-
అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు..
తిరుమల: తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దని టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. - శ్రీవారి సన్నిధిలోని అఖండ దీపం ఆరిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. - కరోనా వైరస్ను కట్టుదిట్టం చేయడానికి తిరుమలకు కూడా భక్తులకు ప్రవేశం లేకుండా రహదారులను మూసివేశారు. - ఆలయంలో శ్రీవారికి జరగాల్సిన ఆగమోక్తమైన కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. - గర్భాలయంలో రెండు అఖండ దీపాలుంటాయి. అవి బయట నుంచి భక్తులకు కనిపించవు. గర్భాలయంలో రెండు నిలువెత్తు వెండి దీపాలు రెండు మూలల్లో ఉంటాయి. ఇవి కాకుండా రెండు నందా దీపాలు స్వామి వారికి ఇరువైపులా వేలాడుతూ కనిపిస్తాయి. ఈ అఖండ దీపాలను ఉదయం సుప్రభాతంలో అర్చకులు బంగారు వాకిలి తలుపులు తెరిచి గర్భాలయ ప్రవేశం చేసినప్పుడు పరిచారకులు వెలిగిస్తారు. - రాత్రి ఏకాంత సేవలో స్వామివారు వేంచేసినప్పడు ఈ దీపాలను ఆర్పివేస్తారు. మళ్లీ మరుసటి రోజు ఉదయం సుప్రభాతంలో తిరిగి వెలిగిస్తారు. - శ్రీవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అఖిలాండం అని భక్తులు పిలుచుకునే దీపారాధన ఉంది. ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద భక్తులు కర్పూరం వెలిగించి, కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. - ఇప్పుడు భక్తులు లేకపోవడంతో అఖిలాండం వద్ద కర్పూర దీపం ఆరిపోయింది.. ఇదీ వాస్తవం. - అఖిలాండం ఆరిపోవడాన్ని అపచారంగానూ, లేక వైపరీత్యంగానూ భావించి పూజలు జరపాలని కొందరు సృష్టిస్తున్న వదంతుల్ని భక్తులు నమ్మోద్దు. -
ఈ పాలకులకు దేవుడంటే భయం లేదు
‘అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు.. పోటులో రహస్య తవ్వకాలు.. క్రమం తప్పిన కైంకర్యాలు.. కుదించుకుపోయిన సేవా కార్యక్రమాలు.. వెరసి విశ్వ విఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న జంకే లేకుండా దైవ భక్తినీ అభాసుపాలుజేసింది. దేవుడి సొమ్మునూ కాజేసేందుకు యత్నాలు సాగించి అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్చకులను హీనంగా చూడటంతో పాటు సంప్రదాయాలకు పాతరేసింది. ఈ పాలకులకు దేవుడంటే భయం లేదు.. అర్చకులు, భక్తులంటే లెక్కే లేదు’ – టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలో నాస్తిక అధికారుల పెత్తనం ఎక్కువైంది. వీరికి దేవుడిపై భక్తి, భయం, నమ్మకం లేదు. సంప్రదాయాలు, ఆగమ శాస్త్రంపై గౌరవం లేదు. ఆగమశాస్త్ర ప్రకారం తోమాల సేవ 45 నిమిషాలు నిర్వహించాలి. వీఐపీల కోసం 10 నిమిషాల్లో ముగించాలని ఒత్తిడి తెస్తున్నారు. సహస్ర నామార్చన 45 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. 15 నిమిషాల్లో ముగించేస్తున్నారు. నైవేద్యం సమర్పించాలంటే గంట సమయం పడుతుంది. దానినీ 10 నిమిషాల్లో కానిచ్చేయాలని ఆదేశిస్తున్నారు. ఆగమ శాస్త్రంలో పేర్కొన్న కాల ప్రమాణాల ప్రకారం మొదటి నైవేద్యం వేకువజామున 5.30 గంటలకు సమర్పించాలి. రెండో నైవేద్యం 11–12 గంటల మధ్య పెట్టాలి. ఉదయం 6 గంటలకే రెండో నైవేద్యం సమర్పించేలా అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పటినుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారికి నైవేద్యం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారు. వీఐపీల మెప్పు కోసం నైవేద్యం, పూజా కైంకర్యాల కాలాన్ని కుదిస్తున్నారు. ఈ పరిస్థితిని ఉన్నతాధికారులు, పాలక మండలికి నివేదించినా ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. అర్చకులకు వైఎస్ హయాం స్వర్ణయుగం ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరిస్తామని, అన్ని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు లోటు రాకుండా చూస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అర్చకుల జీవనానికి, భృతికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించి, అర్చక హక్కులు, మర్యాదలను కాపాడారు. ఊరు వదిలి వెళ్లిన అర్చకులందరినీ పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య, పూజా కైంకర్యాలకు అవసరమైన చర్యలు చేపట్టారు. వారి జీవన భృతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఆయన హయాంలో నియమించిన శ్రీవారి ఆలయ ధర్మకర్తల మండళ్లు, ఐఏఎస్ అధికారులు ఆలయ సంప్రదాయాలను కాపాడటంతోపాటు నిత్య కైంకర్యాలను ఆగమ శాస్త్ర ప్రకారం జరిపించేందుకు కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణంతో అర్చక వ్యవస్థ, ఆలయ సంప్రదాయాల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. (తిరుమల రవిరెడ్డి)సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోందని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడన్న భయమే లేకుండా అరాచకాలకు తెగబడిందని నిప్పులు చెరిగారు. కొన్నేళ్లుగా తిరుమలలో సాగిన అక్రమాల పర్వాన్ని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎండగట్టారు. సాక్షి: పింక్ డైమండ్తో పాటు వజ్రాలు, వైఢూర్యాలు పోయాయని ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు మాయమయ్యాయని అన్నారు? రమణ దీక్షితులు: అవును. మైసూరు మహారాజు ఇచ్చిన ప్లాటినమ్ హారంలో (నడిమి నాయకం) గులాబీ రంగు వజ్రం ఉండేది. ఉత్సవాల్లో భక్తులు విసిరిన నాణేల కారణంగా డైమండ్ పగిలిపోయిందని రికార్డు చేశారు. ఆ సమయంలో డాలర్ శేషాద్రి ఇన్చార్జ్. నాణేలు తగిలి డైమండ్ పగిలిపోయిందనటం విచిత్రమైన సమాధానం. పింక్ డైమండ్ను చాలా పెద్దమొత్తానికి జెనీవాలో నిర్వహించిన వేలంలో అమ్ముకున్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాల విలువపైనా అనుమానం ఉంది. మొదట కిరీటాల విలువ రూ.వందల కోట్లు అన్నారు. ఆ తరువాత వాటి విలువ చాలా తక్కువ అన్నారు.కిరీటాలు ఏమయ్యాయో ఇప్పటికీ వెలుగు చూడలేదు. సాక్షి: శ్రీవారి ఆలయంలో తవ్వకాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంత రాద్ధాంతం జరిగింది? రమణ దీక్షితులు: 2017 డిసెంబర్లో చిన్నపాటి మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేశారు. ఆ సమయంలో వేరేచోట ప్రసాదాలు తయారు చేశారు. అలా చేయటం అపవిత్రం. దీనివల్ల స్వామివారు 25 రోజులు నైవేద్యాన్ని స్వీకరించలేదు. లోపల గోడల్ని పగులగొట్టి, రాళ్లన్నీ తొలగించిన తవ్వకాలను చూసి ఆశ్చర్యపోయాను. చాలా బీభత్సంగా తవ్వేశారు. భయమేసింది. దీనిపై ఈవోను అడిగితే తెలియదన్నారు. తరువాత 24 గంటల వ్యవధిలో హడావుడిగా పూడ్చివేశారు. ఆ సమయంలో క్షుద్రపూజలు జరిగినట్టు తెలిసింది. 1990లో కప్పు కూలిపోతుందని ఇనుప స్తంభాలు పెట్టి నిలబెట్టారు. బంగారు వాకిలికి 15 అడుగుల దూరంలో.. గర్భాలయానికి, ఆనంద నిలయానికి చాలా దగ్గరలో ఇది ఉంది. వెయ్యేళ్ల క్రితం నాటి ప్రాచీన కట్టడంలో ఇంత పెద్దఎత్తున మరమ్మతులు చేయటం వల్ల గర్భాలయం దెబ్బతినే ప్రమాదముంది. జేఈఈ చిన్న మరమ్మతే అన్నారు. గట్టిగా అడిగితే.. తనకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈవో తనకు తెలియదన్నారు. ఆలయంలో ఇంత అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక నిలదీశాను. మీడియా ముందుకు వచ్చాను. అందుకే నా పదవీ విరమణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సాక్షి: కనిపించకుండా పోయిన ఆభరణాలకు విలువ కట్టి, బాధ్యుల నుంచి రాబడుతున్నారా? రమణ దీక్షితులు: 1996 తరువాత ఏ ఆభరణాలు ఉన్నాయి? ఏవి లేవు? అనేది ఎవరికీ తెలియటం లేదు. ఎన్నిసార్లు వాటిని సరిచూశారు? వాటిలో హెచ్చుతగ్గులేమైనా ఉన్నాయా? ఉంటే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? విలువ తగ్గి ఉంటే ఎవరి వద్ద, ఎంత కట్టించుకున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. 