Savyasachi
-
విలన్గా మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన హీరో
హీరోలుగా మంచి ఫాంలో ఉన్న నటులు కూడా ఇటీవల ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్కు విలన్గా పరిచయం అయ్యాడు మాధవన్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోయినా మాధవన్ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో మరిన్ని సినిమాల్లో మాధవన్ ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాధవన్ విలన్గా నటిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన మాధవన్ తాను రవితేజ సినిమాలో నటించటం లేదని.. ఆ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. -
‘బలరాముడంటే రాముడికి చుట్టమా’
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. ఇన్నాళ్లు యాక్షన్ సినిమాగానే ప్రమోట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ కామెడీ టీజర్ను రిలీజ్ చేశారు. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ టీజర్ కడుపుబ్బా నవ్విస్తోంది. నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్ కృష్ణుడిగా అలరించాడు. హైపర్ ఆది, సుదర్శన్, విధ్యుల్లేఖ రామన్, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో తమవంతు కామెడీ పండించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతమందించారు. -
‘సవ్యసాచి’లో నాగ్ సూపర్ హిట్ సాంగ్
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. నవంబర్ 2 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో సందడి చేస్తున్న సవ్యసాచి టీం తాజాగా సాంగ్ టీజర్స్తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో టీజర్ను రిలీజ్ చేశారు. ఒరిజినల్ పాట లోని ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ ట్రెండ్కు తగ్గట్టుగా ట్యూన్ చేశారు కీరవాణి. చైతూ కూడా సూపర్బ్ డ్యాన్స్ మూమెంట్స్తో ఆకట్టుకున్నాడు. చైతూ లుక్స్, కాస్ట్యూమ్స్ కూడా పాటకు మరింత ప్లస్ అయ్యాయి. నిధి అగర్వాల్ గ్లామర్ లుక్స్ తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశారు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్. -
ఆనందంతో పాటు భయం కూడా...
‘‘చాలా తక్కువ టైమ్లో మంచి సక్సెస్ వచ్చిందన్న ఆనందంతో పాటు ఆ సక్సెస్ను నిలబెట్టుకోవాలనే భయం కూడా ఉంది’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ సినిమాలతో వరుస హిట్స్ను సాధించి మంచి ఫామ్లో ఉన్నారు ఈ నిర్మాతలు. తాజాగా వీరి బ్యానర్లో నాగచైతన్య హీరోగా రూపొందిన సినిమా ‘సవ్యసాచి’. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రలు చేసిన ఈ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్, మోహన్, రవిశంకర్ చెప్పిన విశేషాలు... ∙గతేడాది సెప్టెంబర్లో ‘సవ్యసాచి’ సినిమా గురించి చందూ మొండేటి చెప్పారు. నవంబర్లో సెట్స్పైకి వెళ్లాం. నాగచైతన్య బాగా చేశారు. కామెడీ, డ్రామా, యాక్షన్ ఇలా అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. బడ్జెట్ పరంగా కంఫర్టబుల్గానే ఉన్నాం. మాధవన్గారికి కూడా ఈ సినిమా కథ బాగా నచ్చి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్కు ముందు తమన్నానే అనుకున్నాం. కానీ కథానుసారంగా సడన్గా తమన్నా వస్తే బాగుండదమో అని ఆలోచించాం. అందుకే కుదర్లేదు. ‘సవ్య సాచి’ సినిమాను తమిళంలో డబ్ చేయడం లేదు. కానీ తెలుగు వెర్షన్ను అక్కడ రిలీజ్ చేస్తున్నాం. ∙నాగచైతన్య ‘సవ్యసాచి’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ సినిమాలను వెంట వెంటనే విడుదల చేస్తున్నాం అంటే సరైన డేట్స్ లేకనే. ఈ ఏడాది నవంబర్ 29న ‘2.ఓ’ చిత్రం ఉంది. డిసెంబర్ 7వ తేదీ తెలంగాణ ఎన్నికలు. ఒకవేళ 14 రిలీజ్ చేస్తే... డిసెంబర్ 21న 4సినిమాలు ఉన్నాయి. జనవరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. వేరే డేట్స్ లేకనే. ఇలా రిలీజ్ చేస్తున్నాం. ∙మంచి సినిమా తీయడమే కాదు.. మంచి డేట్కు రిలీజ్ చేసుకోవాలి. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని 2015 జూలై 17న రిలీజ్ అనుకున్నాం. కానీ ఆగస్టు 7న చేశాం. ‘జనతా గ్యారేజ్’ సినిమాను 2016 ఆగస్టు 11న అనుకున్నాం. కానీ ఆ తేదీకి ఆడియో రిలీజ్ చేసి సినిమాను 2016 సెప్టెంబర్ 1కి రిలీజ్ చేశాం. ‘రంగస్థలం’ ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్నాం. కానీ మార్చి 30కి రిలీజ్ చేశాం. డిలే సెంటిమెంట్ అని కాదు. అలా జరిగిందంతే. ∙మేం ముగ్గురం విజయవాడ నుంచే వచ్చాం. మేం ఎప్పటినుంచో స్నేహితులం. ‘శ్రీమంతుడు’ ముందు నుంచే హీరోలకు మైత్రీవారు బాగా అడ్వాన్స్లు ఇస్తున్నారన్న టాక్ ఉంది. మేం డైరెక్టర్ను ఫాలో అవుతాం. మా సంస్థలో యాక్టర్స్, డైరెక్టర్స్ రిపీట్ అవుతున్నారంటే... వాళ్లకు కంఫర్ట్గా ఉంది. సేమ్ టైమ్ మాకూ కంఫర్ట్గా ఉంది. చందూ మొండేటితో మరో సినిమా ఉంది. కొరటాల శివగారు (శ్రీమంతుడు, జనతా గ్యారేజ్), సుకుమార్గారు (రంగస్థలం) చెప్పిన కథలు విన్నప్పుడు బాగా నచ్చాయి. ∙తొలుత పెద్ద సినిమాలే తీద్దాం అనుకున్నాం. అయితే మార్కెట్ను గమనిస్తే మధ్య స్థాయి సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ను రాబడుతున్నాయి. 2016లో మిడిల్ లెవల్ సినిమాలు కూడా చేద్దాం అనుకున్నాం. 