revanth
-
బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.అయితే ఈ సినిమా ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నాడు. తెరపై బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్లతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.బుల్లిరాజు తండ్రి విజ్ఞప్తి..అయితే బుల్లి రాజు ఫేమ్ను కొందరు సోషల్ మీడియా వేదికగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రేవంత్ భీమాల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ బాలుడి తండ్రి బి శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా మా అబ్బాయి పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ ప్రమోషన్స్ కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. రేవంత్ పేరిట కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని తెలిపారు. ఏదైనా అధికారిక ప్రకటన ఆ అకౌంట్ నుంచే తెలియజేస్తామన్నారు. అంతేకాదు రేవంత్ పేరిట ఎలాంటి ఫేస్బుక్, ఎక్స్, అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్స్ లేవని తెలిపారు. దయచేసి మా అబ్బాయిని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. అంతేకాకుండా రాజకీయాలతో ముడిపెట్టవద్దని శ్రీనివాసరావు ఇన్స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by 𝕽𝖊𝖛𝖆𝖓𝖙𝖍@𝕭𝖚𝖑𝖑𝖎𝖗𝖆𝖏𝖚. (@revanth_bhimala) -
'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వందకోట్లకు వసూళ్లతో సంక్రాంతి రేసులో అదరగొడుతోంది.అయితే ఈ మూవీ ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్లతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.అయితే తాజాగా బుల్లిరాజుతో కొందరు అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అయితే ఇదే క్రమంలో బుల్లిరాజు ఇబ్బందిగా ఫీలవుతున్నా కూడా వారు వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని బుల్లిరాజు చెప్పినా వారస్సలు పట్టించుకోలేదు. చిన్న పిల్లాడితో ఇలా వ్యవహరించడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. జరగండి.. నేను వెళ్లాలి అని బుల్లిరాజు చెబుతున్నా వినకుండా అతనితో ఫోటోలు తీసుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా ఈ పైత్యం ఏంటని పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.#BulliRaju with items 😍 who are harassing #SankranthikiVasthunam pic.twitter.com/CTqfFrv79L— Aristotle (@goLoko77) January 19, 2025 -
సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా?
సంక్రాంతికి ఆడియన్స్ను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోన్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది అనిల్- వెంకటేశ్ కాంబోపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లి రాజు). తన క్యూట్ క్యూట్ మాటలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు మూవీ ఈవెంట్లో మాట్లాడిన బుల్లి రాజు మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా నాలా ఎవరూ కూడా పాడై పోవద్దంటూ పెద్ద సలహానే ఇచ్చాడు. ఇంతకీ అదేంటో చూద్దాం.బుల్లి రాజు మాట్లాడుతూ..' అందిరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరు థియేటర్స్కు వెళ్లి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్స్. అలాగే నాలా ఓటీటీలు చూసి ఎవరూ పాడైపోవద్దు. ఒక మేసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశాం. ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో నా పాత్రను ఎవరూ ఫాలో అవ్వొద్దు. అందుకు మీ అందరికీ సారీ. అనిల్ సార్ మీరు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందరితో బాగా కలిసిపోయాను.' అని అన్నారు. రేవంత్ పాత్రపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' బుల్లి రాజు నువ్వు బాగా చేశాం. యూఎస్తో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకో. మంచి సినిమాలు చేయి. ఈ బుడ్డోడి పాత్ర ఏంటంటే.. పిల్లలు ఓటీటీ చూస్తే పరిస్థితి ఏంటనేది చూపించాం. అక్కడ వినిపించే బూతులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే మేసేజ్ కోసమే అలా చేశాం. అంతేకానీ బుల్లిరాజుతో అలా మాట్లాడించాలని కాదు' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. -
ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రింగ్రోడ్డు కోసం చౌటుప్పల్ జంక్షన్ వద్ద 184 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని.. ఆ భూములు, ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాత వారి అంగీకారంతోనే భూ సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించే మహాధర్నాకు రావాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధులు శనివారం హరీశ్రావును కలిసి ఆహ్వానించారు. వారి సమస్యలపై కూడా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దివ్యాంగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించి.. ఏడాది అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ప్రకటించారు. -
ఢిల్లీ హీట్: అటు కేటీఆర్.. ఇటు రేవంత్.. గవర్నర్ కూడా..
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బయలేర్దారు. కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. మరో వైపు సీఎం రేవంత్పై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. ఇద్దరు నేతలు ఒకే సమయంలో ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమృత్ పథకంలో స్కాం జరిగిందని కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్ బావమరిది సృజన్రెడ్డికి లబ్ధి చేకూర్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో రేవంత్ ఢిల్లీ టూర్కు వెళ్లడంతో కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణలో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరినట్లు సమాచారం.కాగా, మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సమయంలో గవర్నర్ ఢిల్లీ టూర్పై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన సస్పెన్స్గా మారింది. ఏసీబీ కేసు అనుమతి గురించి చర్చించేందుకా? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది. -
సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
అమెరికాలో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్ హిమంత్సింగ్కా ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్ హెల్త్కోచ్ అయిన రేవంత్ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్ప్రెన్యూర్షిప్...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్–హెల్ఫ్ బుక్ ప్రచురించాడు. ఇందులో ప్యాకేజ్డ్ గూడ్స్ లేబుల్స్పై కూడా ఒక చాప్టర్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ ఎలా పాపులర్ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్–డ్రింక్ బోర్న్విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్ చేస్తుంది ఇది సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లలో వైరల్గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్ఫార్మర్’ ట్యాగ్లైన్తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్లాంటి ప్యాకేజ్డ్ కంటెంట్పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్ చేసేవారు.వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్సింగ్కా. పాఠశాలలో హెల్త్పై సబ్జెక్ట్ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్లాంటి సబ్జెక్ట్లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్ఫార్మర్’గా పాపులర్ అయిన రేవంత్ తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్–2024’ జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer)(చదవండి: -
అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ శుక్రవారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.‘కేటీఆర్ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్ఆర్ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్లో విమర్శించారు. -
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువ సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్లకు దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతంగా రూపొందించారు. రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.కొన్న గంటల్లో రాష్ట్ర ప్రజలు ఈ గీతాన్ని వినబోతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కీరవాణి బృందం కలిసింది. అందులో సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్లు ఉన్నారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్ హారిక ఇలా చెప్పుకొచ్చింది. 'తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో నన్ను చేర్చుకున్నందుకు కీరవాణి సార్కి, అందె శ్రీ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, అంటే జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
విభజనతో చేదు అనుభవాలు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, అనేక చేదు అనుభవాలను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో ఇటు తెలంగాణగానీ, అటు ఏపీగానీ సంబరాలు చేసుకోలేపోయాయని.. విభజన సమయంలో విషపు బీజాలు నాటబడ్డాయని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రసంగించిన మోదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందరి సమ్మతితో కష్టతరమైన పనులనూ పార్లమెంటు పూర్తి చేసింది. ఇదే సభలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా మూడు రాష్ట్రాల విభజన జరిగింది. ఆ రాష్ట్రాల విభజన సమయంలో అన్నిచోట్లా సంబరాలు జరిగాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో దాని మాతృ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సంబరాలు చేసుకుంది. అలాగే ఛత్తీస్గఢ్ ఏర్పాటు సమయంలో మధ్యప్రదేశ్.. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో బిహార్ కూడా సంబరాలు చేసుకున్నాయి. అందరి సమ్మతితో సుహృద్భావ వాతావరణంలో విభజన జరిగింది. కానీ కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. రక్తపుటేర్లు పారాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండూ సంబరాలు చేసుకోలేకపోయాయి. విభజన సమయంలో విష బీజాలు నాటబడ్డాయి. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైన మాదిరిగా అదే ఉత్సాహంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు తెలంగాణ ఒక కొత్త శిఖరానికి చేరుకునేది..’’అని మోదీ పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఫిబ్ర వరి 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రధాని మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విభజన సరిగా జరగలేదని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన ఏపీని సిగ్గుపడేలా కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ వ్యాఖ్యలు: రేవంత్రెడ్డి తెలంగాణ పోరాట స్ఫూర్తిని కించపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ మాట్లాడటం ఘోరం. రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తిప్పికొట్టారు. మనం బీజేపీని తరిమికొడదాం’’అని ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే: రాహుల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే..’’అని మంగళవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు: బీఆర్ఎస్ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు సభలో తిప్పికొట్టారు. బీఆర్ఎస్ తరఫున ప్రసంగించిన నామా... ‘‘తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిలి్చందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణ నేడు దేశంలోనే నంబర్వన్గా ఉంది. తలసరి ఆదాయం, తల సరి విద్యుత్ వినియోగంలో నంబర్వన్ స్థానంలో ఉంది. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ రావాల్సి ఉంది..’’అని పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలే ఉంటే ఇప్పుడు 300కు పైగా ఉన్నారని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని... అదే మాదిరి గా ఇద్దరు ఎంపీలే ఉన్నా తమ పార్టీ కొట్లాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. ఇక నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నామా డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని, హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతని కేసీఆర్ నిరూపించుకున్నారని చెప్పారు. -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్తో 10 జన్పథ్లో నిర్వహించిన మీటింగ్కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్లో ఎయిర్పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్పోర్టును, PV నరసింహారావు ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్వి. ఇక పవన్కళ్యాణ్కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్కళ్యాణ్తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్లో రాహుల్గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్సిబల్ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
రేవంత్, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వార్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. రేవంత్రెడ్డి బెంగళూరు వెళ్లి డి.కె.శివకుమార్ను కలిసిన ఫొటోను పోస్టు చేస్తూ ‘అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడం’ అని కవిత ట్విట్టర్లో జత చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ దండం పెడుతున్న ఫొటోతో రీట్వీట్ చేశారు. ‘గల్లీల్లో సవాళ్లు.. ఢిల్లీలో వంగివంగి మోకరిల్లి వేడుకోళ్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు, జగమెరిగిన నిక్కర్ లిక్కర్ లాజిక్కు’ అని పోస్టు చేశారు. -
ఒరిజినల్ కాంగ్రెసును కాపాడుకోవడమే మా లక్ష్యం : ఉత్తమ్
-
తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత
బిగ్బాస్ సీజన్-6 టైటిల్ గెలవకముందే సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయానికే అన్విత నిండు గర్భిణి. హౌస్లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసి రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రేవంత్కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బిగ్బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ రేవంత్కే ఉందని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
‘బిగ్బాస్’ హౌస్లోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ.. రేవంత్ కంటతడి
బిగ్బాస్ ఆరో సీజన్ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఇందులో బాగంగా మొదటగా ఆదిరెడ్డి ఫ్యామిలీ బిగ్బాస్ ఇంట్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆదిరెడ్డి తన భార్య కవిత, కూతురు అద్వితను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. కూతురికి అన్నం తినిపించాడు. అనంతరం తన ఆటతీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. తన డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నామని కవిత చెప్పడంతో ఆదిరెడ్డితో సహా ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వారు. ‘అందరు మంచి వాళ్లు గేమ్ వరకు కొట్టుకోండి..తింటుకోండి కానీ..’ అని కవిత ఏదో చెప్పబోతుండగా.. ‘ఏంటి నన్ను కూడా కొట్టమంటున్నావా?’ అని ఆదిరెడ్డి అంటాడు. హా..నువ్వేమైనా పెద్ద తోపా అంటూ ఆదిరెడ్డికే సెటైర్ వేసింది కవి. కేక్ కట్ చేసి కూతురు బర్త్డేని సెలబ్రేట్ చేశారు. భార్య, కూతురు రాకతో ఆదిరెడ్డి చాలా సంతోషంగా ఉంటే.. రేవంత్ మాత్ర తన భార్య, పుట్టబోయే బిడ్డను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు. మరి రేవంత్ ఫ్యామిలీ కూడా బిగ్బాస్ హౌస్లోకి వస్తుందా? అన్నది చూడాలి. -
కంటెస్టెంట్స్కి బిగ్బాస్ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవాలంటే..
