Rabri Devi
-
తిరగలి పట్టిన మాజీ సీఎం రబ్రీదేవి
పట్నా: బీహార్లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు. जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024ఇది కూడా చదవండి: ‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు -
అద్వానీది పాకిస్తాన్.. ఇక్కడ సెటిలయ్యారు: మాజీ సీఎం రబ్రీదేవి
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి బీజేపీని టార్గెట్ చేశారు. ‘ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చారు. పాకిస్తాన్-పాకిస్తాన్ అంటున్నారు. అద్వానీ పాకిస్తాన్కు చెందిన వ్యక్తి. అతను భారత్కు వచ్చి స్థిరపడ్డారు. దేశంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని రబ్రీ వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ జిహాదీలు ఇండియా కూటమి నేతలకు మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై రబ్రీ ఎదురుదాడి చేశారు. ‘మోదీ ప్రకటనల మాదిరిగా పరిస్థితులు ఉంటే భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? అంటే ప్రధాని మోదీ విఫలమయ్యారా? దేశంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీహార్లో మహాకూటమి ప్రకంపనలు రేపుతోంది’ అని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని లాంతరు యుగానికి తీసుకెళ్లింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని రబ్రీదేవి కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మిసా భారతి హామీనిచ్చారు.గ్రామాలకు వెళితే కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెడుతున్నారని మిసా భారతి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత పదేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. నిరుద్యోగం పోలేదు అని ఆమె బీజేపీపై మండిపడ్డారు. -
సునీతా కేజ్రీవాల్ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీఎం కేజ్రీవాల్ను జైలుకు ఎందుకు పంపారు?. వారికి( బీజేపీ) ఒక్కటే లక్ష్యం ఉంది..లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్లో జైలులోనే ఉంచటం. దేశ ప్రజలు ఇలాంటి నియంతృత్వానికి గట్టి సమాధానం చెబుతారు’ అని సునీతా కేజ్రీవాల్ అన్నారు. సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజీపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సునీతా కేజ్రీవాల్ను రబ్రీదేవీతో పోల్చారు. ‘రబ్రీదేవి సిద్ధమవుతోంది. గత వారం, పది రోజుల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చెప్పాను. రబ్రీ త్వరలో మనముందుకు వస్తుంది. అంటే నేను అనేది..సునీతా కేజ్రీవాల్ సీఎంగా రాబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఇద్దరు నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్తో కేబినెట్ చర్చలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వమైనా జైలు నుంచి నడపుతారా? ఇక్కడి ప్రభుత్వంలో మాత్రం ముగ్గురు మంత్రులు జైలులో ఉన్నారు. వారు అక్కడే కేబినెట్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ పూరి ఎద్దేవా చేశారు. ఇక.. అవినీతి కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ జైలు వెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయం తెలిసిందే. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
ఈడీ ముందుకు లాలూ కొడుకు
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
Land For Job Scam: ఛార్జిషీట్లో రబ్రి దేవి, మిసా భారతి పేర్లు
ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతీతో సహా తదితరుల పేర్లను చార్జిషీట్లో పేర్కొంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అమిత్ కత్యాల్, మరికొందరు వ్యక్తులు, కంపెనీల పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈరోజు తన మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎమ్ఎల్ఎ) కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. జనవరి 16న విచారణకు కోర్టు జాబితా చేసిందని సమాచారం. ఈ కేసులో కత్యాల్ను గత ఏడాది నవంబర్లో ఈడీ అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించినది ఈ కుంభకోణం. 2004 నుండి 2009 వరకు, భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మంది గ్రూప్ "డి" స్థానాల్లో అక్రమంగా నియమించబడ్డారు. బదులుగా ఆ అభ్యర్థులు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్? -
Land-for-job case: లాలూ కుటుంబానికి ఊరట
న్యూఢిల్లీ: భూమికి ఉద్యోగం కుంభకోణంలో నిందితులుగా ఉన్న నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి తదితరులకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఇటీవల మూత్రపిండమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న లాలూ బుధవారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల ప్రాంగణానికి చేరుకుని జడ్జి ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులూ వెంట వచ్చారు. లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి తదితరులకు ప్రతి ఒక్కరికీ చెరో రూ.50,000 విలువైన వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో పూచీకత్తు సమర్పించాలని సూచిస్తూ అందరికీ బెయిల్ మంజూరుచేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఉత్తర్వులు జారీచేశారు. బెయిల్ కోసం నిందితులు గతంలో పెట్టుకున్న అభ్యర్థనలను కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తోసిపుచ్చలేదు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 29వ తేదీకి వాయిదావేసింది. భారతీయ రైల్వే నియామకాల్లో పేర్కొన్న నిబంధనావళిని తొక్కిపెట్టి తమకు తక్కువ ధరకు భూములు దక్కేలా చేసిన ఉద్యోగార్థులకు వేర్వేరు జోన్లలో తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇప్పించారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదుచేసి సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే. -
rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఇవాళ ఒక్కసారిగా అలజడి రేగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవి ఇంటికి వెళ్లింది. సోమవారం పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనయులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.అయితే.. ఈ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకే వెళ్లినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేగానీ తనిఖీలు, సోదాలు నిర్వహించేందుకు కాదని స్పష్టత ఇచ్చాయి. మరోవైపు ముందు తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారమే అధికారులు ఇంటికి వచ్చారని రబ్రీ దేవి అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ ఉద్దేశ్యాలతో దర్యాప్తు సంస్థలను తప్పుడు దోవలో కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ.. ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖలో రబ్రీ దేవి తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం సంతకం చేశారు. అంతేకాదు.. దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేతల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. సీబీఐ ప్రకారం.. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. 2004-09 మధ్య రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా లాలూ కుటుంబం కారుచౌక ధరలను చెల్లించి భూముల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 2022లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. ఆపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది.మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. అంతేకాదు గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్ను సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. ఇక బీజేపీ దర్యాప్తు సంస్థల బూచీతో బయటపెట్టాలని యత్నిస్తోందని, లాలూ కుటుంబం అలాంటి వాటికి బెదరదని, గత 30 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు తాము ఎదుర్కొంటున్నామని రబ్రీ దేవి తాజాగా ఓ ప్రకటన చేశారు కూడా. -
నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్ కుమార్ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్బంధన్ నాయకుడు నితీష్ కుమార్ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్ కుమార్ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ చిత్రంతో పాటు మహాగత్బంధన్ జిందాబాద్ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్ కిషోర్ యాదవ్ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు. ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్ గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్ విద్యా శాఖ మంత్రి రామ్చరిత మానస్పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం. (చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు) -
జాబ్ ఫర్ ల్యాండ్ కేసు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు(2004-09) రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన కొందరు లాలూకు, ఆయన కుటుంబసభ్యులకు భూమిని తక్కువ ధరకే విక్రయించడం లేదా గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ ఏడాది మేలో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు మిషా భారతి, హేమా యాదవ్లతో పాటు 12మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసం సహా బిహార్, ఢిల్లీలో మొత్తం 17 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. 2021 నుంచి దీనిపై దర్యాప్తు చేస్తోంది. అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే లాలూపై దాడులు చేస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. ఒకప్పుడు రైల్వే శాఖకు వేల కోట్లు లాభాలు తెచ్చిపెట్టి దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాలూను.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్న ఓ గ్రూప్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని లాలూ కుమార్తె రోహిణి యావద్ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
లాలూకు ప్రమాదం.. మెట్లపై నుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నాయి. వీపుపై కుడా గాయమైనట్లు చెప్పాయి. 'లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. రెండు నెలల క్రితమే బెయిల్పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు. లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు. వెంటనే కుటుంసభ్యులు లాలూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భుజం, వీపుపై కాస్త నొప్పి తప్ప.. లాలూకు ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి -
పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj — देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో కలకలం -
లాలూ రాజీనామా వార్తలపై స్పందించిన రబ్రీదేవీ
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ తప్పుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని శుక్రవారం తేల్చిచెప్పారు. లాలూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. లాలూ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ప్రతాప్ యాదవ్ పోటీపడుతున్నట్లు బిహార్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుండె, మూత్రపిండాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. (చదవండి: 'జడ్' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ) -
మళ్లీ జంగిల్ రాజ్ దిశగా బిహార్?
