Thaman S
-
రెండు దశాబ్దాల తర్వాత..!
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ యాక్టర్గా కెమెరా ముందుకు వస్తున్నారు ఎస్. తమన్(Thaman). శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, భరత్, మణికందన్, నకుల్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాయ్స్’. 2003లో విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత తమన్ యాక్టర్గా కొనసాగలేదు.‘మళ్ళీ మళ్ళీ (2009)’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ను స్టార్ట్ చేసి, ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్. ఇప్పుడు మళ్లీ లీడ్ యాక్టర్గా ఓ సినిమా చేయనున్నారు. అధర్య హీరోగా ఆకాశ్ భాస్కరన్ స్వీయ దర్శక నిర్మాణంలో ‘ఇదయమ్ మురళి’ అనే తమిళ మూవీ రానుంది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాలో నట్టి, తమన్, ఎన్ఎమ్ నిహారిక, ప్రగ్యా, సుధాకర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఇలా రెండు దశాబ్దాల తర్వాత తమన్ మళ్లీ ఓ సినిమాలో లీడ్ రోల్ చేస్తుండటం కన్ఫార్మ్ అయిపోయింది. 2003లో వచ్చిన ‘బాయ్స్’లో ఓ లీడ్ రోల్లో నటించిన తమన్ ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్లో మాత్రమే నటించారు. పూర్తి స్థాయి నటుడిగా తమన్ మళ్లీ నటిస్తున్నది ‘ఇదయమ్ మురళి’ చిత్రంలోనే. -
హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్ చేసిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్ సాధించింది. ఈ మూవీలో తమన్.. మ్యూజికల్ బ్యాండ్లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్ మజ్ను, బేబీ జాన్ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)సంగీత దర్శకుడిగా..తమన్ తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్గా పని చేశాడు. బాయ్స్ మూవీలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్. కిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేశాడు.చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు -
అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్ను బాలయ్య పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు. -
ట్రోలర్స్పై తమన్ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికగా తమన్ కామెంట్స్పై రియాక్ట్ అయ్యారు.'డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్)విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు. ట్రోలర్స్పై తమన్ వ్యాఖ్యలుసినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025"ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు... మనమే మన సినిమాని చంపేస్తున్నాం..." - Thaman pic.twitter.com/wmNpyakIf1— Aryan (@chinchat09) January 18, 2025 -
హీరోయిన్గా బ్రాహ్మణికి ఆఫర్.. కానీ, నో చెప్పింది: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. కేవలం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్స్టాపబుల్’ లో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.అన్స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు' అని తమన్ అడిగారు. అందుకు సమాధానంగా వారిద్దరినీ చాలా గారాబంగానే పెంచానంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్ను ఆయన గుర్తు చేసుకున్నారు. 'గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్లిపోయింది. అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. ఆ సమయంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే' అని బాలయ్య అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని అదే వేదికపై బాలకృష్ణ అన్నారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇష్టమేనని ఆయన తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలో జరగనుంది. అక్కడే ట్రైలర్ను విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?
