Sikh
-
అవును.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్సర్లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్సర్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.చెత్త కుప్పలో పడేశారు!‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం. నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్కు చేరుకున్నారు. -
Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు? -
సిక్కుల ఓట్ల కోసమే చిచ్చు!
ప్రజా వ్యతిరేకతను, సొంత పార్టీ లో తిరుగుబాటును అధిగమించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? కెనడాలో గణనీయ సంఖ్యలో ఉన్న సిక్కు ఓటర్లను ప్రసన్నం చేసుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తహతహలాడుతున్నారా? కేవలం అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్– కెనడా సంబంధాలను బలి పెట్టడానికి సైతం వెనుకాడడం లేదా? రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అవుననే చెబుతున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కమార్ వర్మను ట్రూడో ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ట్రూడో పదవీ కాంక్ష వల్ల భారత్, కెనడా ప్రజలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మరో ఏడాది సమయమే మిగిలి ఉంది. మరోవైపు జస్టిన్ ట్రూడో పాలనల పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సొంత పార్టీ లో సైతం నిరసన గళాలు బలం పుంజుకుంటున్నాయి. ట్రూడో నాయకత్వాన్ని, పరిపాలనా సామర్థ్యాన్ని అధికార ‘లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా’ నాయకులు ప్రశి్నస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి నిజ్జర్ హత్యను ట్రూడో తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజ్జర్ వ్యవహారంలో భారత్ను ఇరుకునపెట్టడం ద్వారా సిక్కుల ఓట్లపై ఆయన వల విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2021 నాటి గణాంకాల ప్రకారం కెనడాలో 7.70 లక్షల మంది సిక్కులున్నారు. అంటే జనాభాలో 2.1 శాతం మంది సిక్కులే. భారత్కు వెలుపల అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉన్న దేశం కెనడా. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండి రాజకీయ ప్రాబల్యం కలిగిన సిక్కులను మచ్చిక చేసుకోవడానికి కెనడా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తులను ప్రోత్సహిస్తుంటాయి.భారత్లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న నినాదంతో పుట్టుకొచి్చన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కెనడా అడ్డాగా మారిపోయింది. వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థలు కెనడా నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీ లు వీటికి మద్దతిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. కనీసం 9 ఖలిస్తానీ టెర్రర్ గ్రూప్లకు కెనడాయే ప్రధాన స్థావరం. ఇవన్నీ భారత సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయి. తమ దేశంలో నేరాలకు పాల్పడిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కెనడా లెక్కచేయడం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా తిరస్కరిస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఖలిస్తానీలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోంది. ట్రూడో పాలనలో కెనడా దేశం భారత్కు మరో పాకిస్తాన్గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థి వీసాలపై పిడుగు! కెనడా–భారత్ మధ్య విభేదాలు ముదురుతుండడంతో ఇరు దేశాల ప్రజలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వీసా సేవలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కెనడాలో 1.78 లక్షల మంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), 15.10 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. 2.80 లక్షల మందికిపైగా భారత విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 41 శాతం మంది భారతీయులే.ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలను ప్రభుత్వం 3.60 లక్షలకే పరిమితం చేసింది. 2022 నాటితో పోలిస్తే విద్యార్థి వీసాల సంఖ్యను 35 శాతం తగ్గించింది. దీనివల్ల భారతీయ విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో విభేదిస్తున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారతీయ ఉద్యోగులను ఇప్పటికప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి లేకున్నా, సమీప భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్పోర్ట్లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)ను టార్గెట్ చూస్తూ తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే డల్లాస్లో విమర్శలు గుప్పించిన రాహుల్. తాజాగా వర్జినాలోనూ అదే తరహాలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు, మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్ఎస్ఎస్ తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అలాగే భారత్లో సిక్కు మతస్థుడు తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో, సిక్కులను గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. భారత్లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. అయితే యూఎస్లో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ.. విదేశాల వేదికగా ప్రవాసుల భారతీయుల మధ్య దేశంపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ భారత్కు తిరిగి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.‘రాహుల్ వ్యాఖ్యలు దుర్మార్గం. అతని ముందు ఉన్న వారు నా కమ్యూనిటీకి చెందినవారు. వారు యూఎస్లో జీవిస్తున్నారు. దేశంతో బలమైన సంబంధం లేదు. అలాంటి వారికి రాహుల్ తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. తన అమెరికా పర్యటనలో భారత న్యాయ వ్యవస్థపై, ఎన్నికల ఫలితాలపై, కాంగ్రెస్ ఖాతాల స్తంభణపై మాట్లాడుతున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో భారత్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రాస్తావించడం విస్మరించారు.నేను ఆరు దశాబ్దాలుగా ఓ సిక్కుగా టర్బన్ (తలపాగా) ధరిస్తున్నాను. కడెం కూడా వేసుకుంటున్నాను. దీన్ని ధరించడంలో ఎప్పుడూ సమస్య రాలేదు. అసలు రాహుల్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు భయాందోళనతో జీవించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత1984లో సిక్కులపై హత్యాకాండ జరిగింది. మూడు వేల మంది అమాయక ప్రజలను చంపారు. వారిని ఇళ్ల నుంచి బయటకు లాగి సజీవ దహనం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో సిక్కు సమాజం చాలా సురక్షితంగా, గౌరవంగా జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది’ అని తెలిపారు. -
దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెగ్నెంట్తో ఉండి కూడా వరుస సినిమాల ప్రమోషన్లు, షూటింగ్లతో బిజీగా ఉండే నటి. బిలియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లగ్జరీయస్ వివాహానికి హజరైన నటి దీపికా పదుకొణె డిఫెరెంట్ లుక్తో మెస్మరైజ్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజుల కాలం నాటి దుస్తులు, నగలతో దేవకన్యలా మెరిసింది. దీపీకా ఈ వివాహ వేడుకలో 20వ శతాబ్దం నాటి టోరానీ సింధీ చోగా సల్వార్ ధరించింది. ముఖ్యంగా ఆమె కంఠానికి ధరించిన చోకర్ నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీపికా ధరించిన నగ సిక్కు సామ్రాజ్యం మొదటి పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ నాటి కాలంలోని నగ. చెప్పాలంటే ఆయన దీన్ని చేతి పట్టి లేదా మోచేతి ఆభరణంగా ధరించేవారు. సిక్కు కళాత్మకతకు ఈ నగ అద్భుతమైన ఉదాహరణ. ఆ నగలో ఆకట్టుకునే రీతీలో జెమ్సెట్తో ఉంది. మధ్యలో ఓవల్ షేప్లో 150 క్యారెట్ల బరువుతో ఒక జెమ్. దాని చుట్టూ రెండు వరుసల నీలమణి రాళ్లు ఉంటాయి.ఆ నగ బాజుబ్యాండ్ సిక్కు హస్తకళకు నిదర్శనం. మహారాజు రంజిత్ సింగ్కు ఆభరణాలు, విలువైన రాళ్ల అన్న మక్కువ. ఆయన ఖజానా(లాహోర్ తోషఖానా) కోహ్ ఇ నూర్ వజ్రాలకు నిలయంగా ఉంది. అయితే ఇప్పుడది బ్రిటిష్ కిరీటం అధీనంలో ఉంది. మహారాజా రంజిత్ సింగ్ ఆభరణాల సేకరణల ఎలా ఉండేదనేందుకు ఈ నగను రూపొందించిన విధానమే నిదర్శనం. కాగా, ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత అతని లాహోర్ తోషఖానా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దంలో, రంజిత్ సింగ్, అతని వారసుడు షేర్ సింగ్ మరణానంతరం, అతని చిన్న కుమారుడు పదేళ్ల వయసులో దులీప్ సింగ్ వారసుడిగా ఎంపికయ్యాడు.పంజాబ్ విలీనమైన తర్వాత, అతని తల్లి మహారాణి జిందన్ కౌర్ అరెస్టయ్యి, నేపాల్కు బహిష్కరించబడింది. దీంతో అతను పంజాబ్పై ఈస్ట్ ఇండియా కంపెనీకి సంతకం చేయవలసి వచ్చింది. కోహ్-ఇ-నూర్ వజ్రాలే కాకుండా, సిక్కు రాజ్యం నుంచి కొల్లగొట్టబడిన ఇతర ఆభరణాలలో తైమూర్ రూబీ అని పిలువబడే 224 పెద్ద ముత్యాలతో కూడిన మరొక ప్రసిద్ధ హారము కూడా ఉంది. 1820 నుంచి 1830 మధ్య కాలంలో స్వర్ణకారుడు హఫీజ్ ముహమ్మద్ ముల్తానీ చేసిన మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.(చదవండి: అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..) -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
అమృత్పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్పాల్ లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఆధారాలు అందజేస్తే పరిశీలిస్తాం
న్యూఢిల్లీ: అమెరికాలోని సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత ప్రమేయముందన్న అంశంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై మోదీ మాట్లాడారు. ‘‘ పన్నూ హత్య కుట్రలో భారత్ ప్రమేయముందని ఎవరైనా బలమైన ఆధారాలు మా ప్రభుత్వానికి సమరి్పస్తే తప్పకుండా పరిశీలిస్తాం. మా భారతీయ పౌరుడు ఏదైనా మంచిపనో, చెడు పనో చేసి ఉంటే మాకు చెప్పండి. బలమైన ఆధారాలు అందజేయండి. మేం తప్పక పరిశీలిస్తాం. చట్టబద్ధపాలనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంబంధంలేని విషయాలతో అమెరికా–భారత్ దౌత్య సంబంధాలను కలపొద్దు. గత కొద్ది సంవత్సరాలుగా ఇరుదేశాల మైత్రి బంధం మరింత బలపడుతోంది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వమున్న పన్నూను హత్యచేసేందుకు భారతీయ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ పోలీసుల కస్టడీలో ఉన్న గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా ఒత్తిడిపెంచిన నేపథ్యంలో దీనిపై మోదీ మాట్లాడారు. ‘‘ అనవసర ఆరోపణల విషయం మాదాకా వచి్చంది. ఇప్పటికే ఈ ఆరోపణల్లో నిజానిజాల నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేశాం’’ అని మోదీ వెల్లడించారు. ‘‘ భావ ప్రకటనా స్వేచ్ఛ మాటున కొందరు విదేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇంకోవైపు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు సమున్నత స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి వేర్వేరు ఘటనలకు మధ్య సంబంధం అంటగట్టడం సరికాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. -
అదే రోజున పార్లమెంట్పై దాడి..! భారత్కు పన్నూ బెదిరింపులు
ఢిల్లీ: సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్కు మరోసారి హెచ్చరికలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్లు నిండడం గమనార్హం. అమెరికాలో భారత్ చేపట్టిన తన హత్య కుట్ర విఫలమైందని పేర్కొంటూ పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్ను వీడియోలో పన్నూ ప్రదర్శించాడు. తనను చంపడానికి భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని పన్నూన్ పేర్కొన్నాడు. డిసెంబరు 13 లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తూ వీడియోను విడుదల చేశాడు. ఈనెల 2 నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పన్నూ బెదిరింపులకు పాల్పడటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత వ్యతిరేక విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన కే-2 (కశ్మీర్-ఖలిస్థాన్) విభాగం పన్నూకి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఇటీవల పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాతో భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. ఇదీ చదవండి: పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్విక్లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
తెలంగాణ సిక్కుల వెనక అసలు కథ రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ
గురునానక్ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. గురునానక్ బోధనల్లో మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. హిందూ, ఇస్లాం రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి,మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి, ఆయనిచ్చిన గొప్ప సందేశం ఏంటంటే.. 'హిందువు లేడు, ముస్లిం లేడు, ఇద్దరూ ఒక్కటే!' 200 ఏళ్ల కిందే సిక్కులొచ్చారు హైదరాబాద్లోని సిక్కుల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో ఆనాటి హైదరాబాద్ 4వ నిజాం ( 1829-1857) తన ప్రధాని చందూలాల్ (పంజాబ్ ఖత్రీ) సలహాపై ఒక ఒప్పందం ప్రకారం 1832 లో లాహోరి ఫౌజ్లో భాగంగా వీరిని హైదరాబాద్ కు పిలిపించుకున్నాడు. వారు నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టడంలో కూడా సేవలు అందించారు. ఆనాడు సిక్ రెజిమెంట్ క్యాంపు అత్తాపూర్ దగ్గరున్న బరంబలాలో ఉండేది. అక్కడే హైదరాబాద్ లోని మొట్ట మొదటి గురుద్వారా నిర్మింపబడింది. తెలంగాణ అంతటా ఎన్నో గుర్తులు అలా వచ్చిన సిక్కులు హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణా అంతా విస్తరించారు, స్థానికులతో కలిసిపోయారు. మాతృ భాష పంజాబీని మరిచిపోకుండానే తెలుగు భాషా సంస్కృతులకు అలవాటు పడ్డారు. సికింద్రాబాద్ లో ఏకంగా ఒక సర్దార్జీల గ్రామమే ఉంది. ప్యారడైజ్కు మూడు కిలో మీటర్ల దూరంలోనున్న ఆనాటి 'సిక్కుల తోట'నే కంటోన్మెంట్ పరిధిలోనున్న నేటి 'సిక్ విలేజ్'. వ్యాపారాల్లో ఉద్ధండులు చాలా మంది సర్దార్జీ లు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి పోయారు. ఇక్కడో గురుద్వారా కూడా నిర్మించుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒకప్పటి 'గచ్చుబాయ్ తాండా' ఇప్పుడు' గురుగోవింద్ నగర్ 'గా మారిపోవడం విశేషం. సిక్ హెరిటేజ్ ఫౌండేషన్ వారు 'డెక్కన్ సిక్కుల సంస్కృతి'పై సాలర్ జంగ్ మ్యూజియం లోనున్న పెక్కు చారిత్రక వ్రాత ప్రతుల ఆధారంగా పరిశోధన చేయడం ముదావహం. సిక్కు జీవితంలోంచి వచ్చిన కథ ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సిక్కు కుటుంబాల్లోంచి వచ్చిందే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ. పూర్వ కరీంనగర్ జిల్లాలోని రాఘవ పట్నం కు చెందిన బహు గ్రంథకర్త రామసింహ కవి( 1857 - 1963 ) సర్దార్జీయే. నిజాం కాలం నాటి ఈ కవి ఆత్మకథ వారి మునిమనవడైన సర్దార్ గురుదేవ్ సింగ్ గారి వద్ద లభించగా దాన్ని వేముల ప్రభాకర్ పరిష్కరించి, మిత్రుడు తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ పర్యవేక్షణలో ప్రచురించగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘము వారి వేదికపై (తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో) తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్, ప్రముఖ కథకుడు శ్రీ కాలువ మల్లయ్య ఆవిష్కరించారు. -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్పుత్లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్పుత్ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్పుత్లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఇంగ్లండ్లో సర్దార్జీల సేద్యం!