22 ఏళ్లుగా ఏం జరుగుతోందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. సాక్షి: గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారని మీరూ ఆరోపించారు? అసలేం జరిగింది? రమణ దీక్షితులు: అవును. విలువైన ఆభరణాలు ఉన్నాయి కాబట్టే ఆలయంలో కొన్ని చోట్లకు భక్తులను అనుమతించరు. వెయ్యికాళ్ల మండపం కింద వెయ్యి అడుగుల పొడవు, 30 అడుగల వెడల్పుతో పెద్ద భాండాగారం ఉంది. ఆలయం పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు స్వామి వారికి 18 లక్షల మొహర్లతో చేసిన కనకాభిషేకం ఆభరణాలు, మరో 18 లక్షల మొహర్లతో 9.50 అడుగుల మూలవరుల ఆభరణాలన్నీ భాండాగారంతో పాటు ఆలయ రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచారనే విషయం తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో నాలుగు భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది. మిగిలిన ఆభరణాల కోసం మహా సంప్రోక్షణ సమయంలో తొమ్మిది రోజులపాటు భక్తులకు అనుమతి లేదని ప్రకటించారు. ఇది మీడియాలో రావటం, భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో వెనకడుగు వేశారు. సాక్షి: ఆభరణాలు మాయం అయ్యాయంటున్నారు. వాటి స్థానంలో నకిలీవి అలంకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? రమణ దీక్షితులు: నిజమే. నకిలీ రత్నాలతో చేసిన ఆభరణాలను దాతల నుంచి స్వీకరిస్తున్నారు. ఇందులో బొక్కసం సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రాచీనమైన నవరత్నాల ఆభరణాలకు బదులు నకిలీవి ఎక్కువగా వాడటం గమనిస్తున్నాం. మూలవరులు, ఉత్సవరులు, అమ్మవార్ల విగ్రహాలకు సంబంధించిన అనేక ఆభరణాలను నకిలీ రత్నాలతో చేయించారు. మొన్నటి బ్రహోత్సవాల్లో ప్రాచీన ఆభరణాలు అసలు కనిపించలేదు. నకిలీ రత్నాలతో చేయించిన కొత్త ఆభరణాలనే వినియోగించారు. సాక్షి: అర్చకులెవరికీ పదవీ విరమణ ఉండదని చెప్పారు. ఇప్పుడేమో ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారెందుకని? రమణ దీక్షితులు: వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన చట్టాలన్నిటినీ చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని శాస్త్రంతోపాటు సుప్రీం, హైకోర్టు కూడా చెప్పాయి. ఆలయ సంప్రదాయంలో వేల సంవత్సరాల్లో ఎక్కడా పదవీ విరమణ అనేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. అప్పట్లో జేఈవో బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడున్న శ్రీనివాసరాజు ఇద్దరూ పరమ నాస్తికులు. బ్రాహ్మణ ద్వేషులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ అన్యమతాన్ని ప్రోత్సహించేవాళ్లే. నైవేద్యాలు, కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరపనివ్వకుండా వీళ్లే అడ్డుపడుతున్నారు. సాక్షి: రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి ఎలా ఉంది? రమణ దీక్షితులు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలోకి నెట్టబడ్డాయి. 