sammakka - saralamma
-
వైభవంగా మినీ మేడారం జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వచ్చే 4 రోజులు తెలంగాణ బస్సులు బిజీ బిజీ
తొందరపడి బస్టాండ్లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. "తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం." రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 -
మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు
గుండాల: వన దేవత సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామం అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు సోమవారం మేడారం బయల్దేరాడు. గుండాల మండలంలోని యాపలగడ్డలో సోమవారం పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు, ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును గద్దెల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు, హిజ్రాలు నృత్యాలు చేశారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు ఊరేగింపుతో కాలిడనకన మేడారం బయల్దేరారు. ఆదివాసీ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. మేడారం వెళ్లే భక్తులు సైతం యాపలగడ్డ వద్ద పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్లారు. కాగా బుధవారం పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలకు వద్దకు చేర్చుతామని, దీంతో సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభమవుతుందని అర్రెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్, నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్: 'మేడారం జాతర'కు ఆరు నెలలే గడువు.. అయినా ఇలా..??
వరంగల్: 2024 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహాజాతరకు ఇంకా ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం 18 శాఖల ద్వారా ఏర్పాట్ల కోసం రూ.75కోట్ల నిధులు అవసరమని అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే జాతర సమీపిస్తున్నా.. నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఈ జాతరలో కూడా హడావుడి పనులతోనే నిర్వహించేలా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలోనే నిమగ్నం కావడంతో జాతర పనుల్లో జాప్యం తప్పేలా లేదు. నిధులు సరిపోయేనా..? మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వానికి రూ.75కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వతంగా నిర్మించిన కల్యాణ కట్ట షెడ్లు, రోడ్లు, విద్యుత్, గెస్ట్హౌజ్లు దెబ్బతిన్నాయి. జాతరకు రోడ్డు మార్గాలే చాలా అవసరం కానీ, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుండ్లవాగు బ్రిడ్జి దెబ్బతినడంతో నెలరోజుల పాటు తాడ్వాయి నుంచి మేడారం మీదుగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మళ్లించడంతో ఈ మార్గాన రోడ్లు మరింతగా ధ్వంసమయ్యాయి. అధికారులు మాత్రం రూ.75కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. కానీ, జాతర ఏర్పాట్లు, ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన మరమ్మతుల పనులకు ఈ నిధులు ఏ మూలన సరిపోతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతర సమీపిస్తుండంతో అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుగా ఎన్నికల ఏర్పాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. జాతరకు ఆరు నెలలే గడువు.. మేడారం మహాజాతరకు ఇంకా ఆరునెలల సమయమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. నిధులు మంజూరు చేయడం, టెండర్ల ప్రక్రియ, టెక్నికల్ ఆర్డర్లు పొందడం లాంటి వాటికే నెలకు పైగా సమయం పడుతుంది. ముందస్తుగా నిధులు మంజూరైతేనే పనులు నాణ్యతగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు జాతర నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జాతర వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే జాతరకు నిధులు అసలు మంజూరవుతాయా.. లేదా.. అనే అనుమానం కలుగకమానదు. జాతర నిధుల మంజూరు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలో నిమగ్నమయ్యారు. నిధులు మంజూరు చేయాలి.. మేడారం జాతర నిధులను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. జాతరలో భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించి, సరిపడా నిధులు కేటాయించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – సిద్దబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు -
దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది..
మేడారంలో ఇప్పుడు కొత్త రోడ్లు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి వందల కెమెరాలతో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేరుతోంది. కానీ మూడు దశాబ్దాల క్రితం ఇదో దట్టమైన అడవి. కనీసం కరెంటు కూడా లేదు, ఫోన్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సమ్మక్క రాక భక్తులకు తెలిసేందుకు ఒకే ఒక కొండ గుర్తు ఉండేది. ఇప్పుడు మేడారం జాతరకు ఆర్టీసీ 3500ల బస్సులు నడిపిస్తోంది. లక్షల సంఖ్యలో ఆటోలు, జీపులు, ట్రాక్టర్లలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మేడారం వచ్చే భక్తులు ఎడ్లబండ్లలోనే ఎక్కువ వచ్చేవారు. ఆది, సోమవారాల్లో బయల్దేరి మంగళవారానికి మేడారం చేరుకునేవారు. ఇలా వచ్చే భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో అడవుల్లో బస చేసేవారు. జంపన్నవాగులో చెలమల్లో నీళ్లు తాగేవారు. అడవుల్లో కంకవనం నరికి పందిల్లు వేసుకునేవారు. వాటి కిందే బస చేసేవారు. కరెంటు వెలుగులు లేవు. సాయంత్రం ఆరు గంటల కల్లా వంటలు పూర్తి చేసి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క, సారలమ్మల కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సాయంత్రం సమ్మక్క వస్తుదన్న విషయం తెలిసి పొద్దుగూకే సమయంలో మొక్కులు చెల్లించేందుకు అనువుగా సిద్దమయ్యేవారు. ముఖ్యంగా జాతరలో కీలకమైన సమ్మక్క రాక ఎప్పుడెప్పుడా అని ఒకరినొకరు ఆరా తీసేవారు. గురువారం సాయంత్రం అయ్యిందంటే భక్తులందరూ చిలకలగుట్టవైపుకు చూసేవారు. రహస్య పూజల అనంతరం సమ్మక్కను తీసుకుని వడ్డేలు చిలకలగుట్ట దిగేవారు. అంతే ఒక్కసారిగా అక్కడున్న భక్తులు సమ్మక్కను అనుసరించేవారు. ఆ కోలాహాలానికి మట్టిరోడ్డుపై దుమ్ము ఆకాశాన్ని తాకేలా పైకి లేచేది. ఈ దుమ్ము మేఘాలు కదలాడుతున్న దిశగా భక్తులు సమ్మక్కకు ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. నలువైపుల నుంచి భక్తులు దుమ్ము మేఘాలను అనుసరిస్తూ కదిలేవారు. పసుపు కుంకుమ కలిపిన ఒడిబియ్యం సమ్మక్కపైకి జల్లుతూ,, మేకలు కోళ్లు బలిస్తూ తమ మొక్కులు చెల్లించడం చేసేవారు. ఒక్కసారిగా భక్తుల ఒత్తిడి పెరిగిపోవడంతో తొక్కిసలాట కూడా చోటుచే సుకునేది. తర్వాత కాలంలో సమ్మక్క రాకను సూచిస్తూ గాల్లోకి కాల్పులు జరిపే సంప్రదాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది‡. కాల్పుల శబ్దాన్ని బట్టి సమ్మక్క వస్తున్న సమాచారం జాతర ప్రాంగణంలో తెలిసేది. ఆ తర్వాత కాలంలో మేడారం చుట్ట పక్కల రోడ్లు, హోటళ్లు, సెల్ఫోన్ టవర్లు వచ్చి ప్రతీ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. -
సమ్మక్క-సారాలమ్మను దర్శించిన కేసీఆర్
-
వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, మేడారం : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా గంటపాటు దర్శనాలు నిలిపివేయడంతో క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులు నిరసనకు దిగారు. ఇక మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.మరోవైపు మేడారం జాతరలో ప్రజలకు తమ వంతు సహాయం అందిస్తున్నాయి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఎల్జీ, కార్టేవాలు. కాగ్నిసెన్స్ మీడియా ద్వారా జాతరకు వచ్చే భక్తులకు మాస్కులు, తాగునీరు, ఉచితంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాయి. (వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు) -
‘మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. మేడారాన్ని అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. సంప్రదాయ బద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
మేడారంలో ఆదివాసీ ఇలవేల్పులు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలైన సమ్మక్క – సారలమ్మ చెంత 4 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కొలిచే వివిధ ఇలవేల్పులను తీసుకొచ్చి సమ్మేళనం నిర్వహించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 500 మంది ఆదివాసీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మూడ్రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆదివాసీ తెగలకు సంబంధించి ఇలవేల్పులు, దేవతలను ఒక్కచోట పూజించాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 4 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు కొలిచే ఇలవేల్పుల పడిగెలు (ఆదివాసీ ప్రతిమలు) ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ తరహా వేడుకలు జరగడం ఇదే తొలిసారని ఆదివాసీలు తెలిపారు. ప్రతిరోజూ సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్దకు తోడ్కొని వచ్చి ఆదివాసీ సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ గీతాలు, సంగీత వాయిద్యాల హోరుతో మేడారం పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. కాగా, ఆదివాసీ ఇలవేల్పుల సమ్మే ళనం ముగింపు కార్యక్రమం మంగళవారం మేడారంలో జరిగింది, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
మండ మెలిగె.. మేడారం వెలిగె
కోరిన వారికి కొంగు బంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరకు మరో అడుగు పడింది. గత బుధవారం గుడి మెలిగెతో జాతర ఘట్టం ప్రారంభంకాగా, తాజాగా మండ మెలిగెతో ఉత్సవాలు ఊపందుకున్నాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం వడ్డెలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొండాయిలో గోవిందరాజులు, పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడుల్లో కూడా సంప్రదాయబద్ధంగా మండ మెలిగెను నిర్వహించారు. దుష్టశక్తులు రాకుండా గ్రామ పొలిమేరల్లో నీళ్లు ఆరబోశారు. మేడారానికి రక్షాబంధం కట్టారు. సమ్మక్క– సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని మండమెలిగె పండుగను బుధవారం మేడారంలో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగతో జాతర వేడుకలు ఊపందుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువున్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయాలను వడ్డెలు శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. – ఎస్ఎస్తాడ్వాయి మామిడాకు తోరణాలు.. సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్రావు ఇంటి వద్ద నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. తూర్పు, పడమర వైపు ఉన్న ప్రధానదారుల్లో కొత్త బురుక కర్రలను తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా ఐదుగురు పూజారులు గడ్డపారను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా గుంతలు తవ్వారు. దిష్టి తగులకుండా మామిడి తోరణ ం, కోడిపిల్ల, సోరకాయ కట్టి ధ్వజ స్తంభాలు నిలిపారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి పూజారి కొక్కెర కృష్ణయ్య కంకణాలు, పసుపు, కుంకుమ రూపంలో అమ్మవారిని గద్దె మీదకు తీసుకెళ్లారు. కంకణాలు కట్టి పూజలు చేశారు. కన్నెపల్లి సారలమ్మ గుడిలో.. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కాక వంశస్తులు మండమెలిగె నిర్వహించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఉదయం అమ్మవారి గుడిని శుభ్రపరిచారు. మహిళలు ఆలయాన్ని అలికి ముగ్గులతో అలంకరించారు. అమ్మవారి పూజ సామగ్రి, వస్త్రాలను శుద్ధి చేశారు. సాయంత్రం వడ్డె కాక సారయ్య సారలమ్మకు పూజలు నిర్వహించారు. రాత్రి మేడారంలోని దేవతల గద్దెల వద్దకు సాకహనం(సారా)ను తీసుకుని వెళ్లారు. కొండాయి గోవిందరాజులు గుడిలో.. ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయంలో మండ మెలిగె పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి దబ్బకట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో గుడిని శుద్ధి చేశారు. పసుపు, కుంకుమతో ఆలయాన్ని అలంకరించారు. కొబ్బరి, బెల్లంతో గోవిందరాజులుకు నైవేద్యం సమర్పించారు. ఆలయం పక్కనే ఉన్న నాగులమ్మ ఆలయాన్ని పుట్టమన్నుతో అలికారు. ముగ్గులు వేసి పుసుపు, కుంకుమ చల్లి పూజలు నిర్వహించారు. సమ్మక్క ఆలయంలో.. సిద్ధబోయిన వంశస్తులు మేడారంలోని సమ్మక్క ఆలయంలో మండమెలిగె పండుగ జరిపారు. సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, నాగేశ్వర్రావు సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. కృష్ణయ్య అమ్మవారి శక్తిపీఠం, గద్దెలను పవిత్రమైన పుట్టమట్టితో అలికారు. నాగేశ్వర్రావు అమ్మవారి ధూపాదీపాలను కడిగి, మండ మెలిగె పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి ఆచార ప్రకారం ఆడపడుచులు పసుపు, కుంకుమ, కంకణాలు, పవిత్ర జలాన్ని తీసుకుని డోలువాయిద్యాలతో సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. అమ్మవారి గద్దెపై పసుపు, కుంకుమలు వేశారు. శక్తి పీఠాన్ని కూడా పసుపు, కుంకుమలతో అలంకరించారు. ముగ్గుల అలంకరణ పూర్తయిన అనంతరం పూజారులు ఆలయం నుంచి ధూపం, పసుపు, కుంకుమతో మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ మైసమ్మతోపాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర ట్రస్టుబోర్డు కమిటీ చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. ఘనంగా ఎదురుపిల్ల పండుగ ములుగు రూరల్: మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు గట్టమ్మ ఆలయం వద్ద ఎదురుపిల్ల పండుగను ఆదివాసీ నాయకపోడ్లు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ములుగులోని నాయకపోడ్ కాలనీ నుంచి లక్ష్మీదేవరను సిద్ధం చేసి ఊరేగింపుగా బయలు దేరారు. దీంతోపాటు వాజేడు మండలం కడెకల్, ములుగు మండలం పత్తిపల్లి నుంచి వచ్చిన లక్ష్మీదేవరలను కలుపుకుని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్ నుంచి గట్టమ్మ ఆలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యలో నాయకపోడ్ యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. ఆలయ పూజారులు లక్ష్మీదేవరగను సాదరంగా ఆహ్వానించి ఎదురుకోళ్లు తీశారు. మహిళలు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి యాటపోతులతో మొక్కులు చెల్లించారు. పగిడిద్దరాజుకు పానుపు తయారీ గంగారం(ములుగు): మండ మెలిగెను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును పెన్క వంశీయులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ముందుగా పానుపు(పగిడిద్ద రాజును పెళ్లి కుమారుడిని చేసేందుకు ఉపయోగించే పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ధూపదీప నైవేద్యం)ను సిద్ధం చేసి తళపతి ఇంట్లోని ప్రత్యేక పూజ గదిలో ఉంచారు. తళపతి ఇంటి నుంచి పూజాసామగ్రిని పగిడిద్ద రాజు ఆలయానికి తీసుకొచ్చారు. గుడిని శుభ్రపరిచిన అనంతరం పెన్క వంశీయుల ఆడబిడ్డలు ఆలయం ఎదుట లఘ్నపు ముగ్గు వేశారు. 