2017లో ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పుడు రిలీజ్కు రెడీ అయ్యాయి. ∙అన్నదమ్ములు సాయిధరమ్ తేజ్, వైష్టవ్ తేజ్ సినిమాలను కావాలని ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి మా బ్యానర్లో దాదాపు పది సినిమాలు ఉన్నప్పటికీ సెట్స్లో ఉన్నది రెండు, మూడు సినిమాలే. ఇక్కడ ఎక్కువ సినిమాలు చేస్తుండటం వల్ల ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూషన్ను ఆపేశాం. ∙‘చిత్రలహరి’ని నానితో అనుకున్నాం కానీ కుదర్లేదు. నాని మంచి ఆర్టిస్టు. భవిష్యత్లో ఆయనతో సినిమా ఉంటుంది. తమిళ ‘తేరి’ తెలుగు రీమేక్ను హీరో రవితేజ, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్లతో చేయబోతున్నాం. ‘తేరి’లో చిన్న ప్లాట్ మాత్రమే తీసుకున్నాం. త్రివ్రికమ్–పవన్ కల్యాణ్గారి కాంబినేషన్లో ఓ సినిమా ఉండొచ్చు. ∙చిన్న సినిమాల ఆలోచన కూడా ఉంది. కోటి రూపాయల బడ్జెట్లో రితేష్ అనే డైరెక్టర్తో ఓ సినిమా ప్లాన్ చేశాం. అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. మా సక్సెస్లో దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. నెక్ట్స్ ఇయర్ మా బ్యానర్లో రిలీజయ్యే ఓ 4 సినిమాలకు ఆయనే సంగీత దర్శకుడు. ప్రస్తుతానికి బాలీవుడ్ ఆలోచన లేదు. సొంత స్టూడియో అంటే పెద్ద పని. ఆ ఆలోచన కూడా లేదు. వెబ్ సిరీస్ కోసం అమేజాన్ వాళ్లు అడిగారు. చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ ఎన్టీఆర్, రామ్చరణ్లతో సినిమాలు ఉంటాయి. -
హలోబ్రదర్తో సంబంధం లేదు
‘‘దర్శకుడిగా నాకు థ్రిల్తో కూడుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే నచ్చుతుంటాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను’’ అని చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చందూ మొండేటి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్’కి సంబంధించిన ఓ ఆర్టికల్ని మా ఫ్రెండ్ చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్ని నా కథలో మిళితం చేసి చైతన్య, మైత్రీ నిర్మాతలకు చెప్పాను. అందరూ బాగా ఎగై్జట్ అయ్యారు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్ అయితే బావుంటుందనుకున్నాను. ► హీరోకు తెలియకుండానే తన ఎడమ చేయి పని చేస్తుందనే పాయింట్ని ట్రైలర్లో చూసి, ‘హలో బ్రదర్’ సినిమాతో పోలుస్తున్నారేమో. కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఈ పాయింట్ని చూపించాం. కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్ స్టోరీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ► మాధవన్ ప్యాన్ ఇండియా యాక్టర్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే అన్నీ విభిన్న సినిమాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాలు కథ చెప్పగానే బావుంది చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కీరవాణి గారు తోడయ్యారు. ఆయన మార్క్ సంగీతం అందిచారు. ► లెగసీ ఉన్న హీరో మన సినిమాలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ల పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకూ సరదాగా ఉంటుంది. ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ రీమిక్స్ సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది. చైతూ ఫుల్ జోష్తో చేశాడు. సాంగ్ టీజర్లో మీరు చూసింది శ్యాంపిలే. ముందుగా ఈ పాటకు తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్కు తగట్టుగా కుదర్లే దని నిధితో చేశాం. నిధీ కూడా మంచి డ్యాన్సర్. ► మేమేదో కొత్త పాయింట్ తీశాం అని చెప్పడం లేదు. ఆల్రెడీ ఉన్న ఓ విషయాన్ని మళ్లీ చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇస్తుందని నమ్మాం. ‘మున్నా మైఖేల్’ చిత్రం చూసి నిధిని సెలెక్ట్ చేసుకున్నాం. బాగా చేసింది. నిర్మాతలు అడిగింది అడిగినట్టు ఇచ్చారు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. భూమికగారి పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం ఆలస్యం అయింది. ► ముందు ‘చాణక్య’ అనే కథ కోసం చైతన్య, నేనూ కలిశాం. కానీ అది చేయడం కుదర్లేదు. ‘ప్రేమమ్’ రీమేక్ చేశాం. ‘సవ్యసాచి’ సినిమా కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ► నెక్ట్స్ ‘కార్తికేయ 2 ’ లైన్ ఉంది. ఆ పాయింట్ని డీల్ చేసే సామర్థ్యం నాకింకా రాలేదనుకుంటున్నాను. నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ నెక్ట్స్ ఏ సినిమా ఉంటుందో చెప్పలేను. -
‘సవ్యసాచి’ సెన్సార్ పూర్తి!
డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సినిమాలకు ఇది కలిసొచ్చే కాలమే. కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో నాగచైతన్య సవ్యసాచితో రాబోతున్నాడు. తన మాట వినని ఎడమచేతితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు.. అసలు ఆ కథేంటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్తో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. మాధవన్, భూమిక, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
యాక్షన్ డ్రామాగా సవ్యసాచి
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిథి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న సవ్యసాచి టీం తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్. -
‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అందుకోసమే చైతుకు అమ్మాయిలు ఫోన్ చేసేవారట!
‘తాతగారు మెదలుపెట్టిన ప్రయాణం ఇది. నాన్నగారికి, సుమంత్ అన్నకు, నాకు, అఖిల్కు, సమంతకు ఇలా మా అందరికీ మీ ప్రేమాభిమానాలు, సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. తరాలు మారినా తరగని ప్రేమను అందిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, కొన్నిసార్లు ఎనర్జీ ఇచ్చాను. కానీ మనం అందరం ఇలా కలసి ఉండటం నాకు ముఖ్యం’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిÔ¶ ంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ వేడుకకు వచ్చినందకు కొరటాల శివగారికి, రౌడీ విజయ్కు థ్యాంక్స్. ఉదయం లేవగానే ఓ చెడు వార్త వినాల్సి వచ్చింది. మా కుటుంబానికి చాలా సపోర్ట్గా ఉన్న శివప్రసాద్గారు మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం అందరి కంటే చందు ఎక్కువగా కష్టపడ్డాడు. యునిక్ పాయింట్కి కమర్షియల్ పాయింట్స్ కలిపి మంచి సినిమా తయారు చేశాడు. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో నాన్న పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో పంచుకుంటారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు అమ్మాయిలు ఫోన్ చేసి, షూటింగ్కి రావచ్చా? మాధవన్ని చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ‘చెలి’ చూసినప్పటి నా ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. మీరు ఈ సినిమా అంగీకరించడంతో మా నమ్మకం ఇంకా పెరిగింది. మాధవన్ ఓ సినిమాని ఊరికే అంగీకరించరని మాకు తెలుసు. ఏదో కొత్తదనం లేకపోతే ఆయన ఒప్పుకోరు. ని«ధీ.. నువ్వు ఇక్కడ ఉండటానికి ఎన్ని కలలు కన్నావో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. భూమికగారు, ఇలా అందరికీ థ్యాంక్స్. మైత్రీ బ్యానర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని (అభిమానులు) ఆనందపరచడం కోసం నిజాయితీగా పని చేస్తాను. నా కెరీర్లో ఇది పెద్ద సినిమా. కాంబినేషన్ని నమ్మి కాదు కంటెంట్ని నమ్మి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు మనకు కావాలి. ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారితో పని చేయడం ఎంత ఎంజాయ్ చేశానో చైతన్యతో పని చేయడం కూడా అంతే ఆనందించాను. రచయితలు అందరూ చక్కటి సాహిత్యం అందించారు. నిర్మాతలు ప్రతీది అడిగి తెలుసుకున్నారు. అడిగింది ఇచ్చారు’’ అన్నారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ ఇలా ప్రతీ సినిమాకు నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. శివ గారికి, విజయ్ దేవరకొండకి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్. చైతన్యతో ఇంకో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మాధవన్గారూ.. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. ‘బాహుబలి’ తర్వాత కీరవాణిగారు ఈ సినిమానే చేశారు’’ అని నిర్మాతలు అన్నారు. మాధవన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్ వాళ్ల వల్ల స్ట్రయిట్ తెలుగు సినిమా చేశాను. వాళ్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. ఈ సినిమా కూడా సూపర్గా ఉంటుంది. సినిమాకు పని చేసిన వాళ్లందరూ సహృదయులు. ముఖ్యంగా నాగ చైతన్య. నేను మీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ని చైతన్యా. నీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చందూతో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మైత్రీ బ్యానర్ నా ఫ్యామిలీ లానే. పెద్ద హిట్ సాధిస్తారనుకుంటున్నాను. పవర్ఫుల్ టైటిల్తో వస్తున్నారు. టీమ్కు ఆల్ ది బెస్ట్. చైతన్య చాలా ఇంటెన్స్గా కనిపిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాళ్ల ప్యాషన్ అద్భుతం. మాధవన్గారిని తెలుగులో చూడటం ఆనందంగా ఉంది. చందూ మరో మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హ్యాండ్షేక్, నవ్విన తీరుకే నచ్చేశారు. ఇండస్ట్రీలో ఎవరు చైతన్య గురించి మాట్లాడినా మంచి విషయాలే చెబుతారు. వ్యక్తిగా అంత మంచివాడు’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన టీమ్కి థ్యాంక్స్. చైతూతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మాధవన్గారితో పని చేయడం మర్చిపోలేను’’ అన్నారు నిధి అగర్వాల్. రామకృష్ణ, మోనికా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కెమెరామేన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్
-
కాంబినేషన్ని కాదు.. కంటెంట్ని నమ్మారు
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ సీవీయం, రవిశంకర్లు నిర్మించారు. ‘కార్తికేయ, ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్ను ప్రముఖ దర్శకులు సుకుమార్ హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా బావుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదనుకుంటున్నాను. చాలా వెరైటీ సబ్జెక్ట్. ఇలాంటి సబ్టెక్ట్తో సినిమా చేయటం చందు అదృష్టం. కీరవాణి గారి సంగీతం గురించి నా స్నేహితుడు దేవీశ్రీ ప్రసాద్ ఎంతో గొప్పగా చెబు తుంటాడు. స్పూన్ కిందపడితే వచ్చే శబ్దం కూడా ఏ రాగమో కీరవాణిగారు చెబుతారని, ఆయన అంతటి సంగీత జ్ఞాని అని మేమిద్దరం మాట్లాడుకుంటాం. నిర్మాతల గురించి చెప్పాలంటే ముగ్గురూ మూడు పనులను పంచుకొని చాలా స్పీడ్గా వర్క్ చేస్తారు. నా ‘100 పర్సెంట్ లవ్’ టైమ్లో హీరో చైతూ, నేను రెగ్యులర్గా 100 పర్సెంట్ టచ్లో ఉండేవాళ్లం. ఇప్పుడు సామ్ (సమంత)తో ఉన్నందువల్ల 99 పర్సెంట్ మాత్రమే టచ్లో ఉన్నాడు (నవ్వూతూ). ట్రైలర్లో చైతూ చాలా అందంగా ఉన్నాడు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘చందూతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ జర్నీలో ఎన్నో సార్లు తిట్టాను, కసురుకున్నాను కూడా. తన మంచి కోసమే అనుకునేంత మంచి గుణం అతనిది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మేము ‘ప్రేమమ్’ చేసే టైమ్లో వేరే కంట్రీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న లైన్లో ఈ కథ చెప్పాడు చందూ. చాలా బావుంది అన్నాను. మా కాంబినేషన్ కంటే కంటెంట్ను నమ్మి చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్కు థ్యాంక్స్. ఏ సినిమాకైనా ట్రైలర్ విడుదలైనప్పుడు మెసేజ్లు వచ్చేవి. కానీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజవ్వగానే కాంప్లిమెంట్స్ వచ్చాయి’’ అన్నారు. ‘‘ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ నెల 27న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించబోతున్నాం. నవంబర్ 2న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని. -
ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో సవ్యసాచి
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తొలిసారిగా మాధవన్ ఈ సినిమాతో విలన్గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో హీరో నాగచైతన్య కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. -
‘సవ్యసాచి’ టైటిల్ సాంగ్
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు. పూర్తిగా సంస్కృత పదాలతో సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా ఆయన తండ్రి శివశక్తి దత్తా, రామకృష్ణ కోడూరితో కలిసి సాహిత్యమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
‘సవ్యసాచి’ మరో పాట : ఒక్కరంటే ఒక్కరూ..
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా సినిమాలో కీలకమైన అమ్మ పాటను రిలీజ్ చేశారు. తన కొడుకు ఎడమ చేయి అతని మాట వినకుండా కొడుకును ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ తల్లి పడే ఆవేదనే ఒక్కరంటే ఒక్కరు అంటూ సాగే పాట. కీరవాణి సంగీతమందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా శ్రీనిధి తిరుమల ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
‘సవ్యసాచి’ వర్కింగ్ స్టిల్స్
-
సవ్యసాచిలో సగాన్ని
‘ఒకే రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకు పుడితే అద్భుతం అంటారు. వరసకు కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని. సవ్యసాచిలో సగాన్ని’ అంటున్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్ విలన్గా నటించారు. ఈ చిత్రం టీజర్ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రెండు చేతులను ఒకే బలంతో ఉపయోగించగలిగే సవ్యసాచిగా నాగచైతన్య కనిపించనున్నారు. టీజర్ చూస్తుంటే మంచి సైంటిఫిక్ కాన్సెప్ట్ను కమర్షియల్ చిత్రానికి జోడించినట్టున్నారు దర్శకుడు చందు. ‘‘నేను బాగా ఎగై్జట్ అయిన కాన్సెప్ట్ ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. నవంబర్ 2న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకుడు. -
సవ్యసాచి టీజర్.. సూపర్ కాన్సెప్ట్
‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అంటూ నాగ చైతన్య చెప్పే వాయిస్ ఓవర్తో రిలీజ్ అయిన సవ్యసాచి టీజర్ ఆకట్టుకుంటోంది. సోమవారం విడుదలైన ఈ టీజర్ను చూస్తే ఓ కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీజర్ను డైలాగ్ను బట్టి చూస్తే పైకి కనిపించని.. ఒకే శరీరంతో ఉన్న కవలల కథ ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. -
సవ్యసాచి టీజర్ విడుదల
-
గురువారం గుమ్మడికాయ
ఈ నెలలో ‘శైలజారెడ్డి అల్లుడి’గా ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య తన నెక్ట్స్ చిత్రం ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నిజానికి ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిన్న ప్యాచ్వర్క్ కోసం షూటింగ్ జరుపుతున్నారు. ఇది కూడా రేపటితో పూర్తి అవుతుంది. దీంతో ఈ గురువారం గుమ్మడికాయ కొడతారు ‘సవ్యసాచి’టీమ్. అన్నట్లు ఇంకో మాట... ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’లో నాగార్జున, రమ్యకృష్ణ చేసిన ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు’ అనే సాంగ్ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను నాగచైతన్య, నిధీ అగర్వాల్పై చిత్రీకరించారు. ఈ చిత్రం నవంబర్ 2న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్న చిత్రం అక్టోబర్ 6న ఆరంభం కానుందట. -
ఫైనల్ స్టేజ్లో ‘సవ్యసాచి’
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఆలస్య కావటంతో రిలీజ్ను వాయిదా వేశారు. ఈ లోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను పూర్తి చేసిన చైతూ ఆ సినిమాతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమా పనులు పూర్తి కావటంతో తిరిగి సవ్యసాచితో బిజీ అయ్యాడు చైతూ. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలో ఆకరిపాట చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
డబుల్ ధమాకా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్ సినీ లవర్స్కు ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్ సాధించింది. మా సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్ డేట్స్ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్ ప్రతినిధులు. -
జ్ఞాపకాల గుర్తులు
సిల్వర్ స్క్రీన్పై భూమిక కథానాయికగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్ట్గానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ భూమికలో ఓన్లీ యాక్టింగ్ ప్రతిభ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. స్కూబా డైవింగ్ కూడా బాగా చేస్తారు. ‘‘రీసెంట్గా స్కూబా డైవింగ్ చేసా. ఈ ఎక్స్పీరియన్స్ను ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆ జ్ఞాపకాల గుర్తులు’’ అంటూ స్కూబా డైవింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికొస్తే... చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’, సమంత లీడ్ రోల్ చేసిన ‘యు టర్న్’ సినిమాలోనూ భూమిక నటిస్తున్నారు. -
మస్త్ బిజీ
నాగచైతన్య మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఓ వైపు ‘సవ్యసాచి’ మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలను కంప్లీట్ చేస్తూ, మస్త్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయిక. 10 రోజుల పాటు కొన్ని సీన్స్, అలాగే ఐటమ్ సాంగ్ మినహా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ను కూడా స్పీడ్గా కంప్లీట్ చేస్తోందట చిత్రబృందం. ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది.....’ సాంగ్ని రీమిక్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా, నాగచైతన్యలపై ఈ సాంగ్ను జూన్ లాస్ట్ వీక్లో షూట్ చేయనున్నారట. సో.. సినిమాకు సంబంధించిన ఆఖరి ఘట్టంలోకి అడుగుపెట్టేసారన్నమాట ఈ సవ్యసాచి. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రేమమ్’ లాంటి హిట్ తర్వాత దర్శకుడు చందుతో నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. -
‘అందుకే చైతూ సినిమా పక్కన పెట్టేశాం’
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇటీవల జెంటిల్మన్ సినిమాతో తన కెరీర్లోనూ బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్ను అందుకున్నారు. తరువాత అమీతుమీ సినిమాతో మరో మంచి విజయం అందుకున్న మోహనకృష్ణ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకన్నా ముందే నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. జెంటిల్మన్ సక్సెస్ తరువాత మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరిచారు. సాయి కొర్రపాటి నిర్మాతగా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. అయితే పూర్తి యాక్షన్ కథాంశంగా కావటంతో అప్పటికే నాగచైతన్య యాక్షన్ జానర్లో సవ్యసాచి సినిమాకు ఓకె చెప్పటంతో మోహనకృష్ణ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారట. ఈ విషయాన్ని సమ్మోహనం ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే మరో మంచి కథతో నాగచైతన్య హీరోగా సినిమా చేస్తానని చెప్పారు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్ బాబు, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సమ్మోహనం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సవ్యసాచి రిలీజ్పై కన్ఫ్యూజన్
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి షూటింగ్ దాదాపుగా పూర్తికాగా, మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ జరుగుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం సవ్యసాచి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావటంతో కాస్త వాయిదా పడింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సంస్థ గ్రాఫిక్స్ వర్క్ కొంత మేర పూర్తి చేసినా ఆ వర్క్ సంతృప్తికరంగా ఉండకపోవటంతో మరో సంస్థతో తిరిగి చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించకపోయినా... విడుదల మాత్రం ఆలస్యమవుతుందన్న విషయం తెలుస్తోంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. -
చైతూ, మాధవన్ కాంబినేషన్లో మరో సినిమా
డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్, ఇన్నేళ్లలో ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేయలేదు. అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు మ్యాడీ. అంతేకాదు ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా సమాచారం ప్రకారం నాగచైతన్య, మాధవన్లు మరో సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా పూర్తయిన వెంటనే నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్ను కీలక పాత్రలో నటింప చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
జస్ట్ ఫ్రెండ్.. అంతే!