6ఏ ఆలయాల్లో అర్చకుల పరిస్థితి కొంత బాగున్నా.. మిగిలిన ఆలయాల్లో పనిచేస్తున్న వారు దయనీయ జీవితం గడుపుతున్నారు. అంతకుముందు వంశపారపర్య అర్చకత్వం వల్ల వచ్చిన కొద్దిపాటి వరంబడి, వైదిక సంస్కృతి, ఆగమ సంప్రదాయాలు వల్ల వచ్చే వరంబడులు, ప్రసాదాల్లో కొంత భాగం, అర్చన, హారతి సమయంలో భక్తులు పళ్లెంలో వేసే కానుకల ద్వారా వారి జీవితాలు బాగా గడిచేవి. ఎన్టీఆర్ తెచ్చిన మిరాశీ అబాలిష్ చట్టంతో అర్చకులు వాటిక్కూడా దూరమయ్యారు. ప్రభుత్వం జీతభత్యాలు కూడా ఇచ్చే అవకాశం లేకపోవటంతో 75 శాతం ఆలయాలు మూతపడ్డాయి. చాలామంది అర్చకులు జీవన భృతి కోసం వేరే వృత్తుల్లోకి వెళ్లారు. దీనివల్ల ఎన్నో ఆలయాలు ధూప, దీప, నైవేద్యాలకు దూరమయ్యాయి. టీడీపీ హయాంలో అర్చకులకు ఏపాటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. సాక్షి: జీవో నంబర్ 855 ప్రకారం తిరుమల అర్చకుల సర్వీసును రెగ్యులర్ చేస్తామని, పీఆర్సీ కింద వేతనాలు ఇచ్చి రిటైర్మెంట్కు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రమణ దీక్షితులు: ఈ జీవోనే పెద్ద కుట్ర. అర్చకుల మధ్య చిచ్చుపెట్టిన జీవో అది. ఒక్కొక్క కుటుంబంలో సీనియర్ మోస్ట్ అర్చకులను ప్రధాన అర్చకులుగా నియమించారు. తరువాత ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులుగా విభజించారు. అదేవిధంగా నాతోపాటు మరో ముగ్గురిని ప్రధాన అర్చకులుగా నియమించి మా కుటుంబాల మధ్య చిచ్చుపెట్టారు. నాకు రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన అర్చక హోదా కోసం కొట్టుకుంటున్నారు. ఆలయంలో జేఈవో, మరికొందరు కింకరులు చిచ్చుపెట్టారు. గతంలో ప్రధాన, ముఖ్య అర్చక పోస్టులే లేవు. అందరినీ మిరాశీదారులు అని పిలిచేవాళ్లం. వయసు, అనుభవానికి గౌరవం ఇచ్చేవారు తప్ప.. చిన్నాపెద్ద భేదం ఉండేది కాదు. ఆ జీవో ద్వారా ఒకరిని ప్రధాన అర్చకులుగా చేసి మిగిలిన వారిలో ఈర‡్ష్య, ద్వేషం పెంచింది ఈ ప్రభుత్వమే. వేతనాలు కూడా ఇవ్వలేదు. సాక్షి: చిన్న ఆలయాలకు తిరుమల నుంచి సుమారు రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయని అర్చక సమాఖ్య నేతలు చెబుతున్నారు. ఇందులో నిజమెంత? రమణ దీక్షితులు: వైఎస్ రాజశేఖరరెడ్డి 6ఏ ఆలయాల నుంచి ఏటా కొంత మొత్తాన్ని చిన్న ఆలయాలకు ఇచ్చేవారు. ఆ నిధులు ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భక్తుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. 2014లో టీటీడీకి రూ.965 కోట్ల ఆదాయం రాగా.. రూ.900 కోట్లను డిపాజిట్ చేశారు. 2018–19 సంవత్సరంలో రూ.1,600 కోట్లు పైచిలుకు వస్తే.. అందులో రూ.1,600 కోట్లు తినేసి రూ.20, రూ.30 కోట్లు మాత్రమే బ్యాంక్లో డిపాజిట్ చేయటమే ఇందుకు నిదర్శనం. టీటీడీ నిధులను అతిథి గృహాల నిర్మాణానికి, అమరావతిలో ఆలయాల నిర్మాణానికి కేటాయిస్తున్నారు. ఇలా టీటీడీ నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. కానీ.. చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. సాక్షి: ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై మీరేమంటారు? రమణ దీక్షితులు: మీకు ముందే చెప్పా. టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయని. వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీ నిధులను వినియోగిస్తున్నారు. ఎక్కడో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్లకు ఆలయ నిధులు ఇవ్వడమేంటి. వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి టీటీడీ నిధులను ఖర్చుచేస్తున్నారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం అధికమైందన్నది వాస్తవం. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులనే అమలు చేయటం లేదు. సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వటానికి లేదంటున్నారు. టీటీడీని పూర్తిగా టీడీపీ సంస్థగా మార్చేసుకున్నారు. తిరుమలను టీడీపీ కార్యాలయంగా మార్చుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కూడా పూర్తిగా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయనను బదిలీ చెయ్యకుండా మళ్లీ ఏడాది పొడిగించారు. -
నన్ను విధుల్లోకి తీసుకోండి..