సాక్షి, న్యూఢిల్లీ: అసలు జంగిల్ రాజ్ అంటే ఏంటి..? బిహార్ వెనకబాటుతనానికి జంగిల్రాజ్ కారణమా..? బిహార్లో జంగిల్ రాజ్ అంశం మళ్లీ తెరపైకి రావటానికి కారణం ఏంటి..? బిహార్లో పరిస్థితులు జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరాలు, అవినీతి, శాంతి భద్రతల సమస్యలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్న బిహార్లో మళ్లీ అదే అంశం తెరపైకి వస్తోంది. నేరాల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సాధారణం. అయితే తాజాగా పాలకపక్షంలోని నాయకులే ఇప్పుడు జంగిల్రాజ్ గానం వినిపించడం వివాదానికి కారణంగా మారుతోంది. అసలేంటి జంగిల్ రాజ్..? 1990 నుంచి 2005 వరకు బిహార్ను లాలూ ప్రసాద్–రబ్రీదేవి పాలించిన కాలాన్ని జంగిల్ రాజ్గా రాజకీయవర్గాలు అభివర్ణిస్తుంటాయి. జంగిల్రాజ్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల మధ్య నేరపూరిత సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అంతేగాక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డువచ్చే వారిని బహిరంగంగా బెదిరించడం, హింసాత్మకంగా వ్యవహరించడం ఒక ఫ్యాషన్గా కొనసాగేది. ఆ సమయంలో బిహార్ కిడ్నాప్లకు అడ్డాగా మారింది. రాష్ట్రంలోని వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను పట్టపగలే గ్యాంగ్లు కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బాధితులను నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. గతంలో చేసిన ఒక సర్వే ప్రకారం 1992 నుండి 2004 వరకు బిహార్లో 32,085 కిడ్నాప్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. లాలూ–రబ్రీ హయాంలో రాజకీయ హత్యలు పెద్ద ఎత్తున జరిగాయి. లాలూ అండతో ఆ సమయంలో సివాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాబుద్దీన్పై అనేక హత్యారోపణలు ఉన్నప్పటికీ, లాలూ ప్రసాద్ కారణంగా పోలీసులు కేసులు పెట్టేందుకు భయపడ్డారు. కిడ్నాప్లు, హత్యల నేపథ్యంలో చీకటి పడిన తర్వాత ఇంటి నుంచి బయటి రావాలంటే ప్రజలు వణికిపోయేవారు. బిహార్ పోలీసు గణాంకాల ప్రకారం కేవలం 2001–2005 మధ్య ఐదేళ్ళలో 18,189 హత్యలు జరిగాయంటే 1990 నుంచి 2000 మధ్య కాలంలో జంగిల్ రాజ్లో ఎన్ని హత్యలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదేగాక రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, వాహనం కొన్నా స్థానిక గూండాలకు ‘రంగ్దారీ పన్ను’తప్పని సరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే వారిని గూండాలు హత్య చేసేవారు. అసలు లాలూ–రబ్రీదేవి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరగని నేరం అంటూ ఏదీ లేదు. అయితే లాలూ కుటుంబం అధికార పీఠానికి దూరమైన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఆర్జేడీని ఎదుర్కొనేందుకు జంగిల్ రాజ్ను ఉదహరిస్తూ బీజేపీ, జేడీయూలు ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జంగిల్ రాజ్ పేరు చర్చనీయాంశంగా మారింది. సీతామర్హి బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలోనూ తన నియోజకవర్గం సీతామర్హిలో పెరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, 15 ఏళ్ల క్రితం జంగిల్ రాజ్ రాజ్యమేలిన విధంగా, ప్రస్తుతం బిహార్ జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరస్తులు పోలీసులకు ఏమాత్రం భయపడట్లేదని, ఈ కారణంగా సీతామార్హిలో రోజులో కనీసం మూడు నేర ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని, నేరాలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకొనే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని మిథిలేష్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. సాధారణంగా శాంతిభద్రతలను ఒక సమస్యగా ప్రతిపక్షం మారుస్తోంది. అయితే బిహార్లో స్వపక్షం నుంచే ఈ ప్రకటనలు రావడం రాజకీయంగా నితీష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కేవలం మిథిలేష్ కుమార్ మాత్రమే కాకుండా నేరాలతో పాటు శాంతి భద్రతల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ సహా పలువురు నేతలు నితీష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక నేర నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అవలంభిస్తున్న విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలంటూ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షం, అధికారపార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకులు మాత్రం బిహార్లో జంగిల్ రాజ్ కాదు ఎంతో శాంతియుతంగా న్యాయమైన పాలన జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత 15 ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏనాడూ రాలేదని నితీష్ మంత్రివర్గ సహచరుడు, జేడీయూ నేత అశోక్ చౌదరి వెల్లడించారు. మొత్తానికి బిహార్ అభివృద్ధికి జంగిల్ రాజ్ ఇమేజ్ ఏదో ఒక రూపంలో కచ్చితంగా అడ్డుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బడ్జెట్ సమావేశాలు : ఎలుకతో అసెంబ్లీకి
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష ఆర్జేడీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. శుక్రవారం విపక్ష శాసనసభ్యులు ఎలుకను వెంటపెట్టుకుని సభకు వచ్చారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం కీలక పత్రాలను మాయం చేస్తోందని, వాటిపై ప్రశ్నిస్తే ఎలుకలను సాకుగా చూపుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడిసిన్, లిక్కర్ మాఫియా జరుగుతోందని వాటికి కూడా ఎలుకలనే సాకుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎలుకలను పట్టుకుని వచ్చి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని వివరించారు. -
మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యారాయ్ తండ్రి, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ లాలూ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టేందుకు ఇంటికి బాంబులు పంపించేరేమో అని వియ్యంకుల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐశ్వర్య అత్తింటి నుంచి వచ్చిన వస్తువులను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ క్రమంలో అత్తింటి వారు తనను తీవ్రంగా హింసించి ఇంటి నుంచి గెంటివేశారని ఐశ్వర్యారాయ్ తన అత్త రబ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పెళ్లి సమయంలో తమ కూతురికి ఇచ్చిన ఖరీదైన కానుకలు, వస్తువులు తిరిగి ఇచ్చేయాలంటూ ఐశ్వర్య తల్లి పూర్ణిమా దేవి... వుమన్ హెల్్పలైన్ ద్వారా వియ్యంపురాలు రబ్రీదేవికి నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో లాలూ నివాసం నుంచి రెండు వ్యాన్లు సామాన్లతో గురువారం ఐశ్వర్య పుట్టింటికి చేరుకున్నాయి. అయితే ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ మాత్రం వాటిని అన్లోడ్ చేయనివ్వలేదు. దీంతో రెండు వాహనాలు రాత్రంతా అక్కడే ఉండిపోయాయి.(‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’) ఈ విషయం గురించి చంద్రికా రాయ్ మాట్లాడుతూ... ‘చట్ట ప్రకారం మెజిస్ట్రేట్, పోలీసుల ముందు ఆ సామాన్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలా వాళ్లకు వాళ్లే పంపిస్తే వాటిని నేనెందుకు స్వీకరించాలి. మాకు హాని చేసేందుకు అందులో మద్యం బాటిళ్లు, పేలుడు పదార్థాలు పెట్టారేమో అని లాలూ కుటుంబంపై సందేహం వ్యక్తం చేశారు. ఇక చంద్రికా రాయ్ వ్యాఖ్యలపై లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారమే తాము సామాన్లను వెనక్కి పంపామని.. అయితే చంద్రికా రాయ్ మాత్రం పబ్లిసిటీ కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే వీరి కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తండ్రి చంద్రికా రాయ్తో ఐశ్వర్యా రాయ్(ఫైల్ ఫొటో) -
‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీపై కేసు నమోదైంది. రబ్రీదేవీ తనను హింసించారని ఆరోపిస్తూ.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య... తేజ్కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తేజ్ కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తతో సహా తన అత్త రబ్రీదేవి సైతం తనను వేధింపులకు గురిచేశారని ఐశ్వర్యరాయ్ పోలీసులను ఆశ్రయించారు. తేజ్ప్రతాప్ విడాకులకు పట్టుబట్టడంతో రబ్రీదేవి తనను తీవ్రంగా కొట్టి బయటకు నెట్టివేశారని పేర్కొన్నారు. మెసేజ్ రావడంతో కిందకు వచ్చాను... ‘నేను నా గదిలో టీవీ చూస్తున్న సమయంలో నా ఫోన్కు మెసేజ్ వచ్చింది. నన్ను, నా కుటుంబ సభ్యులను కించపరుస్తూ తేజ్ మద్దతుదారులు పట్నా యూనివర్సిటీ క్యాంపస్లో పోస్టర్లు అతికించారని తెలిసింది. వెంటనే కిందకు దిగి ఈ విషయం గురించి మా అత్తగారిని నిలదీశాను. నా తల్లిదండ్రుల పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాను. వెంటనే తను నన్ను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ.. కిందపడేశారు. తల, మోకాళ్లు, పాదాలపై కర్రతో కొట్టారు. బంగ్లా నుంచి గెంటివేసే ముందు చెప్పులు కూడా తొడుక్కోనివ్వలేదు. నా ఫోన్, ఇతర వస్తువులు లాక్కొన్నారు’ అంటూ సర్కులర్ రోడ్డు నివాసం బయట ఏడుస్తూ ఐశ్వర్య విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి చంద్రికారాయ్ సహా ఇతర కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రబ్రీ దేవిపై కేసు నమోదు చేశారు. ఇక బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. -
'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి'
పాట్నా: ఐదేళ్ల మైనర్ బాలికను దర్భాంగాలో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ మీడియా ముందు మాట్లాడకుండా దాటవేయడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ విమర్శించారు. దర్భాంగా అత్యాచార ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం మహిళల భద్రతపై నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి ఆమె చురకలంటించారు. ట్విటర్ వేదికగా రబ్రీ దేవీ.. 'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి' అనే రీతిలో నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. సిగ్గు లేని, పనికి మాలిన ప్రభుత్వం బిహార్లో రాజ్యమేలుతోందని విమర్శించారు. అనవసరపు విషయాల్లో తలదూర్చి.. ఏదైనా సమస్య తలెత్తగానే పారిపోయే బలహీన, పిరికి ఉప ముఖ్యమంత్రికి.. దర్భాంగా ఘటనతో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీట్లేదని ఎద్దేవా చేశారు. “ये रेपिस्ट बचाओ, रेप बढ़ाओ “वाली नीतीश सरकार है। बेशर्म, नाकारा और धिक्कार। हर मोर्चे पर मैदान छोड़ कर भागने वाला कमजोर असहाय डरपोक उप(चुप)मुख्यमंत्री.. हर वक़्त बात-बेबात बड़बड़ाने वाले के मुँह में शर्म घुस गया। https://t.co/AsDQjO0Loj — Rabri Devi (@RabriDeviRJD) December 7, 2019 వివరాల్లోకి వెళితే.. 5 సంవత్సరాల మైనర్ బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా.. ఆమెను అపహరించి అత్యాచారం చేసిన ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. దుండగుబు ఆమెను తోటలో తీసుకెళ్లి.. లైంగిక దాడి చేసి అక్కడే వదిలేశాడు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఆటో డ్రైవర్గా గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు విచారణ చేపడుతున్నారు. #WATCH Patna: Bihar Deputy Chief Minister Sushil Modi evades question on Darbhanga minor rape case. pic.twitter.com/Yvjlgxbn6K — ANI (@ANI) December 7, 2019 కాగా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ను స్వాగతిస్తున్నామని రబ్రీ దేవీ పేర్కొన్నారు. దిశ కేసులో హైదరాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ నేరస్థులను కొంతమేర కట్టడి చేస్తుందని అన్నారు. బిహార్లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. -
ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు
పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు. రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే. -
తిండి కూడా పెట్టకుండా వేధించారు
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు) మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ, తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు. కాగా 2018, మే నెలలో అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్లో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆమె తండ్రి చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య.. -
నా ఆయుష్షు కూడా పోసుకుని..