'ఆర్ఆర్ఆర్' సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) మళ్లీ కలిశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు, తమన్.. చరణ్(Ram Charan)-తారక్తో దిగిన ఫొటోలని పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ? ఎందుకు కలిశారు?(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?)రీసెంట్గా అమెరికాలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ ఈవెంట్ జరిగింది. దీనికి చరణ్, తమన్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. రిట్నర్ వస్తున్న క్రమంలోనే దుబాయిలో దిగారు. అక్కడే ఎన్టీఆర్ని కలిశారు. మరి తారక్ హాలీ డే కోసం వెళ్తున్నాడా? వేరే షూటింగ్ ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.తారక్.. ఈ రెండు ఫొటోల్లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే 'వార్ 2' చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఇది పీరియాడికల్ మూవీ అని ఈ మధ్యే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. మరి తారక్ సన్నబడింది ఈ ప్రాజెక్ట్ కోసమేనా లేదా ఇంకేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన) -
డల్లాస్లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్.. తమన్ మ్యూజిక్పై ప్రశంసలు
బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' ప్రకటన వెలువడిన సమయం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి 'ది రేజ్ ఆఫ్ డాకు' పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. "డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్
అల్లు అర్జున్ 'పుష్ప 2' చివరి దశ పనులు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సహా పలువురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. తాజాగా 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన తమన్.. తాజాగా మరో ఇంటర్వ్యూలో మూవీ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి-రమ్య బెహరా)'పుష్ప 2 చూసి భయపడ్డాను. ఎందుకంటే అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ తర్వాత అవార్డులన్నీ బన్నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పదిహేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను' అని తమన్ చెప్పాడు.మ్యూజికల్ స్కూల్ కట్టాలనేది తన కోరిక అని.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నానని తమన్ చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ ఉన్న చోట క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను క్రికెట్ ఆడి వస్తే వెంటనే ఓ ట్యూన్ వస్తుంది. క్రికెట్ ఆడటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. రెండు, మూడేళ్లలో వరల్డ్ క్లాస్ స్టూడియోని ఇక్కడే కడతాను. ప్రభుత్వం తరుపున ఏమైనా సాయం చేస్తారా? అని కూడా అడుగుతాను. స్థలం ఇవ్వమని మాత్రం అడగనని తమన్ తన ఆలోచనల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ దిశా పటానీ తండ్రి) -
పుష్ప రాజ్ కి తమన్ హెల్ప్ చేస్తున్నాడా
-
'గేమ్ చేంజర్' నుంచి రెండో సాంగ్ ప్రోమో విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా రెండో పాట గురించి మేకర్స్ సమాచారం ఇచ్చారు. ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్. సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 'గేమ్ చేంజర్' నుంచి విడుదలైన 'జరగండి జరగండి' అనే పాట భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.గేమ్ చేంజర్ నుంచి తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'రా మచ్చా మచ్చా..' అనే లిరిక్స్తో మొదలైన ఈ సాంగ్లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కూడా ఈ సాంగ్లో స్టెప్పులేశారట. ఇదే పాట గురించి సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ శంకర్ చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. -
ఆ దర్శకునికి ఫ్రీగా డేట్స్ ఇచ్చిన 200 Cr స్టార్ ప్రభాస్.. కారణం..!
-
15 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా రీరిలీజ్
మాస్మహారాజా రవితేజ కెరియర్లో కిక్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్ సినిమా రీరిలీజ్ కానుంది. సురేందర్రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోతుంది. కిక్ సినిమాతో థమన్, సురేందర్రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్తో థియేటర్లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. -
గుంటూరు కారం తమన్ సాంగ్స్ పై మహేష్ బాబు సీరియస్!
-
మహేష్ ఫాన్స్ ను నిరాశపరిచిన తమన్
-
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
స్పీడ్ పెంచిన దేవీశ్రీ..దేనికో తెలుసా.!
-
గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?
తమన్ పేరు చెప్పగానే దద్దరిల్లిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తాయి. పలు సినిమాల్ని తన సంగీతంతో ఓ రేంజులో ఎలివేట్ చేశాడు. వాటిలో 'అఖండ' ఒకటి. బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్టర్ అయినా సరే ఈ మూవీ విషయంలో ఎక్కువ క్రెడిట్ తమన్దేనని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్ కష్టం ఏం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఆ కామెంట్స్పై స్వయంగా తమన్ పరోక్షంగా కౌంటర్ కామెంట్స్ చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా 'స్కంద' మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఫైట్స్ తప్ప మరే విషయంలోనూ మెప్పించలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అఖండ'కి తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది కదా అని జర్నలిస్ట్ అడగ్గా.. 'ఆ సినిమాను ఆర్ఆర్ (రీరికార్టింగ్) లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. అదే టైంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద తమన్ అద్భుతంగా చేయగలిగాడు' అని బోయపాటి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్బస్టర్ రెస్పాన్స్) ఇలా బోయపాటి కామెంట్స్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే తమన్.. 'ఐ డోంట్ కేర్' అని ట్వీట్ వేశాడు. ఇది బోయపాటిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ అని అందరూ అనుకున్నారు. తాజాగా 'భగవంత్ కేసరి' సక్సెస్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన తమన్.. బాలకృష్ణ ముందే బోయపాటి పరువు తీసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'మంచి సీన్ని మనం చెడగొట్టం. మనం ఇంకా దాన్ని ఎలివేట్ చేయాలనే చూస్తాం. అక్కడ సీన్లో ఎమోషన్ లేకపోతే నేను ఏం చేసినా వర్కౌట్ కాదు. ఎవడి వల్ల అవ్వదు. చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? అంతే లాజిక్ ఇక్కడ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటారు గానీ అక్కడ మేటర్ లేకపోతే నేనేం చేయను. అక్కడ వాళ్లు(దర్శకులు) ఇవ్వాలి' అని తమన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) #Thaman Comments 🤷pic.twitter.com/XDDsBF6Zk3 — CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 25, 2023 -
బెస్ట్ టీమ్తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ'
'గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో డీజే టిల్లు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన నుంచి మరొక కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు తెలుసు కదా అనే సరికొత్త టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా.. యువరాజ్ కెమెరామెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. సినిమా టైటిల్ వీడియో చాలా రిచ్గా చిత్రీకరించారు. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ అందించిన మ్యూజిక్ మనసును తాకేలా కూల్గా ఉంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్ శ్రీకర ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించనుండటం విశేషం. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి బాద్షా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్గా ఇండస్ట్రీకి పరిచమైన నీరజ కోన ఈ చిత్రానికి మొదటిసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా గుర్తింపు పొందిన నీరజ దర్శకురాలిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. తెలుసు కదా సినిమా టీమ్ చూస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి ప్రేక్షకులల్లో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు కేవలం డిజిటల్ హక్కులే రూ. 80 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొన్నదని ప్రచారం జరిగింది. ఇంత పాజిటివ్ ఎనర్జీతో వస్తున్న ఈ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంది. దీంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమేనని ఇండస్ట్రీలో టాక్. తాజాగా మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్ స్థానంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై.. అలాంటిదేమి లేదని నిర్మాత నాగవంశీతో పాటు తమన్ కూడా ఖండించారు. దీంతో ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఇదే విషయంలో మరోసారి రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గుంటూరు కారం పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేష్ బాబుకు నచ్చలేదట. త్రివిక్రమ్ చెప్పారని మాత్రమే ఆయన్ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితిలో తమన్ను పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఆయన ప్లేస్లోకి 'ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరిలియో'లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని మహేష్ బాబు ముందు ఉంచారట మేకర్స్. ఈ ప్రపోజల్కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు మెలడీతో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరోకరు మాస్ బీట్తో దంచికొడతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్ మాస్టర్స్, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, స్క్రిప్ట్లో మార్పు.. ఇలా మూవీకి కావాల్సిన కీలకమైన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది.. వీటిలో ఇప్పటికే కొన్ని నిజం అయ్యాయి కూడా.. ఫైనల్గా గుంటూరు కారంలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా త్రివిక్రమ్కు చాలా క్లోజ్. వీరిద్దరూ చాలా సినిమాలే చేశారు. అలాంటిది అతనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అసలు సమస్య మహేష్ కాదని, త్రివిక్రమ్ ధోరణితోనే చాలా సమస్య వస్తోందని పరిశ్రమలో టాక్. ఇవన్నీ క్లియర్ కావాలంటే మహేష్బాబు వివరణ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. -
'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు ఎలా తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్ తనదైన శైలిలో స్పందించారు. తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్ ఆడి ఇంటికెళ్తా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ కూడా ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!) -
మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్
మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ను తప్పిస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. రెండురోజులగా ఇదే టాపిక్పై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా మహేష్ బాబుతో థమన్కు విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి రూమర్స్కు తాజాగా థమన్ షాకింగ్ ట్వీట్ చేయడంతో విషయం హాట్ టాపిక్గా మారింది. (ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు) 'నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే.. వారందరికి స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి.. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్ నైట్' అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు. ట్రోల్స్ పై సెలబ్రీటీలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కారు. కాని తమన్ మాత్రం తనపై జరిగే ట్రోల్స్ కి సమాధానం చెప్పడంతో పాటు ఒక్కోసారి కౌంటర్స్ కూడా ఇదే రేంజ్లోనే ఇస్తాడు. దీంతో అసలు ఈ విషయం తెలియని వాళ్ళు ఏమైంది అన్నా.. అని అంటుండగా, కొందరు మాత్రం మహేష్ సినిమా మేకర్స్ అయినా స్పందిస్తే బాగుంటుంది కదా? అంటున్నారు. And also From Tom I am starting #Buttermilk Stall for free of cost at my studios people suffering with stomach burning symptoms are welcome 🙏 pls get cured 👌🏼🤠 Good nite lots of work ahead don’t want to waste my time 🕰️ 🙏 and urs also #peace & #love ♥️🫶 and some… pic.twitter.com/e2Fx7xkA6d — thaman S (@MusicThaman) June 19, 2023 (ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్) -
హర్టయిన శాస్త్రిగారు, కానీ దానికోసం కాదట!
నందమూరి నటసింహం ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ ఆంథెమ్ సాంగ్ జై బాలయ్య రిలీజైంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు అంటూ సాగే ఈ పాట ఒసేయ్ రాములమ్మ సాంగ్ను గుర్తు చేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించిన తమన్ను కాపీ క్యాట్ అంటూ ఆడేసుకుంటున్నారు. కాపీ పాటకు లిరిక్స్ అందించావటూ రామజోగయ్య శాస్త్రిపై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. ప్రతిపాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టూ.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఇబ్బందిగా అనిపిస్తే ఇటు రాకండి అని రాసుకొచ్చాడు. అలా పాట రిలీజ్ అయిందో లేదో ఇలా ట్రోలింగ్ జరగడంతో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యాడని పలువురూ భావించారు. దీంతో తన ట్వీట్కు వివరణ ఇచ్చుకున్నాడీ రచయిత. వేరే విషయం మీద ఆ ట్వీట్ చేశానని, ట్రోలింగ్ లేదు, ఏమీ లేదని స్పష్టం చేశాడు. అభిమానులందరూ నేనంటే చాలా ఇష్టపడతారని, ముఖ్యంగా జై బాలయ్య పాట పట్ల సాహిత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022 చదవండి: నా కోడలు బంగారం అంటున్న నయనతార అత్త -
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
చిరంజీవి ‘గాడ్ఫాదర్’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
Godfather Pre Release Photos: అనంతపురంలో ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ఫాదర్ నుంచి నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో చిరుతో కలిసి సల్మాన్ స్టెప్పులేశాడు. టార్ మార్ టక్కర్ మార్ అంటూ ఫాస్ట్ బీట్తో ప్రొమో అదిరిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రొమో సాంగ్ విన్న కొందరు తమన్ను సోషల్ మీడియా వేదికగా ఆటాడేసుకుంటున్నారు. మళ్లీ దొరికిపోయాడంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట అచ్చం రవితేజ క్రాక్ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందని అంటున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ పాటను కంపోజ్ చేసింది కూడా తమనే. దీంతో ‘ఏంటి.. తమన్ నువ్వు ఇక మరావా?.. రెండు పాటలకు ఒకే బీట్ వాడావంటూ’ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ‘మెగాస్టార్ లాంటి పెద్ద హీరో చిత్రానికి పని చేస్తున్నప్పుడు కొంచం డిఫరేంట్ ఉండాలి కదా’ అని తమన్పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ రెండు పాటలను పోలుస్తూ నెటిజన్లు ‘ఏంటమ్మా.. తమన్ ఇది చూసుకోవాలి కదా’ అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. కాగా ఇలా కాపీ కొట్టి దొరికపోవడం తమన్కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు పాటలకు కాపీ కొట్టి తమన్ దొరికిపోవడం.. అతడిని నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణమైంది. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ -
జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’... ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా... 68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు. 30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్కు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిం చిన ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రేవంత్ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది. మరోవైపు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది. అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’కు మూడు (బెస్ట్ యాక్టర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) జాతీయ అవార్డులు దక్కాయి. తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5, ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం. అలాగే మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ‘ద లాంగెస్ట్ కిస్’కు ‘ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్ క్రిటిక్ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది. సేమ్ సీన్! 67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్పాయ్ (భోన్స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకుడికి అవార్డు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. ఓటీటీ చిత్రాల హవా! 68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి. తొమ్మిదో అవార్డు కెరీర్లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ క్రెడిట్ నాది కాదు ► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్ కూడా ఆయనదే. ► ట్యూన్స్ ఇచ్చింది మీరు కదా.. (నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్గా పిక్ చేయగల డైరెక్టర్ కాబట్టే కరెక్ట్ ట్యూన్స్ని త్రివిక్రమ్గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్ ఎలివేట్ అయిందంటాను. ► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా? ఏమాత్రం టెన్షన్ పడలేదు. త్రివిక్రమ్గారు మమ్మల్నందర్నీ కూల్గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్ ఆయనకే ఇస్తున్నాను. ► మరి.. పూర్తి క్రెడిట్ని మీరెప్పుడు తీసుకుంటారు? ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్’ ఉన్నాయి. మ్యూజికల్ అవార్డ్స్ అవి. ఇండిపెండెంట్ మ్యూజిక్కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్ బిగ్’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. అందుకే అవార్డు క్రెడిట్ని ఒక్కడినే తీసుకోవడంలేదు. – తమన్ బాధ్యత పెరిగింది – సాయి రాజేష్ నిజంగా మా ప్రేమకథ (‘కలర్ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని. అవార్డుల విజేతల వివరాలు ∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి) ∙ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల...వైకుంఠపురములో...) ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్కుమార్ (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్) ∙ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ). -
ఆటా వేడుకలకు సర్వ సిద్ధం: అతిథులతో కళకళ లాడుతున్న వేదిక
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా)17వ ఆటా మహసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకలకోసం తెలుగువారంతా అమెరికాకు చేరుకుంటున్నారు. పదివేలమందికిపైగా హాజరవుతారని భావిస్తున్న ఆటా మహాసభలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాషింగ్టన్ డీసీకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు తమన్, చంద్రబోస్, శివారెడ్డి , సింగర్ మంగ్లీ తదితరులు ఏటీఏ కాన్ఫరెన్స్కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న వేడుకల కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా కోవిడ్ కారణంగా రెండేళ్ళలో వేడుకలు ఇంత పెద్ద ఎత్తున జరగకపోవడం, కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరింత ఉత్సాహం నెలకొంది. ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా, ఉత్సాహంగా సభలను నిర్వహించేందుకు ఎద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆటా అధ్యక్షుడు తెలిపారు. -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
నాగ చైతన్య 'థ్యాంక్యూ' నుంచి 'ఫేర్వెల్..'