30న మేడారానికి పయనం పగిడిద్దరాజును ఈనెల 30న మేడారానికి తీసుకెళ్లాలని పూజారులు ముహూర్తాన్ని నిర్ణయించారు. పగిడిద్దరాజు పడిగెతో సహా పూజారులు, పెనక వంశీయులు కాలి నడకన మేడారం బయలుదేరుతారు. ఆరోజు రాత్రి లక్ష్మీపురంలోని పెనక వంశీయుల ఇంట్లో బస చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారుజామున పస్రా చేరుకుంటారు. పస్రా నుంచి పోలీసు బలగాలతో మేడారం చిలుకలగుట్టకు చేరుకుంటారు. -
మేడారం జాతరకు ‘గ్రహణం’
సాక్షి ప్రతినిధి, వరంగల్: రానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం రోజున గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం, దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మేడారం జాతర జరుగుతుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతరను ఈసారి 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్లో తేదీలు ప్రకటించింది. 2018 జనవరి 31 జాతర తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధం ఏర్పడింది. గ్రహణం తర్వాత: చంద్రగ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని సమ్మక్క–సారలమ్మ పూజా రుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహ ణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొ స్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు చెప్పారు. పూజారుల సంఘం నిర్ణయం ప్రకారమే మేడారం జాతర విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయం ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గ్రహణం విషయంలో పట్టింపులు లేవని పూజారులు చెప్పారు. కాబట్టి ముందుగా నిర్ణయించినట్లుగానే 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జాతర జరుగుతుంది. –రమేశ్బాబు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, వరంగల్ -
సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ సంఘాల ధర్నా హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్లోని భూభాగాన్ని విడదీయకుండా ములుగు కేంద్రంగా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ సంఘాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాలు, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదో షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 13 గిరిజన మండలాలు సబ్ప్లాన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఐదో షెడ్యూల్ భూభాగం ముక్కలు చేసి ఒక్కో జిల్లాకు చేర్చడం వల్ల రానున్న రోజుల్లో పీసాచట్టం, 1/70 చట్టం వర్తింపకుండా చేసే కుట్ర జరగుతోందన్నారు. దీనివల్ల వెనుకబడ్డ ఆదివాసీ జాతులు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా చేస్తున్న విభజన ఆపాలని, ఆదివాసీల ప్రాంతం మొత్తం ఉండేలా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళన అనంతరం డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు బొల్లు దేవేందర్, పొదెం కృష్ణప్రసాద్, పిన్నింటి యాదిరెడ్డి, పాక సాంబయ్య, మండల వెంకన్న, కొమురం ప్రభాకర్, కబ్బాక శ్రావణ్, చిన్న వెంకటయ్య, రత్నం, అర్రెం నారాయణ, అశోక్, సమ్మక్క, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు ఉన్నారు. -
సారీ... సమ్మక్క
వనదేవతను మరిచిన ఉన్నతాధికారులు పునర్విభజన నోటిఫికేషన్లో పొరపాటు తాడ్వాయి మండలంగా ప్రకటన ఆదివాసీ సంఘాల అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్లో తప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాల విషయంలో అయోమయానికి గురి చేసి సవరణ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు... ప్రతిష్టాత్మక విషయాలను మరిచిపోయారు. వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాముఖ్యతను జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న మేడారం జాతర జరిగే తాడ్వాయి మండలాన్ని సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చారు. 2014 జాతర సమయంలో ఈ మేరకు రాష్ట్ర పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సమ్మక్క–సారలమ్మ తాడ్వాయి మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో కలిపారు. అయితే రెవెన్యూ శాఖ మాత్రం తాడ్వాయి మండలంగానే ముసాయిదాలో పేర్కొంది. ప్రతిష్టాత్మక సమ్మక్క–సారలమ్మ ప్రాశస్త్యాన్ని తెలిపేలా ప్రభుత్వం మార్చిన పేరును కాకుండా కేవలం తాడ్వాయిగా పేర్కొనడంపై ఆదివాసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన విషయంలో అంతా రహస్యం అన్నట్లుగా వ్యవహరించిన రెవెన్యూ ఉన్నతాధికారులు ముసాయిదాను తప్పుల తడకగా రూపొందించారు. వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయినట్లుగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంగా మార్చాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామ మండలాన్ని కనీసం ముసాయిదాలో చేర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాల పునర్విభజనలో మొత్తం ముసాయిదాపైనే న్యాయపరమైన సమస్యలు వచ్చేలా దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ పొరపాటును గుర్తించి సవరణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. కొత్త మండలాల ఏర్పాటు విషయంలోనూ జిల్లా అధికారుల తీరు ఇలాగే ఉంటోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలాల మ్యాపులను తయారు చేయడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ గ్రామాలు ఎక్కడ ఉంటాయి, చెరువుల పరిస్థితి, వాటి ఆయకట్టు ఏమిటనేది తెలియక ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముసాయిదా వెల్లడించి వారం రోజులు దాటినా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లుగానే ఉంటున్నారు. -
గజం రూ.7వేలు
సాక్షి, హన్మకొండ:జాతర సమీస్తుండడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో భూముల ధరకు డిమాండ్ పెరిగిపోతోంది. వ్యాపారం, భక్తుల విడిది, వినోద కార్యక్రమాలు.. ఇలా వివిధ పనులతో జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ ఇళ్లు, వ్యవసాయ భూములను అద్దెకు తీసుకుంటారు. ఒకేసారి లక్షల మంది భక్తులు వస్తుండటంతో అద్దె ధరలు హైదరాబాద్, వరంగల్ను తలదన్నే రీతిలో ఉన్నాయి. మేడారంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనుం ది. భక్తులు పిల్లాపాపలతో సకుటుంబ సమేతంగా ఈ జాతరకు వస్తారు. వీరంతా మేడారంతో పాటు ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లపల్లి, కన్నెపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తారు. చాలా మంది భక్తులు జాతర జరిగే మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి తమ మొక్కులు చెల్లిస్తారు. జాతరకు వచ్చే భక్తుల బస అవసరాలు తీర్చేందుకు జాతర పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, పెరటి జాగలతో పాటు తమ పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. భక్తుల బస కాకుండా వ్యాపార సముదాయాలకు కూడా జాగా కావాల్సి వస్తుండడంతో అ క్కడి స్థలాలకు క్రేజ్ పెరిగింది. జాతరకు పది హేనురోజుల ముందుగానే జాగల బుకింగ్లు పూర్తి కావచ్చాయి. బుక్కయిన దుకాణాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. దుకాణాలు, బొమ్మల షాపులు, కోళ్ల అమ్మకాలు చేపట్టేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు వస్తారు. వాణి జ్య అవసరాలకు సంబంధించి గజం స్థలానికి అద్దె వేల రూపాల్లో పలుకుతోంది. గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. ఇక గద్దెల చుట్టూ వం ద మీటర్ల వరకు అన్నివైపులా గజం స్థలం విలువ రూ.7వేలు ఉంది. జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.4వేలు ఉండగా ఇప్పటికే అన్ని బుక్ అవడమే కాకుండా వ్యాపారా లు కూడా ప్రారంభమయ్యాయి. ఊరట్టం వైపు స్నానఘట్టాలు కొత్తగా నిర్మించడంతో ఇక్కడ భూముల అద్దెకు మంచి రేటు వచ్చిం ది. ఈసారి గజం 2,500కు చేరుకుంది.ఇళ్లు.... పదివేలుభక్తులు బస చేస ఇళ్లను, పందిళ్లను ముందుగా నే కిరాయికి బుక్ చేసుకుంటున్నారు. జాతర కేంద్రమైన మేడారం దాని పరిసర గ్రామాలైన రెడ్డిగూడెంలలో ఇళ్ల కిరాయికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని తర్వాత స్థానంలో కన్నెపల్లి, ఆ తర్వాత నార్లాపూర్, ఊరట్టం గ్రామాలు ఉన్నాయి. జాతర జరిగే మూడు రోజుల పాటు ఒక గదికి అద్దె కనిష్టంగా రూ 3,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా మేడారం గ్రామంలో ఉన్న ఇళ్ల వరండా అద్దె సగటున ఐదువేల రూపాయలుగా పలుకుతోంది. గదుల అద్దె విషయంలో మేడారంతో రెడ్డిగూడెం పోటీపడుతోంది. ఇక ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్లో ఇందులో సగం ధరలకు గదులు, వరండాలు అందుబాటులో ఉన్నాయి. పందిళ్లకూ డిమాండ్ గతంలో వచ్చే భక్తులు అడవుల్లో ఉండే కంకవనాలను నరికి పందిళ్లు వేసుకుని జాతర జరిగే రోజుల్లో ఇక్కడ బస చేసేవారు. నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్థానికులకు చెందిన పెర డు, పొలాల్లో బస ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మేరకు భక్తులు బసకు సంబంధించి ఒక పందిరికి అద్దె వెరుు్య రూపాయల నుంచి మూ డు వేల రూపాయల వరకు అద్దె పలుకుతోం ది. ముఖ్యంగా జంపన్నవాగు-గద్దెల మధ్య ఉన్న రెడ్డిగూడెం పరిసరాల్లో ఉండే పొలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
మేడారం జాతరకు శాశ్వత స్నాన ఘట్టాలు
చెక్డ్యామ్ల తరహా నిర్మాణం ఆయకట్టుకు నీరు, లీకేజీల నియంత్రణ లక్ష్యంగా నిర్మాణం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న స్నాన ఘట్టాలకు తుది రూపకల్పన జరిగింది. గతంలో మాదిరి ఇసుక బస్తాలను అడ్డంగా వేసి నీటిని నిల్వ చేసేలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చెక్డ్యామ్లను నిర్మించేలా ప్రణాళిక తయారైంది. జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్డ్యామ్లను నిర్మించి స్నానాలతోపాటు ఇరిగేషన్ అవసరాలకు ఉపయోగపడేలా వీటిని డిజైన్ చేశారు. రూ.20 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ పనులను పదిహేను రోజుల్లో ఆరంభించే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తగిన స్నాన ఘట్టాలను డిజైన్ చేసే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అప్పగించింది. దీనిపై అధ్యయనం చేసిన సీడీఓ జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్డ్యామ్లను ప్రతిపాదించింది. పడిగాపూర్ వద్ద 110 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుతో తొలి చెక్డ్యామ్ను ప్రతిపాదించారు. దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో రెడ్డిగూడెం వద్ద 110 మీటర్ల పొడవుతో 2 మీటర్ల ఎత్తుతో రెండో చెక్డ్యామ్ను ప్రతిపాదించారు. దీనికి 700 మీటర్ల దూరంలో మేడారం వద్ద మరో చెక్డ్యామ్, దీనికి 380 మీటర్ల దూరంలో ఊరట్టం వద్ద మరో చెక్డ్యామ్ను ప్రతిపాదించారు. ఇసుక బస్తాలకు బదులు చెక్డ్యామ్ల తరహా నిర్మాణం చేయడం వల్ల స్నాన ఘట్టాలకు తోడు 1,200 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిని అందించే వెసలుబాటు ఉంటుంది. దీనికి తోడు స్నానఘట్టాలకు ప్రతిసారి వదిలే 250 ఎంసీఎఫ్టీ నీటిలో లీకేజీ నష్టాలు ఉండేవి. ప్రస్తుతం చెక్డ్యామ్ల నిర్మాణంతో 150 ఎంసీఎఫ్టీల నీరు సరిపోతుంది. -
గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు రానుంది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నాడు దేశ రాజధానిలో జరిగే పరేడ్లో తెలంగాణ తరఫున సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర సమాచార- పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, ఆర్టిస్టు రమణారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క- సారలమ్మ జాతర వరంగల్ జిల్లా లో జరుగుతుందని, ఆ ఉత్సవాల ఔన్నత్యం తెలిపే శకటం ప్రదర్శనలో ఉంచితే బాగుంటుందని ఈ సమావేశంలో వీరు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు విన్నవించినట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. -
ఓ మహిళా.. ఏలుకో...
రాణిరుద్రమ పౌరుషం, సమ్మక్క-సారలమ్మ ధీరత్వానికి వారసత్వంగా నిలిచిన ఓరుగల్లులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో కల్పనాదేవి లోక్సభలో అడుగుపెట్టారు. 1967లో జిల్లా నుంచి మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యూరు. ఆ తర్వాత 2004 నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు. 2009లో ఒకేసారి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలు గెలుపొంది రికార్డు సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. 1995లో 225 ఎంపీటీసీ, 17 మంది మహిళా జెడ్పీటీసీ సభ్యులు ఉంటే.. ఇప్పుడు 369 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
అందరి సహకారంతోనే మేడారం జాతర సక్సెస్
రూ.100 కోట్లు ఖర్చు చేశాం.. భవిష్యత్లో శాశ్వత పనులు చేపడతాం కలెక్టర్ కిషన్ హసన్పర్తి, న్యూస్లైన్ : అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్ల మేడారం జాతర సక్సెస్ అయిందని జిల్లా కలెక్టర్ కిషన్ అన్నారు. నగర పరిధిలోని చింతగట్టు అతిథి గృహంలో ఆర్డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర సక్సెస్పై శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర పనుల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ఆర్డబ్ల్యుఎస్ శాఖ పనితీరును అభినందించారు. కోట్లాది మంది హాజరైన ఈ వేడుకల్లో అందరికీ తాగునీరు. బూత్రూంలను ఏర్పాటు చేసి... ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మేడారంలో భవిష్యత్లో జాతరలో శాశ్వత పనులు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ఆర్డబ్ల్యుఎస్ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం భారత్ అభియాన్ పథకం కింద రెండు లక్షల ఐఎస్ఎల్లు మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆర్డబ్ల్యుఎస్ అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిలా పరిషత్ సీఇ వో ఆంజనేయులు మాట్లాడుతూ మేడారం జాతరను పురస్కరించుకుని ఆరునెలల ముందు నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ...అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయడం వల్లే సక్సెస్ అయ్యామని వివరించారు. ఈ సందర్భంగా జాతరలో విధులు నిర్వహించిన ఆర్డబ్ల్యుఎస్ అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్కుమార్, ఈఈ శ్రీనివాస్రావు, రిటైర్డ్ జేడీ విద్యాసాగర్, లింగారవు, మహిపాల్, పులి ప్రభాకర్, శ్రీనివాస్రావు, రామ్మోహన్, గంగాధర్, తహసిల్దార్ ఎల్.కిశోర్కుమార్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొన్నాల...పువ్వులు
మాటల మంత్రి లక్ష్మయ్య వెక్కిరిస్తున్న సమ్మక్క వెబ్సైట్ ఆవిష్కరించినా ఓపెన్ కాని పోర్టల్ అదే తీరుగా మడికొండ ఐటీ పార్కు చెప్పుడెక్కువ... చేసుడు తక్కువ... నానుడి రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు చక్కగా సరిపోతుంది. ఏదో చేసినట్లుగా ప్రకటించుకోవడం... తీరా అది తుస్సుమనడం ఆయన విషయంలో తరచుగా జరగడమే ఇందుకు నిదర్శనం. మేడారం మహా జాతరపై మంత్రి పొన్నాల ఆవిష్కరించిన వెబ్సైట్ ఒక్కరోజు కూడా పనిచేయకపోవడం.. ఆయన శైలిని మరోసారి తేటతెల్లం చేసింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం జాతరకు ముందు రోజున (ఫిబ్రవరి 11) రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్లో సమ్మక్క-సారలమ్మ వెబ్సైట్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. www.sammakkasarakka.co.in పేరు తో రూపొందించిన ఈ వెబ్సైట్ (పోర్టల్) ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటిం చారు. సమ్మక్క-సారలమ్మ తల్లుల విశిష్టతను తెలిపే అంశాలు, ప్రభుత్వపరంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు, వనదేవతలను దర్శనార్థం వచ్చే వారికి అవసరమైన సమాచారం, గూగుల్ రూట్ మ్యాప్లు, అత్యవసర ఫోన్ నంబర్లను ఈ పోర్టల్లో పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ, విదేశాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సమస్త సమాచారాం ఇందులో ఉందని ఢంకా భజాయించారు. కానీ... అది అందుబాటులోకి రాకుండానే తుస్సుమంది. అవాక్కైన భక్తులు మేడారం జాతర విశేషాలు, జాతర విధుల్లో ఉన్న అధికారులు, రూట్మ్యాప్ తదితర అంశాలతో ప్రభుత్వ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చిందనే వార్త విని భక్తులు సంతోషించారు. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మేడారం జాతరకు కోటి మంది భక్తులు వచ్చారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇంత మంది వచ్చిన జాతరపై ఏర్పాటు చేసిన వెబ్సైట్ కావడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో లక్షలాది మంది దీన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. మేడారం జాతరపై కొత్త అంశాలు ఉండవచ్చని ఆశించారు. కానీ.. వారి ఆశలు అడియూసలయ్యూరుు. మంత్రి పొన్నాల వెబ్సైట్ తుస్సుమంది. అసలు విషయం ఏమీ కనిపించలేదు. ఒకరోజు కాకపోతే మరుసటి రోజైనా పోర్టల్ అందుబాటులోకి రాకపోతుందా అని వేచి చూశారు. జాతర జరిగిన నాలుగు రోజులతోపాటు ఇప్పటివరకూ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. పైగా పొన్నాల ఇచ్చిన అడ్రస్తో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈ సైట్ అసలు ప్రారంభం కాలేదని, పైగా ఇది అమ్మకానికి ఉందని అందులో పేర్కొన్నారు. మంత్రి ఆవిష్కరించిన వెబ్సైట్ కావడంతో మేడారం జాతర సమాచారం తెలుస్తుందనుకుంటే... అసలు ఓపెన్ కూడా కాకపోవడం చాలా మందిని నిరుత్సాహ పరిచింది ఎవరో రూపొందించిన వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించడం... అది బాగుంటందని చెప్పుకోవడం... తీరా అందులో విషయం లేకపోవడంతో ఐటీ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్యకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఆది నుంచి అంతే... తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో ఐటీ రంగం పురోగతికి పొన్నాల లక్ష్మయ్య ఏమీ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మడికొండలో 33 ఎకరాల్లో ఆయన ఆర్భాటంగా ఐటీ పార్కును ప్రారంభించారు. మార్కెట్ పరంగా సామర్థ్యం ఉన్నా...ఈ ప్రాజెక్ట్ వైపు కంపెనీలు కనీసం కన్నెత్తి కూడా చూడ లేదు. ఐటీ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండే ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు ఇంకా మూలుగుతూనే ఉంది. -
నేడు జాతర హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్, న్యూస్లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీలను సోమవారం ఉదయం 11గంటలకు హన్మకొండ టీటీ డీ కల్యాణ మండపంలో లెక్కించనున్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖ ఉద్యోగులు 200మందితోపాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల నుంచి వచ్చిన ఉద్యోగులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతర ఈఓ దూస రాజేశ్వర్ తెలిపారు. మొత్తం 410 హుండీలకుగాను 397 హుండీలను ఎనిమిది ఆర్టీసీ బస్సుల్లో తరలించామని, వీటిలో 51 క్లాత్ హుండీలు ఉన్నాయని తెలిపారు. మరో 13 హుండీలను తిరుగువారం ముగిసిన తర్వాత తీసుకొస్తామన్నారు. లెక్కింపు పర్యవేక్షణకు ఎనిమిది సీసీ కెమెరాలు, మూడు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్న హుండీలను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్బాబు, డీఆర్ఓ సురేంద్రకరణ్తో కలిసి ఈఓ రాజేశ్వర్ పర్యవేక్షించారు. హుండీలను భద్రపరిచే కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక హెడ్కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు భద్రతలో నిమగ్నమయ్యారు. లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. -
ముగిసిన మేడారం జాతర
వరంగల్: గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా మేడారం జాతర ముగిసింది. ప్రధాన పూజారుల సమక్షంలో సమ్మక్క-సారలమ్మలు వనప్రవేశం చేశారు. మూడు రోజులుగా మొక్కులు అందుకున్న వనదేవతలు ఈ రోజు వనప్రవేశం చేయడంతో జాతరలో చివరి ఘట్టం ముగిసింది. నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేశారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకువెళ్లారు. మేడారం జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరైనట్లు కలెక్టర్ జి.కిషన్ చెప్పారు. 19న తిరుగువారం సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండగను ఈ నెల 19న గిరిజన పూజారులు ఘనంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజల్లో తప్పిదాలు జరిగితే మన్నించాలని వేడుకుంటూ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. తిరుగువారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో మేడారం మహా వన జాతర ముగిసినట్లువుతుంది. -
గద్దెకు చేరిన సమ్మక్క తల్లి
-
ఉద్విగ్న భరిణెం
జనం చేరిన అమ్మ ప్రతిరూపం పులకించిన మేడారం.. ఉప్పొంగిన భక్తిభావం ఉదయం నుంచే.. సమ్మక్క రాక సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు దోబె పగడయ్య, సిద్దబోయిన సమ్మయ్య(తండ్రి పొట్టయ్య), సిద్దబోయిన సమ్మయ్య (తండ్రి దానయ్య), మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ గురువారం మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే అడవికి వెళ్లి వనం(వెదురు) తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్లి పూజలు చేసి తల్లిని గద్దెలపైకి చేర్చారు. అడుగడుగునా నీరాజనాలు తల్లి సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తులు అడుగడుగునా ఎదురుకోళ్లతో ఘనస్వాగతం పలికారు. గాలిలోకి కోళ్లు ఎగురవేస్తూ ఆహ్వానించారు. తల్లిపై ఒడి బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దారిపొడవునా బారులుదీరి న భక్తులు తల్లిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రాటపడ్డారు. అమ్మను కళ్లారా చూసి తరించా రు. యాటపోతులు, కోళ్లతో ఎదురెళ్లి బలిచ్చా రు. భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో మేడారం హోరెత్తింది. థింసా నృత్యాలు అలరించాయి. పోలీసుల భారీ బందోబస్తు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెకు చేర్చారు. సమ్మక్కను పూజారులు తీసుకుని వస్తుండగా రెండు రోప్పార్టీలు రక్షణ ఇచ్చాయి. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐలు దేవేందర్రెడ్డి, కిరణ్కుమార్, ఇతర బలగాలు భద్రత చేపట్టాయి. అధికారుల ఘనస్వాగతం కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ కాళిదాసు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఊరట్టం సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ దూస రాజేశ్వర్రావు తల్లికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.39కు ఏకే-47తో రూరల్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. గుట్ట దిగగానే 5.42 గంటలకు, గద్దెల ప్రాంగణానికి వస్తుండగా చిలకలగుట్ట రోడ్డుకు చేరిన సమయంలో, సాయంత్రం 5.55 గంటలకు మరోసారి కాల్పులు జరిపారు. గుట్టెక్కిన భక్తులు చిలకలగుట్ట నుంచి తల్లిని గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు చిలకలగుట్ట ఎక్కారు. పూజారుల పూజా విధానంపై ఆసక్తితో వారు గుట్ట ఎక్కినా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో కిందికి దిగారు. ఇక తల్లిపై వేసిన బియ్యాన్ని ఆమె వెళ్లిపోయిన తర్వాత భక్తులు సేకరించారు. అలాగే గుట్ట సమీపంలోని చెట్ల బెరడును కూడా తీసుకెళ్లారు. దేవతలను దర్శించుకున్న 30 లక్షల మంది తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరగానే సుమారు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గద్దెల వద్ద భక్తజన ప్రవాహం కొనసాగింది. అమ్మలకు ఇష్టమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు కిక్కిరిసింది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 70లక్షలమంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఒకే ఒక్కడు..
కోటికొక్కడు కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను తీసుకొచ్చేది తనే మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. జాతరలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం. ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఆ క్షణాల్లో అందరి కళ్లు భరిణె రూపంలో ఉన్న సమ్మక్కపైనే. ఆ తర్వాత వారి దృష్టి దానిని తీసుకొచ్చే ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్యపై పడుతుంది. వేలాదిమంది ప్రత్యక్షంగా, లక్షలాదిమంది పరోక్షంగా ఈ ఘట్టాన్ని ఉత్కంఠగా వీక్షిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భుజాలపై మోసే కొక్కెర కృష్ణయ్య మనోగతం ఆయన మాటల్లోనే.. గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండమెలిగె పండుగతోనే. ఈ పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనున్న సమ్మక్కతల్లిని గద్దెల పైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపండ్లు ఆహా రంగా తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం. నేనొక్కడినే వెళ్తా.. దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం. మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహస్యమైన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డెలైన దోబే పగడయ్య ధూపం, మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తుండగా ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). బాజాభజంత్రీల నడుమ మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ మమ్మల్ని అనుసరిస్తారు. చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తా. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లిని భరిణె రూపంలో కిందకు తీసుకువస్తా. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రి పేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య), భజంత్రీలతో మాదిరి పుల్లయ్యలు శబ్దం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదాల వద్దకు చేరుకోగానే ప్రభుత్వం తరపున కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిపి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు. అది వ్యక్తిగత విషయం సమ్మక్క- సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డెలు మాత్రం తాగేవారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండమెలిగె పండుగ నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటాను. నాతో పాటు ఉండే వడ్డెలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అలాగని తీసుకోవడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం నాలుగు గంటలకల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల ఐదు గంటలవుతోంది. అయితే ఏడుగంటల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే. అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోర్కెలు తీరాలని, కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుందని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది. -
ఒక దేవత వెలిసింది..
రాత్రి 9.40కి జనప్రవేశం పరవశించిన భక్తజనం తెల్లవార్లూ మొక్కుల చెల్లింపు మేడారం, న్యూస్లైన్ : దండాలు సారక్క తల్లే.. అంటూ జాతర ప్రాంగణం తల్లి నామస్మరణలో మునిగితేలింది. నాలుగు రోజులపాటు జరిగే మహా జాతరలో బుధవారం సారలమ్మ మేడారంలోని గద్దెకు చేరడంతో మహాఘట్టానికి తెరలేచింది. కుంకుమ భరణె రూపంలో ఉన్న తల్లి దర్శనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భక్తుల్లో ఆ తల్లి గద్దెపైకి చేరగానే భక్తి భావం ఉప్పొంగింది. బుధవారం సాయంత్రం 6.18 నిమిషాలకు కన్నెపల్లిలో బయలుదేరిన సారలమ్మ 7.20 గంటలకు జంపన్నవాగు వద్దకు, అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకుంది. అప్పటికే అక్కడికి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజులున్నారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.40గంటలకు మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడన సారక్కను ఆద్యంతం భక్తి పారవశ్యంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు పూజారులు గద్దెకు చేర్చారు. సారలమ్మ గద్దెను చేరనున్న క్రమంలో బుధవారం ఉదయం నుం చే సాలరమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో గిరిజన పూజారులు కన్నెపల్లిలోని సారక్క ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు ఆరంభించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పూజలు జోరందుకున్నాయి. సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరిన సారలమ్మ భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తుల జయజయధ్వానాల నడుమ మేడారంలోని గద్దెలను చేరింది. ఉదయం నుంచే.. కన్నెపల్లి వెన్నెలమ్మ మేడారం గద్దెలను చేరనుండడంతో బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లి సారక్క ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ప్రధాన వడ్డె కాక సారయ్యతో పాటు కోరె ముత్యంబాయి, కాక లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకన్న, కాక భుజంగరావు, కాక కనకమ్మ అత్యంత భక్తి శ్రద్ధలతో తల్లికి పూజలు చేశారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమ ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. దారిపొడవునా దండాలు సారలమ్మను గద్దెకు చేర్చే క్రమంలో దారి పొడవునా భక్తుల దండాలు పెడుతూ భక్తి ప్రపత్తులు చాటారు. సారక్క జై.. అంటూ నినాదాలు చేశారు. కన్నెపల్లి వాసులందరూ మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి తమ బిడ్డను మేడారానికి సాగనంపారు. కన్నెపల్లి నుంచి మేడారం చేరే ముందు సారలమ్మ తమ్ముడు జంపన్నను ముద్దాడుకుంటూ వెళ్లింది. సంపెంగవాగులో కొలువైన జంపన్న క్షేమ సమాచారం తెలుసుకుని తల్లి ఒడికి చేరింది. తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. గుడారాల్లో ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా సారక్కను చూసేందుకు రోడ్డు పైకి చేరడంతో పరిసరాలు కిటకిటలాడాయి. సారక్క మహిమలతో శివసత్తులు శివాలూగారు. పోలీసుల అత్యుత్సాహం కన్నెపల్లి వెన్నెలమ్మను మేడారం గద్దెకు చేర్చేక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బందోబస్తు పేరుతో గిరిజనులను ఇబ్బందులు పెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వెన్నెలమ్మను వడివడిగా సమ్మక్క గుడికి చేర్చారు. అయితే సారలమ్మకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. అధికారుల సేవలో తరించారు. జేసీ పౌసుమిబసు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్లకు ఏకంగా రోప్ సౌకర్యం కల్పించి ఔరా అన్పించుకున్నారు. దాదాపుగా సారలమ్మకు రోప్ ఇచ్చినట్టుగా హడావుడి చేస్తూ దారిపొడవునా భక్తులను ఇక్కట్లకు గురిచేశారు. వారి తీరుపై భక్తులు మండిపడ్డారు. వరం పట్టిన మహిళలు సంతానం కోసం పలువురు మహిళలు కన్నెపల్లి ఆయలం వద్ద వరం ప ట్టారు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేశారు. తడిబట్టలతోనే సారలమ్మ గుడికి చేరుకు ని పొర్లుదండాలు పెట్టారు. సారక్క ను గద్దెలపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ పూజారులు కొమ్ము బూరలు పూరించారు. స్వాగతం పలికిన అధికారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు, ప్రముఖులు తరలివచ్చి స్వాగతం పలికా రు. క లెక్టర్ కిషన్, స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జేసీ పౌసుమిబసు, ఏజేసీ, ఐటీడీఏ పీఓ సంజీవయ్య, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మి శ్రా, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, డీఎస్పీ కటకం మురళీధర్, సీఆర్పీఎఫ్ ఐజీ అశ్వనీ వర్మ, డీఎస్పీ అరవింద్ కుమార్ అమ్మవారికి స్వాగతం పలికారు. -
రేపటి నుంచే మహా సంబరం
సాక్షి, హన్మకొండ: మహా జాతరకు ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ భక్త కోటి ఎదురుచూసే అమ్మల జాతరకు ఇంకా మిగిలింది ఇరవై నాలుగు గంటలే.. సారలమ్మ రాకతో ప్రారంభమయ్యే మహాఘట్టానికి మేడారం ముస్తాబైంది. కన్నెపల్లి వెన్నెలమ్మ రాక కోసం భక్త జనం ఆరాటపడుతోంది. 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు మేడారం బాటపడుతున్నారు. కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయూయి. కన్నెపల్లిలో సందడి సారలమ్మ ఆలయం ఉన్న కన్నెపల్లిలో ఊరంతా తమ ఇళ్లను అలికి పండుగకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఇళ్లకు సున్నాలు వేసుకుని సుందరంగా అలంకరించుకున్నారు. పండ క్కి వచ్చిన బంధువులతో వారిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. కాగా, సారలమ్మ పూజారులు గత బుధవారం నుంచే సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. బుధవారం జరిగే మహాఘట్టానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దేవాదాయశాఖ సైతం అమ్మల జాతరను విజయవంతం చేసేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన స్నానఘట్టాలు, నూతన వంతెన, కొత్త రోడ్లు తదితర పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల్లో సోమవారం నుంచి 14వేల మంది వివిధ శాఖల సిబ్బంది తలమునకలైపోయూరు. వాహనాల రద్దీ, వాణిజ్య సముదాయాలు, విద్యుత్ దీప కాంతులతో మేడారం పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. -
ఈసారి..రూ.400 కోట్లు
దట్టమైన అడవిలో భారీ వ్యాపారం 4 రోజుల్లో జోరుగా క్రయవిక్రయూలు 2012లో లావాదేవీలు రూ.300 కోట్లు {పస్తుతం ఏర్పాట్లకు మరో రూ.100 కోట్లు హన్మకొండ, న్యూస్లైన్ : మేడారం... దట్టమైన అటవీ ప్రాంతం... ఇలాంటి చోట సాధారణ సమయూల్లో చిన్న సంత జరిగిన దాఖలాలు ఉండవు. అక్కడి ఆదివాసీ గిరిజనులకు నిత్యావసర సరుకులే దొరకని పరిస్థితి. అలాంటిది మహా జాతర వచ్చిం దంటే చాలు... వ్యాపారం వందల కోట్లకు పరుగెడుతుంది. ప్రతి రెండేళ్ల కాలంలో ఆ నాలుగు రోజులు భారీగా లావాదేవీలు సాగుతాయి. ఊహకందని విధంగా క్రయవిక్రయూలు జరుగుతాయి. భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ రాగా... వ్యాపారం సైతం అదే దారిలో పుంజుకుంటుంది. అందుకే ఆసియూ ఖండంలోనే అత్యంత ఖరీదైన జాతరగా గుర్తింపు పొందింది. గత జాతరలో రూ.300 కోట్ల వ్యాపారం సాగగా... ఈ సారి రూ.400 కోట్లకు చేరుకుం టుందని దేవాదాయ శాఖ అధికారుల అంచనా. నాలుగు రోజుల్లోనే రెండేళ్ల సంపాదన మేడారంతోపాటు దాని చుట్టు ఉండే సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహాజాతర కోసం ఆతృతగా ఎదురుచూస్తారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వనదేవతలకు మొ క్కులు సమర్పించడమే కాకుండా... రెండేళ్ల సంపాదనను వారు జాతర జరిగే ఆ నాలుగు రోజుల్లో సమకూర్చుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అమ్మల దర్శనానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తులు అక్కడ నిల్చుండే జాగ నుంచి మొదలు తాగు నీరు, తినే తిండి వరకు అన్నింటినీ కొనాల్సిందే. అంతేకాదు... రవాణా, విడిది (అద్దె)తోపాటు తల్లులకు సమర్పించే బంగారం (బెల్లం), కొబ్బరికాయ లు, పసుపు, కుంకుమ, కోళ్లు, గొర్రెలు, మేక లు, మద్యం తదితర వస్తువుల కొనుగోళ్లకు ఖర్చు వెచ్చించాల్సిందే. ఈ మేరకు కేవలం ఆ నాలుగు రోజుల్లో రూ.వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ఇందుకు 2012 జాతరలో జరిగిన క్రయవిక్రయూలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచీ... మహాజాతర నేపథ్యంలో వ్యాపారం జోరుగా సాగుతుండడంతో పక్కరాష్ట్రాల వారు సైతం మేడారం వైపు దృష్టి సారిస్తున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు ఆధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మకాం వేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఉండే సౌకర్యాలను జాతర పరిసర ప్రాంతాల్లో కల్పించడమే కాకుండా... వ్యాపార మెళకువలు పాటించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. జాతర జరిగే నాలుగు రోజులు ధరలు విపరీతంగా పెంచి విక్రయూలు చేస్తుండడంతో లావాదేవీలు వందల కోట్లకు చేరుకున్నాయి. సర్కారీ ఖర్చులు అదనం తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక మరమ్మతులు, ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత జాతరలో రూ.60 కోట్లు వెచ్చిం చారు. ఈ లెక్కన మొత్తం లావాదేవీలు రూ.360 కోట్లు. ఇక ఈ సారి జాతర ఏర్పాట్లకు సర్కారు వెచ్చిస్తున్న నిధులు రూ.100 కోట్లు. దేవాదాయ శాఖ అంచనా ప్రకారం వ్యాపార లావాదేవీలు రూ.400 కోట్లు అనుకుంటే... మొత్తం రూ.500 కోట్లకు చేరుతుందన్న మాట. అధికారులు, సిబ్బంది అలవెన్సులు, భోజనాలు, నిర్వహణ ఖర్చులు వీటికి అదనమే అని చెప్పవచ్చు. రాష్ట్రంలోని పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏడాది పొడవునా వ్యాపారం సాగుతున్నా... కోట్లకు చేరలేదు. అలాంటిది నాలుగు రోజుల మేడారం మహాజాతరలో వందల కోట్ల వ్యాపారం సాగుతుండడం విశేషం. -
3,525 ప్రత్యేక బస్సులు 18 లక్షల మంది భక్తులు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు నిపుణులైన డ్రైవర్ల ఎంపిక శిక్షణ, అవగాహన సదస్సులతో సన్నద్ధం ట్రాఫిక్ జాం కాకుండా మేడారం దారిలో క్రేన్లు మరమ్మతులకు బృందాలు ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు హన్మకొండ సిటీ, న్యూస్లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సంస్థ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు తెలిపారు. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్హౌస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరకు 3,525 ప్రత్యేక బస్సు లు నడుపనున్నామని, ఈ మేరకు కొత్త బస్సులు తీసుకొచ్చినట్లు వివరించారు. బస్సులను జాగ్రత్తగా నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను ఎంపిక చేయడంతో పాటు ప్రత్యేక శిక్ష ణ ఇచ్చామన్నారు. జాతరపై అవగాహన సదస్సులు నిర్వహించి వారిని సన్నద్ధం చేసినట్లు వెల్లడించారు. భక్తులను క్షేమంగా గమ్యానికి చేరవేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సారి ఆర్టీసీ బస్సుల ద్వారా 18 లక్షల మంది భక్తులను చేరవేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామన్నారు. మేడారంలో 45 ఎకరాల సువిశాల స్థలంలో బస్స్టేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేశామని, ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. ప్రయాణికులను సత్వరంగా చేరవేసేందుకు వీలుగా టికెట్ ఇష్యూ మిషన్లను వినియోగిస్తున్నామన్నారు. కల్వర్టుల వద్ద బస్సులు నిలిచిపోకుండా ఉండేలా గార్డులను నియమించామన్నారు. బస్సులు మధ్యలో మరమ్మతుకు వస్తే బాగు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీరికి ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ జాం అయినపుడు వాహనాలను తొలగించేందుకు క్రేన్లను సైతం ఏర్పాటు చేశామన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు ప్రతిపాదనలు జిల్లాకు 199 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు కావాలని ప్రతిపాదనలు పంపినట్లు ఎం.సత్యనారాయణరావు వెల్లడించారు. వీటితోపాటు మరో బస్సు డిపో అవసరముందన్నారు. మొదటి విడతలో కరీంనగర్కు ఒక డిపోతోపాటు జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు మంజూరయ్యాయన్నారు. వరంగల్లో బస్సుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండో విడతలో ఒక డిపోతోపాటు 199 బస్సులు మంజూరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈడీలు ఎ.పురుషోత్తం, రవీందర్, వరంగల్ ఆర్ఎం ఈ.యాదగిరి, సెక్యూరిటీ, విజిలెన్స్ జేడీ వెంకట్రావు పాల్గొన్నారు. -
గిరిజనవేల్పుల...
అక్కడ కేవలం రెండు గద్దెలు తప్ప విగ్రహాలంటూ ఉండవు. చెట్లకాండాలు తప్ప దేవతామూర్తులు దర్శనమివ్వవు. భక్తజనం పారవశ్యంతో పెట్టే కేకలు తప్ప వేదమంత్రాలేమీ వినపడవు. బంగారంగా పిలుచుకునే బెల్లం, ఎదురుకోళ్లూ, ఒడిబియ్యమే తప్ప వేరే ముఖ్యమైన మొక్కుబడులేమీ కనపడవు. మద్యం, మాంసం, అంటు, మైల కావు అక్కడ తప్పు. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమినుంచి నాలుగు రోజులపాటు వనదేవతలకు అశేష భక్తసామాన్యం జరుపుకునే ఈ జనజాతర...ఆసియాఖండంలోనే అతి పెద్దదిగా పేరు పొందిన అసలైన గిరిజన జాతర. అదే సమ్మక్క సారలమ్మ జాతర. ఈ నెల 12 నుంచి 15 వరకు అంగరంగవైభవంగా జరగనున్న ఈ జాతర వెనుక కథేమిటంటే... శుభాల కల్పవల్లి: కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12 శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేటకోసం ఒకసారి అభయారణ్యంలోకి వెళ్లాడు. అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి, సమ్మక్క అని పేరు పెట్టి, పెంచుకోసాగాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుండి శుభాలే జరుగుతుండడంతో గ్రామస్థులు ఆమెను దేవతలా కొలిచేవారు. యుక్తవయసు వచ్చిన సమ్మక్క... మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. వారి నోములపంటే సారలమ్మ, నాగులమ్మ జంపన్నలు. సారలమ్మకు గోవిందరాజులుతో పెళ్లి జరిగింది. ఇది ఇలా ఉండగా... మేడారం దగ్గరున్న సారవంతమైన భూములను ఆక్రమించేందుకు కాకతీయ రాజు రుద్రదేవుడు మాఘశుద్ధ పూర్ణిమనాడు మేడారంపై దండెత్తాడు. కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి, చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అదే నేటి జంపన్నవాగు. సమ్మక్క ధాటికి తట్టుకోలేని శత్రువర్గం వారు వెనుక నుంచి వచ్చి బల్లెంతో పొడిచారు. అయినా ధైర్యం కోల్పోకుండా శత్రువులను హతమారుస్తూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది సమ్మక్క. గిరిజనులు ఆమె కోసం అరణ్యమంతా గాలించగా... నాగవృక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న ఓ భరిణె కనిపించింది. ఈ భరిణెనే సమ్మక్కగా భావించి ఆమెను స్మరించుకుంటూ గిరిజనులు జాతర చేసుకుంటున్నారు. వనం నుంచి జనంలోకి... నాలుగు రోజులు జరిగే ఈ జాతర కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో మొదలవుతుంది. అదేరోజు గోవిందరాజును, పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండోరోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు)... చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు వస్తారు. తమ భక్తులు మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. - పిన్నింటి గోపాల్, సాక్షి వరంగల్ ప్రతినిధి -
సమ్మక్క-సారక్క స్ఫూర్తితో ఉద్యమించాలి
ఏటూరునాగారం, న్యూస్లైన్ : ఆదివాసీలు స్వయం పాలనను సాధిం చుకునేందుకు సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లా బాధ్యుడు మడకం వెంకటేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివాసీ సేన ద్వితీయ మహాసభలు, బహిరంగ సభ ఏటూరునాగారంలోని కొమురంభీం మినీ స్టేడియంలో మంగళవారం ఆదివాసీ సేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడి రాంచందర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కణితి లక్ష్మణ్రావు, మండకం వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. లక్ష్మణ్రావు మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అగ్రకులాలు, పెట్టుబడిదారులు ఆదివాసీ ప్రజానీకాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపంచారు. 2008లో స్థాపించిన ఆదివాసీ సేన ఉద్యమ ఫలితంగానే కొన్ని చట్టాలు అమలవుతున్నాయన్నారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కేసులకు వెనకాడేది లేదు.. ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాడినందుకు తనపై ప్రభుత్వం 150 కేసులు పెట్టి, ఆరేళ్లు జైలు పాలు చేసిందని, అయినా ఆదివాసీల కోసం పోరాడుతూనే ఉంటానని వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. ఈ పోరాటం ఫలితంగానే పశ్చిమగోదావరి జిల్లాలో 20 వేల ఎకరాల భూమిని ఆదివాసీలకు పంచారన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మల త్యాగ ఫలాలు ఆదివాసీలకే చెందాలన్నారు. ఈ సందర్భంగా వనదేవతల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు కాదని.. ఆదివాసీల హక్కన్నారు. దాన్ని ప్రభుత్వం అడ్డగోలుగా పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. పుస్తకాల్లో కనిపించని ఆదివాసీల చరిత్ర పుస్తకాల్లో ఆదివాసీలు, కొమురంభీం లాంటి మహానేతల చరిత్రను ఎందుకు ప్రచురించడం లేదని వెంకటేశ్వర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. దేశ దోహ్రుల చరిత్రను మాత్రం పుస్తకాల్లో అచ్చు వేయిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఆదివాసీ ప్రాంతాలను ఏకం చేస్తూ స్వయం పరిపాలన ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బాక్సైట్ వెలికితీత, కవ్వాల టైగర్ జోన్, ఓపెన్ కాస్టులు, ఎలిఫెంట్ జోన్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు.. ఇవన్నీ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసకాండ అని ధ్వజమెత్తారు. ఆదివాసీలకు భూమి, అడవికి మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. స్వయం పాలన సాధించే వరకూ పోరాటాలను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బహుజన సంస్కృతిక సమాఖ్య సంఘం కళాకారులు ఉద్యమ గీతాలను ఆలపించారు. మం డలంలోని చింతలపాడుకు చెందిన గొత్తికోయ మహిళలు వారి భాషలో పాటలు ఆలపిం చారు. సభలో ఆదివాసీ సేన ఆదిలాబాద్ బాధ్యతులు తొడసం ప్రభాకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్మి సంపత్, విశాఖ బాధ్యులు మండే గురుస్వామి, ఆదివాసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు మడి సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి ముక్తి సాంబశివరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి వాసం లింగయ్య, నాయకులు గొం ది కిరణ్, మైపతి సంతోష్ పాల్గొన్నారు. -
సారొస్తారా..?
మేడారానికి ముఖ్యమంత్రి వచ్చేనా... ఇంకా ఖరారు కాని కిరణ్ పర్యటన 2012లో వారం ముందే వచ్చిన సీఎం ఈ సారి సంప్రదాయం తప్పుతుందా... సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుంది. పూర్తిగా గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ మహాజాతరను 1996లో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా... జాతర జరిగే రోజుల్లో లేదా అంతకు వారం ముందు మేడారానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం వనదేవతలకు మొక్కులు సమర్పించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులు వచ్చి ఈ ప్రక్రియ పూర్తి చేయడం గత జాతర వరకు జరిగింది. కానీ... తాజా పరిస్థితుల నేపథ్యంలో మేడారం జాతరకు ఈ సారి ముఖ్యమంత్రి వచ్చే సూచనలు కనబడడం లేదు. సీఎం కిరణ్కుమార్రెడ్డి పర్యటన ఇంకా ఖరారు కాకపోవడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా యంత్రాంగానికి గానీ, పోలీసు శాఖకు గానీ ఎలాంటి సమాచారం లేదు. ఇవన్నీ చూస్తుంటే మేడారం జాతరకు కిరణ్కుమార్రెడ్డి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చల సమయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు తెలంగాణవాదులను మనస్తాపానికి గురిచేసింది. అంతేకాదు... కిరణ్కుమార్రెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగిందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మేడారం జాతరకు వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. ఇదే జరిగితే గిరిజన జాతరకు ముఖ్యమంత్రి వచ్చి మొక్కులు సమర్పించుకునే సంప్రదాయూనికి కిరణ్కుమార్రెడ్డి గండికొట్టినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్లకే మారిన నేతల పరిస్థితి 2012 ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఫిబ్రవరి 1న మేడారానికి వచ్చారు. జాతర మొదలయ్యే వారం (మండె మెలిగే) రోజున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య, సమాచార శాఖ మంత్రి డీకే.అరుణ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు, కాంగ్రెస్ నేత కె.చిరంజీవితో కలిసి వచ్చి సమ్మక్క-సారలమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అప్పుడు కిరణ్కుమార్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. పొన్నాల లక్ష్మయ్య అయితే ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి విథేయుడిగా వ్యవహరించారు. కిరణ్కుమార్రెడ్డి ఎత్తు బంగారం(బెల్లం) తూకం సమయంలో ఏకంగా ఆయన కాలు పట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొకాళ్లపై నిలబడి సీఎంతో ఫొటో దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. రెండేళ్లకే పరిస్థితి మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జాతర జరగనుంది. ప్రస్తుత జాతరకు సంబందించి కీలకమైన మండమెలిగె ప్రక్రియ బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జాతరకు వస్తున్నారా... లేదా... అనేది మంత్రులకు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. హామీల మాటేమిటి... ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జాతరకు రావడం, రాకపోవడం ఎలా ఉన్నా... గత జాతర సమయంలో ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మేడారంలో రూ.2 కోట్లతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. మళ్లీ జాతర వచ్చినా మ్యూజియం ఊసే లేదు. సమ్మక్క దేవత ఉండే చిలకలగుట్ట చుట్టు కంచె(ఫెన్సింగ్) ఏర్పాటు చేస్తామని చెప్పగా... ఇది ఇటీవలే మొదలైంది. కోటి మంది భక్తులు వచ్చే మేడారం మహాజాతరను జాతీయ పండుగగా ప్రకటించే విషయాన్ని పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీల అమలు విషయంలో జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య సైతం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తీరుగానే వ్యవహరించారు. మళ్లీ జాతర వచ్చినా అప్పటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. -
రైల్వే... వివక్షే
మహాజాతరకు కానరాని ప్రత్యేక రైళ్లు ఊసే లేని అదనపు బోగీలు అధిక ఆదాయం సమకూరుతున్నా.. నిర్లక్ష్యం వీడని అధికారులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు కాజీపేట రూరల్, న్యూస్లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ... కుంభమేళాను తలపించే జాతర... ఆసియూ ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది... అలాంటి విశిష్టత ఉన్న మహా జాతరపై రైల్వే శాఖ వివక్ష చూపిస్తోంది. కొత్త రైళ్లు, ప్రత్యేక రైళ్లు, పలు యూనిట్ల కేటాయింపులో రైల్వే అధికారులు ఆంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తూ... తెలంగాణపై వివక్ష చూపుతున్నట్లు ఇదివరకే అపవాదును మూటగట్టుకున్నారు. సంక్రాంతి, దీపావళి పండుగలు, తిరుమల బ్రహ్మోత్సవాలు, శబరిమల, షిర్డీ యాత్రలతోపాటు వేసవి సీజన్లలో ఆంధ్ర ప్రాంతానికి నేరుగా ప్రత్యేక రైళ్లు, యాత్ర రైళ్లు, కొత్త రైళ్లు వేస్తున్న విషయం తెలిసిందే. కానీ... తెలంగాణ ప్రాంత ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే దసరా, శ్రీ రామనవమి వంటి పండుగలు, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల యూత్రలకు ప్రత్యేక రైళ్లు, కొత్త రైళ్లు వేయడం గానీ... ఉన్నవాటికి బోగీలను పెంచడం వంటి చర్యలు గానీ తీసుకున్న దాఖలాలు లేవు. తెలంగాణపై రైల్వే శాఖ చిన్న చూపు చూస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంతేకాకుండా... కోటి మంది భక్తులు వచ్చే మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే కనీస ఏర్పాట్లు చేయకపోవడం తెలంగాణ ప్రాంత ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనదేవతల సందర్శనానికి వస్తున్నారు. ఇందుకు గత జాతరలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారుు. అరుునప్పటికీ... రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టకపోవడంతోపాటు తెలంగాణ ప్రాంతంలో తిరిగే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. అధిక ఆదాయం సమకూరుతున్నా... తెలంగాణ ప్రాంతంలో సిమెంట్ కంపెనీలు, బొగ్గు రవాణ, క్వారీ రాళ్ల ఎగుమతి, సున్నపురాయి. ఎఫ్సీఐ కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలు ఉన్నారుు. వీటి నుంచి ైరె ల్వే శాఖకు భారీ ఆదాయం వస్తోంది. అంతేకాదు... దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆధాయం కాజీపేట జంక్షన్ నుంచే సమకూరుతోంది. ఇంతటి ప్రాధాన్యం గల కాజీపేట జంక్షన్పై రైల్వే శాఖ శీతకన్ను వేయడం తెలంగాణ ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది. మేడారం జాతరకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లాలో అతి ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన కాజీపేట, వరంగల్ మీదుగా తెలంగాణ ప్రాంతంలో కొత్త రైళ్లు గానీ, అదనపు రైళ్లు గానీ... ఉన్న రైళ్లకు అదనపు బోగీలు గానీ ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ఆ దిశగా జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రులు చొరవచూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్ర లాబీయింగే కారణం రైల్వే శాఖలో ఆంధ్ర అధికారుల లాబీయింగ్ వల్లే తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతోంది. వారి వల్ల ఇప్పటికే డోర్నకల్ జంక్షన్ నిర్వీర్యమైంది. అదేబాటలో కాజీపేట జంక్షన్ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. మేడారం జాతర ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ. జిల్లాకు నేరుగా ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో వివిద రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేయూలి. - దేవులపెల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్ మేడారానికి ప్రత్యేక రైలు మార్గం వేయాలి రెండేళ్లకోసారి కుంభమేళాను తలపించే మేడారం మహా జాతరకు జిల్లా హెడ్క్వార్టర్ నుంచి రైలు మార్గం వేయాలి. రానున్న రైల్వే బడ్జెట్లో మేడారం జాతరకు నూతన రైల్వే లేన్ మంజూరు చేయాలి. ఇది అమల్లోకి వస్తే జిల్లాలోని చాలా గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు రైల్వేకు ఆదాయం వస్తుంది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయూల్సిన అవసరం ఉంది. - సీహెచ్.తిరుపతి, రైల్వే నాయకుడు -
సమ్మక్క-సారలమ్మ జాతర
-
జాతర మారుతోంది!
సౌకర్యాల మాటున నవీన పోకడలు స్వచ్ఛతను కోల్పోతున్న మేడారం ఆదివాసీ సంప్రదాయూలు కనుమరుగు పెరుగుతున్న లడ్డు, పులిహోర సంస్కృతి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామనే తాజా ప్రకటనతో గిరి‘జనం’లో గుబులు మేడారం, న్యూస్లైన్ : తెలంగాణ కుంభమేళాను తల పించే మేడారం మహా జాతరపై ఆధునికత ప్రభావం పడుతోంది. భక్తులకు సౌకర్యాల మాటున జాతర స్వచ్ఛతను కోల్పోతోంది. గిరిజన సంప్రదాయూలకు భంగం వాటిల్లుతోంది. కొత్త కొత్త ప్రయోగాలతో గిరిజనుల్లో ఆవేదన మిగుల్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గిరిజన సం స్కృతి ప్రతిబింబించేలా రెండేళ్లకోసారి జరిగే జాతర క్రమేణా... హిందూ ధార్మికతవైపు మరలుతోందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న క్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ ముక్తీశ్వర్రావు చేసిన ప్రకటన గిరిజనుల్లో మరింత గుబులు రేపుతోంది. రూ.50 కోట్లతో జాతరను సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుస్తామని.. ఆధ్యాత్మిక కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ప్రకటించడం గిరిజనుల్లో మరింత గుబులు రేపుతోంది. జాతర అభివృద్ధి సరే కానీ.. సంప్రదాయాలకు భంగం కలిగే చర్యలు ఏవిధంగా ఉంటాయోనన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. క్రమక్రమంగా... మేడారం జాతర అంటే ఒకప్పుడు దట్టమైన అడవిలో రెండు గద్దెలు మినహా మరేవి ఉండేవి కావు. అక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు జరిగేవి. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు చెల్లించేవారు. అయితే క్రమక్రమంగా జాతరకు భక్తుల రాక పెరుగుతూ వచ్చింది. వేల నుంచి లక్షలకు... ఇప్పుడు కోటికి పైగా భక్తులు వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో సౌకర్యాల మాటున పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. 1996లో మేడారం మహాజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. అంతకుముందే కొద్దిగా మార్పులు జరగగా... దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లాక మార్పుల్లో వేగం పెరిగింది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ.. జాతరను అభివృద్ధి చేయాల్సిన దేవాదాయ శాఖ అందుకనుగుణంగా ముందుకుసాగడం లేదన్న అపవాదును మూటగట్టుకుంది. 1994లో గిరిజనులు వ్యతిరేకించినప్పటికీ భక్తుల సౌకర్యార్థం అంటూ గద్దెల చుట్టూ ఇనుప కంచె (గ్రిల్స్) ఏర్పాటు చేశారు. దీనికి తోడు 2008లో గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీ పేరుతో హిందూ సంప్రదాయం ప్రస్ఫుటించేలా సాలహారం నిర్మించారు. దీనిపై ఆదివాసీ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను తెలిపినా.... కాలక్రమేణా మిన్నకుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ జాతరలో గద్దెల వద్ద డోమ్ల నిర్మాణానికి తొలుత ముందుకు వచ్చినా.. గిరిజనుల వ్యతిరేకతతో అధికార యంత్రాంగం వెనక్కి తగ్గక తప్పలేదు. పెరుగుతున్న లడ్డూ, పులిహోర సంస్కృతి సమ్మక్క-సారలమ్మ తల్లులకు అత్యంత ఇష్టమైనది బంగారం (బెల్లం). తమ వద్దకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండొద్దని, విలువైన కానుకలు అసలే వద్దని, నిండు మనసుతో కొలిస్తే కోరికలు నెరవేర్చుతామని అమ్మలు చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఆ తల్లులకు భక్తులు బంగారంతో మొక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో బంగారమే ప్రసాదంగా ప్రసిద్ధికెక్కింది. దీంతోపాటు తల్లుల పాదాల చెంత ఉండే పసుపు, కుంకుమలకు ప్రత్యేకత ఉంది. బంగారం.. బొట్టు అందితే అదే మహాభాగ్యం అని భక్తులు భావిస్తారు. అయితే రానురాను మేడారంలో లడ్డూ.. పులిహోర సంస్కృతి పెరిగిపోయింది. బంగారమే మహా ప్రసాదమైన జాతరలో... ఏకంగా అమ్మల సన్నిధిలోనే లడ్డూ, పులిహోర అమ్మకాలు జరగడం హిందూ సంప్రదాయం వైపు మరలుతోందన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. పూజారుల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే విక్రయాలు జరిపించేందుకు అనుమతులు ఇచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఆదివాసీల్లో ఆందోళన అసలే ఆధునికత పేరుతో వస్తున్న మార్పులపై గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో దేవాదాయ కమిషనర్ ముక్తీశ్వర్రావు మాస్టర్ప్లాన్ అంటూ ఇటీవల బాంబు పేల్చారు. జాతరను ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తామంటూ ప్రకటనలిచ్చేశారు. ఏకంగా వచ్చే జాతర నాటికి రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎటువంటి అభివృద్ధి చేస్తారు.. గిరిజన సంప్రదాయాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆదివాసీల్లో గుబులు నెలకొంది. అరుుతే అభివృద్ధి పనులపై గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ పేర్కొనడం వారికి కొంత ఊరటనిచ్చినట్లయింది. కానీ... రూపంలేని అమ్మలకు దేవాదాయ శాఖ అధికారులు రూపాలు కల్పించడం, ప్రచార సాధనాల్లోనూ వాటినే వినియోగిస్తుండడం, పులి, జింకలపై సమ్మక్క-సారలమ్మ ఉన్నట్లుగా ఆలయం ముందు.. పరిసరాల్లోని ముఖద్వారాలపై బొమ్మలను చెక్కించడం... దేవాదాయశాఖ విడుదల చేసిన ఆరాధన మాస పత్రికలోనూ ఇవే బొమ్మలు పెట్టడం వంటి ఘటనలు వారిని నిద్రపట్టకుండా చేస్తున్నారుు. -
గజం 6000
సాక్షి, హన్మకొండ : మేడారంలో గజం భూమి అద్దె అక్షరాలా ఆరువేల రూపాయలు. జాతరప్పుడు తప్ప జన సంచారం పెద్దగా ఉండని అక్కడ అంత ధరా..! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కూడా అంత లేదే.. ఇక్కడెందుకు ఇలా .. అని ఆలోచనలో పడక్కర్లేదు. ప్రస్తుతం ఇక్కడ పలుకుతున్న అద్దెల ధరలు మహానగరాలతో పోటీపడుతున్నాయి. వచ్చేనెలలో నాలుగు రోజులపాటు కనులపండువగా జరిగే జాతరకు కోటిమందికిపైగా భక్తులు వస్తారని అంచనా. అందుకుతగ్గట్టే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యాపారం చేసుకోవాలంటే స్థలం కావాలిగా.. అది కావాలంటే అద్దెకు తీసుకోవాలిగా. అందుకే.. అక్కడ ఆ నాలుగు రోజులు స్థలాలకు అంత గిరాకీ. పక్షం రోజులముందే.. వచ్చేనెల 12నుంచి 15వ తేదీ వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వీరంతా మేడారంతో పాటు ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లపల్లి, కన్నెపల్లి పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తారు. వీరి అవసరాలు తీర్చేందుకు జాతర పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, పెరడుతోపాటు పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. ఇక వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. దీంతో ఇక్కడి స్థలాలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. జాతరకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉండగానే స్థలాలకు బుకింగ్లు కూడా పూర్తికావచ్చాయి. రెండు కిలోమీటర్లు.. దారికిరువైపులా.. గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. మేడారంలో ఉన్న ఇళ్ల వరండాలో గజం స్థలం విలువ సగటున ఐదువేల రూపాయలు పలుకుతోంది. గద్దెల చుట్టూ వందమీటర్ల వరకు అన్ని వైపులా గజం స్థలం విలువ రూ.ఆరువేలుగా ఉంది. జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.నాలుగువేలు. స్థలం అద్దెలు ఆకాశంలో ఉన్నా ఇప్పటికే ఇవన్నీ బుక్ అయిపోవడం విశేషం. ఇక జంపన్నవాగు నుంచి గద్దెల వరకు గజం భూమి విలువ రూ.ఐదువేలు పలుకుతుండగా రెడ్డిగూడెం, నార్లాపూర్, స్థూపం సెంటర్, ఆర్టీసీ బస్స్టేషన్ చుట్టుపక్కల ఉన్న స్థలాల గజం విలువ సగటున నాలుగువేల రూపాయలుగా ఉంది. ఇంటికి రూ.పదివేలు జాతర పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెంలో ఇళ్ల కిరాయిలు ఆకాశంలో విహరిస్తున్నాయి. దీని తర్వాత స్థానాల్లో కన్నెపల్లి, నార్లాపూర్, ఊరట్టం గ్రామాలున్నాయి. జాతర జరిగే రోజుల్లో మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో ఒక గది అద్దె రూ. ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పలుకుతోంది. గదుల అద్దె విషయంలో మేడారంతో రెడ్డిగూడెం పోటీ పడుతుండగా ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్లో ఇందులో సగం ధరకే గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక పొలాల్లో పందిళ్లు వేసుకుని బస ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు కూడా గజం స్థలానికి వెయ్యి నుంచి మూడువేల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. -
ఎడ్లబండి TO హెలికాప్టర్
నాడు అటవీ మార్గం.. నేడు ఆకాశయానం వేల నుంచి కోట్లలోకి చేరిన భక్తుల సంఖ్య సాక్షి, హన్మకొండ : దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే మేడారం జాతరకు ప్రారంభంలో భక్తులు కాలిబాట ద్వారా చేరుకునేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్ల మార్గం గుండా వెళ్లేవారు. జాతర చుట్టుపక్కల అటవీ గ్రామాలైన కాల్వపల్లి, ఊరట్టం, కొత్తనాగారం, కరీంనగర్, లింగాల, పస్రా మీదుగా మొత్తం 72 మార్గాల గుండా మేడారం చేరుకునే వారు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తులు పగిడిపల్లి, బొర్లగూడెం, సింగారం మీదుగా వరంగల్ జిల్లాలోని కాల్వపల్లి చేరుకుని జాతరకు వచ్చేవారు. ఇప్పటికీ ఈ మార్గాలు ఉపయోగంలో ఉన్నాయి. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కుటుంబ సభ్యులతో వచ్చే భక్తులు ఏటూరునాగరం వద్ద గోదావరి దాటేవారు. ఉదయాన్నే తుపాకులగూడెం వద్ద ఎడ్లబండ్లను కిరాయికి మాట్లాడుకుని కొత్తూరు, సర్వాయి గ్రామాల మీదుగా సాయంత్రానికల్లా అటవీ గ్రామం అయిన ఐలాపురం చేరుకుని... అక్కడే రాత్రి బస చేసేవారు. మరునాడు బయల్దేరి ఊరట్టం చేరుకుని సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించేవారు. ఇప్పటికీ ఊరట్టం గ్రామ సమీపంలో ప్రతి జాతరకూ వందల సంఖ్యలో ఎడ్లబండ్లు అందుబాటులో ఉంటాయి. వరంగల్ మీదుగా వచ్చే భ క్తులు ములుగు గట్టమ్మ దగ్గర రాత్రి బస చేసేవారు. అక్కడి నుంచి బయల్దేరి చల్వాయి, సోమలగడ్డ రంగాపురం, ఇప్పలగడ్డ, కొత్తనాగారం మీదుగా ప్రాజెక్టునగర్ చేరుకుని మేడారం వస్తారు. ఖమ్మం జిల్లా గుండాల మీదుగా జిల్లాలోకి కొత్తగూడ మండ లాలకు చెందిన భక్తులు లింగాల చేరుకుని అక్కడి నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. 1966 నుంచి ఆర్టీసీ.. గోవిందరావుపేట-చల్వాయి మధ్య దయ్యాలవాగుపై వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ 1966 నుంచి బస్సులను మేడారం జాతరకు నడిపిస్తోంది. మొదటిసారి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని ముఖ్యమైన పట్టణాల నుంచి 110 బస్సులను నడిపించింది. భక్తుల రద్దీ దృష్ట్యా 1980 తర్వాత బస్సుల సంఖ్య క్రమేపీ పెరిగింది. ముఖ్యంగా తాడ్వాయి నుంచి మేడారం వరకు బీటీ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల సంఖ్య యేటేటా పెరుగుతోంది. 1996లో జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుం చి భక్తుల సంఖ్య పెరిగింది. గత జాతరలో ఆర్టీసీ రా ష్ట్రంలోని నలుమూలల నుంచి 3వేల బస్సులను నడిపించింది. ఈ జాతరలో బస్సుల సంఖ్య 3,525కి పెంచింది. పెరిగిన ప్రైవేట్ వాహనాలు జంపన్నవాగుపై 2002లో బ్రిడ్జి నిర్మాణం తర్వాత ప్రైవేటు వాహనాల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. దీంతో మేడారం వచ్చేందుకు ఎడ్లబండ్లు, ఆర్టీసీ బస్సులకు ప్రత్యామ్నాయంగా పస్రా-నార్లాపూర్-మేడారం మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రతీ జాతరలో వేల సంఖ్యలో ఆటోలు, కార్లు, సుమోలు, జీపులలో మేడారానికి భక్తులు వస్తున్నారు. ఈసారి మేడారం వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 23 స్థలాలను ఎంపిక చేశారు. అందులో 15 పార్కింగ్ స్థలాలు నార్లాపూర్-జంపన్నవాగు మధ్యలో ఉండటం ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రైవేటు వాహనాల రద్దీకి అద్దంపడుతోంది. గాల్లోనూ ఎగరొచ్చు రాష్ట్ర పండుగగా గుర్తింపు, రోడ్డు మార్గాలు మెరుగుపడడంతో భక్తుల రాక పెరిగింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆకాశమార్గాన పయనించి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది. 2010 జాతర సందర్భంగా మొదటిసారిగా వరంగల్ నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సేవలను టర్బో ఏవియేషన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. రానుపోను చార్జి రూ.6వేలతో మామునూరు ఎయిరోడ్రం నుంచి పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వర కు భక్తులను చేర్చారు. గత జాతరలో ఈ సౌకర్యం అందుబాటులో లేదు. కాగా, 2014 ఫిబ్రవరి 12 నుంచి జరిగే జాతరను పురస్కరించుకుని రెండోసారి ములుగు, వరంగల్, హైదరాబాద్ నుంచి జాతర ప్రాంగణం వరకు హెలికాప్టర్ సేవలను టర్బో ఏవియేషన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. -
వనజాతరకు ఆకాశయానం
నాలుగేళ్ల తర్వాత మళ్లీ హెలికాప్టర్ సర్వీసు సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ సర్వీసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టర్బో ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.ఉమేశ్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ జి.కిషన్తో భేటీ అయ్యారు. మహాజాతర జరిగే ఫిబ్రవరి 12నుంచి 15వరకు హెలికాప్టర్ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమేశ్ చెప్పారు. మేడారంలో దేవతల గద్దెల సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకు 9908765554, 9676999683 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. చార్జీల వివరాలు ళీ హైదరాబాద్ నుంచి మేడారానికి 1.15గంటల ప్రయాణం. ఒక్కరికి రానుపోను చార్జి రూ.40వేలు ళీ వరంగల్ నుంచి రూ.18 వేలు ళీ ములుగు నుంచి రూ.8వేలు ళీ హెలికాప్టర్ అద్దెకు కావాలంటే ఐదుసీట్లకు రూ.90వేలు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సర్వీసు ఉంటుంది. అప్పట్లో రూ.6వేలు చార్జీ.. 2010లో వరంగల్లోని మామునూరు నుంచి ఒక్కో వ్యక్తికి రానుపోను రూ.6వేలు తీసుకున్నారు. -
జాతర విధులు మరువలేనివి