తిరుమల: అర్చకుల వయోపరిమితి వివాదం టీటీడీని ఇప్పట్లో వీడేలా లేదు. తిరుచానూరు ఆలయంలో మిరాశీ అర్చకులకు వయోపరిమితి లేదంటూ.. వారిని విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో అవే నిబంధనలను తమకూ వర్తింపచేయాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీ ఈవోకు రెండు రోజుల కిందట లేఖ రాశారు. దీంతో అర్చకుల వివాదం ఒక్క పట్టాన తెగేలా లేదు. 1986లో మిరాశీ వ్యవస్థ రద్దు చేసినప్పటి నుంచి కూడా కోర్టుల చుట్టూ అర్చకుల వివాదం తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి నిబంధనలను అమలు చేయాలని టీటీడీ బోర్డు.. అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫలితంగా శ్రీవారి ఆలయంలో ప్రధానార్చక హోదాలో ఉన్న నలుగురు మిరాశీ అర్చకులతో సహా.. తిరుచానూరు ఆలయంలోని అర్చకులతో పాటు దాదాపు 20 మంది అర్చకులకు ఉద్వాసన పలికారు. మిరాశీ అర్చకులకు వయోపరిమితి నిబంధన అమలు చేయడం సబబు కాదంటూ వారు కోర్టును ఆశ్రయించారు. రమణ దీక్షితుల ఉద్వాసనకే.. టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రమణదీక్షితులను సాగనంపేందుకే అన్నట్లుగా 65 సంవత్సరాల వయోపరిమితి నిబంధనను పాలకమండలి తెరపైకి తెచ్చింది. శ్రీవారి ఆలయంలో ఏడుగురు, తిరుచానూరు అమ్మవారి ఆలయంలోని ఇద్దరు అర్చకులను ఉద్యోగ విరమణ చేయించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టునాశ్రయించగా.. శ్రీవారి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉండగానే.. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్ అనేదే లేదని, పనిచేసే శక్తి ఉన్నన్నాళ్లు వారిని సంభావన అర్చకులుగా అర్చకత్వానికి అనుమతించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇదే తీర్పును తమకు అమలుజేయాలని రమణదీక్షితులు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కు వెంటనే లేఖ రాశారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్న టీటీడీ.. రమణదీక్షితుల వ్యవహారంలో ఎలా ముందుకెళుతుందోనన్నది ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు మిరాశీ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకునే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి టీటీడీలో కనిపించడం లేదు. రమణదీక్షితులు పక్షాన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామి కూడా హైకోర్టులో కేసును దాఖలు చేశారు. రమణదీక్షితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో లేఖను పరిశీలించిన టీటీడీ.. న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. -
ఏది జరిగినా మన మంచికే
రెప్పపాటు కాలం శ్రీవారిని సందర్శిస్తే చాలు కొండంత సంతోషం. జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.. గంటల తరబడి క్యూలలో వేచి స్వామివారిని దర్శించుకున్నాక భక్తులు పొందే అనుభూతి ఇది. అలాంటిది నిమిషం కాదు..గంట కాదు..రోజు కాదు.. మాసం కాదు.. మూడున్నర దశాబ్దాల పాటు సాక్షాత్తూ శ్రీవారి చెంతనే గడిపే మహద్భాగ్యం పొందిన వ్యక్తి ఏవీ రమణ దీక్షితులు. ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసి నాలుగు నెలలుగా విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన శ్రీవారితో తనకున్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. నాన్నగారు గొల్లపల్లి వెంకటపతి దీక్షితులు. నియమ నిష్టల మధ్య పెంచారు. ఎప్పటికైనా స్వామి వారి అర్చకుడిగా ఉండాలన్న భావనతోనే నన్ను తీర్చిదిద్దారు. మడి కట్టుకోవడం నుంచి అన్ని కట్టుబాట్లు అలవాటుగా మారాయి. తిరుపతిలోనే బీఎస్సీ చదివా. సైన్స్ అంటే ఇష్టం. జువాలజీ ప్రధానాంశంగా ఎమ్మెస్సీ చేశాను. ఒకపక్క సైన్స్.. మరోపక్క శ్రీవారు. రెండు అంశాలూ మనసులో నిండి ఉండేవి. ఈ విషయంలో వైరుధ్యం లేదు. భక్తి కూడా సైన్సే అని విశ్వాసం. మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ పూర్తయింది. 1974లో నాన్నగారు పరమపదించారు. కుటుంబ వారసత్వంగా తిరుమల సేవకు వచ్చేశాను.1977లో లివర్ క్యాన్సర్పై పరిశోధనకు అమెరికా నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేదు. ఆగమశాస్త్ర ప్రకారం సముద్రయానం చేయకూడదు. మ్లేచ్ఛ దేశాలకు వెళ్లితే ధర్మ భ్రష్టత్వం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే వెళ్లలేదు. ఏమని చెప్పను... స్వామివారి సేవకు దీర్ఘకాలం అంకితమయ్యాను. ఆ మూలమూర్తితో బంధం ఏమని చెప్పను. అత్యంత సన్నిహిత సంబంధం మాది. ఒక్కొక్కసారి ఆయనతో వాదన చేస్తుంటాను. స్వామి అలుగుతుంటారు.అప్పుడప్పుడూ స్వామితో విభేదిస్తుంటాను. మళ్లీ మామూలే. మాది తాత, మనవడి సంబంధంగా సాగింది. ఒక్కోసారి తాతగారు మనవడితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందిస్తుంటారు. కొడుకు కంటే మనవడి మీదే తాతగారికి ప్రేమ ఎక్కువుంటుంది. మాదీ అంతే. ప్రధానార్చకుడు.. దానివల్ల వచ్చిన గౌరవం, వేతనాలు.. ఇలా భౌతికంగా లభించే రూపాలన్నింటినీ పక్కనబెడితే... ఆత్మార్పణగా స్వామివారితోనే ఉన్నాను. స్మరించుకుంటే ఎదురుగా నిలబడతారు. ఎదురెదురుగా నిలబడి ఒకరితో ఒకరు సంభాషించుకుంటాం. కైంకర్యాల వేళ బిడ్డ.. ఆగమోక్తంగా స్వామివారికి సమయానుసారం కైంకర్యాలు చేయాలి. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా.. మంత్రాశనం, స్నానాశనం, అలంకారాశనం, యాత్రాశనం, భోజ్యాశనం, శయనాశనం అనే ఆరు దశలుంటాయి. స్వామివారు మంత్రాధీనం. గర్భాలయంలో ప్రవచించే వేదమంత్రాల వల్లే ప్రశాంతత నెలకొంటుంది. గర్భాలయంలోనూ తరంగాలుంటాయి. అందుకే మంత్రయుక్తంగా, శాస్త్రోక్తంగా జరిపితేనే స్వామి వారు సంతృప్తి చెందుతారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్నసూక్తంతో ప్రసాదాలను సమర్పించాలి. ప్రసాదాన్ని పవిత్రం చేయాలి. దీనివల్లే పుష్టి, తేజస్సు, దృఢత్వం లభిస్తాయి. కుడిచేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకి స్వామి కుడిచేతిని తాకిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోరుముద్దలు తినిపించడమన్నమాట. మంచినీళ్లిస్తాం. అభిషేకం చేసేటప్పుడు, ఆరగింపు చేసేటప్పుడు స్వామిని బిడ్డగా చూసుకుంటాం. అందుకే కైంకర్య సమయాన కన్నతల్లిగా మారిపోతాం. మిగిలిన వేళల్లో స్వామివారే యజమాని. మేమంతా సేవకులమే. సక్రమంగా జరపకపోతే అపచారం ఆగమోక్త సంప్రదాయం ప్రకారం ఆలయంలో అన్నీ జరగాలి.. అపసవ్యం జరగకూడదు. ముఖ్యంగా కైంకర్యాలన్నీ పద్ధతిప్రకారం సకాలంలో నిర్వర్తించాలి. వీఐపీలొస్తున్నారనో.. భక్తుల సంఖ్య పెరిగిందనో ఆగమేఘాలపై నిర్వహించలేం. స్వామి కార్యక్రమంలో అతి కీలకమైనది ప్రసాదం. అది కూడా ఆయనకు సక్రమంగా నింపాదిగా ఇవ్వకపోతే ఎలా.. చాలా సందర్భాల్లో ఇలాంటివి అధికారుల ఒత్తిళ్ల నుంచి ఎదుర్కొన్నాం. నా వరకూ ఏనాడూ ఇవి చెవులకు సోకకుండా కైంకర్య బాధ్యతలను నిర్వహించగలిగాను. స్వామివారు ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే భక్తులకు