Russian President Vladimir Putin
-
ఉక్రెయిన్పై పుతిన్తో మాట్లాడా: ట్రంప్
వాషింగ్టన్/మాస్కో: రష్యా దురాక్రమణతో దండెత్తిన దరిమిలా దాదాపు నాలుగేళ్లుగా రావణకాష్టంగా రగిలిపోతున్న ఉక్రెయిన్ భూభాగాల్లో శాంతిపవనాలు వీచే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో ఫోన్లో విడివిడిగా సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మంగళవారం ఉదయం పుతిన్తో ట్రంప్ సుదీర్ఘంగా దాదాపు 90 నిమిషాలపాటు ఫోన్లో మంతనాలు జరిపినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే వివరాలను వాళ్లు బయటపెట్టలేదు. కానీ ట్రంప్ మాత్రం తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంతనాల వివరాలను పంచుకున్నారు. ‘‘ ఇకనైనా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోకుండా యుద్ధం ముగిసిపోవాలని ఇరువురం కోరుకున్నాం. ఉక్రెయిన్ అంశంతోపాటు పశ్చిమాసియాలో అనిశ్చితి, ఇంధన రంగం, కృత్రిమ మేథ, అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యం.. ఇలా కీలకమైన అంశాలపై పుతిన్తో సుదీర్ఘంగా మాట్లాడా. కలిసి పనిచేయాలని మేమిద్దం నిర్ణయించుకున్నాం. ఎంతో ఫలవంతమైన చర్చలు జరిపాం. మా స్నేహానికి గుర్తుగా త్వరలో నేను రష్యాలో పర్యటిస్తా. పుతిన్ సైతం అమెరికా పర్యటనకు వస్తారు. ఇందుకు పుతిన్ కూడా అంగీకరించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని తక్షణం ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, రష్యా తరఫున మధ్యవర్తిత్వ బృందాలు వెంటనే చర్చలు జరిపాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. పుతిన్తో చర్చల సారాంశాన్ని తెలిపేందుకు తర్వాత నేను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశా. పుతిన్ కూడా జెలెన్స్కీకి ఫోన్ చేస్తారేమో’’ అని బుధవారం ట్రూత్సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్చేశారు. తమ అధ్యక్షుడితో ట్రంప్ దాదాపు గంటపాటు ఫోన్లో మంతనాలు జరిపారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విమాన ప్రమాదంపై పుతిన్ ‘సారీ’
మాస్కో: కజకిస్తాన్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్కు క్షమాపణ చెప్పారు. అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం బుధవారం అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించడం తెలిసిందే. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాపణ చెప్పడం గమనార్హం. అయితే, విమాన ప్రమాదానికి బాధ్యత తమదేనంటూ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంగీకరించలేదు. ‘అజెర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి’ అని అంతకుముందు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ కాల్పుల వల్లే విమానం కూలిందంటూ వేరుగా అందులో పేర్కొనలేదు. రష్యా గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్న కారణంగా అధ్యక్షుడు పుతిన్ అజెర్బైజాన్ ప్రెసిడెంట్ అలియేవ్కు క్షమాపణ చెప్పారని క్రెమ్లిన్ వివరించింది. దీనిని అజెర్బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. -
ట్రంప్తో చర్చలకు సిద్ధం
మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ట్రంప్తో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ట్రంప్ హయాంలో అమెరికా విధానాల్లో భారీగా మార్పులు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఉక్రెయి న్లో విజయం సాధించబోతున్నామని, సిరియాలో ఆశించిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. గురు వారం దాదాపు నాలు గున్నర గంటలపాటు జరి గిన వార్షిక మీడియా సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫోన్కాల్స్కు కూడా పుతిన్ స్పందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు రావొచ్చునంటూ వార్తలు వస్తున్న వేళ పుతిన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నాలుగేళ్లుగా మేం మాట్లాడుకో లేదుడొనాల్డ్ ట్రంప్తో సమావేశం ఎప్పుడుంటుందన్న ఎన్బీసీ ప్రతినిధి కెయిర్ సిమ్మన్స్ ప్రశ్నకు..‘మా సమావేశం ఎప్పుడు ఉండొచ్చో నాకు తెలియదు. ట్రంప్ కూడా ఈ విషయం ఎన్నడూ చెప్పలేదు. దాదాపు నాలుగేళ్లుగా మేం మాట్లాడుకున్నదీ లేదు. ట్రంప్ సానుకూలంగా ఉంటే చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధమే’అని అన్నారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధం, సిరియా నుంచి రష్యా బలగాలు వైదొలగాల్సి రావడం వంటి పరిణామాలతో మీరు బలహీనపడినట్లుగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు..,గత రెండు, మూడేళ్లలో రష్యా మరింతగా బలం పుంజుకుంది. ఎందుకంటే మేం మరింత స్వతంత్రంగా మారాం. ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగుతున్నాం’అన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితులు అనూహ్యంగా మారి పోయాయి. యుద్ధక్షేత్రంలో రోజురోజుకూ చదరపు కిలోమీటర్ల కొద్దీ భూభా గాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగు తున్నాం’అన్నారు. అయితే, సరిహద్దుల్లో కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాల నుంచి తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధాన మివ్వలేదు. ‘స్వాధీనం చేసుకుని తీరుతాం. ఫలానా సమయం కల్లా అది పూర్తవుతుందని మాత్రం చెప్పలేను’అని పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆర్మీ అణు విభాగం చీఫ్ కిరిల్లోవ్ హత్యను ఆయన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు అసద్ మాస్కోలోనే ఉన్నట్లు పుతిన్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆయనతో సమావేశం జరగలేదని, కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు. -
రష్యా రక్షణ బడ్జెట్ రూ.10 లక్షల కోట్లు!
కీవ్: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. 2025 బడ్జెట్లో 32.5శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు. రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్లో 28.3శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి. -
Russian President Vladimir Putin: అతని కోసం ఎందాకైనా...!
2024 ఆగస్టు 1. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే లాండైన విమానం నుంచి 8 మంది ప్రత్యేక భద్రత మధ్య బయటికి వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్ చేసుకునేందుకు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు ‘వీఐపీ’కి షేక్హాండ్ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2019 ఆగస్టు. జర్మనీ రాజధాని బెర్లిన్. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పార్కు. సైకిల్పై వస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. తన ముందు నడుస్తున్న మాజీ చెచెన్ రెబెల్ జెలీంఖాన్ ఖాన్గోష్విలిని టపీమని కాల్చేశాడు. చుట్టుపక్కల వాళ్లు షాక్ నుంచి తేరుకునే లోపే క్షణాల్లో మాయమైపోయాడు. సైకిల్ను పక్కనే ఉన్న నదిలో పారేశాడు. విగ్గు తీసి, నీట్గా షేవ్ చేసుకుని ఎవరూ గుర్తించలేనంతగా రూపం మార్చుకున్నాడు. విధి వక్రించి ప్రత్యక్ష సాక్షులు గుర్తించడంతో కాసేపటికే పట్టుబడి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. – నాడు జర్మనీలో జీవితఖైదుకు గురైందీ, నేడు మాస్కోలో పుతిన్ నుంచి ఘనస్వాగతం అందుకున్నదీ ఒక్కడే. అతనే... వదీం క్రషికోవ్. పేరుమోసిన రష్యా హిట్మ్యాన్. జెలీంఖాన్ ఒక్కడినే కాదు, రష్యాకు కంట్లో నలుసుగా మారిన వాళ్లెందరినో క్రషికోవ్ వెంటాడి వేటాడాడు. విదేశీ గడ్డపై ఇలాంటి అసైన్మెంట్లను సైలెంట్గా పూర్తి చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రష్యా గూఢచర్య సంస్థ ఎఫ్ఎస్బీలో చేరిన కొన్నాళ్లకే టాప్ రేటెడ్ హిట్మ్యాన్గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా పుతిన్కు అత్యంత ఇషు్టనిగా మారాడు. అందుకే అతన్ని విడిపించుకోవడాన్ని ఆయన సవాలుగా తీసుకున్నారు. జెలీంఖాన్ హత్యతో తనకు సంబంధమే లేదని విచారణ పొడవునా క్రషికోవ్ బుకాయించినా, అది అతని పనేనని పుతిన్ అధికారికంగానే అంగీకరించారు. క్రషికోవ్ను ‘గొప్ప దేశభక్తుని’గా అభివరి్ణంచారు. అతని కోసం సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికాతో చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మారి్పడికి కూడా అంగీకరించారు. వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మెరైన్ పౌల్ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్ కారా ముర్జా సహా 16 మందిని వదిలేశారు. బదులుగా అమెరికా, జర్మనీ, పశ్చిమ దేశాల నుంచి క్రషికోవ్తో పాటు 8 మంది రష్యన్లను విడిపించుకున్నారు. వారిలో మరో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లున్నారు. తద్వారా, విదేశాల్లో ఇలాంటి ఆపరేషన్లు చేసే క్రమంలో దొరికిపోయినా అధ్యక్షుడు తమను కాపాడి తీరతారని నిఘా విభాగం ఏజెంట్లకు ధీమా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆశించింది కూడా అదేనని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-North Korea relations: మరింత బలమైన మైత్రీబంధం
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఘన స్వాగతం పలికిన కిమ్సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్పోర్ట్లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్ను పుతిన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.పలు రంగాలపై ఒప్పందాలు‘కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది. కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.కారు నడిపిన పుతిన్, కిమ్కుమ్సుసాన్ ప్యాలెస్కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్కు కిమ్ బహూకరించారు. కిమ్కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. -
