Selection Committee
-
నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్(61) పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సౌత్బ్లాక్లో సమావేశమైంది. మోదీతోపాటు కమిటీలో సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎంపిక చేశారు. కొత్త సీఈసీ పేరును సెలక్షన్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఎంపికైనట్లు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఆయన ఈ నెల 19న బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ పదవీ కాలం 2029 జనవరి 26 దాకా ఉంది. అలాగే ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ స్థానంలో హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు. కొత్తం చట్టం కింద తొలి సీఈసీ 1988 బ్యాచ్ కేరళక్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తిచేశారు. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించారు. కేరళలో ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సేవలందించారు. కేంద్ర సరీ్వసుల్లో చేరి, రక్షణ శాఖలో జాయింట్ సెక్రెటరీగా సేవలందించారు. హోంశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ఆయన ఆధ్వర్యంలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన 2024 మార్చి 15న ఎన్నికల సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నప్పుడు ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసులో కేంద్రానికి సహకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞానేశ్ కుమార్ సన్నిహితుడిగా పేరుంది. సమావేశం వాయిదా వేయాలన్న కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ తొలుత డిమాండ్ చేసింది. సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉందని వెల్లడించింది. కోర్టులో విచారణ పూర్తయ్యేదాకా కమిటీ సమావేశం నిర్వహించవద్దని కోరింది. సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర మంత్రిని నియమించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత అభిõÙక్ మనూ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడం తగదని సూచించారు. -
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా అజయ్ రాత్రా
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా టీమిండియా మాజీ వికెట్కీపర్, బ్యాటర్ అజయ్ రాత్రా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం (సెప్టెంబర్ 3) ప్రకటించింది. మాజీ సభ్యుడు సలీల్ అంకోలా స్థానాన్ని రాత్రా భర్తీ చేస్తాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అంకోలా ఇద్దరూ ఒకే జోన్కు (వెస్ట్) చెందిన వారు కావడంతో అంకోలా సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. రాత్రా నార్త్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీథరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. తాజాగా రాత్రా వీరి సరసన చేరాడు. 2002లో టీమిండియా తరఫున 6 టెస్ట్లు, 12 వన్డేలు ఆడిన రాత్రా దేశవాలీ క్రికెట్లో అసోం, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ హెడ్ కోచ్గా పని చేశాడు. అతను 2023 దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్లో సభ్యుడిగా ఉన్నాడు. అజయ్ రాత్రా టెస్ట్ల్లో టీమిండియా తరఫున ఓ సెంచరీ చేశాడు. -
BCCI: బీసీసీఐ సెలక్టర్పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల
BCCI Men's Senior Selection Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి మెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీలోని ఓ సభ్యుడిపై వేటు పడింది. అతడి స్థానంలో కొత్త మెంబర్ను నియమించేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లోనే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అతడిపై వేటు అయితే, అనేక చర్చల అనంతరం మళ్లీ చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్గా నియమించిన బోర్డు.. సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శివ్ సుందర్ దాస్, ఎస్.శరత్లకు కమిటీలో సభ్యులుగా చోటిచ్చింది. అయితే, ఓ వార్తా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ భారత క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వేటు వేసింది బీసీసీఐ. చాలాకాలం పాటు చీఫ్ సెలక్టర్ పోస్టు ఖాళీగా ఉన్న తరుణంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆ పదవిని చేపట్టేలా బోర్డు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ పనిచేస్తోంది. త్యాగం చేయాల్సి వస్తోంది అయితే, ఇందులో భాగమైన సలీల్ అంకోలా తన పదవిని త్యాగం చేయాల్సి వస్తోంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ సహా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల నుంచి ఒక్కో సభ్యుడు ఉండాలి. ప్రస్తుతం ఉన్న కమిటీలో అగార్కర్, సలీల్ వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. శివ సుందర్ ఈస్ట్, శరత్ సౌత్, సుబ్రతో బెనర్జీ సెంట్రల్ జోన్ నుంచి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అగార్కర్ను కొనసాగించేందుకు నిర్ణయించిన బీసీసీఐ వెస్ట్ నుంచి అదనపు సభ్యుడిగా ఉన్న సలీల్ అంకోలాను తప్పించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త మెంబర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సెలక్షన్ కమిటీ మెంబర్ కావాలంటే అర్హతలు ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి. 10 అంతర్జాతీయ వన్డేలు లేదంటే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. అదే విధంగా ఆట నుంచి రిటైర్ అయ్యి ఐదేళ్లు పూర్తై ఉండాలి. అదే విధంగా.. గత ఐదేళ్లకాలంలో ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. కాగా బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు జనవరి 25, సాయంత్రం ఆరు లోగా తమ అప్లికేషన్ సమర్పించాలి. -
వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. ఒత్తిళ్ల కారణంగా: సంజూ
తన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల మీద మాత్రమే తాను దృష్టి పెడతానని టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. అంతేతప్ప తనకు తగిలిన ఎదురుదెబ్బల గురించి ఆలోచిస్తూ.. అందుకు కారణమైన వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండిపోనని స్పష్టం చేశాడు. కాగా వన్డే ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్తో పోలిస్తే మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ సంజూకు వన్డే వరల్డ్కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. అంతకు ముందు కీలక సిరీస్లలోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్కు అన్యాయం జరుగుతోందంటూ బీసీసీఐపై ఇప్పటికే అనేకసార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు ఈ కేరళ బ్యాటర్. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన మూడు మ్యాచ్ల సిరీస్లో సంజూ కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాడు. అయితే, మొదటి రెండు వన్డేల్లో ప్రభావం చూపలేకపోయిన సంజూ శాంసన్.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. తద్వారా సిరీస్ టీమిండియా సొంతమైంది. ఇక ఎనిమిదేళ్ల కెరీర్లో సంజూకు ఇదే తొలి శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా క్రికెటర్గా.. మీడియా ఒత్తిడి, మైదానం లోపల.. వెలుపలా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కోల్పోకుండా ఉండటమే ముఖ్యం. నా మనసును ఎలా నియంత్రించుకోవాలన్న విషయం మీదే దృష్టి పెడతాను. బయట చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు. కానీ.. నేను మాత్రం ఎల్లప్పుడూ నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తాను. నా లోటుపాట్లు సరిదిద్దుకోవడం, వైఫల్యాలను అధిగమించడంపై ఫోకస్ చేస్తా. అంతేకానీ.. నేను మిస్సైన ఈవెంట్ల గురించి ప్రస్తావిస్తూ.. అందుకు కారణమైన వారి గురించి ఫిర్యాదులు చేస్తూ కూర్చోను. నా నైపుణ్యాలకు ఎలా సానపెట్టాలి? నేను ఓపికగా ఉండగలుగుతున్నానా? స్థాయికి తగ్గట్లు ఆడుతున్నానా? అన్న విషయాల గురించే ఆలోచిస్తా. విజయ్ హజారే ట్రోఫీలో కేరళ సారథిగా నేను ఎంతో కఠిన శ్రమకోర్చాను. ఆలోచనలను నియంత్రించుకుంటూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికలను అమలు చేశాను’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2023లో సంజూ ఎనిమిది మ్యాచ్లు ఆడి 293 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్కు ఎంపికయ్యాడు. చదవండి: టీమిండియాకు ఊహించని షాక్.. సూర్యకుమార్ గాయం తీవ్రం! నెలల పాటు.. -
గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని మోదీకి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. 1995లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ సభాపతి, లోక్సభలో విపక్షనేత, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అహింసాయుత పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రహీతలకు రూ. కోటి నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
తిలక్ పేరులో ‘లక్’ ఉంది. ఈ ‘లక్’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్లో ఈ నిలకడే భారత టీమ్ మేనేజ్మెంట్ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది. ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) డివిజన్ లీగ్ క్రికెట్లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చాక లీగ్లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ ఆ సీజన్లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్రేట్తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లోనూ 11 మ్యాచ్ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్ రేట్తో 343 పరుగులు చేశాడు. సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్రేట్ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు. విండీస్లో సిక్సర్లతో... అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా గుర్తించి కరీబియన్ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ వదులుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెపె్టన్ హార్దిక్ పాండ్యాల గేమ్ ప్లాన్లో భాగమైన తిలక్... విండీస్ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్ స్కోర్! తర్వాత మూడు మ్యాచ్ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్గా 173 పరుగులతో ఈ సిరీస్లో భారత టాప్ స్కోరర్గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్ రోహిత్ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు. ఆసియా కప్, ప్రపంచకప్లపై... యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్ను ఊరిస్తోంది. ఆసియా కప్లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్ మ్యాచ్కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. –సాక్షి క్రీడా విభాగం -
టీమిండియా చీఫ్ సెలక్టర్గా చేతన్ శర్మ.. బీసీసీఐ ప్రకటన
భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా చేతన్ శర్మ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం వెల్లడించింది. చేతన్తో పాటు ఈ సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్కు చోటు దక్కింది. కాగా టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతన్ శర్మ చైర్మన్గా ఉన్న కమిటీని రద్దు చేసి ఖాళీ స్థానాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో మరోసారి చేతన్ శర్మ వైపే మొగ్గు చూపిన బీసీసీఐ పెద్దలు అతడిని అప్లై చేసుకోవాల్సిందిగా సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆలిండియా మెన్ సెలక్షన్ కమిటీని ఖరారు చేసింది. నవంబరు 18న 5 పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 600 మంది అప్లై చేసినట్లు పేర్కొంది. వీరిలో 11 మందిని షార్ట్లిస్ట్ చేసి చివరగా కావాల్సిన ఐదుగురిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ కమిటీకి చైర్మన్గా చేతన్ శర్మ ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. చదవండి: కొంచెం చూడరా బాబు.. బంతి వేయకముందే పిచ్ మధ్యలోకి! వీడియో వైరల్ -
రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? టీమిండియా చీఫ్ సెలక్టర్గా మళ్లీ అతడే!
Team India Chief Selector: టీమిండియా చీఫ్ సెలక్టర్గా చేతన్ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెలక్షన్ కమిటీ విషయంలో ఈ మాజీ పేసర్కే భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కాగా 2020 డిసెంబరులో సునిల్ జోషి స్థానంలో సెలక్షన్ కమిటీ చైర్మన్గా చేతన్ శర్మ నియమితుడయ్యాడు. ఈ క్రమంలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఈ పంజాబ్ క్రికెటర్కు టీ20 ప్రపంచకప్-2022 తర్వాత చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్, వరల్డ్కప్ ఈవెంట్లలో టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసింది బీసీసీఐ. ప్రక్షాళన చర్యల్లో భాగంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. చేతన్ శర్మనే మరోసారి చీఫ్ సెలక్టర్ చేసేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చేతన్ శర్మను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. నిబంధనలకు అనుగుణంగానే చేతన్తో పాటు హర్వీందర్ సింగ్ కూడా తన పదవిలో కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సెలక్షన్ ప్యానెల్లో వీరితో పాటు 13 మంది పేర్లు షార్ట్లిస్టు అయినట్లు తెలుస్తోంది. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి కోసం పోటీపడ్డ వెంకటేశ్ ప్రసాద్కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన వైఫల్యం నేపథ్యంలో నవంబరులో సెలక్షన్ కమిటీని రద్దు చేశారు. సెమీస్లోనే భారత్ ఇంటిబాట పట్టిన తరుణంలో ఈ మేరకు సెలక్టర్లపై వేటు వేశారు. ఈ క్రమంలో ఖాళీ స్థానాల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రెస్నోట్ రిలీజ్లో.. ఇందుకు గల అర్హతలను ప్రస్తావించింది. ‘‘కనీసం ఏడు టెస్టు మ్యాచ్లు లేదంటే, 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన వారు. అదే విధంగా ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు’’ అర్హులు అని పేర్కొంది. చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్తో ఆషామాషీ కాదు! అర్ష్దీప్పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
BCCI: ఊహాగానాలకు తెర.. జనవరిలో కొత్త సెలెక్షన్ కమిటీ
బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు గురించి వస్తున్న ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ఈ నెలాఖరులోగా కమిటీ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పడనుందని సమాచారం. ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా మండలి కొత్త సెలక్షన్ కమిటీ సభ్యలను ఎంపిక చేయనుంది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్లు ముంబైలోని బీసీసీఐ ఆఫీసులో డిసెంబర్ 30వ తేదీన సమావేశం కానున్నారు. బీసీసీఐ అధికారులతో చర్చించి సెలక్షన్ కమిటీ సభ్యులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంపికైన వాళ్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 2011 తర్వాత ఒక్క మోగా టోర్నమెంట్లో కూడా టీమిండియా విజేతగా నిలవలేదు. దీంతో వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ ట్రోఫీపై భారత జట్టు కన్నేసింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన ఆసియా కప్లో భారత జట్టు చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం జట్టు కూర్పుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో చేతన్ శర్మ కమిటీని రద్దు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. సెలక్షన్ కమిటీపై నవంబర్లో బీసీసీఐ వేటు వేసింది. ఆ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవాళ్లకు ఉండాల్సిన అర్హతలను బీసీసీఐ స్పష్టంగా నోటిఫికేషన్లో వెల్లడించింది. చదవండి: Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్గా -
IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు!