మంచి జరుగుతుంది. ఆగమశాస్త్రంపై కనీస అవగాహన.. దైవ నియమాలు.. భక్తి.. సంస్కృతులపై నమ్మకం లేని అధికారులుంటే మంచిది కాదు. ఆ స్వామి చలవతోనే టీటీడీ అన్న విషయం మరువకూడదు. ఆగమోక్తంగా కైంకర్యం కూడా నిర్వహించకపోతే అపచారం. త్వరలోనే తెలుగు అనువాదం సా«ధారణంగా స్వామి వారికి సమర్పించే కైంకర్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి భక్తులందరికీ ఉంటుంది. అందరికీ తెలిసిన ప్రసాదం లడ్డూ ఒక్కటే. కానీ ఎన్నో రకరకాల ప్రసాదాలుంటాయి. ఏ సమయంలో ఏ నైవేద్యం పెడతారు, వాటిని ఎవరు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వాటిలో ఉండే దిట్టం ఏమిటి లాంటి అంశాలు అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కైంకర్యాలకు సంబంధించిన అంశాలతో ఫుడ్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాను. దీనిని తెలుగులో అనువదించి ప్రచురించాలని ఎక్కువమంది కోరారు. అందుకే తెలుగులో అనువదించే పనిలో పడ్డా. 80 శాతం పూర్తయింది. కొద్దిరోజుల్లో పుస్తకాన్ని తీసుకువస్తాను. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు వైకుంఠం నుంచి తిరుమలకు రావడానికి మునుపే స్వామి తన ప్రతినిధిగా వైఖానస మహర్షిని పంపారు. వైఖానస ఆగమ శాస్త్రాన్ని సృష్టించారు. ఆ తర్వాతే స్వామివారు తిరుమలకు విచ్చేశారు. అంటే స్వామి భూలోకానికి వచ్చే సమయానికే ఆగమ శాస్త్రం అమల్లో ఉంది. ఇప్పటికీ అత్రి మహర్షి ఆలయంలో సజీవంగా ఉన్నారని భావిస్తాం. వేల సంవత్సరాల కిందట ఒక ప్రయోగం జరిగింది. దేవతలు, మహర్షులంతా కలిసి... ఆలయ ఆవరణలో పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి, వారిని స్వామివారికి రక్షణ సిబ్బందిగా నియమించారు. మంత్రపూర్వకంగా ఆవాహన చేశారు. వారంతా స్వామివారి సేవలో సజీవంగా ఉన్నారు. రక్షణ కవచంలా నిలుస్తున్న ఆ దైవశక్తులను సామాన్య మానవులు తట్టుకోలేరు. అందువల్లే స్వామివారిని దర్శనం చేసుకుని, ఆలయం వెలుపలికి వచ్చాక ఇక మళ్లీ స్వామి దివ్యమంగళ స్వరూపం గుర్తుండదు. మనసులో శూన్యత ఆవరిస్తుంది. మనమేదైనా కోరాలన్నా మరచిపోతాం. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు. అర్చావతారంలో కనిపించేది కూడా స్వామి వారి రూపం కాదు. అది వేరే ఉంటుందని నమ్ముతాను. ఆగమశాస్త్రంలో చెప్పబడే లక్షణాలున్న భంగిమ.. లక్షణాలతో స్వామివారున్నారని ధ్యానం చేసుకుంటుంటాను. వైఎస్ హయాంలో... వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత కొండకు వచ్చారు. సుదర్శనయాగం నిర్వహించాం. మా కష్టాలు విన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోలేదు. రాష్ట్రంలోని 24 వేల దేవాలయాల్లో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించారు. ఇందుకోసం చట్టసవరణ చేశారు. అర్చకులకు గౌరవమిచ్చారు. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇచ్చారు. వేతనాలు పెంచారు. బ్రాహ్మణులంతా సంతోషించారు. ఆయన తర్వాత మళ్లీ బ్రాహ్మణులకు, పురోహితులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు తొమ్మిదేళ్లపాటు ఎన్నో ఒడిదుడుకులు ..