ఇంగ్లండ్.. వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ చారిత్రక పారిశ్రామిక పట్టణం స్మెదిక్. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న వందలాది పంజాబీ సిక్కు కుటుంబీకులు అర్బన్ ఫార్మర్స్గా మారారు. వ్యవసాయంతో, భూమితో వారికి అనువంశికంగా ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాన్ని స్మెదిక్లోని తమ పెరటి తోటల ద్వారా పునరుజ్జీవింపజేసుకున్నారు. స్మెదిక్ పట్టణానికున్నట్టే సర్దార్జీల వలస గాథకూ సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ∙∙ 1779వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పురాతన ఆవిరి యంత్రాన్ని స్మెదిక్లో నెలకొల్పటం పారిశ్రామిక చరిత్రలోనే ఒక మైలురాయి. అందుకే ఆ యంత్రానికి ‘స్మెదిక్ ఇంజిన్’గా పేరు. పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన ఈ పట్టణంలో 5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 90 స్టీల్ ఫౌండ్రీలు ఉండేవట. ఆ పరిశ్రమల చిమ్నీల నుంచి నిరంతరం వెలువడే దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది కాబట్టి.. ఈ పట్టణానికి ‘బ్లాక్ కంట్రీ’ అని పేరొచ్చిందట. శ్వేత జాతీయులతో పాటు అనేక కామన్వెల్త్ దేశాల నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల ప్రజలు ఈ శ్రమజీవుల పట్టణంలో జీవిస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వలస జీవులు స్మెదిక్లో జీవిక కోసం వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీరిలో పంజాబీల సంఖ్య ఎక్కువ. 1917లో తొలిగా 50కి పైగా సిక్కు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత (1945 నుంచి) మరింత మంది సిక్కులు భారత దేశం నుంచి ఇక్కడకు చేరారు. 1961లో ఓ పాత చర్చ్ను కొనుగోలు చేసి గురుద్వారాగా మార్చుకున్నారు. స్మెదిక్ జనజీవనంతో సామాజికంగా, భావోద్వేగపరంగా సిక్కు సామాజిక వర్గం మమేకమయ్యే ప్రక్రియ అంతటితో పూర్తయ్యిందని చెప్పొచ్చు. ∙∙ పారిశ్రామిక కాలుష్యం వల్ల సహజ వనరులన్నీ కలుషితమైపోవటం వల్ల కాలక్రమంలో అక్కడి ప్రజల ఆయర్దాయం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి 11 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం ‘గార్డెన్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి పనిగట్టుకొని సుమారు 45 వేల కొత్త ఇళ్లను నిర్మించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పని యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. ఈ క్రమంలో సర్దార్జీల ఇంటిపంటల నైపుణ్యం గురించి స్థానిక పత్రికలు కథనాలు రాయటం ప్రారంభించాయి. పంజాబ్ నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగానో మిత్రులతోపాటో పారిశ్రామిక కార్మికులుగా వలస వచ్చిన తొలినాటి సర్దాజీలు.. అప్పట్లోనే తమ కోసం కూరగాయలు పండించుకోవటం ప్రారంభించారు. ఆ విధంగా వలస జీవులను ఇంటిపంటలు కనెక్ట్ చేస్తూ ఉత్తేజితపరుస్తూ వచ్చాయి. ‘వ్యవసాయంతో, భూమితో ఈ అనుబంధం మా సంస్కృతికి మూలం. ఏ సీజన్లో ఏమి తింటామో అవి పండించుకుంటాం’ అంటున్నారు స్మెదిక్ సర్దార్జీలు సంతోషంగా! (చదవండి: వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?) -
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
సిక్కు అల్లర్ల కేసులో టైట్లర్పై చార్జిషీటు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్(78)పై సీబీఐ శనివారం ప్రత్యేక కోర్టులో చార్జిషీటు వేసింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. ఈ నేరానికి గాను ఆయన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ అభియోగాలపై జూన్ 2న కోర్టు విచారణ చేపట్టనుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. -
సిక్కు మత్త పెద్దలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
అమృత్పాల్ @ ఆ ఏడుగురు...
దుబాయ్లో డ్రైవర్గా పని చేసే అమృత్పాల్ సింగ్ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్ఐ అమృత్పాల్ను దుబాయ్ నుంచి పంజాబ్కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్పాల్ సింగ్ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్పాల్ భారత్కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. పపల్ప్రీత్ సింగ్ అమృత్పాల్ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్ఐ ఆదేశాల మేరకే పపల్ప్రీత్ సింగ్ అమృత్సింగ్ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్ప్రీత్ సింగ్ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్పాల్ బైక్పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్ప్రీత్గా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్ప్రీత్ సింగ్ పంజాబ్లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్ డిమాండ్తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్ప్రీత్ సింగ్ సూచనల మేరకే అమృత్పాల్ సింగ్ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. భగవంత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు కుడిభుజం. పంజాబ్లో అజ్నాలా పోలీసు స్టేషన్లో హింసాకాండకు భగవంత్ సింగ్ బాధ్యు డు. అమృత్పాల్ సింగ్కు మీడియా, సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్సింగ్ పరారయ్యాక భగవంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను సోషల్ మీడియా లైవ్లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్ అన్నీ బ్లాక్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. గుర్మీత్ సింగ్ అమృత్పాల్ సింగ్ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్ సింగ్ . పోలీసులు అమృత్సింగ్పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్సర్ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్ కూడా దిబ్రూగఢ్ జైల్లోనే ఉన్నాడు దల్జీత్ సింగ్ కల్సి అమృత్సర్కు చెందిన దల్జీత్ సింగ్ కల్సి అమృత్పాల్కు ఫైనాన్షియర్. పాకిస్థాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకి అమృత్పాల్కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లవ్ప్రీత్ తుఫాన్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్పాల్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. లవ్ప్రీత్ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్పాల్ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్లో విధ్వంసం సృష్టించాడు. హర్జీత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్జీత్ సింగ్ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్జీత్ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్జీత్ సింగ్ దుబాయ్లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్పాల్ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్జీత్ భారత్కు తిరిగి వచ్చాడు. అమృత్పాల్ దుబాయ్ నుంచి పంజాబ్కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్జీత్ ప్రభావం అధికంగా ఉంది. కిరణ్దీప్ కౌర్ అమృత్పాల్ సింగ్ భార్య. బ్రిటన్కు చెందిన ఎన్నారై. రివర్స్ మైగ్రేషన్ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్ తీసుకురావడానికే ఈమెను అమృత్పాల్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అమృత్పాల్కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు. ఎజెండా ఇదీ ... ► పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్పాల్ సింగ్ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ► విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్ యువతలో గన్ కల్చర్ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. ► పంజాబ్లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు. ► డ్రగ్స్కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్ నుంచి వచ్చాక జల్లూపూర్ కెహ్రా గ్రామంలో డ్రగ్ డీ–ఎడిక్షన్ సెంటర్ని నెలకొల్పాడు. ► డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్ పంజాబ్ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది. అమృత్పాల్పైనున్న కేసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ మొత్తం ఆరు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. ఫిబ్రవరి 16 : అమృత్పాల్పై కిడ్నాప్, దాడి కేసు నమోదు ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు ఫిబ్రవరి 23 – అమృత్పాల్, అతని సాయుధ అనుచరులు పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు మార్చి 19 : ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు జలంధర్లో కేసు -
ఖలిస్తాన్ 2.0
శనివారం నుంచి మూడు రోజులుగా నిరంతర గాలింపు. అయినా దొరకలేదు. ఇప్పటికి వందమందికిపైగా అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పొద్దుగూకాక కూడా నిందితుడు పోలీసుల గస్తీ కళ్ళ నుంచి తప్పించుకొని, తిరుగుతూనే ఉన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ పరారీ, అందుకు దారి తీసిన పరిస్థితులు చూస్తే, నలభై ఏళ్ళ నాటి తీవ్రవాద సంక్షుభిత పంజాబ్ పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న ఆందో ళన కలుగుతోంది. సిక్కులకు సార్వభౌమాధికార దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్పాల్ ముఠా బలప్రదర్శన చేసి,అమృత్సర్లో పోలీస్స్టేషన్పై ఫిబ్రవరి 23న దాడి చేసి నెలవుతున్నా, నిన్నటి దాకా కళ్ళు తెరవని ‘ఆప్’ సర్కార్ వైఫల్యం వెక్కిరిస్తోంది. గాలివార్తలు సుడిగాలిలా వైరల్ అవుతున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్ సేవల్ని మంగళవారం మధ్యాహ్నం దాకా పాలకులు నిలిపివేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రూపం మార్చుకున్న సరికొత్త ఖలిస్తాన్ 2.0 విజృంభిస్తోందా? 1980–90ల్లోలా పంజాబ్ మళ్ళీ అగ్నిగుండం కానుందా? హత్యానేరం, పోలీసులపై దాడి సహా కనీసం 7 క్రిమినల్ నేరారోపణలున్న అమృత్పాల్ ఇప్పుడు పంజాబ్లో మళ్ళీ పుంజుకుంటున్న వేర్పాటువాదానికి కేంద్రబిందువయ్యాడు. మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడానికి పనిచేసే డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్పాల్ తన అడ్డాగా చేసుకున్నాడట. ఆ స్థావరాల్లో కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నాడని గూఢచారి వర్గాల సమాచారం. ఆయుధాలు – బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు దొరకడం, సాయుధ పోరాటం ఇష్టం లేదంటూనే ‘ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) పేరును ప్రాచుర్యంలో పెట్టడం లాంటి అమృత్పాల్ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంధువుల సాయంతో 20 ఏళ్ళ వయసులో దుబాయ్ వెళ్ళి, భారీ వాహనాల డ్రైవర్గా పని చేసి, నిరుడు భారత్కు తిరిగొచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ఈ స్థాయికి చేరడం చిత్రమే. నిన్నటి దాకా ఆధునిక వేషభాషల్లో ఉన్న 30 ఏళ్ళ అమృత్పాల్ ఇవాళ సాంప్రదాయిక సిక్కు వస్త్రధారణలో, చేతిలో కృపాణంతో, ఖలిస్తానీ ఉద్యమానికి వేగుచుక్క కావడం సహజ పరిణామం అనుకోలేం. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానం బలపడుతున్నది అందుకే. అతనికి నిధులెక్కడివన్నదీ ఆరా తీయాల్సిందే! ఇక, పలాయితుడిపై జాతీయ భద్రతా చట్టం విధిస్తారన్న వార్త పరిస్థితి తీవ్రతకు ఉదాహరణ. 1980లు, 90లలో అకాలీలు తీవ్రవాద ఆరోపణలతో అరెస్టయిన తమ అనుయాయుల విడుదల కోసం వీధికెక్కినట్టే, ఈ 2023లో అమృత్పాల్, ఆయన తోటి ఖలిస్తానీ మద్దతుదారులు తమ సహచరుడి విడుదల కోసం గత నెలలో వీధికెక్కారు. ఏడేళ్ళ వయసు నుంచే సాంప్రదాయిక సిక్కు ధార్మిక శిక్షణ పొందిన ఒకప్పటి ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్వాలేకు భిన్నంగా,అలాంటి శిక్షణేమీ లేకుండా ఉన్నట్టుండి అలాగే వేషం కట్టి, మాట్లాడుతున్నాడు అమృత్పాల్. స్వీయ ప్రచారం మాటెలా ఉన్నా అతనిని ‘భింద్రన్వాలే 2.0’ అనలేం. సాయుధ అంగరక్షకుల నడుమ ఊరూరా తిరుగుతూ, రెచ్చగొడుతున్నాడు. 