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. కిమ్ ఆహా్వనం మేరకు పుతిన్ మంగళ, బుధవారాల్లో తమ దేశంలో పర్యటించనున్నట్టు కొరియన్ సెంట్రల్ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనను ఇరు దేశాలు ««ధ్రువీకరించాయి. ఉక్రెయిన్పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించడం సంచలనమైంది. ఉక్రెయిన్పై రష్యా తీవ్రమైన దాడులు చేస్తుండటంతో రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని, అందుకు బదులుగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతోందని దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. ఉత్తర కొరియాతో ఆయుధ వాణిజ్యం చేస్తే యూఎన్ తీర్మానాలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. అయితే, ఉత్తర కొరియా, రష్యా ఈ కథనాలను ఖండించాయి. కాగా, రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం 24 ఏళ్లలో ఇది ప్రథమం. పుతిన్ మొదటిసారి జూలై 2000లో ఉత్తర కొరియాలో పర్యటించారు. మొదటి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, అప్పుడు ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్తో సమావేశమయ్యారు. పుతిన్ కోసం విలాసవంతమైన వేడుక 1991లో సోవియట్ పతనం తర్వాత ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా 2019లో రష్యాలోని తూర్పు నౌకాశ్రయం వ్లాడివోస్టాక్లో పుతిన్తో సమావేశమయ్యారు. మళ్లీ పుతిన్, కిమ్లు ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుతిన్.. కిమ్కు హై–ఎండ్ ఆరస్సెనాట్ కారును పంపారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపేందుకు పుతిన్ కోసం విలాసవంతమైన వేడుకను కిమ్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఒక చౌరస్తాలో భారీ కవాతు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయని ఓ న్యూస్ వెబ్సైట్ విశ్లేíÙంచింది. ఉక్రెయిన్పై యుద్ధం తరువాత పుతిన్ను స్వాగతించే దేశాలు తక్కువగా ఉన్నా.. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన కిమ్ విజయం అంటున్నారు ఉత్తరకొరియా రాజకీయ విశ్లేషకులు. మాస్కోతో ఆర్థిక, ఇతర సహకారాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. -
China–Russia relations: ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం
బీజింగ్: ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడానికి త్వరలోనే రాజకీయ పరిష్కారం కనుగొంటామని చైనా అధినేత షీ జిన్పింగ్ సంకేతాలిచ్చారు. ఐరోపా ఖండంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గురువారం చైనా రాజధాని బీజింగ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జిన్పింగ్ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. చైనా–రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను సహించకూడదని, గట్టిగా ఎదిరించాలని నిర్ణయానికొచ్చారు. తమ రెండు దేశాల సంబంధాల్లో కలుగజేసుకోవద్దని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉయదం రష్యా నుంచి చైనాకు చేరుకున్న పుతిన్కు ఘన స్వాగతం లభించింది. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. చర్చల అనంతరం జిన్పింగ్, పుతిన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా తెరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా–రష్యా సంబంధాలను మూడోదేశం ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. అలా ప్రభావితం చేసేందుకు సాగే ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు. తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం కంటే ఇప్పుడు తమ బంధం ఇంకా దృఢమవుతోందని పేర్కొన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కచి్చతంగా కాపాడుకుంటామని తేలి్చచెప్పారు. అణు ఇంధనం నుంచి ఆహార సరఫరా దాకా భిన్న రంగాల్లో చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని పుతిన్ వెల్లడించారు. రష్యాలో చైనా కార్ల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నందుకు చైనాకు పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా–రష్యా మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఒకఒప్పందంపై జిన్పింగ్, పుతిన్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చల తర్వాత 30 పేజీల ఈ ఒప్పందం డాక్యుమెంట్ను సిద్ధం చేసినట్లు రష్యా ప్రతినిధి యూరి ఉషకోవ్ చెప్పారు. -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
మార్చిలో రష్యా ఎన్నికలు
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎన్నికల తేదీ ఖరారైనందున, ఐదో సారీ ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచి్చన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండిపోయారు. చాలా వరకు స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్ను ఎదుర్కొనే వారెవరనే విషయం ఇంకా వెల్లడికాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించిన ఇద్దరిలో, మాస్కో ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు బోరిస్ నదేజ్దిన్, జర్నలిస్ట్, లాయర్ అయిన యక్తెరినా దుంట్సోవా ఉన్నారు. ఉక్రెయిన్తో ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధం, ప్రైవేట్ సైన్యాధిపతి యెవ్గెనీ ప్రిగోజిన్ విఫల తిరుగుబాటు వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు ఏవీ లేవని పరిశీలకులు అంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు.. రష్యా దిగువ సభ డూమాలో గానీ కనీసం మూడో వంతు ప్రాంతీయ శాసనసభలలో ప్రాతినిధ్యం లేని పార్టీ ద్వారా 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి కనీసం లక్ష సంతకాలను సేకరించాలి. ఏ పారీ్టకీ సంబంధం లేకుండా పోటీ చేసే వారికి కనీసం 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి 3 లక్షల సంతకాలు అవసరం. ఈ నిబంధనలు పుతిన్కు సైతం వర్తిస్తాయి. 2018లో స్వతంత్రుడిగా పోటీ చేసిన పుతిన్ తరఫున ప్రచారకర్తలు సంతకాలు సేకరించారు. 2012 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ ఆయనను నామినేట్ చేసింది. దీంతో, సంతకాల సేకరణ అవసరం లేకుండాపోయింది. -
జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నా
న్యూఢిల్లీ: భారత్లో వచ్చే నెలలో జరిగే జీ20 కీలక సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సహకారం, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరిగిన ‘బ్రిక్స్’ సదస్సు ప్రస్తావనకు వచ్చింది. సెపె్టంబర్ 9, 10న జరిగే జీ20 సదస్సుకు హాజరయ్యే విషయంలో తన అశక్తతను పుతిన్ తెలియజేశారు. ఈ సదస్సుకు రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. జీ20కి సారథ్యంలో భాగంగా భారత్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు గాను పుతిన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరు కాలేదు. -
భారత్లో జరిగే జీ20 భేటీకి పుతిన్ దూరం
మాస్కో: వచ్చే నెలలో భారత్లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ పాల్గొనడం లేదు. ఉక్రెయిన్లో ఏడాదికి పైగా కొనసాగుతున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్పైనే ఆయన దృష్టంతా ఉందని శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. దీంతోపాటు బిజీ షెడ్యూల్ ఉన్నందున అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ జీ20 సమావేశంలో వర్చువల్గా పాల్గొనే విషయం తర్వాత ఖరారవుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 దేశాల నేతల సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. తాజాగా జొహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ భేటీకి కూడా పుతిన్ వెళ్లలేదు. -
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
వాగ్నర్ గ్రూప్ చీఫ్ హతం! ఇందులో నిజమెంత? అమెరికా సందేహాలు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ ఇప్పుడు ఎక్కడున్నారు? రష్యాలోనే ఉన్నారా? లేక పొరుగు దేశం బెలారస్లో తల దాచుకుంటున్నారా? తిరుగుబాటు తర్వాత పుతిన్తో ఆయన సమావేశమై తన చర్యలపై వివరణ ఇచి్చనట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. అయితే, పుతిన్ ఆదేశాలతో రష్యా అధికారులు ప్రిగోజిన్ను ఇప్పటికే అంతం చేసి ఉండొచ్చని లేక జైల్లో బంధించి ఉండొచ్చని అమెరికా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పుతిన్తో ప్రిగోజిన్ భేటీ రష్యా ఆడిన డ్రామా అని ఆయన తేలి్చచెప్పారు. ప్రిగోజిన్ను ఇక బహిరంగంగా చూడటం అనుమానమేనన్నారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్ను రష్యా అధికారులు చంపేసి అయినా ఉండాలి లేదా జైల్లో పెట్టయినా ఉండాలి లేదా ఎక్కడైనా దాచేసి ఉండాలి అని రాబర్ట్ అబ్రామ్స్ వెల్లడించారు. ప్రిగోజిన్ జూన్ 23న తన ప్రైవేట్ సైన్యంతో కలిసి పుతిన్పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. కొందరు రష్యా సైనికాధికారుల అండతోనే ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు వాదనలు వినిపించాయి. తిరుగుబాటు కొన్ని గంటల్లోనే ముగిసింది. ఆ తర్వాత జూన్ 29న ప్రిగోజిన్ తన వాగ్నర్ గ్రూప్ కమాండర్లతో కలిసి పుతిన్తో సమావేశమయ్యారని, ఇకపై రష్యా ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామన్నట్టు వార్తలొచ్చాయి. ఉక్రెయిన్పై యుద్ధంలో ప్రిగోజిన్ సేవల దృష్ట్యా అతడికి పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించినట్టు వార్తలొచ్చాయి. -
ఒక తిరుగుబాటు.. కొన్ని ప్రశ్నలు!