బిగ్బాస్ 6 తెలుగు: కంటెస్టెంట్కి బిగ్బాస్ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్ లేకుండా చివరి వరకు హౌజ్ కొనసాగేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు వారికి సదా అవకాన్ని ఇచ్చాడు. అయితే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్కి కఠిమైన టాస్క్తో పాటు వారి ప్రైజ్మనీలోంచి భారీగా కోతలు పెట్టాడు బిగ్బాస్. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. దీంతో ఆదిరెడ్డి ఈ పాస్ తనకు వద్దంటూ టాస్క్ ఆడని తేల్చేశాడు. ఇక హౌజ్ అందరు చర్చించుకున్న అనంతరం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రేవంత్, శ్రీహాన్, ఫైమా పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 6: కంట్రోల్ తప్పిన రోహిత్.. బ్యాగ్ని కాలితో తన్నుతూ.. ఫుల్ ఫైర్
బిగ్బాస్ హౌస్లో టాస్క్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పదోవారం ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మరింత వాడివేడిగా జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘నాగమణి’టాస్క్లో విజయం సాధించిన పాముల టీమ్ సభ్యులు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తిలతో పాటు శ్రీసత్య, మెరీనా కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీలో నిలిచారు. వీరికి ‘వస్తా నీవెనుక’అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా థర్మాకోల్ బాల్స్ నిండి ఉన్న బ్యాగ్లను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో ఆదిరెడ్డి.. రోహిత్, మెరినాలను టార్గెట్ చేసినట్లు చేసింది. అందరికంటే ముందే మెరినా టాస్క్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రోహిత్పై అటాక్కి వెళ్లిన ఆదిరెడ్డికి ఫైమా తోడైంది. ఇద్దరు కలిసి రోహిత్ని బ్యాగ్ను చించేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోహిత్ సంచాలక్పై ఫైర్ అయ్యాడు. ఆదిరెడ్డి బ్యాగ్ పట్టుకుంటే ఏం అనలేదు కానీ.. నన్ను మాత్రం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగ్ని కాలితో తన్నుతూ.. ‘నేను బ్యాగ్ని పట్టుకోలేదు’ అని గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే మెరినా మాత్రం రోహిత్ని కూల్ చేస్తూ..‘జనాలు చూస్తున్నారు’లే అని సర్థిచెప్పింది. అయినా రోహిత్ కోపం చల్లారలేదు. ఇక ఈ టాస్క్లో గెలిచి కెప్టెన్ అయిందెవరు అనేది నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
హౌస్మేట్స్ కోసం త్యాగం, చివరకు బకరా అయిన రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 40: బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీహాన్, శ్రీసత్య, సుదీప, బాలాదిత్య, ఇనయ, అర్జున్, ఆది రెడ్డి, గీతూలకు సర్ప్రైజ్లు అందాయి. వారు ఎంచుకున్న ఆప్షన్ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్, వీడియో కాల్, ఫొటో ఫ్రేమ్, ఫుడ్ అందుకున్నారు. మిగిలిన హౌస్మేట్స్ నేడు వారి ఫ్యామిలీతో మాట్లాడారు. మరి ఎవరికి ఎలాంటి సర్ప్రైజ్లు అందాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. ఇనయ- సూర్యలు ఒకరికొకరు ఫెవికాల్లా అతుక్కుపోయారు. ఇప్పటిదాకా ఒకరికొకరు గోరుముద్దలు పెట్టుకున్న ఈ ఇద్దరు పొద్దుపొద్దున్నే ఒకరి లాలీపాప్ను మరొకరు చప్పరించారు. ఇనయ లాలీపాప్ తింటూ దాన్ని సూర్యతో షేర్ చేసుకుంది. అతడు కూడా వద్దనుకుండా దాన్ని నోట్లో పెట్టుకోవడం గమనార్హం. అటు బాలాదిత్య సిగరెట్లు లేక అల్లాడిపోయాడు. పొద్దునకల్లా తిరిగి పంపించేస్తాను ఒక్కసారి సిగరెట్లు ఇవ్వండి బిగ్బాస్ అని కెమెరాల దగ్గర మొత్తుకున్నాడు. కానీ బిగ్బాస్ ఏడిపించే రకమే కానీ కరుణించే రకం కాదు కదా! మరోవైపు అన్నం సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ వండమని ఆదిరెడ్డి కెప్టెన్ను అడిగాడు. దానికతడు రైస్ వేస్ట్ కాకూడదు అంటూ కస్సుబుస్సులాడాడు. నీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బందిపడటం మీకు ఇష్టమా? అని ఆదిరెడ్డి ప్రశ్నించగా మీరు ఇబ్బందిపడ్డారా? అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడాడు రేవంత్. రైస్ ఎక్కువ ఉంది కాబట్టే అడిగానని ఆదిరెడ్డి చెప్తున్నా అతడు వినిపించుకోలేదు. ఇంతలో టెలిఫోన్ బూత్కు బిగ్బాస్ కాల్ చేశాడు. రోహిత్, వాసంతిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు స్వతాహాగా నామినేట్ అయితే బ్యాటరీ ఫుల్గా రీచార్జ్ అవుతుందన్నాడు. ఇంటిసభ్యుల కోసం తాను నామినేట్ అవడానికి సిద్ధమని రోహిత్ వెల్లడించడంతో బ్యాటరీ వంద శాతం రీచార్జ్ అయింది. కాకపోతే ఈసారి బిగ్బాస్ పిలవడం కాకుండా ఫోన్ రింగ్ అయినప్పుడు ఎవరు ముందుగా లిఫ్ట్ చేస్తే వారికే సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. మొదటగా రేవంత్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతడు 10 శాతం రీచార్జ్ వినియోగిస్తూ భార్య ఫొటో సెలక్ట్ చేసుకున్నాడు. ఫైమా 25 శాతం రీచార్జ్ ఉపయోగించి అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. కీర్తి.. 15 శాతం ఉన్న మానస్ ఆడియో మెసేజ్ విని సంతోషపడింది. సూర్య.. 20 శాతం ఉన్న అమ్మ లేఖ అందుకుని చదివి మురిసిపోయాడు. వాసంతి.. 15 శాతం రీచార్జ్ ఉన్న అక్క కూతురి ఫొటో తీసుకుంది. రాజ్.. 15 శాతం రీచార్జ్ వినియోగిస్తూ అమ్మతో ఆడియో కాల్ తీసుకున్నాడు. రోహిత్, మెరీనాలకు అవకాశం రాకుండానే బ్యాటరీ రీచార్జ్ మొత్తం అయిపోయింది. నిజానికి రోహిత్ వల్లే బ్యాటరీ రీచార్జ్ అయినా అతడికి, మెరీనాకు మాత్రం ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. అనంతరం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. అందులో భాగంగా బంతిని వారి బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్లో కిందామీదా పడ్డ హౌస్మేట్స్కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టు విడవకుండా గేమ్ ఆడి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: శ్రీసత్య కన్నింగ్, వాసంతి ఎడ్డిది: స్రవంతి సినిమా ఛాన్స్ పేరుతో నన్ను ఇంటికి పిలిచి... బిగ్బాస్ కంటెస్టెంట్ బండారం బయటపెట్టిన నటి -
నేహాపై ఫైర్ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం
బిగ్బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్రూమ్లో వేసి లాక్ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్ అని పిలుస్తానని చెప్పిన అర్జున్ సత్యతో లవ్ ట్రాక్ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. -
Bigg Boss 6: సిగ్గూ, శరం ఉండాలి.. కోపంతో ఊగిపోయిన రేవంత్
బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్లో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.ఒక టీమ్ పోలీసులుగా వ్యవహరించనుండగా, రెండో టీమ్ దొంగలుగా ఉన్నారు. గీతూ రాయల్ మాత్రం స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా ఉంటోంది. అయితే టాస్క్లు రెండు టీమ్లు సభ్యులు బిగ్బాస్ రూల్స్ని బ్రేక్ చేశారు. వస్తువులను కాపాడాల్సిన పోలీసులే.. అడవిలోని విలువైన వస్తువులను దొంగతనం చేశారు. ఇక వస్తువులను కొనాల్సిన గీతూ కూడా కొన్నింటిని కొట్టేసింది.దీంతో బిగ్బాస్ మరోసారి టాస్క్ గురించి వివరించాడు. రైడ్కి వెళ్లిన పోలీసులు సమయానికి మించి అక్కడే ఉంటే..వారిని దొంగలు కిడ్నాప్ చేయ్యొచ్చు. ఈ కండీషన్పై స్టోర్ రూంలోకి వెళ్లిన ఇనయాను దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఇద్దరు దొంగలు మాత్రమే ఇనయాను కిడ్నాప్ చేయాల్సి ఉండగా.. అందరూ వచ్చి ఆమెను పట్టుకున్నారు. తనను తాను తప్పించుకునే క్రమంలో ఇనయా.. ఆరోహిని కాలితో తన్నడంతో పాటు నేహ చెంపపై కొట్టింది. గుండెల మీద పట్టుకొని బయటకు నెట్టి చెంపపై కొట్టిందని రేవంత్తో చెబుతూ నేహా బాధ పడుతుంటే..షూతో ఆరోహి మొహం మీద తన్నిందని రేవంత్ చెప్పాడు. ఇక ఇదే విషయంపై కీర్తి, ఇనయా మధ్య డిస్కషన్ జరిగింది. నేను రైడ్కి వెళ్లే సమయంలో నేహ బెడ్ రూమ్లో ఉందని ఇనయా అంటే..లేదని కీర్తి చెప్పింది..ఇలా ఇద్దరు గొడవపడుతుంటే.. చంటి కలగజేసుకొని ఆ సమయంలో నేహ బెడ్ రూమ్లో లేదని చెప్పడంతో అందరూ కూల్ అయిపోయారు. గీతూ, ఇనయాల మధ్య కూడా కిడ్నాప్ గురించే గొడవ జరిగింది. ఆ సమయంలో దొంగల టీమ్లోని సభ్యులెవరో తన డ్రెస్ని పైకి లాగారని ఇనయా అంటే.. ఇవన్నీ తప్పుడు మాటలని గీతూ మొహం మీదే చెప్పేసింది.‘నువ్ తప్పు మాటలు మాట్లాడుతున్నావ్.. మాటలు మారుస్తున్నావ్ ’అంటూ ఇనయాను రెచ్చగొట్టింది. చివరకు ఇనయా నేను చేసిందే తప్పే..కానీ వాళ్లు చేసింది ఎంతవకు కరెక్ట్? అని చెబుతూనే.. కిడ్నాప్ చేసుకోండి అని ఇంట్లోకి వెళ్లింది. ‘అడవిలో ఆట’ టాస్క్లో ఎలాగైనా గెలిచి కెప్టెన్సీ కంటెండర్ కావాలని గీతూ కన్నింగ్ ప్లాన్ వేసింది. తను కొనుగోలు చేసిన బొమ్మలను కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్లతో డీల్ కుదుర్చుకుంది. అయితే గీతూ ఇచ్చిన డబ్బులను శ్రీహాన్ తీసుకున్నాడు కానీ.. సూర్య మాత్రం తీసుకోలేదు. ఇక దొంగల టీమ్ సభ్యుడైన రేవంత్పై ఆ టీమ్ సభ్యులే అనుమానం వ్యక్తం చేశారు. గీతూతో రేవంత్ డీల్ కుదుర్చుకున్నాడని, అతని బొమ్మలు లేపేద్దామని నేహా, ఆరోహి ప్లాన్ వేశారు. అనుకున్నట్లే రేవంత్ దాచుకున్న బొమ్మలను దొంగిలించారు. దీంతో రేవంత్ కోపంతో ఊగిపోయాడు. తన బొమ్మలను లేపేసిన వారికి సిగ్గూ శరం లేదంటూ మండిపోయాడు. నీతులు చెప్పడమే కాదు పాటించాలి కూడా అంటూ దొంగల టీమ్పై అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా రాత్రంతా నిద్ర పోనని, పోలీసుల టీమ్ని గెలించడమే తన లక్ష్యమని చెప్పాడు. బుధవారం నాటి ఆట ముగిసే సరికి.. శ్రీహాన్, సూర్యల వద్దే ఎక్కువ డబ్బులున్నట్టు కనిపిస్తోంది.అలాగే గీతూ కూడా తనకు కావాల్సిన బొమ్మలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. -
బిగ్బాస్ 6 టైటిల్ నాదే.. వైరల్గా సింగర్ రేవంత్ పోస్ట్
హౌజ్లో ఇంకా అడుగు పెట్టకుండానే టైటిల్ నాదే అంటూ ధిమా వ్యక్తం చేశాడు సింగర్ రేవంత్. అయితే అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ తాజాగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్బాస్ 6వ సీజన్ రేపు గ్రాండ్గా లాంచ్ కాబోతుంది. హౌజ్లో అడుగుపెట్టేది వీరేనంటూ కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ జాబితాలో ఇండియన్ ఐడల్ విజేత సింగర్ రేవంత్ ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: పవన్ కల్యాణ్కి విషెస్ చెప్పని బన్నీ, కారణమిదేనా? తాజాగా ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేశాడు రేవంత్. ‘జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడం చాలా కష్టం... నా కుటుంబాన్ని మిస్ అవుతాను. ముఖ్యం నా భార్యను అలాగే నా సంగీతాన్ని. కానీ ఓ భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటికు వస్తాను. త్వరలోనే మీ అందరి కలుసుకుంటా. ఓటింగ్స్ ద్వారా మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి. మీ అందరిని అలరించేందుకు చివరి రంగం సిద్ధమైంది. మీ అందరి ప్రేమ, ఆశ్వీర్వాదంతో టైటిల్ గెలిచి వస్తాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసి అతడి ఫ్యాన్స్ ‘ఆల్ ది బెస్ట్’ అంటూ రేవంత్ని విష్ చేస్తున్నారు. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి కాగా బిగ్బాస్ హౌజ్లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో ఎలాంటి కాంటాక్ట్ కానీ, అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మూడు నెలల పాటు హౌజ్లో ఉండాలనేది బిగ్బాస్ రూల్. అంతేకాదు హౌజ్లో అడుగుపెట్టేవరకు కంటెస్టెంట్స్ ఎవరూ తాము బిగ్బాస్ ఆఫర్ అందుకున్న విషయాన్ని బయటకు లీక్ చేయొద్దు. అది బిగ్బాస్ రూల్. కానీ రేవంత్ ఇంకా బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టకుండానే అఫిషియల్గా పోస్ట్ షేర్ చేయడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది. మరి ఇది బిగ్బాస్ పర్మిషన్తోనే చేశాడా? లేక ఆత్రుత ఆగలేక తొందరపడి పెట్టేశాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. -
సింగర్ రేవంత్ పెళ్లి, ఫొటోలు వైరల్
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన అన్వితను పెళ్లాడాడు. ఆదివారం (ఫిబ్రవరి 6న) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబర్ 24న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
టెన్త్ క్లాస్ డైరీస్ నుంచి సిలకా సిలకా సాంగ్ వచ్చేసింది..