Naga Chaitanya Thank You Movie Farewell Lyrical Song Released: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'ఫేర్ వెల్..' అంటూ సాగే పాటను హైదరాబాద్లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సోమవారం (జూన్ 28) విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ- 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం.. ఆ తర్వాత స్కూల్మేట్స్తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజ్ లైఫ్ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ 'ఫేర్వెల్..' పాట ద్వారా చెప్పాం' అన్నారు. 'ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని విక్రమ్ కె. కుమార్ అభిప్రాయపడ్డారు. ''మూడేళ్లు 'థ్యాంక్యూ' కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం'' అని నాగచైతన్య పేర్కొన్నాడు. ''ఫేర్వెల్..' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు'' అని తమన్ తెలిపాడు. చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. -
కువైట్లో తమన్ 'సుస్వర తమనీయం'.. వైభవంగా వేడుక
Thaman Music Festival In Kuwait: రెండున్నర సంవత్సరాల తరువాత 'కోవిడ్' అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం 'సుస్వర తమనీయం'. కువైట్లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 3 సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ బృందంతోపాటు సుమారు 1500 మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్ బృందమైన గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వీచంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తదితరులు తమ పాటలతో అలరించారు. దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది. సభ్యులందరు కేరింతలు,నృత్యాలు, ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ 'సుస్వర తమనీయం' ఆద్యతం అలరించింది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు అనంతరం స్పాన్సర్స్.. తమన్ను, వారి బృందాన్ని, మిగతా సంస్థల అధ్యక్షులను, ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ను "తెలుగు కళా సమితి" కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో "తెలుగు కళా సమితి" స్మారక చిహ్నమైన 'సావెనీర్' వార్షిక సంచికను విడుదల చేశారు. -
మహేశ్ బాబుపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఎస్ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న గ్రాండ్గా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను స్పీడ్ చేసిన చిత్రబృందం శనివారం (మే 7) ప్రీరిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని యూసుఫ్ గూడ 1వ టీఎస్ఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 'సుమతో తకిట తకిట విత్ తమన్' పేరుతో చిట్చాట్ జరిగింది. తర్వాత ఈ మూవీ టీమ్ క్రికెట్ ప్లేయర్స్ అయితే ఎవరెవరికీ ఏ పొజిషన్ ఇస్తారని తమన్ను యాంకర్ సుమ అడిగింది. దానికి తమన్ వికేట్ కీపర్గా పరశురామ్, బౌలర్గా కీర్తి సురేశ్ అని చెప్పాడు. దీంతో తన బౌలింగ్కు ఎవరైనా ఔట్ కావాల్సిందేనా అని సుమ అడగ్గా.. 'అవును. తన నటనతో బాగా నమ్మించేసింది' అంటూ చెప్పుకొచ్చాడు తమన్. అనంతరం మంచి ఫీల్డర్ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పాడు తమన్. ఎటునుంచి వచ్చిన బాల్ను పట్టుకునేది ఒక కెప్టెన్ అది మహేశ్ బాబు అని తమన్ పేర్కొన్నాడు. చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో ప్రభుదేవా..
Prabhu Deva Choreography In Chiranjeevi Godfather Movie: కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి చేతిలో ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మంగళవారం (మే 3) రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారని మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇదివరకే తెలిపాడు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించాడు తమన్. చిరు-సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్ను ఇండియన్ మైఖేల్ డ్యాన్సర్గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇదివరకు అనేక చిరంజీవి చిత్రాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చిందేయడం, దీనికి తమన్ సంగీతం అందించడంతోపాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్ కావడంతో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్ స్క్రీన్పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. చదవండి: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి Yayyyy !! ❤️ THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6 — thaman S (@MusicThaman) May 3, 2022 -
రాధేశ్యామ్పై ట్రోలింగ్: మీమ్తో కౌంటరిచ్చిన తమన్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 11) రిలీజైంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ పీరియాడికల్ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ప్రేమకథ అజరామరం అని కొందరు పొగుడుతుంటే మరికొందరు మాత్రం చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిందని అంటున్నారు. ఈ సినిమా ప్రభాస్ చేయాల్సింది కాదని కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా ఈ నెగెటివిటీపై సంగీత దర్శకుడు తమన్ పరోక్షంగా స్పందించాడు. చదవండి: ‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న మీమ్ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇంతకీ ఆ మీమ్లో ఏముందంటే.. 'సినిమా ఎలా ఉంది?' అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. 'నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ నైట్, సెకండాఫ్లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి?' అని చిర్రుబుర్రులాడుతున్నట్లుగా ఉంది. దీన్ని షేర్ చేసిన తమన్.. 'మీమ్ అదిరింది.. స్లో అంట, నువ్వు పరిగెత్తాల్సింది' అంటూ ట్రోలర్స్పై సెటైర్ వేశాడు. ఈ ట్వీట్కు బ్లాక్బస్టర్ రాధేశ్యామ్ అన్న హ్యాష్ట్యాగ్ను జత చేశాడు. మరి ఈ సినిమా నిజంగానే బ్లాక్బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి! #BlockBusterRadheShyam 💥💥💥💥💥💥 Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣 Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h — thaman S (@MusicThaman) March 11, 2022 -
‘రాధేశ్యామ్’మూవీ జెన్యూన్ రివ్యూ..