బీసీసీఐకి ఇది కొత్త కాదు... ఏదైనా సిరీస్ కోసం జట్టును దాదాపు అర్ధరాత్రి సమయంలో ప్రకటించడమే కాదు... పేర్లు మినహా ఎంపిక గురించి కనీసం ఏకవాక్య సమాచారం కూడా ఇవ్వకపోవడం రివాజుగా మారింది. ఫలానా ఆటగాడిపై వేటు వేశామనో, ఫిట్నెస్ లేదనో, లేదంటే విశ్రాంతినిచ్చామనో, లేదా ఆటగాడు కోరుకుంటే విరామం ఇచ్చామనో ఏమీ ఉండదు... తగిన కారణం లేకుండా ఆటగాళ్లు పేర్లు మాత్రం మారిపోతాయి. మరో వైపు ఉద్వాసనకు గురైన సెలక్షన్ కమిటీతోనే కొత్త జట్లను కూడా ఎంపిక చేయించడం కూడా ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంకతో సిరీస్లకు ప్రకటించిన జట్లను విశ్లేషిస్తే... వచ్చే ఏడాది స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ కీలక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే నిర్ణయాలే తీసుకుంది. అందువల్లే రోహిత్, కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, రాహుల్లను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. అందులో కొందరిని టి20లకు తీసుకుంటే... మరికొందరిని వన్డేలకు ఎంపిక చేసింది. బుమ్రాలాంటి ఆటగాడిని ప్రపంచకప్ దృష్టితో చూసి ఏ సిరీస్కూ ఎంపిక చేయలేదు. నిజానికి అతను ఫిట్గానే ఉన్నాడు. అయితే తొందరపడి వెంటనే అంతర్జాతీయ క్రికెట్ బరిలో ఇప్పుడపుడే దింపకూడదని సెలక్టర్లు భావించారు. బంగ్లాలో గాయపడిన రోహిత్ ప్రస్తుతం కోలుకున్నాడు. నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంకో వారం, పదిరోజుల్లో అతను పూర్తి ఫిట్నెస్ సంతరించుకుంటాడు. అందువల్లే అతన్ని వన్డేలకు ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి కోరకపోయినప్పటికీ సెలక్టర్లే టి20లకు రెస్ట్ ఇచ్చి వన్డే జట్టులోకి తీసుకున్నారు. బుమ్రాను ప్రపంచకప్ దృష్టితో చూసినట్టే... రిషభ్ పంత్ను సొంతగడ్డపై ఆసీస్తో జరిగే టెస్టు సిరీస్ కోసం బ్రేక్ ఇచ్చారు. కంగరూతో సిరీస్లో కీలకపాత్ర పోషించగలడని భావిస్తున్న పంత్ను కండిషనింగ్ క్యాంపునకు పంపారు. ఈ ఏడాది అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 44 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. బిజీ షెడ్యూలు నుంచి కాస్త తెరిపినివ్వాలనే ఉద్దేశంతోనే అతన్ని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారు. జడేజా విషయానికి వస్తే ముందుగా అతని మ్యాచ్ ఫిట్నెస్ను పరిశీలించాకే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీ భావించింది. గత సీజన్లో పేస్ బౌలింగ్తో ఆకట్టుకున్న ప్రసిధ్ కృష్ణ, ఆల్రౌండర్ దీపక్ చహర్ గాయాల నుంచి ఇంకా వంద శాతం కోలుకోలేదు. సీనియర్ సీమర్ భువనేశ్వర్ను అసలు పరిశీలించలేదు. దీంతో వచ్చే ప్రపంచకప్లో ఆడే టీమిండియా జట్టులో భువనేశ్వర్ భాగంగా లేడని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చినట్లయింది. స్పిన్నర్లలో అనుభవజ్ఞుడైన చహల్పైనే సెలక్టర్లు నమ్మకముంచారు. దీంతో రవి బిష్ణోయ్కి అవకాశం లేకపోయింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, హైదరాబాద్ పేసర్ సిరాజ్లు ఫామ్లోనే ఉన్నారు. వారి ఆటతీరుపై సెలక్టర్లకు అసంతృప్తి ఏమీ లేదు... కానీ పొట్టి సిరీస్కు మాత్రం వీళ్లిద్దరికి విశ్రాంతినిచ్చింది. భావి కెప్టెన్ అంచనాలతో... హార్దిక్ పాండ్యా నాయకత్వ సత్తా ఏంటో ఐపీఎల్లో ఒకే ఒక్క సీజన్తో చాటిచెప్పాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలోనూ పగ్గాలు చేపట్టి జట్టును నడిపించాడు. ఈ నేపథ్యంలో భావి కెప్టెన్ అంచనాలున్న ఆల్రౌండర్ పాండ్యాకు జట్టులో ఒక రకంగా పూర్తి స్థాయి వైస్ కెప్టెన్సీతో పదోన్నతి ఇచ్చారు. టాపార్డర్లో ఇటీవల మంచి అవకాశాలు కల్పించినప్పటికీ పేలవమైన ఆటతీరు కనబరిచిన ధావన్పై సెలక్టర్లు వేటు వేశారు. ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్లాంటి ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తుండటంతో ఇక ధావన్ ఆటకు తెరపడినట్లే భావించవచ్చు. -సాక్షి క్రీడా విభాగం చదవండి: సిరీస్ ఓటమిపై బీసీబీ ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా -
BCCI: తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన మాజీ ఆల్రౌండర్
BCCI Selection Committee: జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ హేమంగ్ బదానీ స్పందించాడు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టిపడేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ పానెల్లో భాగం కావడం గొప్ప గౌరవమని.. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఎలాంటి పోస్టుకు అప్లై చేయలేదని స్పష్టం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లోనూ టీమిండియా సెమీస్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా మేజర్ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త సెలక్షన్ కమిటీ నియామకం నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించేందుకు నవంబరు 28ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో హేమంగ్ బదానీ కూడా అప్లై చేశారని, అంతేగాక సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో కూడా ఉన్నాడంటూ అతడి పేరు వార్తల్లో నిలిచింది. నేనసలు అప్లై చేయలేదు ఈ విషయంపై స్పందించిన హేమంగ్ బదానీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. మీ అందరికీ ఓ విషయంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాను. బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండటం గొప్ప గౌరవం. అయితే, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా నేను సెలక్షన్ కమిటీ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ బుధవారం ట్వీట్ చేశాడు. కాగా తమిళనాడు ఆల్రౌండర్ హేమంగ్ బదానీ.. 2000- 2004 వరకు టీమిండియా తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా, లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్, సలీల్ అంకోలా తదితరులు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు. చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్ 🙏🏽🙏🏽 pic.twitter.com/WX2I1vXRxf — Hemang Badani (@hemangkbadani) November 30, 2022 -
BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలెక్షన్ కమిటీ రేసులో కొత్త పేర్లు
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు.. సౌత్ జోన్.. హేమంగ్ బదానీ కన్వల్జిత్ సింగ్ వెస్ట్ జోన్.. మణిందర్ సింగ్ నయన్ మోంగియా సలీల్ అంకోలా సమీర్ దీఘే సెంట్రల్ అండ్ నార్త్ జోన్.. అజయ్ రాత్రా గ్యాను పాండే అమయ్ ఖురాసియా అతుల్ వాసన్ నిఖిల్ చోప్రా రితేందర్ సింగ్ సోధి ఈస్ట్ జోన్.. శివ్ సుందర్ దాస్ ప్రభంజన్ మల్లిక్ ఆర్ఆర్ పరిడా శుభోమోయ్ దాస్ ఎస్ లహిరి -
BCCI: కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరంటే..?
టీ20 వరల్డ్కప్-2022, అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం విధితమే. ఈ కమిటీకి చైర్మన్గా చేతన్ శర్మ ఉండగా, హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. సెలక్షన్ కమిటీ రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామకృష్ణన్కు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్గా శివరామకృష్ణన్ పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. రేసులో ఉన్న అజత్ అగార్కర్కు కూడా బోర్డులోని పలువురు ప్రముఖుల మద్దతు ఉండటంతో అతని అభ్యర్ధిత్వాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు.. కనీసం 7 టెస్టు మ్యాచ్లు లేదా 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి క్రికెట్కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యి ఉండాలి ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు -
సెలెక్షన్ కమిటీని హఠాత్తుగా తొలగించడానికి కారణాలివే..!
చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసిన నేపథ్యంలో యావత్ భారత క్రికెట్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. భారత క్రికెట్ చరిత్రలో జాతీయ సెలక్షన్ కమిటీని ఇలా హఠాత్తుగా తొలగించిన దాఖలాలు లేకపోవడంతో సర్వత్రా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. భారత క్రికెట్లో చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంపై అంతార్జతీయ క్రికెట్ సర్కిల్స్లో సైతం చర్చ జోరుగా సాగుతుంది. ఇంత ఆదరాబాదరాగా సెలెక్షన్ ప్యానెల్పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందోనని నెటిజన్లు ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే సెలెక్షన్ కమిటీపై వేటుకు గట్టి కారణాలే ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 2021 జనవరిలో చేతన్ శర్మ నేతృత్వంలో సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్)లతో కూడిన జాతీయ సెలెక్షన్ కమిటీ ఎన్నికైంది. నాటి నుంచి కమిటీ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా, నాసిరకంగా ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చింది. వీరి హయాంలో టీమిండియా.. 2021 టీ20 వరల్డ్కప్లో కనీసం నాకౌట్ స్టేజ్కు కూడా చేరలేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఈ ఏడాది ఆసియా కప్లో సూపర్-4లోనే పరాభవం తాజాగా టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే నిష్క్రమణ బుమ్రా, జడేజా పూర్తి ఫిట్గా లేకపోయినా ఎంపిక చేయడం ఏడాదికి 8 మంది కెప్టెన్లను మార్చడం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు ఎంపిక చేసిన జట్లలో సమతూకం లోపించడం ఇలా పై పేర్కొన్న అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ చేతన్ శర్మ టీమ్కు ఉద్వాసన పలికినట్లు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఇదే నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది. చదవండి: బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు -
బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ట్విటర్ ద్వారా వెల్లడించింది. దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుత కమిటీలో ఛైర్మన్గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) లు ఉన్నారు. గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది. 🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men). Details : https://t.co/inkWOSoMt9 — BCCI (@BCCI) November 18, 2022 ఇదీ చదవండి: వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్ భారత్కు అత్యవసరం -
బ్రాడ్మన్తో సరిసమానమైన గణాంకాలు.. అయినా ఏం ప్రయోజనం..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 ఇన్నింగ్స్ల తర్వాత లెజెండ్ డాన్ బ్రాడ్మన్తో సరిసమానమైన గణాంకాలు.. తానాడిన ఆఖరి 21 ఇన్నింగ్స్ల్లో 9 సెంచరీలు.. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు.. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ కెరీర్లో బ్రాడ్మన్ (95.14) తర్వాత అత్యధిక సగటు (81.49).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం తరం యువ క్రికెటర్లలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సాధించినటువంటి ఈ గణాంకాలు మరే ఇతర క్రికెటర్ సాధించలేదనే చెప్పాలి. అయితే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఈ ఆటగాడికి టీమిండియా తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. దేశవాళీ టోర్నీల్లో భీభత్సమైన ఫామ్లో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు ఈ ముంబైకర్ను కనీసం దేకట్లేదు. అడపాదడపా ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్న సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ 25 ఏళ్ల క్రికెటర్ను మాత్రం ఎంపిక చేయట్లేదు. బంగ్లాదేశ్ పర్యటన కోసం నిన్న (అక్టోబర్ 31) ప్రకటించిన టీమిండియాలో స్థానం ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్ ఖాన్.. తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. టీమిండియాకు ఆడటానికి ఇంతకంటే నేనేం చేయగలనని వాపోతున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు తనను చిన్న చూపు చూడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేస్తామని హామీ ఇచ్చిన సెలెక్టర్లు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్ఫరాజ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల సునామీ సృష్టిస్తున్నా ఇతన్ని ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని జాలి పడతున్నారు. నువ్వేమీ చేశావు నేరం.. నిన్నెక్కడంటిది పాపం అంటూ తెలుగు సినిమా పాటను గుర్తు చేస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు. కాగా, ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో భీకరమైన ఫామ్లో ఉండిన సర్ఫరాజ్ ఖాన్.. 982 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో 43 ఇన్నింగ్స్లు ఆడిన అతను.. 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. దిగ్గజ డాన్ బ్రాడ్మన్ గణాంకాలు కూడా 43 ఇన్నింగ్స్ల తర్వాత ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్మన్ కంటే ఓ పరుగు అధికంగానే సాధించాడు. Sarfaraz Khan now has one more run than the DON after 43 FC inns Don Bradman 22 matches, 8 no, 2927 runs, ave 83.63, 100s: 12, 50s: 9 Sarfaraz Khan 29 matches, 7 no, 2928 runs, ave 81.33, 100s: 10, 50s: 8 Note: In his next match in Jan 1930, Bradman made a record unbeaten 452! https://t.co/7HPwPl72fz — Mohandas Menon (@mohanstatsman) October 2, 2022 43 ఇన్నింగ్స్ల తర్వాత బ్రాడ్మన్ 83.63 సగటున 12 శతకాలు, 9 అర్ధశతకాల సాయంతో 2927 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అదే 43 ఇన్నింగ్స్ల తర్వాత 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. ఈ 43 ఇన్నింగ్స్ల్లో బ్రాడ్మన్ 8 సార్లు నాటౌట్గా నిలువగా.. సర్ఫరాజ్ 7 సార్ల నాటౌట్గా నిలిచాడు. ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ లాగే మరో ముంబై ఆటగాడు పృథ్వీ షా కూడా టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డాడు. బంగ్లా టూర్కు జట్టు ప్రకటన తర్వాత షా.. వైరాగ్యంతో కూడిన ఓ ట్వీట్ను కూడా చేశాడు. అంతా దేవుడు చూస్తున్నాడంటూ దేవుడిపై భారం వేశాడు. -
గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?!