1984లో అమృత్సర్ స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్లో భింద్రన్వాలేను హతమార్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిర, పంజాబ్ సీఎం బియాంత్ సింగ్లకు పట్టిన గతి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్షా, పంజాబ్ సీఎం మాన్లకు పడుతుందని తొడకొడుతున్నాడు. మానిన పాత గాయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు. భారత్ పట్ల ఖలిస్తానీల విద్వేషం బ్రిటన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉన్నట్టుండి వెల్లువె త్తడం మరింత ఆందోళనకరం. బరి తెగించిన ఖలిస్తానీ దుండగులు లండన్ తదితర ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయాలపై దాడి చేయడం, జాతీయ జెండాను తొలగించడం దుస్సహం. రాయబార కార్యాలయానికి కాపుండాల్సిన ఆయా దేశాల ఉదాసీన వైఖరీ ముమ్మాటికీ తప్పే. అసలు మన బంగారం మంచిదైతేగా! పంజాబ్ సంపన్న రాష్ట్రమే కానీ, గత పదిహేనేళ్ళలో తీవ్రనిరుద్యోగంతో యువత తప్పుదోవ పడుతోంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా 2020 – 21లో పంజాబీ సోదరులు పోరాటం సాగిస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘంగా సాగదీసిన కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత సైతం అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణం. హిందూ రాష్ట్రమనే భావనను పైకి తెస్తున్న పిడి వాదులూ, పరోక్షంగా ఖలిస్తానీల సిక్కురాజ్య వాదనకు ప్రేరేపకులే! నిరుద్యోగ యువత అసంతృప్తి, రైతుల ఆగ్రహం, ‘ఉఢ్తా పంజాబ్’గా మారిన రాష్ట్రంలో ఇట్టే దొరుకుతున్న మాదక ద్రవ్యాలు, పాక్ సరిహద్దుల నుంచి ఆయుధ ప్రవాహం, పాలకుల నిస్తేజం... అన్నీ కలసిన పంచకూట కషాయమే – పంజాబ్లో ప్రబలుతున్న దేశవ్యతిరేక కార్యకలాపాలు. జనబాహుళ్య అసంతృప్తిని తెలివిగా వాడుకుంటూ తన పునాదిని విస్తరించుకుంటున్న అమృత్ పాల్కు పాక్ అండతో సాగుతున్న విదేశీ ఖలిస్తానీ మద్దతుదారులు తోడవడం అగ్నికి ఆజ్యమే. తనను తాను అతిగా ఊహించుకుంటున్న ఈ వేర్పాటువాదిని ఆదిలోనే అడ్డుకోవాలి. మొగ్గలోనే తుంచకపోతే విభజనవాదం బ్రహ్మరాక్షసిగా మారి మింగేస్తుంది. కదం తొక్కాల్సిన పాలకులు కాలహరణం చేస్తే పంజాబ్లో మళ్ళీ పాత చీకటి రోజులు ముందుకొస్తాయి. పారా హుషార్! -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్ను ఉప మేయర్గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్గా, ఉప మేయర్గానూ సేవలందించారు. మేయర్గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్లోని పంజాబ్కు చెందిన వారు. ఆర్మ్స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్న్యూస్! -
మహోజ్వల భారతి: దేవుడు, దాసుడు
బందా సింగ్ బహదూర్ (1670–1716) సిక్కు సైన్యాధ్యక్షుడు. మహా యోధుడు. లక్ష్మణ్ దేవ్, బందా బహదూర్, లక్ష్మణ్ దాస్, మాధవ్ దాస్ అనే పేర్లతోనూ ఆయన ప్రఖ్యాతి చెందారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరి ఆయన జన్మస్థలం. పదిహేనవ యేట ఇల్లు విడిచి సన్యసించి, ‘మాధవ్ దాస్’ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలోని నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. 1708 సెప్టెంబరులో ఆయన ఆశ్రమాన్ని గురు గోవింద సింగ్ సందర్శించారు. అనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని తయారుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో మొఘల్ ప్రావిన్షియల్ రాజధాని సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదు చేశారు. పంజాబ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేపు (జూన్ 9) ఆయన వర్ధంతి. (చదవండి: స్వతంత్ర భారతి: భారత రత్నాలు) -
పాక్లో ఇద్దరు సిక్కుల కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్లో ఆదివారం ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. మృతులను సుగంధ ద్రవ్యాల దుకాణం నడుపుకునే సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38)గా గుర్తించారు. ఘటనకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. పెషావర్లో సుమారు 15 వేల మంది సిక్కు మతస్తులున్నారు. చదవండి: సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా -
శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వి, కత్తులు దూసి
చండీగఢ్: పంజాబ్లోని పాటియాలాలోని కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ఒక గ్రూప్ వారు మరో గ్రూప్పై రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూశారు. పంజాబ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా నాయకత్వంలో పాటియాలాలో ఆ పార్టీ కార్యకర్తలు ఖలిస్తానీ గ్రూపులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. శివసేన కార్యకర్తలు ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయగా.. వీరికి వ్యతిరేకంగా సిక్కు వర్గాలు కత్తులు చేతిలో పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరువర్గాలు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. కత్తులు దూయడంతో పాటియాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హరీశ్ సింగ్లా మాట్లాడుతూ, పంజాబ్లో ఖలిస్థానీ గ్రూపులు ఏర్పడటానికి శివసేన అవకాశం ఇవ్వబోదని చెప్పారు. చదవండి: వరుడి నిర్వాకం... ఊహించని షాక్ ఇచ్చిన వధువు #WATCH | Punjab: A clash broke out between two groups near Kali Devi Mandir in Patiala today. Police personnel deployed at the spot to maintain law and order situation. pic.twitter.com/yZv2vfAiT6 — ANI (@ANI) April 29, 2022 పాటియాలాలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పాటియాలాలో ఘర్షణలు జరగడం చాలా దురదృష్టకరమని తాను డీజీపీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం పాటియాలాలో పరిస్థితులు పునరుద్ధరిరంచినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశరు. పంజాబ్లో శాంతి, సామరస్యం కాపాడటం చాలా ముఖ్యమని భగవంత్ మాన్ అన్నారు. The incident of clashes in Patiala are deeply unfortunate. I spoke with the DGP, peace has been restored in the area. We are closely monitoring the situation and will not let anyone create disturbance in the State. Punjab’s peace and harmony is of utmost importance. — Bhagwant Mann (@BhagwantMann) April 29, 2022 పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. పాటియాలతోపాటు పంజాబ్ ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు తెలిపారు. -
సిక్కు ప్రముఖులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ తిరుగుబాటు వర్గం నేత సుఖ్దేవ్ సింగ్ థిండ్సాలతో ఏర్పడిన తమ కూటమి బలమైందని చూపి, సిక్కు వర్గం ఓట్లు, వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్, యమునానగర్కు చెందిన మహంత్ కరంజీత్ సింగ్, కర్నాల్కు చెందిన బాబా జోగా సింగ్, అమృత్సర్కు చెందిన సంత్ బాబా మెజోర్ సింగ్ సహా పలువురు సిక్కు ప్రముఖులు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశ సేవ,, రక్షణతోపాటు, సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో సిక్కు నేతలు ముందున్నారని అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వీర్బాల్ దివస్గా డిసెంబర్ 26
న్యూఢిల్లీ: సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్బాల్ దివస్గా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆదివారం ప్రధాని ఈ ప్రకటన చేశారు. న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతేహ్ సింగ్ మొఘల్ పాలకులు వారిని బంధించి గోడ కట్టడంతో వీరమరణం పొందారు. నమ్ముకున్న ధర్మానికి కట్టుబడి ప్రాణాలను సైతం వారు త్యజించారు’అని పేర్కొన్నారు. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీపై ఆగ్రహంతో ఉన్న సిక్కు వర్గాన్ని మంచి చేసుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్ని జోడించి మరీ ఇన్స్టాగ్రామ్లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet) -
Hyderabad: సిక్కుల ర్యాలీ: పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ జరగనుంది. అశోక్ బజార్ గురుద్వార నుంచి మొదలై మళ్లీ అక్కడికే చేరుతుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ బజార్, చార్మినార్, గోషామహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఆప్జల్ గంజ్ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్,శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాల్లో అమలులో ఉండనున్నాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగుతారు. అక్కడ నుంచి గ్రీన్ ల్యాండ్స్లోని యోథ డయాగ్నస్టిక్స్కు వెళ్తారు. సాయంత్రం 5.50 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 కు వెళ్లనున్నారు. ఆయా సమయాల్లో, ఆయా మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
తలపాగే ప్రాణాలను కాపాడింది
కెనడా: మనం వెళ్లున్నప్పుడో లేక ఎక్కడకైన వెళ్లినపుడు అనుకోకుండా అప్పటి వరకు మనతో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లను ఏ విధంగా రక్షించాలన్న ఆలోచనతో గందరగోళంలోకి వెళ్లిపోతాం. మహా అయితే ఎవరినైన సాయం చేయమని అడుగుతాం తప్ప మన వరకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనే స్ఫూరించదు. కానీ కెనడాలోన ఒక పార్కులోని ఇద్దరూ వ్యక్తులు పార్క్ దగర ఉండే నీటిలో పడిపోతే వారిని ఐదుగురు సిక్కులు తమ వద్ద రక్షించేందకు కావల్సినవి ఏమి లేకపోయినప్పటికీ వాళ్లు తలపాగనే తాడుగా చేసి మరీ వాళ్లను కాపాడతారు. (చదవండి: బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) వివరాల్లోకెళ్లితే....కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్లో కుల్జీందర్ కిండా అనే అతను తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తూ అనుకోకుండా ఇద్దరూ అక్కడ ఉన్న జారుడు బడ్డ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోతారు. దీంతో ఆ పార్క్లో ఉన ప్రజలు ఇద్దరూ వ్యక్తులు ఎవరో పడిపోయారు కాపాడంటూ అని అరుస్తారు. అటుగా వాకింగ్ చేస్తూ వస్తున్న ఐదుగురు సిక్కు స్నేహితులు ఏం జరిగిందని అక్కడి వాళ్లని అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు వాళ్లను ఏ విధంగా రక్షించాలో మొదట వాళ్లకు అర్థం కాలేదు . ఇంతలో తమ తలపాగనే తాడుగా చేసి రక్షింద్దాం అనే నిర్ణయానికి వస్తారు వాళ్లు. ఈ క్రమంలో ఆ ఐదుగురు స్నేహితులు తమ తలపాగలను, ఆఖరికి తమ దుస్తులను కూడా జత చేసి తాడుగా మార్చి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కొతసేపటి వాళ్లు సురక్షితంగా బయటపడతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏమి ఆలోచన మీది, మీరు చాలా గ్రేట్ అంటూ రకరకాలుగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) A video of the incident on Monday, in which five Sikh hikers tied their dastaars (turbans) together to save a man who had slipped and fallen at the Lower Falls at Golden Ears Park. Video courtesy @globalnews Kudos to these young men on their quick thinking and selflessness. pic.twitter.com/XQuX27OH5i — Sikh Community of BC (@BCSikhs) October 16, 2021 -
సిక్కు మెరైన్కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో
న్యూయార్క్: అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి(26)కి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం. అయితే, పూర్తి స్థాయిలో మతపరమైన వెసులుబాట్లు కల్పించకుంటే కోర్టుకెళతానని అతడు పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సుఖ్బీర్ సింగ్ 2017లో మెరైన్స్లో చేరారు. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్గా ప్రమోషన్ అందుతుందని సుఖ్బీర్ సింగ్ తూర్ సుఖ్బీర్సింగ్ తూర్ న్యూయార్క్టైమ్స్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. చదవండి: (మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ) భారత్ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్బీర్కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ‘సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతడిని గుర్తుపడతారు’అని మెరైన్వర్గాలు అంటున్నాయి. యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి. దీనిపై సుఖ్బీర్ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయని న్యూయార్క్టైమ్స్ కథనం పేర్కొంది. అమెరికా ఆర్మీ, ఎయిర్ఫోర్స్లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!) -
‘కశ్మీర్లో బలవంతపు మతమార్పిళ్లు’
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ–కశ్మీర్లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి అకాలీదళ్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన సిక్కుల ప్రతినిధి బృందం జమ్మూ కశ్మీర్లో సిక్కు సమాజానికి చెందిన బాలికలను బలవంతంగా మతం మార్పిడి చేసి, వివాహం చేస్తున్నట్లు ఆయనకు వివరించారు. ఢిల్లీ బీజేపీ నేత ఆర్పీ సింగ్ నేతృత్వంలోని బృందం కిషన్రెడ్డికి మెమోరాండం సమర్పించింది. చదవండి: ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు Drone Attack Jammu: మరో ఉగ్రకుట్ర భగ్నం -
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి సిక్కు వర్గం నుంచే..
అమృత్సర్: 2022లో పంజాబ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తే ఉంటారని పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని, నిర్ణయం తీసుకోగానే చెబుతామని అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్సింగ్... కేజ్రీవాల్ సమక్షంలో ఆప్లో చేరారు. ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళితవర్గం నుంచి ఎవరైనా ఉంటారా? అంటూ మీడియా ప్రశ్నించింది. కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రకటించబోయే వ్యక్తి వల్ల యావత్ రాష్ట్రం గర్విస్తుందని, ఆ వ్యక్తి సిక్కువర్గం నుంచి ఉంటారని స్పష్టం చేశారు. విజయ్ ప్రతాప్సింగ్ ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూతో చర్చలు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా... ‘సిద్ధూ కాంగ్రెస్ నేత అని, సీనియర్ నాయకుడు. ఆయన్ను నేనెంతో గౌరవిస్తాను. అందువల్ల ఏ నేత గురించీ అనవసర మాటలొద్దు. ఒకవేళ సిద్ధూతో భేటీ అయితే, ముందుగా ఆ విషయాన్ని మీడియాకే చెబుతా’నని తెలిపారు. -
అభ్యాస అవంతిక
పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్’ అని ఓ లెర్నింగ్ ప్రోగ్రామ్ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక. గుర్తించడమే నాంది ఈ శిక్షణా ప్రోగ్రామ్ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది. మానసిక నిపుణుల సాయం అవంతిక తన ఆలోచనను క్లాస్మేట్స్తో పంచుకుంది. క్లాస్మేట్ నమితా థాపర్, అతీత్ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్ ఉద్యోగి గరిమా జిందాల్లు అవంతిక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్’ అనే పరిశోధన ప్రోగ్రామ్ను ప్రారంభించింది. డిజైన్ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాష్కార్డ్లతో ఉండే ఈ ప్రోగ్రామ్లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక. వివరణాత్మక ప్రోగ్రామ్ అవంతిక తన ప్రోగ్రామ్ బాక్స్ గురించి వివరిస్తూ ‘బాక్స్లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్ టచ్ అండ్ ఫీల్ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్ కార్డ్ లో ఒక సర్కిల్ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది. బహుమతిగా కార్డు బాక్స్ ఈ కార్డు బాక్స్ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్ బాక్స్ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్ ప్యాక్ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు. అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్ను కొనుగోలు చేశాయి. డే వన్ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక. -
గోల్డెన్ టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా?
పంజాబ్ రాష్ట్రం, అమృత్సర్ నగరం. ప్రఖ్యాత స్వర్ణదేవాలయం, బయట రాష్ట్రాల వాళ్లకు ‘అమృత్సర్ బంగారు దేవాలయం’గానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్మందిర్ సాహిబ్. నిజానికి హరిమందిర్. వాడుకలో హర్మందిర్ అయింది. దర్బార్ సాహిబ్ అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. ‘హరి’ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు ‘అమృత సర’. అమృతంతో నిండిన సరస్సు అని అర్థం. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఇది ఆలయం కోసం తవ్విన సరస్సు. బంగారంటి పేరు మనకు అమృతసర్ గోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తు వచ్చే సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్. ఆ తర్వాత ఇందిరా గాంధీ దారుణ హత్య. ఆ తర్వాత అల్లర్లు, ఖలిస్థాన్ ఉద్యమం. ఈ ప్రభావం మన దగ్గర ఒక తరాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే... ఈ ఆలయ నిర్మాణం, దాడులకు గురవడం అనేది చర్విత చరణంగా సాగింది. ఎన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో పునర్నిర్మించుకోవడంలో సిక్కుల సంకల్పబలం అర్థమవుతోంది. మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరవాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయం స్వర్ణదేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో నామినేట్ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గుడి ముందు... ఊరు తర్వాత సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకవసరమైన పని వాళ్లు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ల కోసం ఇళ్లు కట్టారు. మనుషుల జీవికకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసం వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరయింది. సిక్కుల ఆరాధ్యమందిరం. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వమానవాళికీ అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు లక్షమంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు. వందేళ్ల వంటశాల ధాబా పేరు కేసర్ దా ధాబా. గోల్డెన్ టెంపుల్కి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇది వందేళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లాచ్చా పరాఠా, దాల్ మఖానీ కోసం లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా వందేళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్ మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్లోని షేక్పురాలో మొదలుపెట్టారు. దేశవిభజన సమయంలో ఆ దంపతులు ధాబాను అమృతసర్కు మార్చారు. అప్పట్లో లాచ్చా రోటీ– దాల్ మఖానీ మాత్రమే వండేవాళ్లు. ఇప్పుడు వేడిగా కరకరలాడే హాట్ క్రిస్ప్ పరాఠా, మీగడ లస్సీ, పంజాబీ థాలీ, ఫిర్నీ కూడా వండుతున్నారు. ఇప్పుడు కాని మీరు కాని స్వర్ణదేవాలయాన్ని కాని చూడడానికి వెళ్లినట్లయితే... అప్పుడు ఈ ధాబాలో పంజాబీ వంటకాలను రుచి చూడడం మర్చిపోవద్దు. రోజంతా వండుతూనే ఉంటారు పంజాబీ వంటకాలను రాగి పాత్రలో ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు ఉడికిస్తారు. రాజ్మా గింజలు, తాజా మీగడ, పెరుగుతో దాల్ మఖానీ ఉడుకుతున్న పెద్ద గుండిగ ఒక పక్క. మరో పక్క ఒక పాత్రలో ఫిర్నీ, పెద్ద పెద్ద రాగి, ఇత్తడి పాత్రలు కళ్ల ఎదురుగానే ఉంటాయి. రోజంతా తక్కువ మంట మీద వంటలు తాజాదనం కోల్పోకుండా వేడి మీద ఉంటాయి. -
గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ను సందర్శించారు. నేడు సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్బహదూర్’ వర్ధంతి కావడంతో ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఇది న్యూఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉంది. అయితే ప్రధాని గురుద్వారా సందర్శన షెడ్యూల్ ప్రకారం నిర్వహించినది కాదు. ఈ పర్యటనను ఉన్నట్టుండి ప్లాన్ చేశారు. సాధారణంగా ప్రధాని ఇలాంటి పర్యటనకు వెళ్తే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ఏ విధమైనటువంటి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. చదవండి: భారత్ ఎందుకొద్దు? పర్యటనలో ప్రధాని మోదీ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అక్కడ పోలీసు బందోబస్తు లేదని, ఎక్కడా బారికేడ్లు పెట్టలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదని, సామాన్యులకు ఎలాంటి అడ్డంకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. ఉదయాన్నే మంచుకురుస్తుండగా, ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా ప్రధాని మోదీ గురుద్వారా రకాబ్ గంజ్ చేరుకొని గురు తేగ్ బహదూర్కు సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా ఢిల్లీలో గురుద్వారా రకాబగంజ్ 1783వ సంవత్సరంలో నిర్మితమైంది. ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాల్లో ఎక్కువ మంది సందర్శకులు వెళ్లే గురుద్వారాల్లో ఇదీ ఒకటి. ఓవైపు పంజాబ్ రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఈ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం ప్రధానమంత్రి మోదీ తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. దీనితోపాటు గురుముఖి భాషలో సందేశమిచ్చారు. ‘నేను ఈ రోజు ఉదయం చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్కు ప్రార్థనలు చేశాను. అక్కడ గురు తేగ్బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాను. ఈ ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితులను చేసి, ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లించిన గురు తేగ్బహదూర్ దయతోనే ఎంతో ప్రేరణ పొందాను. గురు సాహిబ్స్ విశేష కృపతోనే మన ప్రభుత్వ పాలనా కాలంలో గురు తేగ్బహదూర్ 400వ ప్రకాశ్ పర్వాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తేగ్ బహదూర్ ఆదేశాలను గుర్తు చేసుకుంటున్నాం. కాగా గురు తేగ్ బహదూర్ సిక్కు మతంలోని పదిమంది గురువులలో తొమ్మిదవ గురువు. 17వ శతాబ్దంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అతన్ని హత్య చేశారు. -
50 రూపాయలకే ఎమ్ఆర్ఐ స్కాన్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్ఆర్ఐ స్కాన్ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ చెప్పారు. పేదలకు ఎమ్ఆర్ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్ఆర్ఐ రూ. 2,500 వరకూ ఉంది. -
మీ దేశానికి వెళ్లిపోండి: రెస్టారెంట్ ధ్వంసం
వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ హోటల్ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. అనంతరం విద్వేషపూరిత వ్యాఖ్యలతో హోటల్ గోడలను నింపేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. న్యూ మెక్సికోలోని సాంటే ఫె సిటీలో బల్జీత్ సింగ్ అనే సిక్కు వ్యక్తి భారతీయ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉన్నట్టుండి కొందరు దుండగులు హోటల్లోకి చొచ్చుకు వచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. దేవుళ్ల విగ్రహాలను కిందపడేశారు. వంటగదిని సర్వనాశనం చేశారు. గోడలపై 'వైట్ పవర్', 'ట్రంప్ 2020', 'స్వదేశానికి వెళ్లిపో' అంటూ బెదిరింపు వ్యాఖ్యలను రాశారు. (సియాటిల్లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం) అనంతరం కంప్యూటర్లను దొంగిలించారు. ఈ దాడి వల్ల రెస్టారెంట్ యజమానికి లక్ష డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ చర్యను సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్(ఎస్ఏఎల్డిఈఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. స్పానిష్ వలసవాదుల విగ్రహాలను తొలగించడంతో ఈ ఆందోళనలు మరింత భగ్గుమన్నాయి. (ఒంటి కాలితో గెంతుకుంటూ వెళ్లమన్నారు) (ప్రజాగ్రహం: భారతీయ రెస్టారెంట్కు నిప్పు) -
కారిడార్ కల సాకారం
సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సిక్కు మత సంస్థాపకుడు గురునానక్ 550వ జయంతి రోజైన శనివారం కర్తార్పూర్ కారిడార్ మొదలుకాబోతోంది. పంజాబ్లో ఉన్న దేరా బాబా నానక్ దేవాలయం నుంచి పాకిస్తాన్ గడ్డపై ఉన్న కర్తార్పూర్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రీకులు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే ఈ కారిడార్ వల్ల ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి. శతాబ్దాలుగా కోట్లాదిమందికి మార్గనిర్దేశం చేస్తున్న సమున్నత సామాజిక, సాంస్కృ తిక ధారకు గురునానక్ ఆద్యుడు. సిక్కుల తొలి సమష్టి జీవన వ్యవస్థను ఆయన కర్తార్పూర్లోనే ప్రారంభించారు. తన చివరి రోజులు కూడా అక్కడే గడిపారు. అందువల్లనే అది సిక్కులకు అత్యంత పవిత్ర క్షేత్రం. దురదృష్టవశాత్తూ విభజన సమయంలో రావి నదికి అటువైపున్న కర్తార్పూర్ ప్రాంతం పాకిస్తాన్ పరిధిలోనికి వెళ్లింది. భారత్–పాక్ సరిహద్దునుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బార్ సాహిబ్... పంజాబ్లోని దేరా బాబా నానక్ దేవాలయం సమీపం నుంచి బైనాక్యులర్స్తో చూస్తే స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ పవిత్ర క్షేత్రాన్ని స్వయంగా వెళ్లి, సందర్శించుకోలేనివారి కోసం అక్కడ ఎత్తయిన వేదిక నిర్మించారు. గట్టిగా పావుగంట కూడా పట్టని ప్రయాణం కాస్తా ఇరు దేశాల మధ్యా నెలకొన్న సమస్యల కారణంగా భక్త జనానికి వ్యయప్రయాసలు మిగిలిస్తోంది. కర్తార్పూర్ వెళ్లదల్చుకున్నవారు ముందు లాహోర్ వరకూ వెళ్లాలి. అక్కడినుంచి కర్తార్పూర్ చేరుకోవాలి. ఇదంతా 125 కిలోమీటర్ల దూరం. ఇతర లాంఛనాలు సరేసరి. ఏమైతేనేం... ఇన్నాళ్లకు కర్తార్పూర్ కారిడార్ మొదలవుతోంది. ఇరు దేశాల మధ్యా ఇప్పుడున్న పొరపొచ్చాల నేపథ్యంలో ఇది లేవనెత్తే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తన గురించి చెప్పుకోవాలి. అక్కడ ప్రభుత్వం గొంతు ఒకలా, పాక్ సైన్యం వైఖరి మరొకలా కనబడుతూ మన ప్రభుత్వానికి, సిక్కు భక్త జనానికి అయోమయాన్ని కలిగించాయి. పంజాబ్ నుంచి వచ్చే సిక్కులకు ఎలాంటి పత్రాలు అవసరం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రక టించారు. కానీ పాక్ సైన్యం ఇక్కడికొచ్చేవారందరికీ భారతీయ పాస్పోర్టులు ఉండి తీరాలని చెప్పింది. ఈ నిబంధన పాటిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని మన దేశం భావిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ పాస్పోర్టుల ఆధారంగా డేటాబేస్ రూపొందిస్తుందని, దీన్ని పాక్లోని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నదని సందేహిస్తోంది. ఈ నిర్మాణం హడావుడిగా పూర్తి చేయడంపైనా అనుమానాలున్నాయి. కొన్ని నెలలక్రితం ఖలిస్తాన్ సంస్థలుగా చెప్పుకున్న కొన్ని 2020లో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాయి. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ను అంతర్జాతీయంగా హోరెత్తించడం ఈ రిఫరెండం ఉద్దేశం. అది ఏదో మేర జరిగినట్టు అందరినీ నమ్మించాలంటే ఈ కారిడార్ ప్రారంభం అత్యవసరమని పాక్ సైన్యం భావిస్తున్నట్టు అనుమానాలున్నాయి. ఇవి కేవలం అనుమానాలే అని కొట్టిపారేయడానికి వీల్లేని రీతిలో పాకిస్తాన్ తీరుతెన్నులున్నాయి. కర్తార్పూర్ సందర్శనపై రూపొందించిన వీడియోలో ఉద్దేశపూర్వకంగా ఖలి స్తాన్ ఉద్యమ నాయకుడు భింద్రన్వాలే, మరో ఇద్దరు ఉన్న పోస్టర్ కనబడేలా పెట్టడం ఇందుకొక ఉదాహరణ. అంతేకాదు...దర్బారాసాహిబ్ గురుద్వారా వద్ద ఒక చిన్న స్తంభం నిర్మించి అందులో ఒక అద్దాల బాక్స్ అమర్చి, ఒక బాంబును ప్రదర్శనగా పెట్టారు. దానికింద ‘1971లో భారత సైన్యం ప్రయోగించిన బాంబు’ అంటూ ఒక వ్యాఖ్యానం ఉంచారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో ప్రయోగించిన బాంబు పక్కనున్న బావిలో పడటంతో పెను ముప్పు తప్పిందని, ఇది వాహేగురు జీ సంకల్పబలమని ఆ స్తంభానికి పక్కనున్న శిలాఫలకంపై రాశారు. క్షేత్ర సందర్శకుల్లో భారత్ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడమే దీనంతటి ఉద్దేశమని వేరే చెప్పనవసరం లేదు. కర్తార్ పూర్లో సిక్కులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని మరో అసంబద్ధ నిబంధన విధించింది. నిజానికి గురునానక్ను అనుసరించేవారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. స్వర్ణదేవాలయంతో సహా సిక్కు గురుద్వారాలేవీ తమ మతస్తులను మాత్రమే అనుమతిస్తామన్న నిబంధన విధించవు. కేవలం శిరసుపై ఆచ్ఛాదన ఉంటే చాలు... ఏ మతాన్ని అవలంబించేవారికైనా గురుద్వారాల్లో ప్రవేశం ఉంటుంది. ఒకపక్క దర్బారా సాహిబ్ను సందర్శించుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించా మని చెప్పుకుంటూనే ఆ మత విశ్వాసాలకూ, దాని విశాల దృక్పథానికీ భిన్నంగా ఆంక్షలు విధిం చడం, ఆలయ ప్రాంగణంలో తప్పుడు ప్రచారానికి దిగడం పాక్ దురుద్దేశాలకు అద్దం పడుతోంది. మొత్తానికి కర్తార్పూర్ కారిడార్ సాకారం కావడం శుభసూచకమే అయినా మన నిఘా వ్యవ స్థలూ, సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పెంచింది. అసలు కర్తార్పూర్ సుల భంగా వెళ్లి రావడానికి ఇన్ని దశాబ్దాల సమయం పడుతుందని, రాకపోకలపై ఇన్ని ఆంక్షలుం టాయని విభజన సమయంలో ఎవరూ అనుకోలేదు. రావి నదికి ఆవలనున్న ఆ ప్రాంతానికి వంతెన దాటి వెళ్లేవారు. కానీ రాను రాను ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరిగి, చివరకు 1965 నాటి యుద్ధంలో ఆ వంతెన ధ్వంసం కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అసలు అక్కడి ప్రార్థనా మందిరం బాగోగుల్ని పాక్ ఎప్పుడూ పట్టించుకోలేదు. 1999లో అప్పటి ప్రధాని దివం గత వాజపేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య చర్చలు జరిగి ఢిల్లీ–లాహోర్ బస్సు ప్రారం భమైన సందర్భంగా ఈ కారిడార్ గురించి వాజపేయి ప్రతిపాదించారు. అటు తర్వాతే దర్బారా సాహిబ్పై పాక్ శ్రద్ధపెట్టింది. కారిడార్ నిర్మాణం పనులు నిరుడు నవంబర్లోనే ప్రారంభమ య్యాయి. ఈ కారిడార్ కొత్త సమస్యలకూ, ఘర్షణలకూ కారణం కానీయరాదని, స్నేహ సంబం ధాలు పెంపొందించుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని పాక్ గ్రహించడం అవసరం. -
కర్తార్పూర్ యాత్రికులకు పాక్ శుభవార్త
ఇస్లామాబాద్ : సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ సందర్శించే భారత యాత్రికులకు పాక్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొదటి రోజు ప్రవేశ రుసుమును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయడం లేదని తెలిపింది. గతంలో సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్ను ప్రారంభించినున్నట్టు ఇమ్రాన్ చెప్పారు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా భారత్ నుంచి కర్తార్పూర్ సందర్శనకు వచ్చే సిక్కు యాత్రికులకు అవసరమైన రెండు చర్యలు తీసుకున్నాం. కర్తార్పూర్ సందర్శించే భారత యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే సరిపోతుందని, పాస్పోర్ట్ అవసరం లేదని, పది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ కూడా అవసరం లేదని ట్వీట్ చేశారు. అలాగే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి రుసుము వసూలు చేయమని ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సిక్కులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. ప్రతి ఏడాది సిక్కులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. నవంబర్ 9నుంచి కర్తార్పూర్ యాత్ర మొదలవనుంది. సిక్కుల గురువైన గురునానక్ దీనిని 1522 లో స్థాపించారు. చదవండి : కర్తార్పూర్ ద్వారా పాక్ ఆదాయం ఏడాదికి రూ.259కోట్లు -
‘కర్తార్పూర్’ ప్రారంభ తేదీ ఖరారు
లాహోర్ : కర్తార్పూర్ కారిడార్ను నవంబర్ 9న ప్రారంభించనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాకిస్తాన్లోని గురుద్వార దార్బార్ సాహిబ్ నుంచి పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ వరకు ఈ కారిడార్ ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ సరిహద్దు నుంచి డేరాబాబా నానక్ వరకు కారిడార్ నిర్మాణానికి భారత్ సంకల్పించింది. అటువైపు దార్బర్ సాహిబ్ వరకు కారిడార్ను పాక్ చేపట్టింది. అయితే పాక్ వైపు కారిడార్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో.. దీనిని ప్రారంభించేందకు ఆ దేశ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కారిడార్ ప్రారంభంతో భారత్లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్పూర్ సాహిబ్ వెళ్లవచ్చు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్ను ప్రారంభించినున్నట్టు ఇమ్రాన్ చెప్పారు. ఈ కారిడార్ను ప్రారంభించడం వల్ల స్థానికులకు ఆతిథ్య రంగంలో ఉపాధి లభిస్తోందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కర్తార్పూర్ కారిడార్కు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే మొదలైనప్పటికీ.. సందర్శనకు వచ్చే భక్తుల నుంచి పెద్దమొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని పాక్ నిర్ణయించింది. ఒక్కో భక్తుడు 20 యూఎస్ డాలర్లు చెల్లించాలని పేర్కొంది. ఈ అంశంపై భారత్ కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ పాక్ వాటిని తోసిపుచ్చింది. దీంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కానుంది. కాగా, ఈ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కానున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి తెలిపారు. 16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. గురునానక్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్పూర్ సాహిబ్ గురుద్వార పాకిస్తాన్కు వెళ్లింది. -
‘కౌగిలింత అంతే.. రాఫెల్ డీల్ కాదు కదా’
న్యూఢిల్లీ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌగిలింత అనేది కేవలం ఒక్క సెకన్ మూవ్మెంట్ అంతే.. అదేమీ రాఫెల్ డీల్ అంతా ప్రమాదకరం కాదంటూ బీజేపీకి చురకలంటించారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధూ ఈ సందర్భంగా తాను గతంలో పాక్ ఆర్మీ చీఫ్ను కౌగిలించుకోవడాన్ని మరోసారి సమర్ధించుకున్నారు. ఈ విషయం గురించి సిద్ధూ మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా ఇద్దరు పంజాబీలు ఎదురుపడితే కౌగిలించుకుంటారు.. పంజాబ్లో ఇది చాలా సర్వ సాధారణం. ఇది కేవలం ఒక్క సెకన్ మూవ్మెంట్ అంతే.. రాఫెల్ డీల్ అంతా ప్రమాదకరం కూడా కాదం’టూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. The hug(with Pakistan Army Chief) was for hardly a second, it was not a #RafaleDeal . When two Punjabis meet they hug each other, its normal practice in Punjab.: Navjot Sidhu in Lahore pic.twitter.com/zZemyh0qls — ANI (@ANI) November 27, 2018 అంతేకాక ఈ కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం ఇరు దేశాల ప్రజలను దగ్గర చేసి, శాంతిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత్లోని గురుదాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. -
‘కర్తార్పూర్’కు శంకుస్థాపన
గురుదాస్పూర్: పాకిస్తాన్లోని గురుద్వార దార్బార్ సాహిబ్ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్పూర్ కారిడార్కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలపడం విదితమే.16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్పూర్ సాహిబ్ గురుద్వార పాకిస్తాన్కు వెళ్లింది. భారత్లోని గురుదాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్తో ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ పాక్కు హెచ్చరికలు చేశారు. భారత్ శాంతికి ప్రాధాన్యమిస్తుందనీ, కానీ భారత్కు భారీ, శక్తిమంతమైన సైన్యం ఉందన్న విషయాన్ని పాక్ గుర్తించాలన్నారు. సరిహద్దుల్లో భారత సైనికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల, సైనికుల దాడులకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వానే కారణమన్నారు. -
‘నా కౌగిలింత పని చేసింది’
చండీగఢ్ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ. భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్లో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్పూర్లోని సాహిబ్ కారిడార్ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్ ఒపెన్ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్ క్యాబినేట్ బదులు పాక్ క్యాబినేట్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు. -
కర్తాపూర్ కారిడార్కు కేంద్ర మంత్రివర్గం అమోదం
-
కర్తార్పూర్కు ప్రత్యేక కారిడార్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారిడాక్కు ఈ నెల 26న రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మిస్తామని పాక్ ప్రకటించింది. గురువారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం, ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న అనంతర పరిణామాలపై కేబినెట్ క్లుప్తంగా చర్చించింది. నానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని.. ► పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కేంద్రం నిధులతో ఆధునిక వసతులతో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు. ∙పాక్లో ఉన్న కర్తార్పూర్ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్ ఏర్పాటు. ∙చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు. ► భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాక్లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలిæ గురుద్వారా ఏర్పాటైంది. ► ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు. ► ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు–2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి. ► అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి. -
గురునానక్ జయంతి..సిక్కుల విన్యాసాలు
-
అమెరికాలో మరో భారతీయుడి హత్య..!
న్యూయార్క్ : అమెరికాలో సిక్కులపై మరో దాడి జరిగింది. ఓ సిక్కు వ్యక్తిపై కొందరు దుండగులు కత్తితో దాడి చేసి పొట్టనబెట్టుకున్నారు. గత మూడు వారాల్లో ఇది మూడో ఘటన. న్యూజెర్సీలో ఎసెక్స్ కౌంటీలో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. భారత్కు చెందిన తెర్లోక్ సింగ్ అనే వ్యక్తి స్థానికంగా ఒక కొట్టు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం స్టోర్ వద్దకు వెళ్లగా తెర్లోక్ చనిపోయి ఉన్నాడని అతని బంధువు వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామనీ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎసెక్స్ కౌంటి అధికారులు తెలిపారు. తెర్లోక్కు భార్యాపిల్లలు ఉన్నారు. మీ దేశం వెళ్లిపో...! వారంక్రితం (ఆగస్టు 6) కూడా సిక్కు వ్యక్తిపై ఇలాంటి దాడే జరిగింది. కాలిఫోర్నియాలోని మాంటెకా కౌంటీలో సాహిబ్ సింగ్ (71) మార్నింగ్ వాక్కు వెళ్లొస్తుండా తైరోన్ మెక్అలిస్టర్ అనే వ్యక్తి కిరాతంగా హత్య చేశాడు. రెండు వారాల క్రితం (జూలై 31) సుర్జీత్ మహ్లీ(50)ని అనే సిక్కును ఓ దుండగుడు హత్య చేశాడు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నావంటూ సుర్జీత్ ట్రక్పై ‘మీ దేశానికి వెళ్లిపో’అంటూ హంతకుడు హెచ్చరికలు రాసినట్టు వెల్లడైంది. కాగా, దాడులు జరగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న సిక్కులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ‘ఇక్కడ మన హక్కులు తెలుసుకోండి. మనతో దురుసుగా ప్రవర్తించేవారిని ఉపేక్షించొద్దు. వారిపై తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని సిక్కు సంఘం నాయకులు అమృత్ కౌర్ తెలిపారు. -
ప్రత్యేక జాతిగా బ్రిటన్ సిక్కులు!