తల్లుల సేవలో తరించడం అదృష్టం వనదేవతల ఆగమనం అనిర్వచనీయం ‘న్యూస్లైన్’తో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు తెలంగాణ కుంభమేళాగా వర్ధిల్లుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో విధులు నిర్వర్తించడం నా అదృష్టం. కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న వనదేవతల్లో గొప్పశక్తి దాగి ఉంది. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ప్రధానఘట్టం తల్లుల ఆగమనం. ఈ సమయంలో జాతర ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. భక్తులు తమను తాము మరిచిపోయి వనదేవతలను కొలుస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి జాతరను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ వనదేవతల సేవలో తరిస్తున్న జిల్లా పరిషత్ సీఈఓ గాదె ఆంజనేయులు శుక్రవారం ‘న్యూస్లైన్’తో గత జాతర అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... జిల్లా పరిషత్, న్యూస్లైన్ : మేడారం జాతరలో విధులు నిర్వర్తించడం ప్రభుత్వ ఉద్యోగుల అదృష్టమనే చెప్పవచ్చు. నేను 2004 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు జాతరలో పనిచేశాను. 2004, 2006లో నర్సం పేట ఆర్డీఓగా, 2008లో ములుగు ఆర్డీఓగా, 2012, 2014లో జిల్లా పరిషత్ సీఈఓ హోదాలో వనదేవతలకు సేవ చేసే భాగ్యం దక్కింది. ఆర్డీఓగా పనిచేసిన అనుభవంతోనే తాను జాతరలో అభివృద్ధి పనుల బాధ్యతను తీసుకున్నాను. 2004 జాతర అధికార యంత్రాంగానికి గుణపాఠం.. 2004లో జరిగిన మేడారం జాతర జిల్లా యంత్రాంగానికి గుణపాఠం నేర్పింది. అప్పుడు జరిగిన జాతరలో ఆర్అండ్బీశాఖ అధికారులు ప్రధాన రహదారిని వెడల్పు చేసి, సైడ్బర్మ్స్ వేసేందుకు పక్కనే కందకం తీసి మట్టిని ఇరువైపుల పోశారు. అయితే జాతర ప్రారంభమయ్యే ముందు వర్షాలు కురియడంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల వాహనాలు అందులో కూరుకుపోయాయి. సాధారణంగా జాతర జరిగే సమయం లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రోడ్డు పక్క ఉన్న అడవిలో వాహనాలను పార్కింగ్ చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ.. 2004 జాతరలో రోడ్డు వెడల్పు కోసం తీసిన కందకాల్లో వర్షపునీరు నిలువడం తో వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తాడ్వాయి మీదుగా జంగలంచ వరకు, మే డారం-నార్లాపూర్ మార్గంలో పస్రా వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది భక్తులు వాహనాలు ఆగిపోయిన చోట నుంచే కాలినడకన మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ట్రాఫిక్ స్తంభించిన సమయంలో దారి పొడవునా చిరువ్యాపారులు తాగునీరు, చల్లటి పానీయాలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు అమ్మడంతో భక్తులకు కొంత ఊరట లభించింది. రోడ్డు వెడల్పు పనులను సకాలంలో చేయకపోవడం.. జిల్లా యం త్రాంగానికి గుణపాఠం నేర్పింది. 2006లో గద్దెల వద్ద విధులు.. 2006లో నర్సంపేట ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో గద్దెల వద్ద విధులు నిర్వర్తించాను. అప్పటి జాతరలో ఉదయం 6 గం టల నుంచి రాత్రి 11గంటల వరకు అక్కడే ఉండి పనిచేశాను. ఎందుకంటే తల్లులు గద్దెలపైకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడితోపాటు దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు గద్దెలకు వస్తున్న సమయంలో అధికారులు కూడా తన్మయత్వంతో ఊగిపోతారు. ఆ సమయంలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. 2008లో ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు జంపన్నవాగు స్నానఘట్టాలపై విధులు నిర్వహించాను. జాతరలో ట్రాఫిక్తో పాటు స్నానఘట్టాలపై పోలీసు యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2008లో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే దంపతుల సామగ్రిని దొంగలు ఎత్తుకుపోతుండడం.. నేను కళ్లారా చూశా ను. ఈ విషయాన్ని అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. 2010లో కామారెడ్డిలో పనిచేయడం కారణంగా జాతరలో విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2011లో జిల్లా పరిషత్ సీఈఓగా మళ్లీ జిల్లాకు రావడంతో 2012లో తల్లులకు సేవలందించాను. అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత.. జాతరను పురస్కరించుకుని రహదారులు, సదుపాయాల కల్పనకు ఈ ఏడాది ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అయితే గత జాతరల్లో పనిచేసిన అనుభవం కలిగిన తనకు కలెక్టర్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షిస్తున్నాను. అయితే గత జాతరలో భక్తుల సౌకర్యార్థం ఎన్ని మరుగుదొడ్లు కట్టిన విషయం తెలుసుకునేందుకు జెడ్పీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీలు వేశాను. నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో పనుల్లో పురోగతి పెరిగింది. మేడారం జాతరతో పాటు అగ్రహంపాడ్, అమ్మవారిపేట లాంటి చిన్న జాతరల్లో జరిగే అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. ఈ ఏడాది జరిగే వనదేవతల జాతరలో ఎంపీడీఓలు, సూపరింటెండెంట్స్థాయి అధికారుల సేవలు వినియోంచుకుంటాం. ప్రధాన గేటు వద్ద ఉన్నతాధికారి విధులు.. గత జాతరల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలపై జిల్లా యం త్రాంగం ఇటీవల చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 2010, 2012లో జరిగిన జాతరలో ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు(వీఐపీ) దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వారిని నేరుగా అనుమతించలేదు. దీనిపై అధికారుల మధ్య భేదాభి ప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. వీఐపీల దర్శనం సందర్భంగా పోలీసు అధికారితో పాటు ఆర్డీఓ స్థాయి అధికారిని ప్రధానగేటు వద్ద విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. గేటు వద్ద ఉండే ప్రతి అధికారి 12 గంటల పాటు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నాం. జాతర సెక్టొరియల్ అధికారులకు సహాయకులుగా తహసీల్దార్లతో పాటు పలువురు ఎంపీడీఓలు పనిచేయనున్నారు. జిల్లా పరిషత్ నుంచి ములుగు పరిధిలోని మండలాలకు చెందిన అధికారులను జాతర విధుల్లోకి తీసుకునే అవకాశాలున్నాయి. -
9వేల మందితో బందోబస్తు
జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు ఎక్కువమంది కలిసి ఒకే వాహనం వినియోగిస్తే మేలు పాలిథిన్ కవర్ల వాడకంపై నియంత్రణ అవసరం నకిలీల బెడకు పాస్లపై హోలోగ్రామ్లు రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంకటరంగారావు వరంగల్ క్రైం, న్యూస్లైన్ : మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంకటరంగారావు అన్నారు. జాతరకు వచ్చేందుకు ప్రజలు ఎక్కువ వాహనాలు వినియోగించకుండా తెలిసిన వ్యక్తులందరూ కలిసి పెద్ద వాహనంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ను నివారించవచ్చన్నారు. అలాగే పాలిథిన్ కవర్లను వినియోగించవద్దని, వాటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘న్యూస్లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పటిష్ట బందోబస్తు తొమ్మిదివేల మంది పోలీసులతో జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర అవసరాలకు సంబంధించి ఓ చెక్లిస్ట్ తయారుచేసి సెక్టార్ ఇన్చార్జ్లకు ఇచ్చాం. వాటి ప్రకారం ఆయా ఇన్చార్జ్లు నడుచుకుంటారు. ఇలా ఎప్పటికప్పుడు చెక్చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రశ్న ఉండదు. అలాగే జాతరకు సంబంధించి మార్గదర్శకాలను పై అధికారులకు అందజేశాం. వాటి ఆధారంగా పనులు ముందుకు సాగుతున్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే భక్తులు బంగారం(బెల్లం) వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. జాతరలో స్పోరియన్ బెల్లం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లబెల్లాన్ని పరీక్షించి తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ పాటించాలి. వ్యర్థాలను ఎక్కడికక్కడ పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పాలిథిన్ కవర్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వాటిని వాడి పడేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. భూమిలో కలిసిపోవు సరికదా.. పర్యావరణానికి తీవ్ర విఘాతం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం సూచించిన నాణ్యత గల క్యారీ బ్యాగులనే ఉపయోగించాలి. వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యం భక్తులు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి. అమ్మవారు గద్దెకు చేరుకునే సమయంలో జనాలు పెద్దమొత్తంలో ఉండడంతో తోపులాట జరిగే అవకాశం ఉంది. దీనికితోడు గద్దెలపై బంగారం(బెల్లం) ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. వీఐపీ పాస్లపై కూడా శ్రద్ధ చూపిస్తున్నాం. పాస్లకు హోలోగ్రామ్ ముద్రించడం వల్ల నకిలీల బెడద ఉండదు. అప్పుడు చాలా తక్కువ 1998లో నేను ములుగు డీఎస్పీగా ఉన్నప్పుడు జాతరకు వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉండేది. దీంతో భక్తుల కంటే అప్పటి పరిస్థితులను బట్టి మావోయిస్టులపైనే ఎక్కువగా నిఘాపెట్టేవాళ్లం. అప్పట్లో మావోయిస్టులు జాతరలో పోస్టర్లు అతికించేవారు. అటువంటివి జరగకుండా నిత్యం కూంబింగ్ నిర్వహించేవాళ్లం. అభివృద్ధికి సంకేతమే డీజీపీ పర్యటన వరంగల్ ఏజెన్సీలో డీజీపీ పర్యటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఏటూరునాగారం ఏజెన్సీకి డీజీపీ రోడ్డు మార్గంలో రావడం వెన క ఓ మంచి ఉద్దేశం ఉంది. ఆ స్థాయి వ్యక్తి సాధారణ పౌరుడిలా ఏజెన్సీ అంతా తిరిగితే నక్సలిజం అనేది లేదనే సంకేతాలు పారిశ్రామిక వేత్తలకు అందుతాయి. దీంతో ఆ ప్రాం తాభివృద్ధికి వారు సహకరిస్తారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. ఏజెన్సీ ఏరియాలు కూడా అభివృద్ధి చెం దుతున్నాయనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే డీజీపీ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం. -
అన్నీ వాళ్లే..!
మేడారం(తాడ్వాయి), న్యూస్లైన్ : మేడారం మహాజాతరను పురస్కరించుకుని గిరిజన సంక్షేమశాఖ అధికారులు కాంట్రా క్టర్ల అవతారమెత్తారు. జాతరలో చేపట్టే వివిధ పనులను నామినేషన్ పద్ధతిన వారే చేస్తుండడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... వచ్చే నెలలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు *6కోట్ల నిధులు మం జూరు చేసింది. అయితే ఇందులో *1.42 కోట్లతో తాగునీటి పైపులైన్ల నిర్మాణం, జంపన్నవాగులోని నీటిని నిల్వ చేసేందుకు ఇసుకబస్తాలతో అడ్డుకట్ట, సిస్టర్న్, నల్లాల ప్లాట్ఫాంల మరమ్మత్తుతోపాటు మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. అయితే గిరిజన సంక్షేమశాఖ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పై పనులను అన్నింటిని నామినేషన్ పద్ధతిన ఒకే కాం ట్రాక్టర్కు అప్పగించారు. దీంతో స్థానిక గిరి జనులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో జరిగే జాతరలో చేపట్టే పనుల బాధ్యతను మాకే కేటాయించాలని వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. మొత్తం పనుల్లో కనీసం ఒకటి, రెం డైన.. వీడీసీ ద్వారా తమకే అప్పగించాలని గిరిజన మహిళలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జాతర పనులను చేపట్టడంలో తగిన అనుభవం లేదనే సాకుతో ఇంజినీరింగ్ అధికారులు స్థానికులకు పనులు అప్పగించేందుకు ముఖం చాటేశారు. ఇదిలా ఉండగా, స్థానికుల సహకారం లేకుండా మేడారంలో ఎలాంటి పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో గిరిజన సంక్షేమ అధికారులే కాంట్రాక్టర్లుగా మారి కూలీలతో పనులు చేయిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు టెం డర్లు అప్పగించి పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులే.. స్వయంగా పనుల బాధ్యతను తీసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామి నేషన్ పద్ధతిన పనులు చేస్తున్న అధికారులే.. బిల్లులు కూ డా చేసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులను ఏమేరకు నాణ్యతో చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై ‘న్యూస్లైన్’ ఏఈ ఆబిద్ఖాన్‘తో మా ట్లాడగా.. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో చేపట్టే పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయన్నారు. వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడిప్పుడే మొదలైన పనులు.. మేడారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. ఊరట్టం కా జ్వేనుంచి మేడారం దే వతల గద్దెల వరకు అప్డ్రోచ్రోడ్డు, పైప్లైన్లు, ఇన్ఫిల్టరేషన్ బావుల నిర్మా ణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యా యి. సరిగ్గా నెలలోపు జాతర జరుగుతున్నప్పటికీ గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు ఇంకా పనుల ప్రారంభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, ఈశాఖ పనులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో స్థానిక అధికారులు, సిబ్బంది పనుల్లో పురోగతి చూపించేందుకు హైరానా పడుతున్నారు. భక్తు ల సౌకర్యార్థం చేపడుతున్న పనులు జాతర ప్రారంభంలోగా పూర్తవుతాయా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
మేడారంపై గిరిజన శాఖ నిర్లక్ష్యం
సాక్షిప్రతినిధి, వరంగల్: గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విషయంలో గిరిజన సంక్షేమ శాఖ దారుణంగా వ్యవహరిస్తోంది. మేడారం పరిసరాల్లో మెరుగైన ఏర్పాట్లు చేసి జాతర గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా చేయాల్సిన ఆ శాఖకు.. కనీసం సాధారణ పనులు చేసేందుకు చేతులు రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లలో తన వంతుగా చేపట్టే పనులకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) రూ.10 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. కోటి మంది భక్తులు వచ్చే జాతరకు రూ.10 కోట్లు అంటే.. కచ్చితంగా మంజూరవుతాయని ఐటీడీఏ భావించింది. కానీ, ఐటీడీఏ కోరిన నిధుల్లో 50 శాతమే మంజూరయ్యే పరిస్థితి ఉందని గిరిజన శాఖ చెప్పి ప్రణాళిక ఖర్చును రూ.5.80 కోట్లకు తగ్గించింది. దీంట్లో రూ.4.99 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.1.56 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించింది. నిధులను తగ్గించిన ఆ శాఖ.. మంజూరు విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తోంది. జాతర దగ్గరపడుతున్నా ఇప్పటికి కేవలం రూ.1.42 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మేడారంలోని గిరిజన గురుకుల కళాశాల నుంచి వనం రోడ్డు వరకు 600 మీటర్ల బీటీ రోడ్డు వేసేందుకు రూ.42 లక్షలు, ఊరట్టం కాజ్వే నుంచి గ్రామానికి 800 మీటర్ల సీసీ రోడ్డుకు రూ.52 లక్షలు చొప్పున ప్రణాళికలో పెట్టారు. చిలుకలగుట్టకు వెళ్లే 800 మీటర్ల సీసీ రోడ్డు వెడల్పునకు రూ.48.50 లక్షలు, దొడ్ల నుంచి కొండాయి బ్రిడ్జి వరకు 1.5 కిలో మీటర్ల బీటీ రోడ్డుకు రూ.1.10 కోట్లు, ఆర్అం డ్బీ పరిధిలోని మేడారం నుంచి చిలుకలగుట్ట కు ఉన్న 1.50 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.20 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అలా గే మేడారంలోని ఐటీడీఏ గెస్ట్హౌజ్ మరమతులకు రూ.6 లక్షలు, కాటేజీకి రూ.4 లక్షలు, క్యాంప్ ఆఫీసుకు రూ.3 లక్షల వెచ్చించాలని నిర్ణయించారు. అరుుతే గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల రాకపోవడంతో ఈ పనులు ముందుకుసాగడంలేదు. మేడారం జాతరలో కీలకంగా వ్యవహరించే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సర్పరాజ్ నెల రోజులుగా సెలవులో ఉ న్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవ య్య ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగం అధికారి సైతం ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో ఐటీడీఏ పనుల పర్యవేక్షణ జరగడంలేదు. -
ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఫైళ్లు
=మేడారం జాతర పనులపై చిన్నచూపు =కేటాయింపులు చేసినా పైసా విడుదల చేయని సర్కార్ =ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఫైళ్లు =సచివాలయం చుట్టూ తిరుగుతున్న జిల్లా అధికారులు =ముంచుకొస్తున్న జాతర గడువు.. ఈ సారీ పనులు ఆగమాగమే? మహాజాతరపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతరపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏదో అత్తెసరు నిధులకు మంజూరీ ఇచ్చినా ఇప్పటి వరకు పైసా రాలేదు. జాతరకు మూడు నెలలు మాత్రమే గడువు ఉండగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కనీసం టెండర్ దశకు కూడా చేరుకోలేదు. సరైన సౌకర్యాలు లేక ఈ సారి కూడా భక్తులకు కష్టాలే ఎదురుకానున్నాయి. ములుగు, న్యూస్లైన్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 12నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అధికారుల అంచనా. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టడానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిం చింది. కలెక్టర్ కిషన్ నేతృత్వంలో రూ.114 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఎట్టకేలకు తొలుత రూ.68.62 కోట్లు, తదుపరి మరో రూ.21.5 కోట్ల నిధులు మంజూరుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నిధుల కేటాయింపులు జరిగినప్పటికీ పైసా కూడా విడుదల కాలేదు. సదరు ఫైళ్లు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆయా శాఖల జిల్లా అధికారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆ ఫైళ్లకు మోక్షం లభించడం లేదు. ఫైనాన్స్ విభాగంలో క్లియరెన్స్ రావడానికి వారం.. ఆ తదుపరి టెండర్ పిలవడం.. ఓపెన్ చేయడం.. అగ్రిమెంటు..తదితరాలను ఫైనలైజ్ చేయడానికి మరింత సమయం పట్టనుంది. ఇలా.. జాతర పనుల ప్రారంభానికి మరో నెల రోజులు పట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీసారి జరిగే జాతరల్లోనూ నిర్ణీత గడువుకు పనులు ప్రారంభంకాక పోవడం భక్తులకు శాపంగా మారింది. జిల్లా యంత్రాంగం ముందస్తుగా స్పందిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత జాతరల అనుభవ పాఠాలను నేర్వని ప్రభుత్వం తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఈ జాతరలోనూ ఆదరాబాదరా పనులకే తెరలేవనున్నట్లు స్పష్టమవుతోంది. ఫైనాన్స్ విభాగంలోనే.. మేడారం మహాజాతరకు ప్రభుత్వం సుమారు రూ.90 కోట్లు కేటాయించినా అందుకు సంబంధించిన ఫైళ్లు ఫైనాన్స్ విభాగంలో పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా ఎక్కువ మొత్తం శాఖల పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని శాఖల పనులు ఇంకా టెక్నికల్ మంజూరుకు అపసోపాలు పడుతున్నాయి. జాతర పనుల్లో స్నానఘట్టాల పనులు.. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ అత్యంత కీలకవైనవి. అయితే ఈ పనుల ఎప్పుడు కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు.. హడావుడి నిర్మాణాలతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకునేలా అధికారులే అవకాశం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం చిన్ననీటి పారుదల శాఖ పరిధిలో రూ.9.52 కోట్ల నిధుల మంజూరుకు సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ విభాగంలో ఉంది. పనుల ఫైనలైజ్ కోసం ఆ శాఖ ఈఈ హైదరాబాద్లోనే మకాం వేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో రూ.9.30 కోట్లతో 80 పనులు చేపట్టనున్నారు. నిధుల మంజూరు ఫైల్ ప్రస్తుతం ఫైనాన్స్ విభాగంలో ఉందని, రెండు మూడు రోజుల్లో ఫైనల్ కానున్నట్లు ఆ శాఖ ఈఈ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖదీ అదే పరిస్థితి మేడారం జాతరలో రూ.9.96 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ వివిధ అభివృద్ధి పనులను చేపట్టనుంది. అయితే నిధుల మంజూరు ఫైల్ ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో ఉంది. ఇక్కడ ఆమోదం వేయించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్లోనే ఉన్నట్లు డీఈ మల్లయ్య తెలిపారు. ఇదిలాఉండగా, గత జాతరలో ఈ శాఖ చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లోనే స్పష్టమైంది. జాతర గడువు దగ్గరపడడంతో అప్పట్లో అధికారులపైనా, సదరు కాంట్రాక్టర్పైనా చర్యలు తీసుకోలేకపోయారు. ఆ తదుపరి మరిచిపోయారు. ఆర్అండ్బీదీ అదే తీరు.. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు అష్టకష్టాలు పడి సుమారు రూ.43కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం వేయించుకున్నారు. అయితే సదరు పనుల్లో కొన్ని టెక్నికల్ సాంక్షన్ దశలో ఉండగా మరికొన్ని ఫైనాన్స్ విభాగంలో క్లియరెన్స్ కోసం రెడీగా ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ సారి జాతరలో ట్రాఫిక్ సమస్యను తీర్చాలన్న లక్ష్యంతో ఈ శాఖకు ఎక్కువ మొత్తం నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పనుల ప్రారంభానికి కనీసం ఇంకా నెలరోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సారీ ఆదరాబాదరా పనులు తప్పని పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్ శాఖ ముందంజ జాతర పనులకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కొంత ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.7.68 కోట్లతో ఆరు పనులు చేపట్టనుండగా దాదాపుగా అన్ని అనుమతులు వచ్చాయని.. రెండు మూడు రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆ శాఖ ఏఈ ప్రభాకర్ తెలిపారు. కన్నెపల్లి ఆర్చ్ నుంచి దేవాలయం వరకు రోడ్డుకు రూ.91 లక్షలు, చింతల్ క్రాస్ నుంచి మేడారం వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు, బీటీ, మెటల్ పనులకు రూ.1.51 లక్షలు, బయ్యక్కపేట ఆర్అండ్బీ నుంచి కాల్వపల్లి వరకు సీసీ నిర్మాణానికి రూ.46 లక్షలు, నార్లాపూర్ గ్రామం నుంచి బయ్యక్కపేట మేడారం ఆర్అండ్బీ రోడ్డు వరకు వెడల్పునకు రూ.64 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు మిగతా పనులకు టెండర్లు పూర్తి చేసి.. 15 రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
మహాజాతరకు మరో రూ. 21 కోట్లు
= ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు =‘సాక్షి’ కథనానికి స్పందించిన రాష్ట్ర సర్కారు సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం మహా జాతరకు మరిన్ని నిధులిచ్చేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడిగినన్ని నిధులు ఇవ్వకుండా... సమ్మక్క-సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వ్యవహారాన్ని ఇటీవలే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరంగల్ జిల్లా యంత్రాంగం విభాగాల వారీగా మొత్తం రూ. 114 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే... కేవలం రూ. 68 కోట్లు విదిలించి నిధులు కోత పెట్టింది. ఎట్టకేలకు స్పందించిన సర్కారు ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు కేటాయించేందుకు క్లి యరెన్స్ ఇచ్చింది. ఆర్ అండ్ బీ విభాగం పం పిన ప్రతిపాదనలకు ఈ నిధులను వాడుకునేం దుకు సమ్మతించింది. ప్రస్తుతం ఫెనాన్స్ విభాగంలో ఉన్న ఈ ఫైలుకు మరో రెండు రోజుల్లో ఆమోదం లభిస్తుందని ఆర్ అండ్ బీ అధికారు లు సూచనప్రాయంగా వెల్లడించారు. జాతరకు వెళ్లే మార్గాల్లో రోడ్లు, మరమ్మతులు, వంతెనల నిర్మాణానికి రూ. 53.01కోట్లు కావాలని ముందు గా ఆర్అండ్బీ విభాగం ప్రతిపాదనలు పం పించింది. అందులో రూ. 21.15 కోట్లు ఇచ్చేందు కు మాత్రమే సమ్మతించిన సర్కారు ఇప్పుడు అదనంగా రూ.21కోట్లు కేటాయించేందుకు ఫైలు కదిపింది. దీంతో భక్తులకు అనుగుణంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
నగర పాలక సంస్థ కమిషనర్గా సువర్ణ పండా దాస్
=జిల్లాకు సుపరిచితుడే.. =ములుగు సబ్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం =విజయవాడ కమిషనర్ నుంచి వరంగల్కు బదిలీ కార్పొరేషన్, న్యూస్లైన్ : వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్గా గొర్రెల సువర్ణ పండాదాస్ నియమితులయ్యారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న పండాదాస్ను ఇక్కడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పండా దాస్ జిల్లాకు సుపరిచితుడే. 2008-2010 మధ్య కాలంలో ములుగు సబ్ కలెక్టర్గా పనిచేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ఈనెల 18 నుంచి ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్నారు. తాగునీటి వసతుల కల్పనపై జరుగుతున్న సెమినార్కు ఇజ్రాయిల్ వెళ్లిన ఆయన 26న తిరిగి రానున్నారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలానికి చెందిన గొర్రెల ఇందిర, ప్రకాశ్రావ్ల కుమారుడు సువర్ణ పండాదాస్. ప్రకాశ్రావు.. ఎల్లవరం మాజీ ఎమ్మెల్యే. పండాదాస్ విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) చదివారు. బెంగళూరు ఐ.ఐ.ఎం పీజీ డిప్లొమో చేశారు. 2006 ఐఎఎస్ బ్యాచ్కు చెందిన ఈయన గుంటూరు జిల్లాలో శిక్షణ పొందారు. పోస్టింగ్లు ఐఎఎస్ శిక్షణ అనంతరం పండాదాస్ ములుగు సబ్ కలెక్టర్గా సూమారు రెండేళ్ల పాటు పనిచేశారు. అనంతరం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టరుగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి బదిలీపై 2012 జూన్లో హైదరాబాద్ జల మండలిలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టరుగా పనిచేశారు. 2013 జనవరి రెండో వారంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీఅయ్యారు. సూమారు పది నెలల తర్వాత వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్గా నియమితులయ్యారు. ములుగు సబ్కలెక్టర్గా పనిచేయడంతో జిల్లా భౌగోళిక, పరిపాలన, రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉంది. పండాకు షటిల్, టెన్నిస్, క్రికెట్పై మక్కువ. ముక్కుసూటితనం, నిబంధనలు కచ్చితంగా పాటిస్తారనే పేరుంది. -
‘కోటి’ జాగ్రత్తలు అవసరం
మేడారం (తాడ్వాయి), న్కూస్లైన్ : కోటి మంది వచ్చే మేడారం జాతరకు కోటి జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ మేరకు అభివృద్ధి పనులకు ముందస్తుగా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని అధికారులను కలెక్టర్ కిషన్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో జాతరలో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అమ్మవార్ల ఆశీస్సులతో అందరం కలిసి జాతరను విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం ఫి బ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో కలెక్టర్ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి మేడారంలో క్షేత్రస్థారుులో పర్యటించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో రూరల్ ఎస్పీ పా లరాజు, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐటీడీఏ, ఆర్డబ్ల్యూఎస్, ఎంఐ, ఐబీ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, ఎండోమెంట్, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. గత జాతరలోని భక్తుల ఇబ్బందులను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. గత జాతరకు 80 లక్షల మంది భక్తులు వచ్చారని... ఈసారి కోటి మంది భక్తులు వచ్చే అవకాశమున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా జాతరలో తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్య లు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూ పొందించాలని ఆయూ శాఖల అధికారులకు కలెక్టర్ కిషన్ సూ చించారు. అదేవిధంగా ఐటీడీఐ ఆధ్వర్యంలో లింక్ రోడ్ల అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేయూ లన్నారు. పస్రా నుంచి మేడారం... తాడ్వాయి నుంచి మేడారం వరకు గల తారు రోడ్లు అభివృద్ధి చేయాలని ఆర్ఆండ్బీ, ఎన్హె చ్ అధికారులను ఆదేశించారు. జాతరలో అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య పరీక్షలందించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చే యాలన్నారు. గద్దెల ప్రాంతంలోనే కాకుండా జాతర పది కిలోమీటర్ల మేర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులకు చెప్పారు. బృందాల వారీగా అధికారులు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతం చేయూలన్నారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఎక్కువ సంఖ్యలో కేశఖండన కేంద్రాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు దేవతలను దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యే క క్యూ లైన్లు ఏర్పాటు చేయూలన్నారు. జాతరపై ఇది తొలి సమావేశమేనని.. ఇలాంటివి ఎన్నో ఉంటాయని కలెక్టర్ చెప్పారు. భారీ భద్రత చర్యలు : రూరల్ ఎస్పీ పాలరాజు మేడారం జాతరలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ పాలరాజు తెలిపారు. గత జాతరలో భక్తుల ఎదుర్కొన్న ఇబ్బందులపై... అప్పుడు విధులు నిర్వర్తించిన ఎస్పీ జాబితా తయారు చేశారని చెప్పారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యతోపాటు క్యూలో తోపులాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వీఐపీ, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం అదనపు స్థలాలు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టనున్నట్లు పాలరాజు వివరించారు. దేవాదాయ సిబ్బంది తీరుపై అసంతృప్తి తాడ్వాయి : దేవాదాయశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ కిషన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు దేవతల గద్దెల ప్రాగణంలోని నాపరాయి వేడిక్కింది. దీంతో అధికారులు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద దేవాదాయ సిబ్బంది బస్తా సంచులు వేశారు. అధికారులు వాటిపై నిలబడి దేవతలను దర్శించుకున్నారు. మేడారంలో పర్యటన ఉందని తెలిసి కూడా గద్దెల ప్రాంగణంలో నీడ ఏర్పాటు ఎందుకు చేయలేదని దేవాదాయశాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయొద్దని వారికి సూచించారు.