ఎస్. రాజమహేంద్రారెడ్డి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు దెబ్బతిన్న పులా? అలసిపోయిన పులా? దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఎదురులేని, తిరుగులేని నేతగా రష్యాను పరిపాలిస్తున్న పుతిన్ను ఉవ్వెత్తున ఎగసి అంతేవేగంగా నేలకరిచిన ఓ సాయుధ తిరుగుబాటు ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మక ద్రోహాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసే రికార్డు ఉన్న పుతిన్ ఈసారి ఎందుకో క్షమాభిక్షతో పేజీ తిప్పేశారు. రష్యాపై పుతిన్ పట్టు సడలుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎన్నో రహస్య యుద్ధాల్లో తన కనుసన్నల్లో కాలుదువి్వన వాగ్నర్ గ్రూప్సేనలు మడమతిప్పి తన మీదే తుపాకీ ఎక్కుపెట్టడం పుతిన్కు మింగుడు పడడం లేదు. వండివార్చే చెఫ్ నుంచి కిరాయి సేన చీఫ్గా అంచెలంచెలుగా ఎదిగిన యెవ్గెనీ ప్రిగోజిన్ తిరుగుబాటుకు తెగిస్తాడని పుతిన్ కలలో కూడా ఊహించలేదు. ఆయన తేరుకునేలోపే ప్రిగోజిన్ సేనలు రష్యాలో ఓ పట్టణాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడమే కాకుండా రాజధాని మాస్కో ముట్టడికి కదం తొక్కాయ అపారమైన సైనిక శక్తి, సాయుధ సంపత్తి కలిగి ఉన్న రష్యా ఈ కిరాయి సేనలను ఎందుకు నిలువరించలేకపోయిందో ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న! తిరుగుబాటును ముందస్తుగా పసిగట్టలేనంత దుస్థితిలో రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయా? అన్న అనుమానం రాక మానదు. పుతిన్లో మునుపటి దూకుడు లేదనడానికి ఇది నిదర్శనం కాదా? అనవసరమైన రాజ్యకాంక్షకు దాసోహమని అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ ఉక్రెయిన్పై మోహరించడం తిరుగుబాటుకు కారణం కాదా? ఇంతకీ పుతిన్కు ఏమైంది? రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కాని ప్రశ్న ఇదే. ఆయుధాలు ఇవ్వనందుకేనా? వంటవాడు గరిటె విసిరేసి తుపాకీ పడితే.. అతడే యెవ్గెనీ ప్రిగోజిన్ అవుతాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఇష్టమైన వంటకాలను రుచికరంగా వండి వడ్డించి ఆయనకు కుడిభుజంగా రూపాంతరం చెందిన ప్రిగోజిన్ హఠాత్తుగా పక్కల్లో బల్లెంలా తయారై 24 గంటలపాటు తన బాస్ను భయపెట్టేశాడు. పుతిన్కు ఇంతకాలం విధేయుడిగా మసలిన ప్రిగోజిన్కు ఎందుకు అంత కోపమొచి్చంది? ఉక్రెయిన్లో తన సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ సేనలు సాధించిన విజయాలను రష్యా సైన్యం వారి ఖాతాలో వేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యుద్ధం గడుస్తున్న కొద్దీ కరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రిని భర్తీ చేయకపోవడం ప్రిగోజిన్ను అసహనానికి గురిచేసింది. నిజానికి అతడి కోపమంతా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమో పైనే. బఖ్ముత్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో జరిగిన యుద్ధంతో తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసేందుకు రష్యా ససేమిరా అనడమే తిరుగుబాటు అసలు కారణమని విశ్లేషకుల అంచనా. రష్యాకు ఆయువు పట్టయిన కీలక మిలటరీ స్థావరం రోస్తోవ్ను చేజిక్కించుకొని, అదే ఊపులో ప్రిగోజిన్ సేనలు మాస్కో వైపు కదలడంతో తిరుగుబాటు బహిర్గతమైంది. అయితే రష్యా వైమానిక దళం కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్కు ఈ తిరుగుబాటు వ్యూహం గురించి ముందే తెలుసని, అంతర్లీనంగా ఆయన మద్దతు ప్రిగోజిన్కు ఉందని భోగట్టా. అందుకే ఆయన మౌనంగా ఉండిపోయారని రష్యా నిఘా వర్గాల సమాచారం. రష్యా సైన్యంలో కీలక స్థానాల్లో ఉన్న మరికొందరు జనరల్స్ సైతం పుతిన్ వ్యవహార శైలి రుచించక ప్రిగోజిన్కు పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వాగ్నర్ గ్రూప్ కిరాయి సేనల పరిస్థితేమిటి? సిరియా అంతర్యుద్ధంలో, 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకొనే క్రమంలో జరిగిన పోరాటంలో క్రెమ్లిన్ తరపున ప్రిగోజిన్ పనిచేశాడు. అంతటి వీరవిధేయుడు తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్కు బద్ధశత్రువుగా మారిపోయాడు. అయినప్పటికీ బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ క్షేమంగా రష్యా పొలిమేరలు దాటి వెళ్లిపోయాడు. ఏ షరతులకు లోబడి క్రెమ్లిన్కు, ప్రిగోజిన్కు మధ్య సంధి కుదిరిందో ఇంకా బయటపడలేదు. సంధి కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో కూడా దీనిపై ఏ ప్రకటనా చేయలేదు. పుతిన్ కూడా ఈ అంశంపై పెదవి విప్పలేదు. క్షమాభిక్ష పెడుతున్నానని మాత్రమే ప్రకటించాడు. పుతిన్ మునుపటి బలవంతుడు కాదు, బలహీనుడు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ప్రిగోజిన్ క్షమాభిక్షతో బయటపడినప్పటికీ అతడి సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికుల భవిష్యత్తు ఏమిటన్నది ఇంకా తేలలేదు. చెల్లాచెదురైపోతారా? లేక రష్యా సైన్యంలో విలీనమై ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఈ క్షమాభిక్ష తాత్కాలికమే! తిరుగుబాటును వెన్నుపోటుగా, దేశ ద్రోహంగా అభివరి్ణంచిన పుతిన్ అందుకు కారణమైన వాళ్ల అంతు చూస్తానంటూ బాహాటంగా ప్రకటించకపోవడం సామాన్య పౌరులకు సైతం విడ్డూరంగా అనిపించింది. బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటు తిరుగుబాట పట్టినప్పటికీ, ప్రిగోజిన్కు, అతడి కిరాయి సేనలకు పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించడం ఈ మొత్తం ఉదంతానికి యాంటీ క్లయిమాక్స్గానే చెప్పుకోవాలి. ఈ క్షమాభిక్ష తాత్కాలికమేనని, తిరుగుబాటుదారుల్లో ఏ ఒక్కరినీ పుతిన్ వదిలిపెట్టరనేది మరికొందరి వాదన. ఏది ఏమైనప్పటికీ పుతిన్ అధికార ప్రస్థానంలో ఇది మాయని మచ్చగానే మిగిలిపోతుంది. తిరుగుబాటు చల్లారిన తర్వాత పుతిన్ రెండుసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ రెండూ రికార్డు చేసి, ప్రసారం చేసినవే కావడం గమనార్హం. రష్యా ప్రజలను అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంత జరిగినా రష్యా ప్రజల్లో అధిక శాతం ఆయనకు మద్దతుగానే నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో పుతిన్ ఉన్నట్టుండి బుధవారం జనం మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వారితో కరచాలనాలు చేసి తానేమీ బెదిరిపోలేదనే సంకేతాలు పంపించారు. కొసమెరుపు.. తిరుగుబాటు జరిగి(జూన్ 23) వారం రోజులవుతోంది. 24 గంటల్లోనే ఈ తిరుగుబాటు చల్లారడం, బాధ్యుడైన ప్రిగోజిన్ స్వేచ్ఛగా రష్యా విడిచి వెళ్లడం జరిగిపోయింది. అయితే ప్రిగోజిన్ ఎక్కడ తలదాచుకున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు తిరుగుబాటు సమాచారం ముందే తెలిసినా మౌనంగా ఉండిపోయిన రష్యా వైమానిక దళం కమాండర్ సెర్గెయ్ సురోవికిన్ కూడా మాయమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడో ఇటు రష్యా నిఘా సంస్థకు గానీ, అటు ఆయన కుటుంబ సభ్యులకు గానీ సమాచారం లేదు. అవిధేయతను అణచివేయడంలో సిద్ధహస్తుడైన పుతిన్ వేట మొదలుపెట్టారా? ఏమో! ఏమైనా కావొచ్చు!! -
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా పర్యటన.. ఇద్దరు మిత్రులు సాధించిందేమిటి?
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్కు జిన్పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్కు స్నేహహస్తం అందించారు. జిన్పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం.. ఉక్రెయిన్పై చొరవ సున్నా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక సహకారం, రక్షణ సంబంధాలు నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక కూటమి అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్పింగ్ పరోక్షంగా వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అండ యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు. రష్యాకే మొదటి ప్రాధాన్యం ► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు. ► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆక్రమిత మేరియుపోల్లో పుతిన్
కీవ్: ఉక్రెయిన్లోని ఆక్రమిత తీర ప్రాంత నగరం మేరియుపోల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మికంగా పర్యటించారు. సెప్టెంబర్లో తమ సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక పుతిన్ మొదటిసారిగా అక్కడికి వెళ్లారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న పుతిన్, సొంతంగా వాహనం నడుపుతూ నగరంలోని స్మారకప్రాంతాలను సందర్శించారు. పుతిన్ శనివారం మేరియుపోల్కు దగ్గర్లోనే ఉన్న క్రిమియాకూ వెళ్లారు. -
పుతిన్ అరెస్ట్ అవుతారా?.. బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాదికి పైగా ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తున్నారు. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో దారుణ కాండ సాగిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్న ధోరణిలో పోతున్నారు. అలాంటి సమయంలో ఐసీసీ ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వారెంట్లతో పుతిన్ను అరెస్ట్ చేయొచ్చా ? మాస్కో చెబుతున్నట్టుగా అ వారెంట్లు చిత్తు కాగితాలతో సమానమా? ► పుతిన్పైనున్న ఆరోపణలేంటి? ఉక్రెయిన్లో ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లల్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి రష్యాకి దాదాపుగా 16,221 మంది తరలివెళ్లారని ఐక్యరాజ్య సమితి విచారణలో తేలింది. ఈ పిల్లల్ని తాత్కాలికంగా తరలిస్తున్నట్టు బయటకి చెబుతున్నారు. కానీ ఆ చిన్నారుల్ని రష్యాలో పెంపుడు కుటుంబాలకు ఇచ్చేసి వారిని శాశ్వతంగా రష్యా పౌరుల్ని చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్లో మిగిలిపోయిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. ఇలా పిల్లల్ని తరలించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం యుద్ధ నేరం కిందకే వస్తుంది. పిల్లల్ని తరలిస్తున్న సైనికుల్ని, ఇతర అధికారుల్ని నియంత్రించలేకపోయిన పుతిన్ యుద్ధ నేరస్తుడేనని ఐసీసీ చెబుతోంది. పుతిన్తో పాటుగా రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా లోవా బెలోవా కూడా సహనిందితురాలుగా ఉంది. ► పుతిన్ అరెస్ట్ అవుతారా? పుతిన్ సొంత దేశంలో అపరిమితమైన అధికారాలను అనుభవిస్తున్నారు. రష్యాలో ఉన్నంత కాలం ఆయన సేఫ్. ఐసీసీకి సొంత పోలీసు బలగం లేదు. ఏ పని చెయ్యాలన్నా సభ్యదేశాలపైనే ఆధారపడుతుంది. రష్యాను వీడి పుతిన్ వేరే దేశానికి వెళితే ఐసీసీ అరెస్ట్ చేయొచ్చు. ఈ అరెస్ట్ వారెంట్ల జారీతో ఆయన విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి. అయితే 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఐసీసీ నోటీసులతో అంతర్జాతీయ సమాజం కూడా ఇక పుతిన్ కదలికలను నిశితంగా గమనిస్తుంది కాబట్టి ఆయన వేరే దేశం వెళితే మాత్రం అరెస్ట్ కాక తప్పకపోవచ్చు. ► విచారణ ఎదుర్కొంటారా? పుతిన్ విచారణకు కొన్ని అడ్డంకులున్నాయి. ఐసీసీని రష్యా గుర్తించడంలేదు. అమెరికా, రష్యా వంటి దేశాలు ఇందులో సభ్యులు కావు. ఐసీసీ విచారణ పరిధిని అగ్రరాజ్యం అమెరికా కూడా ఆమోదించడం లేదు. మరో అడ్డంకి ఏమిటంటే ఐసీసీ వాద, ప్రతివాదులిద్దరూ హాజరైతే తప్ప విచారణ కొనసాగించదు. ఎవరైనా విచారణకు గైర్హాజరైతే విచారణ ముందుకు సాగదు. పుతిన్ను విచారించాలంటే ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన దేశాల్లో విచారణ చేయొచ్చు. పుతిన్ను అలా వేరే దేశానికి తీసుకురావడం అసాధ్యం. ► ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఎంత? ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న అరాచకాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని మరోసారి పుతిన్కు స్పష్టంగా తెలిసేలా, అంతర్జాతీయ సమాజం దీనిపై ఆగ్రహంగా ఉందని సంకేతాలు ఇచ్చేలా ఈ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అయితే రష్యా ఈ వారెంట్లను లెక్క చేయలేదు. తాము ఐసీసీని గుర్తించడం లేదు కాబట్టి ఆ వారెంట్లు చిత్తు కాగితంతో సమానమని మాస్కో పెద్దలు వ్యాఖ్యానించారు. పుతిన్ అధికార ప్రతినిధి ఒకరు ఈ వారెంట్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఐసీసీని ఏ మాత్రం పట్టించుకోని పుతిన్ ఈ వారెంట్లకి భయపడి ఉక్రెయిన్ అంశంలో వెనకడుగు వేస్తారని అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా ఏ దేశాల నేతలను శిక్షించారు? ► అరాచకాలు సృష్టించిన జర్మనీ నాజీ నాయకుల్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. నియంత అడాల్ఫ్ హిట్లర్కు కుడిభుజంగా చెప్పుకునే రుడాల్ఫ్ హెస్కి జీవిత ఖైదు పడింది. ► బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల నాయకుల్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో విచారించారు ► 1990లో యుగోస్లోవియా ముక్కలైనప్పుడు అక్కడ హింసాకాండను ప్రేరేపించిన ఆ దేశాధ్యక్షుడు స్లొబోదాన్ మిలోసెవిచ్ను ఐక్యరాజ్యసమితి హేగ్లో విచారించింది. తీర్పు వచ్చేలోపే ఆయన జైల్లో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఏకంగా 90 మందికి శిక్ష పడింది. ► అత్యాచారాలను ప్రేరేపించిన లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్కు 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు ► చాడ్ దేశం మాజీ నియంత హిస్సేని హాబ్రేకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ► ఐసీసీ ఏర్పాటయ్యాక 40 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందినవారు. ఏమిటీ ఐసీసీ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) 1998లో ‘‘రోమ్ స్టాచ్యూట్’’ ఒప్పందం కింద ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని హేగ్లో ఉంది. అంతర్జాతీయ సమాజంపైనా, మానవత్వంపైన జరిగే తీవ్రమైన నేరాలు, మారణహోమాలు, యుద్ధనేరాలను విచారించి శిక్షలు విధిస్తుంది.రెండో ప్రపంచ యుద్ధం సమయంలో న్యూరెంబర్గ్ విచారణ తరహాలోనే ఐసీసీ ఏర్పాటైంది. ప్రస్తుతం బ్రిటన్, జపాన్, అఫ్గానిస్తాన్, జర్మనీ సహా 123 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నా యి. రష్యా, అమెరికా దీనిని గుర్తించలేదు. అదే విధంగా భారత్, చైనా కూడా సభ్యత్వాన్ని తీసుకోలేదు. తీవ్రమైన నేరాల విషయాల్లో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలు విచారణలో విఫలమైతే ఐసీసీ జోక్యం చేసుకుంటుంది. -
పుతిన్పై ఐసీసీ అరెస్టు వారెంట్
ద హేగ్: రష్యా అధ్యక్షుడు పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) శుక్రవారం వెల్లడించింది. ఉక్రెయిన్లో పిల్లలను అపహరించిన ఘటనల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యుద్ధనేరాలకు పాల్పడినట్లు గుర్తిస్తూ ఈ వారెంట్ జారీ చేసినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పిల్లలను ఇలా చట్టవిరుద్ధంగా మరో దేశానికి తరలించడం యుద్ధనేరమేనని పేర్కొంది. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి కార్యాలయంలో పిల్లల హక్కుల కమిషనర్గా పని చేస్తున్న మారియా అలెక్సేయేవ్నాను సైతం అరెస్టు చేయాలంటూ ఐసీసీ వారెంట్ జారీ చేసింది. -
Russia-Ukraine war: ఒక దురాక్రమణకు, తలవంచని తెగువకు..ఏడాది
ఏడాది క్రితం.. 2022 ఫిబ్రవరి 24... ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పొరుగు దేశం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. దాదాపు ఏడాది గడిచాక... పసికూనగా భావించిన ఉక్రెయిన్ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే. తొలిసారేమీ కాదు.. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్(యూఎస్ఎస్ఆర్)లో అంతర్భాగమే. సోవియట్ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ కీలుబొమ్మ అని పుతిన్ తరచుగా విమర్శిస్తుంటారు. ఉక్రెయిన్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. మరోవైపు ఉక్రెయిన్లో గణనీయంగా ఉన్న రష్యన్ మాట్లాడే ప్రజలు రష్యాకు మద్దతుగా తిరుగుబాటుకు దిగారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం, రష్యా నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల సాయం కోరారు. రష్యా బారినుంచి కాపాడేందుకు తమను తక్షణం నాటో కూటమిలో చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తమైంది. అదే జరిగితే నాటో సేనలు ఏకంగా రష్యా సరిహద్దుల్లో తిష్టవేసే ఆస్కారముండటం అధ్యక్షుడు పుతిన్కు ఆగ్రహం కలిగించింది. వెంటనే రంగంలోకి దిగి 2021 నవంబర్ నాటికే ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలించారు. 2022 ఫిబ్రవరికల్లా దాన్ని లక్షకు పెంచి తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీశారు. ఉక్రెయిన్పై దాడి తప్పదన్న వార్తల నడుమ, తీవ్ర పరిణామాలు, కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. తమకలాంటి ఉద్దేశం లేనే లేదంటూనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై పుతిన్ సైన్యం మూడువైపుల నుంచీ విరుచుకుపడింది. శిథిల చిత్రంగా ఉక్రెయిన్ రష్యా దాడుల ధాటికి ఉక్రెయిన్ సర్వం కోల్పోయి శిథిలచిత్రంగా మిగిలింది. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, మృతదేహాలతో మరుభూమిని తలపించింది. ఐక్యరాజ్యసమితికి శరణార్థుల హై కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2023 జనవరి 15 నాటికి రష్యా దాడుల్లో 7,000కు పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 11 వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. వాస్తవానికి కనీసం 50 వేల మందికి పైగా అమాయక పౌరులు యుద్ధానికి బలయ్యారని, లక్షలాది మంది గాయపడ్డారని అంచనా. 80 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా ఇతర దేశాలకు వలసవెళ్లారు. వారంతా కట్టుబట్టలతో ఇల్లూ వాకిలీ వదిలి తరలిపోతున్న దృశ్యాలు మానవతకే తీరని మచ్చగా మిగిలాయి. మరో 60 లక్షల మంది స్వదేశంలోనే నిరాశ్రయులయ్యారు. రష్యా అతలాకుతలం రష్యా కూడా ఉక్రెయిన్ చేతిలో అవమానకర ఎదురుదెబ్బలు మినహా ఇప్పటిదాకా ఇప్పటిదాకా బావుకున్నదేమీ లేదు. పైపెచ్చు యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా దిగజారింది. అమెరికా, పాశ్చాత్య దేశాల తీవ్ర ఆర్థిక ఆంక్షలతో పూర్తిగా స్తంభించి కుదేలైంది. ఆర్థిక వృద్ధి నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ దేశం వీడాయి. చమురు మినహా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా పడకేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. దాంతో యుద్ధంపై రష్యాలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నడూ లేని రీతిలో పౌరులు బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. వేలాదిగా అరెస్టులు జరిగినా వెరవకుండా ఆందోళనలు చేశారు. దేశాల్లో ఆకలి కేకలు గోధుమలు, మొక్కజొన్న ఎగుమతిలో అగ్రస్థానాన ఉన్న రష్యా, ఉక్రెయిన్ నుంచి యుద్ధం కారణంగా తిండి గింజల సరఫరా పూర్తిగా నిలిచిపోయి 50కి పై చిలుకు దేశాలు తీవ్ర ఆహార కొరత బారిన పడి అల్లాడుతున్నాయి. అంతేగాక అటు సంపన్న, ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం వల్ల ఎంతగానో దెబ్బ తిన్నాయి. సాహసి... జెలెన్స్కీ రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొక్కవోని ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తనను హతమార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కాచుకున్నారు. సురక్షితంగా తప్పిస్తామంటూ అమెరికా ముందుకొచ్చినా కాదన్నారు. సైన్యంతో కలివిడిగా తిరుగుతూ వారిలో స్థైర్యం నింపారు. ప్రపంచ దేశాలను సాయం కోరుతూ ప్రతి అంతర్జాతీయ వేదిక మీదా రష్యాను దునుమాడుతూ సాగారు. పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్గా చేసినా నిజ జీవితంలో మాత్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తిరుగులేని నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి హీరో అనిపించుకున్నారు. ఎవరికెంత నష్టం? యుద్ధంలో విజేతలు ఎవరో ఇప్పటిదాకా తేలకపోయినా ఇరు దేశాలు మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టాన్ని చవి చూశాయి. లక్షల సంఖ్యలో సైనికులను, వేల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, నౌకలను కోల్పోయాయి. ఏ దేశం ఎవరి వైపు... అమెరికా బ్రిటన్ సహా 30 నాటో సభ్య దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భారీగా ఆయుధ, ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాయి. వీటితో పాటు మరెన్నో దేశాలు రష్యా దాడిని ఖండించి ఉక్రెయిన్కు నైతిక మద్దతు ప్రకటించాయి. ఇక రష్యాకు ప్రధానంగా పొరుగు దేశమైన బెలారస్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉంది. చైనాతో పాటు ఉత్తర కొరియా, క్యూబా, వెనెజువెలా, ఇరాన్, సిరియా, కిర్గిస్తాన్ కూడా రష్యాకు మద్దతు ప్రకటించాయి. యూఏఈ, సౌదీ అరేబియా తటస్థంగా నిలిచినా రష్యా దాడిని ఖండించేందుకు తిరస్కరించాయి. యుద్ధానికి తక్షణం ముగింపు పలికి చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నది తొలినుంచీ భారత్ వైఖరిగా ఉంది. యుద్ధంలో కీలక మలుపులు ఫిబ్రవరి: 24న యుద్ధం ప్రారంభం. ఉక్రెయిన్ నిస్సైనికీకరణకు సైనిక చర్య ముసుగులో తూర్పు, ఉత్తర, దక్షిణాల నుంచి రష్యా ముప్పేట దాడి. మార్చి: ఖెర్సన్ నగరం స్వాధీనమైందన్న రష్యా. యూరప్లోకెల్లా పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ఆక్రమణ. కీవ్ శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో అపార నష్టం ధాటికి రష్యా సేనల పలాయనం. రష్యాపై అమెరికా, యూరప్ దేశాల భారీ ఆర్థిక, తదితర ఆంక్షలు. ఏప్రిల్: కీవ్, బుచాల్లో వందలాది పౌరులను రష్యా సైన్యం చిత్రహింసల పాలు చేసి చంపినట్టు వెల్లడి. రష్యాపై యుద్ధ నేరాల అభియోగాలు మోపాలంటూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు. ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి. రష్యా యుద్ధ నౌక మాస్క్వాను క్షిపణి దాడితో నల్లసముద్రంలో ముంచి సంబరాలు చేసుకున్న ఉక్రెయిన్. మే: మారియుపోల్ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా. రష్యా దూకుడు పట్ల ఆందోళనతో నాటోలో చేరుతామంటూ దరఖాస్తు చేసుకుని పుతిన్కు షాకిచ్చిన ఫిన్లండ్, స్వీడన్. జూన్: ఉక్రెయిన్ దాడుల దెబ్బకు యుద్ధం మొదట్లో నల్లసముద్రంలో ఆక్రమించిన స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలిగిన రష్యా సేనలు. జూలై: ప్రపంచ ఆహార భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ రేవు పట్టణాల నుంచి ఆహార ధాన్యాల సరఫరా. ఆగస్టు: క్రిమియాపై ఉక్రెయిన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బ తిన్న రష్యా వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలు. సెప్టెంబర్: ఖర్కీవ్లో ఆకస్మిక దాడులతో రష్యా దళాలను తరిమికొట్టిన ఉక్రెయిన్ సైన్యం. రిఫరెండం ముసుగులో డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు పుతిన్ ప్రకటన. అక్టోబర్: క్రిమియాను రష్యాతో కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్. నవంబర్: రష్యాకు పరాభవం. దాడులకు తాళలేక ఖెర్సన్ నగరం నుంచి పుతిన్ సేనల పలాయనం. డిసెంబర్: రష్యాలోని సరిహద్దు ప్రాంతాలు, పట్టణాలు, నగరాలపై దాడులు, భారీ నష్టం. 2023 జనవరి: మకీవ్కాలో క్షిపణి దాడులతో వందలాది మంది రష్యా సైనికులను మట్టుబెట్టామన్న ఉక్రెయిన్. 89 మంది మరణించారన్న రష్యా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సఖాలిన్–1 క్షేత్రాల్లో ఓవీఎల్కు 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: రష్యాలోని సఖాలిన్–1 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో తిరిగి 20 శాతం వాటాలను తీసుకున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఆపరేటర్ అయిన అమెరికన్ సంస్థ ఎక్సాన్మొబిల్ అనుబంధ కంపెనీ ఎక్సాన్ నెఫ్ట్గాజ్ను పక్కకు తప్పించి, దానికి సంబంధించిన అసెట్స్ అన్నింటిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతేడాది కొత్త ఆపరేటర్కు బదలాయించారు. గతంలో తమకున్న వాటాలను తిరిగి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అప్పట్లో షేర్హోల్డర్లయిన జపాన్ సంస్థ సోడెకో కన్సార్షియం, ఓవీఎల్కు రష్యా ప్రభుత్వం సూచించింది. దానికి అనుగుణంగానే ఓవీఎల్ దరఖాస్తు చేసుకోగా, తదనుగుణంగా గతంలో దానికి ఉన్నంత వాటాలను కేటాయించింది. సోడెకో కూడా తన వాటాను అట్టే పెట్టుకుంది. అయితే, ఎక్సాన్మొబిల్ విషయంలో స్పష్టత రాలేదు. గతంలో సఖాలిన్1లో ఎక్సాన్ నెఫ్ట్గ్యాస్, సోడెకో సంస్థలకు చెరి 30 శాతం, రాస్నెఫ్ట్కు 20 శాతం వాటాలు ఉండేవి. 2001లో ఓవీఎల్ ఇందులో 20 శాతం వాటాలు తీసుకుంది. గతేడాది అక్టోబర్లో ఈ ప్రాజెక్టును సఖాలిన్–1 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి రష్యా బదలాయించింది. ఈ కొత్త కంపెనీలో ఓవీఎల్, రాస్నెఫ్ట్కు చెరి 20 శాతం, సోడెకోకు 30 శాతం వాటాలు ఉండగా.. ఎక్సాన్మొబిల్ వాటా విషయంలో ఇంకా ఏమీ తేలలేదు. ఉక్రెయిన్ మీద దాడికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్లో సఖాలిన్–1 నుంచి ఉత్పత్తిని ఎక్సాన్ నెఫ్ట్గాజ్ నిలిపివేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సఖాలిన్–1లో రోజుకు 2,20,000 బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తయ్యేది. నవంబర్ నుంచి మళ్లీ 1,40,000–1,50,000 బీపీడీ మేర ఉత్పత్తి మొదలుపెట్టారు. -
Xi meets Putin: ఇక మరింత సహకారం
కీవ్: రష్యా, చైనా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు పుతిన్, షీ జిన్పింగ్ నిర్ణయానికొచ్చారు. వారు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మినహా పలు అంశాలపై చర్చించుకున్నారు. భేటీని టీవీల్లో ప్రసారం చేశారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా రష్యా, చైనా బంధం బలోపేతం అవుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు! రెండు దేశాల సంబంధాల్లో సైనిక సహకారానికి ‘ప్రత్యేక ప్రాధాన్యం’ ఉందని ఉద్ఘాటించారు. రష్యా, చైనా సైనిక దళాల నడుమ సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రష్యాలో పర్యటించాలని జిన్పింగ్ను ఆహ్వానించారు. -
మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్
మాస్కో: ప్రపంచంలోని శక్తిమంతమైన నేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. 70 ఏళ్ల పుతిన్ మెట్లపై నుంచి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన బాడీగార్డ్స్ సోఫాలో కూర్చోబెట్టగా వైద్యులు చికిత్స అందించినట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్య సమస్యలతో సమతమతవుతున్నట్లు వెల్లడిస్తూ వస్తున్న జనరల్ ఎస్వీఆర్.. తాజా పరిణామాన్ని రష్యన్ టెలిగ్రామ్ ఛానల్కు తెలిపినట్లు మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయంపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. మెట్లపై నుంచి పడిపోవడం వల్ల తుంటి ఎముక దెబ్బతినంటతో పాటు జీర్ణాశయాంతర క్యాన్సర్ బయటపడిందని మీడియా పేర్కొంది. ‘సమీపంలోని సోఫాలోకి తీసుకెళ్లేందుకు ముగ్గురు సెక్యూరిటీ అధికారులు పుతిన్కు సాయం చేశారు. అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను పిలిపించారు. పుతిన్ ఇప్పటికే జీర్ణాశయాంతర పేగు ఆంకాలజీతో బాధపడుతున్నారు. దాని ఫలితంగా ఆయన ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే మెట్లపై నుంచి పడిపోయారు.’ అని స్థానిక మీడియా పేర్కొంది. పుతిన్ మెట్లపై నుంచి పడిపోయిన క్రమంలో ఆయన ఆరోగ్యంపై మరోమారు వార్తలు గుప్పుమన్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, దగ్గు, మైకము, నిద్రలేమి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని పలు మీడియాలు కథనాలు వెల్లడించాయి. పుతిన్ తన చుట్టూ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు నిత్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారని గతంలోనూ పలు మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: చైనాలో ‘జీరో కోవిడ్’ ఆంక్షలు ఎత్తివేస్తే 20 లక్షల మరణాలు? -
ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన
కీవ్: ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్లో 87%, లుహాన్స్క్లో 98%, డొనెట్స్క్లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు మంగళవారం ప్రకటించారు. శుక్రవారం క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి. -
Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది
మాస్కో: ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పుతిన్ శుక్రవారం దేశ పార్లమెంట్నుద్దేశించి మాట్లాడారు. క్రిమియా, వేర్పాటువాదుల ప్రాబల్యప్రాంతాలతో పాటు ఆక్రమిత ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఉక్రెయిన్ను రష్యా డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్కు అమెరికా ఆయుధ సాయం వాషింగ్టన్: ఉక్రెయిన్కు అమెరికా మరో రూ.3,100 కోట్ల విలువైన ఆయుధ సాయం అందజేసింది. ఇందులో అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు తదితరాలున్నాయని అధికారులు చెప్పారు. -
Russia-Ukraine War: లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్
పొక్రోవ్స్క్: తూర్పు ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన డోన్బాస్లో భాగమైన లుహాన్స్క్ ప్రావిన్స్లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఖరారు చేశారు. లుహాన్స్క్లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. లుహాన్స్క్ను మన దళాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు అధ్యక్షుడు పుతిన్కు తెలియజేశారు. లుహాన్స్క్ ప్రావిన్స్లో పెద్ద నగరమైన లీసిచాన్స్క్ రష్యా వశమయ్యిందని, అక్కడ ఆపరేషన్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. కీలక ప్రాంతంలో విజయం దక్కడం పట్ల పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. రష్యా సైన్యానికి లక్ష్యంగా మారకుండా లుహాన్స్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లాయని స్థానిక గవర్నర్ సెర్హియి హైడై తెలిపారు. మరికొంత కాలం అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. దానికి అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. లుహాన్స్క్లో దక్కిన విజయంతో రష్యా సైన్యం ఇక డొనెట్స్క్లోని సివీరెస్క్, ఫెడోరివ్కా, బఖ్ముత్ వైపు కదిలేందుకు సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. డొనెట్స్క్లో సగం భూభాగం ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉంది. స్లొవియాన్స్క్, క్రామటోర్స్క్లో రష్యా వైమానిక దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. స్లొవియాన్స్క్లో తాజాగా రష్యా దాడుల్లో తొమ్మిదేళ్ల బాలిక సహా ఆరుగురు మరణించారు. 19 మంది క్షతగాత్రులయ్యారు. క్రామటోర్స్క్లోనూ రష్యా నిప్పుల వర్షం కురిపించింది. రష్యా దృష్టి మొత్తం ఇప్పుడు డొనెట్స్క్పైనే ఉందని బ్రిటిష్ రక్షణ శాఖ పేర్కొంది. పునర్నిర్మాణం.. ప్రపంచ బాధ్యత: జెలెన్స్కీ లుహాన్స్క్ నుంచి తమ దళాలు వెనుదిరగడం నిజమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకొని, బలం పుంజుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో సోమవారం ‘ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్’లో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణం అనేది స్థానిక ప్రాజక్టు లేదా ఒక దేశ ప్రాజెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో నాగరిక దేశాల ఉమ్మడి కార్యాచరణ అని వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసి తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి 750 బిలియన్ డాలర్లు అవసరమని ఉక్రెయిన్ ప్రధానమంత్రి అంచనా వేశారు. ఈ మేరకు రికవరీ ప్లాన్ రూపొందించారు. -
ఆహార, ఇంధన సంక్షోభం పశ్చిమ దేశాల పుణ్యమే: పుతిన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ఆహార, ఇంధన సంక్షోభానికి పశ్చమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తప్పులన్నీ అవి చేసి, ఇప్పుడు నెపాన్ని రష్యాపై మోపుతున్నాయంటూ మండిపడ్డారు. రష్యాపై అవి విధించిన ఆంక్షలు ప్రపంచ మార్కెట్లను మరింతగా కుంగదీయడం ఖాయంమని జోస్యం చెప్పారు. యూరప్ దేశాల మతిలేని విధానాల వల్లే రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇదంతా పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారమే. ఉక్రెయిన్ తన రేవు పట్టణాల్లోని తీర జలాల నుంచి మందుపాతరలను తొలగించే పక్షంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాల రవాణాకు భరోసా కల్పిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
Russia-Ukraine war: డోన్బాస్పై రాజీకి రెడీ