ఏ దేశంలో ఉన్నప్పటికీ భారతీయులు మాతృదేశాన్ని మరిచిపోకూడదని, మాతృదేశాభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీ సహా పలువురు నేతలు పదే పదే చెబుతోంటే...అసలు తమను భారతీయులుగా పరిగణించడానికి వీల్లేదని బ్రిటన్లోని అసంఖ్యాక సిక్కులు ఉద్ఘాటిస్తున్నారు.2021న జరిగే జనాభా లెక్కలకు సంబంధించిన దరఖాస్తు పత్రాల్లో తమ కోసం సిక్కు పేరుతో ప్రత్యేక జాతి కేటగిరిని పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిలా భారతీయులు అన్న కేటగిరిలో తాము చేరబోమని వారు స్పష్టం చేస్తున్నారు. జనాభా లెక్కల ప్రక్రియను నిర్వహించే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్(ఓఎన్ఎస్)కు బ్రిటన్లోని పలు సిక్కు సంఘాలు ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించాయి.అయితే, దీనిపై ఓఎన్ఎస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, సిక్కుల అభ్యర్థనను పరిశీలిస్తున్నామని సంబంధిత అధికారులు చెప్పారు.2011 జనాభా లెక్కల సమయంలో 80వేల మందికి పైగా సిక్కులు తమ దరఖాస్తు ఫారాల్లో జాతి/మతాన్ని తెలిపే కాలంలో భారతీయుడు అని కాని ఇతరులు అని కాని రాయలేదు. సిక్కు అని ప్రత్యేకంగా రాశారు.బ్రిటన్లో 112 గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో లక్ష మందికిపైగా సభ్యులున్నారు.2021 జనాభా లెక్కల కోసం విడుదల చేసే సెన్సస్ వైట్ పేపర్2018లో తమ సిక్కు జాతి కోసం ప్రత్యేకంగా గడి పెట్టాలని కేబినెట్ ఆఫీస్కు సిఫారసు చేయాలని వారంతా ఓఎన్ఎస్కు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని ఓఎన్ఎస్ ఆమోదిస్తుందన్న విశ్వాసం ఉందని సిక్కు సమాఖ్య అంటోంది. ’వచ్చే జనాభా లెక్కల్లో తమను ప్రత్యేక జాతిగా గుర్తించాలని 55 వర్గాలు అభ్యర్థనలు పంపాయి. వాటిలో యూదులు, రోమన్లు, సిక్కులు, సోమాలీల అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నాయి.’అని ఓఎన్ఎస్ అధికారి ఒకరు తెలిపారు.సిక్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని గత ఏడాది పార్టీల కతీతంగా 250 మంది ఎంపీలు కూడా డిమాండ్ చేశారు.తమ సంతకాలతో ఓఎన్ఎస్కు వినతిపత్రాలు పంపారు.జనాభా లెక్కల్లో జాతుల ఆధారంగానే ప్రభుత్వం వారికి వివిధ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుంది. ప్రభుత్వ నిధులను పంచుతుంది. -
అమెరికాలో సిక్కు డ్రైవర్ మృతి
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సిక్కు ట్రక్ డ్రైవర్ మరణించాడు. ఈ నెల 12న ఒహయోలో జస్ప్రీత్ సింగ్(32) అనే ట్రక్కు డ్రైవర్పై బ్రోడరిక్ మలిక్ జోన్స్ రాబర్ట్స్(20) కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జస్ప్రీత్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21న కన్నుమూశాడు. జస్ప్రీత్ ట్రక్లో ఉండగా దోపిడీకి ప్రయత్నించిన రాబర్ట్స్.. అతను ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేయనున్నారు. -
పోలీస్ సాబ్ మీరు సూపర్; వీడియో వైరల్
రామ్ నగర్, ఉత్తరాఖండ్ : ప్రేమకు, మానవత్వం చాటుకోవడానికి మతం అడ్డురాదు. వాటికి తెలిసిందల్లా ప్రేమను పంచడం... సాయం చేయడమే. ఉత్తరాఖండ్లో ఈ రెండు సంఘటనలు ఏక కాలంలో జరిగాయి. తమ మతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడన్న కారణంగా ముస్లిం యువకుడిపై కొందరు హిందూ యువకులు దాడికి దిగారు. ఈ సంఘటన రామ్పూర్ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగింది. ఈ గొడవ గురించి ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ గంగాదీప్ సింగ్కు సమాచారం అందించారు స్థానికులు. సింగ్ ఆ ప్రదేశానికి చేరుకునే సరికి హిందూ యువకులు ముస్లిం యువకుడిని కొట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇది గమనించిన సింగ్ బాధిత యువకుడిని కాపాడటం కోసం ముందుకు వెళ్లి ఆ యువకుడికి అడ్డుగా ఉండి కాపాడాడు. ఈ తతంగాన్ని ఒకరు ఫోన్లో రికార్డు చేసి ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా గంగాదీప్ సింగ్ను అభినందనలతో ముంచేత్తుతున్నారు. ‘పోలీస్ సాబ్ మానవత్వానికి మతంతో పని లేదని చాటారు...మీరు సూపర్ సార్’ సోషల్ మీడియాలో హీరోను చేస్తూ కామెంట్ చేశారు. -
సహచరుల విడుదల కోరుతూ ఆత్మహత్య..
పంజాబ్: వివిధ కేసుల్లో శిక్షలు పడి, జైలు జీవితం పూర్తి చేసుకున్నా తన సహచరులు విడుదల కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న గురుభక్ష్ సింగ్ ఖల్సా ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినప్పటికీ, ఖైదీల విడుదలకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కురుక్షేత్ర జిల్లా ఎస్పీ అభిషేక్ గార్గ్ మాట్లాడుతూ.. ‘పలువురు సిక్క్ రాడికల్స్ విడుదల కోసం గత కొంతకాలంగా గురుభక్ష్ ఆందోళన చేస్తున్నాడు. వారిని విడుదల చేయాలని ట్యాంక్ పైకెక్కి నినాదాలు చేస్తూ.. నీటిలోకి దూకాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని లోక్నారాయణ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించార’ని తెలిపారు. 44 రోజుల నిరాహార దీక్ష.. 2013లో గురుభక్ష్ సింగ్...శిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేయాలంటూ 44 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ప్రభుత్వ హామీతో దీక్ష విరమించాడు. కానీ, వారు విడుదల కాకపోవడం గమనార్హం. -
సిక్కుల ఊచకోత : కన్నీటి జ్ఞాపకాలు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోతకు గురయ్యారు. వేల సంఖ్యలో అమాయక సిక్కులు అసువులు బాసారు. 33 ఏళ్ల నాటి విషాద పరిస్థితులు.. ఆనాటి జ్ఞాపకాలు బాధితుల కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇందిర హత్యానంతర పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి అయిన అత్తార్ కౌర్... కన్నీటి గాథ ఇది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో అత్తార్ కౌర్ భర్తతో సహా 11 మంది కుటుంబ సభ్యులను కోల్పొయి దీనావస్థలొకి వెళ్లిపోయింది. ఆనాటి పరిస్థితులపై అత్తార్ కౌర్ పంజాబ్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడారు. మారణహోమానికి 33 ఏళ్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు బాడీగార్డులు హత్య చేయడంతో.. ఒక్క సారిగా దేశమంతా సిక్కు వ్యతిరేకత అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అధికంగా ఢిల్లీలోనే మారణహోమం అధికంగా జరిగింది. అల్లరి మూకలు అత్యంత దారుణంగా 3 వేల మంది సిక్కులను ఊచకోత కోశాయి. ఈ మారణహోమానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జన్ కుమార్ కారకుడని సీబీఐ ఢిల్లీ సెషన్స్ కోర్టుకు తెలిపింది. చితికిన కుటుంబం అత్తార్ కౌర్ నాటి తూర్పు ఢిల్లీలోని త్రిలోకపురిలో భర్త, పిల్లలతో కలిసి నివాసముండేది. ఇందిర హత్యానంతరం అల్లరి మూకలు సిక్కులు అధికంగా నివసించే ప్రాంతాలపై దాడులకు దిగాయి. అత్తార్ కౌర్ భర్త కృపాల్ సింగ్ అక్కడే చిన్నచిన్ని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించేవాడు. కళ్లముందే దారుణం కృపాల్ సింగ్ వ్యాపార పనుల రీత్యా అప్పుడే గురుద్వారాకు వెళ్లారు. ఇంటి బయట.. 7 మంది చిన్నారులు, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఇంటి బయట అత్త, మామ ఉన్నారని అత్తర్ కౌర్ తెలిపారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన అల్లరి మూకలు.. ఆడుకుంటున్న చిన్నారులను, బయ ఉన్న పెద్దవారిని అత్యంత పాశవికంగా హత్య చేశాయని ఆమె చెప్పారు. తన రెండు నెలల పసిబిడ్డతో సహా, 6 మంది పిల్లలను, భర్త, అత్తమామలసహా 11 మంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు పొట్టన పెట్టుకున్నాయని ఆమె ఆవేదనగా తెలిపారు. సజీవ దహనం జంతువులును వేటాడినట్టు అల్లరి మూకలు సిక్కులను వెంటాడి వేటాడి చంపాయని అత్తార్ కౌర్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపారు. కొద్దిమందిని దారుణంగా హింసించి.. సజీవ దహనం చేసిన ఘటనలు ఉన్నాయని కౌర్ తెలిపారు. ముస్లింల సాయం అల్లరి మూకలు మరింత దారుణాలకు ఒడిగడుతున్న సమయంలో మాకు పక్కనే ఉన్న ఒక ముస్లిం కుటుంబం.. మిగిలిన ముగ్గురు పిల్లలను, నాకు వారి ఇంట్లో రక్షణ కల్పించారని ఆమె తెలిపారు. సాయంత్రం ట్రిపోలి రహదారి పక్కన పిల్లల మృత దేహాలు, దహనమైన అత్త, మామలు, భర్త శరీరాలను చూశానని ఆమె హృదయ విదారకంగా తెలిపారు. ఇందిరా హత్యానంతర పరిస్థితులు గుర్తుకు వస్తే.. ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని ఆమె చెప్పారు. -
జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య
సాక్షి,వాషింగ్టన్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిక్కు యువకుణ్ని ఓ అమెరికన్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ దురదృష్టకర ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి గగన్దీప్ సింగ్ (22) హత్యకు గురికావడం విషాదాన్ని రేపింది. యూనివర్శిటీలో అడ్మిషన్ రాలేదన్న అక్కసుతో జాకబ్ కోలెమన్ (19) టాక్సీ డ్రైవర్, సిక్ విద్యార్థిని అనేకసార్లు పొడిచి హత్యచేశారని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సింగ్ టాక్సీ డ్రైవర్గా పనిచేన్నారు.. ఈ క్రమంలో ఆగష్టు 28 న వాషింగ్టన్ లోని స్పోకేన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిందితుడు సింగ్ టాక్సీ ఎక్కాడు. ఇదాహోలోని బోనర్ కంట్రీలో తన స్నేహితుడు ఇంటికి వెళ్లమని కోరాడు. ఆకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు విచక్షణా రహితంగా దాడి చేయడంతో సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గోంజాగా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రయివేట్ కాథలిక్ యూనివర్శిటీలో ప్రవేశం లభించకపోవడంతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల కథనం. అయితే ఈ విషయాన్ని యూనివర్శిటీ ఖండించింది. అలాంటి అప్లికేషన్ ఏదీ తమ దగ్గరకు రాలేదనీ, విచారణకు సహకరిస్తున్నట్టు తెలిపింది. పంజాబ్లోని జంషెడ్పూర్కుచెందిన గగన్దీప్సింగ్ గా మృతుణ్ని గుర్తించారు. 2003నుంచిన ఆయన వాషింగ్టన్లో నివసిస్తున్నారు. మరోవపు జలంధర్ కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ రాజు మేనల్లుడు గగన్ సింగ్. ఈ హత్యపై ఆయన స్పందిస్తూ, తన మేనల్లుడు జాతి విద్వేషాలకు బలైయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై ట్రంప్ విధానాల ఫలితంగా జాతి విద్వేషాలకు బాధితులుగా భారతీయులు, ఆసియన్లు బాధితులుగా మారుతున్నారని మండిపడ్డారు. కాగా అమెరికాలో ఇటీవలి నెలల్లో అమెరికన్లు లభారతీయలును, సిక్కులను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆందోళన రేపుతోంది. జూలైలో కాలిఫోర్నియాలో ఒకే వారం లో రెండు వేర్వేరు సంఘటనలలో ఇద్దరు హత్యకు గురైన సంగతి తెలిసిందే. -
ఇందిరాగాంధీ హత్య రోజు ఏం జరిగిందీ?