కష్టాలు పడ్డాం. అవమానాలు భరించాం. ముఖ్యంగా జాతీయ నిధిగా చెప్పుకునే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారు. రథ.. వాహన మండపాలనూ ధ్వంసం చేయించారు. అవన్నీ దివ్యపురుషుడి దేహభాగాలుగా భావిస్తాం. ఇది మహాపాపమని చెప్పినా విన్నవారెవరూ లేరు. నాలుగు నెలలుగా స్వామికి దూరంగా.. ఏదైనా స్వామి అభీష్టానికి వదిలేస్తుంటాను. ఏది జరిగినా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాను. అన్నిటి వెనుక స్వామి దయ ఉందనే నమ్మకం. మనసా, వాచా ఏ తప్పు చేయలేదు. నాది కాని దాన్ని తీసుకోలేదు, తీసుకోను కూడా. స్వామివారి పేరు చెప్పి అక్రమంగా ఏదీ పొందలేదు. దైవ సంకల్పంతోనే ఏదైనా జరుగుతుంది. తిరుమలలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ చేయించాలని చట్టాల్లో ఎక్కడా నిబంధనలు లేవు. కానీ, అలా జరిగిపోయింది. తెలతెలవారుతుండగానే గర్భగుడిలో స్వామి సేవలో తరించేవాడిని. నాలుగు నెలలుగా దూరంగా ఉన్నాను. స్వామివారిని దర్శించుకోలేకపోతున్నాననే కొరత.ఎప్పటికైనా స్వామి వారు నన్ను పిలిపించుకుంటారు. ఇప్పుడు నన్ను బయట పెట్టారంటే ఏం జరిగిందో తెలియదు. ఏదో ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది. జరిగేవన్నీ స్వామి వారి సంకల్పమే.ఏది జరిగినా మన మంచి కోసమేనన్నది నా భావన. – పక్కి సత్యారావు పట్నాయక్, తిరుపతి -
గుట్టుగా నా ఖాతాలో రూ.30 లక్షలు టీటీడీ జమ
సాక్షి, అమరావతి: తనకు ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా, తాను ఎటువంటి దరఖాస్తు చేయకుండానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు తన పేరిట రూ.30 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేశారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, ఆగమ విరుద్ధ అనాచారాలను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా ఆలయంలో బాధ్యతల నుంచి తొలగించిన టీటీడీ.. ఇప్పుడు మరో ఏకపక్ష నిర్ణయంతో తన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేశారని విమర్శించారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవి తన రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులని అధికారులు చెబుతున్నారని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన అర్చక నియామకమే సర్వీసు రూల్స్ ప్రకారం జరగలేదని, వంశపారంపర్య హక్కుల ప్రకారం తాను అర్చక బాధ్యతల్లో పనిచేశానని రమణదీక్షితులు వివరించారు. ఈ కారణంగానే 20–30 ఏళ్ల పాటు తాను ఆ బాధ్యతల్లో కొనసాగినప్పటికీ, తనకు ఎటువంటి అలవెన్స్లు, సర్వీసు ఉత్త ర్వులు లేవని అందులో తెలిపారు. పదవీ విరమణ తన సమ్మతితో జరగలేదని.. అలాగే రిటైర్మెంట్ సెటిల్మెంట్ అని చెబుతున్న నగదు కూడా తన సమ్మతితో జమ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన వారి ఖాతాల్లో కూడా ఇంతే మొత్తంలో డబ్బులు జమచేశారన్నారు. అధికారులు ఇంకెంత తరలించారో!? ఎలాంటి వోచర్, రశీదు లేకుండా, ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా టీటీడీ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు శ్రీవారి ఖజానాలోని దాదాపు కోటి రూపాయలు తమ ఖాతాల్లో జమ చేసినట్లు వారు మిగిలిన విషయాల్లో ఇంకెన్ని కోట్లు తరలించారో అని రమణదీక్షితులు అనుమానం వ్యక్తంచేశారు. టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఇన్నాళ్లూ తాను చెబుతున్న మాటలు వాస్తవమేనని దీంతో స్పష్టమైందని తన ప్రకటనలో రమణదీక్షితులు వివరించారు. టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ తప్పకుండా జరిపించాలని ప్రజలందరూ కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీటీడీ చట్టవ్యతిరేక నిర్ణయాలను, తన పదవీ విరమణ వ్యవహారాలను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement