Rovman Powell
-
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విజేత దుబాయ్ క్యాపిటల్స్.. ఫైనల్లో వైపర్స్ చిత్తు
2025 ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) టైటిల్ను దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) చేజిక్కించుకుంది. నిన్న (ఫిబ్రవరి 9) జరిగిన ఫైనల్లో క్యాపిటల్స్ డెజర్ట్ వైపర్స్ను (Desert Vipers) 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో రోవ్మన్ పావెల్ (38 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సికందర్ రజా (12 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్ను గెలిపించారు. Pride. Ecstacy. Honour. Valour. Glory. Legacy. ✨No better & prouder moment for the @Dubai_Capitals, than when they get their hands on the 🏆#Final #DPWorldILT20 #TheFinalPush #AllInForCricket pic.twitter.com/vgOOrqjDid— International League T20 (@ILT20Official) February 9, 2025190 పరుగుల లక్ష్య ఛేదనలో 39 పరుగులకే మూడు వికెట్లు (డేవిడ్ వార్నర్ (4), గుల్బదిన్ నైబ్ (5), సామ్ బిల్లింగ్స్ (6)) కోల్పోయిన క్యాపిటల్స్ను పావెల్, షాయ్ హోప్ (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరూ క్యాపిటల్స్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. ఈ దశలో సామ్ కర్రన్ హోప్ను పెవిలియన్కు పంపి వైపర్స్ను తిరిగి గేమ్లోకి తెచ్చాడు. అయితే హోప్ ఔటయ్యాక కూడా పావెల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్యాపిటల్స్ను గెలుపు రేసులో ఉంచాడు. చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన తరుణంలో సికందర్ రజా మ్యాజిక్ చేశాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన 19వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన రజా.. చివరి ఓవర్లో సిక్సర్, బౌండరీ బాది క్యాపిటల్స్ను తొలి టైటిల్ను అందించాడు. పావెల్ ఔటయ్యాక దుసన్ శనక (10 బంతుల్లో 21; 2 సిక్సర్లు) సికందర్ రజాకు మద్దతుగా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్తో క్యాపిటల్స్ టైటిల్ సాధించేందుకు దోహదపడిన రోవ్మన్ పావెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సామ్ కర్రన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయ్ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓబెద్ మెక్కాయ్ ధాటికి వైపర్స్ 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్, అలెక్స్ హేల్స్ తలో ఐదు పరుగులు చేసి మెక్కాయ్ బౌలింగ్లో ఔటయ్యారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన మ్యాక్స్ హోల్టన్ (51 బంతుల్లో 76; 12 ఫోర్లు), కెప్టెన్ సామ్ కర్రన్ (33 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వైపర్స్ ఇన్నింగ్స్కు జీవం పోశారు. వీరిద్దరు మెరుపు అర్ద శతకాలు చేసి వైపర్స్కు భారీ స్కోర్ అందించారు. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (13 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్యాపిటల్స్ బౌలర్లలో మెక్కాయ్ 2, హైదర్ అలీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన క్యాపిటల్స్ ఆదిలో తడబడింది. షాయ్ హోప్, రోవ్మన్ పావెల్ బాధ్యతాయుతమై ఇన్నింగ్స్లు ఆడి క్యాపిటల్స్ను గేమ్లో ఉంచారు. ఆఖర్లో సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడి క్యాపిటల్స్ను విజయతీరాలకు చేర్చాడు. పావెల్, హోప్, రజా దెబ్బకు క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, డేవిడ్ పేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, నాథన్ సౌటర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, దుబాయ్ క్యాపిటల్స్ ఈ టోర్నీలో మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ఎడిషన్లో గల్ఫ్ జెయింట్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్లో ఎంఐ ఎమిరేట్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్పై గెలుపొంది టైటిల్ గెలుచుకుంది. వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరిన క్యాపిటల్స్ ఎట్టకేలకు టైటిల్ను కైవసం చేసుకుంది. -
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్కు తప్పని ఓటమి
ఇంగ్లండ్తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి క్లీన్స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
WI vs ENG 2nd T20: స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?
క్రికెట్లో సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు యార్కర్లు వేయడం మనం చూస్తుంటాం. అదే ఓ స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య తాజాగా జరిగిన టీ20 మ్యాచ్లో ఓ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అద్భుతమైన యార్కర్ను సంధించాడు. స్పిన్నర్ నుంచి అనూహ్యంగా యార్కర్ లెంగ్త్ బాల్ రావడంతో బ్యాటర్ చేసేదేమీ లేక నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు.AN OFF SPINNER WITH A YORKER. 🤯- Dan Mousley bamboozled Rovman Powell. 🔥 pic.twitter.com/UnFQHjOsmG— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాటర్ రోవ్మన్ పావెల్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి జోరు మీదున్నాడు. ఈ దశలో ఇంగ్లండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ డాన్ మౌస్లీ కళ్లు చెదిరే యార్కర్తో రోవ్మన్ పావెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మౌస్లీ సంధించిన యార్కర్ లెంగ్త్ బంతికి రోవ్మన్ దగ్గర సమాధానం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.కాగా, వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్మన్ పావెల్ (43) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (45 బంతుల్లో 83; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 14.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్కు జతగా విల్ జాక్స్ (29 బంతుల్లో 38), లివింగ్స్టోన్ (11 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా.. జేకబ్ బేతెల్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0 ఆధిక్యంలో వెళ్లింది. -
SL vs WI 2nd T20I: విండీస్ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్ను 1-1తో సమం చేసింది.పరిమిత ఓవర్ల సిరీస్ కోసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్కు దంబుల్లా, వన్డే సిరీస్కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.నిసాంక హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.బౌలర్లు పడగొట్టేశారుఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు దూరం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోషఫ్, కైల్ మైర్స్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ జట్టుకు రోవ్మాన్ పావెల్ మరోసారి సారథ్యం వహించనున్నాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్రౌండర్ రోస్టన్ చేజ్ వ్యవరించారు. ఇక ఈ జట్టులో వెటరన్ ఆల్రౌండర్ ఫాబియన్ అలెన్, పేసర్ మాథ్యూ ఫోర్డ్, యంగ్ బ్యాటర్ అలిక్ అథనాజ్లకు చోటు దక్కింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. ఆగస్టు 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్లు కూడా ట్రినిడాడ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే ప్రోటీస్ జట్టు విండీస్ టెస్టు సిరీస్ను 0-1తో సొంతం చేసుకుంది.దక్షిణాఫ్రికాతో టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, ఫాబియన్ అలెన్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. -
చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం: వెస్టిండీస్ కెప్టెన్
టీ20 వరల్డ్కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ ప్రయాణం ముగిసింది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ పరాజయం పాలైంది.చివరి వరకు విండీస్ అద్బుతంగా పోరాడనప్పటకి విజయం మాత్రం ప్రోటీస్నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులకే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ప్రోటీస్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు. అయితే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక దక్షిణాఫ్రికా వికెట్ల పతనం కొనసాగింది.చివరికి ఆల్రౌండర్ మార్కో జానెసన్ 21 పరుగులతో ఆజేయంగా నిలిచి దక్షిణాఫ్రికాను సెమీస్కు చేర్చాడు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రావెమన్ పావెల్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని పావెల్ తెలిపాడు."ఈ మ్యాచ్లో ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆఖరి వరకు పోరాడినందుకు మా బాయ్స్కు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాము.సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాం. కానీ 135 పరుగులను కాపాడుకోగలమని మా బౌలర్లు విశ్వసించారు. అందుకు తగ్గట్టు చివరివరకు తమ వంతు ప్రయత్నం చేశారు. మేము సెమీఫైనల్కు చేరుకోపోవచ్చు గానీ గత 12 నెలలగా మేము బాగా ఆడుతున్నాం. ఈ టోర్నీలోమాకు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇది నిజంగా మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికి ధన్యవాదాలని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో పావెల్ పేర్కొన్నాడు. -
చెలరేగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్ ఓపెనర్లు చార్లెస్, కింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ వికెట్కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగులు చేసిన కింగ్ గాయం కారణంగా రిటైర్డ్హట్గా వెనుదిరిగాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. చార్లెస్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చార్లెస్ ఔటయ్యాక కెప్టెన్ రావ్మెన్ పావెల్ సైతం తన బ్యాట్కు పని చెప్పాడు.విండీస్ బ్యాటర్లలో చార్లెస్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పూరన్(36), పావెల్(36), రుథర్ఫార్డ్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అర్చర్, కుర్రాన్, మొయిన్ అలీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 WC: రోహిత్ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024లో సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్ తమ స్వదేశంలో ఆరు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి దశ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్లు మాత్రమే ఇరు జట్లు ఆడనునున్నాయి. టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత మరో మూడు మ్యాచ్లు జరగనున్నాయి.మే 23న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రోటీస్తో సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు ఐపీఎల్-2024లో భాగమైన విండీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్మెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్మైర్ వంటి కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్కు సన్నద్దమవుతున్నారు. ఈ సిరీస్లో విండీస్ కెప్టెన్గా బ్రాండన్ కింగ్ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్. -
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్కప్లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్లో ఈసారి వరల్డ్కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్తో మ్యాచ్లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో రాజస్తాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కోల్కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్మన్ పావెల్తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్గా వార్నర్
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోవ్మన్ పావెల్ స్థానంలో వార్నర్ అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈసారి ఐఎల్టీ20 లీగ్లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్మన్ పావెల్ కెప్టెన్గా వ్యవహరించాడు. పది మ్యాచ్లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్కు టీ20లలో బ్యాటర్గానూ మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్మన్ పావెల్, రోలోఫ్ వాన్డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Dubai Capitals (@dubaicapitals) -
ఇంగ్లండ్ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్ విండీస్దే..!
ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. గుడకేశ్ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్ (4-0-25-2), అకీల్ హొసేన్ (4-0-20-2),హోల్డర్ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిలిప్ సాల్ట్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. లివింగ్స్టోన్ (28), మొయిన్ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్ ఛార్లెస్ (27), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (30) సాయంతో షాయ్ హోప్ (43 నాటౌట్) విండీస్ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ వెనువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్ సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్.. వరుసగా రెండు సిరీస్లను కోల్పోయింది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్ను చేజార్చుకుంది. -
ఐపీఎల్ వేలంలో జాక్పాట్ కొట్టిన విండీస్ కెప్టెన్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2024 మినీ వేలంలో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్కు జాక్పాట్ తగిలింది. పావెల్ను రూ.7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా ఉన్న పావెల్ కోసం కోల్కత్ నైట్రైడర్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఎంతైనా తగ్గేదేలే అని భావించిన రాజస్తాన్.. భారీ మొత్తానికి పావెల్ను దక్కించుకుంది. కాగా పావెల్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని రూ.2.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2024 సీజన్కు ముందు పావెల్ను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన పావెల్పై కాసుల వర్షం కురిసింది. కాగా టీ20ల్లో పావెల్కు మంచి రికార్డు ఉంది. వరల్డ్క్రికెట్లో విధ్వంసకర ఆటగాడిగా పావెల్కు పేరొంది. ఇప్పటివరకు 66 మ్యాచ్లు ఆడిన పావెల్ 1202 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ పావెల్ అదరగొడుతున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!? -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో పేస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్పై టీ20 సిరీస్లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
శివాలెత్తిన గప్తిల్.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్కు పోలార్డ్ (32 బంతుల్లో 46; ఫోర్, 4 సిక్సర్లు), మార్క్ దెయాల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. Raise your bat Martin Guptill. What a knock from the kiwi sensation 🙌 #CPL23 #BRvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Betbarter @BetBarteronline pic.twitter.com/GdqWmEzPx5 — CPL T20 (@CPL) August 31, 2023 నైట్రైడర్స్లో గప్తిల్, పోలార్డ్తో పాటు నికోలస్ పూరన్ (6), ఆండ్రీ రసెల్ (5), డ్వేన్ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్ ధాటికి బార్బడోస్ బౌలర్ ఓబెద్ మెక్కాయ్ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్ మరో బార్బడోస్ బౌలర్ రకీమ్ కార్న్వాల్ను కూడా ఆడుకున్నాడు. కార్న్వాల్ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2.. కైస్ అహ్మద్, వాన్ డర్ మెర్వ్ తలో వికెట్ దక్కించుకున్నారు. వకార్ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్.. నైట్రైడర్స్ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్.. వకార్ సలామ్ కైల్ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్ (2-0-13-2), అకీల్ హొసేన్ (4-0-16-2), సునీల్ నరైన్ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు రకీమ్ కార్న్వాల్, కైల్ మేయర్స్ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్ (5), అథనేజ్ (2), కెవిన్ విక్హమ్ (9), యంగ్ (3), వాన్ డర్ మెర్వ్ (3), ఓబెద్ మెక్ కాయ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్ హోల్డర్ (14), రోవ్మన్ పావెల్ (10), కైస్ అహ్మద్ (10 నాటౌట్) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. -
నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్లను కోల్పోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు సొంతం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్పై విండీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ చివరగా 2017లో టీమిండియాపై టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక చారిత్రత్మక సిరీస్ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ స్పందించాడు. "టీ20 సిరీస్ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఏమి మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఆఖరి మ్యాచ్లో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డాం. మ్యాచ్కు ముందు రోజు సాయంత్రం మేము ఓ మీటింగ్ పెట్టుకున్నాం. కరేబియన్ ప్రజలు మన నుంచి గెలుపు ఆశిస్తున్నారని మా బాయ్స్కు చెప్పా. మేము విజయం సాధించడంలో కోచింగ్ స్టాప్ది కీలక పాత్ర. మేము వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చెందడంతో కాస్త నిరాశ చెందాము. కానీ మా కోచింగ్ స్టాప్ మాత్రం మాకు మద్దతుగా నిలిచారు. ఈ సిరీస్లో మా జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నారు. జట్టులో ఎవరో ఒకరు రాణించినా కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఈ సిరీస్లో మాకు కీలక విజయాలు అందించాడు. అతడు మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. అదే విధంగా మాకు సపోర్ట్గా నిలిచిన విండీస్ క్రికెట్కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పావెల్ పేర్కొన్నాడు. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Drought broken 👏 The West Indies claim T20I series bragging rights over India in Florida! More from #WIvIND 👇https://t.co/dvEJ9cwGIw — ICC (@ICC) August 14, 2023 -
IND VS WI 5th T20: టాస్ గెలిచిన టీమిండియా.. అదే జట్టుతో బరిలోకి..!
5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫ్లోరిడా వేదికగా విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయి 0-2తో వెనుకపడిన భారత్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచి 2-2తో సిరీస్లో సమంగా నిలిచింది. చివరిదైన ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. నాలుగో మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టునే టీమిండియా యధాతథంగా కొనసాగించగా.. విండీస్ ఓ మార్పు చేసింది. ఒబెద్ మెక్కాయ్ స్థానంలో అల్జరీ జోసఫ్ బరిలోకి దిగాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
విండీస్తో టీమిండియా కీలక పోరు.. వెస్టిండీస్ స్కోరు ఎంతంటే!
India tour of West Indies, 2023 - West Indies vs India, 4th T20I: టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు 3, కుల్దీప్ యాదవ్కు రెండు, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్కు ఒక్కో వికెట్ దక్కాయి. 19.2: అర్ష్దీప్ మరోసారి అర్ష్దీప్ బౌలింగ్లో హెట్మైర్ అవుట్. 61 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించిన హిట్టర్. విండీస్ స్కోరు 171/8 (19.3) ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 15.3: ముకేశ్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయిన జేసన్ హోల్డర్. స్కోరు: 132-7 14.2: అక్షర్ పటేల్కు తొలి వికెట్ షెపర్డ్(9) రూపంలో వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో షెపర్డ్ ఇచ్చిన క్యాచ్ను సంజూ ఒడిసిపట్టాడు. స్కోరు: 119/6 (14.3) ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12.5: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ వెస్టిండీస్కు షాకిచ్చాడు. అర్ధ శతకం దిశగా వెళ్తున్న షాయీ హోప్[45(29)]ను పెవిలియన్కు పంపాడు. 109/5 (13.3) 12 ఓవర్లలో విండీస్ స్కోరు: 102/4 నిలకడగా ఆడుతున్న షాయీ హోప్(43), హెట్మెయిర్(22) 10 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 79/4 6.5: మళ్లీ దెబ్బేసిన కుల్దీప్ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఏడో ఓవర్ మొదటి బంతికి పూరన్ను అవుట్ చేసిన ఈ స్టార్ స్పిన్నర్.. ఐదో బంతికి విండీస్ సారథి పావెల్(1)ను అవుట్ చేశాడు. స్కోరు: 57-4(7) 6.1: మూడో వికెట్ కోల్పోయిన విండీస్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్కు భారీ షాకిచ్చాడు. బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్(1)ను పెవిలియన్కు పంపాడు. విండీస్ స్కోరు: 55/3 (6.1) 5.4: విండీస్ను దెబ్బకొట్టిన అర్ష్దీప్ బ్రాండన్ కింగ్[18(16)] రూపంలో రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్. 5 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 48-1 1.4: తొలి వికెట్ కోల్పోయిన విండీస్ అర్ష్దీప్ బౌలింగ్లో మేయర్స్ [17(7)] అవుట్. కింగ్, షాయీ హోప్ క్రీజులో ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 టాస్ గెలిచిన వెస్టిండీస్ వెస్టిండీస్ మరో కీలక మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం నాటి నాలుగో టీ20కి అమెరికాలోని ఫ్లోరిడా వేదికైంది. రీజినల్ పార్క్ స్టేడియంలో హార్దిక్ సేన.. రోవ్మన్ పావెల్ బృందంతో తలపడేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించగా.. వెస్టిండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కాగా ఫ్లోరిడా పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 13 టి20 మ్యాచ్లలో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య విండీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో విజయం సాధిస్తేనే భారత జట్టు సిరీస్ సాధించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. మనకు ఎవరూ సపోర్ట్ చేయరు: షాదాబ్ ఖాన్ -
IND VS WI 3rd T20: టాస్ ఓడిన టీమిండియా, యశస్వి జైస్వాల్ అరంగేట్రం
5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గయానా వేదికగా విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 8) జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి 0-2తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఇషాన్ కిషన్ స్థానంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులో చేరాడు. మరోవైపు విండీస్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆడిన జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ ఛేజ్ బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
విండీస్తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా, ఒక్క మార్పు
5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గయానా వేదికగా విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో తొలి టీ20 ఓడి 0-1తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్లో ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20 ఆడిన కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
'చాలా సంతోషంగా ఉంది.. టీమిండియాను చూశాక తప్పుచేశా అనుకున్నా'
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో కరేబియన్లు అదరగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ స్పందించాడు. తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ పావెల్ చెప్పుకొచ్చాడు. మేము ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డాం. ఏదైమనప్పటికీ విజయంతో సిరీస్ను ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో తొలుత భారత బౌలింగ్ ఎటాక్ చూశాక, మేము అదనంగా ఒక స్పిన్నర్ను తీసుకుని వుంటే బాగుండేది అన్పించింది. కానీ మా ఫాస్ట్ బౌలర్లు మరో స్పిన్నర్ అవసరం లేకుండా చేశారు. మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. ట్రినిడాడ్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ మ్యాచ్లో పవర్ప్లేలో మాకు మంచి స్కోర్ వచ్చింది. కానీ మిడిల్ ఓవర్లలో పెద్దగా పరుగులు సాధించలేకపోయాము. మిడిల్ఓవర్లలో విండీస్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో అన్నదానిపై సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక హోల్డర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పావెల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత్-విండీస్ మధ్య రెండో టీ20 ఆగస్టు 6న గయానా వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్! వీడియో వైరల్ -
ఆదుకున్న పూరన్, పావెల్.. టీమిండియా టార్గెట్ 150
టీమిండియాతో జరుగుతున్న తొలి టి20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రోవ్మెన్ పావెల్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. నికోలస్ పూరన్ 34 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో యజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్లు చెరో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు చెరొక వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ను యజువేంద్ర చాహల్ దెబ్బకొట్టాడు. ఆదిలోనే కీలకమైన కైల్ మేయర్స్(1) బ్రాండన్ కింగ్(28)లను వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన జాన్సన్ చార్లెస్(3)ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. కష్టాల్లో పడిన విండీస్ను కెప్టెన్ పావెల్, పూరన్ ఆదుకున్నారు. వీళ్లు వికెట్కు పరుగులు జోడించారు. దాంతో, ఆతిథ్య జట్టు పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. చదవండి: Tilak Varma: స్టన్నింగ్ క్యాచ్తో మెరిసిన తిలక్ వర్మ -
టాస్ గెలిచిన వెస్టిండీస్.. జైశ్వాల్కు దక్కని చోటు
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను ముగించుకున్న టీమిండియా ఇక టి20 సిరీస్పై దృష్టి పెట్టింది. రోహిత్, కోహ్లి సహా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్తో తలపడనుంది. గురువారం ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో విండీస్, భారత్ల మధ్య తొలి టి20 మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్లో సెంచరీతో రాణించిన యశస్వి జైశ్వాల్కు తొలి టి20లో చోటు దక్కలేదు. దీంతో తొలి టి20లో ఓపెనర్లుగా గిల్, ఇషాన్ కిషన్ రానున్నారు. వన్డౌన్లో సంజూ శాంసన్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్లు రానున్నారు. ఇక బౌలింగ్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది. స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్లు ఉండగా.. ముకేశ్ కుమార్ టి20ల్లో అరంగేట్రం చేయనుండగా.. అర్ష్దీప్ సింగ్ ప్రధాన పేసర్గా ఉన్నాడు. ఇక నికోలస్ పూరన్, అల్జారీ జోసెఫ్ల రాకతో విండీస్ టి20 జట్టు బలంగా కనిపిస్తోంది. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్నే తప్పించిన విండీస్
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్ దశ మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. నెదర్లాండ్స్తో ఇవాళ (జూన్ 26) జరిగే కీలక మ్యాచ్కు ఏకంగా వైస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్నే దూరం పెట్టింది. అతనితో పాటు గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ఆల్రౌండర్ కైల్ మేయర్స్ను కూడా పక్కన పెట్టింది. రోవ్మన్ పావెల్ గత కొన్ని మ్యాచ్లుగా చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్తో మ్యాచ్కు పావెల్ స్థానంలో రొమారియో షెపర్డ్, కైల్మేయర్స్ స్థానంలో షమారా బ్రూక్స్ను తుది జట్టుకు ఎంపిక చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (16), జాన్సన్ ఛార్లెస్ (27) క్రీజ్లో ఉన్నారు. కాగా, విండీస్ ఇదివరకే సూపర్ సిక్స్కు చేరినా నెదర్లాండ్స్పై గెలుపు తదుపరి దశలో ఆ జట్టుకు కీలకం కానున్న నేపథ్యంలో విండీస్ మేనేజ్మెంట్ కీలక ఆటగాడిని తప్పించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్తో మ్యాచ్లో విండీస్ గెలిస్తే రెండు పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్కు చేరుతుంది. ఫైనల్కు చేరే క్రమంలో ఈ పాయింట్లు ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాయి. మరోవైపు గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా ఉన్న జింబాబ్వే.. తమతో పాటు సూపర్ సిక్స్కు చేరుకున్న విండీస్, నెదర్లాండ్స్లపై విజయాలు సాధించినందున 4 పాయింట్లు ఖాతా పెట్టుకుని సూపర్ సిక్స్కు చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు (జూన్ 27) జరుగబోయే మ్యాచ్ అనంతరం ఏ జట్టు 4 పాయింట్లతో సూపర్ సిక్స్కు చేరుతుందో తెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లు, ఓడిన జట్టు 2 పాయింట్లతో సూపర్ సిక్స్కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ దశలో ఈ పాయింట్లు కలుపుకుని ఒక్కో జట్టు 3 మ్యాచ్లు ఆడిన అనంతరం ఏ జట్లు టాప్-2లో ఉంటాయో అవి ఫైనల్లో తలపడటంతో పాటు ఈ ఏడాది చివరల్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. -
IPL 2023: వైరలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ పెళ్లి ఫోటోలు
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇటీవలే తన లాంగ్ టర్మ్ పార్ట్నర్ గ్రెటా మాక్ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గ్రేస్టౌన్లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. వివాహ వేడుకలో మార్ష్ బ్లాక్ కలర్ సూట్లో మెరిసిపోగా.. మాక్, సంప్రదాయ తెల్లని గౌనులో తళుక్కుమంది. నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, పెళ్లి నిమిత్తం మార్ష్ ఐపీఎల్-2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్కు మార్ష్ అందుబాటులో లేడు. డీసీ ఆడబోయే మరో 3, 4 మ్యాచ్లకు మార్ష్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మార్ష్ గైర్హాజరీలో డీసీ రోవ్మన్ పావెల్ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో అతను దారుణంగా నిరాశపరిచాడు. దీంతో మార్ష్ లేని లోటు డీసీ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢీకొంటుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ మ్యాచ్లో తలపడబోయే ఇరు జట్లు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్ను ఇరు జట్లు చాలా సీరియస్గా తీసుకోనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. -
అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్
టి20 క్రికెట్లో మ్యాచ్ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించరు. ఓవర్ ఓవర్కు ఫలితాలు మారుతాయి కాబట్టే పొట్టి క్రికెట్కు అంత ఆదరణ దక్కింది. కొన్ని జట్లు ఒక్క పరుగుతో ఓడిపోయిన సందర్భాలు చూసే ఉంటారు. కానీ తొలి ఇన్నింగ్స్లో చివరి ఓవర్లో పరుగుల పండగ చేసుకున్న జట్టు.. ఆ ఓవర్లో వచ్చిన పరుగులతోనే మ్యాచ్ విజయాన్ని శాసించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఫీట్ సౌతాఫ్రికా, వెస్టిండీస్ల మధ్య జరిగిన మూడో టి20లో నమోదైంది. మంగళవారం జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టి20లో సౌతాఫ్రికా ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్కు తోడుగా.. ఐడెన్ మార్ర్కమ్ 18 బంతుల్లో 35 నాటౌట్ రాణించినప్పటికి సౌతాఫ్రికాను గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్లతో రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. తొలుత బ్రాండన్ కింగ్ 25 బంతుల్లో 36, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్ 22 బంతుల్లో 44 పరుగులు నాటౌట్, అల్జారీ జోసెఫ్ 9 బంతుల్లో 14 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు.. 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. స్ట్రైక్ తీసుకున్న షెపర్డ్ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన షెపర్డ్ వరుసగా నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు రావడంతో ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. చిత్రంగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్లో 26 పరుగులు బాదితే.. టార్గెట్లో సౌతాఫ్రికాకు ఆఖరి ఓవర్లో అదే 26 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తొలి ఇన్నింగ్స్ కాబట్టి ఒత్తిడి ఉండదు.. కానీ రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడి ప్రొటిస్ విజయాన్ని దెబ్బతీసింది.ఈ విజయంతో వెస్టిండీస్ 2-1 తేడాతో టి20 సిరీస్ను కైవసం చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్ జట్టు టి20 సిరీస్ను గెలవడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అల్జారీ జోసెఫ్ నిలవగా.. జాన్సన్ చార్లెస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. West Indies vs South Africa 3rd T20 highlight WI 220-8(20)/213-6(20)SA#Highlights #SAvsWI #3rdt20 Watch full highlight on YouTube 👇https://t.co/tZW9e0Hbqc 1k subscribers Kara do yarr🙏 Share please #cricket pic.twitter.com/VJELBSzoVL — cricket kida (@cricket_kida1) March 29, 2023 First SERIES WIN as CAPTAIN! Thanks to all involved, until next time South Africa 🇿🇦.#Rpowell52 pic.twitter.com/703d9d74Wy — Rovman Powell (@Ravipowell26) March 29, 2023 చదవండి: చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన -
పావెల్ విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ సంచలన విజయం
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: SA vs WI: డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే! -
క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్
వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్మన్ పావెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పావెల్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారీ సిక్సర్ బాదిన పావెల్.. ఈ మ్యాచ్లో పావెల్ 116 మీటర్ల ఓ భారీ సిక్సర్ బాదాడు. 15 ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్ బౌలింగ్లో తొలి బంతిని పావెల్ సిక్స్గా మలిచాడు. పావెల్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దెబ్బకు నవాజ్కు ప్యూజ్లు ఎగిరిపోయాయి. పావెల్ కొట్టిన సిక్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగెస్ట్ సిక్స్ల్లో ఒకటిగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 8 వికెట్ల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇదే మ్యాచ్లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్లతో 115 పరుగులు సాధించాడు. చదవండి: BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు.. Rovman Powell, what a shot 👏 #HBLPSL8 pic.twitter.com/hrJaON9hLL — Farid Khan (@_FaridKhan) March 8, 2023 -
రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా కరాచీ కింగ్స్తో నిన్న (మార్చి 1) జరిగిన మ్యాచ్లో పెషావర్ జల్మీ జట్టు 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్.. కోహ్లెర్ కాడ్మోర్ (45 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్ (29 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవమన్ పావెల్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కరాచీ బౌలర్లలో మహ్మద్ అమీర్ (4-0-26-4) నిప్పులు చెరగగా.. షంషి (1/25), ఆమెర్ యామిన్ (4-1-38-0) పర్వాలేదనిపించారు. అనంతరం198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 53; 9 ఫోర్లు), ఇమాద్ వసీం (30 బంతుల్లో 57 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. పెషావర్ బౌలరల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆమెర్ జమాల్ తలో 3 వికెట్లు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2 వికెట్లు పడగొట్టారు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన బాబర్ ఆజమ్ సేనను మెరుపు అర్ధశతకంతో గట్టెక్కించిన రోవమన్ పావెల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్లో ఇవాళ (మార్చి 2) లాహోర్ ఖలందర్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. 17 మ్యాచ్లు పూర్తయ్యేసరికి లాహోర్ ఖలందర్స్ (5 మ్యాచ్ల్లో 4 విజయలతో 8 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి. -
వెస్టిండీస్ టీ20 కెప్టెన్గా విధ్వంసకర వీరుడు..
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు పరిమిత ఓవర్ల కొత్త కెప్టెన్లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు షాయ్ హోప్ ఎంపికవ్వగా.. టీ20లకు విధ్వంసకర ఆల్రౌండర్ రోవ్మన్ పావెల్ నియమితుడయ్యాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ నికోలస్ పూరన్ విండీస్ వైట్ బాల్ కెప్టెన్సీకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో వీరిద్దరూ బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 16 నుంచి దక్షిణాఫ్రికాతో జరగున్న వన్డే, టీ20 సిరీస్లతో సారథిలగా వీళ్ల ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా 2019 నుంచి విండీస్ వన్డే జట్టుకు హోప్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 104 వన్డే మ్యాచ్లు ఆడిన అతడు 48.08 సగటుతో 4308 పరుగులు చేశాడు. అదే విధంగా రోవ్మన్ పావెల్ కూడా విండీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో కెప్టెన్గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గత ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్న జమైకా తల్లావాస్కు పావెల్ సారథిగా వ్యవహరించాడు. అదే విధంగా అతడు కెప్టెన్గా జమైకా స్కార్పియన్స్కు యునైటెడ్ సూపర్50 కప్ టైటిల్ను కూడా అందించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్ రెండు టెస్టులు,మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో అతిథ్య జట్టుతో తలపడనుంది. చదవండి: T20 WC: టీ20 ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్తో 🚨BREAKING NEWS🚨 CWI announces new captains for White-Ball formats. Read More⬇️ https://t.co/Bmw7qILA9p pic.twitter.com/suNk7ndqKE — Windies Cricket (@windiescricket) February 15, 2023 -
మూడు పరుగులతో శతకం మిస్.. చేయాల్సిన విధ్వంసం చేసేశాడు
విండీస్ హార్డ్ హిట్టర్ రోవ్మెన్ పావెల్ ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) క్రికెట్లో తుఫాన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటైనప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసిపారేశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి తోడుగా జో రూట్ కూడా 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ తరపున రోవ్మెన్ పావెల్ 45 వన్డేల్లో 897 పరుగులు, 55 టి20ల్లో 890 పరుగులు సాధించాడు. మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. The captain came out all guns blazing 💥 A 100+ partnership with Root, 10 6️⃣s, 97 runs 🤩 It was indeed a captain's inning from @Ravipowell26. Book your tickets from https://t.co/VekRYhpzz6#DPWorldILT20 #ALeagueApart #MIEvDC pic.twitter.com/YWYuCo8qFl — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్లోనే నైట్ రైడర్స్కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్లో తదుపరి మ్యాచ్లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్లో మొత్తం 34 మ్యాచ్లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్ను జీ నెట్వర్క్స్లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు -
క్రికెటర్ జీవితాన్ని మార్చిన పీఈటీ టీచర్
విండీస్ క్రికెటర్ రోవ్మెన్ పావెల్ హార్డ్హిట్టర్గా మాత్రమే మనకు పరిచయం. అయితే పావెల్ క్రికెటర్గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అథ్లెట్గా మెరవాల్సినోడు ఇవాళ క్రికెటర్గా రాణించడం వెనుక తన స్కూల్ పీఈటీ టీచర్ కార్ల్టన్ సోలన్ పాత్ర ఎంతో ఉందట. ఈ విషయాన్ని రోవ్మెన్ పావెల్ స్వయంగా వివరించాడు. జమైకాలోని ఓల్డ్ హర్బర్లో జన్మించిన రోవ్మెన్ పావెల్కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతరంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, అతను చాలా కింది నుంచి పైకి వచ్చాడు... పేదరికాన్ని జయించడానికి ఆటను ఎంచుకున్నాడు. స్కూల్ చదువుతున్నప్పుడే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తానని వాళ్ల అమ్మకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికే క్రికెటర్గా మారాడు. ఇదే విషయమై పావెల్ స్పందిస్తూ.. ''నా పీఈటీ టీచర్ కార్ల్టన్ నేను క్రికెట్ ఆడటం గమనించేవాడు. అయితే నేను ఓసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లా. అక్కడ ఆయన కూడా ఉన్నాడు.. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్..? బహుశా నువ్వు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అనుకుంటా. నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు. ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ను వదిలేయ్. ఇది నీకు సెట్ అవదు. నా మాట వినకుండా నువ్వు మళ్లీ ఇక్కడ గనక కనబడితే కొట్టడం గ్యారంటీ. నువ్వు రెండింటి (క్రికెట్, ట్రాక్ అండ్ ఫీల్డ్) మీద దృష్టి సారిస్తానంటే కుదరదు. అలా చేస్తే దేనిమీద వంద శాతం దృష్టి పెట్టలేవు'' అంటూ వివరించాడు. ఆయన సూచనతోనే పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నానని తెలిపాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రోవ్మెన్ పావెల్ విండీస్ తరపున 45 వన్డేలు, 55 టి20 మ్యాచ్లు ఆడాడు. కాగా పావెల్ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, టి20ల్లో ఒక సెంచరీ ఉండడం విశేషం. -
వెస్టిండీస్ జట్టుకు కొత్త సారధి.. పాత కెప్టెన్పై వేటు..?
టీ20 వరల్డ్కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్కప్లోనే కాక కెప్టెన్గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్గా వైస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు. తాజాగా రోవ్మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
కళ్లు చెదిరే సిక్సర్.. విండీస్ బ్యాటర్ చర్య వైరల్
టి20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన క్వాలిఫయర్ పోరులో విండీస్ బ్యాటర్ రోవ్మెన్ పావెల్ భారీ సిక్సర్ బాదాడు. ఇప్పుడు ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ అయింది పావెల్ కొట్టిన సిక్సర్ కాదు.. అకిల్ హొసేన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ బ్లెస్సింగ్ ముజరబానీ వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని రోవ్మెన్ పావెల్ లాంగాఫ్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. దాదాపు 104 మీటర్ల దూరం వెళ్లిన బంతి చాలా ఎత్తులో ఉంది. అందుకే అకిల్ హొసెన్ పావెల్ కొట్టిన సిక్స్ను కన్నార్పకుండా చూసి ''వామ్మో ఎంత పెద్ద సిక్స్'' అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అందుకే హొసెన్ ఎక్స్ప్రెషన్ ట్రెండింగ్లో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్లో ఓపెనర్ చార్లెస్ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆపై బౌలింగ్లో అల్జారీ జోసెఫ్ (4/16), జేసన్ హోల్డర్ (3/12) నిప్పులు చెరిగారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మదెవెర్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో లూక్ జాంగ్వే (22 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. మిగతా వారిలో ఆరుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రెండు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన విండీస్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ‘సూపర్ 12’ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 'టైటిల్ గెలవాలంటే చేయాల్సింది చాలా ఉంది' -
CPL 2022: ‘కింగ్’ అద్భుత ఇన్నింగ్స్.. మూడోసారి చాంపియన్గా జమైకా తలైవాస్
Caribbean Premier League 2022 - Barbados Royals vs Jamaica Tallawahs, Final: కరేబియన్ ప్రీమియర్ లీగ్- 2022 విజేతగా జమైకా తలైవాస్ అవతరించింది. గయానాలో బార్బడోస్ రాయల్స్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్గా నిలిచింది. ఒబెడ్ మెకాయ్ బౌలింగ్లో బ్రాండన్ కింగ్ సిక్సర్ బాది తలైవాస్ విజయం ఖరారు చేశాడు. CHAMPIONS!!!!! 🏆🏆🏆#CPL22 #BRvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #CPLFinal pic.twitter.com/DFMixoADQ0 — CPL T20 (@CPL) October 1, 2022 ఆజం ఖాన్ ఒక్కడే ఇక తాజా సీజన్లో విజయంతో జమైకా మూడోసారి ట్రోఫీ అందుకుంది. దీంతో రోవ్మన్ పావెల్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. సీపీఎల్-2022 ఫైనల్లో టాస్ గెలిచిన బార్బడోస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డౌన్ బ్యాటర్ ఆజం ఖాన్ అర్ధ శతకంతో రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కింగ్ అదరగొట్టాడు లక్ష్య ఛేదనకు దిగిన జమైకా తలైవాస్కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ అద్భుత ఆరంభం అందించాడు. 50 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. వన్డౌన్ బ్యాటర్ షామర్ బ్రూక్స్ 47 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలోనే తలైవాస్ జట్టు టార్గెట్ ఛేదించింది. రెండు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా మూడోసారి సీపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. బార్బడోస్ను కట్టడి చేయడంలో సఫలమైన తలైవాస్ ఆల్రౌండర్ ఫాబియన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు 2013, 2016 సీజన్లలో తలైవాస్ టీమ్ సీపీఎల్ చాంపియన్గా నిలిచింది. మాటల్లో వర్ణించలేను విజయానంతరం తలైవాస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ మాట్లాడుతూ.. ఈ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఒకానొక దశలో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తానే స్థితి నుంచి చాంపియన్లుగా అవతరించడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. జట్టు సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. గయానాలో తమకు ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని.. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. King produces a regal knock!!! He guides his team to win the tournament with an unbeaten 83 from 50 balls earning the CPL22 Final’s @Dream11 MVP award. #CPL22 #BRvJT #CricketPlayedLouder #Dream11 #BiggestPartyInSport pic.twitter.com/QPiuhDoj2F — CPL T20 (@CPL) October 1, 2022 -
పవర్ హిట్టర్ రీ ఎంట్రీ.. టి20 ప్రపంచకప్కు విండీస్ జట్టు
అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన విండీస్ జట్టులోకి పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ రీ ఎంట్రీ ఇవ్వగా.. నికోలస్ పూరన్ కెప్టెన్ కాగా.. రోవ్మెన్ పావెల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. కాగా హిట్టర్గా పేరు పొందిన ఎవిన్ లూయిస్ విండీస్ తరపున మ్యాచ్ ఆడి ఏడాది దాటిపోయింది. చివరగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లోనే విండీస్ తరపున ఆడాడు. పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు ఈసారి టి20 ప్రపంచకప్లో సూపర్-12కు క్వాలిఫై కాలేదు. దీంతో క్వాలిఫయింగ్ దశలో వెస్టిండీస్.. స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్లతో ఆడనుంది. ఈ మ్యాచ్లు గెలిచి సూపర్-12లో చోటు దక్కించుకోవాలని విండీస్ ఆశిస్తోంది. ఇక విండీస్ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఎదుర్కోనుంది. టి20 ప్రపంచకప్కు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఓడియన్ స్మిత్, జాన్సన్ చార్లెస్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, రేమాన్ రీఫర్, ఒబెద్ మెక్కాయ్, అల్జారీ జోసెఫ్, అకేల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్, యానిక్ కరియా -