న్యూఢిల్లీ: సరిగ్గా ఈ రోజుకు 32 సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది. అంటే 1984, అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా, దేశవ్యాప్తంగా 2,800 మంది ఊచకోతకు గురయ్యారు. అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడువేల మంది సిక్కులు, దేశవ్యాప్తంగా 8 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారన్నది అంచనా. ఆ రోజు సఫ్దార్జంగ్ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9.20 గంటలకు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి. ఏడు తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందిగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ టూర్లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా, ఐదు గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపలే రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు. అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్కు ఉదయం 10 గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెల్సింది. ఆయన వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు. వెంటనే 1971లో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్జీత్ సింగ్కు ఫోన్ చేసి సంప్రతించారు. అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్. రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్జీత్ సింగ్లను కలుసుకొని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలని మంతనాలు జరిపారు. అప్పటికీ ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన)ను సంప్రతించాలని నిర్ణయించి ఫోన్ చేశారు. అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెల్సింది. ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ను కలసుకున్నారు. అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. ‘సార్ ఇప్పటికే ఢిల్లీ తగులబడి పోతోంది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే వందమందికిపైగా మత్యువాత పడ్డట్టూ వార్తలందుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపడానికి ఇంతకన్నా ఉద్రిక్త పరిస్థితులు ఏం కావాలి?’ అని వారు ప్రశ్నించారు. అయినా సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్సింగ్ సమాధానం ఇచ్చారు. హోం మంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడమని సూచించగా ఆయన కార్యదర్శి హోం శాఖకు ఫోన్ చేసి కనుక్కొన్నారు. హోం మంత్రి అత్యవసర సమావేశంలో ఉన్నారని, మాట్లాడడం సాధ్యం కాదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. చేసేదేమీ లేక ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు వెనుతిరిగి వచ్చారు. అదేరోజు ఈ ఐదుగురు సిక్కులు హోం మంత్రి పీవీ నరసింహారావును కలసుకొన్నారు. అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడని ఆయన అప్పుడు సైన్యాని రప్పించేందుకు నిర్ణయించినట్లు, సాయంత్రానికల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచే హోం శాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యం, పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు పీవీ నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్, ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ను కలుసుకొని మాట్లాడుకుంటారని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలసుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ అప్పాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్ను కోరారు. సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తాగానీ, సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పియ్యనని ఆయన సమాధానం ఇచ్చారు. సంతాపం ఎలాగూ తెలియజేస్తాం, సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమేకదా, దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అప్పాయింట్మెంట్ నిరాకరించారు. నవంబర్ రెండవ తేదీన ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి. తాము చెప్పినట్లు ముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే చరిత్రలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదన్నది సిక్కు ప్రముఖుల వాదన. ఇదే అల్లర్ల విషయమై అప్పుడు రాజీవ్ గాంధీని మీడియా ప్రశ్నించగా ‘ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు రావడం చాలా సహజం’ అని వ్యాఖ్యానించారు. (ఐదుగురు సిక్కు ప్రముఖులు, ఇందర్ కుమార్ గుజ్రాల్ డైరీ, పలు విచారణ కమిషన్ నివేదికలు, పౌరహక్కుల సంఘాల నివేదికలు, అప్పటి పోలీసు అధికారులు వెల్లడించిన అంశాల ఆధారంగా ఇస్తున్న వార్తా కథనం ఇది) -
కాలిఫోర్నియా వర్సిటీకి భారీ విరాళం
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారత సంతతికి చెందిన దంపతులు హర్కీరత్, దీపా ధిల్లాన్ లక్ష డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. యూనివర్సిటీలో సిక్కు, పంజాబీ సంస్కృతులను అధ్యయనం చేస్తున్న విద్యార్థుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని యూనివర్సిటీని కోరారు. సిక్కు, పంజాబీ సంస్కృతిపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమెరికాలో సిక్కు సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నవారికి కూడా తాము ప్రోత్సాహకం కల్పిస్తామన్నారు. అంతేకాక హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్సైన్స్ తదితర అంశాల్లో రీసెర్చ్లు చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులు కూడా ప్రకటిస్తామన్నారు. -
ఆప్ నేత ఆశిష్ కేతన్ మరోసారి క్షమాపణ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆశిష్ కేతన్ మరోసారి క్షమాపణ చెప్పారు. ఆప్ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆయన సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్తో పోల్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆశిష్ కేతన్ మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై నిన్నే క్షమాపణ చెప్పానని, అయితే మళ్లీ సారీ చెబుతున్నానన్నారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదనీ, అలాగే ఎవరి మనోభావాలను కించపరచలేదని అన్నారు. కాగా మతవిశ్వాసాలను దెబ్బతీసేలా అశిష్ కేతన్ వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై అమృత్సర్లో కేసు నమోదు అయింది. సిక్క్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత కర్నైల్ సింగ్ పీర్ మొహమద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మత మనోభావాలు దెబ్బతీసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రావాల్ క్షమాపణ చెప్పాలని పీర్ మొహమద్ ...ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆప్ నేతలు క్షమాపణ చెబితే సరిపోదని, కేజ్రీవాల్ స్వయంగా క్షమాపణ చెప్పాలని సిక్కు సంస్థలు స్పష్టం చేశారు. -
ఘనంగా గురు గోవింద్సింగ్ జయంత్యుత్సవాలు: మోదీ
న్యూఢిల్లీ : సిక్కుల చివరి మతగురువు గోవింద్ సింగ్ 350వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగానే కాకుండా, భారతీయులున్న ప్రతీ దేశంలోనూ ఘనంగా జరుపుతామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.100 కోట్లను కేటాయించామని, నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు కమిటీ వేస్తామని చెప్పారు. సిక్కుల జనరల్ బాబా బందా సింగ్ బహదూర్ అమరుడై 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారమిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. సిక్కుల విజయనాదం ‘జో బోలే సో నిహాల్’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. చరిత్రను విస్మరించినవారు చరిత్రను సృష్టించలేరన్నారు. -
పైలట్కు ఇబ్బందని నలుగురిని దించేశారు
న్యూయార్క్: విమాన సిబ్బందికి నచ్చలేదని నలుగురు ప్రయాణికులను బలవంతంగా దించివేసిన ఘటన ఆందోళన రేకెత్తించింది. ఒక సిక్కు యువకుడు సహా అతని స్నేహితులు నలుగుర్ని విమానం దిగిపోవాల్సిందిగా అమెరికన్ ఎయిర్ లైన్స్ అదేశించింది. లేదంటే విమానాన్ని ఆపివేస్తామన్నారు. దీంతో వివాదం రాజుకుంది. ఒక సిక్కు యువకుడు, ముగ్గురు ముస్లిం యువకులతో కలిసి టొరంటో నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు విమానంలో బయలుదేరారు. షాన్ ఆనంద్, ఆలం, డబ్ల్యూ.హెచ్, ఎంకె, ఈ నలుగురు విమానం ఎక్కి సర్దుకుని కూర్చొనే లోపే వారికి చేదు అనుభవం ఎదురైంది. విమానంనుంచి దిగిపోవాల్సింది విమాన అటెండెంట్ అదేశించింది. దీంతో షాకైన యువకులు వాదనకు దిగారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి వారిని బలవంతంగా గెంటేసి మరీ విమానం ఎగిరిపోయింది. దీనిపై షాన్ , అతని స్నేహితులు ఎయిర్ లైన్స్ సంప్రదించినపుడు అధికారులు విచిత్రమైన వాదనకు తెరతీశారు. వారి ఇంటి పేర్ల ఆధారంగా బంగ్లాదేశ్ ముస్లిం, అరబ్ ముస్లింలను గుర్తించిన విమాన సిబ్బంది ఆందోళనకు లోనయ్యారని తెలిపారు. ముఖ్యంగా పైలట్ వారు విమానంలో ఉంటే తమకు అసౌకర్యంగా ఉంటుందని వాదించారన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో ఆ యువకులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థపై సుమారు 62 కోట్ల (9 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాల్సింది కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధమంటూ, ప్రోటోకాల్ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థ తమను మానసికంగా వేధించిందని ఆనంద్ ఆరోపించాడు. అందరూ తనను క్రిమినల్గా చూస్తోంటే చాలా బాధేసిందని డబ్ల్యూ.హెచ్ అనే మరోయువకుడు వాపోయాడు. -
పంజాబ్లో టెన్షన్.. టెన్షన్
ఫరిద్కోట్: పంజాబ్లోని ఫరిద్ కోట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవాన్ని దూషించారటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. వీరిని అడ్డుకుని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకోగా ఘర్షణలు మరింత మించిపోయాయి. పరస్పర దాడులు జరగడంతో మొత్తం 17మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లాఠీఛార్జి జరపి, భాష్పవాయుగోళాలను, జలఫిరంగులను ప్రయోగించి చివరకు రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నా అక్కడి వాతావరణం మాత్రం గంభీరంగా తయారైంది. ప్రజలంతా శాంతితో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు. -
ఆకట్టుకున్న సిక్కుల విన్యాసాలు
-
టాక్సీ డ్రైవర్.. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే
ఆదివారం వస్తోందంటే చాలు.. శనివారం రాత్రి నుంచే హాయిగా రిలాక్స్ అయిపోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఓ సాధారణ వ్యక్తి అసాధారణ సేవలను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నెలలో ఒక ఆదివారం సమాజసేవకు అంకితం అవుతూ.. 'ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే' పేరిట ఓ వినూత్నకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇండియాలో పుట్టి ఆస్ట్రేలియాలోని డర్విన్ లో ఉంటున్న తేజేందర్ సింగ్... అక్కడ కూడు, గూడుకు నోచుకోని నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆపద్బాంధవుడయ్యాడు. తేజేందర్ సింగ్ ప్రతి ఆదివారం.. ఉదయం ఏడు గంటలకు షిఫ్టు ముగించుకొని ఇంటికి వచ్చే అతడు కిలోల కొద్దీ అన్నం, కూరగాయలను వండుతాడు. అతని కుమారుడు నవదీప్ ఆ ఆహారాన్ని సిటీలోని పేదలకు అందిస్తాడు. మూడేళ్లుగా తేజేందర్ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. మంచి పని చేస్తున్నపుడు తనకు మరింత శక్తి వస్తుందంటున్న అతడు... పగలు ఎయిర్ కండిషనర్ మెకానిక్ గానూ పని చేస్తూ తన సంపాదనను ప్రజాసేవకు వినియోగిస్తున్నాడు. ''సంపాదించిన దానిలో పదిశాతం బీదలకు, దిక్కు లేనివారికి వెచ్చించాలన్నది మా మత ధర్మంలో ఉంది'' అంటున్న తేజేందర్ సింగ్.. ఈ రకమైన సేవ పదిమందీ చేయాలన్న ఉద్దేశంతో.. ఫేస్బుక్ను ప్రచార సాధనంగా ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే గా గుర్తింపు పొందాడు. రాత్రంతా టాక్సీ నడిపి, తెల్లవారుతుండగా ఇంటికి చేరే తేజేందర్ తిరిగి పని చేయాలంటే శక్తి అవసరం కాబట్టి ఏదో కాస్త తిని, కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఓపిక కూడదీసుకొని మళ్లీ పనిలో నిమగ్నమైపోతాడు. తేజేందర్ ఎందరికో ఆర్థికంగానూ అండగా నిలుస్తున్నాడు. తాను చేసే సేవకు ఎటువంటి నిధులు, విరాళాలు సేకరించడు. స్వయంగా సంపాదించిన దానిలోనే ఇతరులకు సహాయ పడతాడు. తనలాగా మరెందరో సేవలు అందించగలిగితే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నాడు. అందుకు ముందుకు వచ్చేవారు తన వ్యాను, వంట పాత్రలు వినియోగించుకోవచ్చని చెబుతున్నాడు. -
మతాచారం కంటే మానవత్వమే మిన్నగా..