రెండు మూడు రోజుల నుంచి బీటౌన్లో ఒకటే గుసగుస. హీరోయిన్ నిధీ అగర్వాల్ డేటింగ్ గురించి. క్రికెటర్ కేఎల్ రాహుల్తో ఆమె డేటింగ్లో ఉన్నారని ఈ గుసగుసల సారాంశం. అయితే ఈ గుసగుసల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిధీ అగర్వాల్. ‘‘రాహుల్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అతను క్రికెటర్ కాకముందునుంచి నాకు తెలుసు. నేను హీరోయిన్ కాకముందే అతనికి నేను తెలుసు. అందుకని మాట్లాడుకుంటుంటాం. అంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లేనా? రాహుల్ది కూడా బెంగళూరునే’’ అని చెప్పుకొచ్చారు ఈ మంగుళూరు బ్యూటీ. నిధీ అగర్వాల్ మూలాలు హైదరాబాద్లో ఉన్నప్పటికీని, ఆమె చదువుకుంటూ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. ఆ సంగతి అలా ఉంచితే... నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో నిధీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాతోనే నిధీ టాలీవుడ్కు పరిచయం కానున్నారు. -
నిజాయితీ ఉండాలి
అబ్బాయిలను ఇష్టపడాలంటే బోలేడు గుడ్ క్వాలిటీస్ వారిలో ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. తమను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ నవ్వించే అబ్బాయిలను మరింత ఇష్టపడతారు కొందరు అమ్మాయిలు. అయితే. . కేవలం నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి అంటున్నారు కథానాయిక నిధి అగర్వాల్. ‘‘నవ్వించే అబ్బాయిలకు ఈజీగా అమ్మాయిలు ఎట్రాక్ట్ అవుతారు. నవ్వు వారి రిలేషన్షిప్ను స్ట్రాంగ్గా ఉంచుతుంది’’ అన్న ఓ ట్విటర్ కామెంట్కు నిధి స్పందిస్తూ...‘‘అబ్బాయిలు ఓన్లీ నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి. అలాగే స్థిరంగా ఉంటూనే చాలా ప్రేమించాలి’’ అని సరదాగా పేర్కొన్నారు. అన్నట్లు ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధినే కథానాయిక. ఈ సినిమాను జూలై లోపు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
మమ్మమ్మాస్..
స్పెషల్ సాంగ్స్లో మరింత స్పెషల్గా కనిపించడమే కాదు డ్యాన్స్లో రెండింతలు రెచ్చిపోతారు తమన్నా. మళ్లీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ మమ్మమాస్ అనేలా దుమ్మురేపిన ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ను ‘సవ్యసాచి’ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్లోనే చైతూతో కలిసి స్టేజ్ను అదరగొట్టనున్నారు తమన్నా. ఈ సాంగ్ను వచ్చే నెలలో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఆల్రెడీ తమన్నా ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటల్లో ఆమె స్టెప్స్ అదుర్స్. ఇప్పుడీ పాటలోనూ మాస్ స్టెప్స్తో మెస్మరైజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మిల్కీ బ్యూటీ చైతూకు జోడీగా ‘100 పర్సెంట్ లవ్’, ‘తడాఖా’ చిత్రాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
మరో స్పెషల్ సాంగ్లో మిల్కీ బ్యూటీ
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకు ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ మాస్ మసాలా స్పెషల్ సాంగ్లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుందట. గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
చైతూ ఆటా పాటా
న్యూయార్క్లో తన మార్క్ కనిపించేలా చిందేస్తున్నారు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ప్రవీణ్. ఎమ్ సహనిర్మాత. ‘‘న్యూయార్క్లో జరుగుతోన్న ఈ చివరి షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఒక సాంగ్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. చైతూ అక్కగా భూమిక, ఓ కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు’’ అని పేర్కొంది చిత్రబృందం. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: కీరవాణి. -
‘సవ్యసాచి’ రిలీజ్.. తాజా కబురు!
అక్కినేని అభిమానులు ఇప్పుడు ఆత్రంగా ఎదురుచూస్తున్నది నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రం విడుదల కోసమే. ‘ప్రేమమ్’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్లో విడుదలవుతుందనే వార్తలు వినిపించాయి ఇన్ని రోజులు. కానీ తాజా సమాచారం ఏంటంటే ‘సవ్యసాచి’ జూన్లో కాదు జులైలో వస్తున్నాడు. అయితే దీని గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంతవరకూ సినిమా నిర్మాణానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు చిత్ర యూనిట్. ఈ మధ్యే చిత్ర దర్శకుడు చందూ మొండేటి ‘సవ్యసాచి’ గురించి మాట్లాడుతూ నాగచైతన్యను ఇంతవరకూ ఎప్పుడు చూడని కొత్త పాత్రలో చూస్తారని, ‘సవ్యసాచి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడని తెలిపాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మాధవన్, భూమిక ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. -
‘టాలీవుడ్కు స్వాగతం’
కోలీవుడ్, బాలీవుడ్లలో ఆకట్టుకున్న మాధవన్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా సవ్యసాచి. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే అయినా ఇంత వరకు మాధవన్ స్ట్రయిట్ తెలుగు సినిమా మాత్రం చేయలేదు. నాగచైతన్య హీరోగా చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ మ్యాన్లీ హీరో. ఇప్పటికే సవ్యసాచి సినిమాలో మాధవన్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీ కరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మ్యాడీకి ఓ లేఖ రాశారు. ‘17 ఏళ్ల క్రితం మీతో ప్రేమలో పడ్డాం. వీడియో జాకీగా ప్రారంభమై నటుడిగా ఎదిగిన మీ ప్రస్థానం మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. కేవలం మీ నటనకే కాదు మీ మాటలకు కూడా మేం అభిమానులం. దర్శకుడిగా విజన్ను గౌరవించే ఓ గొప్ప నటుడితో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది. మిమ్మల్ని తెలుగు తెరకు పరిచయం చేయడానికి చాలా సమయం పట్టింది. మీ అంగీకారంతో టాలీవుడ్కు మిమ్మల్ని పరిచయం చేయటమే కాదు, మా సినిమా కూడా సగం విజయం సాధించింది. సవ్యసాచి యూనిట్ తరుపున టాలీవుడ్కు స్వాగతం’ అంటూ ఓ లేఖ రాశారు. సవ్యసాచి సినిమా నటించటంపై మాధవన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. -
ఆ వార్త నిజం కాదు : రకుల్
అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించారు. నాగార్జున సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు’ పాటను రీమిక్స్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ పాటలో నాగచైతన్యతో రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడుతుందన్న ప్రచారం జరిగింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో కలిసి నటించిన చైతూ, రకుల్లు మరోసారి ఈ పాట కోసం ఆడి పాడనున్నారన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ వార్తపై హీరోయిన్ రకుల్ స్పందించారు. తాను సవ్యసాచి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు నిజంగా కాదంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న రకుల్, కొన్ని తమిళ చిత్రాలకు కూడా ఓకె చెప్పింది. Not true https://t.co/AahmZLpR4X — Rakul Preet (@Rakulpreet) 15 April 2018 -
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు
ఈలలు.. కేకలు.. చప్పట్లతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఎందుకంటే... ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణల ఊర మాస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు.. నేను రోమియోగ మారినది లగాయితు....’ రీమిక్స్లో నాగచైతన్య, నిధి అగర్వాల్ చిందేయనున్నారు. అవును.. ‘సవ్యసాచి’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. తొంభై శాతం చిత్రీకరణ పూరై్తంది. ఒక సాంగ్తో పాటు మూడు సీన్లను చిత్రీకరించేందుకు చిత్రబృందం యూఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. మే 3 నుంచి 15వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’ సాంగ్ రీమిక్స్ని చిత్రీకరించనున్నారు. అప్పుడు ‘అల్లరి అల్లుడు’కి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘సవ్యసాచి’కి మణిశర్మ స్వరకర్త. ఈ రీమిక్స్ సాంగ్ మణిశర్మ స్టైల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో నాగ్–రమ్యల స్టెప్స్ అదుర్స్. ఇప్పుడు చైతూ–నిధి కూడా అదిరిపోయేలా స్టెప్స్ వేస్తారని ఊహించవచ్చు. -
ఫైటింగ్.. షూటింగ్
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని ముప్పిరెడ్డి గ్రామ శివారులో గల బీఎస్ స్టీల్ పరిశ్రమలో ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారం ‘సవ్యసాచి’ అనే సినిమా షూటింగ్లో భాగంగా హీరో నాగచైతన్య పై పైటింగ్ సన్నివేశాలను ఫైటింగ్ మాస్టర్లు రామ్– లక్ష్మణ్లు చిత్రీకరించారు. ఈ సందర్భంగా సినిమా ఫైట్ మాస్టర్లూ మాట్లాడుతూ చందు మోండేటీ దర్శకత్వంలో సినిమాను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇట్టి సినిమా భాగంలో భాగంగా ఫైటింగ్ సన్నివేశాలను తీస్తున్నామన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరో, లైన్ ప్రోడక్షన్ పీటీ గిరిధర్∙తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
చిట్టిబాబు కథలో ‘సవ్యసాచి’
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. మల్టీ స్టారర్ సినిమాలకు ఒకే చెప్పటంతో పాటు ఒకరి సినిమాకు ఒకరు ప్రమోషన్ పరంగా సాయం చేసుకుంటున్నారు. ఇదే బాటలో అక్కినేని యువ హీరో సినిమాకు మెగా పవర్ స్టార్ సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రంగస్థలం సినిమాతో పాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి టీజర్ ను కూడా ప్రదర్శిచనున్నారట. ఈ టీజర్ మార్చి 27నే ఆన్లైన్లో రిలీజ్ కానుంది. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మాధవన్, భూమికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
డోంట్ వర్రీ అంటున్న యంగ్ డైరెక్టర్
మహానుభావుడు లాంటి క్లాస్ హిట్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు మారుతి . నాగచైతన్య హీరోగా శైలజారెడ్డి అల్లుడు సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యుల్ కంప్లీట్ అయిందని మారుతి ట్వీట్ చేశారు. ఇటీవలే మొదటి షెడ్యుల్ కంప్లీట్ అయ్యిందనీ, రెండో షెడ్యుల్ కోసం వెయిట్ చేస్తున్నామనీ, చైతన్య సవ్యసాచి సినిమాలో బిజీగా ఉన్నాడని త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలవుతుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. మీకు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా డోంట్ వర్రీ అంటూ ట్వీట్ చేశారు. మే లో సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో..మారుతీ ఈ సినిమాను కూడా తనదైన శైలీలో కామెడీ, మాస్ ఎంటర్టైనర్గా మలుచుతున్నారేమో చూడాలి. No doubt meeku ela kavalo alane untundi #chaymovie dont wry... — Maruthi dasari (@DirectorMaruthi) March 24, 2018 Hi friends...andaru #chaymovie gurinchi aduguthunnaru.1st scedule complete chesam.kani ayana savya sachi lo busy..nenu me lage waiting lo unna... i think may lo look istha...pls wait bros.. — Maruthi dasari (@DirectorMaruthi) March 24, 2018 -
చైతూ సినిమాలో సెంటిమెంటే హైలెట్
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకి ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సీనియర్ హీరోయిన్ భూమిక, హీరో మాధవన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మాధవన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. భూమిక, నాగచైతన్యకు అక్కగా నటిస్తోంది. సినిమాకు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కుతోందన్న ప్రచారం జరుగుతోంది. -
ఫస్ట్ పంచ్ అదిరింది
‘మొహంపై గాయం, గంభీరమైన చూపు. వెనక వలయాకారంలో చేతులు. ఒక్కో చేతికి ఒక్కో ట్యాటూ. ‘చిన్నారి బొమ్మ, క్వొశ్చన్ మార్క్స్, 21, మహా, అక్క, ప్రేమ గుర్తులు’.. ఆ పచ్చబొట్లే నాగచైతన్య ఫస్ట్ పంచ్ విశేషాలు. ‘ప్రేమమ్’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగచైతన్య–చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ ఎర్నేని, సీవీయం మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ పంచ్ను శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ పంచ్ పేరుతో రిలీజ్ చేసిన నాగచైతన్య ఫస్ట్ లుక్కి ఇటు చిత్రవర్గాల్లో అటు అభిమానుల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ పోస్ట్ర్తోనే చెప్పేసింది చిత్రబృందం. నాగచైతన్య లుక్ చూశాక అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాధవన్, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
అసలు సవ్యసాచి అంటే ఎవరు?
సాక్షి, సినిమా : రెండు చేతుల్ని సమర్థంగా.. శక్తివంతంగా వాడేవాళ్లనే సవ్యసాచి అంటారు. అదే టైటిల్ను నాగ చైతన్య కొత్త చిత్రానికి ఫిక్స్ చేయగా.. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్లుక్ను మేకర్లు విడుదల చేశారు. మహాభారతంలో అర్జునుడి అయిదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్య ప్రదర్శించగలడు. అలాగే ఈ చిత్రంలో హీరో రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు అంటూ ఓ సందేశంతో పోస్టర్ను వదిలారు. బ్యాక్ గ్రౌండ్లో చేతులు.. వాటిపై రాతలు... సీరియస్గా ఉన్న చైతూ లుక్ ఆకట్టుకునేలా ఉంది. మైత్రి మూమీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా.. నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. మాధవన్, భూమికలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సవ్యసాచి వస్తున్నాడు
సేమ్ వపర్. రైట్ హ్యాండ్కి ఎంత పవర్ ఉందో.. సేమ్ పవర్ లెఫ్ట్ హ్యాండ్కి కూడా ఉందతనికి. మరి ఈ ఎక్స్ట్రా పవర్తో అతను ఎక్స్ట్రీమ్గా ఏం చేశాడో తెలుసుకోవాలంటే ‘సవ్యసాచి’ సినిమా చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ౖవై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మార్చి 18న రిలీజ్ చేసి, చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రస్తుతం నాగచైతన్య, భూమిక, ఇతర ముఖ్య తారాగణంపై హైదరాబాద్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఆ తర్వాత యూఎస్లో మరో కీలక షెడ్యూల్ను ప్లాన్ చేశాం. కీరవాణి సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: యువరాజ్. ప్రేయసిగా శ్రీమతి మూడుముళ్లకు ముందు ముచ్చటగా మూడుసార్లు (ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం) స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగచైతన్య, సమంత. మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి నటించనున్నారని, ఆల్రెడీ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారని టాక్. -
‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్
‘ప్రేమమ్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ లు మాట్లాడుతూ.. ‘మా యూనిట్ సభ్యులందరికీ సవ్యసాచి ఒక స్పెషల్ ఫిలిం. ప్రస్తుతం హైద్రాబాద్ లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే సవ్యసాచి చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కీరవాణి గారు సవ్యసాచికి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. -
నాగచైతన్య ‘ప్రేయసి’..?
