అయి మళ్లీ నీచకార్యాన్ని (శ్యామాని కరవటం) చేస్తావా? విషరూపంగా ఉన్న నువ్వు దిగిఫో! అని ఆ పాముని మందలించాడు సాయి. ఇది వినడానికీ చదువుకోవడానికీ బాగుండచ్చేమో గానీ నమ్మవీలులేనిదిగా ఉందనిపించవచ్చు. మరి అదే నిజమైతే ‘భతుర్ధ్యా!’ అని ఎందుకు సంబోధించాడు సాయి? మళ్లీ ఆ సాయే శ్యామా మేడమీదికి రాగానే తగ్గిపోతుందనీ శాంతపడతావనీ నిద్రపోవద్దనీ ఎందుకన్నాడు శాంతస్వరంతో. పైగా దీక్షిత్ని శ్యామా ఇంటికెందుకు పంపాడు? అందరూ తన నుంచి వెళ్లిపో యేలా చేసుకునీ చూసుకునీ ‘అల్లాహ్(అల్లా అనే పేరుండి విశ్వమంతా నిండిన) హో(అతడు మాత్రమే) మాలిక్! (నాకు సర్వస్వం) అనే తన మంత్రాన్ని శ్యామా కోసం మననం చేస్తూ ఉండిపోయాడు సాయి. వాక్కుకి ఓ శక్తి అనేది రావాలంటే తాను నమ్మిన మంత్రాన్ని మననం చేసినప్పుడే అది సాధ్యం. అంతకుముందే ఉన్న మంత్రశక్తితో శ్యామాకున్న ప్రాణవాయువుని పోకుండా నిరోధించి, తాను చేస్తున్న మంత్ర మనన శక్తితో శ్యామా బాధనీ ఆందోళననీ విషతీవ్రతనీ తగ్గించాడు సాయి. అందుకే సాయికి ఈ విషతీవ్రతని నిరోధించడానికి ఓ రాత్రి రాత్రంతా పట్టింది. వాక్కులో మంత్ర మననశక్తి ప్రవేశిస్తే అది అనుగ్రహం కారణంగా వరంగా ఆగ్రహం కారణంగా శాపంగా మారుతుంది. అందుకే తమ సంతానాన్ని ఆశీర్వదించవలసిన అవసరం వచ్చినప్పుడు తల్లులు కొంతసేపైనా మంత్రమననాన్ని చేసి ‘బాగా పరీక్షలు వ్రాయి!’ సుఖంగా ప్రయాణం సాగాలి! అంటూ ఇలా ఆశీర్వదిస్తే అవి నెరవేరతాయి. ఒట్టిగా ‘విష్యూ ఆల్ ది బెస్ట్’ వంటి మాటలు గాలిలో కలిసి ఏ ప్రయోజనాన్ని కలిగించవు. ప్రాణవాయువు మీద ఆధిపత్యమున్న సాయి కొందరి ప్రాణవాయువుని తొలగించిన సందర్భాలనీ చూద్దాం! –సశేషం -
నన్ను కాపాడటానికి వచ్చావా...!!
చిన్న పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటే చిలుకలా ఎంత మధురంగా మాట్లాడుతున్నారో అంటూ మురిసిపోతాం. వారి మాటల్ని చిలుక పలుకులతో పోలుస్తాం. కానీ జెస్సీ మాటలు వింటే మాత్రం ఇంకెప్పుడూ అలా పోల్చడానికి సాహసించరు. ఇంతకీ జెస్సీ ఎవరో చెప్పలేదు కదూ.. లండన్కు చెందిన ఓ వ్యాపారి పెంపుడు చిలుకే ఈ జెస్సీ. పంజరంలో బంధీగా ఉండటం జెస్సీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఆహారం తినిపించే సమయంలో ఒక్కసారిగా తుర్రుమని ఎగిరిపోయింది. పక్కింటి పైకి ఎక్కి మూడు రోజులుగా అక్కడే బస చేస్తోంది. అయితే ఎంతో ప్రేమగా పెంచుకున్న జెస్సీ తిండీ తిప్పలు లేకుండా ఉండటం చూడలేక.. జంతు సంరక్షణ సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్కు ఫోన్ చేశాడు జెస్సీ యజమాని. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఒకరు.. ఓ గిన్నెలో జెస్సీ కోసం ఆహారం తీసుకెళ్లి ప్రేమగా తినిపించబోయాడు. యజమానిలాగే ‘ఐ లవ్ యూ జెస్సీ’ అంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయడంతో... చిర్రెత్తుకొచ్చిన జెస్సీ అతడిని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. జెస్సీ నుంచి అలాంటి మాటలు రావడంతో షాక్ తినడం అతని వంతైంది. ఈ విషయం గురించి జెస్సీ వాళ్ల యజమాని మాట్లాడుతూ.. తానెప్పుడూ అలాంటి మాటలు నేర్పించేలేదని, జెస్సీ తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని వివరణ ఇచ్చుకున్నాడు. కాసేపటి తర్వాత కిందకి దిగొచ్చిన జెస్సీ... ఫైర్ బ్రిగేడ్కు సారీ చెప్పడంతో పాటు.. తనను కాపాడటానికి వచ్చినందుకు థ్యాంక్యూ కూడా చెప్పి.. అతడి కోపాన్ని పోగొట్టేసింది. -