-
కళావతి స్టెప్ ను రీక్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
తమన్ వర్సెస్ అనిరుథ్
-
హార్ట్ బ్రేకింగ్: వాడికి పనిస్తే.. ఈ పని చేస్తాడని అనుకోలేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి గతంలో మూవీ టీజర్ లీక్ కాగా తాజాగా కళావతి పాట కూడా లీక్ కావడంతో మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయంపై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తన మాటల్లో.. నా మనసు చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతెంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. ఈ పాట షూటింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అభిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్భుతమైన లిరిక్స్. మా డైరెక్టర్ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో. మాస్టరింగ్, మిక్సింగ్ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం. అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాధ పడాలా.. మూవ్ ఆన్ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్ బ్రేకింగా వుంది. నేను మామూలుగా ఇంత హార్ట్ బ్రేక్ అవ్వను. చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఎన్నో ఎదుర్కొన్నాను లైఫ్లో. నేనెందుకు పబ్లిక్ డొమైన్లో ఈ ఆడియో నోట్ పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి అంటూ తమన్ ట్వీట్ ద్వారా తన ఆవేదనను తెలిపాడు. ఇక పాట లీకైన నేపథ్యంలో కళావతి పూర్తి పాటను నేడు అధికారికంగా యూట్యూబ్లో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. Heartbroken 💔 !! pic.twitter.com/tO75lsUND6 — thaman S (@MusicThaman) February 12, 2022 -
తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జ్గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !
S Thaman As Judge For Telugu Indian Idol Show: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు తమన్. 2009లో రవితేజ కిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అనేక మంది స్టార్ హీరోలకు మ్యూజిక్ కంపోజ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో తమన్ పేరు మారుమోగిపోయింది. అందులో తమన్ కొట్టిన బీజీఎంకు మాములు క్రేజ్ రాలేదు. ఇదే కాకుండా పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' పాటలు ఇప్పటికే ఫుల్ పాపులర్ అయ్యాయి. దీంతోపాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు తమన్. అయితే ప్రస్తుతం తమన్కు సంబంధించిన ఒక క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంతతో 'సామ్ జామ్', నందమూరి బాలకృష్ణతో 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' వంటి టాక్ షోలతో ఆహా అనిపించింది. తాజాగా తెలుగు 'ఇండియన్ ఐడల్' పేరుతో సింగింగ్ రియాలిటీ షోను పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్గా సింగర్, బిగ్బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర హోస్ట్గా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ షోకు న్యాయ నిర్ణేతగా తమన్ వ్యవహరించనున్నాడట. ఇండియన్ ఐడల్ మేకర్స్ దాదాపుగా తమన్ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే షోకు రేటింగ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ షోకు తమన్ జడ్జ్గా వస్తే సోషల్ మీడియాలో మీమర్స్కు కూడా పని దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే తమన్ చాలా సినిమాల నుంచి మ్యూజిక్ కాపీ కొడతాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి. నాగార్జున నటించిన కింగ్ మూవీలోని కొన్ని సీన్లను స్పూఫ్ చేస్తూ తమన్పై ట్రోలింగ్, మీమ్స్ చేసినవారు కూడా ఎక్కువే. కాగా న్యాయనిర్ణేతగా తమన్ ఇచ్చే జడ్జిమెంట్పై ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు -
రాధేశ్యామ్ నుంచి ఆసక్తికర అప్డేట్.. బీజీఎంకు తమన్
Radhe Shyam Movie Background Music Director Thaman: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. కాగా, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా భారీ హైప్కు ఒక కారణం. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులు నమోదు చేశాయి. ఇటీవలే పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు వెల్లడించిన పోస్టర్కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో ఒప్పందం చేసుకున్నారు మేకర్స్. రాధేశ్యామ్ సినిమాకు దక్షిణాది భాషలకు తమన్ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్ తెలిపింది. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సినిమాలోని బీజీఎం హైలెట్గా నిలిచింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అఖండ బీజీఎం గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. తమన్ బీజీఎం సూపర్ అంటూ ఆకాశానికెత్తారు ఆడియెన్స్. ఇదంతా చూస్తుంటే 'రాధేశ్యామ్' సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్లో ఉండాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE — UV Creations (@UV_Creations) December 26, 2021 ఇదీ చదవండి: ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్' గురించి పలు ఆసక్తికర విషయాలు -
Ghani: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే..