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు ఈ యంగ్ హీరో. నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ఆ వదంతులు నమ్మవద్దు: చైతూ
హైదరాబాద్: సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగచైతన్య. తాను రెండు కొత్త మూవీలకు ఒకే చెప్పినట్లుగా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయని, అవన్నీ వదంతులేనని వాటిని పట్టించుకోవద్దని తన అభిమానులకు చైతూ తెలిపారు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకుంటే త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తన ప్రస్తుత మూవీ ప్రాజెక్టుల గురించి వివరించారు. 'నా లేటెస్ట్ ప్రాజెక్ట్లకు సంబంధించి వచ్చిన కథనాల్లో నిజం లేదు. సవ్యసాచితో పాటు దర్శకుడు మారుతితో చేస్తున్న మూవీల షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది నావద్దకు మంచి స్క్రిప్ట్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ రెండు మూవీలు కాకుండా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నా లేటెస్ట్ సినిమాల అప్డేట్స్ నిజం కాదు. నా తర్వాతి ప్రాజెక్టుల గురించి త్వరలోనే వెల్లడిస్తానంటూ' హీరో నాగచైతన్య ట్వీట్ చేశారు. చైతూ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సర్ధార్ గబ్బర్ సింగ్తో నిరాశ పరిచినా ఎన్టీఆర్తో జైలవకువ లాంటి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొత్త మూవీలో చైతూ నటించనున్నాడని ప్రచారం జరిగింది. బాబీతో మూవీకి ఒకే చెప్పడంతో పాటు 'నిన్ను కోరి' ఫేం శివ ఇర్వాణ డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కానీ షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజులు సమయం తీసుకుంటారని అప్డేట్స్ వచ్చాయి. అయితే వీటిలో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'తో పాటు మారుతి డైరెక్షన్లో 'శైలాజా రెడ్డి అల్లుడు' షూటింగ్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. Some news today reporting my next projects which isn’t true..shooting fr savyasachi & Maruthi Garu’s film,excited with the way both films are shaping up.been blessed this year listening to some really nice content.will announce my next soon,whatever you hear otherwise is NOT TRUE — chaitanya akkineni (@chay_akkineni) 22 February 2018 -
చైతూతో ఎన్టీఆర్ డైరెక్టర్..?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు బాబీ.. తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించిన బాబీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ‘నిన్ను కోరి’ ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితేగాని బాబీ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. మరి బాబీ అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేక ఈ లోపు మరో సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి. -
ముహూర్తం కుదిరిందా?
‘సవ్యసాచి’ సినిమా రిలీజ్కు మూహూర్తం కుదిరిందా? అంటే.. అవుననే సమాధానమే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో ఇప్పుడు వినిపిస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ కథానాయిక. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే... ఈ సినిమాను తొలుత రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్గా ‘సవ్యసాచి’ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘100పర్సెంట్ లవ్’, ‘మనం’,‘తడాఖా’, ‘రారండోయ్ వేడుక చుద్దాం’ చిత్రాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి... నాగచైతన్యకు కలిసొచ్చిన మే మంత్లోనే ‘సవ్యసాచి’ చిత్రం రిలీజ్ అవుతుందా? లేక వేరే రిలీజ్ డేట్ను ఎనౌన్స్ చేస్తారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. -
నాగచైతన్య స్వార్థపరుడు..!
పెళ్లి తరువాత తిరిగి షూటింగ్ లతో బిజీ అయిన అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ప్రకటించినట్టుగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతన్య. మారుతి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తన సినిమాల్లో హీరోలకు ఏదో ఒక వీక్నెస్ పెట్టే దర్శకుడు మారుతి, నాగచైతన్యను స్వార్థపరుడిగా చూపించనున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించనుంది. -
గృహప్రవేశం
సినీ స్టార్కి ఒక హౌస్ నచ్చాలంటే అది ఎలా ఉండాలి? సూపర్బ్ డిజైన్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఫర్నిచర్తో అదిరిపోవాలి. అలాంటి ఇల్లు కట్టాలంటే ఎట్లీస్ట్ వన్ ఇయర్ టైమ్ పడుతుంది. కానీ, యాక్టర్ మాధవన్ ఇంటిని మాత్రం హైదరాబాద్లో 25 డేస్లో కట్టేశారు. భాగ్యనగరానికి ఆయనెప్పుడు మకాం మార్చారు? అనే డౌట్ క్లారిఫై కావాలంటే మేటర్కు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేయండి. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమాలో మాధవన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ను సిక్స్ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసిన షెడ్యూల్లో మాధవన్ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మాధవన్ ఉండే ఇంటిని సెట్గా వేయించారు నిర్మాతలు. ఇది కాస్ట్లీ సెట్ అని, పూర్తవడానికి 25 రోజులు పట్టిందని పేర్కొన్నారు. అంటే.. మాధవన్ రీల్ లైఫ్లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారన్నమాట. అన్నట్లు.. రామ్చరణ్ ‘రంగస్థలం’లో అసలు సిసలు పల్లెటూరిని తలపించేలా బ్రహ్మాండంగా సెట్స్ వేసిన రామకృష్ణనే ‘సవ్యసాచి’కి కూడా ఆర్ట్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘నీలో మంచి బ్రదర్ ఉన్నాడని నాకు తెలుసు. కానీ, సౌత్ మొత్తం నిన్ను ఇష్టపడుతున్నారు. దానికి కారణం నువ్వు మంచి హ్యూమన్ బీయింగ్. నీతో కలసి సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అని నాగచైతన్య బర్త్డే (నవంబర్ 21) సందర్భంగా మాధవన్ అంటే, ‘‘నువ్వు మా సినిమాలోకి వచ్చినందుకు ఎగై్జటింగ్గా ఉంది’’ అని చైతూ అన్నారు. ఈ మాటలను బట్టి ఈ ఇద్దరూ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతాయని కూడా ఊహించవచ్చు. -
చైతూ హీరోయిన్ కూడా నో చెప్పేసింది
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో రెండు చేతులా సంపాదించేస్తున్నారు మన తారలు. అయితే ఈ విషయంలో హీరోయిన్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వివాదాలు తావివ్వకుండా తాము ప్రచారం చేయాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫెయిర్ నెస్ క్రీములకు ప్రచార కర్తలుగా వ్యవహరించేందుకు నో చెప్పారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ యువ కథానాయిక వచ్చి చేరింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నాగచైతన్య సినిమా సవ్యసాచితో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చి భామ కావటంతో వెంటనే బ్రాండ్ అంబాసిడర్ గానూ ఆఫర్స్ వస్తున్నాయి. అలా వచ్చిన ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కు ఈ బ్యూటీ నో చెప్పేసిందట. ఎంత డబ్బు ఇచ్చినా.. ఫెయిర్ నెస్ క్రీములను ప్రమోట్ చేయనని చెప్పేసిందట. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సవ్యసాచి'
పెళ్లి తరువాత నాగచైతన్య నటిస్తున్న సినిమా సవ్యసాచి. ప్రేమమ్ సినిమాతో నాగచైతన్యకు బిగెస్ట్ హిట్ అందించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఒక వ్యక్తి రెండు చేతుల్లో ఒక చెయ్యి అతని మాట వినకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమాతో నిధి అగర్వాల్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలంధిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ హీరో ఇమేజ్ కోసం కష్టపడుతున్న నాగచైతన్యకు ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
అంతా సవ్యంగా...