రాష్ట్ర వృక్షంగా వేప
రాష్ట్ర చిహ్నాలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నాలుగేళ్ల తర్వాత వాటిని గుర్తించింది. వృక్షంగా వేపచెట్టును, పుష్పంగా మల్లెను, జంతువుగా కృష్ణ జింకను, పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షి, అమరావతి: వేద కాలం నుంచి పూజలందుకుంటూ, పుష్కలమైన ఔషధ గుణాలు కలిగిన వేపచెట్టును ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా నిర్ణయించింది. విభజన నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక చిహ్నాలు ఖరారు చేసింది. వేపచెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. ఉగాది పర్వదినాన తెలుగువారికే ప్రత్యేకమైన ఉగాది పచ్చడిలో వేప పువ్వును ఉపయోగిస్తారు. వేప గింజల నుంచి తీసే నూనెను సబ్బులు, షాంపూలు, క్రీమ్స్లో ఉపయోగిస్తారు. వేప చెట్టులోని వివిధ భాగాలను ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. చర్మవ్యాధులకు వేపాకుతో చేసిన లేపనం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామం అజాడిరక్త ఇండిక. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అటవీ పర్యావరణ శాఖ వేపను రాష్ట్ర వృక్షంగా ఖరారు చేసింది. పొడవాటి మెలికలు తిరిగిన కొమ్ములతో శరీరంపై వివిధ వర్ణాల మచ్చలతో చూడటానికి అందంగా కనిపించే కృష్ణ జింకను ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా నిర్ణయించింది. దీని శాస్త్రీయ నామం ఏంటిలోప్ సెర్వికాప్రా. ప్రాచీన హిందూ పురాణాల్లో కృష్ణజింక చంద్రుని వాహనంగా చెప్పబడింది. అయితే ప్రస్తుతం ఇది అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉంది. పెంపుడు పక్షిగా మనిషికి అత్యంత సన్నిహితంగా ఉండే రామచిలుకను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసింది. శుభకార్యాలనగానే గుర్తుకొచ్చే, సువాసనలు వెదజల్లే మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా ఖరారు చేసింది. ఈమేరకు అటవీ, పర్యావరణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి జూన్ నాలుగో తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. -
ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, రామ చిలుకను రాష్ట్ర పక్షిగా, మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. -
చిలుకా.. క్షేమమా!
పచ్చని చిలుకలు తోడుంటే.. అంటూ పాట పాడుకుంటాం. అంటే చిలుకలంటే పచ్చగానే ఉంటాయని మనకు తెలుసు. సర్కస్లలో, సినిమాల్లో ఒక్కోసారి రంగురంగుల చిలుకలు దర్శనమిస్తాయి. కానీ ఎప్పుడైనా నీలిరంగు చిలుకను చూశారా? ఈ అరుదైన చిలుక జాతిని శాస్త్రవేత్తలు మెక్సికోలో గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు అమెజాన్ ప్రాంతంలో ఈ చిలుకలను గుర్తించారు. ఈ చిలుకలలో అనేక ప్రత్యేక లక్షణాలున్నాయట. మనదగ్గర ఉండే పచ్చని చిలుకల కంటే ఇవి పెద్దగా అరుస్తాయట. అది కూడా ఒకే రకమైన శబ్దం చేస్తూ మళ్లీ మళ్లీ అరుస్తాయట. అంతేగాక ఇవి చిన్న గుంపులుగా జీవిస్తాయని, ఒక్కో గుంపులో 10 నుంచి 12 చిలుకలు ఉంటాయని చెప్పారు. శాకాహారులైన ఈ పక్షులు పండ్లు, పువ్వులు, ఆకులు, విత్తనాలను ఇష్టంగా తింటాయని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు 1,20,000 సంవత్సరాల క్రితమే ఈ జాతి ఆవిర్భవించిందని గుర్తించారు. -
పక్షులకూ మనసుంటుంది!