ఎట్టకేలకు ఓ విజయం.. వైట్వాష్ గండం నుంచి గట్టెక్కిన విండీస్
ఇటీవలి కాలంలో వరుస వైట్వాష్ పరాభవాలను ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు.. మరోసారి ఆ అవమానం బారిన పడకుండా గట్టెక్కింది. న్యూజిలాండ్తో స్వదేశంలో జరగుతున్న టీ20 సిరీస్లో ఆ జట్టు ఎట్టకేలకు ఓ ఓదార్పు విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఆఖరి టీ20లో కరీబియన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓడియన్ స్మిత్ (3/29), అకీల్ హొసేన్ (2/28), డోమినిక్ డ్రేక్స్ (1/19), హేడెన్ వాల్ష్ (1/16) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. కివీస్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్ (26 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఛేదనలో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షమార్ బ్రూక్స్ (59 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగడంతో విండీస్ 19 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖర్లో కెప్టెన్ రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుస ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడి విండీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా విండీస్ 3 మ్యాచ్ల ఈ సిరీస్ను 1-2 తేడాతో ముగించింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఐష్ సోధీకి తలో వికెట్ దక్కింది. సిరీస్ మొత్తంలో 5 అద్భుతమైన క్యాచ్లతో పాటు ఓ హాఫ్ సెంచరీ సహా 100కిపైగా పరుగులు సాధించిన గ్లెన్ ఫిలిప్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్లో సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగిన బ్రాండన్ కింగ్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్కు ముందు విండీస్ టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్ను, 1-4 తేడాతో టీ20 సిరీస్ను, అంతకుముందు స్వదేశంలోనే బంగ్లాదేశ్ చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్ను, పాక్ గడ్డపై 0-3 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయిన విషయం తెలిసిందే. విండీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్ట్ 17 నుంచి ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా ఆగస్ట్ 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న ఆఖరి వన్డే జరుగనుంది. చదవండి: వెస్టిండీస్తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్కు బిగ్ షాక్! -
రోవ్మన్ పావెల్ ఊచకోత.. రెండో టీ20లో విండీస్ ఘన విజయం
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న సిరీస్లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ హవా కొనసాగిస్తుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. రోవ్మన్ పావెల్ (28 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. పావెల్ సహా బ్రాండన్ కింగ్ (43 బంతుల్లో 57; 7 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ పూరన్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. Powell power on display 💪 Shakib heroics can't save Bangladesh 🙌 West Indies eye T20 World Cup 👀 Talking points from the second #WIvBAN T20I 👇https://t.co/HmQoL9E7Hy — ICC (@ICC) July 4, 2022 అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) బంగ్లాదేశ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్ కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు.. ఓడియన్ స్మిత్, అకీల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నిర్ణయాత్మక మూడో టీ20 గయానా వేదికగా జులై 7న జరుగనుంది. చదవండి: హర్షల్ ఆల్రౌండ్ షో.. రెండో మ్యాచ్లోనూ టీమిండియాదే విజయం -
'నేను క్రికెటర్ కాకపోయింటే సైనికుడిని అయ్యేవాడిని'
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ రోవ్మెన్ పావెల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరంభ మ్యాచ్లలో పావెల్ విఫలమైనా.. తర్వాత మ్యాచ్ల్లో తన హిట్టింగ్తో జట్టుకు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "నేను జమైకాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా గ్రామంలో చాలా కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయం. నాకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్ బాగా ఆడి నా కటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయాలని నేను కలలు కన్నాను. ఆ దేవుని దయ వల్ల క్రికెట్లో బాగా రాణిస్తున్నాను. ఒక వేళ నేను ప్రొఫెషనల్ క్రికెటర్ కాకపోయింటే సైనికుడిని అయ్యేవాడిని" అని పావెల్ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో 11 మ్యాచ్లాడిన పావెల్ 205 పరుగులు సాధించాడు. పావెల్ ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. చదవండి: Rovman Powell: 'మూడురోజులు టవల్ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు' -
'మూడురోజులు టవల్ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'
ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు విజయాలు.. ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ తాను ఆడబోయే చివరి మూడుమ్యాచ్ల్లో గెలిస్తే ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఖంగుతిన్న ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ విషయం పక్కనబెడితే.. ఢిల్లీ హార్డ్ హిట్టర్ రోవ్మెన్ పావెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 'ఎపిసోడ్-6 విత్ పావెల్' పాడ్కాస్ట్ ఇంటర్య్వూ నిర్వహించింది. ఇంటర్య్వూలో పావెల్ తన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.'' ఐపీఎల్ 2022 సీజన్ కోసం ముంబైలో అడుగుపెట్టినప్పుడు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నా హ్యాండ్ బాగ్ తప్ప మరెలాంటి బట్టలు లేవు.. అవి ఎక్కడో మిసయ్యాయి. ఆ తర్వాత హోటల్ రూంలో మూడురోజుల పాటు టవల్ చుట్టుకునే గడిపాను. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. PC: IPL Twitter ''ఇక ఐపీఎల్ కోసం కరిబీయన్ నుంచి ఇండియాకు వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ బాగానే రిసీవ్ చేసుకుంది. ఢిల్లీతో ఉంటే సొంతజట్టుతో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను ఆటగాడిగా రాణించినా.. రాణించకపోయినా జట్టు మద్దతు అనేది ముఖ్యం. ఆ విషయంలో మాత్రం నాకు డోకా లేదు. ఇది మంచి విషయం. రిషబ్ పంత్ మంచి ఆటగాడు మాత్రమే కాదు.. గుడ్ కెప్టెన్ కూడా. అంతర్జాతీయ క్రికెట్లో పంత్కు ప్రత్యర్థిగా ఆడినప్పటికి మంచి స్నేహితులుగానే ఉంటాము. జట్టులో చోటు కల్పించడం.. నా రోల్ను సమర్థంగా పోషించేందుకు సాయపడతానని పంత్ అన్నాడు. తాజాగా మా కెప్టెన్ తన మాటకు కట్టుబడ్డాడు'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో రోవ్మెన్ పావెల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్లాడిన పావెల్ 205 పరుగులు సాధించాడు. పావెల్ ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. చదవండి: Shreyas Iyer: 'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం' #DCPodcast EP 6️⃣ powered by @Ravipowell26 🔥 You've seen him hit those big ones on the field, now watch him speak about the big moments in his life, his humble upbringing, similarities with #RP17 and much more 💙#YehHaiNayiDilli | #DCSpecials | #OctaRoarsForDC @TajMahalMumbai pic.twitter.com/pez8krkcj9 — Delhi Capitals (@DelhiCapitals) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వార్నర్ను సెంచరీ గురించి అడిగాను.. నన్ను హిట్టింగ్ చేయమన్నాడు'
సన్రైజర్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో 19వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 54 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తే తన పాత జట్టుపై సెంచరీ చేసే అవకాశం అతనికి ఉండేది. అయితే వ్యక్తిగత ప్రదర్శనకంటే జట్టే ముఖ్యమంటూ వార్నర్ దానిని సీరియస్గా తీసుకోలేదని అతని సహచర బ్యాటర్ రావ్మన్ పావెల్ వెల్లడించాడు. చివరి ఓవర్లో 6 బంతులను కూడా ఎదుర్కొన్న పావెల్ 3 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. ‘చివరి ఓవర్ ప్రారంభానికి ముందు వార్నర్ను నేను సెంచరీ గురించి అడిగాను. తొలి బంతికి సింగిల్ తీసి నీకు స్ట్రైకింగ్ ఇవ్వనా, శతకం పూర్తవుతుంది అని చెప్పాను. అయితే వార్నర్ దానిని తిరస్కరించాడు. మనం ఈ రకంగా క్రికెట్ ఆడకూడదు. నువ్వు నీ అత్యుత్తమ బ్యాటింగ్ చూపించు. ఎంత బలంగా బంతిని బాదగలవో అంతగా షాట్లు ఆడు అంటూ నాలో స్ఫూర్తి నింపాడు’ అని పావెల్ వివరించాడు. మ్యాచ్లో ఢిల్లీ 21 పరుగులతో గెలవగా, వార్నర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. చదవండి: చహల్తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన ఇంగ్లండ్ స్టార్.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఆ రికార్డు బద్దలు కొట్టాలి! 130 మీటర్లు.. నా లక్ష్యం అదే!