పట్నా : ‘ప్రాణ సమానులు, గౌరవనీయులైన శ్రీ లాలూ ప్రసాద్ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్షు కూడా పోసుకుని మీరు కలకాలం వర్ధిల్లాలి’ అని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన భర్త, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాలూతో కలిసి దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ 1948, జూన్ 11న బిహార్లో జన్మించారు. 1973లో రబ్రీదేవిని వివాహమాడిన ఆయనకు.. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించిన లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా, రైల్వే శాఖమంత్రిగా, ఎంపీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్న లాలూ.. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు లాలూ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు బిర్సా ముండా జైలులో లాలూను కలిసినట్లు సమాచారం. प्राणप्रिय आदरणीय श्री @laluprasadrjd जी को 72वें अवतरण दिवस की अनंत बधाईयाँ। आपको हमारी भी उम्र लग जावे। pic.twitter.com/rqwuawj3sx — Rabri Devi (@RabriDeviRJD) June 11, 2019 -
‘మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి’
పట్నా : నూతనంగా ఏర్పాడిన కేంద్ర మంత్రి వర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్ రబ్రీ దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయని.. నితీష్ కుమార్ ఎప్పుడైనా కూటమిలో చేరవచ్చని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ మహాకూటమిలో చేరతానంటే మాకేం అభ్యంతరం లేదు. మేం ఆయనను స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆర్జేడీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రఘువంశ ప్రసాద్ సింగ్ స్వాగతించారు. అయితే నితీష్ ఎప్పుడు ఎవరి వైపు మారతాడో.. ఎవరికి మద్దతిస్తాడో ఊహించలేం అన్నాడు. గతంలో చాలా సార్లు అతను ఇలానే చేశాడని గుర్తు చేసుకున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునే వారికి తాను మద్దతిస్తానని తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. ఎన్డీఏతో చేరిన సంగతి తెలిసిందే. -
లాలూ భార్య సంచలన వ్యాఖ్యలు
పట్నా : సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలును చంపడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకు తన కుమారుడు తేజస్వి యాదవ్ను వెళితే.. అనుమతి నిరాకరించి వెనక్కి పంపిచడం దారుణమన్నారు. లాలూకు ఏదైనా జరిగితే బీహర్, జార్ఖండ్ ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. ‘అలా చేస్తే.. నా కొడుకును సీఎంని చేస్తానన్నాడు’ ‘ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి లాలును చంపేందుకు కుట్ర చేస్తున్నారు. లాలూకు విషం ఇచ్చి చంపాలని చూస్తున్నారు. వాళ్లు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) అనుకుంటే లాలూ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. కానీ నియంతృత్వాన్ని ఇక్కడ పనిచేయనీయం’ అని రబ్రీ దేవి పేర్కొన్నారు. కాగా పశుగ్రాస కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. రాంచీలోని రిమ్స్లో వైద్య చికిత్స పొందుతున్న లాలూ.. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయాలు చక్కబెడుతున్నారు. -
మీడియా ముందుకు రండి.. ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్
పట్నా : తమ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఘటుగా స్పందించారు. లాలు కోరుకుంటే ఎప్పుడైనా తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ఛాలెంజ్ చేశారు. మీడియా ముందు చర్చ జరిగితే ఎవరేంటో..ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరికి ఏం ఆఫర్ ఇచ్చారో ప్రజలకు తెలియజేయవచ్చు అని ట్విట్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజాన్ని కాపాడుతున్నారా అని మండిపడ్డారు. చదవండి...‘ప్రశాంత్ కిశోర్ మా పార్టీని విలీనం చేయమన్నారు’ కాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఆర్జేడీ తిప్పికొట్టింది. ‘పండిత్ జీ.. మీ వయసు మా పార్టీ అధినేత అనుభవమంతా కాదు. మీలాంటి రాజకీయ నాయకులను చాలా మంది వచ్చి వెళ్లారు. మోదీ, నితీష్ల దగ్గరకు వెళ్లి మీ స్టోరీలను అమ్ముకోండి. మేము నిజం బయటపెడితే మీ పరువు, కీర్తి పోతుంది’ అని పార్టీ ట్వీట్ చేసింది. సీఎం నితీశ్ తరఫున ప్రశాంత్ మమ్మల్ని కలిశారని, రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారని రబ్రీ దేవి ఆరోపించారు. ఒక సందర్భంలో తనకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని చెప్పానన్నారు. ప్రశాంత్ కిశోర్.. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్, లాలూతో కలిసి పని చేశారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ సహా ఆరు పార్టీలు జనతా పరివార్గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. నితీశ్ కుమార్ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 81 స్థానాలు, జేడీయూ 70, బీజేపీ 53 స్థానాల్లో గెలిచాయి.అనంతరం ఆర్జేడీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2017లో నితీశ్ కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
‘అలా చేస్తే.. నా కొడుకును సీఎంని చేస్తానన్నాడు’
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహఘట్బంధన్ తరఫున తనను పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన కుమారుడు తేజస్వీని సీఎంని చేస్తానని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం కానీ.. మోదీ కానీ నితీశ్ కుమార్ను పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు సరైన విలువ ఇవ్వలేదు. బీజేపీ బలవంతం మీదనే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారు. కానీ మళ్లీ ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు. అప్పుడాయన ‘2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీని సీఎంగా చూడాలనుకుంటున్నాను. అయితే అందుకు ఒక షరతు.. మహఘట్బంధన్ తరఫున నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2020లో తేజస్వీని సీఎం చేస్తాన’’ని చెప్పాడన్నారు. రబ్రీ దేవి మహఘట్బంధన్ గురించి మాట్లాడుతూ.. ‘మేం 400 స్థానాల్లో విజయం సాధిస్తాం. లాలూజీ ఇక్కడ లేరు కాబట్టి కేవలం 400 సీట్లు మాత్రమే గెలుస్తామని చెప్పగలుగుతున్నాను అన్నారు. అసలు లాలూజీ జైలులో ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. మంజూ వర్మ కేసులో కానీ.. దాణా కుంభకోణం కేసులో కానీ లాలూజీ తప్పేం లేదని స్పష్టం చేశారు. లాలూజీ పేదల గొంతుకగా నిలిచారు. అందుకు ఆయనకు కృతజ్ఞత తెలపాల్సింది పోయి.. కుంభకోణాలు చేశారని జనాలు ఆయనను విమర్శించడం దారుణమన్నారు. -
‘ప్రశాంత్ కిశోర్ మా పార్టీని విలీనం చేయమన్నారు’
పట్నా: తమ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేశారు. ఈ విలీనం ద్వారా లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించవచ్చని ఆయన తెలిపారని కూడా రబ్రీదేవి వెల్లడించారు. ‘సీఎం నితీశ్ తరఫున ప్రశాంత్ మమ్మల్ని కలిశారు. రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారు. ఒక సందర్భంలో నాకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని కోరా’ అని పేర్కొన్నారు. రెండు పార్టీలను కలపాలంటూ నితీశ్కుమార్ చేసిన ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తన వద్దకు తెచ్చారని ఇటీవల తన జీవిత చరిత్ర పుస్తకంలో లాలూ వెల్లడించారు. రబ్రీదేవి వ్యాఖ్యలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జేడీయూలో చేరక మునుపు అనేక పర్యాయాలు లాలూతో భేటీ అయిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, అప్పట్లో తాము చర్చించిన విషయాలను వెల్లడిస్తే ఆయన ఇబ్బందుల్లో పడతారని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. -
‘జరిగింది చాలు.. తిరిగొచ్చేయ్’
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఉద్వేగానికి లోనయ్యారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఉద్దేశిస్తూ.. ‘ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇంటికి వచ్చేయ్’ అంటూ అభ్యర్థించారు. లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. భార్య ఐశ్వర్యతో పొసగడం లేదు.. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జైలులో ఉన్న తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కూడా తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి తేజ్ ప్రతాప్ ఇంటికి వెళ్లకుండా వేరుగా ఉంటున్నాడు. (చదవండి : బాబాయ్ నాకు ఇల్లు కావాలి) ఈ నేపథ్యంలో తొలిసారి రబ్రీ దేవి మీడియా ముందు తన కుమారుని గురించి మాట్లాడారు. ‘నా కొడుకులిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా శత్రువులైన బీజేపీ, జేడీయూ మనుషులు నా కొడుకును తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతం నా భర్త మాతో లేకపోవడం కూడా వారికి బాగా కలసివచ్చింది. మేం కూడా లాలూజీని చాలా మిస్ అవుతున్నాం. ఆయన లేకపోతే ప్రతీది నిరుపయోగమే. ఆయన త్వరలోనే వస్తాడు.. సమస్యలన్ని పరిష్కారమవుతాయ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక తాను ప్రతి రోజు తన కుమారునితో ఫోన్లో మాట్లాడుతున్నానని రబ్రీ దేవి తెలిపారు. -