ఆక్లాండ్: మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి ఒక బాలుడి ప్రాణాలు కాపాడిన 22 ఏళ్ల హర్మన్ సింగ్ హీరో అయ్యాడు. అతని మత ఆచారాన్ని మించిన మానవత్వానికి అందరూ జై జైలు కొడుతున్నారు. హర్మన్ సింగ్ న్యూజిలాండ్ లో అక్లాండ్ లో నివాసం ఉంటున్నాడు.. అదే ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు తన సోదరితో స్కూలుకి బయలుదేరాడు. మార్గమధ్యలో ఒక కారు ఆ బాలున్ని ఢీకొంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్న హర్మన్ సింగ్ వెంటనే అక్కడకి వెళ్లాడు. బాలుడికి తలనుంచి రక్తస్రావం అవ్వడం గమనించిన సింగ్ ఇంకో ఆలోచన లేకుండానే తన తల పాగాని తీసి బాలుడికి గాయమైన ప్రాంతంలో గట్టిగా కట్టాడు. తీవ్ర గాయాలతో అసుపత్రిలో చేరిన ఆ బాలుడి పరిస్థితి మొదట క్లిష్టంగా ఉన్న ప్రస్తుతం నిలకడగానే ఉంది. 'సిక్కు మత ఆచారం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో తల పాగాని తీయడం క్షమించరాని నేరం. నాకు తలపాగా మీద అపారమైన భక్తి ఉంది. కానీ ఆ సమయంలో మత ఆచారం గురించి ఆలోచించలేదు. ఆ ప్రమాదంలో గాయలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలున్ని రక్షించడమే నా కర్తవ్యంగా భావించాను' అని సింగ్ అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇదంతా గమనించిన గగన్ దిల్లాన్ అనే వ్యక్తి ఫోటో తీసి ఫేస్ బుక్లో పోస్టు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. పోస్టు చేసిన తక్కువ వ్యవధిలోనే హర్మన్ సింగ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. -
యూకేలో సిక్కుపై దాడి.. విచారణకు ఆదేశం
లండన్: బ్రిటన్లో ఓ సిక్క్తుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. బర్మింగ్హమ్ నగరంలో రద్దీగా ఉన్న వీధిలో సిక్కుపై అందరూ చూస్తుండగానే దారుణంగా దాడి చేసిన వీడియోను ‘డైలీ సిక్ అప్డేట్స్’ అన్న ఫేస్బుక్ పేజీలో సంచలనం సృష్టించింది. బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. సిక్కుపై దాడి జరుగుతున్న చుట్టూ ఉన్న వ్యక్తులెవరూ పట్టించుకోలేదు. కొద్ది దూరంలో మరో వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. బహుశా అతను మొదటి బాధితుడై ఉంటాడనిఅనుమానిస్తున్నారు. -
బ్రిటన్లో సిక్కు యువకుడిపై దాడి!
-
కాంగ్రెస్కు ప్రధాని మోదీ చురకలు
-
కాంగ్రెస్కు ప్రధాని మోదీ చురకలు
న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ వర్థంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లబాయి పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విస్మరించి కాంగ్రెస్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మోదీ మాట్లాడుతూ అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ఆయన తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారన్నారు. అయితే 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తు అదే రోజు దారుణం చోటుచేసుకుందని మోదీ అన్నారు. 1984లో జరిగిన అల్లర్లు జాతి సమగ్రతను దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ సంకుచిత సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోదీ హితవు పలికారు. కాగా ఇందిరా గాంధీకి మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. మరోవైపు 1984 అల్లర్లలో మరణించిన సిక్కులకు ప్రధాని గురువారం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 3,325 సిక్కు కుటుంబాలకు ప్రభుత్వం రూ.167 కోట్లు పరిహారం చెల్లించనుంది. కాగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలను ప్రకటించలేదు. అలాగే, ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ను ప్రధాని సందర్శించే విషయంపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
అమృత్సర్లో రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ
-
సిక్కులను విభజిస్తే ఒప్పుకోం!
-
భాగ్యనగర్..బల్లే బల్లే
సిక్కు..అంటే ధైర్యం, పట్టుదల, సైనికునికి ఉండే చొరవ, సాహసం గుర్తుకు వస్తారుు. యుుద్ధవిద్యల్లో ఆరితేరిన వీరు నగరం వాకిట ‘రక్షకులుగా’ ఓ రెండువందల ఏళ్ల కిందట అడుగు పెట్టారు. హైదరాబాద్ నవాబు కోరిక మేరకు 1832లో పంజాబ్ మహారాజు రణజీత్సింగ్ సుశిక్షుతులైన ఓ సైనిక పటాలాన్ని పంపారట. అలా వచ్చిన వారు ఇక్కడ విశేష సేవలందించారు. సైన్యంలో కీలక పాత్ర పోషించారు. శిస్తులు వసూలు చేశారు. అలా భాగ్యనగరిలో మమేకమై ‘తెలుగు దనం’ అద్దుకున్నారు. ఇక స్వాతంత్య్రానంతరం వచ్చిన వారు ఇక్కడి వ్యాపారాల్లో నిలదొక్కుకున్నారు. మొత్తం కలిపి నగర జనాభాలో ఓ లక్షకు పైచిలుకు ‘పంజాబీలు’ కనిపిస్తారు. ఇప్పుడు నగరంలో స్థిరపడ్డ వారు దక్కన్ సిక్కులుగా పేరుపడ్డారు. వీరికి ఇడ్లీ, వడ, సాంబారూ ఇష్టంగా మారిపోయారు. కొందరు వుహిళలు అక్కడి సాంప్రదాయు వస్త్రాలైన పంజాబీ దుస్తులతో పాటు, వునవారు ధరించే చీరా,జాకెట్టూ ధరిస్తుంటారు. రోటీకి బదులు అన్నం తింటుంటారు. అంతెందుకు తేట తెలుగులో చక్కగా మాట్లాడి ఔరా! అనిపిస్తారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, ధాబా ల నిర్వహణల్లో ఉంటున్నారు. ‘కంటోన్మెంట్’ నుంచి కూకట్పల్లి వరకూ... నగర భద్రతకోసవుని వచ్చిన వీరిని అప్పటి నవాబు వీరి చౌనీ కోసం కిషన్బాగ్లో ‘కంటోన్మెంట్’ స్థలాన్ని ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో గౌలిగూడ గురుద్వారా, అఫ్జల్గంజ్లో ఉన్న సింగ్ సభ, సికింద్రాబాద్లో సిక్విలేజ్లో ఉన్న గురుద్వారా చుట్టూ వీరుంటున్నారు. రాజేంద్రగనర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోనూ అధికంగా కనిపిస్తారు. వారం..వారం ఆత్మీయ రాగం నగరంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన సిక్కులు ప్రతీ ఆదివారం తమకు చేరువలో ఉన్న గురుద్వారాల్లో కలుసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గురుద్వారా సాహెబాన్ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీకి చైర్మన్ గురుచరణ్సింగ్ బగ్గా . గురుద్వారాలో ‘గురు గ్రంథ్ సాహెబ్’ (వుత గ్రంథం)కు ప్రార్థనలు చేస్తారు. విగ్రహారాధన ఉండదు. ఆ రోజు ‘ఉచిత వంటశాల’ నిర్వహిస్తారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వరుస క్రమంలో కూచున్న వాళ్లందరికీ భోజనం వడ్డిస్తారు. ఈ ‘ఫ్రీ కిచెన్’ తరతరాలుగానడుస్తోంది. ఇది వారి మత సంప్రదాయంలో భాగం. సిక్కులిచ్చే విరాళాలతోనే నడుస్తోంది. ‘సప్తపదికి’ బదులు .. వందల ఏళ్ల కిందట వూతృరాష్ట్రాన్ని విడిచి పెట్టినా వారి సంప్రదాయూల్లో కొన్నింటిని మాత్రం తప్పకుండా పాటిస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గది వారి వివాహ వేడుక. హిందూ వివాహంలో అగ్ని చుట్టూ తిరిగే ‘సప్తపది’లాంటిది వీరి ఆచారాల్లో ముఖ్యమైంది. వివాహ సమయుంలో తొలుత నిర్వహించేది ‘అఖండ్ పాఠ్’. దీన్ని 48 గంటల వుుందు నిర్వహిస్తారు. వివాహ సమయుంలో ‘గురు గ్రంథ్ సాహెబ్’ చుట్టూ నాలుగు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ సందర్భంలో ‘ఫెరా’ను చదవడం తప్పని సరి.‘బందీ ఛోడ్ దివస్’ పండుగను దీపావళి మాదిరిగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఒక్క పండగ తప్ప మిగతా అన్నిటినీ వారి పది మంది మత గురువుల (గురునానక్ నుంచి పదో గురువైన గురు గోబింద్సింగ్జీ వరకు) జయంతులనే ప్రధాన వేడుకలని చెప్పాలి. ఆదివారం జరిగిన ‘సింగ్సభ’ వ్యవస్థాపకుడు హర్మహేందర్సింగ్ బగ్గా వర్ధంతికి సుమారు వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. పిల్లలకు పంజాబీ.. వీరి పిల్లలు కూడా నగర జీవనంలో వుమేకమై పోయూరు. స్థోవుత ఉన్నవారు ఇంగ్లిష్ మీడియుం స్కూళ్లలో చదివిస్తుంటే, మిగతా వారు ప్రభుత్వ పాఠశాలలకు పంపుతుంటారు. ఇక పంజాబీ నేర్పించేం దుకు వూత్రం గురుద్వారాల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఇది మా మాతృనగరం హైదరాబాద్ గురించి ఏం చెప్పాలి? ఇది మా మాతృనగరం. నేను పుట్టింది ఇక్కడే. హైదరాబాద్ పంజాబ్ ఈ రెంటి మధ్య మాకు తేడా కనిపించదు. 1947 తర్వాత మా వాళ్లు ఇక్కడికి వచ్చారట. మా ఇంట్లో వాళ్లకు తెలుగు బాగా వస్తుంది. నాకు అర్థమవుతుంది. ‘హిందువూ లేడు, ముసల్మానూ లేడు’ మనుషులందరూ ఒక్కటే. మానవత్వమే మా మతం. మా స్కూల్లో ఎక్కువగా ముస్లింల పిల్లలే చదువుకుంటున్నారు. - కులదీప్సింగ్ బగ్గా, అఫ్జల్గంజ్ గురుద్వారా ‘సింగ్సభ’ చైర్మన్ -
రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ
-
ఢిల్లీలో సిక్కుల ఆందోళన
-
ఇంద్రియాలను జయించిన మహావీరుడు
ఏప్రిల్ 13న మహావీరుడి జయంతి హిందూ, జైన, బౌద్ధ, సిక్కు వుతాల్లో బౌద్ధ, జైనమతాలు కొంచెం భిన్నమైనవి. అహింస, సత్యవాక్పాలన, ఆస్తేయం (దొంగతనం చేయకుండా ఉండటం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకపోవటం) అనే ఐదు సూత్రాల ఆధారంగా ఏర్పడినదే జైనమతం. జినులు అంటే జయించినవారు అని అర్థం. వారు జయించింది ఇంద్రియాలను, ఆ తర్వాత జనుల హృదయాలను. జైనమత వ్యాపకుడైన వర్థమాన మహావీరుడు రాజుగా పుట్టాడు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వర్ధమానుడు. పెరిగి పెద్దవాడయ్యాక ఆయన ఇతర రాజ్యాల మీద దండెత్తి రాజులను జయించి ఉంటే అందరూ వీరుడని కొనియాడేవారేమో! అయితే వర్థమానుడు అలా చేయలేదు. రాగద్వేషాలను, అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలను జయించి మహావీరుడయ్యాడు. క్రీ.పూ. 599లో నేటి బీహార్లోని విదిశ (నాటి వైశాలి) లో త్రిశల, సిద్ధార్థుడు అనే రాజదంపతులకు జన్మించిన వర్థమానుడు బాల్యం నుంచి ప్రాపంచిక విషయాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదట. యశోధర అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల మరణానంతరం భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరించాడు. వృషభనాథుడు ప్రతిపాదించిన జైనమతాన్ని తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా బలోపేతం చేశాడు. వర్థమాన మహావీరుడిని ఆనాటి ప్రజలు సాక్షాత్తూ భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధించారు. - డి.వి.ఆర్. వర్థమానుడి తత్వం ద్వైతం. ఆయన సిద్ధాంతం ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవుడు, రెండు అజీవుడు. జీవుడంటే ఆత్మ, అజీవుడంటే పదార్థం. అజీవుడు అణునిర్మితమైతే, జీవుడు అమర్త్యం. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మల కారణంగానే జన్మలు ఏర్పడతాయి. జన్మరాహిత్యం చేసుకోవాలంటే మోహవికారాదులను, ఇంద్రియానుభవాలను తగ్గించుకోవాలి. అందుకు సన్యాసం, తపస్సు రెండూ అవసరమవుతాయి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. అంటే నిష్క్రియాత్మకమైన, నిర్మలమైన శాశ్వతానందం. నిర్వాణం లక్ష్యంగా ఉన్నవారు దుష్కర్మలను పరిహరించాలి. అంతేకాదు, నూతనకర్మలు చేయకుండా ఉన్న కర్మలను క్రమంగా నశింపజేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన. -
ఆకట్టుకున్న సిక్కుల విన్యాసాలు