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదా తొలగింపుపై ఎంత డ్రామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ మంగళవారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. కొత్త కార్యవర్గంలో రోజర్ బిన్నీ (అధ్యక్షుడు.. బీసీసీఐ కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా , సంయుక్త కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా,కోశాధికారిగా ఆశిష్ షెలార్లు నియమితులయ్యారు. గంగూలీని పదవి నుంచి తొలగించిన బీసీసీఐ ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్.. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వర్గంపై కన్నువేసింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 2020 డిసెంబర్లో కొత్త సెలక్షన్ కమిటీని నియమించాడు. సెలక్షన్ కమిటీలోచేతన్ శర్మతో పాటు అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతి ఉన్నారు. తాజాగా చేతన్ శర్మ బృంధం తమ పదవులను కోల్పోయే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. చేతన్ శర్మ పనితీరు పట్ల బీసీసీఐ కొత్త నాయకత్వం సంతృప్తిగా ఉన్నప్పటికి కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనే ధోరణిలోనే కొత్త పాలకవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన పనితీరు కనబరిచిన చేతన్ శర్మను తొలగించకపోయినా.. అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతిని సాగనంపడం ఖాయమని సమాచారం. టి20 ప్రపంచకప్లో టీమిండియా చేసే ప్రదర్శన ఆధారంగానే సెలక్షన్ కమిటీ పదవుల మార్పుపై ఒక స్పష్టత రానుంది. వీరి స్థానాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లు.. ఒడిశాకు చెందిన మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్, బెంగాల్ క్రికెటర్ దీప్ దాస్గుప్తా, జాతీయ జూనియర్ సెలెక్టర్ రణదేబ్ బోస్ సెలెక్షన్ కమిటీ పదవుల కోసం పోటీలో ఉండొచ్చని అంటున్నారు. అయితే వీరిలో రణదేబ్ బోస్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించకపోవడం అతనికి మైనస్. దీనిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం బెంగాల్కే చెందిన మాజీ వన్డే ప్లేయర్ లక్ష్మీ రతన్ శుక్లా లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్లో ఒకరిని తీసుకోవచ్చని తెలుస్తోంది. చదవండి: 'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా -
Zimbabwe vs India ODI series: చహర్ పునరాగమనం
ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత టీమ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‡్షదీప్లను కూడా ఈ టూర్కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, దీపక్ చహర్. -
రేపే సెలెక్టర్ల సమావేశం.. తేలనున్న 'ఆ నలుగురి' భవితవ్యం
Selectors And BCCI To Meet On Saturday Over Team India T20 World Cup Team: టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు చేర్పులు చేసేందుకు అక్టోబర్ 10 ఆఖరి తేదీ కావడంతో బీసీసీఐ, సెలెక్షన్ కమిటీలు రేపు(శనివారం) భేటీ కానున్నాయి. ఈ సందర్భంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల భవితవ్యంపై చర్చ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరచిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లతో పాటు మిస్టరీ స్పిన్నర్, కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తిలను జట్టులో కొనసాగించడంపై సెలెక్షన్ కమిటీ తీవ్ర కసరత్తే చేయనుంది. వీరిలో హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిల ఫిట్నెస్ సమస్య బీసీసీఐ సహా సెలెక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఈ నలుగురిని తప్పించి ఇతరులకు చోటు కల్పించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తే ఎవరెవరు జట్టులోకి వస్తారన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ ఇలాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఒకట్రెండు మార్పులు చేసినా.. అవి స్టాండ్ బై ఆటగాళ్లను దాటకపోవచ్చని సమాచారం. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లలో ఒకరిని తప్పించాలని భావిస్తే.. ఆ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్తో.. హార్దిక్ పాండ్యాపై వేటు వేయాలనుకుంటే శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్లలో ఒకరిని జట్టులోని తీసుకునే అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్న వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్నెస్ సాధించని పక్షంలో అతని స్థానాన్ని ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్తో భర్తీ చేసే అవకాశం ఉందని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపాడు. కాగా, ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా హాజరుకానున్నారు. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు దీపక్ చాహర్ చదవండి: దీపక్ చాహర్ లవ్ ప్రపోజల్ సెలబ్రేషన్స్.. ధోని హంగామా చూడాల్సిందే..! -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ వేణుగోపాల్ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
ప్రసిధ్ కృష్ణకు పిలుపు
ముంబై: ఇంగ్లండ్తో తలపడే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందంలో ముగ్గురు ఆటగాళ్లకు తొలిసారి వన్డే టీమ్లో చోటు దక్కింది. కర్ణాటక పేస్ బౌలర్, గతంలో భారత ‘ఎ’ జట్టుకు ఆడిన ప్రసిధ్ కృష్ణ జాతీయ సీనియర్ జట్టులో ఎంపిక కావడం ఇదే తొలిసారి కాగా... ఇప్పటికే టి20లు ఆడిన ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా, తాజా టి20 సిరీస్లో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్లకు కూడా అవకాశం దక్కింది. ఐపీఎల్లో కోల్కతా జట్టు తరఫున కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసిధ్కు దేశవాళీ వన్డేల్లో మంచి రికార్డు ఉంది. 48 వన్డేల్లో అతను 23.07 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 18 టి20లు ఆడిన కృనాల్ ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్లలో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్ ప్రదర్శన ఆధారంగా సిరాజ్కు మరోసారి వన్డే పిలుపు లభించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో టీమ్లో ఉన్న మయాంక్, మనీశ్ పాండే, సైనీ, సంజూ సామ్సన్ తమ స్థానాలు కోల్పోయారు. ఇంగ్లండ్తో మూడు వన్డేలు ఈనెల 23, 26, 28వ తేదీల్లో పుణేలో జరుగుతాయి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, గిల్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్, రాహుల్, చహల్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, సుందర్, నటరాజన్, భువనేశ్వర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్. -
‘నా టైమ్ ఎప్పుడొస్తుంది’
సాక్షి క్రీడా విభాగం: సరిగ్గా రెండేళ్లయింది కుల్దీప్ యాదవ్ టెస్టు మ్యాచ్ ఆడి. నాడు సిడ్నీ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన తర్వాత ఏ ముహూర్తాన హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలర్, అత్యుత్తమ స్పిన్నర్’ అంటూ ప్రశంసించాడో ఆ రోజు నుంచి అదృష్టం అతని గడప తొక్కలేదు. ఇటీవల ముగిసిన సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క వన్డే మాత్రం ఆడిన కుల్దీప్ సొంత గడ్డపైనైనా తన సుడి మారుతుందని ఆశించాడు. ‘స్వదేశంలో జరిగే మ్యాచ్లలో కుల్దీప్ మా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు’ అంటూ స్వయంగా కోహ్లి గురువారమే చెప్పినా... శుక్రవారానికి వచ్చేసరికి అతనికి మరోసారి మ్యాచ్ దక్కలేదు. వైవిధ్యమైన చైనామన్ బౌలింగ్తో ఇంగ్లండ్ను కచ్చితంగా కుల్దీప్ ఇబ్బంది పెట్టగలడని అంతా భావించారు. అరుదుగా ఉండే ఎడంచేతి మణికట్టు స్పిన్నర్లు పిచ్తో సంబంధం లేకుండా ప్రభావం చూపించగలరు కాబట్టి తొలి టెస్టులో అతనికి చోటు ఖాయంగా కనిపించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తుది జట్టులో ముగ్గురూ ‘ఫింగర్ స్పిన్నర్’లకే అవకాశమిచ్చింది. అశ్విన్లాంటి సీనియర్ ఉన్నప్పుడు అదే శైలి ఉన్న సుందర్కు చోటు కల్పించడం ఆశ్చర్యకర నిర్ణయం. జట్టు బ్యాటింగ్ను బలోపేతం చేసేందుకే ఇలా చేశారు అంటూ ఒక వాదన వినిపించింది. దీని ప్రకారం కోహ్లి కచ్చితంగా జట్టులో ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాల్సిందేనని పట్టు బట్టాడు. పిచ్లు భిన్నమైనా... ఇటీవల శ్రీలంక బౌలర్ ఎంబుల్డెనియా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్కు సమస్యలు సృష్టించడం కూడా అందుకు ఒక కారణం. రవీంద్ర జడేజా లేకపోవడంతో అతడిని పోలిన బౌలింగ్ శైలి, బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో అక్షర్ పటేల్ ఆడటం ఖాయమైపోయింది కూడా. అయితే అక్షర్ అనూహ్యంగా తప్పుకోవడంతో లెక్క మారిపోయింది. చివరి నిమిషంలో ఎంపిక చేసిన నదీమ్కు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కుల్దీప్ను కూడా ఎంపిక చేస్తే చివరి నలుగురు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేనివారిగా మారిపోతారు కాబట్టి ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుంటుందని జట్టు భావించింది. ఇటీవలి బ్రిస్బేన్ టెస్టు ప్రదర్శన సుందర్కు అదనపు అర్హతగా మారిపోయింది. దాంతో కుల్దీప్కు అవకాశం దక్కలేదు. అయితే చివరకు అనుభవం లేని నదీమ్, సుందర్లనే లక్ష్యంగా చేసి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 3.87 ఎకానమీతో పరుగులు ఇవ్వగా, 19 ఫోర్లు వీరి బౌలింగ్లోనే వచ్చాయి. బౌలింగ్లో సుందర్ను జట్టు పెద్దగా వాడుకోనే లేదు. 41వ ఓవర్కు గానీ బౌలింగ్ ప్రారంభించని అతను 12 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో బ్రిస్బేన్ టెస్టు అవకాశం దక్కించుకున్న సుందర్... మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోహ్లి, పుజారా, రోహిత్, రహానే, పంత్లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఉన్న భారత జట్టు స్వదేశంలో భారీ స్కోరు కోసం ఏడో నంబర్ ఆటగాడి వరకు ఆధారపడుతుందా! టాప్–6 సరిగ్గా బ్యాటింగ్ చేస్తే అసలు లోయర్ ఆర్డర్ అవసరమేముంటుంది? వారు చేయలేని పనిని ఏడు, ఎనిమిదో నంబర్ ఆటగాళ్లు చేస్తారా! మూడేళ్ల తర్వాత... భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2018 జనవరిలో కేప్టౌన్లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడగా, అన్నీ విదేశాల్లోనే జరిగాయి. -
కెప్టెన్కే ఏమీ తెలీదు!