దోషి భార్య తరపున రబ్రీ ప్రచారం
పట్నా : మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో దోషి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా తేలిన రాజ్వల్లభ్ యాదవ్ భార్య తరపున నవాడా లోక్సభ నియోజకవర్గంలో బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. నవాడాలో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రబ్రీదేవి రాజ్వల్లభ్ యాదవ్ను అక్రమంగా లైంగిక దాడి కేసులో దోషిగా ఇరికించారని, ఆయన భార్య విభాదేవిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాదవుల ప్రతిష్టను దిగజార్చేందుకు పాలకులు రాజ్వల్లభ్ యాదవ్ను కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆయన భార్య విభాదేవిని నవాడా ఓటర్లు గెలిపించాలని కోరారు. గత ఏడాది డిసెంబర్లో పట్నా కోర్టు రాజ్వల్లభ్ యాదవ్ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించింది. పోక్సో చట్టం కింద యాదవ్తో పాటు మరో నలుగురికి మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష విధించింది. నవాడా ఎంఎల్ఏ రాజ్వల్లభ్ యాదవ్ 2016 ఫిభ్రవరి 6న బిహార్ షరీఫ్లోని తన నివాసంలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా చేర్చడంతో యాదవ్ను ఆర్జేడీ అదే ఏడాది ఫిబ్రవరి 14న ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. -
‘విడాకుల యుద్ధం.. భారతం కన్నా పెద్దది’
పట్నా : విడాకుల యుద్ధం మహాభారత యుద్ధం కంటే పెద్దదంటున్నారు బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. తాజాగా విడాకుల విషయంలో తేజ్ ప్రతాప్ వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేల్చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ సందర్భంగా తల్లి రబ్రీ దేవితో విడాకుల గురించి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విడాకుల విషయంలో నేను ఇప్పటికి నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. ఈ నెల 8న విడాకులకు సంబంధించిన లీగల్ అంశాల విచారణ ప్రారంభం అవుతుంది. అయితే ఈ విడాకుల అంశం అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేలా లేదు. విడాకులు పొందడం కోసం మహాభారతం కంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందన్నారు. ‘ఈ విషయంలో మా అమ్మ నాకు పూర్తి మద్దతు తెలుపుతోంది. నా భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో ఇక ఎలాంటి సంబంధం ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఐశ్వర్య కుటుంబంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సందర్భంగా యాదవ కమ్యూనిటీకంతటికి ఒక విషయం విన్న విస్తున్నాను. నాకు, ఐశ్వర్యకు మధ్య ఎలాంటి బంధం ఉందో మీకు నిజంగా తెలీదు. ఈ విషయాల గురించి మీకు తెలిసిన రోజు మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని తెలిపాడు. ఈ ఎన్నికల్లో తాను తన తమ్ముడు తేజస్వి యాదవ్ కోసం పని చేస్తానని తెలపాడు. తేజస్వీనే కాబోయే సీఎం. అతనికి నా ఆశీర్వాదాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. -
తేజస్వీ, రబ్రీ దేవీలకు బెయిల్
న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం రబ్రీదేవి, తేజశ్వి యాదవ్లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన నిందితులందరికీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిలిచ్చింది. నిందితులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రయాణాలు చేయడానికి వీల్లేదని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల లాలూను కోర్టులో హాజరుపరచలేమని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకు సమ్మతించిన కోర్టు, నవంబర్ 19న జరిగే విచారణకు లాలూ తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పూరీలోని ఐఆర్సీటీసీ హోటళ్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
లాలూకు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
-
లాలూకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ మని లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను అక్టోబర్ ఆరులోపు తన ముందు హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందున ఆయనకు ప్రొడక్షన్ వారెంట్ను జారీ చేసింది. సుజాత ప్రైవేటు లిమిటెడ్ హోటల్కు రెండు రైల్వే హోటళ్లను సబ్ లీజ్ను ఇచ్చే విషయంలో లాలూతో సహా అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఈడీ ఆభియోగాలు యోపింది. దీనిపై గతంలో ఈడీ చార్జ్షీట్ను నమోదు చేయగా.. కేసుపై విచారించడానికి తగిన సమయం కావాల్సిందిగా ఈడీని కోర్టు కోరింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్పై పూర్తి విచారణ అనంతరం కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలూకు మరోసారి సమన్లు రావడంతో ఆర్జేడీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
రబ్రీ దేవి, తేజస్వి యాదవ్లకు బెయిల్ మంజూరు
-
రబ్రీ దేవి, తేజస్వి యాదవ్లకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ భూ కుంభకోణం కేసులో బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లకు ఢిల్లీ పటియాలా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్కు సీబీఐ కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన క్రమంలో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ నేడు కోర్టు ఎదుట హాజరు కాలేకపోయారు. ఐఆర్సీటీసీ స్కామ్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ సహా 13 మంది ఇతరులపై ఈడీ తొలి చార్జిషీట్ను దాఖలు చేసింది. చార్జిషీట్లో ఆర్జేడీ నేత , కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, సంస్థ లారా ప్రాజెక్ట్స్ పేర్లనూ ప్రస్తావించింది. పూరి, రాంచీల్లో రెండు రైల్వే హోటళ్లను నిబంధనలకు విరుద్ధంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ మాజీ సీఎం లాలూ, ఐఆర్సీటీసీ అధికారులు విజయ్, వినయ్ కొచ్చర్లకు చెందిన సుజాత హోటల్ ప్రైవేట్ లిమిటెడ్కు కట్టబెట్టారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా లాలూ సన్నిహితుడైన పీసీ గుప్తాకు చెందిన డిలైట్ మార్కెటింగ్ కంపెనీకి మార్కెట్ ధర కన్నా తక్కువ ధరలో విలువైన భూమిని బదలాయించారని పేర్కొన్నాయి. వీటిలో వాటాలు దక్కించుకోవడం ద్వారా అతితక్కువ ధరకే విలువైన భూమిని రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్లు సొంతం చేసుకున్నారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. -
షెల్టర్ షేమ్ : నితీష్ రాజీనామాకు రబ్రీ డిమాండ్
పట్నా : ముజఫర్పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ సీఎం రబ్రీ దేవి డిమాండ్ చేశారు. నితీష్ సీఎం పదవిలో కొనసాగినంత కాలం నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీబీఐ ప్రస్తుతం కేసును విచారిస్తున్నా ఇంతవరకూ పెద్ద తలకాయలు ఎవరూ పట్టుబడలేదని, నితీష్ అధికారంలో ఉంటే కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగుచూడవని తాము భావిస్తున్నామన్నారు. ముజఫర్పూర్ దారుణ ఘటనలో జేడీయూ, బీజేపీ నేతల హస్తం ఉందని నితీష్ అంతరాత్మకు తెలుసని రబ్రీ దేవి ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ నిష్పాక్షిక విచారణపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ముజఫర్పూర్ ఘటన బిహార్తో పాటు నితీష్ ప్రతిష్టను మంటగలిపిందని అన్నారు. మహిళలు, బాలికలకు బిహార్ సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘రబ్రీదేవి నీ కొడుకు జాగ్రత్త’
పట్నా : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ ఛీప్ లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవికి జేడీయూ మహిళా విభాగం నేతలు బహిరంగ లేఖ రాశారు. రబ్రీదేవి నీ కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రవర్తన సరిగ్గా లేదు జాగ్రత్త అంటూ లేఖలో పేర్కొన్నారు. ముజఫర్పూర్ ఘటనకు నిరసనగా శనివారం తేజస్వీ యాదవ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నా అనంతరం జేడీయూకి చెందిన అంజుం ఆరా, శ్వేతా విశ్వాస్, భారతీ మెహతాలు రబ్రీదేవికి లేఖ రాశారు. ‘మీ కొడుకు, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ ప్రవర్తన సరిగ్గా లేదు. తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. తేజస్వీ పీఏగా పనిచేస్తున్న మణిప్రకాశ్ మంచి వాడు కాదు. అతను మహిళల అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వారిని మీరు పీఏగా ఎలా నియమించుకుంటారు. అతని మార్గదర్శకత్వంలో తేజస్వీ పక్కదారి పడుతున్నాడు. ఒక మహిళగా మీరు ఆలోచించడండి. మీ కొడుకులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో మీరు విఫలమయ్యారు. ఇప్పటికైన మించింది ఏంలేదు. త్వరగా మేల్కోని మీ కొడుకుని కాపాడుకొండి’ అంటూ ఘాటుగా రాశారు. కాగా ముజఫర్ఘటనపై తేజస్వీ యాదవ్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష వేయాలని, నితీష్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని తేజస్వీ విమరిస్తున్నారు. -
కోడలు వచ్చిన వేళా విశేషం..