లివీవ్: యుద్ధానికి తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఉక్రెయిన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఉక్రెయిన్ను తటస్థ దేశంగా ప్రకటించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అంతేగాక ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతం డోన్బాస్ హోదాపై రాజీకి కూడా సిద్ధమన్నారు. ‘‘రష్యా సేనలు మా దేశాన్ని పూర్తిగా వీడటం అసాధ్యమని అర్థమైంది. అందుకే అవి వెనక్కు తగ్గి డోన్బాస్కు పరిమితం కావాలి’’ అని కోరారు. తద్వారా, ఆ ప్రాంతాన్ని రష్యాకు వదులుకుంటామనే సంకేతాలిచ్చారు. తక్షణం యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పితే పుతిన్ కోరుతున్నట్టుగా అణ్వస్త్రరహిత దేశ హోదాకు ఒప్పుకోవడంతో పాటు ఇతర భద్రతా హామీలు కూడా ఇస్తామన్నారు. యుద్ధం ముగిశాక ఈ డిమాండ్లపై రిఫరెండం నిర్వహించి జనాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ ముక్తాయించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర రష్యా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, తాను ముఖాముఖీ చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. నాటోలో చేరొద్దన్న డిమాండ్కు అంగీకరిస్తామని జెలెన్స్కీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కీలకాంశాలన్నింటి మీదా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే పుతిన్–జెలెన్స్కీ భేటీ సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పునరుద్ఘాటించారు. నిలిచిన రష్యా దళాలు రష్యా దళాలు గత 24 గంటల్లో ఉక్రెయిన్లో ఏ ప్రాంతంలోనూ పెద్దగా ముందుకు చొచ్చుకుపోలేదు. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల తీవ్ర కొరత, అతిశీతల పరిస్థితులు, ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో ఎక్కడివక్కడే రక్షణాత్మక పొజిషన్లలో ఉండిపోయినట్టు ఇంగ్లండ్ పేర్కొంది. ఉక్రెయిన్లో ఉన్న రష్యా దళాలను చాలావరకు డోన్బాస్ కేసి మళ్లిస్తున్నట్టు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి ఒకరు చెప్పారు. రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలను విచారించేందుకు సంయుక్త విచారణ బృందం ఏర్పాటుకు పోలండ్, లిథువేనియా, ఉక్రెయిన్లకు సాయపడ్డట్టు యూరోపియన్ యూని యన్ సమన్వయ సమితి యూరోజస్ట్ పేర్కొంది. మరోవైపు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండొద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు రష్యా పేర్కొంది. రూబుల్ చెల్లింపులు చేయం: జీ7 గ్యాస్ ఎగుమతుల చెల్లింపులను రూబుల్స్లోనే చేయాలన్న రష్యా డిమాండ్ను తిరస్కరించాలని జీ7 బృందం నిర్ణయించినట్టు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హెబక్ ప్రకటించారు. ‘‘ఇది ఒప్పందాలకు విరుద్ధం. మాకెవరికీ అంగీకారయోగ్యం కాదు’’ అని చెప్పారు. నెదర్లాండ్స్కు చెందిన బ్రూవరీ దిగ్గజం హెన్కెన్ కూడా రష్యా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా మరోసారి చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వచ్చే వారం భారత్లో పర్యటించే అవకాశముంది. భారత్కు సరఫరా చేస్తున్న ఇంధనానికి, మిలటరీ హార్డ్వేర్కు చెల్లింపులు రష్యా కరెన్సీ రూబుల్స్లో చేయాలని ఈ సందర్భంగా కోరవచ్చంటున్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. -
దమ్ముంటే ఒక్కడివే రా.. పుతిన్కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్
-
మూడో పక్షం జోక్యాన్ని సహించం
లెవివ్: ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్గా ప్రకటిస్తే తాము ఎంతమాత్రం అంగీకరించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా మూడో పక్షం జోక్యం చేసుకుంటే ప్రస్తుత యుద్ధంలో ఆ పక్షాన్ని కూడా భాగస్వామిగానే పరిగణిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారం లో మూడో పక్షం తలదూర్చవద్దంటూ పరోక్షంగా తేల్చిచెప్పారు. పుతిన్ శనివారం రష్యా మహిళా పైలట్లతో సమావేశమయ్యారు. నో–ఫ్లై జోన్ దిశగా ఎవరైనా ముందడుగు వేస్తే వారిని తమ భద్రతా దళాలకు ముప్పుగానే భావిస్తామని, తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని తెలిపారు. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని తాజా పరిస్థితికి అక్కడి నాయకులే బాధ్యులని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. మరోవైపు తమ గగనతలాన్ని నో–ఫ్లై జోన్గా గుర్తించాలని నాటో దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటినుంచి తమ దేశంలో ఎవరైనా మరణిస్తే నాటో కారణంగానే మరణించినట్లు భావిస్తామని చెప్పారు. మూడో దఫా చర్చలకు సిద్ధం ఉక్రెయిన్తో మూడో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ శనివారం చెప్పారు. తమ వైఖరి స్పష్టంగానే ఉందని, ఉక్రెయిన్ వైఖరే నమ్మదగిన విధంగా లేదని తప్పుపట్టారు. రష్యాతో 3వ విడత సోమవారం చర్చలు జరిపాలని ఉక్రెయిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఉక్రెయిన్లో ఆహార సంక్షోభం! గోధుమల ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే ఉక్రెయిన్లో ఇప్పుడు ఆహార కొరత తలెత్తింది. అత్యవసరంగా తమకు 10 బిలియన్ డాలర్లు అందజేయాలని ఆమెరికాను జెలెన్స్కీ అభ్యర్థించారు. ఉక్రెయిన్లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. -
రష్యా రెక్కలు విరుస్తాం: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను నియంతగా, యుద్ధ పిపాసిగా అభివర్ణించారు. అకారణ యుద్ధానికి దిగినందుకు ఆయన దోషిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. జీ7 దేశాల నేతలతో గంటకు పైగా వర్చువల్గా చర్చించాక భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా, ఇతరత్రా కూడా రష్యా రెక్కలు విరిచేస్తామన్నారు. ‘‘మరో నాలుగు అతి పెద్ద రష్యా బ్యాంకులపై, పుతిన్కు సన్నిహితులైన ఆ దేశ కుబేరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. ఆ బ్యాంకులకు, సంపన్నులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నాం. ఇక అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్టే. చదవండి: (Vladimir Putin: రష్యా అధ్యక్షుడికి ఎక్కడిదీ బరి తెగింపు!) డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్ కరెన్సీల్లో ఇకపై రష్యా ఎలాంటి లావాదేవీలు చేయలేదు. ఆ దేశ ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తీస్తాం. ఇవన్నీ యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర దేశాలతో కలిసి అమెరికా సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు. త్వరలో రష్యాపై మరిన్ని అతి కఠిన ఆంక్షలుంటాయి’’ అని ప్రకటించారు. తూర్పు యూరప్లోని నాటో స్థావరాలకు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తున్నట్టు చెప్పారు. నాటో దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్ క్షేమం కోసం ప్రపంచ దేశాలన్నింటితో కలిసి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ దేశానికి నైతికంగా, మానవతా దృక్పథంతో అన్ని రకాల సాయమూ చేస్తామన్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) -
డిసెంబర్ 6న భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్కు రానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అదే రోజు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై రెండు దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ] ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం వెల్లడించారు. దీంతోపాటు, అదే రోజు రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరుగుతాయని వివరించారు. చదవండి: తైవాన్కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు -
భారత్, రష్యా భాయి–భాయి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వార్షిక ద్వైపాక్షిక భేటీలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలకగా మోదీ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. పుతిన్ విమానాశ్రయంలో దిగిన అనంతరం మోదీ ఇంగ్లిష్, రష్యా భాషల్లో ట్వీట్ చేస్తూ ‘భారత్కు స్వాగతం పుతిన్. భారత్–రష్యాల స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే మన చర్చల కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఏకాంతంగా విందు ఆరగిస్తూ ద్వైపాక్షిక సహకారం సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని ఓ అధికారి చెప్పారు. 19వ భారత్–రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగనుంది. రక్షణ రంగంలో సహకారం, ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థపై ఒప్పందం, ఉగ్రవాదంపై పోరు, పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, పుతిన్లు చర్చించే అవకాశం ఉంది. 5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసే ఒప్పందం శుక్రవారం దాదాపుగా ఖరారవనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రష్యా నుంచి ఎవరూ ఆయుధాలు కొనకూడదంటూ ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. అవసరమైనప్పుడు ప్రతేకంగా ఏదైనా దేశం కోసం ఈ ఆంక్షలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కు అధికారం ఉంది. ఆంక్షలున్నా సరే రష్యా నుంచి క్షిపణుల కొనుగోలుకే భారత్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష, వాణి జ్య, ఇంధన, పర్యాటక తదిరత రంగాల్లో ఒప్పందాలు కూడా భారత్–రష్యామధ్య కుదిరే అవకాశం ఉంది. -
శవాలదిబ్బ ; సిరియాలో 700 మంది హతం
మనిషి విజ్ఞానం రాశులు పోసినట్లు కనిపిస్తుందక్కడ.. శిథిలాలు, శవాలదిబ్బల రూపంలో! అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తిమంతంగా తయారైన ఆయుధాలను పసిపిల్లల్ని చంపడానికి వినియోగిస్తున్నారక్కడ!! అదేమంటే, ఉగ్రవాద విముక్తి పోరాటంలో ‘నరబలి’ తప్పదన్నట్లు ప్రభుత్వాలు వ్యాఖ్యానిస్తున్నాయి!!! డమస్కస్ : గడిచిన కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాల దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఏకబిగిన జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది. (సిరియా అంతర్యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ఓ పాత ఫొటో) అసలేం జరుగుతోంది? దేశ రాజధాని డమస్కస్ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్ అల్ షమ్, అల్ రహమాన్ లీజియన్, జైష్ అల్ ఇస్లామ్ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి. (యుద్ధక్షేత్రంలో ఓ అమాయక బాలిక) దేశరాజధాని డమస్కస్కు 10 కిలోమీటర్ల దూరంలో 100 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న గౌటా నగరంపై పట్టుసాధిస్తే తప్ప సిరియా ప్రభుత్వం మనలేని పరిస్థితి. ఉగ్రవాదుల చెర నుంచి మిగతా ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లే గౌటాను కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో సిరియా సైన్యం పనిచేస్తున్నది. ఆ సైన్యాలకు రష్యా పూర్తిస్థాయిలో అండగా నిలవడమేకాక, వైమానిక దాడులు సైతం నిర్వహిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గౌటా యుద్ధక్షేత్రంలో సుమారు 4లక్షల మంది జనం చిక్కుకుపోయారు. రోజుకు ఐదు గంటల విరామం : పుతిన్ మానవ హక్కులను కాలరాస్తూ సిరియా-రష్యాలు సాగిస్తోన్న బాంబు దాడులపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ‘తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలి’ అని మండలి తీర్మానించింది. రష్యా కూడా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాల్పుల విరమణపై రష్యా వెనక్కితగ్గలేదు. ‘మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రమే దాడుల్ని ఆపుతాం. ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. -
పుతిన్.. ఆ పాముతో దోస్తీ మానుకో!