సిడ్నీ: ఆస్ట్రేలియా విమానం ఎక్కుతున్న సమయంలో కూడా జట్టు వైస్ కెప్టెన్ తమతో పాటు ఎందుకు రావడం లేదో కెప్టెన్కు తెలీదు! ఈ వ్యవహారంపై జట్టు సారథికి సమాచారం ఇవ్వాల్సిన బోర్డు ఏదీ చెప్పకుండా అన్ని విషయాలను దాచి పెట్టింది! భారత క్రికెట్కు సంబంధించి తాజా పరిస్థితి ఇది. ఐపీఎల్లో రోహిత్ శర్మ గాయపడటం మొదలు ఇప్పుడు తొలి రెండు టెస్టులకు దూరం కావడం వరకు నెల రోజులుగా సాగుతున్న అతని ఫిట్నెస్ వివాదంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది. అసలు రోహిత్ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అసలు ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని అతను చెప్పడం ఈ వ్యవహారం ఎలా సాగిందో చెబుతోంది. టీమిండియా కెప్టెన్కు, బీసీసీఐకి మధ్య ఎలాంటి సమాచార లోపం ఉందో కూడా ఇది చూపిస్తోంది. రోహిత్ వ్యవహారానికి సంబంధించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు అతని మాటల్లోనే... ‘దుబాయ్లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. అయితే అది జరగలేదు. (289 రోజుల తర్వాత...) మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు. దాని తర్వాత బోర్డు నుంచి అధికారికంగా ఒకే ఒక మెయిల్ వచ్చింది. అందులో రోహిత్ ఎన్సీఏలో ఉన్నాడని, అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నామని, నవంబర్ 11న మరింత స్పష్టత వస్తుందని రాసుంది. సెలక్షన్ కమిటీ సమావేశం జరిగిన రోజు నుంచి మొదలు పెడితే ఐపీఎల్ ముగిసి, ఎన్సీఏలో చేరే వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై పూర్తిగా స్పష్టత లోపించింది. అసలు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వేచి చూడటమే సరైంది కాదు. అంతా గందరగోళంగా ఉందనేది వాస్తవం. రోహిత్ పరిస్థితికి సంబంధించి ఎంతో అనిశ్చితి నెలకొంది. ఎక్కడా స్పష్టత లేదు’ -
చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్!
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు నిన్నటితో ముగిసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సౌత్జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్లను మదన్లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది. మిగతా ముగ్గురు సభ్యుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నవారిలో అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మహిందర్ సింగ్, ఎస్ఎస్ దాస్లలో ముగ్గురు సెలెక్టర్లుగా ఎంపికవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక అజిత్ అగార్కర్, మహిందర్ సింగ్ గత మార్చిలోనే అప్లై చేయగా.. వారికి అవకాశం రాలేదు. ఆ దరఖాస్తులనే సీఏసీ మళ్లీ పరిగణించనుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న అగార్కర్ చీఫ్ సెలక్టర్గా సరిపోతాడని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మాజీ పేస్ బౌలర్ దేవాశిష్ మహంతిని జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా నియమించాలని చెప్తున్నారు. గత సెలక్షన్ కమిటీ భర్తీ ప్రక్రియలో జోన్లవారీగా సభ్యులను ఎంపిక చేసుకుని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. తాజాగా ఆ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
సెలక్టర్లు కావలెను..అర్హతలివే..!
న్యూఢిల్లీ: సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈ నెల 15 ఆఖరి తేదీ అని అందులో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్జోన్), శరణ్దీప్ సింగ్ (నార్త్జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్జోన్)ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా... ఆసీస్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్లను నియమించింది. (చదవండి: తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి) అర్హతలివే... అంతర్జాతీయ అనుభవం లేకపోయినా... కనీసం 30 దేశవాళీ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవమైనా ఉండాలి. అయితే ఈసారి అంతర్జాతీయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అని ఎక్కడా పేర్కొనలేదు. 30 దేశవాళీ మ్యాచ్లాడినా పరిగణమిస్తామని తెలిపింది. సెలక్షన్ కమిటీ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న మాజీ సీమర్ అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్ల ఎంపికను కూడా పరిశీలిస్తారు. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) -
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి
ముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు. సెలక్షన్ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్కప్లో భారత్ ఓడిపోయిందన్న తివారీ... నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో నాలుగో నంబర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్ల కోసం టీమిండియాను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సమావేశాలను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించినప్పుడు కనీసం అతనికైనా కారణం చెప్పాలని కోరాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్ర వ్యక్తి కాబట్టి హనుమ విహారికి, వెస్ట్జోన్కి చెందిన వ్యక్తి అధికారంలో ఉండగా వసీమ్ జాఫర్కు, నార్త్జోన్ వ్యక్తి సెలెక్టర్గా ఉన్న కాలంలో గురుకీరత్ సింగ్, రిషీ ధావన్లకు అవకాశాలు వచ్చాయని భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారీ ఆరోపించాడు. -
అగార్కర్కు మరో చాన్స్?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సెలక్టర్గా ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయిన మాజీ పేసర్ అజిత్ అగార్కర్కు మరో చాన్స్ ఉన్నట్లే కనబడుతోంది. మదన్లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్జోన్)ని ఎంపిక చేయడంతో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. జోనల్ పద్ధతిని పాటించడంతో అగార్కర్ అసలు సెలక్టర్ల రేసులోనే లేకుండా పోయాడు.(ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి) రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహాన్లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోనల్ ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్ను పరిగణనలోకి తీసుకోలేదు. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్ ఖోడా సెంట్రల్ జోన్కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్ను... ఎమ్మెస్కే ప్రసాద్ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఇక్కడ సునీల్ జోషి, హర్విందర్ సింగ్లను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే సునీల్ జోషి చీఫ్ సెలక్టర్గా ఎంపిక చేశారు. అగార్కర్కు మరో చాన్స్ ఎలా? సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్దీప్ సింగ్ (నార్త్ జోన్)ల పదవీ కాలం ఈ సెప్టెంబర్తో ముగియనుంది. దాంతో ప్రస్తుతం దరఖాస్తుకు చేసుకుని నిరాశకు గురైన అగార్కర్, నయాన్ మోంగియా, మణిందర్ సింగ్ తదితరులు మళ్లీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం లేకుండానే రేసులో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా జతిన్ పరంజపే ముంబైకు చెందిన వాడు కావడంతో అతని స్థానంలో అగార్కర్కు చాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే దానికి మరో ఆరు నుంచి ఏడు నెలలు నిరీక్షించాల్సి ఉంటుంది. సెలక్టర్గా అగార్కర్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. ‘భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాలు అగార్కర్కు ఉన్నాయి. సెలక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకున్న జాబితా ప్రకారం చూస్తే అతనే టాప్ ప్లేస్లో ఉన్నాడు. కానీ జోనల్ పద్ధతిని అనుసరించడంతో అగార్కర్ చాన్స్ మిస్సయ్యాడు. అదే సమయంలో ముంబై నుంచి పరంజపే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దాంతో అగార్కర్కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ముగ్గురు మరో ఆరు-ఏడు నెలల్లో వీడ్కోలు చెప్పనున్నారు. అప్పుడు అగార్కర్ను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం’ అని గంగూలీ తెలిపాడు. -
బుమ్రా వచ్చేశాడు...
న్యూఢిల్లీ: స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. వెస్టిండీస్ గడ్డపై సిరీస్ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. స్వదేశంలో వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టి20, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లకు బుమ్రాను సెలక్టర్లు ఎంపిక చేశారు. బుమ్రా ఫిట్గా ఉన్నట్లు టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ నివేదిక ఇవ్వడంతో అతని రాక ఖాయమైంది. అయితే ఈ సిరీస్లకు ముందు బుమ్రా తన మ్యాచ్ ఫిట్నెస్ కోసం గుజరాత్ తరఫున ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడతాడు. రాబోయే రెండు సిరీస్ల కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. గాయం కారణంగానే విండీస్తో సిరీస్లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత రెండు సిరీస్లకు ఎంపికైనా... ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని సంజూ సామ్సన్ను మరోసారి బ్యాకప్ ఓపెనర్గా లంకతో టి20 సిరీస్కు ఎంపిక చేశారు. మరోవైపు వెన్నునొప్పితో విండీస్తో రెండు మ్యాచ్లు ఆడని దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదు. దాంతో అతని స్థానంలో నవదీప్ సైనీ కొనసాగుతాడు. షమీకి బ్రేక్... 2019లో భారత జట్టులో అందరికంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మకు ఊహించినట్లుగానే విశ్రాంతి లభించింది. శ్రీలంకతో టి20లకు అతను దూరంగా ఉంటాడు. అయితే ఆసీస్తో వన్డేల్లో మాత్రం రోహిత్ బరిలోకి దిగుతాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన పేసర్ మొహమ్మద్ షమీకి కూడా సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీలించలేదు. ఎప్పటిలాగే మహేంద్ర సింగ్ ధోని విషయంలో సెలక్టర్లు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యా చేయలేనని ఎమ్మెస్కే చెప్పారు. జనవరి 5, 7, 10 తేదీల్లో శ్రీలంకతో 3 టి20ల్లో... జనవరి 14, 17, 19 తేదీల్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేల్లో భారత్ తలపడుతుంది. భారత జట్ల వివరాలు శ్రీలంకతో 3 టి20లకు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సైనీ, శార్దుల్ ఠాకూర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్. ఆస్ట్రేలియాతో 3 వన్డేలకు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, షమీ. ‘ఆస్ట్రేలియాతో సిరీస్కు ముగ్గురు ఓపెనర్లు కూడా అందుబాటులో ఉంటారు. చాహర్కు అనూహ్యంగా వెన్ను నొప్పి వచ్చింది. అయితే మనకు తగినంత సంఖ్యలో రిజర్వ్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను న్యూజి లాండ్లో పర్యటించే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపిక చేశాం ’ –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్ -
అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం!
ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లు ఎన్ని...? అతని అనుభవం ఎంత? ఏడాది పాటు సెలక్టర్గా, ఆ తర్వాత చీఫ్ సెలక్టర్గా పని చేసిన మూడేళ్ల కాలంలో అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి లెక్క లేనన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న ఎదురవుతూ వచ్చింది. ముఖ్యంగా కీలక, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నప్పుడైతే వీరంతా ప్రసాద్ను విమర్శించడంలో ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. కానీ సెలక్టర్గా తన బాధ్యతలు నిర్వర్తించడం తప్ప విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెస్కే వ్యాఖ్యానించారు. ముంబై: భారత జట్టు సాధిస్తున్న విజయాలే తమ సెలక్షన్ కమిటీ పనితీరుకు సూచిక అని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘మేం ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా, ఎంత అంకితభావంతో పని చేశామన్నదే ముఖ్యం. మాకంటే ఎక్కువ క్రికెట్ ఆడినవాళ్లు కూడా సెలక్టర్లుగా విఫలమయ్యేవారేమో. ఏదేమైనా విజయాలే మన గురించి చెబుతాయి. ప్రస్తుతం భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఎలా ఆడుతుందో చూస్తే చాలు. గతంలో ఏ సెలక్షన్ కమిటీకి కూడా మా అంత మెరుగైన రికార్డు లేదు. అనుభవం లేనివాళ్లమే అయినా విజయవంతమైన జట్లను ఎంపిక చేశాం. సీనియర్ టీమ్ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా ‘ఎ’ జట్లయితే విశేషంగా రాణించాయి. 13 సిరీస్లు ఆడితే అన్నీ గెలిచాయి. సీనియర్ టీమ్లో ఇప్పుడు మ్యాచ్ ఫలితాలను శాసించగల ఎనిమిది మంది ఫాస్ట్ బౌలర్లు, ప్రధాన స్పిన్నర్లతో పాటు మరో ఆరుగురు స్పిన్నర్లు, ఆరుగురు సమర్థులైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకా మా నుంచి ఏం ఆశిస్తున్నారు’ అని ఎమ్మెస్కే వివరించారు. ప్రపంచకప్ సెమీస్లో పరాజయానికి ‘నాలుగో స్థానం’ కారణం కాదని, సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా నాలుగో నంబర్ బ్యాట్స్మన్ ఇబ్బంది పడటం జరగనే లేదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు మినహా తాము అవకాశం ఇచ్చిన కొత్త ఆటగాళ్లంతా సత్తా చాటారన్న మాజీ వికెట్ కీపర్... బుమ్రాను టెస్టుల్లోకి ఎంపిక చేయడం తమ అత్యుత్తమ నిర్ణయమన్నారు. సెలక్టర్గా పని చేసేటప్పుడు విమర్శలు రావడం సహజమేనన్న ఎమ్మెస్కే... ధోని, కోహ్లిలతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ‘మేనేజ్మెంట్ విద్యార్థినైన నేను ఆంధ్ర క్రికెట్ డైరెక్టర్గా ఇంతకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలక్టర్గా ఉన్న సమయంలో నేను దిగ్గజ క్రికెటర్ల సలహాలు తీసుకుంటూ వచ్చాను. ధోని, కోహ్లిలతో నా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు. జనం ఏమైనా అనుకోవచ్చు గానీ వారిద్దరు నన్ను ఎంతగా గౌర విస్తారో నాకు తెలుసు’ అని ప్రసాద్ అన్నారు. -
విండీస్ సిరీస్కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్గా వ్యవహరించనున్నాడు. ఆల్రౌండర్ కేదార్ జాదవ్ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్కు పరిగణించలేదు. అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్గా వ్యవహరిస్తాడు. -
విండీస్ టూర్: వీరికి అవకాశం దక్కేనా?
హైదరాబాద్: ప్రపంచకప్లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు. బలహీన మిడిలార్డర్, నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్మన్ లేకపోవడం వంటి కారణాలను క్రీడా విశ్లేషకులు వెతుకుతున్నారు. అయితే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ అనంతరం వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అందరి దృష్టి భారత జట్టు ఎంపికపై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తుండటంతో పలువురు ఆటగాళ్లు తెరపైకి వస్తున్నారు. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, సిరాజ్ వంటి వారిపైనే కాకుండా మరికొంత మంది యువ కిశోరాలపై సెలక్టర్ల కన్ను పడింది. గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, నవదీపై సైనీ, రాహుల్ చహర్, కేఎస్ భరత్ వంటి యువ ఆటగాళ్లు విండీస్ పర్యటనలో టీమిండియా తరుపున అరంగేట్రం చేసే అవకాశం ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి. టీమిండియా యువ కిశోరం పృథ్వీ షా గాయం తర్వాత ఫిట్నెస్ నిరూపించుకోలేదు. సెలక్టర్ల సమావేశంలోపు పృథ్వీ షా తన ఫిట్నెస్ నిరూపించుకంటేనే జట్టులో ఉంటాడు లేకుంటే అంతే సంగతులు. ఇక టెస్టులకు సీనియర్ ఆటగాళ్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్లను పూర్తిగా పక్కకు పెట్టే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. దీంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్తో పాటు మూడో ఓపెనర్గా గుజరాత్ సారథి ప్రియాంక్ పంచల్కు అవకాశం దక్కవచ్చు. గుజరాత్ సారథిగా, ఓపెనర్గా ప్రియాంక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో ప్రియాంక్కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మరోవైపు బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రియాంక్కు పోటీ ఇస్తున్నాడు. లిస్టు ఏ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలపై పరుగుల ప్రవాహం సృష్టించిన ఈశ్వరన్ విండీస్ పర్యటనకు ఎంపిక చేస్తారనే ఆశాభావంతో ఉన్నాడు. కీపర్గా ఎంఎస్ ధోని వారసుడిగా రిషభ్ పంత్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. అయితే టెస్టుల విషయానికి వస్తే వృద్దిమాన్ సాహా గాయం నుంచి కోలుకోవడంతో సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపవచ్చు. అయితే పంత్, సాహాల తర్వాత కేఎస్ భరత్వైపు సెలక్టర్ల దృష్టి ఉంది. భారత్ ఏ మ్యాచ్ల్లో విశేష ప్రతిభతో సెలక్టర్లును ఆకట్టుకున్నాడు. భరత్ చివరి 11 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, రెండు అర్దసెంచరీల సహాయంతో 686 పరుగులు సాధించాడు. అంతేకాకుండా కీపింగ్లో 41 క్యాచ్లు, 6 స్టంపింగ్స్ చేశాడు. దీంతో టెస్టులకు రెగ్యులర్ కీపర్కు బ్యాకప్గా భరత్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. సెలక్టర్లు పంత్, సాహాలను కాదని భరత్ను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి ప్రతిభ అలాంటిది. ఇప్పటికిప్పుడు టీమిండియా తరుపున ఆడే సత్తా, అనుభవం, ప్రతిభ గల బౌలర్ నవదీప్ సైనీ. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కంటే వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం.. వికెట్లు తీయగల నైపుణ్యం అతడి సొంతం. ఇప్పటికే కోహ్లి సేనతో పాటు విదేశీ పర్యటనలకు వెళుతూ.. నెట్స్లో బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేస్తూ వారి ప్రాక్టీస్కు దోహదపడుతున్నాడు. ఇక ఐపీఎల్, లిస్ట్ ఏ మ్యాచ్ల్లో వికెట్లు పడగొడుతున్న సైనీ అతి త్వరలోనే టీమిండియా జెర్సీ వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్లు జోరు నడుస్తోంది. టీమిండియా స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు తమ మాయాజాలంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నారు. అయితే ప్రపంచకప్లో వారు విఫలమవ్వడంతో వారికి ప్రత్యామ్నాయంగా రాహుల్ చహర్ తెరపైకి వచ్చాడు. టీమిండియా- ఏ తరుపున తనదైన శైలిలో రాణిస్తున్న ఈ స్టైలీష్ స్పిన్నర్పై సెలక్టర్ల కన్నుపడింది. బౌలింగ్లో వేగం.. అంతకుమించి వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్న చహర్ కనీసం టీ20లకైనా సెలక్ట్ అవుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!
ముంబై : వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే సారథి విరాట్ కోహ్లి ఇంగ్లండ్ నుంచి భారత్కు తిరిగొచ్చేయడంతో పాటు విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోనని తెలపడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు కోహ్లి అందుబాటులో ఉండటంతో అతడి సమక్షంలో లేదా అతడితో చర్చించే కలిసే జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 20న లేదా 21న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం సెలక్టర్లు ప్రయోగాలు చేయాలని తొలుత భావించారు. సీనియర్ ఆటగాళ్లు కోహ్లి, ధోని, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చి మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకోవాలని భావించింది. అయితే కోహ్లి విశ్రాంతి తీసుకోవడానికి అయిష్టత చూపడంతో సీన్ రివర్సయింది. కేవలం ధోనికే విశ్రాంతినిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సెలక్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సెలక్టర్ల సమావేశం ఆసక్తిగా మారింది. -
ఏప్రిల్ 15న...
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 15న ప్రకటించనుంది. సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ కప్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ నిర్దేశించిన తుది గడువు ఏప్రిల్ 23 కాగా... టీమిండియా సభ్యుల సన్నద్ధత కోసం మరికొంత అదనపు సమయం ఉంటే బాగుంటుందని సెలక్టర్లు భావించారు. సోమవారం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండబోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతాడు. మే 30నుంచి ఇంగ్లండ్లో ప్రపంచ కప్ జరగనుండగా, భారత్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. -
పద్మాలకు 50వేల దరఖాస్తులు
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల ఎంపికకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2014లో తొలిసారి ప్రజల నుంచి నామినేషన్లను ఆహ్వానించినప్పుడు 2,200 మాత్రమే కాగా, 2019లో ఆ సంఖ్య 50,000కు చేరుకుందని వ్యాఖ్యానించారు. సమాజంపై, ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావం చూపిన వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, వ్యక్తులకు ఈసారి అవార్డులు వరించాయని అభిప్రాయపడ్డారు. ఈసారి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతులు పద్మ అవార్డులను అందుకున్నారు. వీరిలో అత్యాధునిక పద్ధతులు సాంకేతికత పాటించినందుకు భారత్ భూషణ్ త్యాగి, రామ్శరణ్ వర్మతో పాటు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కమలా పూజారీ, రాజ్కుమారీ దేవి, బాబూలాల్ దహియా, హుకుమ్చంద్ పటీదార్ ఉన్నారు. వీరితో పాటు కన్వల్ సింగ్ చౌహాన్(మష్రూమ్, మొక్కజొన్న సాగు), వల్లభ్భాయ్ వస్రమ్భాయ్(క్యారట్ సాగు), జగదీశ్ ప్రసాద్(క్యాలీఫ్లవర్), సుల్తాన్ సింగ్(చేపల పెంపకం), నరేంద్ర సింగ్(పాడిపశువుల పునరుత్పత్తి)లకు పద్మ అవార్డులు దక్కాయి. వైద్య రంగానికి సంబంధించి 11 రాష్ట్రాల నుంచి 14 మంది వైద్యులను కేంద్ర పద్మ అవార్డులతో సత్కరించింది. పేదలకు నామమాత్రపు ఫీజుకే, కొన్నిసార్లు ఉచితంగా చికిత్స అందజేస్తున్న శ్యామ్ప్రసాద్ ముఖర్జీ(జార్ఖండ్), స్మిత, రవీంద్ర కోల్హే(మహారాష్ట్ర), ఆర్వీ రమణి(తమిళనాడు)లకు పద్మ అవార్డులు వరించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలను కొనసాగిస్తున్న సెరింగ్ నోర్బూ(లడఖ్), ఇలియాజ్ అలీ(అస్సాం), అశోక్ లక్ష్మణ్రావ్ కుకడే(లాతూర్–మహారాష్ట్ర) పద్మ పురస్కారాలను దక్కించుకున్నారు. వీరితో పాటు ప్రతిష్టాత్మక వైద్య సంస్థలకు చెందిన జగత్రామ్(పీజీఐఎంఈఆర్ డైరెక్టర్–చండీగఢ్), షాదాబ్ మొహమ్మద్(కింగ్ జార్జ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం–లక్నో), సందీప్ గులేరియా(ఎయిమ్స్–ఢిల్లీ), మమ్మెన్ చాందీ(టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్–కోల్కతా) పద్మ అవార్డులను అందుకున్నారు. పద్మ పురస్కారాలు పొందినవారిలో సోషలిస్ట్ నేత హుకుమ్దేవ నారాయణ్ యాదవ్, గిరిజన నేత కరియాముండా, సిక్కు నేత సుఖ్దేవ్ సింగ్, మహాదళిత్ మహిళా నేత భగీరథి దేవి, 1984 అల్లర్ల బాధితుల తరఫున పోరాడుతున్న లాయర్ హర్విందర్ సింగ్ ఫూల్కా ఉన్నారు. -
కొలిక్కిరాని సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక
న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని గురువారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. ‘పదవికి అర్హులైన జాబితాలోని అధికారుల పేర్లపై సెలక్షన్ కమిటీ సభ్యులు గురువారం చర్చించారు. త్వరలోనే మరోసారి కమిటీ సమావేశమై కొత్త చీఫ్ పేరును ప్రకటిస్తుంది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్, లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జన్ ఖర్గే పాల్గొన్నారు. ‘ కేవలం పేర్లపైనే చర్చ జరిగింది. జాబితాలోని అధికారుల కెరీర్, అనుభవం తదితర వివరాలను పొందుపరచలేదు. అందుకే సంబంధిత వివరాలను కోరాం. వచ్చే వారం కమిటీ సమావేశం ఉండొచ్చు’ అని ఖర్గే అన్నారు. ‘సీబీఐ’ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సిక్రీ న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తప్పుకున్నారు. గత సోమవారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఈ కేసును తాను విచారించబోనంటూ తప్పుకోవడం తెలిసిందే. సీబీఐకి కొత్త డైరెక్టర్ను ఎంపిక చేసే అత్యన్నత స్థాయి కమిటీలో జస్టిస్ గొగోయ్ సభ్యుడు కాగా, సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగించిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. ఈ కారణాలనే చూపుతూ వీరిద్దరూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసును జస్టిస్ సిక్రీ విచారిస్తే తమకేమీ అభ్యంతరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పినప్పటికీ పక్కకు తప్పుకునేందుకే జస్టిస్ సిక్రీ మొగ్గు చూపారు. -
‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎమ్.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసేందుకు 2019, జనవరి 24న సమావేశం కానున్న అత్యున్నత ఎంపిక కమిటీలో తానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ఈ పిటిషన్ను విచారించేందుకు మరో బెంచ్ను నియమిస్తామని వెల్లడించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాలుచేస్తూ కామన్కాజ్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. సీబీఐ డైరెక్టర్ నియామకంలో పారదర్శకత కోసం విధివిధానాలను రూపొందించాలని కామన్కాజ్ సంస్థ కోర్టును కోరింది. నాగేశ్వరరావును సెలెక్ట్ కమిటీ సిఫార్సు ఆధారంగా నియమించలేదని తెలిపింది. నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం 2018, అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. కానీ కేంద్రం దుర్బుద్ధితో, ఏకపక్షంగా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం (డీపీఎస్ఏ) నిబంధనల్ని తుంగలో తొక్కుతూ నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమించిందని పిటిషన్లో పేర్కొంది. డీపీఎస్ చట్టం ప్రకారం వెంటనే నూతన సీబీఐ డైరెక్టర్ను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. అలాగే సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను, ఎంపిక ప్రక్రియలో పాటించిన విధివిధానాలు, సమావేశాల మినిట్స్ను సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కింద ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరింది. దీనివల్ల తుది జాబితాలోని అభ్యర్థులకు సంబంధించి ప్రతికూల అంశాలు ఉంటే ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు వీలవుతుందని సూచించింది. -
లోక్పాల్ ఎక్కడ?