పట్నా : కొత్త కోడలు ఐశ్వర్య రాయ్పై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్ల వివాహం శనివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఈ పెళ్లి కోసం మూడు రోజుల పెరోలుపై బయటకు వచ్చారు. సోమవారం కొత్త దంపతులతో కలసి విష్ణు ఆలయానకి వెళ్లిన రబ్రీదేవి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా రబ్రీదేవిని మీడియా ప్రతినిధులు కోడలి గురించి ప్రశ్నించగా ఆమె చాలా ఆనందం వ్యక్తం చేశారు. రబ్రీదేవి మాట్లాడుతూ.. ‘నా కోడలు చాలా అదృష్టవంతురాలు. ఐశ్వర్య మా ఇంటి లక్ష్మీ.. ఆమె రాకతో మా కుటుంబంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఒక శుభ శకునం’ అని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకి ఆరు వారాల తాత్కాలిక బెయిల్ లభించడం.. గత నెలలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రబ్రీదేవి తాజాగా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆమె ఇలా స్పందించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సోమవారం పెరోల్ గడువు ముగియడంతో లాలూ రాంచీ జైలుకు వెళ్లిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా లాలూకు లభించిన బెయిల్ మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో లాలూ ఈ రోజు సాయంత్రం పట్నాకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి వేడుకలో స్టెప్పులేసిన మాజీ సీఎం
-
సంపన్న ఎమ్మెల్సీగా మాజీ సీఎం
పట్నా: ఇటీవల బిహార్ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన 11 మంది నేతల్లో తొమ్మిది మంది కోటీశ్వరులు కాగా, సీఎం నితీష్ కుమార్ సహా 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. అత్యంత ధనిక ఎమ్మెల్సీగా 17.92 కోట్ల రూపాయాల ఆస్తులతో మాజీ సీఎం, ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి నిలిచారు. జేడీయూ నేత రామేశ్వర్ మహతో 15.21 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్వయంగా నేతలు సమర్పించిన అఫిడవిట్ల సమాచారంతో ఏడీఆర్ ఈ రిపోర్టు తయారు చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్సీల సగటు ఆస్తుల విలువ 10.07 కోట్లుండగా, జేడీయూ ఎమ్మెల్సీల ఆస్తులు 7.34 కోట్ల రూపాయలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్సీల సగటు ఆస్తులు రూ.1.95 కోట్లు ఉన్నాయి. ఎమ్మెల్సీల్లో సీఎం నితీష్, ఆర్జేడీ నేతలు రామచంద్ర పర్బీ, రబ్రీదేవి, హెఏఎం-ఎస్కు చెందిన నేత సంతోష్ కుమార్ సుమన్లు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. 9 మంది ఎమ్మెల్సీలు విద్యార్హత డిగ్రీ పాసైనట్లు తెలిపారని, ఇద్దరు ఇంటర్లోపు విద్యార్హత కలిగి ఉన్నారు. -
మండలి సభ్యులుగా ఎన్నికైన నితీష్, రబ్రీ
సాక్షి, పాట్నా : బిహార్ శాసన మండలి ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, హోంమంత్రి మంగళ్ పాండే, మాజీ సీఎం రబ్రీదేవి సహా పలువురు ప్రముఖులు పోటీలేకుండా ఎన్నికయ్యారు. మొత్తం 11 స్ధానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులంతా పోటీ లేకుండా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే అభ్యర్థి ప్రేమ్చంద్ మిశ్రాను బరిలో దింపగా, బీజేపీ తరపున సంజయ్ పాశ్వాన్, సుశీల్ కుమార్ మోదీ, మంగళ్ పాండేలు పోటీలో నిలిచారు. జేడీ(యూ) నుంచి నితీష్ కుమార్, రామేశ్వర్ మహతో, ఖలీద్ అన్వర్ పోటీ చేశారు. ఆర్జేడీడీ నుంచి రబ్రీదేవి, రామచంద్ర పుర్వే, సయ్యద్ ఖుర్షీద్ మెహసీన్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీ బరిలో నిలిచారు. ముఖ్యమంత్రిగా మూడోసారి నితీష్ కుమార్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. బిహార్లో మండలి సభ్యుడిగా సీఎం పదవికి ఎంపికైన తొలినేత నితీష్ కుమార్ కావడం గమనార్హం. ఎన్నికైన ఎమ్మెల్సీల్లో సంజయ్ పాశ్వాన్, ప్రేమ్చంద్ మిశ్రా, రామేశ్వర్ మహతో, ఖలీద్ అన్వర్, సయ్యద్ ఖుర్షీద్ మొహసీన్, సంతోష్ కుమార్ సుమన్ కొత్త ముఖాలు. -
నన్నూ..నా కుటుంబాన్ని ఏం చేస్తారో..?
సాక్షి, పాట్నా : తననూ తన కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి ఆరోపించారు. పాట్నాలో తన నివాసం వద్ద పహారా కాసే 32 మంది మిలటరీ జవాన్లను బిహార్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రబ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన నివాసం వద్ద సెక్యూరిటీని మంగళవారం ఉపసంహరించిన ప్రభుత్వం తిరిగి రాత్రి 9 గంటల సమయంలో పునరుద్ధరిచింది.. ఇది తననూ, తన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇది నితీష్ కుమార్, సుశీల్ మోదీ, బిహార్ ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. లాలూజీని జైల్లో పెట్టి నిత్యం వేధిస్తున్నారు..ఆయన వ్యాధులతో మరణిస్తారో..లేక మందులతో చంపేస్తారో తనకు అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. లాలూ చక్కెర స్ధాయిలు పెరుగుతున్నాయని..ఈ ప్రభుత్వాన్ని తాను నమ్మే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు రబ్రీదేవికి భద్రతను ఉపసంహరించినందుకు నిరసనగా ఆమె కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్తో కలిసి తమకు కల్పించిన భద్రతను వదులుకున్న విషయం తెలిసిందే. -
రైల్వే టెండర్ కేసు: లాలూకు మరో షాక్
సాక్షి, పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలుకు రైల్వూ టెండర్ కేసులో మరో షాక్ తగిలింది. మాజీ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలూ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. పట్నాలోని ఆమె నివాసంలో మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించింది. దీంతోపాటు లాలు కుమారుడు తేజ్విని దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించినట్టు సమాచారం. నగరంలో దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వమించిన సీబీఐ కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రైల్వే హోటల్స్(ఐఆర్సీటీసీ) టెండర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ అనే రెండు ఐఆర్సీటీసీ హోటళ్ళను సుజాత హోటల్కు చట్ట విరుద్ధంగా కట్టబెట్టినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్ యాజమాన్యంలో సుజాత హోటల్ నడుస్తోంది. లాలూ రైల్వేమంత్రిగా ఉన్న 2004-09 మధ్య కాలంలో ఈ హోటళ్ళను కొచ్చర్లకు కట్టబెట్టడానికి తన పదవిని దుర్వినియోగపరచినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్ పేర్లతో పాటు ఐఆర్సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, పీకే గోయల్, లాలు సన్నిహితులైన ప్రేమ్ చంద్ గుప్తా భార్య సరళ గుప్తా , డిలైట్మార్కెటింగ్ అధిపతి పేర్లను కూడా సీబీఐ కేసులో చేర్చింది. లాలూపై సీబీఐ ఛార్జిషీటు 2017 జూలై 7న నమోదైంది. ఈ హోటళ్ళను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా అత్యంత విలువైన భూమిని లాలూ స్వీకరించారని తెలిపింది. డిలైట్ మార్కెటింగ్ (లారా ప్రాజెక్ట్స్) కంపెనీ అనే బినామీ కంపెనీ పేరుతో ఈ భూమిని స్వీకరించినట్లు ఆరోపించింది. కాగా దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ జైల్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
మోదీ గొంతు కోయడానికి సిద్ధంగా ఉన్నారు
పాట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లలూప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నవారిని వేలు నరుకుతామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రబ్రీ ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొంతు కోసేందుకు, ఆయన చేయి నరికేందుకు చాలా మంది బిహారీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారందరినీ బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. -
ఆర్జేడీ అధినేతకు మరోసారి భారీ ఎదురుదెబ్బ
లాలూ, భార్య రబ్రీదేవి, కుమారుడు, మరో వ్యక్తిపై సీబీఐ కేసు బిహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతనెలలోనే మనీలాండరింగ్ కేసులో ఆయన కుటుంబంపై ఆదాయపు పన్నుశాఖ బినామీ లావాదేవీల చట్టాన్ని ప్రయోగించగా.. తాజాగా నేడు(శుక్రవారం) హోటళ్ల టెండర్ల వ్యవహారంలో లాలూతో పాటు మరో ముగ్గురిపై సీబీఐ కేసు నమోదుచేసింది. 2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పురి ప్రాంతాల్లో హోటళ్ల టెండర్ల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏజెన్సీ రిపోర్టులు నివేదించాయి. ఈ కేసు నమోదుచేసిన వారిలో ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. అంతేకాక ఆయన నివాసంలో ఈ ఉదయం సీబీఐ తనిఖీలు కూడా చేపట్టింది. ఢిల్లీ, పాట్నా, రాంచీ, పురి, గురుగ్రామ్తో సహా 12 ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు కూడా చేస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అంటే 12 ఏళ్ల క్రితం రైల్వేకు చెందిన రెండు హోటళ్లను ప్రైవేట్ హాస్పిటాలిటీ గ్రూప్కు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఈ విషయంపై సీబీఐ విచారణ కూడా చేపడుతోంది. హోటళ్లను ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావం బిహార్ ప్రభుత్వంపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమితో బిహార్లో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో నితీష్ కుమార్, లాలూతో తెగదెంపులు చేసుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. -
ఆర్జేడీ అధినేతకు భారీ ఎదురుదెబ్బ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన భార్య రబ్రీ దేవీ, కూతరు మిశా భారతి, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లకు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. వీరి బినామీ ఆస్తులను సీజ్ చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులకు అటాచ్ మెంట్ నోటీసులు పంపింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసు జారీచేసింది. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ రూ.170-రూ.180 కోట్ల వరకు ఉండొచ్చని పన్ను అధికారులు అంచనావేస్తున్నారు. ఈ అటాచ్ మెంట్లలో పాట్నాలో ఫుల్వారీ షరీఫ్ లో ఉన్న తొమ్మిది ప్లాట్స్ ఉన్నాయి. ఇవే ఆస్తులను మే నెలలో కూడా డిపార్ట్ మెంట్ సీజ్ చేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు లాలూ కుటుంబీకుల పేరున ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారంతా ఆదాయపన్ను కూడా ఎగ్గొట్టారన్న విమర్శలు వచ్చాయి. లాలూతో పాటు ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అక్రమంగా భూ ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బీజేపీ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మే నెలలో దాడులు జరిపారు. విచారణలో భాగంగా ఐటీ డిపార్ట్ మెంట్ ఢిల్లీ విచారణ వింగ్ ముందు హాజరుకావాలని రెండు సార్లు లాలూ ప్రసాద్ కూతురికి, ఆయన భర్తకు సమన్లు జారీచేసింది. కానీ వాటిని వారు ధిక్కరించారు. ఐటీ సమన్లను ధిక్కరించినందుకు మిశాభారతికి 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు. -