IPL 2022 DC Vs SRH: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లు- స్కోరు 67 నాటౌట్. ఓపెనర్ డేవిడ్ వార్నర్తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ రోవ్మన్ పావెల్ నమోదు చేసిన గణాంకాలు ఇవి. ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెటర్ పావెల్.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత ఢిల్లీ విజయాల్లో భాగమవుతూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. ఇక గురువారం సన్రైజర్స్తో మ్యాచ్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు పావెల్. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో రైజర్స్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో ఈ హిట్టర్ ఒక సిక్సర్తో పాటు మూడు ఫోర్లు బాది సత్తా చాటాడు. ముఖ్యంగా గంటకు 157 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన బంతిని సమర్థవంతగా ఎదుర్కొని బౌండరీ బాదిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక 102 మీటర్ల సిక్సర్ చూసి ఢిల్లీ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక తన మెరుపు ఇన్నింగ్స్ గురించి విజయానంతరం స్పందించిన పావెల్ సిక్సర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 130 మీటర్ల భారీ సిక్సర్ కొడతానని ఊహించానని, అయితే ఇప్పుడు కాకపోయినా తదుపరి మ్యాచ్లోనైనా ఈ ఫీట్ నమోదు చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో.. బిగ్గెస్ట్ సిక్స్ ఆల్బీ మోర్కెల్(125 మీటర్లు- 2008లో) పేరిట ఉంది. ఇక ఇటీవల పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 117 మీటర్ల సిక్సర్ బాదాడు. వీరిద్దరిని అధిగమించి 130 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాలని భావిస్తున్నట్లు పావెల్ పేర్కొనడం విశేషం. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘నిన్న నేను 130 మీటర్ల సిక్సర్ కొడతాననే అనుకున్నా. మన్దీప్తో ఈ విషయం చెప్పాను. చూద్దాం ఏ జరుగుతుందో!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా డేవిడ్ వార్నర్(92- నాటౌట్), పావెల్(67- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో భారీ స్కోరు చేసిన ఢిల్లీ 21 పరుగుల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించింది. చదవండి👉🏾 David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ! Century stand 👌 Clinical finish 💪 Pre-game rituals 🤔 Assistant Coach @ShaneRWatson33 joins batting stars @davidwarner31 & @Ravipowell26 to sum @DelhiCapitals' win over #SRH. 👍 👍 - By @RajalArora Full interview 📹 🔽 #TATAIPL | #DCvSRH https://t.co/jw1jHsvSlc pic.twitter.com/PyeJe5ciBX — IndianPremierLeague (@IPL) May 6, 2022 5⃣th win for @RishabhPant17 & Co. in the #TATAIPL 2022! 👏 👏 The @DelhiCapitals beat #SRH by 21 runs & return to winning ways. 👌 👌 #DCvSRH Scorecard ▶️ https://t.co/0T96z8GzHj pic.twitter.com/uqHvqJPu2v — IndianPremierLeague (@IPL) May 5, 2022 -
సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్!
ఐపీఎల్లో ఒక స్టార్ ఆటగాడు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారడం సర్వ సాధారణం. కానీ ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ మాత్రం కాస్త ఢిఫెరెంట్ అని చెప్పాలి. సరిగ్గా ఏడాది క్రితం ఎస్ఆర్హెచ్లో వార్నర్కు చాలా అవమానాలు జరిగాయి. కెప్టెన్సీ పదవి తొలగించడం.. ఆపై జట్టులో చోటు కోల్పోవడం.. ఆఖరికి డ్రింక్స్ బాయ్గా సేవలందించిన వార్నర్ను చూసి సొంత అభిమానులే ఎస్ఆర్హెచ్ వైఖరిని తప్పుబట్టారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు ఐపీఎల్లో విజేతగా నిలిపిన వ్యక్తిని అవమానకర రీతిలో జట్టు నుంచి బయటకు పంపించారు. అయితే వార్నర్ ఇదంతా పట్టించుకోలేదు. అవకాశం వచ్చినప్పుడు తాను స్పందిస్తానని స్వయంగా పేర్కొన్నాడు. కట్చేస్తే.. మెగావేలంలో రూ. 6 కోట్లకు డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సీజన్లో కాస్త లేటుగా జాయిన్ అయినప్పటికి వార్నర్ మంచి ఫామ్ కనబరిచాడు. లీగ్లో మూడు అర్థసెంచరీలు సాధించిన వార్నర్.. తాజాగా తన పాత టీమ్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో మరోసారి మెరిశాడు.ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వార్నర్.. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. సీజన్లో సూపర్హిట్ బౌలింగ్తో మెరుస్తున్న ఉమ్రాన్ మాలిక్ను వార్నర్ ఒక ఆట ఆడుకున్నాడు. ఓవరాల్గా 58 బంతుల్లో 92 పరుగులు చేసిన వార్నర్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. సెంచరీ చేసే అవకాశం రాకపోయినప్పటికి వార్నర్ ఒక రకంగా తన పంతం నెగ్గించుకున్నాడనే చెప్పాలి. వాస్తవానికి వార్నర్ సెంచరీ చేయాలనుకుంటే రోవ్మన్ పావెల్ అవకాశం ఇచ్చేవాడే. కానీ వార్నర్ తన సెంచరీ కంటే జట్టు స్కోరు పెంచడమే ముఖ్యమని భావించాడు. . అందుకే పావెల్ను చివరి ఓవర్ మొత్తం ఆడమని ముందే చెప్పాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆఖరి ఓవర్లో రోవ్మెన్ పావెల్ 6,4,4,4 సహా మొత్తం 19 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలో పావెల్ బౌండరీ కొట్టిన ప్రతీసారి.. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లవైపు చూస్తూ వార్నర్ గట్టిగా అరుస్తూ పావెల్ను ఎంకరేజ్ చేశాడు. వార్నర్ తీరు చూస్తే తనను అవమానించిన ఎస్ఆర్హెచ్కు తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్.. వార్నర్ ప్రత్యర్థి ఆటగాడైనా సరే.. మన వార్నర్ అన్న మొత్తానికి పంతం నెగ్గించుకున్నాడంటూ కామెంట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి -
IPL 2022: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి
IPL 2022 DC Vs KKR- Rovman Powell: వెస్టిండీస్ బ్యాటర్ రోవ్మన్ పావెల్ ఐపీఎల్-2022 సీజన్తో క్యాష్ రిచ్లీగ్లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్ ఆడాడు. ఇందులో రెండు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా 20, 3, 8, 0, 36 పరుగులు చేశాడు. ఇక కోల్కతా నైట్రైడర్స్తో గురువారం నాటి మ్యాచ్లో 16 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పావెల్ను కొనియాడాడు వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్. పేదరికాన్ని జయించి తన తల్లి, చెల్లి బాగోగులు చూసుకుంటున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఈ మేరకు బిషప్ మాట్లాడుతూ.. ‘‘మీలో ఎవరికైనా ఓ పది నిమిషాల సమయం ఉంటే.. వెళ్లి రోవ్మన్ యూట్యూబ్లో ఉన్న రోవ్మన్ పావెల్ లైఫ్స్టోరీ చూడండి. నేను.. నాతోపాటు మరికొంత మంది పావెల్ ఐపీఎల్ ఆడాలని ఎందుకు కోరుకున్నారో.. అతడు అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారో మీకే తెలుస్తుంది. చిన్న స్థాయి నుంచి అతడు అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి దాకా వచ్చాడు. తాను సెకండరీ స్కూళ్లో ఉన్నపుడే పేదరికం నుంచి మిమ్మల్ని బయటపడేస్తానంటూ తన తల్లికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు’’ అని పావెల్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తాడు. పేదరికాన్ని జయించి జమైకాలోని ఓల్డ్ హార్బర్లో గల బానిస్టర్ జిల్లాలో 1993, జూలై 23న పావెల్ జన్మించాడు. అతడి తల్లి సింగిల్ పేరెంట్. పావెల్తో పాటు ఆమె ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని పెంచి పెద్ద చేసింది. చిన్న ఇంట్లో తల్లి ఇబ్బందులు చూస్తూ పెరిగిన పావెల్.. ఆమె ప్రశాంత జీవితం గడిపేలా అన్ని సౌకర్యాలు ఉన్న జీవితం అందించాలనే తలంపుతో చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానిని నిజం చేసుకుని తల్లి, చెల్లిని బాగా చూసుకుంటున్నాడు. పావెల్ జీవిత విశేషాలకు సంబంధించిన విషయాలను కరేబియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ సమయంలో డాక్యుమెంటరీ రూపొందించారు. ఇక పావెల్ కెరీర్ విషయానికొస్తే.. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డేతో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్తో సిరీస్తో టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో భాగమైన పావెల్.. ఐపీఎల్ మెగా వేలం-2022లో తన పేరు నమోదు చేసుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. రూ. 2.8 కోట్లు ఖర్చు చేసి పావెల్ను సొంతం చేసుకుంది. చదవండి👉🏾 Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ A return to winning ways for the Delhi Capitals! 👏 👏 The Rishabh Pant-led side beat #KKR by 4 wickets & seal their 4⃣th win of the #TATAIPL 2022. 👍 👍 Scorecard ▶️ https://t.co/jZMJFLuj4h #DCvKKR pic.twitter.com/QCQ4XrJn0P — IndianPremierLeague (@IPL) April 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"గత మ్యాచ్ల గురించి ఆలోచించం.. ప్లేఆఫ్స్కు మేము వచ్చామంటే.. కప్ మదే"
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో గురువారం తలపడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు పవర్ హిట్టర్ రోవ్మాన్ పావెల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గత ఓటముల గురించి ఆలోచించే సమయం లేదని.. కచ్చితంగా కేకేఆర్పై విజయం సాధిస్తామని అతడు థీమా వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ ఉండాలంటే.. రాబోయే మ్యాచ్ల్లో తప్పక గెలవాలని పావెల్ తెలిపాడు. కాగా గత శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అఖరి ఓవర్లో ఆరు బంతుల్లో 36 పరుగులు అవసరమవ్వగా.. పావెల్ వరుస మూడు బంతుల్లో మూడు సిక్స్లు బాది మ్యాచ్పై ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. "గత మ్యాచ్లు గురించి ఆలోచించే సమయం ఇప్పుడు మాకు లేదు. మాకు ముందు ముందు చాలా మ్యాచ్లు ఉన్నాయి. రాబోయే మ్యాచ్ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్కు ఆర్హత సాధించాలి అనుకుంటున్నాం. ప్లేఆఫ్స్కు ఆర్హత సాధించమంటే.. కచ్చితంగా టైటిల్ నెగ్గుతాం. కాగా మునపటి మ్యాచ్లో అఖరి ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టగలని నమ్మకంగా ఉన్నాను. తొలి రెండు బంతులకు సిక్స్లు కొట్టాక.. మూడో బంతిని కూడా స్టాండ్స్కు తరలించాను. అయితే అది నో బాల్ అని నేను ఆశించాను. కానీ అంపైర్ నిర్ణయమే అంతిమమైనది కాబట్టి. క్రికెటర్గా అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి" అని రోవ్మాన్ పావెల్ పేర్కొన్నాడు. -
IPL 2022: హేయ్.. వెనక్కి వచ్చేయండి.. పంత్ అసహనం.. వైరల్
IPL 2022 DC Vs RR- Rishabh Pant- No Ball Controversy: ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ చివర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్కు జోస్ బట్లర్(116 పరుగులు), దేవ్దత్ పడిక్కల్(54) అదిరిపోయే ఆరంభం అందించారు. కెప్టెన్ సంజూ శాంసన్(46) సైతం బ్యాట్ ఝులిపించాడు. వీరి విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా(37), డేవిడ్ వార్నర్(28) శుభారంభం అందించారు. కానీ, ఆ తర్వాత రిషభ్ పంత్(44), లలిత్ యాదవ్(37) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అయితే, ఆఖర్లో రోవ్మన్ పావెల్ ఆశాకిరణంలా కనిపించాడు. రాజస్తాన్ బౌలర్ మెక్కాయ్ వేసిన చివరి ఓవర్లో 36 పరుగులు కావాల్సి ఉండగా, తొలి 3 బంతుల్లో పావెల్ సిక్సర్లు బాదడంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే ఫుల్టాస్గా వచ్చిన మూడో బంతి ‘నో బాల్’గా భావించినా అంపైర్ ఇవ్వలేదు. దాంతో ఢిల్లీ డగౌట్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. నోబా ల్ ఇవ్వమంటూ వారంతా సైగలు చేయడంతో పాటు ఇద్దరు బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ కెప్టెన్ పంత్ పిలవడం వరకు పరిస్థితి వెళ్లింది. గ్రౌండ్లో ఉన్న అంపైర్లతో పాటు చహల్ తది తరులు కూడా బ్యాటర్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ ఆమ్రే అయితే మైదానంలోకే వచ్చేశాడు. అంపైర్ నితిన్ మాత్రం నిర్ణయానికి కట్టుబడుతూ ‘నోబాల్’ ప్రకటించలేదు. మిగిలిన మూడు బంతుల్లోనూ సిక్సర్లు బాది పావెల్ గెలిపించగలిగేవాడా చెప్పలేం కానీ ఈ ఘటనతో ఢిల్లీ బృందం తమ బ్యాటర్ లయ దెబ్బ తీసిందనేది మాత్రం వాస్తవం. నిబంధనల ప్రకారం అవుటైన బంతులకే టీవీ అంపైర్లు నోబాల్ అవునా కాదా అని రీప్లే చూస్తారు. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ రాజస్తాన్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ‘నోబాల్’ ఘటనపై స్పందించిన నెటిజన్లు.. గతంలో చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్గా ఉన్న ఎంఎస్ ధోని సైతం ఇలాగే వ్యవహరించాడని, బహుశా పంత్ అతడి నుంచే స్ఫూర్తి పొందాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2022 DC Vs RR: బట్లర్ ‘తీన్’మార్... That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 var request = Loved this attitude from Rishabh Pant.Captains fighting hard for wrong umpiring 👍🔥🔥#RR #RRvsDC #Pant #RishabhPant #NoBall #umpire pic.twitter.com/xOQLAFP8Ai— Kshitij Umarkar Patil (@itsKshitijPatil) April 22, 2022 Shane Watson Saying Chote Bache Hai Kya After Seeing Rishabh Pant Calling His Team Back 🤣🤣#RishabhPant#DCvRR#ChotiBachiHoKya pic.twitter.com/qSjqxpqBxU — Kabir (@kabirrockz) April 22, 2022 Loved this attitude from Rishabh Pant. Captains fighting hard for wrong umpiring 👍🔥🔥#RR #RRvsDC #Pant #RishabhPant #NoBall #umpire pic.twitter.com/xOQLAFP8Ai — Kshitij Umarkar Patil (@itsKshitijPatil) April 22, 2022 -
10 సిక్సర్లతో విండీస్ బ్యాటర్ విధ్వంసం
Rovman Powell Hits Century In 51 Balls.. వెస్టిండీస్ హిట్టర్ రోవ్మెన్ పావెల్ ఇంగ్లండ్తో జరిగిన మూడో టి20లో మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించాడు మెరిశాడు. సిక్సర్ల వర్షం కురిపించిన పావెల్.. 53 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అతని ధాటికి వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 70 పరుగులతో రాణించాడు. చదవండి: అయ్యర్పై వేటు.. రవి బిష్ణోయ్కు బంపరాఫర్; తొలి వన్డేకు రాహుల్ దూరం అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ బ్యాటింగ్లో ఓపెనర్ టామ్ బాంటన్ (39 బంతుల్లో 73 పరుగులు, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), పిలిఫ్ సాల్ట్(24 బంతుల్లో 57, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినప్పటికి మిగతావారు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ మూడు, పొలార్డ్ 2, మిగతా బౌలర్లలో హొస్సేన్, హోల్డర్, కాట్రెల్ తలా ఒక వికెట్ తీశారు. తద్వారా ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో విండీస్ 2-1తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. కెన్నింగ్సటన్ వేదికగా జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 40 ఓవర్లలో 428 పరుగులు చేయడం వెస్టిండీస్ గడ్డపై అత్యధిక స్కోరుగా రికార్డు నమోదైంది. మ్యాచ్ మొత్తంలో రెండు ఇన్నింగ్స్లు కలిపి 31 సిక్సర్లు.. 19 ఫోర్లు కొట్డడం విశేషం. What a knock from from Rovman Powell! His 1st T20I century earns our #MastercardPricelessMoment. #WIvENG pic.twitter.com/IVtAkWAl5D — Windies Cricket (@windiescricket) January 27, 2022