పక్షిపాతం చుట్టూ పాలరాతి మెరుపులు, అద్దాల తలుపులు, మండే ఎండల్లోనూ చల్లని పవనాలు అన్నీ ఉన్నా ఏదో వెలితి. నవీన కాలంలో మనిషికి మనిషి తోడు లేని మనసులు. లోలోపల కుంగదీస్తున్న మనసును బుజ్జగించే నాథుడు లేక తోడును వెతుక్కునే క్రమంలో నేటి మనిషి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నాడు. ఇంకొందరు పక్షులను తెచ్చి నట్టింట్లో పంజరం వేలాడదీసి వాటిని అందులో ఉంచి గారాలు పోతున్నారు. ఇంటికి అతిథి వచ్చినా పలకరించకుండా పక్షులకు కావల్సిన తిండి ఎలాంటిదైతే బాగుంటోందని నెట్టింట్లో వెతుకుతున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ స్వేచ్ఛగా ఉండాల్సిన పక్షులు సిమెంట్ ఇళ్ల గదుల్లో ఇమడలేక మనుషుల్లాగే రోగాల పాలబడుతున్నాయంటున్నారు పరిశోదకులు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో పరిశోధన బృందం ప్రత్యేకంగా ఆఫ్రికన్ బర్డ్స్పై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాట్లాడే చిలుకలకు డిమాండ్.. సహజంగానే పక్షులు మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. వీటిలో ఆఫ్రికన్ గ్రే కలర్ రామచిలుక, ఆస్ట్రేలియన్ కాక్టూస్, సౌత్ అమెరికన్ మకావ్స్.. పక్షులు అద్భుతమైన రంగులతో ఆకర్షిస్తాయి. అందుకే వీటిని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్ ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఈ పక్షుల్లో చాలా వరకు మనుషులు ఎదుర్కొనే ఊబకాయం, డిప్రెషన్, చురుకుదనం లేమి.. వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలలో పక్షుల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ సంఖ్య పెరుగుతోంది. జీవితకాలపు తోడు... నగరాల్లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రతియేటా పక్షులను పెంచుకునేవారి శాతం పెరుగుతుంది. ఎందుకంటే వీటిని చిన్న చిన్న ప్లాట్లలోనూ మ్యానేజ్ చేయవచ్చు. ‘పక్షుల పెంపకం సులువు’గా భావించడం కూడా వీటి కొనుగోళ్లను పెంచుతుంది. కొన్ని ప్రత్యేకమైన పక్షులైతే 60–70 ఏళ్లు జీవించగలవు. దీని వల్ల ఒక మనిషి తన జీవితకాలం ఒక పక్షినే పెంచుకోవచ్చు. ఈ తరహా పక్షులు తమ యజమాని ఎవరో ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వారిని ఉద్దేశించే సంభాషిస్తుంటాయి. ‘మా రామచిలుక అయితే గోళ్లు, రెక్కలను కత్తిరించేవారెవరో గుర్తుపట్టేస్తుంది. నేను కాకుండా మరెవరినీ దగ్గరకు రానీయదు’ అంటాడు ఆనందంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉదయ్. ‘నేను ఇంట్లోకి అడుగుపెడుతూనే నా అడుగుల శబ్దం విని తెగ అల్లరిచేసేస్తుంటుంది మా డియర్’ అని మురిపెంగా తన పెంపుడు చిలుక గురించి చెబుతుంది సోనీ! పక్షులకూ ఊబకాయం సమస్య... ‘సాధారణంగాæ పక్షులు వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. ఆహారం కోసం ఆకాశంలో ఎంత దూరమైనా స్వేచ్ఛగా విహరిస్తాయి. వాటికి విశాల విశ్వమే హద్దు. అలాంటి వాటిని తీసుకొచ్చి ఎక్కడకూ కదలడానికి వీలులేని పంజరంలో ఉంచి, అవసరానికి మించి వాటికి ఆహారాన్ని పెడుతున్నారు. ఆ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే శక్తిని ఖర్చుపెట్టుకోనీయడం లేదు. పైగా పక్షి ఒంటరిగా ఉండటం వల్ల చురుకుదనం కోల్పోయి డిప్రెషన్ వంటి బాధలను అనుభవిస్తున్నాయి’ అంటారు ఆఫ్రికన్ డాక్టర్ గంజ్వాన్! ‘ఆనందంగా ఉండే పక్షి రెక్కలు నవనవలాడుతూ శుభ్రంగా ఉంటాయి. అదే డిప్రెషన్ పక్షి రెక్కలు డీలాపడిపోయి ఉంటాయి. వాటి పునరుత్పత్తి విషయంలోనూ తేడాలు వస్తున్నాయి. రెక్కలు విప్పుకోవడానికి కావల్సినంత