‘సినిమాలకు, మాల్స్కు వెళ్లే కోడలొద్దు’
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి...కోడలు కోసం వెతుకులాటలో బిజీబిజీగా ఉన్నారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కు సరిజోడిగా సంప్రదాయబద్ధమైన వధువు కోసం లాలూ దంపతులు సంబంధాలు చూస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి కట్నకానుకలు లేకుండా హోమ్లీగా ఉండి, తమతో చక్కగా కలిసిపోయే అమ్మాయి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. లాలూ పుట్టినరోజు సందర్భంగా రబ్రీదేవీతో కొడుకు పెళ్లి గురించి పలువురు విలేకర్లు అడగగా, తమకు పద్ధతైన, ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయి కోడలుగా కావాలే కానీ, సినిమాలకు, షాపింగ్ మాల్స్ కు తిరిగే అమ్మాయిలు వద్దని అన్నారు. తాము చాలా సంబంధాలు చూసామని, అలాగే చాలా పెళ్లి ప్రదిపాదనలు వచ్చినట్లు తెలిపారు. అయితే తేజ్ ప్రతాప్ కు సరైన జోడీ ఇంకా దొరకలేదన్నారు. ఇదే విషయంపై లాలూ మాట్లాడుతూ ..తమ ఇంటికి వచ్చే కోడలు..దేశంలోని ఏ ప్రాంతంవారైనా కావచ్చని, అంతేకాకుండా తాము పైసా కట్నం తీసుకోమని ఆయన తెలిపారు. అయితే ఓ ఆవుకు మాత్రం మినహాయింపు ఉందని తెలిపారు. కాగా తన కుమారుడికి కాబోయే భార్యను లాలూ యూపీలోని రాజకీయ కుటుంబం నుంచే ఎంపిక చేయనున్నట్లు సమాచారం. లాలూ ప్రసాద్కు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో తేజ్ ప్రతాప్ర్ ప్రస్తుతం ఆర్యోగ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. లాలూ నాలుగో కుమార్తె రజినీ... ఎస్పీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర యాదవ్ కుమారుడు రాహుల్ యాదవ్ను వివాహం చేసుకున్నారు. అలాగే ఆయన చివరి కుమార్తె రాజ్ లక్ష్మీని యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మనవడు, ఎంపీ తేజ్ ప్రతాప్ సింగ్తో వివాహం జరిపించారు. ఇక లాలూ పెద్ద కుమార్తె మీసా భారతి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. -
ఆ మాజీ సీఎం.. అవినీతిమయం: మోదీ
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ భార్య రబ్రీదేవి అవినీతి పురాణాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ బయటపెట్టారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాటి మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ, మాజీ మంత్రి సుధా శ్రీవాస్తవలకు కేటాయించిన విలువైన భూమిని కారు చవగ్గా లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధిఖీ, సుధా శ్రీవాస్తవలకు ఎమ్మెల్యే కోఆపరేటివ్ సొసైటీ కేటాయించిన భూమిని ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి లాక్కున్నారని ఓ ప్రకటనలో చెప్పారు. 1992-93లో ఎమ్మెల్యేల సహకార సంఘం 5.59 డెసిమల్ భూమిని వారిద్దరికీ రూ. 37వేల వంతున కేటాయించగా, పదేళ్ల తర్వాత కూడా రబ్రీదేవి వారి నుంచి అదే ధరకు భూమి తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలిఆపరు. రబ్రీదేవి 1997 నుంచి 2005 వరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్జేడీ నేతలు రఘునాథ్ ఝా, కాంతి సింగ్ లాంటి వాళ్లు తేజస్వి, తేజ్ప్రతాప్ యాదవ్లకు తమ విలువైన భూములను చవగ్గా ఇచ్చినట్లే.. అప్పట్లో రబ్రీదేవికి కూడా వాళ్లిద్దరూ నామమాత్రపు ధరలకు ఎందుకు ఇచ్చారని సుశీల్ మోదీ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల సహకార సంఘం చైర్మన్ జయప్రకాష్ నారాయణ్, కార్యదర్శి భోలా యాదవ్ ఇద్దరూ లాలు ప్రసాద్ సన్నిహిత సహచరులేనని, వాళ్లు తాము భూములు కేటాయించిన వారి జాబితాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. -
మా అబ్బాయి సీఎం అవుతాడని చెప్పలేదు
పట్నా: బిహార్ ప్రజలు కోరుకుంటే తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన మాజీ సీఎం రబ్రీదేవి యూ టర్న్ తీసుకున్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదని, ముఖ్యమంత్రి పదవిలో నితీష్ కుమార్ పూర్తికాలం కొనసాగుతారని చెప్పారు. బిహార్లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు జేడీయూ నేత నితీష్ సీఎం అయ్యారు. గురువారం రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ సీఎం కావాలని ఆర్జేడీ ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. దీనిపై విమర్శలు వచ్చాయి. రబ్రీదేవి పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె మాట మార్చారు. గత ఫిబ్రవరిలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూడా తన కొడుకు తేజస్వి భవిష్యత్లో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యలు చేసి తర్వాత మాట మార్చారు. బిహార్ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటని, 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రులుగా లాలు, ఆయన భార్య రబ్రీ దేవి పనిచేశారు. ప్రస్తుతం వీరి చిన్న కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎంగా, మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. -
‘అంత బాధేస్తే నితీశ్కు నీ సోదరినివ్వు’
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీని అనకూడని మాటలు అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవిష్యత్తు గురించి అంత ఆందోళన పడుతున్న సుశీల్ ఆయనను ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని అన్నారు. అది కాకుంటే నితీశ్కు సుశీల్ సోదరి చేయినందించి పెళ్లి చేసుకోని ఆయన ఖ్యాతిని పెంచుకోవచ్చని వివాదాస్పదంగా మాట్లాడారు. బీజేపీలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ జీవితం చాలా అద్భుతంగా ఉందని, ఆయనకు అది ఒక స్వర్ణ యుగం అని, కానీ, ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అంతకుముందు రోజు సుశీల్ కుమార్ మోదీ అన్నారు. ఆ పార్టీలతో స్నేహం గురించి మరోసారి ఆలోచిస్తే మంచిదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తూ నితీశ్ బహిరంగ ప్రకటన చేసిన అనంతరం సుశీల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే లాలూ భార్యను కొందరు మీడియా ప్రతినిధులు కలిసి స్పందన కోరగా సుశీల్కు నితీశ్ ను చూసి అంత బాధనిపిస్తే ఆయన సోదరినిచ్చి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని ఘాటుగా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో పలు విమర్శలకు దారి తీయడంతో తన ఉద్దేశం అది కానే కాదని, మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు. సుశీల్ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని, అతడికి తాను వదినలాంటిదాన్నని, ఆ మాత్రం పరాచికాలు ఆడకూడదా అంటూ వివరణ ఇచ్చారు. -
మా ఆయన వద్ద నల్లధనం లేదు!
నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయడంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ నల్లధనాన్ని దాచి ఉంచారేమో కానీ మా ఆయన లాలూప్రసాద్ వద్ద ఏమాత్రం నల్లధనం లేదు. ఆయనకు వ్యతిరేకంగా 25 ఏళ్లు (దాణా స్కాం) కేసు నడిచింది. కానీ ఆయన వద్ద ఒక్క నయాపైసాను కూడా ఎవరూ కనుగొనలేదు’ అని రబ్రీదేవీ అన్నారు. అదేవిధంగా పెద్దనోట్ల రద్దును బిహార్ సీఎం నితీశ్కుమార్ సమర్థిస్తున్న నేపథ్యంలో బీజేపీ-నితీశ్ పొత్తు పెట్టుకోవచ్చునని వస్తున్న వార్తలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కావాలంటే బిహార్ బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ.. నితీశ్ను తన ఒడిలో కూచోబెట్టుకోవచ్చునని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇవి సరదాకు చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని మీడియాకు తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి అయిన రబ్రీదేవి బిహార్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బిహార్ శాసనమండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిహార్లో నితీశ్కుమార్ జేడీయూ, ఆర్జేడీ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీయూ మళ్లీ బీజేపీ వైపునకు అడుగులు వేస్తున్నదన్న కథనాలు రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతున్నాయి. -
రబ్రీదేవి చెప్పారనే.. ఆర్ఎస్ఎస్ ప్యాంట్లు!
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు ఖాకీ నిక్కర్లు వేసుకుని పెరేడ్ చేసేవారు. తమ కార్యక్రమాలన్నింటికీ సర్సంఘ్ చాలక్ (జాతీయ అధ్యక్షుడు) సహా అందరూ తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు ధరించే వచ్చేవారు. కానీ దసరా నుంచి ఆ పద్ధతి మారింది. అందరూ ఖాకీ ప్యాంట్లు ధరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మారని పద్ధతి.. ఇప్పుడే మారిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. తన భార్య రబ్రీదేవి చెప్పడం వల్లే ఆర్ఎస్ఎస్ వాళ్లు యూనిఫాం మార్చుకున్నారని లాలు అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు పట్టపగలు కూడా సిగ్గు పడకుండా నిక్కర్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని రబ్రీదేవి చెప్పారని.. అందుకే ఇప్పుడు వాళ్లు ప్యాంట్లకు మారారని అన్నారు. దాంతోపాటు.. తాజాగా ఇదే అంశంపై మరో ట్వీట్ కూడా చేశారు. తనదైన కవితాత్మక భాషలో ఆయన ఈ అంశం గురించి ఇలా చెప్పారు. ''ఇప్పడే మేం హాఫ్ ప్యాంట్లను ఫుల్ చేయించుకున్నాం.. మైండ్ కూడా ఫుల్ చేయించుకుంటాం... ప్యాంట్లే కాదు ఆలోచనలు కూడా మార్చుకుంటాం.. ఆయుధాలు పక్కన పెడతాం.. విషయం వ్యాపించనివ్వం'' అని ట్వీట్లో రాశారు. अभी तो हमने हाफ को फुल पेंट करवाया है माइंड को भी फुल करवायेंगे पैंट ही नहीं सोच भी बदलवायेंगे हथियार भी डलवायेंगे जहर नही फ़ैलाने देंगे।। pic.twitter.com/LAIUV6dRYA — Lalu Prasad Yadav (@laluprasadrjd) 11 October 2016 -
మా ఆవిడ వల్లే ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకుంది!