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులుగా కెమెరామేన్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘సిలకా.. సిలకా.. రామా సిలకా.. ఏదో ఉందే మెలికా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సందర్భంగా ‘గరుడ వేగ’ అంజి మాట్లాడుతూ – ‘‘ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డ్యాన్సర్స్పై ఈ పాటను తెరకెక్కించాం. ఈ పాటలో ఇద్దరు ముంబై డ్యాన్సర్స్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘రోజ్ విల్లా, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత మేం చేస్తోన్న మూడో చిత్రం ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు అచ్యుత రామారావు. -
గ్రాండ్గా సింగర్ రేవంత్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
Singer Revanth Engagement With Anvitha, Pic Goes Viral: ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్గా కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్ ఇండియన్ ఐడల్-9 టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బాహుబలి పార్ట్-1లో మనోహరి పాటతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రేవంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్పనున్నాడు. డిసెంబర్24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రేవంత్కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రేవంత్కి కాబోయే భార్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
మిస్టేక్: ఒక్క పాటకోసం 40 మంది లిల్లీపుట్స్.. సాంగ్ వైరల్
ఇటీవల వచ్చి 'రామ్ అసుర్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అభినవ్ సర్దార్. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా విజయం సాధిస్తున్నాడు. తాజాగా 'మిస్టేక్' అనే మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అభినవ్. ఏఎస్పీ మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతున్న ఈ సినిమాకు అభినవ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా రొమాంటిక్, సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్లో కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఎప్పటికప్పుడూ సినిమా అప్డేట్స్ వదులుతూ చిత్రం పట్ల ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి సాంగ్ 'గంటా గ్రహచారం' విడుదల చేశారు. తాజాగా గుంటూరులోని వీవీఐటీ కాలేజ్లో సుమారు 4 వేల మంది విద్యార్థుల నడుమ రెండో పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ సందడి చేశారు. రేవంత్ 'పిల్లా పిల్లా' అంటూ పాడిన ఈ పాట (TAQUERO MUCHO SONG) యూత్ను తెగ ఆకట్టుకుంటోంది. జంగిల్ థీమ్, మణి జెన్నా సంగీతం, శ్రీరామ్ పిసుపాటి అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. అయితే ఈ పాట కోసం సుమారు 40 మంది లిల్లీపుట్స్ను సేకరించడం విశేషం. అంటే ఈ పాటలో 40 మంది లిల్లీపుట్స్ నటించినట్లు తెలుస్తోంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ మిస్టేక్ చిత్రంతో అభినవ్ సర్ధార్ మరో మెట్టు ఎక్కనున్నాడని చిత్రబృందం అంటోంది. అతి త్వరలో సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. -
‘చిరంజీవి, రామ్ చరణ్ వల్ల మా జీవితమే మారిపోయింది’
‘సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్తో వస్తే ఆదరిస్తారు. పెద్ద స్టార్స్ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చిరంజీవి, రామ్ చరణ్ మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయింది’అన్నారు ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ►చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను. ►నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే. ►నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. ►మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది. మనం వేరే వాళ్లను కాపీ చేస్తే అది కాపీలానే ఉంటుంది. మనలోని యూనిక్ పాయింట్ను తీస్తే అందరూ ప్రశంసిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత నన్ను సత్కరించారు. ► చిరంజీవి ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయన చూశారు. బాగా నచ్చింది. మమ్మల్ని ప్రశంసించారు. ► చిన్నప్పుడు అందరి తల్లిదండ్రుల్లానే నన్ను కూడా రకరకాల క్లాసులకు పంపించారు. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణను చూసి అక్కడే ఉండిపోయాను. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కామర్స్ చదువు, ఫ్యాక్టరీలు చూసుకో అని ఇంట్లోవాళ్లు చెప్పారు. కానీ మనసంతా కూడా నాట్యం మీదే ఉండిపోయింది. కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నన్ను నిరుత్సాహపరచలేదు. పెళ్లి తరువాత కూడా మెట్టింట్లో వాళ్లంతా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ► క్లాసికల్ డ్యాన్స్తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశాం. దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం. కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది. రొహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్. అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయి. ► నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పని చేస్తూ వచ్చాను. అలా హీరోయిన్లా ఎక్కడా ఉండలేకపోయాను. సినిమాను పూర్తి చేసి థియేటర్కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది. ► నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు జనాలు మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలానే ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే.. ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రొత్సాహానిచ్చినట్టు అవుతుంది. ► నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి చాలా ఆదరణ వచ్చింది. ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు. అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చింది. ► నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు. కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు. మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. కెమెరాకు ఆ శక్తి ఉంది. ► మళయాలంలో యూటర్న్ సినిమాను చేశాను. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక నాట్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను. కానీ కమర్షియల్ చిత్రాలను చేయను. డబ్బులు ఎక్కువగా ఇస్తారు కదా? అని ఏది పడితే అది చేయను. ఆ హీరోతో చేస్తే మార్కెట్ పెరుగుతుందనే స్ట్రాటజీలతో సినిమాలు చేయను. మంచి కథ, పాత్ర వస్తే చేస్తాను. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వేస్తాను. అమ్మాయిలకు లీడ్ కారెక్టర్స్ చేయాలనిపించే పాత్రలే చేస్తాను. ► మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్
‘‘కొందరు వ్యక్తులు ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు అంటే వినిపించుకోరు. కానీ కథ ద్వారా చెబితే వింటారు. ‘నాట్యం’ కథ తప్పొప్పులను చెబుతుంది’’ అన్నారు రేవంత్. నాట్యకళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ – ‘‘నాకు విఠలాచార్య, కె. విశ్వనాథ్గార్లంటే అభిమానం. తెలుగులో మంచి సినిమాలంటే ముందుగా కె. విశ్వనాథ్గారు గుర్తుకు వస్తారు. అందుకే దర్శకుడిగా నా తొలి సినిమాను క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో తీయాలనుకుని ‘నాట్యం’ తీశాను. నాట్యం అనే ఊరిలోని ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఆ ఊరిలోని ఓ నాట్యగురువు వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమవుతాడు. అయితే ఈ గురువు శిష్యురాలు తన నాట్య కళ ద్వారా ప్రజలను ఎలా చైతన్యవంతులను చేసింది? అన్నదే కథ. శిష్యురాలి పాత్రను సంధ్యారాజు చేశారు. ఈ సినిమాకు మెయిన్ లీడ్గానే కాదు.. నిర్మాత, సాంకేతిక నిపుణురాలిగా కూడా సంధ్యారాజు ఎంతో కష్టపడ్డారు. కొన్ని సినిమాటిక్ అంశాలను ‘నాట్యం’ చిత్రంలో పొందుపరిచాను’’ అన్నారు. -
ట్విట్టర్ వార్ కేటీఆర్ V/S రేవంత్
-
కాగ్నిజెంట్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ, కుమార్పల్లికి చెందిన సిద్ధోజు రేవంత్ (32) కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. 2013లో అతను మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ షహనాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఇద్దరు శ్రీరాంనగర్ ఏ బ్లాక్లో ఉంటున్నారు. ఏడాది క్రితం రేవంత్ భార్యను ఉద్యోగం మన్పించాడు. ప్రతి వారాంతంలో ఎవరి తల్లిదండ్రుల ఇళ్లకు వారు వెళ్లేవారు. ఈ క్రమంలో శనివారం షహనాజ్ మాదాపూర్లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి తాను ఇంటికి రావడం లేదని భర్తకు మెసేజ్ పెట్టింది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా రేవంత్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో ఆమె అత్తమామలు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది రేవంత్ను పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గచ్చిబౌలి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలి కోసం కొట్టుకున్నారు..
బంజారాహిల్స్: తన ప్రియురాలిని గత రెండు నెలలుగా మాయ మాటలు చెప్పి తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడటమే కాకుండా ఆమెకు ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్మేట్తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రేవంత్ ప్రవర్తన నచ్చని యువతి అతడితో బ్రేకప్ చేసుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్(26) వద్దకు వచ్చింది. కన్సల్టెంట్గా పని చేస్తున్న అఖిల్ తన గదిలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని రేవంత్ కొద్దిరోజులుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. అక్కడి నుంచి రాకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఆమెను తన ఇంటికి పంపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం రాత్రి అఖిల్ను ఫోన్లో బెదిరించాడు. ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు. అఖిల్కు రేవంత్కు మధ్య ఘర్షణ జరగడంతో అఖిల్ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇండియన్ ఐడల్ ఆడిషన్స్కు విశేష స్పందన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్లో బుధవారం సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో ప్రసారం కానున్న ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి 1500 మంది ఔత్సాహిక గాయకులు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆడిషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్–9 విజేత ఎల్.వి.రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులు పరిచయం కానున్నారన్నారు. 10 వ ఇం డియర్ ఐడియల్ హైదరాబాద్తో పా టు వై జాగ్లలో ఆడిషన్స్ను నిర్వహించనుందన్నా రు. గతంలో కంటే ప్రస్తుతం నిర్వహిస్తు న్న ఆ డిషన్స్కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ ఆడిషన్స్లో న్యాయ నిర్ణేతలుగా నీరజ్ కా లాకర్, మంగల్ మిశ్రాలు వ్యవహరించారు. ఆడిషన్స్ మేనేజర్ శర్మ మాట్లాడుతూ... మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇప్పటికి 22 వేల మందికి పైగా ఈ ఆడిషన్స్లో పాలుపంచుకున్నారన్నారు. మొత్తం 200 మందిని ఎం పిక చేసి ముంబాయిలో జరిగే ఆడిషన్స్కు ఎంపిక చేస్తామన్నారు. ప్రస్తుతం రెండు రౌం డ్లల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఈ ఆడిషన్స్కు పలువురు గాయకులు హాజరయ్యారు. -
మూడు కోకిలలు.. ఆరు పాటలు