చోటు లేక విపరీతమైన బాధలను అనుభవిస్తున్నాయి’ అని తమ పరిశోధనలో వివరించారు చికాగో పరిశోధకులు. వేల రకాల పక్షులను పరీక్షించిన తర్వాత ఓ నిర్ధారణకు వచ్చారు ఈ పరిశోధకులు ‘పక్షులు అతి తెలివైనవనీ, అవి తమ తోటి పక్షుల అటెన్షన్ను కోరుకుంటాయని, లేదంటే అంటిపెట్టుకుని ఉండే మనుషులు తమతో ఎక్కువ సమయం ఉండాలనుకుంటాయ’ని వివరించారు. చట్టాలు కఠినం కావాలా! ‘పక్షి ప్రేమికులు ప్రపంచమంతటా ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది పక్షులను తమ ఫార్మ్హౌజ్లలో ఎక్కువ సంఖ్యలో పక్షులను పెంచుతున్నవారే!’ అంటారు డాక్టర్ టండెల్. కలకత్తాకు చెందిన ఈ డాక్టర్ ‘చాలా దేశాలలో వన్యప్రాణి సంక్షరణ కేంద్రాల చట్టం అంతరించిపోతున్న పక్షులను సంరక్షిస్తుంటుంది. అయితే, వలస పక్షుల పెంపకం, అమ్మకంలో మాత్రం కఠిన∙చట్టాలు తీసుకోవడం లేదు’ అంటారాయన. – ఎన్.ఆర్ పెంపుడు పక్షుల కోసం కనీస జాగ్రత్తలు ఆఫ్రికన్ వెటర్నరీ డాక్టర్ గంజ్వానీ పక్షుల పెంపకానికి తీసుకోవాల్సిన కనీసం జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. పక్షులు ఒంటరితనం ఫీలవకుండా టీవీ లేదా రేడియో, అద్దం ముందు పక్షి పంజరాన్ని ఉంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పంజరంలో మరో పక్షి బొమ్మనైనా ఉంచాలి కొంతమంది తాము ఆహారాన్ని తింటూ వాటినే పక్షులకు పెడుతుంటారు. ఉదాహరణకు.. రోటీ, పాస్తా వంటివి. ఇవి పక్షులకు జీర్ణం కావు. సరైన వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా లభించేవి, వాటికి అనుకూలమైన ఆహారం ఉండాలి. మీ పక్షికి ఏం కావాలో, ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. పక్షి జీవితం సంతోషంగా ఉండటం మీ చేతుల్లో ఉంది. లేదంటే, ఆ పక్షిని మీ చేతులతో ఆకాశంలోకి స్వేచ్ఛగా వదిలిపెట్టడం మంచిది. -
పనిమనిషితో భర్త గుట్టు విప్పిన చిలుక!
మాటలు నేర్చిన రామచిలుక ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. మనం మాట్లాడిన మాటల్నే ముద్దుముద్దుగా అది వల్లేవేస్తుంది. కానీ, ఓ రామచిలుక మాత్రం తాను నేర్చిన మాటలతో తన ఇంటి ఆసామి బండారం బట్టబయలు చేసింది. పనిమనిషితో రహస్యంగా శృంగారలీలలు జరుపుతూ.. ఆమెతో ఆయన చెప్పిన ముద్దుముద్దు మాటల్ని ఆ చిలుక భార్య ముందు పలికేసింది. దాంతో పనిమనిషితో ఆయన జరుపుతున్న రహస్య రాసలీలలు బట్టబయలయ్యాయి. దీంతో ఇప్పుడాయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కువైట్లో జరిగింది. పనిమనిషితో భర్త రహస్యంగా జరుపుతున్న రాసలీలల గురించి పెంపుడు చిలుక గుట్టువిప్పడంతో భార్య ఆయన మీద కేసు పెట్టింది. వారిద్దరి రహస్యంగా మాట్లాడుకున్న మాటల్ని చిలుక పదేపదే వల్లే వేయడంతో వారిపై తనకు అనుమానం కలిగినట్టు హవాల్లి పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనను మోసం చేస్తున్నాడని తనకు చాలాకాలంగా అనుమానంగా ఉందని, చిలుక మాటలతో ఈ అనుమానం నిజమైందని తెలిపింది. తాను ఆఫీసు నుంచి త్వరగా వస్తే భర్త ఆశ్చర్యపోతున్నాడని, కుంగిపోయి కనిపిస్తున్నాడని ఆమె పేర్కొంది. అయితే, చిలుక చెప్పిన విషయాల ఆధారంగా కేసు నమోదుచేయలేమని పోలీసులు అంటున్నారు. టీవీలో రాసలీలల దృశ్యాలు చూసి.. ఆ మాటల్ని చిలుక వల్లేవేస్తూ ఉండవచ్చునని, చిలుక మాటల ఆధారంగా నేరాన్ని నిరూపించడం కష్టమని పోలీసులు అంటున్నారని అరబ్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో అక్రమ సంబంధం కలిగి ఉండటం నేరం. ఈ నేరం రుజువైతే కఠినమైన జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. -
రామ్మా.. సమంత..!