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇటీవల డ్రెస్ కోడ్ మార్చుకోవడం తన భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఘనతేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్ తాజాగా తన డ్రెస్ కోడ్ ను మార్చిన సంగతి తెలిసిందే. మామూలుగా ధరించే ఖాకీ నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టింది. దీని గురించి లాలూ స్పందిస్తూ 'ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకునేలా రబ్రీదేవి చేయగలిగారు' అని ట్వీట్ చేశారు. వారిని ప్యాంట్ల నుంచి మళ్లీ నెక్కర్లలోకి మారుస్తామంటూ ఆరెస్సెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దాదాపు రెండు నెలల కిందట ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ను తన భార్య తప్పుబట్టిందని, దీంతో ఇబ్బందిగా ఫీలైన ఆరెస్సెస్ నాయకత్వం నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టిందని లాలూ తెలిపారు. 'నిక్కర్లు వేసుకొని బహిరంగంగా తిరగడానికి ఆరెస్సెస్ వృద్ధ నేతలు సిగ్గుపడటం లేదా?' అంటూ గత జనవరిలో రబ్రిదేవీ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను బిహార్ బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రబ్రిదేవి 19వ శతాబ్దంనాటి పాతకాలపు మహిళలా మాట్లాడుతున్నారని సుశీల్మోదీ విమర్శించారు. కాగా, గత ఆదివారం నుంచి డ్రెస్కోడ్ మారుస్తున్నట్టు ఆరెస్సెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
-
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
బిహార్ అంటే... అందునా లాలు ప్రసాద్ అంటే కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన ఇద్దరు కొడుకులు రాష్ట్రంలో మంత్రులు. అందులోనూ చిన్నకొడుకు ఉప ముఖ్యమంత్రి కూడా. అయితే, ఇంతకుముందు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన భార్య, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన కూతురు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఎందుకు ఉండాలి అనుకున్నారేమో గానీ.. వాళ్లిద్దరినీ రాజ్యసభకు పంపాలని లాలు నిర్ణయించేశారు. వచ్చే సంవత్సరం బిహార్ నుంచి రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ ఎంపిక చేశారు. రబ్రీదేవికి, మీసా భారతికి రాజ్యసభ సీట్లు ఖాయమని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకోవడంతో ఆర్జేడీ సులభంగా రెండు రాజ్యసభ స్థానాలను పొందుతుంది. ఒక్కో అభ్యర్థికి అసెంబ్లీ నుంచి కేవలం 41 ఓట్లు వస్తే చాలు. అంటే, మిత్రపక్షాలైన జేడీ(యూ) లేదా కాంగ్రెస్ నుంచి ఇద్దరు తమవాళ్లకు ఓట్లేస్తే చాలని లాలు చూస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు 2016 జూలైలో రిటైర్ కానున్నారు. తాను జాతీయస్థాయిలో పనిచేస్తానని, తమ్ముడు నితీష్ బిహార్ను చూసుకుంటాడని లాలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కావాలి గానీ.. తాను ఎటూ ఎన్నిక కాలేడు కాబట్టి భార్యను, కూతురిని పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రబ్రీదేవి ఎటూ మాజీ సీఎం కాబట్టి, ఆమెకు పెద్ద బంగ్లానే వస్తుంది. మీసాభారతి మాత్రం రాజకీయ పదవి పొందడం ఇదే తొలిసారి అవుతుంది. అది కూడా నేరుగా రాజ్యసభకు వెళ్లడం విశేషం. 2014 ఎన్నికల్లో ఆమె పాటలీపుత్ర స్థానం నుంచి లోక్సభకు పోటీ చేసింది. కానీ, అప్పటివరకు లాలుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రామ్ కృపాల్ బీజేపీలోకి వెళ్లి, ఆమెను ఓడించారు. కానీ మీసాభారతిని ఎలాగైనా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న లాలు.. ఇప్పుడు అవకాశం రావడంతో పెద్దల సభకు పంపేస్తున్నారు. -
ఎన్నికల్లో పోటీకి సీఎం, మాజీ సీఎం దూరం!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి.. ఇద్దరూ రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమంటూ స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోవట్లేదని.. పూర్తిగా ప్రచారం మీదే దృష్టి పెడతానని సీఎం నితీష్ కుమార్ చెప్పారు. జేడీ(యూ), ఆర్జేడీ, ఎన్సీపీల కూటమి తరఫున ఉమ్మడి సీఎం అభ్యర్థిగా నితీష్కుమార్ను ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే తాను పోటీ చేయట్లేదని.. ప్రచారాన్ని మాత్రం ముందుండి నడిపిస్తానని అసెంబ్లీ బయట విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఇక బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి కూడా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవట్లేదని సోమవారమే ప్రకటించారు. అయితే తన ఇద్దరు కొడుకులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ మాత్రం పోటీ చేస్తారని ఆమె చెప్పారు. రబ్రీదేవి 1997 నుంచి 2005 వరకు బీహార్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ సంవత్సరం చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
భార్యకు గులాబి పువ్విచ్చిన లాలూ
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఏం చేసినా సంచలనమే. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. నాలుగు నెలల పాటు ఢిల్లీలోనే గడిపి, ఇటీవలే పాట్నాకు తిరిగొచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన.. తన ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా.. తన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి ఓ గులాబిపువ్వు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని టీవీ కెమెరాలు వెంటనే పట్టేశాయి. ఈరోజుల్లో జనమంతా ఇంగ్లీషు క్యాలెండరే ఫాలో అవుతున్నారని, అలాంటప్పుడు వాళ్ల పద్ధతిలోనే తన భార్యకు అభినందనలు చెప్పాలనుకున్నానని ఆయన అన్నారు. -
హేమమాలిని బుగ్గల కంటే నున్నగా...
భారత రాజకీయాల్లో చాలా సున్నితమైన అంశాలను సీరియస్ గా .. సీరియస్ అంశాలను వినోదాత్మకంగా మలచడంలో మన నాయకులకు సాటి ఎవ్వరూ ఉండరు. అయితే సెన్సిటివ్ అంశాలను సీరియస్ గా మార్చడం కొందరు రాజకీయ నాయకులు సాధ్యమైతే.. సీరియస్ అంశాలకు హ్యూమర్ జోడించి తేలిక పర్చడం మరి కొందరికి మాత్రమే సాధ్యం. కాని భారత రాజకీయాల్లో ఈ రెండింటిని సాధ్యం చేసే సత్తా ఉన్న నేత కేవలం రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కే సాధ్యమనడంలో సందేహం అక్కర్లేదు. మీడియా సమావేశం కాని.. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కాని, సమయమేదైనా కాని.. సందర్భం ఎలాంటిదైనా...తన మార్క్ కామెడి.. తనదైన శైలితో ప్రతిపక్ష నేతలపై లాలూ దాడికి దిగడం లాంటి అంశాలు భారత ప్రజలను ఆకర్షిస్తునే ఉన్నాయి. అందుకు ఉదహరణగా ఓ సంఘటన ప్రస్తావించాల్సిందే. బీహార్ రోడ్లన్ని గతుకులమయం అయ్యాయని ఓ విలేకరి ప్రశ్నించిన సందర్భంలో.. బీహార్ రోడ్లన్ని హేమామాలిని బుగ్గల కంటే చాలా నున్నగా ఉన్నాయని ( బీహార్ రోడ్స్ ఆర్ బెటర్ దాన్ హేమామాలిని చీక్స్ ) లాలూ భాయ్ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలతో మీడియా వారికే కాదు.. ప్రజలకు కూడా హాస్యాన్ని పంచడంలో లాలూది ఓ ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. అంతేకాక.. ఓసారి ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోందటగా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. బీహార్ లో ఆలూ ఉన్నంత కాలం.. లాలూ రాజకీయాల్లో ఉంటాడు (జబ్ తక్ బీహార్ మే ఆలూ.. తబ్ తక్ లాలూ) అని చమత్కరించారు. బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ రధ యాత్రను బీహార్ లో అడ్డుకోవడం ద్వారా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ .. ఆతర్వాత ఢిల్లీలో ప్రభావవంతమైన రాజకీయాలను నడిపించడంలో లాలూ పెద్ద పాత్రే పోషించారు. అయితే ఆతర్వాత పశుగ్రాస కుంభకోణం, లెక్కకు మించిన ఆస్తుల్లాంటి కేసు లాలూని వెంటాడంతో ఆయన ప్రభావం క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఆతర్వాత రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో అనూహ్యంగా తన భార్య రబ్రీదేవిని పీఠంపై కూర్చోబెట్టి రాజకీయ నేతలకు గట్టి షాకే ఇచ్చారు. ఆ తర్వాత లాలూ ప్రభావం ఎంతగా పడిపోయిందనే విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తే.. ఓ దశలో సోనియా గాంధీని తనదైన మార్క్ తో రఫ్ ఆడించారు.. కాని అధికారం కోల్పోయిన లాలూ చివరకు సోనియా కనుసన్నళ్లో రాజకీయ జీవితం గడపాల్సి వస్తోంది. బీహార్ లో నితీష్ ప్రభుత్వానికి ఎదురు లేకపోవడం... లాలూ పుంజుకోకపోవడం లాంటి అంశాలు అధికారానికి దూరంగా ఉంచాయి. అయితే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ శతవిధాలా ప్రయత్నిస్తునే ఉన్నారు. ప్రస్తుతం జరుగబోయే.. జరుగుతున్న ఎన్నికలు లాలూకు అగ్నిపరీక్షగానే నిలిచాయి. లాలూ తిరిగి పూర్వ వైభావాన్ని నిలబెట్టుకుంటారా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే అయినా.. కొద్ది రోజులాగితే లాలూ జాతకం ఎంటో స్పష్టమవ్వడం ఖాయమే. లాలూ అధికారాన్ని చేజిక్కించుకుంటారో లేదో..కాని ఆయన మార్క్ రాజకీయాలకు మాత్రం బీహార్ లో ఆలూ ఉన్నంత కాలం ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. -