ప్రతిరోజూ పండగలానే... ఉగాది అనగానే నాకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పిండివంటలు. ఇప్పటివరకు నేను ఎనిమిది భాషల్లో మూడు వందలకు పైగా పాటలు పాడాను. బాలీవుడ్లో కూడా చాలా మంచి పాటలు పాడి పేరు సంపాదించాను. ఉగాది అని ప్రత్యేకంగా చెప్పను కాని ప్రతి రోజూ పండగ లాగానే ఉంటుంది. మన తెలుగువారందరూ విళంబి నామ సంవత్సరంలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రోజూ అందరూ చాలా కష్టపడి పని చెయ్యాలి. నా విషయానికొస్తే నాకైతే ఇంకా అన్ని భాషల్లో పాటలు పాడాలి అని ఉంటుంది. అలాగే నేను నటిస్తానని కూడా అందరికీ తెలుసు. ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘ఉగ్రం’ అనే సినిమాలో జేడీ చక్రవర్తి, నేను కలిసి నటిస్తున్నాం. ఈ ఉగాదికి స్పెషల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో నా కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘దరీమిక్స్’ అనే షో ప్రసారమౌతుంది. నాకు చాలా పేరొస్తుందనే గట్టి నమ్మకముంది. వారానికి ఒక షో రిలీజవుతుంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇందులో సింగింగ్, డాన్సింగ్కి చాలా స్కోప్ ఉంది. హిందీలో మంచి ఆల్బమ్స్ చేస్తున్నాను. వచ్చే ఉగాది లోపు నటుడిగా మంచి అవకాశలొస్తాయని ఆశిస్తున్నా. – శ్రీరామచంద్ర బాలీవుడ్లో ఎంటరవుతా 2017 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని సొంతం చేసుకున్నా. ఈ టైటిల్ను సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉగాది ఇది. మాది మధ్యతరగతి కుటుంబం. కంబైన్డ్ ఫ్యామిలీ. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి పచ్చడి మిస్సవుతానేమో అనుకొన్నాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికంటే ముందే నేను ఉగాది పచ్చడి రుచి చూశాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా వెళ్లే ముందే మా అమ్మగారు నాకు ఉగాది పచ్చడి ఇష్టమని ముందే తయారు చేసి రుచి చూపించారు. గతేడాది ఉగాదికి నేను మన రాష్ట్రాంలోని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఈ ఉగాదికి భారతదేశం మొత్తం తెలుసు. ఎప్పుడైతే నా పేరు పక్కన ‘ఇండియన్ ఐడల్’ అని చేరిందో అది నా జీవితాన్ని మార్చేసింది. ఉగాది పండగ స్పెషల్ ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్ని రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. మనం జీరోలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలాగే మనం ఏదైనా సాధించగానే అందరూ మనవాళ్ల లాగే మన దగ్గరికి వస్తారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కష్టం, మన యాటిట్యూడ్ మాత్రమే మనల్ని మనలా నిలబెడతాయి. అవే మనకెప్పుడూ మనతో పాటు తోడుంటాయి. ఈ ఉగాది సందర్భంగా నేను కొన్ని అనుకొంటున్నాను. అవేంటంటే.. నా సింగింగ్తో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అవుతా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. – రేవంత్ అప్పుడే తీపి విలువ తెలుస్తుంది ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అందరూ బతకటం కోసం తింటే నేను మాత్రం తినడం కోసమే బతుకుతాను. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత కూడా ఉంది కదా. మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేటప్పుడు కనీసం ఫోను కూడా క్యారీ చెయ్యం. ఒక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్ను కూడా మేం డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురాం. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన మనుషులతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. ఎందుకు ఫుడ్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఉగాది పండగలోని ఆరు రుచులు మన లైఫ్ ఫిలాసఫీని గుర్తు చే స్తాయి. అందులో చేదు రుచిని చూస్తేనే కదా మనకు తర్వాత వచ్చే తీపి విలువ తెలుస్తుంది. 2006 సంవత్సరంలో నేను మొదట ఇండియన్ ఐడల్ గెలిచిన ఉగాదిని ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఉగాది నా కెరీర్కే మైల్స్టోన్ లాంటిది. ఆ తర్వాత ఎన్నో బెస్ట్ ఉగాదులు నన్ను పలకరించినా 2017 ఉగాది మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రస్తుతం నాకు సింగింగ్ అనేది వృత్తికాదు, ప్రవృత్తి మాత్రమే. నేను గతేడాది నా సొంత యూట్యూబ్ చానల్ని ప్రారంభించింది ఉగాది రోజునే. అదిప్పుడు పదిలక్షల మంది సభ్యులకు చేరువలో ఉంది. నా చానెల్ కోసం యస్పీ బాలసుబ్రమణ్యం లాంటి వారు వీడియోలు చేయటం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. అలాగే గతేడాది ఉగాది నుండి ఈ ఏడాది ఉగాదికి నేను మూడు పెద్ద పనులు ప్రారంభించాను. అవేంటంటే మొదటిది నాకు నేనుగా నా యూట్యూబ్ చానల్ కోసం సంగీతం తయారు చేసుకోవటం, రెండోది మా పెద్దనాన్న వాళ్లు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. వారు సొంతంగా తయారు చేసుకున్న లలిత సంగీతాన్ని ఇప్పటివరకు మా ఇంట్లో మేం మాత్రమే పాడుకున్నాం. అవి బయట వారికి తెలియవు. ఇప్పుడు వాటిని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజలకు అందజేయటం . ఇక మూడోది కర్ణాటక సంగీత కచేరీలను కూడా మొదలెట్టాను. సినిమాలు కాకుండా ముచ్చటగా ఈ మూడు పనులను ఉగాది నుండి ఉగాది వరకు అన్నట్టు చేసుకున్నాను. ఈ ఉగాదికి ‘సాక్షి’ పాఠకులందరూ ఆరు రుచులతో హాయిగా ఉండాలి. – కారుణ్య -
నాయక్పై నిర్భయ కేసు పెట్టాలి: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్నాయక్పై నిర్భయ కేసు నమోదు చేయాలని టీడీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, స్వేచ్ఛగా విధులను నిర్వహించలేకపోతున్నానని ప్రీతి మీనా ఆరు నెలల క్రితమే సీఎస్, సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన వారిని కాపాడటం కోసం డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, అదే జరిగితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా నాశనం అవుతుందని రేవంత్రెడ్డి హెచ్చరించారు. -
‘బాహుబలి’లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది
- ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ రావులపాలెం (కొత్తపేట) : తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రంలో గాయకుడిగా తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని సినీ గాయకుడు, ఇండియన్ ఐడల్ విజేత కేఎల్ రేవంత్ అన్నారు. రావులపాలెంలో బాహుబలి-2 చిత్రం ప్రదర్శిస్తున్న శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా పారిశ్రామిక విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు ఆధ్వర్యాన గురువారం సాయంత్రం రేవంత్ను ఘనంగా సన్మానించారు. ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఆయనకు రవిరాజు, ప్రభాస్ అభిమానులు పూలకిరీటం, పూలమాలలు, జ్ఞాపిక, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రేవంత్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన సన్నిహితులు, అభిమానులు, పెద్దల ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. ఈ కృషిలో తల్లిదండ్రులు, తోటి గాయకుల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ విజయంలో తన కృషితోపాటు ప్రజల ఓటింగ్ కూడా కీలక పాత్ర పోషించాయన్నారు. రవిరాజు తనకు మంచి మిత్రుడని, ఆయన సహకారంతోనే జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. ప్రభాస్కు తాను పెద్ద అభిమానినని ప్రభాస్ అభిమానుల సమక్షంలో సత్కారం పొందడం సంతోషంగా ఉందని అన్నారు. సచిన్ టెండూల్కర్, ఎస్ఎస్ రాజమౌళి తనకు స్ఫూర్తి అన్నారు. బాహుబలి సినిమాలోని ప్రతి సన్నివేశం అమోఘంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఆయన బాహుబలి-1లో తాను ఆలపించిన ‘మనోహరీ..’ గీతాన్ని ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరో గాయని గీతామాధురి బాహుబలి-2 చిత్రంలోని ‘దండాలయ్యా’ పాట పాడి అలరించారు. కార్యక్రమంలో గాయకుడు శ్రీకృష్ణ, యాంకర్ అశ్వని, ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు వేగిశ్న మణికంఠవర్మ, దాట్ల రాకేష్వర్మ, సయ్యపరాజు నరసింహరాజు, తాడిపూడి బాబు, నడింపల్లి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
అందరి సహకారంతోనే ఈ విజయం
ఇండియన్ ఐడల్ రేవంత్.. విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం శంషాబాద్: ఇండియన్ ఐడల్ను సొంతం చేసుకున్న తెలుగు గాయకుడు రేవంత్కు శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అభిమానులు, కుటుంబ సభ్యులు, మీడియాతోపాటు శ్రేయోభిలాషులందరి సహకారంతోనే తాను ఇండియన్ ఐడల్ను సొంతం చేసుకోగలిగానని అన్నారు. ఆయా వేదికలపై తాను ఆలపించిన ఎన్నో మధురమైన గీతాలు గొప్ప అనుభూతిని మిగిల్చాయన్నారు. -
రేవంత్, రోహిత్లకు ఘనస్వాగతం
గాయకుడు రేవంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో ఎన్నో విజయవంతమైన పాటలు పాడిన రేవంత్ ప్రస్తుతం తన గాత్రాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాడు. రేవంత్తో పాటు మరో యువ గాయకుడు రోహిత్ కూడా ఇండియన్ ఐడల్ వేదిక మీద సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్లో ఫైనల్కు చేరిన ఈ యువ గాయకులు పోటి మధ్యలో కాస్త కాలీ సమయం దొరకటంతో హైదరాబాద్కు వచ్చారు. ఇండియన్ ఐడల్ వేదిక మీద సత్తా చాటిన ఈ ఇద్దరు గాయకులకు ఘనస్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న ఇండియన్ ఐడల్ సీజన్ 9 ఫైనల్స్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది. -
టాప్ సెవన్కు వెళ్లిన రేవంత్
-
టాప్ టెన్లో రేవంత్
తెలుగు ప్రేక్షకులకి రేవంత్ తెలుసు. ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ పాటతో పాటు తెలుగు చిత్రాల్లో పలు హిట్ పాటలు పాడిన ఈ యువ గాయకుడి పేరు ఇప్పుడు బాలీవుడ్లోనూ వినిపిస్తోంది. సోనీ టీవీలో ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్–9’లో రాకింగ్ ఫర్ఫార్మెన్స్తో రేవంత్ ముందుకు దూసుకువెళ్తున్నాడు. ఆల్రెడీ టాప్ 10లోకి ఎంటరైన రేవంత్కి ఈ రోజు (శనివారం) జరగనున్న కాంపిటీషన్ కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తే రేవంత్ టాప్ 8లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అతను ‘ఇండియన్ ఐడల్–9 విన్నర్’గా నిలవడానికి ప్రేక్షకుల ఓటింగ్ (ఎస్సెమ్మెస్), మద్దతు చాలా అవసరమవుతాయి. ఇప్పటికే పలువురు రేవంత్పై అభిమానాన్ని సోనీ టీవీ ఫేస్బుక్ పేజీలో అతని వీడియోకి లైక్స్ కొడుతూ, మద్దతు ఇస్తున్నారు. -
రాష్ట్రంలో కందిబోర్డు ఏర్పాటు చేయాలి
సీఎం కేసీఆర్కు రేవంత్ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కందుల ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో కందుల అభివృద్ధి బోర్డు ఏర్పా టు చేయాలని సీఎం కేసీఆర్ను టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం సీఎంకు లేఖ రాశారు. క్వింటాలు కందులకు 10 వేలకు పైగా ఇచ్చి కొంటామని, ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది 5లక్షల టన్నుల కుపైగా కందులు మార్కెట్కు వస్తున్నాయ న్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదన్నారు. క్వింటాలుకు రూ.450 బోనస్ ఇవ్వాలన్నారు. కాగా, టైగర్ రిజర్వుప్రాజెక్టు పరిధిలో యురేని యం తవ్వకాలను ఆమోదించడానికి వ్యతి రేకంగా నాగర్కర్నూలు జిల్లా ఆమ్రాబా ద్లో బుధవారం టీటీడీపీ బహిరంగసభ నిర్వహిస్తోంది. -
తెలంగాణకు ‘మహా’ అన్యాయం: రేవంత్
-
తెలంగాణకు ‘మహా’ అన్యాయం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టుల విషయం లో తెలంగాణకు అన్యాయం చేశాయని చెబుతున్న కేసీఆర్, అసలు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఎందుకు చెప్పడంలేదని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ మహారాష్ట్రతో చేసుకు న్న ఒప్పందంవల్ల తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతందన్నారు.గురువారం ఇక్కడి ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర, అప్పటి ఏపీ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులు, బ్యారేజ్ల నిర్మాణాలకు సంబంధించి 1975లోనే ఒప్పందాలు చేసుకున్నాయన్నా రు. దీనిపై అంతర్రాష్ట్ర బోర్డు సమావేశాల్లో పునస్సమీక్షించుకునే అవకాశం ఉందని, కేసీఆర్ తప్పును సరిద్దిద్దుకోవాలన్నారు. రీడిజైనింగ్ వల్ల రాష్ట్రంపై రూ.50వేల కోట్ల అదనపు భారం పడుతుందని, ప్రజాధనాన్ని కాపాడ డానికి అవసరమైతే కోర్టు తలుపులు తడతామని రేవంత్ చెప్పారు. -
ఆ ముగ్గురూ మూర్ఖులే!