- రష్యాకు బ్రిటన్ స్ట్రాంగ్ వార్నింగ్ లండన్: సొంత ప్రజలపై రసాయనికదాడులకు పాల్పడిన సిరియా ప్రభుత్వానికి నిర్విరామంగా మద్దతు పలుకుతోన్న రష్యాకు.. బ్రిటన్ గట్టి హెచ్చరిక చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను విషపూరిత జీవిగా పోల్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్.. ‘పుతిన్.. ఇప్పటికైనా ఆ పాముతో స్నేహం మానుకో’ అని హితవుపలికారు. ఈ విషయాన్ని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారమే రష్యాకు వెళ్లాల్సిన బోరిస్ ఉన్నపళంగా తన పర్యటనను రద్దుచేసుకునిమరీ పుతిన్పై విమర్శలు గుప్పించడం గమనార్హం. తిరుగుబాటుల ఆధీనంలోని ఖాన్ షిఖౌన్ పట్టణంలో గతవారం సిరియా సైన్యం జరిపిన రసాయనిక దాడిలో 89 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ చర్యను గర్హించిన అమెరికా.. శుక్రవారం తెల్లవారుజామున సిరియా వైమానిక స్థావరంపై మిస్సైళ్లతో దాడిచేసింది. దీంతో ఇన్నాళ్లూ పరోక్షంగా సాగిన పోరు.. ప్రత్యక్ష యుద్ధంగా మారినట్లయింది. అయితే రష్యా మాత్రం ఎప్పటిలాగే సిరియా సర్కారును వెనకేసుకొచ్చింది. సైన్యం రసాయనికదాడి చేయలేదని, రెబల్స్ దాచిపెట్టిన రసాయనాలు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చింది. నేడు జీ-7 దేశాల కీలక భేటీ.. సిరియా విషయంలో రష్యా పాత్రను కట్టడిచేసేలా వివిధ వేదికలు పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం ఇటలీలో జీ-7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కీలక తీర్మానాలు ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ వేదికపై నుంచి రష్యాకు మరింత తీవ్రంగా హెచ్చరికలు పంపాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. రేపు రష్యాకు అమెరికా విదేశాంగ మంత్రి ఒకపైపు సిరియా కేంద్రంగా పోటాపోటీ తలపడుతున్న అమెరికా-రష్యాలు మరోవైపు దౌత్యపరమైన సంబంధాల పునరుద్ధరణపై దృష్టిసారించాయి. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ మంగళవారం మాస్కోలో పర్యటించనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలతోపాటు ప్రస్తుత తరుణంలో కీలకంగా మారిన సిరియా పరిణామాలపైనా చర్చలు జరపనున్నట్లు సమాచారం. -
మనం కలిసుందాం.. వాళ్లను కుమ్మేద్దాం!
మాస్కో/వాషింగ్టన్: దాదాపు గంటపాటు జరిపిన ఫోన్ సంభాషణలో అగ్రదేశాధినేతలిద్దరూ ప్రపంచ సమస్యలను చర్చించారు. చివరికి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు.. అమెరికా, రష్యాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అదేసమయంలో భూగోళం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రప్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో శనివారం ఫోన్లో మాట్లాడారు. ఇద్దరు నేతలు గంటపాటు ఫోన్లో మాట్లాడుకున్నారని, ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రష్యా అధికార కేంద్రం క్రెమ్లిన్, యూఎస్ అధ్యక్ష భవనం వైట్హౌస్ అధికార ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అమెరికా-రష్యాల మధ్య సత్సంబంధాల పునరుద్ధారణ ఆవశ్యకమని ఇరునేతలు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఐసిస్, సిరియాలో అంతర్యుద్ధం, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఉత్తర కొరియా దూకుడు తదితర అంశాలపై ట్రంప్, పుతిన్లు చర్చించారని ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ఎత్తివేత గురించి ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నారా లేదా అనేదానిపై ఇరుదేశాల ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. ఫోన్ చర్చల ఫలితంగా సిరియాలో బాంబుల మోత ఆగుతుందా? లేదా? అనే ప్రశ్నకూ జవాబు దాటవేశారు. కాగా, అతి త్వరలోనే నేరుగా కలుసుకుని చర్చలు జరపాలని ట్రంప్-పుతిన్లు నిర్ణయించుకున్నారు. ట్రంప్ రష్యాకు వెళతారా? లేక పుతిన్నే అమెరికాకు ఆహ్వానిస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేమని క్రెమ్లిన్, వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. -
బద్ధశత్రువుల కలయికతో కొత్త ప్రపంచం?
మాస్కో/వాషింగ్టన్: ఒక దేశం సంక్షోభంలో చిక్కుకుందంటే దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా(+మిత్రదేశాలు), రష్యాలు కారణమవుతాయన్న సంగతి చెప్పనక్కర్లేదు. ఆధిపత్యభావజాలం, ఆయిల్ నిక్షేపాలు, ఆయుధాల వ్యాపారం.. లాంటి ఎన్నో దారుల్లో అగ్రరాజ్యాలు ఆయా దేశాల్లో కల్లోలం రేపుతాయని తెలిసిందే. అలా పెరిగి పెద్దదై, నాగరికతకు, మానవత్వానికి మాయని మచ్చలా తయారైందే సిరియా సంక్షోభం. ఒక్క సిరియానేకాదు మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాలు, ఆఫ్రికాలోని అన్నిదేశాలు, మిగతా ప్రపంచంలో కొన్నిదేశాల్లో నెలకొన్న పరిస్థితి వింటే మనిషన్న ఎవరికైనా బాధకలగకమానదు. ఇలాంటి స్థితిలో ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రపంచశాంతి కోసం పాటుపడటం అనే ప్రక్రియను అగ్రరాజ్యాలు మొదలుపెడతాయా? అంటే కష్టమనే చెప్పొచ్చు. కార్పొరేట్ సమీకరణాల నడుమ అభివృద్ధి చెందిన ఏ దేశమూ ఆ పని చేయదు. కానీ శాంతి నెలకొనాలని మనం అభిలాషించాల్సిందే. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల తాజా చర్చలు ఆ ఆశలను కొద్దిగా రేకెత్తిస్తున్నాయి. పుతిన్ మొదటి నుంచి ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు వార్తలు వింటున్నాం. అయితే అమెరికా-రష్యాల అధినేతలుగా మాత్రం వాళ్లు ప్రస్తుతానికి బద్ధ శత్రువులే! రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సోమవారం అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డోనాల్ట్ ట్రంప్ కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలపడంతోపాటు సిరియా సంక్షోభం, అమెరికా-రష్యాల ద్వైపాక్షిక సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇరుదేశాల సంబంధాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని సాధారణ స్థితికి తీసుకురావడం, సిరియా సంక్షోభానికి ముగింపు పలకండం లాంటి కీలక అంశాలపై ఇరునేతలు చర్చించినట్లు క్రెమ్లిన్(రష్యా అధికార కేంద్రం), ట్రంప్ కార్యాలయాలు మీడియాకు వెల్లడించాయి. సత్సంబధాల పునరుద్ధరణలో భాగంగా వాషింగ్టన్, మాస్కోల మద్య నిరంతర సంవాదాలు, తరచూ ఇరుదేశాధ్యక్షుల పర్యటనలు కొనసాగాలని పుతిన్, ట్రంప్ లు నిర్ణయించారని, ఈ ప్రక్రియలో ఎలాంటి భేషజాలకు తావు ఇవ్వకూడదని నేతలు భావిస్తున్నట్లు వారి ప్రతినిధులు పేర్కొన్నారు. 200 ఏళ్లకు పైగా కొనసాగుతోన్న అమెరికా- రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో త్వరలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. వచ్చే ఏడాదితో యూఎస్-రష్యా బంధం 210వ వార్షికోత్సవం జరగనుంది. ఇంకా ఖారారుకాని ఈ వేదికపైనుంచి పుతిన్, ట్రంప్ లు కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారని, ఆ మేరకు మార్గనిర్దేశం చేస్తారని తెలిసింది. సమానత్వం, పరస్పర గౌరవం, ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు కలుగజేసుకోకుండా ఉండటం తదితర అంశాల ప్రాతిపదికన ఇద్దరు నేతలు చర్చలు జరుపుతారని క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించగా, ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసి పోరాడుదామని ట్రంప్ పేర్కొన్నట్లు వాషింగ్టన్ లోని ఆయన కార్యాలయం తెలిపింది. అయ్యో.. సిరియా సిరియాలో అధికార బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 1000 గ్రూపులు పనిచేస్తున్నాయి. ఐసిస్ ఆ వెయ్యిలో ఒకటి. ఎన్నికల ప్రచారంలో ‘ఐసిస్ ను సృష్టించింది ఒబామా, హిల్లరీలే’నన్న ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని, అసద్ కు రష్యా దన్నుగా నిలవడంతో తన ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న భయంతోనే అమెరికా రెబల్ గ్రూపులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరాచేసిందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతారరు. అసద్ కు మద్దతిస్తోన్న రష్యా కూడా వైమానిక దాడులతో సిరియాలో ఘోర విధ్వంసాలకు పాల్పడింది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు బరితెగించడంతో దాదాపు రెండు కోట్ల మంది సిరియన్ల బతుకులు కకావికలం అయ్యాయి. నాలుగేళ్లుగా ఉధృతంగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఇప్పటికే 50 లక్షల పైచిలుకు సిరియన్లు సోంతదేశాన్ని విడిచచి శరణార్థులుగా వెళ్లిపోయారు. అలా వెళుతూ వెళుతూ సముద్రంలో మునిగి చనిపోయిన బాలుడు అయిలన్ కుర్ధీ ఫొటో ప్రపంచాన్ని ఎంతగా కదిలించిందో చూశాం. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, పుతిన్ సారధ్యంలోని రష్యాలు సిరియా సంక్షోభానికి ముగింపు పలికి, మున్ముందు ఇలాంటి దురాక్రమణలకు ఉపక్రమించకుండా ఉంటే ప్రపంచానికి కావాల్సిందేముంటుంది? -
ట్రంప్కు మోదీ, పుతిన్ అభినందనలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. అమెరికా-భారత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో భారత్తో ఉన్న అనుభందాన్ని స్నేహాన్ని ప్రస్థావించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. అలాగే, మరో అగ్ర రాజ్యం రష్యా అభినందనలు తెలియజేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ట్రంప్కు టెలిగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని తాను ఆశిస్తున్నట్లు అందులో పుతిన్ పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి సాగాలని తాము భావిస్తున్నామన్నారు. అంతేకాదు.. రష్యాలోని మేజర్ పార్టీలన్నీ కూడా ట్రంప్కు అభినందనలు తెలియజేశాయి. రష్యాకు అనుకూలంగా ప్రచారం సమయంలో ట్రంప్ మాట్లాడటాన్ని అదనుగా చేసుకొని హిల్లరీ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ట్రంప్కు రష్యాతో వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకే పుతిన్కు అనుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నారని ఆమె ఆ సమయంలో ఆరోపించారు కూడా. -
ఆయన వ్యాఖ్యలతో పెట్రోల్ ధరల మంట!