రబ్రీ ఆస్తులు రూ. 6.5కోట్లు
పాట్నా: పశువులు 65, ఒక డబుల్ బేరల్ తుపాకీ, 50 కాట్రిడ్జులు... ఇవన్నీ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆస్తుల్లో భాగం. తనకు రూ. 6.5కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. బీహార్లోని శరణ్ లోక్సభ నియోజవకర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశమున్న నాలుగు కేసులను ఎదుర్కొంటున్నట్లు, వాటిపై కోర్టులో అభియోగాలు కూడా నమోదైనట్లు ఆమె వెల్లడించారు. తాజా ఆదాయపన్ను రిటర్నుల ప్రకారం రబ్రీదేవి వార్షికాదాయం రూ. 17.15లక్షలుగా ఉంది. లాలూ ఆదాయం రూ. 9లక్షలు. -
రబ్రీదేవికి 65 ఆవులు, ఓ డబుల్ బారెల్ గన్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి 65 ఆవులు, దూడలు ఉన్నాయి. రబ్రీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను తెలియజేశారు. బీహార్లోని సరన్ లోక్సభ నియోజవర్గం నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రబ్రీకి 6.5 కోట్ల రూపాయిల విలువైన ఇతర ఆస్తులున్నాయి. ఆమెకు వాహనాలేమీ లేవు. కాగా డబుల్ బారెల్ గన్, బంగారు ఆభరణాలున్నాయి. ఇక పాట్నాలో అరడజను ఇళ్లు ఉన్నాయి. 2010 బీహార్ ఎన్నికలప్పటి కంటే రబ్రీకున్న ఆవుల సంఖ్య తగ్గింది. అప్పట్లో ఆమెకు 62 ఆవులు, 42 దూడలు ఉన్నట్టు తెలియజేసింది. పాట్నా నగర శివారు ధనాపూర్ వద్ద గల లాలూ పశుక్షేత్రంలో వీటిని సంరక్షిస్తున్నట్టు ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. లాలూ దంపతులకు పశువులంటే ప్రత్యేక ప్రేమ. రబ్రీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు వందకు పైగా ఆవులున్నాయి. 2005 ఎన్నికల్లో ఓటమి అనంతరం అధికారిక నివాసం ఖాలీ చేశాక వీటి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. -
'తమ్ముడైనా..సోదరైనా ఎన్నికల్లో శత్రువే'
పాట్నా: ఎన్నికల బరిలో రక్త సంబంధాలకు స్థానం లేదని ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్పష్టం చేశారు. బీహార్ లోని సరన్ లోకసభ నియోజకవర్గంలో తన తమ్ముడు సాధు యాదవ్ ను రబ్రీదేవి ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ్ముడు, సోదరి అనే సంబధాలు పక్కన పెట్టాల్సిందే అని అన్నారు. తమ్ముడైనా ఎన్నికల్లో శత్రువేనని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల బరిలో తమ్ముడైనా, సోదరైనా ప్రత్యర్ధిగానే పరిగణిస్తానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యర్ధులతో ఎలాంటి ఒప్పందాలు ఉండవని, సరన్ ప్రజలు సాధుకు గుణపాఠం చెబుతారని రబ్రీదేవి అన్నారు. వివాదస్పద సిట్టింగ్ ఎంపీ సాధుయాదవ్ సరన్ స్థానం నుంచి పోటి చేయనున్నట్టు ప్రకటన చేశారు. ఆర్జేడి ప్రచారంలో ఆకర్షణీయమైన నేతగా మారిన కుమారుడు తేజస్వి యాదవ్ తో కలిసి రబ్రీదేవి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన తల్లికి వ్యతిరేకంగా పోటిలో నిలిచి మామ పెద్ద తప్పు చేశారని తేజస్వీ అన్నారు. బావమరిది పోటీలో ఉన్నా గెలుపు రబ్రీదేవిదే అని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. -
అక్కాతమ్ముళ్ల సవాల్
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో బీహార్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. సరాన్ నియోజకవర్గం నుంచి సొంత అక్కాతమ్ముళ్లే పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిపై పోటీ చేయనున్నట్టు ఆమె సోదరుడు మాజీ ఎంపీ సాధు యాదవ్ అలియాస్ అనిరుధ్ ప్రసాద్ యాదవ్ చెప్పారు. సరాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపారేశారు. తన బామ్మర్ది సాధు యాదవ్ ప్రభావం ఎన్నికలపై ఉండదని, రబ్రీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా రబ్రీదేవి ఈ విషయంపై స్పందిచేందుకు నిరాకరించారు. మీపై తమ్ముడే పోటీ చేస్తున్నారు కదా అన్న ప్రశ్నకు.. రబ్రీదేవి నుంచి చిరునవ్వే సమాధానమైంది. సరాన్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. -
లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు
-
లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు
న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చత్పూజను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చత్పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు బీహార్ మాజీ ముఖ్యమంత్రి - లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవీ పాట్నాలో చత్పూజ నిర్వహించారు. సొంత నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పశువుల దాణా స్కామ్లో లాలూ ప్రసాద్యాదవ్ జైలుపాలు కాగా.. అతని ఫ్లెక్సీలను పూజా ప్రాంతంలో ప్రదర్శించారు. -
లాలూ లేకపోవడం చాలా బాధగా ఉంది: రబ్రీ
పవిత్రంగా జరుపుకునే ఛత్ పర్వదినాన లాలూ ప్రసాద్ యాదవ్ తమ మధ్య లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆయన సతీమణి రబ్రీ దేవి అన్నారు. తన నివాసంలో రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఛత్ పండగ రోజున జరిగే కార్యక్రమాలను లాలూ దగ్గరుండి చూసుకునే వారు అని అన్నారు. ఛత్ రోజున కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను, ఇతరుల్లో సంతోషం నింపే వారని గతంలో జరుపుకున్న పండగలను గుర్తు చేసుకున్నారు. ఈ సారి లాలూ లేకపోవడం, మాలో విషాదాన్ని నింపింది అని అన్నారు. ఛత్ పండగ కార్యక్రమాల్లో భాగంగా సూర్య భగవానుడికి కోసం గోధుమలను ఎండపెట్టే కార్యక్రమాన్ని రబ్రీ ప్రారంభించారు. లాలూ జైల్లో ఉన్నప్పటికి.. ఆయన స్పూర్తి తమను నడిపిస్తోంది అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో ప్రస్తుతం రాంచీ జైల్లో లాలూ ప్రసాద్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రజల దృష్టిలో లాలూ ఓ హీరో: రబ్రీదేవి
'ప్రజల దృష్టిలో రాష్టీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో' అని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి రబ్రీ దేవి వ్యాఖ్యానించారు. లోకసభ సభ్యుడిగా అనర్హతతోపాటు, మరో పదకొండు ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా లాలూపై వేటు పడిన నేపథ్యంలో రబ్రీ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల, ప్రజల దృష్టిలో లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజకీయ కుట్రకు తన భర్త బలైపోయాడు అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల పాటు, మరో ఎంపీ జగదీష్ శర్మలకు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ, శర్మలు రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
లోక్సభ ఎన్నికల్లో పోటీచేయను: రబ్రీదేవి
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీచేయబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి చెప్పారు. ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె మీసా భారతి కానీ పోటీ చేసేదిలేదని ఆదివారం స్పష్టం చేశారు. బీహార్లోని సరన్ లోక్సభ నియోజకవర్గానికి లాలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాణా కుంభకోణంలో ఆయనకు జైలు శిక్ష విధించడంతో ఎంపీగా అనర్హత వేటుపడనుంది. ఈ నేపథ్యంలో సరన్ నుంచి రబ్రీదేవి పోటీచేస్తారని వచ్చిన వార్తల్ని ఆమె తోసిపుచ్చారు. లాలూ జైల్లో ఉన్నా ఆర్జేడీకి సారథ్యం కొనసాగిస్తారని రబ్రీదేవి పేర్కొన్నారు. -
లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిసిన రాబ్రీదేవి!
పశుగ్రాస కుంభకోణంలో కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో రాంచీ జైల్లో ఉన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన సతీమణి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం శిక్ష ఖారారు చేయనున్న సంగతి తెలిసిందే. రాంచీ జైల్లో ఉన్న లాలూని కలుసుకోవడానికి ముందు రాబ్రీదేవి.. ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యచరణను, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ స్థానంలో రాబ్రీదేవి పార్టీకి నాయకత్వం వహించాలని ఆ పార్టీ నాయకుడు రాం కృపాల్ యాదవ్ కోరారు. జైల్లో ఉన్న లాలూ సూచనల ప్రకారం పార్టీని పటిష్టం చేద్దామని మరో నేత తెలిపారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూపై గురువారం శిక్ష ఖరారు అయ్యే అవకాశం ఉంది.