జైపాల్, రేవంత్, నాగంపై మంత్రి జూపల్లి ధ్వజం కల్వకుర్తి: ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడం తగదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, టీడీపీ నేత రేవంత్రెడ్డి ముగ్గురూ మూర్ఖులుగా వ్యవహరిస్తూ అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు. రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తున్నా.. కావాలనే కుట్రపూరితంగా ఆటంకాలు సృష్టిస్తూ పగటి వేషగాళ్ల వలే వ్యవహరిస్తున్నారన్నారు. -
ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి
చేగుంట మండలం ఉప్పరపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి రేవంత్ అనే మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో పార్టీని వదులుకోను
* సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉంది: చంద్రబాబు * అంకితభావంతో పనిచేస్తే పూర్వ వైభవం వస్తుందని వ్యాఖ్య * పార్టీలో తననెందుకు పక్కన పెట్టారో చెప్పాలని నిలదీసిన మోత్కుపల్లి * గ్రేటర్ ఎన్నికల్లో ఓటమిపై చర్చించని టీ.టీడీపీ విస్తృతస్థాయి సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినా పార్టీకి నష్టం లేదని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో తెలంగాణ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వీడటం దురదృష్టకరమని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని... దేశంలో సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఉన్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు. ఎలాంటి సంక్షోభాన్నయినా ఒక అవకాశంగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో అందరూ అంకితభావంతో పనిచేస్తే పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. నాయకుడిగా గుర్తించడం లేదేం? పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీలో నెలకొన్న పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మైనస్ చంద్రబాబు వల్ల (చంద్రబాబు రాకపోతే) తెలంగాణలో ఏమీ జరగదు. ఉపన్యాసాలకు తావులేదు. నాయకత్వం అవసరం. సీఎంగా బాధ్యతల కోసం చంద్రబాబు ఏపీకి వెళ్లారు. తెలంగాణను వదిలేశారు. తెలంగాణకు చంద్రబాబు రావడం లేదన్న అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది. వారానికి ఒకరోజైనా ఇక్కడ సమయం కేటాయించాలి. తప్పకుండా అన్ని జిల్లాల్లో తిరగాలి. లేకుంటే పూర్వ వైభవం రాదు..’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో చంద్రబాబు మినహా మరే నాయకుడికి స్థానం లేకుండా పోయిందని, వేరేవారిని నాయకుడిగా గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీపై నన్ను మాట్లాడనీయకుండా నా ఎనర్జీని కాపాడారు ఇన్నాళ్లు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో కూడా న న్ను ఎక్కడా ఉపయోగించుకోలేదు. నన్ను ఎందుకు పక్కన బెట్టారో అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మీటింగుల్లో నన్ను ఎక్కడైనా చూశారా? గ్రేటర్ ఎన్నికల్లో నా ప్రమేయం అస్సలు లేదు..’’ అని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్కు అధికార బాధ్యతలుండాలి: రేవంత్ నారా లోకేశ్ను కేంద్ర మంత్రిని చేయాలని పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. ‘‘లోకేశ్కు పార్టీ బాధ్యతలే కాకుండా అధికార బాధ్యతలూ ఉంటే బాగుంటుంది. తద్వారా తెలంగాణలో అధికారులకు ఆదేశాలిచ్చే పరిస్థితి లోకేశ్కు ఉంటుంది. రాజకీయాల్లో హోదా కూడా ముఖ్యమే.’’ అని సూచించారు. తనకు అనుభవం తక్కువని, తప్పటడుగులు, తొట్రుపాట్లు ఉంటాయని సహకరించాలని కోరారు. వారంలో రెండు రోజులు బాబు తెలంగాణకు సమయం కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు గరికపాటి మోహన్రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, గాంధీ, గోపీనాథ్, సండ్ర వెంకట వీరయ్యతో పాటు పార్టీ నేతలు రావుల, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్లో ఓటమి, అభ్యర్థుల ఎంపిక, సీట్ల అమ్మకాల ఫిర్యాదులు, డబ్బు పంపకాల్లో అవకతవకలపై కొందరు నాయకులు చంద్రబాబు, లోకేశ్కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. అయితే విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఓటమిపై చర్చ జరగకపోవడం గమనార్హం. -
కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలున్నాయని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో వంద సీట్లు గెలుస్తామని, ఎంఐఎంతో పొత్తు అవసరం లేద ని మంత్రి కేటీఆర్ చెప్పగా, ఆయన సోదరి కవిత కూడా ఎవరి సాయం లేకుండానే మేయర్ స్థానం దక్కించుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం ఎంఐఎం సహకారంతో మేయర్ స్థానం దక్కించుకుంటామని చెబుతున్నారని, దీన్ని బట్టే వారి కుటుంబంలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోందన్నారు. ఎంఐఎం-టీఆర్ఎస్ కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాము ఏనాడో చెప్పామని గుర్తుచేశారు. సొంత పార్టీలో, కుటుంబంలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి
న్యాయస్థానం నుంచి ఫోరెన్సిక్ రిపోర్టు కోరిన ఏసీబీ కోర్టులో మెమో దాఖలు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ‘ఓటుకు కోట్లు’కేసులో మళ్లీ కదలిక చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో కదలిక కనిపిస్తోంది. కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య స్వరనమూనాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అందజేసిన నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఈ మెమోపై కోర్టు శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతోపాటు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి, ఇతరులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వారి అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు నిందితుల ఫోన్లు, ఆడియో, వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు. స్వర నమూనాల పరిశీలన కోసం వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అలాగే వారి ఒరిజినల్ వాయిస్ కోసం అసెంబ్లీ రికార్డులతో పాటు మీడియాతో సంభాషించిన టేపులను కూడా ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపించారు. వాయిస్ స్పెట్రోగ్రాఫ్ వేవ్స్ ఆధారంగా సంభాషణలను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్... ఆడియో, వీడియో టేపులు నిజమైనవేనని, అందులో కత్తిరింతలు, అతికింపులు ఏమీ లేవని నిర్ధారించింది. చంద్రబాబు వాయిసే కీలకం! ‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీట్ వేయాలంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర నిగ్గు తేలాల్సి ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి పదేపదే తమ ‘బాస్’ చంద్రబాబు అదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్టీఫెన్సన్తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడిన టేపు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో, ఆడియో టేపులు నిజమైనవే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ విషయాలను కోర్టులో దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో ఏసీబీ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తామని అప్పట్లో పేర్కొంది. అయితే సప్లిమెంటరీ చార్జిషీట్ లేదా తుది చార్జిషీట్ వేయాలంటే రేవంత్ మాదిరిగా చంద్రబాబు స్వర నమూనాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇందుకు రికార్డులు, ఒరిజినల్ వాయిస్లను కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఏసీబీ నిర్ణయించింది. దాని ఆధారంగా చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. కానీ తాజా పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాత్రను తేల్చడం తమకు కత్తిమీద సాము లాంటిదేనని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పదో తరగతిలోనే హీస్టోరియా పుస్తకం రాసిన రేవంత్
-
బాబు సమక్షంలో బయటపడ్డ టీటీడీపీ విభేదాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తెలంగాణ శాసనసభలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావులు పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 'పదవులు ఇచ్చింది అధికారం చెలాయించడానికి కాదు. నియోజకవర్గ ఇంఛార్జ్లను బలోపేతం చేయాలి. నేను ఫలానా పదవిలో ఉన్నాను. పెత్తనం చెలాయిస్తాను అనే మాటలొద్దు' అని ఎర్రబెల్లి విమర్శించారు. 'ఏ పదవిలో ఉన్నా పార్టీ కోసమే కష్టపడి పని చేశా. పార్టీలో కష్టపడిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయి. 2007లో పార్టీలో చేరి అంచెలంచలుగా ఎదిగి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను' అని రేవంత్ రెడ్డి వివరించారు. -