న్యూయార్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు ’మంట’ పెడుతున్నాయి. రష్యా, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) కలిసి ముడిచమురు ఉత్పత్తిని స్తంభింపజేయాలని భావిస్తున్నాయని పుతిన్ తాజాగా పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయంగా తగ్గాల్సిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా.. పెరిగిపోయాయి. వచ్చేవారం చైనాలో జరగనున్న గ్రూప్ ఆఫ్ 20 దేశాల సదస్సులో భాగంగా తాను సౌదీ అరేబియా డిప్యూటీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయి, ఈ విషయమై సమగ్ర ప్రణాళికపై చర్చిస్తానని పుతిన్ పేర్కొన్నారు. ఆయన ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. పుతిన్ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న వారాల్లో ముడిచమురు ఉత్పత్తి స్తంభించిపోవచ్చునని, దీంతో ధరలు పెరిగిపోవచ్చునని భావిస్తున్నారు. ఈ భయాందోళనల నేపథ్యంలోనే ఈ వారం ముడిచమురు ధర పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మర్చంటైల్ ఎక్స్చేంజ్ లో బ్యారెల్ ముడిచమురు ధర 1.28 డాలర్లు పెరిగి.. 44.44 డాలర్లకు చేరగా, లండన్ ఐసీఎఫ్ ఫ్యుచర్ ఎక్స్చేంజ్ లో1.38 డాలర్లు పెరిగి .. 46.83 డాలర్లకు చేరింది. నిజానికి మార్కెట్లో ముడిచమురు సరఫరా అధికం కావడంతో ఈ వారంలో వరుసగా నాలుగు సెషన్లలో ధర తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ముడిచమురు ఎగుమతి దేశాలు సరఫరాను నిలిపివేస్తే మళ్లీ ధరలు పెరిగే అవకాశముంది. -
విశ్వసనీయుడిపై పుతిన్ వేటు
రష్యా: ఎన్నో ఏళ్లుగా తన వద్ద విశ్వాసంగా ఉంటున్న ఉన్నతాధికారిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ విధుల నుంచి తొలగించారు. ఆయనను తొలగించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. అక్కడి అధికార ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం ఇవనోవ్ (63) అనే వ్యక్తి పుతిన్ పరిపాలన విభాగంలో అత్యంతముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన అంతర్గత వ్యవహారాలకోసం ఉన్న ప్రత్యేక సర్కిల్కు ఇవనోవ్ బాస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రస్తుతం పర్యావరణం, రవాణాశాఖవంటివాటికి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కానీ, అనూహ్యంగా పుతిన్ ఆయనను విధుల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో ఆంటాన్ వైనోకు బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. -
ఒలింపిక్స్కు పుతిన్ వెళ్లడం లేదు
మాస్కో: అట్టహాసంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ప్రపంచ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హాజరుకావడం లేదంట. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో అసలు రష్యా తరుపున ఈ క్రీడా ప్రారంభోత్సవ వేదికకు ఎవరు వెళతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. 'రియో ఒలింపిక్స్ వెళ్లే ప్రణాళిక ఏది మా అధ్యక్షుడు పుతిన్ షెడ్యూల్ లో లేదు. ప్రభుత్వం తరుపున ఎవరు వెళతారనే విషయంపై కూడా నా వద్ద సమాచారం లేదు' అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. -
ట్రంప్కు అమెరికా విరోధి మద్దతు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు దాని బద్ధవిరోధి రష్యా ప్రయత్నిస్తున్నదా? అమెరికా అధ్యక్షుడిగా తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ను గెలిపించుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నిస్తున్నారా? అంటే తాజా వార్తలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ను గెలిపించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘ఏదైనా సాధ్యమే’ అని ఒబామా బదులిచ్చారు. గతవారం డెమొక్రటిక్ నేషనల్ కమిటీ డాటాను దొగలించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. రష్యా నిఘా వర్గాల తరఫున హ్యాకర్లు ఈ పనికి ఒడిగట్టినట్టు గట్టి ఆధారాలు లభించాయని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ హిల్లరీ క్లింటన్పై ట్రంప్ను గెలిపించుకునేందుకు పుతిన్ ఈ కుయుక్తులకు పాల్పడుతున్నారని డెమొక్రటిక్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైట్హౌస్లో తన మిత్రుడు ట్రంప్ను ప్రతిష్టించుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు అమెరికా అధికారుల వాదనకు వీకీలీక్స్ వెల్లడించిన మెయిల్స్ కూడా మద్దతు పలుకుతున్నాయి. -
'ఏదో ఒక రోజు నా రెండో భార్య గురించి చెప్తా'!
మాస్కో: ఏదో ఒక రోజు తన రెండో భార్య గురించి చెప్పి రష్యా ప్రజల సరదా తీరుస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా చెప్పారు. ఓ సామాన్యుడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వని ఆయన ఏదో ఒక రోజు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి మీ కోరిక తీరుస్తానని అన్నారు. మొదటి భార్య లుద్మిలా నుంచి పుతిన్ 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఆయన ఇటీవల ఒకప్పటి ఒలంపిక్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యంతో కూడిన రొమాన్స్ జరుగుతుందని అక్కడి వార్తా పత్రికలు వరుస కథనాలు వెలువరించాయి. కాగా, గురువారం సాయంత్రం పుతిన్ ఓ టీవీకార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ వ్యక్తి పుతిన్ కు ఫోన్ చేసి మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె ఎవరు అని ప్రశ్నలు సందించారు. దీంతో అవాక్కయిన పుతిన్ అది లైవ్ షో కావడంతో కాస్తంత తడబడినా వెంటనే తేరుకుని తన ప్రైవేటు జీవితం గురించి కన్నా రష్యా అధ్యక్షుడిగా తాను ఎలా పనిచేస్తున్నానన్న విషయంపైనే రష్యా ప్రజలకు ఆసక్తి ఉందని అనుకుంటున్నారని అన్నారు. కానీ, ఏదో ఒక రోజు సమాధానం చెప్పి మీ ఉత్సాహాన్ని తీరుస్తానని చెప్పారు. -
'అవినీతి బొమ్మ వేస్తే ఆయనలా ఉంటుంది'
-
'అవినీతి బొమ్మ వేస్తే ఆయనలా ఉంటుంది'
లండన్: అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్పై నేరుగా విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరు పుతిన్ అని, అవినీతి బొమ్మకుకు ఆయన ప్రతిరూపమని ఆరోపించారు. ఉక్రెయిన్లోని క్రెమియాను తమ దేశంలో కలుపుకోవడంతో రష్యాపై అమెరికా 2014లో ఆంక్షలు విధించింది. అయినప్పటికీ అప్పట్లో పుతిన్పై అమెరికా ఆరోపణలు చేయలేదు. అయితే పుతిన్ రహస్య సంపదలపై జరిపిన స్థూల దర్యాప్తులో ఆయన అవినీతి బొమ్మకు ప్రతిరూపంగా నిలిచారని ఆడం జుబిన్ అన్నారు. అమెరికా ట్రెజరీలో ఉగ్రవాదం, ఆర్థిక నిఘాకు తాత్కాలిక అండర్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న జుబిన్ బీబీసీలో సోమవారం ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపారు. 'ప్రభుత్వ సంపదలను ఉపయోగించుకొని ఆయన తన సన్నిహితులు, స్నేహితులను సంపన్నులుగా మార్చివేశారు. అదేసమయంలో తనుకు స్నేహితులు కాదనుకున్న వారిని తొక్కిపారేశారు. ఇంధన సంపదలైనా, ప్రభుత్వ కాంట్రాక్టులైనా తనకు సేవలు చేస్తారనుకున్న వారికే పుతిన్ కట్టబెట్టేవారు. తనకు సేవ చేయని వారిని దూరం పెట్టేవారు' అని ఆయన పేర్కొన్నారు. -
రేపు రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రష్యా వెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 24 వరకు మాస్కోలో జరిగే 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ భేటీకానున్నారు. ఈ భేటీలో భారత్- రష్యా మధ్య సంబంధాలు విస్తరించే అంశాలపై వారు చర్చించనున్నట్టు సమాచారం. రెండో రోజు సదస్సులో నరేంద్ర మోదీ, పుతిన్, భారత సీఈఓలు సమావేశం కానున్నారు. -
ఇంధన రంగంలో సహకారమే కీలకం
ఢిల్లీ చేరుకున్న పుతిన్ న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సులో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అణు ఇంధనం, రక్షణ, హైడ్రోకార్బన్ల వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై వారివురూ ప్రధానంగా చర్చించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు స్వాగతం పలికారు. గురువారం ఉదయం హైదరాబాద్ హౌస్లో సమావేశం జరగనుంది. పుతిన్ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్ వ్యవహారంపై అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్తో ఆర్థిక బంధాన్ని పరిపుష్టం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఇరు దేశాలు 15-20 ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్కు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతులతోపాటు ఆర్కిటిక్ మహాసముద్రంలో చమురు అన్వేషణలో ఓఎన్జీసీని భాగస్వామిని చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. అణు ఇంధన రంగంలో 14-16 అణు ప్లాంట్ల ఏర్పాటుకు బదులు 20-24 ప్లాంట్ల ఏర్పాటుకు రష్యా ప్రతిపాదించే అవకాశం ఉంది. -
11న వరల్డ్ డైమండ్ సదస్సు
హైదరాబాద్: అంతర్జాతీయ వజ్రాల వ్యాపార దిగ్గజాలతో ఈ నెల 11, 12న న్యూఢిల్లీలో వరల్డ్ డైమండ్ కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీని ప్రారంభ కార్యక్రమంలో పొల్గొంటారని జెమ్ అండ్ జ్యుయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీజే ఈపీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. వజ్రాల మైనింగ్లో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు వివరించింది. కేంద్ర వాణిజ్య శాఖ తోడ్పాటుతో వరల్డ్ డైమండ్ మార్క్ ఫౌండేషన్, జీజేఈపీసీ ఈ సదస్సును నిర్విహ ంచనున్నాయి.