రామ్మ చిలకమ్మా... ఐశ్యర్యారాయ్.. ప్రీతీజింటా.. సమంతా.. కాజల్.. ప్రియాంకచోప్రా... బయటకి రావమ్మా... అయ్యగారు వచ్చారు... నీకు కానుకలు తెచ్చారు.. దీంతో నువ్వు పండ్లు కొనుక్కోవచ్చు... నేను మందు కొనుక్కోవచ్చు.. అయ్యగారి అదృష్టాన్ని.. కీర్తిని.. హోదాని బయటకి తీయవమ్మ.. లక్ష్మీతల్లి వరించాలా.. సరస్వతమ్మ కరుణించాలా.. బెజవాడ కనకదుర్గా.. శ్రీశైలం మల్లన్న.. తిరుపతి వెంకన్నా.. నిన్ను కరుణించుగాక.. చిరంజీవి.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ప్రభాస్.. అందరూ రండి.. అందరూ కలిసొచ్చి అయ్యగారి కార్డు తీయడానికి మా సమంత(చిలక)కు సహకరించండి.. అయ్యగారూ.. యాభై రూపాయలు అక్కడ పెట్టండి.. సమంత రావమ్మ.. నీకు కానుకలు వచ్చాయి.. అయ్యగారు చక్కగా.. బలంగా ఉన్నారు.. అయ్యగారికి తగ్గట్టు మంచి కార్డు తీయమ్మ... అయ్యగారికి ఈసారి దశ తిరిగిపోవాలి.. ఇలా చిలకజోస్యులు పుష్కరాల్లో సందడి చేస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద చిలకజోస్యం చేప్పించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకుని వస్తున్న వారిని చిలక జ్యోతిస్యులు ‘ఒక్క చిన్నమాట..’ అని పిలిచి కూర్చోబెడుతున్నారు. ‘మా సమంత చెప్పింది జరగాల.. జరిగాక అయ్యగారు, అమ్మగారు మెచ్చాలా..’ అంటూ భక్తులను ఆకర్షిస్తున్నారు. చిలకలకు సినీతారల పేరు పెట్టుకుని తమ మాటలతో భక్తులను అలరిస్తున్నారు. మారిన చిత్రాలు కాలంతోపాటు చిలకజోస్యంలో కూడా మార్పులు వచ్చాయి. గతంలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు ఉన్న ఫొటోలను చిలుకలతో తీయించి జోస్యం చెప్పేవారు. మారిన ట్రెండ్ ప్రకారం దేవతల స్థానంలో సినీనటుల ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. చిలక తీసిన ఫొటోలను బట్టి వచ్చినవారి హావభావాలకు అనుగుణంగా జోస్యం చెబుతున్నారు. - విజయవాడ(గుణదల) -
బాగా చూడమ్మా.. అక్కడ ఏం రాసుందమ్మా..!
పుష్కరస్నానం అచరించిన భక్తులు తమ భవిష్యత్ తెలుసుకోవలనే ఉత్సుకతతో చిలకజోస్యం చెప్పించుకోవటానికి కొంత మంది భక్తులు అసక్తి చూసుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే స్థానిక సాయిబాబా మందిరం రోడ్డులో చిలకజోస్యం చెప్పెవారందరూ ఉండటంతో అక్కడ భక్తులు అధిక సంఖ్యలో చిలకజోస్యం చెప్పించుకుంటున్నారు. - అమరావతి -
మర్డర్ కేసులో చిలుక సాక్ష్యం!!
మిచిగన్ః పసి పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చిలకపలుకులు అంటాం. అటువంటిది నిజంగా ఆ చిలకే పలికితే ఎంత అద్భుతంగా ఫీలవుతాం. దానికి వచ్చీ రాని మాటలను దాంతో మళ్ళీ మళ్ళీ చెప్పించి ఎంజాయ్ చేస్తాం. అయితే అమెరికాలోని ఓ గడసరి చిలుక.. తన పలుకులతో ఏకంగా ఓ మర్డరిస్టును గుర్తించేట్లు చేసిందట. ఓ మహిళ తన భర్తను హత్య చేసిన కేసులో.. చంపిన వ్యక్తిని గుర్తించిన చిలుక.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా మిచిగన్ సౌండ్ లేక్ ప్రాంతంలో గత మే నెల్లో జరిగిన ఓ హత్య కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. 48 ఏళ్ళ గ్లెన్నా దురాన్ ఆమె భర్త మారిటిన్ దురాన్ ను హత్యచేసినట్లుగా నమోదైన కేసులో ఆ పెంపుడు చిలుక ప్రధాన సాక్ష్యం చెప్పింది. మారిటిన్ దురాన్ ను అతడి భార్య గ్లెన్నా దురాన్ తుపాకీతో షూట్ చేసే ముందు వారిద్దరికీ జరిగిన వాగ్వాదాన్ని ఆ చిలుక ఎంతో స్పష్టంగా చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్లెన్నా తన ఇంట్లోనే ఉన్న భర్తపై సుమారు నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు మృతుడికి తగిలిన గాయాలను బట్టి తెలియగా... మారిటిన్ మరణించిన కొద్ది రోజుల తర్వాత బయటపడ్డ ఓ వీడియో లోని చిలుక పలుకులు ఇప్పుడు కేసులో ప్రధాన సాక్ష్యాలయ్యాయి. మారిటిన్ హ్యత్య జరిగిన రోజు గ్లెన్నాను అతడు వారిస్తున్నట్లు, అయినా పట్టించుకోకుండా షూట్ చేసినట్లు చిలుక మాటలను బట్టి అర్థమౌతోంది. అతడు మరణించినప్పటినుంచీ చిలుక నోట... పదే పదే వెలువడుతున్న మాటలను ఇప్పుడు హత్య కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఆఫ్రికన్ ప్యారెట్.. గెట్ అవుట్, వేర్ విల్ గో, డోంట్ షూట్ అంటూ మార్చి మార్చి పలకడం మారిటిన్ హత్య జరిగిన రోజు భార్యా భర్తలిద్దరి మధ్యా జరిగిన వాగ్వాదంగా విచారణలో గుర్తించే అవకాశం కనిపిస్తోంది. చిలుక పలికన పదాలను అధ్యయనం చేసి, అనంతరం వాటిని విలువైన సాక్ష్యంగా అనుమతిస్తామని నెవాగో ప్రాంత నేర విచారణ అటార్నీ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. ఇదో ఆసక్తికరమైన, వింత విషయమని, ఇప్పుడు తమకు ఆఫ్రికన్ చిలుకల గురించి తెలుసుకునే గొప్ప అవకాశం కూడ వచ్చిందని ఆయనన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమయాల్లో చిలుక సాక్ష్యాన్ని వినియోగించడంపై కూడ పరిశీలిస్తున్నామని, చిలుకల సాక్ష్యాన్ని నమ్మడమా? వాటి మాటలను బట్టి ప్రత్యేక ఆధారాలను సేకరించడమా అన్న విషయాలను పరిశీలిస్తున్నామని రాబర్ట్.. ఓ పత్రికతో తెలిపారు. -
హత్య కేసులో చిలుక సాక్ష్యం!