‘ఓటుకు కోట్లు’ కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఉచ్చు బిగుసుకుంటోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియో, ఆడియోలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ (ఎఫ్ఎస్ఎల్)కు అందజేశారు. అలాగే కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్తో సండ్ర ఫోన్లో జరిపిన సంభాషణలను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. టేపులన్నీ నిజమైనవేనని నిర్ధారించినందున వారికి స్వర నమూనా పరీక్షలు నిర్వహించాలని గతంలో ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనాలను అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వారిరువురితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ మీడియాతో మాట్లాడిన టేపులను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణకు అందజేయాలంటూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. -
'డ్రైవర్ల ఎంపికలోనూ జాగ్రత్త పడ్డారు'
హైదరాబాద్ : మోతీనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల చుట్టే ఈ వ్యవహారం జరిగిందని, డ్రైవర్ల ఎంపికలోనూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీమ్ జాగ్రత్త పడిందని తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే కీలక భేటీలు జరిగాయని, పార్టీ ఆఫీసు ముందు, క్యాంటీన్లలోనూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భేటీలు జరిగాయని రిపోర్టులో తేలింది. మొదటి మూడు రోజులు పక్కా ప్లాన్ చేసుకుని, మే 30 న రేవంత్ రెడ్డిని ఈ ఆపరేషన్ లోకి సండ్ర దించినట్లు రిపోర్టు కథనంలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏం చేసినా జనార్ధన్ అనే వ్యక్తికి సండ్ర, సెబాస్టియన్ అప్డేట్ చేసేవారు. కొందరు వ్యక్తులను కలవడానికి టీడీపీ నేతలు క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ సాయం తీసుకున్నారు. రెండు పార్టీలు కలుసుకునే విషయంలో సండ్ర టీమ్ చాలా జాగ్రత్తులు తీసుకుంది. సులభంగా గుర్తుపట్టే అడ్రస్లు చెప్పాలంటూ సండ్ర సూచనలిచ్చేవారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్టుపై సెబాస్టియన్ ఎస్ఎమ్ఎస్లు పంపేవాడని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
* రేవంత్కు బెయిల్పై ఏసీబీ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు * నెల రోజులు రిమాండ్లో ఉన్నా మళ్లీ ఎందుకని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో మొదటి నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, ఇతర నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ను ప్రస్తావించేందుకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం వద్ద అవకాశం వచ్చింది. ఏసీబీ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు పూర్వాపరాలను వివరిస్తూ బెయిల్ రద్దు చేయాలని కోరారు. ‘‘జూన్ ఒకటో తేదీన తెలంగాణ శాసన మండలి ఎన్నికల ప్రక్రియకు రెండ్రోజుల ముందు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షల నగదు లంచంగా ఇస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. అయితే ఈలోపే ఉమ్మడి హైకోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ కేసులో, ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెయిల్ ఇవ్వడంతో పలుకుబడి కలిగిన నిందితుడు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించి నిందితుడు ఇప్పటికే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. వాటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అందువల్ల హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలి’’ అని విన్నవించారు. ఈ సందర్భంలో జస్టిస్ అరుణ్ మిశ్రా కల్పించుకుంటూ.. ‘‘ఇప్పటికే నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇందులో 4 రోజులు ఏసీబీ కస్టడీలో ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు కల్పించుకుని ‘‘నిన్న అరెస్టయి ఈరోజు బెయిల్ వస్తే మీరు సవాలు చేయవచ్చు. కానీ నెల రోజుల కింద మీరు అరెస్ట్ చేశారు. ఏ న్యాయమూర్తి అయినా తన విచక్షణకు అనుగుణంగా బెయిల్ విషయంలో ఉత్తర్వులు జారీ చేస్తారు. 1985 నుంచి సుప్రీంకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఉదారంగానే ఉంటోంది. ఇప్పటికే మీరు సీఆర్పీసీ 164 సెక్షన్ కింద నిందితుడి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. దర్యాప్తు కూడా చేశారు. ఈ సమయంలో మేం జోక్యం చేసుకోలేం’ అని వ్యాఖ్యానించారు. -
రేవంత్రెడ్డి విడుదలకు లైన్ క్లియర్
-
రేవంత్తో సంబంధంలేదని ఎందుకు చెప్పరు?
చంద్రబాబును ప్రశ్నించిన కడియం తొర్రూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలోని తొర్రూరులో ఆది వారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు రాష్ర్ట ఏర్పాటును అడ్డుకొని.. నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాలుపంచుకుని రికార్డులతో పట్టుబడిన తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ టా్యిపింగ్ చేసిందని గగ్గొలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. స్వతంత్ర ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబునాయుడు ఫోన్ సంభాషణలు మాత్రమే రికార్డు అయ్యాయి తప్ప ఆయన ఫోన్ను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదన్నారు. -
బాబే A-1ముద్దాయి
అసలు సూత్రధారి చంద్రబాబే అనడానికి బలమైన ఆధారాలున్నాయి వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి గవర్నర్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు వ్యవహారంలో రేవంత్ పాత్రధారే ఏడాది పాలనలో అవినీతిపై దర్యాప్తు జరిపించాలి హైదరాబాద్: ఒక ఎమ్మెల్యే ఓటుకు ఐదుకోట్లు ఎర చూపి అడ్డంగా దొరికిపోయిన ఉదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నందున ఆయనను కేసులో ప్రథమ ముద్దాయిగా (ఏ-1) గా చేర్చాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ఉదంతంలో సూత్రధారి చంద్రబాబే అన్నది వీడియో క్లిప్పింగ్ల్లో స్పష్టంగా వెల్లడైందని, ఈ విషయంలో వెంటనే చంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్న చంద్రబాబు ఏడాది పాలనలో జరిగిన అనేక అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు జరిపించాలన్నారు. జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలతో కలసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని పంపించి రూ.ఐదు కోట్లతో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు. చంద్రబాబు ఏడాది పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందని, వాటన్నింటిపైనా విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి జగన్ రాజ్భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడానికి యత్నించిన చంద్రబాబును ఆ కేసులో ఏ-1గా చేర్చాలని గవర్నర్ను గట్టిగా కోరామని తెలిపారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పదేపదే... మా బాస్ చెబితేనే వచ్చానని చెప్పడంతోపాటు... నేరుగా చంద్రబాబుతో మాట్లాడించి హామీ ఇప్పించారని వీడియోల్లో అంత స్పష్టంగా కనబడుతున్నా ఆయనపై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. చట్టం మీద ప్రజలకు నమ్మకం కల గాలంటే ముఖ్యమంత్రి అయినా సరే నేరం చేసిన వారిని శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంత డబ్బెక్కడిది? తెలంగాణ మండలిలో ఒక్క ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా ఏపీలో ప్రభావం ఉండదని తెలిసినా... ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబుకు అంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అని జగన్ ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకు ఐదు కోట్లివ్వడానికి సిద్ధపడ్డారంటేనే ఏడాది పాలనలో చంద్రబాబు ఎంత దోచుకుంటున్నారో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారమంతా రాజకీయ కుట్ర అనడంపై జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు కూడా తప్పు ఇంకొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తారని దుయ్యబట్టారు. ‘‘అసలిది రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇవ్వడానికి డబ్బు తీసుకెళ్లింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అన్నది వీడియోల్లో స్పష్టంగా కనబడుతోంది. నల్లటి బ్యాగు తెరిచి డబ్బు ఇస్తుంటే చక్కగా నవ్వుతూ రేవంత్ వీడియోలో కనిపిస్తున్నారు. ‘బాస్’ తనకు ఇక్కడకు పంపాడని ఆ ఎమ్మెల్యేనే చెబుతున్నాడు. ఆ ‘బాస్’తో ఫోన్లో కూడా మాట్లాడించాడు. ఇదంతా వీడియో దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంటే... ఇంకా తమపై రాజకీయ కుట్ర జరిగిందంటారా? చంద్రబాబుపై రాజకీయ కుట్ర జరిగిందా? లేక చంద్రబాబే కుట్ర పన్నుతూ పట్టుబడ్డాడా?’’ అని ప్రశ్నించారు. అక్కడో మాట... ఇక్కడోమాట... చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణలో ఒక మాట, ఏపీలో మరో మాట మాట్లాడతారని జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిచ్చే స్థాయికి వైఎస్సార్సీపీ దిగజారిందని తమ పార్టీని బాబు విమర్శించిన అంశాన్ని జగన్ స్వయంగా ప్రస్తావిస్తూ... ‘‘నిజంగా చంద్రబాబుకు ఓ నమస్కారం పెట్టాలి. ఆయనేమో వరంగల్కు వెళ్లి తామిచ్చిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్తారు. ఇక్కడికొచ్చి అన్యాయంగా విడదీశారని గగ్గోలు పెడతారు. కాం గ్రెస్పై ఓ వైపు దుమ్మెత్తి పోస్తూనే ఇటీవల జరిగిన ఏపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి చెందిన సతీష్రెడ్డిని కాంగ్రెస్ మద్దతుతో గెలిపించుకోలేదా? సమైక్య రాష్ట్రంగా ఉన్నపుడు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని విప్ జారీ చేసి మరీ టీడీపీ కాపాడలేదా? ఇలాంటి విలువలు లేని రాజకీయాలు మేం చేయం. మా పార్టీ ఒక్కమాట మీద నిల బడుతుంది. చేయాలనుకున్నది ధైర్యంగా చెప్పే చేస్తాం. రాష్ట్ర విభజన జరిగే వరకూ సమైక్యత కోసం నిజాయితీగా పోరాడిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని చెప్పడానికి గర్విస్తాం. తెలంగాణలో మా పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించడంపై కోర్టుకు వెళ్లి, వారిని అనర్హులను చేయాలని గట్టిగా పోరాడుతున్నాం’’ అని తెలిపారు. గవర్నర్ను కలసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎంపీలు బుట్టా రేణుక, వైఎస్ అవినాష్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, గుమ్మనూరు జయరామయ్య, చింతల రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, వై.సాయిప్రసాద్రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, డాక్టర్ సునీల్, బుగ్గన రాజేంద్రనాథ్, ఎన్.అమరనాథ్ రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, కొత్తకోట ప్రకాష్రెడ్డి, హిందూపురం పార్లమెంటు ఇన్చార్జి డి.శ్రీధర్రెడ్డి ఉన్నారు. ఇదీ బాబు పాలనలో అవినీతి ఏపీలో అడ్డగోలుగా సంపాదిస్తున్న అవినీతి సొమ్ముతో కన్నూ మిన్నూ కానరాకుండా చంద్రబాబు ఏమనుకుంటే అది చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలనలో జరిగిన అవినీతి వ్యవహారాలను వివరించారు.... పట్టిసీమలో ఎంత తిన్నావు? పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని 21.9 శాతం ఎక్సెస్కు (అధిక మొత్తానికి) కాంట్రాక్టర్కు అప్పగించారు. ఈ పనులను మరెవ్వరూ తీసుకోకుండా రెండు కంపెనీలకే అర్హత వచ్చేలా నిబంధనలు రూపొందించారు. పనులు పొందిన కాంట్రాక్టర్ వాస్తవిక వ్యయం కన్నా 21.9 శాతం అధికంగా కోట్ చేస్తే నిబంధనల ప్రకారం ఐదు శాతానికి మించి ఎక్సెస్ ఇవ్వకూడదు. అందువల్ల నిబంధనల్లో లేకపోయినా మిగతా 16.9 శాతం మొత్తాన్ని బోనస్ రూపంలో అదనంగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కేవలం ఆ కాంట్రాక్టర్కు మేలు చేయడానికే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జీవో-22తో ఎంత దోచిపెట్టావు? కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి జీవో నంబర్ 22 జారీ చేశారు. ఈపీసీ ప్రాతిపదికన ఖరారు చేసిన పనుల టెండర్లకు కాస్ట్ ఎస్కలేషన్ (వ్యయం పెరుగుదలను) ఇచ్చే అవకాశమే లేదు. ఇనుము, సిమెంట్ ధరల్లో పెరుగుదల 5 శాతానికి మించినపుడు మాత్రమే వారు ఆ మేరకు పెంచుకునే అవకాశముంది. ఈపీసీ పనుల్లో 40 శాతం మేరకు ఇనుము, సిమెంట్ వ్యయం ఉంటుంది. మిగతా 60 శాతం యంత్రాలు, కూలీల తాలూకు వ్యయంగా ఉంటుంది. చంద్రబాబు కాంట్రాక్టర్లపై ప్రేమ చూపిస్తూ ఈ 60 శాతంపై కూడా 2013 నుంచే మీ ఇష్టప్రకారం పెంచుకోండి అని చెప్పి జీవో ఇవ్వడంలోని ఆంతర్యమేమిటి? బెరైటిస్లో బొక్కింది ఎంత? అంతర్జాతీయ మార్కెట్లో కన్నా రాష్ట్రంలో బెరైటిస్ ధర తక్కువగా ఉన్నప్పుడు దానిని పెంచాల్సింది పోయి ఇంకా ధరను తగ్గించి ఇచ్చారు. ఎఫ్ఓబీ ధర 75 శాతం ఉంటే దాన్ని 65 శాతానికి తగ్గించిన కారణంగా బెరైటిస్ కాంట్రాక్టర్లంతా రింగ్ అయి... రిజర్వుడు ధర కన్నా కేవలం ఒక్క 50 రూపాయలు మాత్రమే పెంచి టెండర్లు వేసిన సంఘటన మన కళ్ల ముందే జరిగింది. స్థానికంగా ఉన్న 200 మిల్లులకు 40 శాతం బెరైటిస్ను ఇవ్వాలనే నిబంధనను కాదని తనకు ఇష్టమొచ్చిన వ్యక్తులకు ధారాదత్తం చేసి 40 వేల మంది కడుపు కొట్టారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు 2008 నుంచి పారిశ్రామిక రాయితీల బకాయిల ఫైలును ఆగమేఘాలపై దులిపి రూ.2,060 కోట్లు చెల్లించిన వ్యవహారంలో 30 శాతం మేరకు కమిషన్లు కొట్టేశారు. తమకు ఇష్టమైన పలు డిస్టిలరీలు ఉత్పత్తులు పెంచుకోవడానికి అనుమతులిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక దందా పెద్దఎత్తున సాగుతోంది. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను స్విస్ ఛాలెంజింగ్ పద్థతిలో ఇస్తామని చంద్రబాబు చెప్పడమంటే... తనకు కావాల్సిన వాళ్లకు భూములు ఇస్తారనే. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు 25 శాతం మేరకు తగ్గితే ఏపీలో మాత్రం తగ్గవని బొగ్గు సరఫరాదారులనుంచి ముడుపులు తీసుకుని అధిక ధరలకు బొగ్గును తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అసాధారణ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం వెనుక ముడుపులు తీసుకుంటున్నారు. -
రేవంత్నే కాదు బాబునూ విచారించాలి:జగదీష్ రెడ్డి
-
స్టీఫెన్కి డబ్బులు ఇస్తున్న రేవంత్రెడ్డి
-
29 వరకు అసెంబ్లీ పొడిగింపు
బడ్జెట్ సమావేశాలపై బీఏసీ భేటీలో నిర్ణయం 28న ద్రవ్య బిల్లుకు ఆమోదం రేవంత్ విషయాన్ని వదిలేయాలని జానా సూచన క్షమాపణ చెప్పేదాక వదలరన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 29 దాకా పొడిగించారు. స్పీకర్ మదుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం జరి గిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా రు. వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు వివిధ పద్దులు, శాఖలవారీ డిమాండ్లపై చర్చించనున్నారు. నాలుగు రోజులూ సభ రెండు పూట ల సమావేశమవుతుంది. తర్వాత శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లును ఉభయసభల్లో ఆమోదించనున్నారు. వివిధ శాఖల పద్దులపై అన్ని పార్టీల అభిప్రాయాలను వెల్లడించే విధంగా ఈ నెలాఖరు దాకా సమావేశాలను పొడిగించాలని పలు పార్టీలు కోరాయి. బడ్జెట్ ఆమోదానికి డిసెంబర్ 2 వరకు అవకాశముందని కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ సభ్యులు గుర్తు చేశారు. శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ను గవర్నర్ ఆమోదించడానికి మూడు రోజు లు అవసరమైనందున, ఈ నెల 29 వరకు సమావేశాలను పొడిగించేందుకు బీఏసీ నిర్ణయించింది. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమం త్రి టి.రాజయ్య, మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, జి.చిన్నారెడ్డి(కాంగ్రెస్), డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), తాటి వెంకటేశ్వర్లు(వైఎస్సార్ కాం గ్రెస్), సున్నం రాజయ్య(సీపీఎం), ఆర్.రవీంద్రకుమార్(సీపీఐ) హాజరయ్యారు. సమావేశం నుంచి టీడీపీ వాకౌట్ బీఏసీలో సభ్యుల సంఖ్య విషయంలో స్పీకర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ వాకౌట్ చేసింది. టీడీపీ తరఫున ఒకరికి సభ్యునిగా, మరొకరికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించాలని గత బీఏసీ భేటీలో నిర్ణయించారు. తాజా భేటీకి టీడీపీ సభ్యుడు రేవంత్రెడ్డి రావొద్దంటూ ప్రభుత్వం షరతు విధించించడంతో తమ పార్టీ నుంచి ఎంతమందికి అవకాశం కల్పిస్తారో రాతపూర్వకంగా చెప్పాలని టీడీపీ సభ్యు లు డిమాండ్ చేయగా స్పీకర్ నిరాకరించారు. దీంతో వాకౌట్ చేస్తున్నట్టుగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, సండ్ర వెంకటవీరయ్య వెళ్లిపోయారు. కాగా ‘రేవంత్ తప్పుగా మాట్లాడినట్టుగా మీరు భావిస్తే ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలిపెట్టండి. వెంటపడి వేధిస్తున్నట్టుగా కనిపించడం ప్రజాస్వామ్యంలో తప్పుడు సంకేతాలిస్తాయి’ అని బీఏసీలో జానారెడ్డి పేర్కొన్నారు. క్షమాపణ చెప్పేదాకా టీఆర్ఎస్ సభ్యులు వదలరని సీఎం వ్యాఖ్యానించారు. -
గ్రీన్ సిగ్నల్ మూవీ ప్లాటీనమ్
-
గ్రీన్ సిగ్నల్ న్యూ మూవీ స్టిల్స్
-
విజృంభించిన సురేంద ర్, రేవంత్
జింఖానా, న్యూస్లైన్: సురేందర్ సింగ్ (4/22), రేవంత్ (3/15) విజృంభించడంతో విశాక జట్టు 103 పరుగుల తేడాతో బడ్డింగ్ స్టార్స్పై గెలిచింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్లో తొలి రోజు బ్యాటింగ్ చేసిన విశాక 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రేవంత్ సాయి (43), మెహర్ ప్రసాద్ (44), అబ్దుల్ మాజీద్ (36) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బడ్డింగ్ స్టార్స్ 83 పరుగులకు ఆలౌటైంది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో బౌలర్స్ రవి (5/14), పవన్ (5/30) చెలరేగడంతో కాకతీయ జట్టు 10 వికెట్ల తేడాతో సదరన్ స్టార్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ స్టార్స్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 44 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ వికెట్లేమీ నష్టపోకుండా 46 పరుగులు చేసి గెలుపొందింది. సత్య సీసీ, భారతీయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన సత్య సీసీ 381 పరుగులు చేసింది. భారతీయ జట్టు బౌలర్లు సోమశేఖర్ 5, అశోక్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. తర్వాత బరిలోకి దిగిన భారతీయ ఒక వికెట్ కోల్పోయి16 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ మెదక్: 147 (నరేష్ 43; హరీష్ 4/16); నిజామాబాద్: 128 (ఈశ్వర్ 30; భరత్ కుమార్ 4/21, మనోహర్ 3/17). ఖమ్మం: 145 (అనిల్ 36; వినోద్ 3/34); ఆదిలాబాద్: 148/2 (ప్రదీప్ 53 నాటౌట్, శ్రవణ్ కుమార్ 47). వరంగల్: 142/7 (నవరసన్ 43); కరీంనగర్: 143/8 (షానవాజ్ 36).