లోక్పాల్ను ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీకి ఫిబ్రవరి ఆఖరులోగా పేర్ల జాబితా సమర్పించాలని సెర్చ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ని సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశించింది. 2018 మార్చి నుంచి సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అనేక అవ కాశాలు ఇచ్చింది. కానీ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. నత్తనడక నడుస్తోంది. 2014 ఎన్నికల ప్రచారంలో తరచుగా వినిపించిన మాట లోక్పాల్. యూపీఏ ప్రభుత్వం అవినీతిమయమైనదని దుయ్యబడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్పాల్ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రకటించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి (మే 26, 2014) నాలుగేళ్ళ ఎనిమిది మాసాలు గడిచిపోయినాయి. ఇంతవరకూ లోక్పాల్ను నియమించలేదు. లోక్పాల్ను నియమించాలనే పట్టింపు ప్రధానికి ఉంటే ఆ పని ఎప్పుడో జరిగేది. ఆ సంకల్పం లేదు. అంతే. ఎన్నికల ప్రచారంలో చేసిన బాసలు కపట రాజకీయంలో భాగమే అనుకోవాలి. గుజ రాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన 12 సంవత్సరాలలో కూడా మోదీ లోకాయుక్తను నియమిం చలేదు. ప్రజాప్రతినిధులలో, ప్రజాసేవకులలో అవినీతిని అరికట్టేందుకు లోక్పాల్ను నియమించా లన్న ఉద్యమం 1960లలో మొదలయింది. 2010లో ఊపందుకున్నది. అరుణారాయ్ నాయక త్వంలో ప్రజల హక్కుకోసం జాతీయ ఉద్యమం (నేషనల్ కేంపేన్ ఫర్ పీపుల్స్ రైట్స్– ఎన్సీపీ ఆర్ఐ) జన్లోక్పాల్ బిల్లు తయారు చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ నియమించింది. అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్భూషన్, శేఖర్సింగ్లతో కూడిన కమిటీ ఒక ముసాయిదా బిల్లును రూపొందించారు. దాని ఆధారంగా 2011 జనవరిలో ఢిల్లీలో రాంలీలా మైదానంలో పెద్ద బహిరం గసభ జరిగింది. మూడు మాసాల అనంతరం 2011 ఏప్రిల్లో అన్నాహజారే జంతర్మంతర్లో లోక్పాల్ చట్టం కోసం నిరవధిక నిరాహారదీక్ష ఆరంభించారు. ప్రభుత్వం దిగివచ్చింది. బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి తొమ్మిదిమంది ప్రముఖులతో ఒక సంయుక్త సంఘాన్ని అన్నా హజారే నియమించారు. ఇందులో అయిదుగురు సీనియర్ కేంద్ర మంత్రులూ, నలుగురు పౌరసమాజ ప్రముఖులూ ఉన్నారు. ప్రణబ్కుమార్ ముఖర్జీ, కపిల్ శిబ్బల్, సల్మాన్ ఖుర్షీద్, వీరప్పమొయిలీ, పి చిదంబరం కేంద్ర మంత్రులు. శాంతిభూషణ్, సంతోష్హెగ్డే, కేజ్రీవాల్, ప్రశాంత్భూషణ్ పౌర సమాజం ప్రతినిధులు. సంయుక్త సంఘం రెండు అంశాలపైన విభేదాల కారణంగా బిల్లును ఖరారు చేయలేకపోయింది. సెలక్షన్ కమిటీలో రాజకీయ ప్రముఖులు ఉండాలా లేక రాజకీయేతర ప్రముఖులు ఉండాలా అనే అంశంపైనా, సీబీఐ లోక్పాల్ కిందికి రావాలా, లేదా అనే అంశంపైనా స్పష్టత కొరవడింది. చివరికి 2013 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన బిల్లులో ఈ రెండు అంశాల విషయంలో ఉద్యమకారులకు నిరాశ కలిగింది. సెలక్షన్ కమిటీలో ప్రధాని, లోక్సభ స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడూ, ఒక న్యాయకోవిదుడూ ఉండాలని బిల్లులో ఉంది. సీబీఐ లోక్పాల్ పరిధిలోకి రాదని కూడా తేల్చారు. అవినీతిపై పోరాటానికి ఏదో ఒక చట్టం వస్తే అంతే చాలునని హజారే, తదితరులు భావించారు. 2014 జనవరి ఒకటో తేదీన జీవో వచ్చింది. తర్వాత నియమనిబంధనలు నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటి ప్రధాని మన్మోహన్సింగ్, సభాపతి మీరాకుమార్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు, న్యాయకోవిదుడు పిపి రావులు రెండు విడతలు సమావేశమైనారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 మాసాలపాటు లోక్పాల్ ఊసు లేదు. సెలక్షన్ కమిటీ సమావేశం లేదు. కామన్కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) తరఫున ప్రశాంత్భూషణ్ దాఖలు చేసిన పిటిషన్పైన సుప్రీంకోర్టు స్పందించిన కారణంగా సెలక్షన్ కమిటీ సమావేశాలు 2018 మార్చి ఒకటి నుంచి ఇంత వరకూ ఆరుసార్లు జరిగాయి. పీపీ రావు మృతి కారణంగా ముకుల్ రోహట్గీని న్యాయకోవిదుడుగా కమిటీలో నియమించారు. సెలక్షన్ కమిటీ సమావేశాలకు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ఖర్గేని ‘ఆహ్వానితుడుగా’ పిలుస్తున్నారు. హాజరు కావడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఆహ్వానితుడికి ఓటింగ్ హక్కు ఉండదు. ఆయన వాగ్మూలం నమోదు కాదు. తనను సభ్యుడిగా ఆహ్వానించాలనీ, లోక్పాల్, లోకాయుక్త చట్టం, 2014, స్ఫూర్తిని అనుసరించి అతి పెద్ద ప్రతిపక్షానికి నాయకుడైన తనను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆహ్వానించాలని ఆయన వాదన. మోదీ అంగీకరించరు. లోక్పాల్ చట్టానికి 2016లో ఎన్డీఏ సర్కార్ సవరణ తెచ్చేందుకు ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ అందులో ఈ వివాదానికి పరిష్కారం లేదు. ప్రతి పక్ష నాయకుడి హోదాలో లోక్సభలో ఎవ్వరూ లేరు కనుక కమిటీ సమావేశాలు సవ్యంగా జరగడం లేదనీ, సెర్చ్ కమిటీకి ప్రాథమిక సౌకర్యాలు లేవనీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టులో చెప్పారు. ఇది కేవలం ఒక సాకు. నిజంగా ప్రధానమంత్రికి లోక్పాల్ నియామకంపైన చిత్తశుద్ధి ఉంటే సెర్చి కమిటీ అధ్యక్షుడికి అవసరమైన సదుపాయాలు కల్పించవచ్చు. ఖర్గేని ప్రతిపక్ష నాయ కుడిగా పరిగణించవచ్చు లేదా తక్కిన నలుగురు సభ్యులూ కలసి ఒక వ్యక్తిని లోక్పాల్గా నిర్ణయిం చవచ్చు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక సుప్రీంకోర్టు నేరుగా లోక్పాల్ను నియమించా లని ప్రశాంత్భూషణ్ వాదిస్తున్నారు. ఎంతో పట్టుదలతో పోరాడి సాధించుకున్న లోక్పాల్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత కారణంగా అయిదేళ్ళుగా నిష్ఫలంగా ఉండటం విషాదం. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం), సీఐసీ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్– కేంద్ర సమాచార వ్యవస్థ) నీరు గారి పోతున్నాయంటూ, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కోల్పోతున్నాయనీ మాజీ కేంద్ర సమాచార కమిష నర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఆవేదన వెలిబుచ్చుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు లేఖ రాశారు. రాష్ట్రపతి అయినా పట్టించుకుంటారా? -
సీబీఐ చీఫ్ ఎంపికకు 24న కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : తదుపరి సీబీఐ డైరెక్టర్ను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈనెల 24న సమావేశం కానుంది. ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, లోక్సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభ్యులుగా ఉన్నారు. తొలుత ఈనెల 21న కమిటీ సమావేశం కావాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఈనెల 24 లేదా 25న సమావేశం జరగాలని ఖర్గే కోరారు. తర్జనభర్జనల అనంతరం నూతన సీబీఐ చీఫ్ను ఎంపిక చేసేందుకు ఈనెల 24న సమావేశం కావాలని ప్రభుత్వం కమిటీ భేటీకి తేదీని ఖరారు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్గా తిరిగి నియమితులైన ఆలోక్ వర్మను ఆ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసుల డీజీగా నియమించినప్పటి నుంచి సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఆలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ప్రభుత్వ ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును నియమించింది. సీబీఐకి పూర్తిస్ధాయి డైరెక్టర్ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై ఒత్తిడి పెంచుతోంది. -
భువీ, బుమ్రా వచ్చేశారు
న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలింగ్ ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్తో జరుగనున్న మిగతా మూడు వన్డేలకు జట్టులోకి వచ్చారు. సెలక్షన్ కమిటీ గురువారం జట్టును ప్రకటించింది. ఇందులో ఉమేశ్ యాదవ్ చోటు కాపాడుకోగా... మొహమ్మద్ షమీని తప్పించారు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టును యథాతథం గా కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్నా కేదార్ జాదవ్ను పరిగణనలోకి తీసుకోలేదు. మొదటి రెండు వన్డేలకు భువీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. జాదవ్కు చోటు లేదు! ప్రస్తుత సిరీస్లో అనుకూల పిచ్లపై బ్యాట్స్మెన్ చెలరేగుతుండటంతో ఇరు జట్ల బౌలర్లు చేసేదేమీ లేకపోతోంది. ముఖ్యంగా హిట్టింగ్కు పేరుగాంచిన విండీస్ బ్యాట్స్మెన్ను మన పేసర్లు, స్పిన్నర్లు అనుకున్నంతగా కట్టడి చేయలేకపోతున్నారు. రెండు వన్డేల్లో కలిపి ఉమేశ్ 142, షమీ 140 పరుగులిచ్చారు. అయితే, తొలి మ్యాచ్లో విఫలమైన షమీ... విశాఖపట్నంలో మెరుగ్గా (1/59) బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో యార్కర్లతో పరుగులు నిరోధించాడు. ఈ విషయంలో ఉమేశ్ కంటే మెరుగైన షమీని తప్పించడం ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు బౌలింగ్ ఇలాగే ఉంటే వన్డే సిరీస్ నెగ్గడం కష్టమని భావించారో, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టు కుని పూర్తి స్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనుకున్నారో కాని భువీ, బుమ్రాల విశ్రాంతిని ముగించారు. ఇక, ఫిట్నెస్ సంతరించుకుని గురువారం దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ తరఫున బ్యాట్తో రాణించి, ఐదు ఓవర్లు కూడా వేసిన జాదవ్ను తీసుకోకపోవడమూ కొంత చర్చకు తావిచ్చింది. నన్నెందుకు తీసుకోలేదో?: జాదవ్ విండీస్తో తదుపరి మూడు వన్డేలకు ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ నుంచి తనకెలాంటి సమాచారం లేదని ఆల్రౌండర్ కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ఢిల్లీలో దేవధర్ ట్రోఫీ ఆడుతోన్న అతడిని... టీమిండియాలోకి తీసుకోకపోవడం గురించి మీడియా అడగ్గా ‘ఈ విషయం మీ ద్వారా ఇప్పుడే తెలిసింది. నన్నెందుకు ఎంపిక చేయలేదో ఆలోచించాల్సి ఉంది. జట్టుతో లేను కాబట్టి వారి ప్రణాళికలేమిటో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించాడు. తాను పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నట్లు తెలిపాడు. గాయాల నుంచి కోలుకున్నట్లు ఎన్సీఏ ప్రకటిస్తేనే ఏ టోర్నీ అయినా ఆడిస్తారని అన్నాడు. గురువారం భారత్ ‘ఎ’ తరఫున ఫిరోజ్షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ ఆడిన జాదవ్... 25 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ను ముగ్గురు జాతీయ సెలక్టర్లు వీక్షించడం గమనార్హం. కేదార్ జాదవ్ గాయాల చరిత్రే కారణం: ఎమ్మెస్కే కేదార్ జాదవ్ను టీమిండియాలోకి తీసుకోకపోవడానికి అతడి గాయాల చరిత్రే కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘గతంలో కోలుకొని జట్టులోకి వచ్చిన వెంటనే జాదవ్ గాయాలకు గురయ్యాడు. ఇటీవల ఆసియా కప్లో కూడా అదే జరిగింది. దీంతో పాటు దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ గురువారం నెగ్గి ఉంటే... అతడికి ఫైనల్ రూపంలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉండేది. అప్పుడు తన ఫిట్నెస్పై మేం పూర్తి భరోసాకు వచ్చేవాళ్లం. నాలుగో వన్డేకు భారత జట్టులోకి అదనపు ఆటగాడిగా తీసుకునేవాళ్లమేమో. జట్టు ఎంపిక సందర్భంగా మేం ఓ పద్ధతి అనుసరిస్తున్న తీరును ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు. -
సెలక్టర్లు నాతోనూ మాట్లాడలేదు!