మిచిగన్: రామచిలుకలు మాట్లాడతాయని విన్నాం. కానీ ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేందుకు కూడా రెడీ అయ్యాయి. అమెరికాలోని మిచిగన్లో ఓ హత్య కేసులో రామచిలుక సాక్షిగా నిలిచిలింది. చిలుక సాక్ష్యంతో కేసును ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. మిచిగన్లోని సాండ్లేక్ పట్టణంలో గత ఏడాది మేలో భర్త మార్టిన్ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెనా డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు బుల్లెట్ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్లెనా డురమ్ తలకు కూడా బుల్లెట్ గాయమైంది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్లెనా డురమ్ ఇంటిలోని పెంపుడు చిలుక మాటలు విని ఆశ్చర్యపోయారు. మార్టిన్ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో చిలుక అరవడం ప్రారంభించింది. ‘ఇంట్లోంచి బయటకు వెళ్లిపో..’, ‘ఎక్కడికి వెళ్లాలి..’ ‘నన్ను కాల్చొద్దు..’ అనే పదాలను చిలుక చెబుతుండటాన్ని పోలీసులు గమనించారు. చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. హత్య కేసులో చిలుక సాక్ష్యంను కోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. అయితే మరోవైపు తన భర్తను హత్య చేయలేదని గ్లెనా డురమ్ వాదిస్తోంది. -
నీలి రంగు చిలుకను ఎప్పుడైనా చూశారా?
వావ్..‘స్పిక్స్ మకావ్’ మీరు ఎన్నో రకాల రామ చిలకలను చూసి ఉంటారు. కానీ నీలి రంగులో ఉన్న చిలుకను ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! నీలి రంగు రామచిలుక దాదాపు 15 ఏళ్ల తరువాత బ్రెజిల్ వాసులకు కనిపించింది. అరుదైన ‘స్పిక్స్ మకావ్’ అనే నీలిరంగు చిలుకలు కనిపించకపోవడంతో ఆ జాతి అంతరించిపోయిందని అక్కడ స్థానికులంతా భావించారు. అయితే బ్రెజిల్లోని బహియా స్టేట్లో చెట్లపైన ఎగురుతూ అనూహ్యంగా కనిపించిన మకావ్ చిలుకను చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది స్థానికులు ఆ చిలుకను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బ్రెజిల్లో అటవీశాఖ అధికారులు ఇటీవల వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు ఈ చిలుకను బంధించి ఉంచిన వేటగాళ్లు చట్టం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు వదిలేసి ఉంటారని భావిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. పోలీస్.. ప్యారట్..! నేరస్తులను ఇంత వరకు జాగిలాలు మాత్రమే పట్టిస్తాయని మనకు తెలుసు. కాని తెలియని విషయం ఏమిటంటే చిలుకలు కూడా నేరస్తులను పట్టిస్తాయి. దీనిపై సందేహం రావొచ్చు. కాని ఇది నిజం. ఈ సంఘటన అమెరికాలోని శాండ్ లేక్లో జరిగింది. 14 నెలలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేసును చిలుక తన పలుకులతో పరిష్కరించింది. మార్లిన్ దురం, గ్లెన్నా దురం శాండ్ లేక్కు చెందిన దంపతులు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన గొడవలో గ్లెన్నా తన భర్త మార్టిన్ను క్షణికావేశంలో తుపాకీతో కాల్చిచంపింది. ‘గ్లెన్నా..నన్ను చంపొద్దు’ అని మార్టిన్ వేడుకున్నాడు. వారి మధ్య జరిగిన చివరి సంభాషణను వారు పెంచుకుంటున్న ఆఫ్రికన్ చిలుక పదే పదే పలుకుతోంది. దాని ఆధారంగా పోలీసులు గ్లెన్నానే హత్య చేసిందనే నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్టు చేశారు. -
శ్రీవారి గర్భాలయంలో రామచిలుక
-
ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..
అనగనగా ఒక రామచిలుక. దాని పేరు హరియాల్. ప్రతిరోజు యజమాని నేర్పే మాటలను అందంగా వల్లెవేస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరొచ్చినా పలకరిస్తుంది. కానీ ఒక బామ్మ కనపడితేమాత్రం తిట్ల దండకం అందుకుంటుంది. మామూలుగా కాదు.. చెవులు తూట్లు పడేందతటి బూతులు తిడుతుంది. అలా నెలలపాటు చిలుక తిట్లను భరించి.. సహనం కోల్పోయిన ఆ వృద్ధురాలు.. మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? చిలుక ఆమెను ఎందుకలా తిడుతోంది? మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. 85 ఏళ్ల జనాబాయి సకార్కర్ అనే వృద్ధురాలు చంద్రపూర్ జిల్లా రాజూరాలో నివసిస్తోంది. ఆమె ఇంటికి కొద్ది దూరంలోని మరో ఇంట్లో సవతి కొడుకు సురేశ్ ఉంటున్నాడు. సురేశ్ ఆ మధ్య ఓ చిలకను కొన్నాడు. అప్పటికే నాలుగైదు పదాలు పలకగల ఆ చిలుకకు బూతులు నేర్పాడు. జనాబాయి ఫొటోను చూపిస్తూ ఆమె కనిపించినప్పుడు బూతులు మాట్లాడేలా చిలుకకు శిక్షణ ఇచ్చాడు. అలా జనాబాయి కనిపించినప్పుడల్లా తిట్లతో ఆమెను అవమానించేది హరియాల్ చిలుక. ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో విబేధాలు తలెత్తడంతో జనాబాయికి, ఆమె సవతి కొడుకు సురేశ్ తో సయోధ్య చెడింది. అప్పటినుంచి ఆమెపై కక్ష గట్టిన సురేశ్ చిలుక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జానాబాయి, సురేశ్లతోపాటు హరియాల్ (చిలుక)ను కూడా స్టేషన్కు పిలిపించారు. అక్కడ సీన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లు జనాబాయిని చూడగానే చిలుక తిట్టడం మొదలుపెట్టాలి. కానీ అప్పుడలా జరగలేదు. పోలీసులను గుర్తుపట్టిందో ఏమోగానీ స్టేషన్లో నోరుమెదపకుండా కూర్చుంది హరియాల్. దీంతో ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ కావాలా? అని తలపట్టుకున్నారు పోలీసులు! సుదీర్ఘ ఆలోచన తర్వాత జనాబాయి మానసిక ఆందోళనలో న్యాయం ఉన్నదని గుర్తించి.. సదరు చిలుకను అటవీశాఖకు అప్పగించారు. సురేశ్, జనాబాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపేశారు. -
చిలుక పలుకులకు కారణం తెలిసింది..
వాషింగ్టన్: 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన చెప్పిన మాదిరి పక్షుల్లో కూడా చిలుకలది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మిగిలిన పక్షులకు వేటికీ లేనిదీ, చిలుకలకు మాత్రమే సొంతమైన సామర్థ్యం మాట్లాడగలగడం. వీటికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో వాషింగ్టన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. చిలుకల మెదడులో ఉండే ప్రత్యేకమైన అసమాంతర నిర్మాణాలే మనుషులు చేసే శబ్దాలను అవి అనుకరించడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన పక్షుల్లో వేటికీ ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు లేవని తెలిపారు. వీటిపై గత 34 ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నా ఈ ప్రత్యేక నిర్మాణాలను ఇప్పటి వరకూ గుర్తించలేదని అన్నారు. విన్న శబ్దాలను అనుకరించడానికి సాయపడే ప్రత్యేకమైన కర్పరాలు కూడా చిలుకల్లో ఉన్నట్టు గుర్తించారు. హమ్మింగ్ బర్డ్ వంటి కొన్ని రకాల జాతుల పక్షుల్లోనూ ఇలాంటి కర్పరాలు ఉన్నా.. వాటి పరిమాణం చిలుకల్లో పెద్దగా ఉన్నట్టు నిర్ధారించారు. అందువల్లనే మానవులు చెప్పే మాటలను ముద్దు ముద్దుగా పలకడం వీటికి మాత్రమే సాధ్యమైందని వివరించారు. అయితే వీటి మెదడులో ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు వీటి జాతి ఆవిర్భవించినప్పటి నుంచీ ఉన్నాయా.. లేక కాలక్రమేణా ఉద్భవించాయా.. అనే కోణంలో కూడా శాస్త్రవేత్తలు పరిశోధించారు. వీటికి ఈ ప్రత్యేకతలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయని ధ్రువీకరించారు. -
ఈ పక్షికి డెబ్బై యేళ్లు
-
చిలుక.. చిన్నది..