యస్... నాగచైతన్య–చందూ మొండేటి–మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీకి అంతా సవ్యంగా జరుగుతోంది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ. ఆర్టిస్టులు రెడీ. ఇప్పుడు షూటింగ్కి కూడా అంతా రెడీ అయిపోయింది. సినిమా టైటిల్ ‘సవ్యసాచి’. అంటే... రెండు చేతులకూ సమాన బలం ఉన్నవాడు అని అర్థం. సినిమాలో చైతూ లెఫ్ట్ హ్యాండ్ అతని మాట వినదు. అసలు కంట్రోల్లో ఉండదు. కానీ, సినిమాని ఫుల్ కంట్రోల్లో తీస్తామని, సవ్యంగా జరిగేలా ప్లాన్ చేశామని చిత్రబృందం అంటోంది. మొత్తానికి చైతూని వెరైటీ రోల్లో చూడబోతున్నామని టైటిల్ చెబుతోంది. వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తోన్న ఈ చిత్రం బుధవారం మొదలైంది. హైదరాబాద్లో వేసిన సెట్లో షూటింగ్ మొదలుపెట్టారు. బాలీవుడ్ భామ నిధీ అగర్వాల్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మాధవన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాగచైతన్య–చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్’ ఎంత హిట్టయిందో తెలిసిందే. అది ప్రేమకథా చిత్రమైతే.. ఇది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. హీరో క్యారెక్టరైజేషన్కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్ టైటిల్. ఫస్ట్ షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుంది. హీరో, హీరోయిన్, ‘వెన్నెల’ కిశోర్, సత్య కాంబినేషన్లో సీన్స్ తీస్తాం. డిసెంబర్లో జరిగే షెడ్యూల్లో మాధవన్ పాల్గొంటారు’’ అన్నారు. రావు రమేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం. కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈవో: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పీటీ గిరిధర్. -
పెళ్లి తరువాత తొలిసారి సెట్స్కు..!
ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ లవ్ కపుల్ నాగచైతన్య, సమంతలు తిరిగి షూటింగ్లకు హాజరవుతున్నారు. సమంత ఇప్పటికే రంగస్థలం యూనిట్ తో జాయిన్ అవ్వగా ఈ రోజు నుంచి నాగచైతన్య కూడా షూటింగ్కు హాజరయ్యాడు. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిథి అగర్వాల్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్నఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణీ స్వరాలందిస్తున్నారు. ఈరోజు షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని కన్ఫమ్ చేస్తూ సవ్యసాచి సెట్లో యూనిట్తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన చైతూ ‘తిరిగి పని ప్రారంభించాం’ అంటూ కామెంట్ చేశాడు. సవ్యసాచి సినిమా సెట్స్ మీద ఉండగానే మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించనున్నాడు ఈ అక్కినేని అందగాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సవ్యసాచి తొలి షెడ్యూల్ పూర్తయిన తరువాత శైలజా రెడ్డి అల్లుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. Back to work ! #Savyasachi pic.twitter.com/ymZkj82YUL — chaitanya akkineni (@chay_akkineni) 8 November 2017 -
సవ్యసాచికి సీనియర్ సపోర్ట్
యుద్ధం శరణం సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నాగచైతన్య, ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంతతో పెళ్లి తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాలతో బిజీ అయ్యేలా ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేశాడు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి ఘనవిజయం అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేయనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొంతకాలంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు సంగీతమందించనున్నాడట. అక్కినేని ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండటంతో కీరవాణి ఈ సినిమాకు సంగీతమందించేందుకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. -
చైతూ జోడిగా బాలీవుడ్ బ్యూటీ
ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో కనిపించిన అక్కినేని హీరో నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అయితే ఆ ప్రభావం తన తదుపరి చిత్రాల మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడు చైతూ. అందుకే త్వరలో ప్రారంభం కానున్న సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రేమమ్ సినిమాతో తనకు ఘనవిజయం అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చైతన్య. సవ్యసాఛి పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది. కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటి నిధి అగర్వాల్ ను ఫైనల్ చేశారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన నిధి, తొలి సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా.. హాట్ బ్యూటీ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఇప్పుడు సక్సెస్ కోసం సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది. మరి నాగచైతన్య అయిన ఈ భామకు సక్సెస్ అందిస్తాడేమో చూడాలి. -
నాగచైతన్యతో కోలీవుడ్ సీనియర్ హీరో..!
యుద్ధం శరణం సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నాగచైతన్య, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి ఘనవిజయాన్ని అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాఛి సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు చైతూ. ఇప్పటికే రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకపాత్రలో కోలీవుడ్ నటుడు మాధవన్ నటించనున్నాడు. సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మాధవన్ తరువాత కూడా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. త్వరలో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
అచ్చంగా అర్జునుడిలా...
అర్జునుడు సవ్యసాచి. కురుక్షేత్ర రణరంగంలో ఈ ధీశాలి రెండు చేతులతో శత్రువులపై బాణాలు సంధించాడు. నాగచైతన్య కూడా అచ్చంగా అర్జునుడిలానే. అప్పుడు అర్జునుడు బాణాలు వేయ గలిగితే, ఇప్పుడు చైతూ రెండు చేతులతో శూలాలు వేయగ లుగుతాడు. ఇదంతా సినిమా కోసమేనని ఊహించే ఉంటారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ‘సవ్యసాచి’ చిత్రంలో చైతూ పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ లోగోను, ప్రీ–లుక్ను బుధవారం విడుదల చేశారు. ‘‘చందు మొండేటి రాసిన హీరో క్యారెక్టరైజేషన్కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్ టైటిల్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ‘ప్రేమమ్’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటిల హిట్ కాంబినేషన్ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.