ముంబై: టెస్టు జట్టు నుంచి స్థానం కోల్పోయిన భారత ఓపెనర్ మురళీ విజయ్ సెలక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కరుణ్ నాయర్లాగే తనతో కూడా మాటమాత్రమైనా చెప్పకుండానే జట్టునుంచి తప్పించారని వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన విజయ్ని టీమ్ మేనేజ్మెంట్ మూడో టెస్టు ఆడించకుండా పక్కనబెట్టింది. అనంతరం సెలక్టర్లు చివరి రెండు టెస్టులకు అతనిపై వేటు వేశారు. దీనిపై అతను మాట్లాడుతూ ‘మూడో టెస్టునుంచి నన్ను తప్పించిన తర్వాత చీఫ్ సెలక్టర్గానీ, మిగతా సెలక్టర్లుగానీ ఎవరూ నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇంగ్లండ్లో కేవలం జట్టు మేనేజ్మెంట్ మాత్రమే నాతో మాట్లాడింది. అంతకుమించి తొలగింపుపై నేను ఇంకెవరితోనూ మాట్లాడింది లేదు. నాకు చెప్పింది లేదు’ అని అన్నాడు. జట్టుకు ఎంపికైనా కరుణ్ నాయర్కు ఒక్క టెస్టులోనూ అవకాశం ఇవ్వకుండానే ప్రస్తుత విండీస్ సిరీస్ నుంచి అతన్ని తప్పించడంపై విమర్శలొచ్చాయి. కరుణ్ తనను తప్పించడానికి గల కారణాలు, ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు సూచనలు ఎవరు చెప్పలేదని మీడియాతో అన్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో 20, 6 పరుగులు చేసి విజయ్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ డకౌటయ్యాడు. అయితే విజయ్ వ్యాఖ్యలపై కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడిని జట్టునుంచి తప్పించినప్పుడు అందుకు తగిన కార ణాలు వివరిస్తూ సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ స్పష్టంగా మాట్లాడినట్లు ప్రసాద్ వివరణ ఇచ్చారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీ నేడు ఆదేశాలు
-
ఏపీ డీజీపీ రేసులో ఆ ఐదుగురు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవాంగ్, ఠాకూర్లలో ఒకరికి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకున్న విషయం తెలిసిందే. ఇన్చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. ఈ నెల(జూన్) 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. -
శిఖర్ ధావన్ ఓ బలిపశువు!
సాక్షి, స్పోర్ట్స్ : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు శిఖర్ ధావన్ను పక్కనపెట్టడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. బోర్డు చేతిలో ప్రతీసారి ధావన్ బలిపశువు అవుతున్నాడంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ధావన్ మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతూనే ఉంటుంది. జట్టులో అతడో బలిపశువుగా మారాడు’’ అని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడిని జట్టు నుంచి పంపించడానికి ఒక్కే ఒక్క చెత్త ప్రదర్శన చాలని ఆయన అన్నారు. ఇక భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మ ఎలా వచ్చాడో? ఎందుకు వచ్చాడో? తనకు అర్థం కావడం లేదని గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేప్టౌన్ టెస్టులో తొలి రోజు మూడు వికెట్లు తీసిన భువీని పక్కన పెట్టి ఇషాంత్ను తీసుకోవడం ఏంటని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఒకవేళ ఇషాంత్నే తీసుకోవాలనుకుంటే షమీనో, బుమ్రానో తప్పించి ఉండాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కాగా, దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు కోసం భారత్ మూడు మార్పులు చేసింది. శిఖర్ ధవన్ స్థానంలో కేఎల్ రాహల్ను, భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా ప్లేస్లో పార్థివ్ పటేల్ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక మొదటి టెస్ట్ సందర్భంగా రహానేను పక్కనపెట్టి రోహిత్ శర్మను తీసుకోవటంపై కూడా విమర్శలు వినిపించినవ విషయం తెలిసిందే. -
ఎమ్మెస్కే టీమ్కు పొడిగింపు!
ముంబై: ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీకి మరికొంత కాలం పొడిగింపు లభించింది. బీసీసీఐ తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే వరకు కమిటీ కొనసాగుతుంది. బోర్డు నిబంధనల ప్రకారం ఏజీఎం సమయంలోనే కమిటీలో మార్పు జరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిపాలకుల కమిటీ (సీఓఏ) పర్యవేక్షణలో బోర్డు వ్యవహారాలు కొనసాగుతుండటంతో తర్వాతి ఏజీఎం ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టత లేదు. కాబట్టి అప్పటి వరకు సెలక్షన్ కమిటీని మార్చే అవకాశం లేదు. ఈ కమిటీలో ప్రసాద్తో పాటు దేవాంగ్ గాంధీ, శరణ్దీప్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 1న బీసీసీఐ ఎస్జీఎం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) డిసెంబర్ 1న జరగనుంది. రాబోయే ఐదేళ్ల (2019–2023) కాలంలో భారత జట్టు పర్యటనలకు సంబంధించిన అంశాలతో పాటు మరో మూడు అంశాలు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. కేరళకు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ వివాదం పరిష్కారంతో పాటు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కు మళ్లీ గుర్తింపు ఇవ్వడం, టెస్ట్ చాంపియన్షిప్, వన్డే లీగ్స్ నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. -
మార్పుల్లేవ్
* న్యూజిలాండ్తో సిరీస్కు * భారత టెస్టు జట్టు ప్రకటన * బిన్నీ, ఠాకూర్లకు నిరాశ ముంబై: న్యూజిలాండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్లో తలపడే భారత క్రికెట్ జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఆడిన జట్టునుంచి ఇద్దరిని తప్పించి 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. విండీస్ విదేశీ పర్యటన కావడంతో 17 మందితో వెళ్లిన భారత బృందంలో స్టువర్ట్ బిన్నీ, శార్దుల్ ఠాకూర్ మినహా మిగతా ఆటగాళ్లపైనే సెలక్టర్లు నమ్మకముంచారు. విండీస్తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ వీరిద్దరికి తుది జట్టులో స్థానం లభించలేదు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఈ నెల 22నుంచి కాన్పూర్లో జరుగుతుంది. సీనియర్ల పేర్లు పరిశీలించినా... టెస్టు సిరీస్లో పెద్దగా రాణించని శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు కమిటీ మరో అవకాశం ఇచ్చింది. ఓపెనర్లుగా ధావన్, విజయ్, రాహుల్ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో తుది జట్టులో ఎవరిని తీసుకోవాలనేది టీమ్ మేనేజ్మెంట్ ఇష్టమని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ అన్నారు. రోహిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా... అతనిలో మంచి ప్రతిభ ఉందని, రోహిత్కు తగినన్ని అవకాశాలు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. గౌతమ్ గంభీర్ సహా కొందరు సీనియర్ల గురించి కూడా చర్చ జరిగిందని, అయితే విదేశాల్లో సిరీస్ నెగ్గిన జట్టునే కొనసాగించాలని తాము భావించామని పాటిల్ చెప్పారు. ధావన్ మళ్లీ రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జట్టు వివరాలు: విరాట్ కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, రాహుల్, పుజారా, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, ఉమేశ్, షమీ, భువనేశ్వర్, ఇషాంత్. -
28న సైకాలజిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
న్యూశాయంపేట : ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ నెల 28న హన్మకొండలోని హౌసింగ్బోర్డ్ కాలనీ రోడ్డులో గల మైండ్కేర్ సెంటర్లో ఎన్నికోనున్నట్లు అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి బరుపాటి గోపి తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైకాలజీ పూర్తి చేసిన వారు రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉన్నవారే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. అదే రోజున సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు కమలాకర్, రాష్ట్ర కార్యదర్శి వేదప్రకాశ్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో అప్పన మనోజ్కుమార్, కుసుమ రమేష్, ఎం.విజయభాస్కర్రెడ్డి, భుజేందర్రెడ్డి, ఎన్.శ్రీనివాస్,జి.రామాచారి పాల్గొన్నారు. -
టీయూడబ్ల్యూజే వీడియో జర్నలిస్టు కార్యవర్గం ఎన్నిక
హన్మకొండ: టీయూడబ్ల్యూజే హెచ్– 143కి అనుబంధ తెలంగాణ వీడియో జర్నలిస్టు యూనియన్(టీవీజేయు) జి ల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొ డిగే శ్రీను, ప్రధాన కార్యదర్శిగా గొర్రె సంజీవ్, కోశాధికారిగా జనగాని ఆంజనేయులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా గుండెబోయిన దిలీప్, ఉపాధ్యక్షుడిగా తోట తిరుమలరావు, సంయుక్త కార్యదర్శిగా అబ్బగాని విజయ్, కార్యవర్గ సభ్యులుగా కె.రా జు, రమేష్, పాషా, పి.సుధాకర్, జగదీష్, ప్రదీప్రాజ, ఎం.రాజు, క్రాంతి, మున్నాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా తమ నియామకానికి సహకరించిన టీయూడబ్ల్యూజే నాయకులు బీ.ఆర్.లెనిన్, పీ.వీ.కొండల్రావు, జి.వెంకట్, తడక రాజనారాయణ, పి.శివకుమార్, గడ్డం కేశవమూర్తి, మెండు రవీందర్, సుధాకర్, వెంకటరత్నంలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘ప్రతిభాన్వేషణ’కు గుర్తింపు
అయ్యప్ప, స్టీఫెన్, భరత్, శ్రీరామ్, భుయ్... గత ఐదేళ్లలో ఆంధ్ర క్రికెట్నుంచి వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో కొందరు. వీరందరి గుర్తింపు, ఎంపిక వెనక ఎమ్మెస్కే ప్రసాద్ హస్తం ఉంది. 2010లో ప్రారంభమైన ఆంధ్ర క్రికెట్ అకాడమీ అందించిన క్రికెటర్లు వీరు. అంతకు రెండేళ్ల క్రితం 33 ఏళ్ల వయసులో ఇంకా ఆడే సత్తా ఉన్నా... ఫస్ట్క్లాస్ క్రికెట్కు గుడ్బై చెప్పిన ప్రసాద్, ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అభివృద్ధిలో భాగమయ్యారు. ఏసీఏ డెరైక్టర్ (ఆపరేషన్స్) హోదాలో అనేక కొత్త ప్రణాళికలతో తమ జట్టు రాత మార్చారు. ప్రతిభ ఉంటే చాలు ఆంధ్ర క్రికెట్లో అవకాశం దక్కుతుందనే భావన అన్ని వర్గాల్లో వెళ్లటంలో ఎమ్మెస్కేదే కీలక పాత్ర. సాధారణ నేపథ్యం ఉన్న కుర్రాళ్లను సానబెట్టేందుకు ఏర్పాటు చేసిన మూడు రెసిడెన్షియల్ అకాడమీలు (అండర్-14, అండర్-16, అండర్-19) అతని మార్గదర్శనంలో మంచి ఫలితాలు అందించాయి. గత రెండేళ్లలో ఆంధ్ర రంజీ జట్టును పటిష్టంగా తీర్చిదిద్దడంలో ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత ఏడాది నాకౌట్ దశకు అర్హత సాధించిన ఆంధ్ర, ఈ సారి కూడా నిలకడగా రాణించింది. ఇటీవల ఆంధ్ర మహిళల అండర్-19 జట్టు జాతీయ చాంపియన్గా కూడా నిలిచింది. కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎమ్మెస్కే చురుగ్గా పని చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్లో ప్రస్తుతం వేర్వేరు వయో విభాగాల్లో ఉన్న 9 సెలక్షన్ కమిటీల్లో ప్రసాద్ భాగం కావడం విశేషం. గతంలో బోర్డు టెక్నికల్ కమిటీ, ఎన్సీఏ కమిటీలో ప్రసాద్ సభ్యుడిగా పని చేశారు. ఎమ్మెస్కే 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత్కు ప్రాతి నిధ్యం వహించారు. 1999-2000లో సచిన్ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టులో ప్రసాద్ సభ్యుడు. 96 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 4021 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ 239 క్యాచ్లు పట్టి, 27 స్టంపింగ్లు చేశారు. అభినందనలు... సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్ను ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అభినందించారు. తెలుగువారికి ప్రసాద్ గర్వకారణంగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆంధ్ర క్రికెట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడ సమష్టిగా మేం చేస్తున్న కృషి అందరికీ కనిపిస్తోంది. ఈ కారణాలతోనే సౌత్నుంచి మరికొన్ని సీనియర్ ఆటగాళ్ల పేర్లు వచ్చినా...నా పనితీరు గురించి చెప్పి అవకాశం కల్పించిన గోకరాజు గంగరాజుగారికి కృతజ్ఞతలు. ఇక్కడ కేవలం ప్రతిభ మినహా ఎలాంటి సిఫారసులను పట్టించుకోవద్దంటూ ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లే ఆంధ్ర క్రికెట్నుంచి అనేక మంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. భారత సెలక్టర్గా కూడా సమర్థంగా పని చేసేందుకు ప్రయత్నిస్తా. ఇది నాకో సవాల్లాంటిది. ఇప్పుడే చెప్పలేను కానీ మున్ముందు ఆంధ్రనుంచి భారత జట్టుకు ఎక్కువ మంది ఎంపికవుతారని ఆశిస్తున్నా’ -‘సాక్షి’తో ఎమ్మెస్కే ప్రసాద్ -
సెలక్టర్గా ఎమ్మెస్కే ప్రసాద్
రోజర్ బిన్నీపై వేటు వైజాగ్కు టెస్టు హోదా ముంబై: భారత క్రికెటర్ సీనియర్ సెలక్షన్ కమిటీలో భారత మాజీ వికెట్ కీపర్, ఆంధ్రకు చెందిన మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్కు చోటు లభించింది. సౌత్ జోన్నుంచి ఇప్పటి వరకు సెలక్టర్గా ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ కమిటీలో చైర్మన్ సందీప్ పాటిల్తో పాటు విక్రమ్ రాథోడ్, సబా కరీం కొనసాగనుండగా...సెంట్రల్జోన్ నుంచి రాజీందర్ సింగ్ హన్స్ స్థానంలో రాజస్థాన్ మాజీ ఆటగాడు గగన్ ఖోడాకు అవకాశం దక్కింది. ఖోడా భారత్ తరఫున ఓపెనర్గా 2 వన్డేలు ఆడారు. తండ్రి సెలక్టర్ కావడం వల్ల స్టువర్ట్ బిన్నీ కెరీర్పై ప్రభావం పడుతోందని, అతను తన ప్రతిభతో ఎంపికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడని ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు మనోహర్ అభిప్రాయ పడ్డారు. అందు వల్లే రోజర్ బిన్నీని తప్పించామని, మున్ముందు స్టువర్ట్పై ఎలాంటి ఒత్తిడి ఉండదని, అతను స్వేచ్ఛగా ఆడవచ్చని ఆయన అన్నారు. ఆరు కొత్త టెస్టు వేదికలు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)కు ఆనందం కలిగించే మరో నిర్ణయాన్ని బోర్డు ఏజీఎంలో తీసుకున్నారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంకు టెస్టు హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. వైజాగ్తో పాటు పుణే, రాజ్కోట్, ఇండోర్, ధర్మశాల, రాంచీ కూడా టెస్టు వేదికలు కానున్నాయి. ఈ వన్డే వేదికల్లో టెస్టుల నిర్వహణకు తగిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయని బోర్డు అభిప్రాయ పడింది. వైజాగ్లో ఇప్పటివరకు ఐదు వన్డేలు జరిగాయి. ఏసీఏ కార్యదర్శి, బీసీసీఐ ఉపాధ్యక్షుడు అయిన గోకరాజు గంగరాజు టూర్ ప్రోగ్రామ్ అండ్ ఫిక్స్చర్స్ కమిటీ చైర్మన్గా కూడా ఎంపికయ్యారు. -
'క్రికెటర్ల ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యత'
-
'క్రికెటర్ల ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యత'
కడప:భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఎంపిక విషయంలో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తానని జాతీయ జట్టు సెలెక్టర్ గా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో ప్రసాద్ కు సెలెక్టర్ల జాబితాలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ ను వైఎస్ రాజారెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్మానించారు. అనంతరం ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ఆంధ్ర క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయన్నాడు. జట్టు ఎంపికలో ఆటగాళ్ల ప్రతిభకే తాను పెద్ద పీట వేస్తానని తెలిపాడు. ఈరోజు జరిగిన ఏజీఎం సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలకగా, వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. దీంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున అతడు ఆడాడు. -
విశాఖ స్టేడియానికి టెస్టు హోదా
ముంబై: విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ -వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా కల్పిస్తూ బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్తగా విశాఖతో పాటు రాంచీ, ఇండోర్, రాజ్ కోట్, పుణే స్టేడియాలకు టెస్టు హోదా కల్పించారు. దీంతో పాటు టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ శుక్లాను తిరిగి అదే స్థానంలో కొనసాగించాలని వార్షిక సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకూ భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలకగా, వారి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరభ్ గంగూలీని నియమించారు. -
రోజర్ బిన్నీకి ఉద్వాసన!
టి20 ప్రపంచకప్కు నాలుగు నెలల ముందు సీనియర్ సెలక్షన్ కమిటీలో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం జరిగే బోర్డు ఏజీఎంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. రోజర్ బిన్నీ తన కుమారుడు స్టువర్ట్ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అలాగే సందీప్ పాటిల్ స్థానంలో చైర్మన్గా అమర్నాథ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
టీమిండియా కెప్టెన్గా రహానే
-
ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం, న్యూస్లైన్ : ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నిక సోమవారం జరి గింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టెంక చలపతిరావు, సన్నశెట్టి రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నేత బి.జోబిబాబు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. సహా ధ్యక్షునిగా జి.బాలాజీరావు, ఉపాధ్యక్షులుగా చింతాడ దిలీప్కుమార్, నానుబాల ప్రభాకరరావు, మైలపల్లి తులసీరావు, ఎం.లక్ష్మణరావు, అదనపు కార్యదర్శిగా కవిటి పాపారావు, కార్యదర్శులుగా కొర్రాయి చలపతిరావు, వావిలపల్లి గోవిందరావు, ఆర్.వి.అనంతాచార్యులు, పేకేటి రామారావు, వాన కామేశ్వరరావు, బూరాడ ప్రకాశరావు, కె.ప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా పి.నాగేశ్వరరావు, పి.ఆనందరావు, పొగిరి ముఖలింగం, ఎం.భుజంగరావు, టి.గిరిరాజు, మైలపల్లి వెంకటరమణ, ఎ.చిట్టన్న, బొడ్డేపల్లి నేతాజీరావు, కె.ప్రసాదరావు ఎన్నికయ్యారు. పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం పాలకులు మారినంత మాత్రాన సమస్యలకు పరిష్కారం లభించదని, నిరంతర పోరాటాలతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమని సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా ప్రగతి, సమాజ శ్రేయ స్సు లక్ష్యాలుగా సంఘం పనిచేస్తోందన్నా రు. గతంలో అపరిష్కృతంగా మిగి లిన సమస్యలను టీడీపీ ప్రభుత్వ హయాం లో సాధించుకుంటామన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలు చేపట్టాక ఆయన్ను కలసి సమస్యలపై చర్చిస్తామన్నారు. -
పైసలిస్తేనే పర్మినెంట్!
శ్రీకాకుళం టౌన్, న్యూస్లైన్: కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయడం అంటే దరఖాస్తు చేస్తే సరిపోతుందా? దీనికి కొన్ని ఖర్చులుంటాయి... ఎవరి వాటాలు వారికి ఇవ్వాల్సిందే... మీరిచ్చిన డబ్బులు ఇక్కడ ఒక్క దగ్గరే ఉండిపోతాయనుకుంటున్నారా ఏంటీ? ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి పై స్థాయి అధికారులకు ఎవరి వాటాలు వారికి ఇవ్వాలి. ఎవరి వాటాలు వారికి అందితే అంతా సక్రమంగా ఫైల్ నడుస్తుంది. లేదంటే మధ్యలోనే ఆగిపోయి వెనక్కి వస్తోంది. ఇక మీ ఇష్టం. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కాంట్రాక్ట్ కార్యదర్శులను నమ్మిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... కాంట్రాక్టు కార్యదర్శులను పర్మినెంట్ చేస్తామని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొన్ని మెలికలు పెట్టింది. ఈ మెలికలే వసూళ్లకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో 156 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిలో డిగ్రీ అర్హత ఉన్న వారు 135 మంది. వీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 4వ తేదీ వరకు గడువు విధించింది. మిగిలిన 30 పోస్టులకు ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికీ కాంట్రాక్టు కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి 25 శాతం మార్కులు అదనంగా కేటాయిస్తారు. అంటే దాదాపుగా వీరందరికీ పర్మినెంట్ అవుతుందని అధికార వర్గాల సమాచారం. అయితే దరఖాస్తు చేయడం, సెలక్షన్ కమిటీ ఎంపిక తదితర ప్రక్రియలు ఉండడంతో వసూళ్లకు అస్కారమిచ్చినట్లైందని ఆ శాఖ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఈ లొసుగుల్ని అధారంగా కాంట్రాక్టు కార్యదర్శుల నుంచి రూ 50 వేల నుంచి రూ లక్ష వరకు వసూలు చేయడానికి రంగం సిద్ధమైందన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. డీపీవో కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పనుల్లో చక్రం తిప్పే ఓ ఉద్యోగి అక్రమ వసూళ్లకు బీజం చేశాడని సమాచారం. పై స్థాయి జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి వరకు వాటాలు ఇవ్వాలని నమ్మబలుకుతున్నట్లు భోగట్టా. ఇది ఎంతవరకు నిజమో కానీ కాంట్రాక్టు కార్యదర్శులు మాత్రం ఇన్నాళ్లు సర్వీసు చేసిన వాళ్ల దగ్గర నుంచి కూడా వసూళ్లు చేయడం దారుణమని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.