ఆ.. ఏముంది.. ఎప్పుడూ చూసే చిలుక ఫొటోనే కదా అని అనుకుంటున్నారా? ఒకసారి ఈ ఫొటోను పరీక్షగా చూడండి.. చిలుకలో దాగున్న చిన్నది మీకు కనిపిస్తుంది. అదే బాడీ ఆర్ట్ పెయింటింగ్ గొప్పతనం. ఈ చిన్నదాన్ని చిలుకగా మార్చిన ఘనత ఇటలీకి చెందిన జానస్ స్టౌటర్ది. -
పేరట్ @ః 25 నాటౌట్
రాజమండ్రి కార్పొరేషన్ : సమాజంలో చిలుక జోస్యాన్ని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ, ఈ చిత్రంలో కనిపించే చిలుక ఎవరికీ జోస్యం చెప్పకపోయినా..దాని ఆయుష్షు ఏ జోస్యానికీ అందనంత దీర్ఘంగా ఉండి అందరినీ ఆశ్చర్యృచకితులను చేస్తోంది. సాధారణంగా రామచిలుకల జీవితకాలం గరిష్టంగా అయిదేళ్లు కాగా దీని వయసు ఇప్పటికే అంతకు నాలుగురెట్లు ఎక్కువ. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్లో ఆంధ్రాబ్యాంకు ఏటీఎం పక్కన ఉన్న లక్ష్మణ్జీ ఇంటిలో పెరుగుతున్న ఈ చిలుకకు 12 ఏళ్ల వయసుండగా దీన్ని, మరో చిలుకనూ బెంగళూరులోని బంధువుల ఇంటి నుంచి తెచ్చారు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే మరో చిలుక మరణించింది. అప్పటి నుంచీ లక్ష్మణ్జీ కుటుంబం దీన్ని శ్రద్ధగా సాకనారంభించారు. అన్ని చిలుకల్లాగానే జామ కాయలంటే పడిచచ్చే ఈ చిలుక వేరుశనగలు, మొక్కజొన్నలు కూడా దండిగా తింటుంది. కరకరలాడే జంతికలు, ఘుమఘుమలాడే కాఫీ దీని ఫేవరెట్ డిష్లు. గతంలో దానికి కాఫీ పుష్కలంగా ఇచ్చినా ప్రస్తుతం పెరిగిన వయసును దృష్టిలో పెట్టుకుని రేషన్ విధించారు. ఎంతో చనువుగా యజమానుల భుజాలపై వాలిపోయే ఈ చిలుక కొత్తవారు కనబడగానే.. వారి రాకను చాటుతూ ఒకటే పనిగా అరుస్తుంది. ఆదివారం నగరంలోని పశువుల ఆస్పత్రిలో ప్రపంచ జూనోసిస్ డే కార్యక్రమానికి దీన్ని లక్ష్మణ్జీ, ఆయన కుమారుడు రామకృష్ణ తీసుకువచ్చారు. రామ చిలుకల జీవితకాలం కేవలం నాలుగైదేళ్లు మాత్రమే అయి నా ఈ చిలుకను పెంచుతున్న వారు చూపే ప్రేమ, శ్రద్ధతో పాటు జన్యుపరమైన కారణాలు ఇంతకాలం బతకడానికి దోహదపడ్డాయని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు చెప్పారు. వయసు పైబడడం వల్ల కాస్త రంగుమారినా మరో నాలుగైదేళ్లు బతుకుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ పంతం రజనీ శేషసాయి.. కాలాన్ని గెలిచిన ఈ చిలుకను చూసి ముచ్చటపడి కాసేపు దానితో ఆడుకున్నారు. -
యజమాని హంతకుడిని పట్టించిన చిలుక
ఆగ్రా: తన యజమాని భార్యను హత్యచేసిన దుండగుడిని ఒక పెంపుడు చిలుక పట్టించింది. తన యజమానులు నేర్పిన మాటలతోనే.. హంతకుడెవరో చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఒక హిందీ వార్తాపత్రిక ఎడిటర్ విజయ్ శర్మ భార్య నీలంను ఫిబ్రవరి 20న ఎవరో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కూడా. అయితే విజయ్ అల్లుడు అశుతోష్ గోస్వామి ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా.. విజయ్ పెంచుకుంటున్న చిలుక భయంగా అరుస్తూ, విచిత్రంగా ప్రవర్తించసాగింది. విజయ్ ఆ చిలుకకు అంతకుముందే మాటలు నేర్పి ఉండడంతో... అనుమానితుల పేర్లను దాని ముందు పలకడం ప్రారంభించారు. అందులో అశుతోష్ పేరును పలికినప్పుడు ఆ చిలుక... ‘ఉస్నే మారా.. ఉస్నే మారా (అతనే చంపాడు.. అతనే చంపాడు)’ అని అరవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు అశుతోష్ను అదుపులోకి తీసుకుని.. తమదైన పద్ధతిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. రోన్నీ మాసే అనే వ్యక్తితో కలిసి అశుతోష్.. విజయ్ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. డబ్బు, విలువైన వస్తువులు ఇవ్వాలని నీలంను బెదిరించారు. ఒకవేళ తమ పేర్లు బయటికి చెబుతుందేమోనని కత్తితో పొడిచి చంపేశారు. నీలం పెంపుడు కుక్క అరవడంతో దానినీ చంపేశారు. ఈ దృశ్యాన్ని చూసిన చిలుక... బయటపెట్టడంతో దొరికిపోయారు.