మెగా హీరో వరుణ్తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్గా కనిపించబోతున్నాడు. అందులోని వరుణ్ మాస్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. సినిమా విడుదల కోసం ఎంతగానో వేయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే వారిని సంతోషపెట్టేందుకు మూవీ మేకర్స్ గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో హీరోయిన్ నుంచి విలన్ వరకు కీలకమైన పాత్రలన్నింటినీ చూపించారు. మొదట నదియా, తర్వాత నరేష్ కనిపించగా, క్రమంగా తనికెళ్ల భరణి, నవీన్ చంద్ర, సాయి మంజ్రేకర్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రను చూపించారు. అయితే గని ప్రపంచంలో వీళ్లందరు ఉంటారనట్లుగా వీడియో ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ చూస్తే ఆ అంచనా రెట్టింపు అయ్యేలా ఉంది. బాలీవుడ్ నటుడు మహేష్ ముంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే సినిమా టీజర్ను నవంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు వీడియోలో చూపించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. అల్లు వెంకటేష్, సిద్దు ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గని చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. -
శంకర ప్రియ తమన
-
RC15: పట్టలేనంత సంతోషంలో తమన్
తమన్ పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. మరి.. ఏ దర్శకుడి సినిమాలో నటుడిగా కనిపించారో అదే దర్శకుడి సినిమాకి పాటలిచ్చే అవకాశం వస్తే ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదా. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ (2003)లో ఐదుగురు యువకుల్లో ఓ యువకుడిగా తమన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు శంకర్ డైరెక్షన్లో యాక్టర్గా కనిపించిన తమన్ ఇప్పుడు ఆయన సినిమాకి ట్యూన్స్ ఇవ్వనుండటం విశేషం. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న ప్యాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. ‘‘2000 సంవత్సరం నుంచి శంకర్ సార్ని చూస్తున్నాను. సైన్స్ని, సినిమాకి మించిన విషయాలను ఆయన ఊహించే విధానం అద్భుతం. ఆయనలో అదే ఉత్సాహం ఉంది. ‘నాయక్’, ‘బ్రూస్లీ’ తర్వాత రామ్ చరణ్ సినిమాకి పని చేయనున్నాను. నా బెస్ట్ ఇవ్వ డానికి ప్రయత్నం చేస్తాను’’ అన్నారు తమన్. -
పనికిమాలినోడిని చేసుకున్నందుకు గర్వపడుతుంది: థమన్
చెడు చెవిలో చెప్పాలి, మంచి మాత్రం నలుగురికీ వినబడేలా చెప్పాలి అంటుంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యాన మంచి కన్నా చెడునే ఎక్కువగా చాటింపు వేసి చెప్తున్నారు. తప్పున్నా లేకపోయినా ఎదుటివాడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద సెటైర్లు వేయడం చాలామందికి అదో వినోదంగా మారింది. అయితే ఇలాంటి వాటిని చూసీచూడనట్లుండే సంగీత దర్శకుడు థమన్ ఈ మధ్య మాత్రం తన మీద కామెంట్లు చేసేవారిని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నాడు. Meanwhile PLS tell ur wife tat U Wr busy doing this memes bro she will proud of You tat she married a useless memmer !! In LIFE 🤣🙋🏽♂️ https://t.co/rOmbVtSIJr — thaman S (@MusicThaman) May 9, 2021 తాజాగా ఓ నెటిజన్ థమన్ను అవమానించేలా మీమ్ పెట్టాడు. ఇందులో కింగ్ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర తాలూకు స్టిల్స్ ఉన్నాయి. రేప్పొద్దున తన పిల్లలకు ఇతనే థమన్ అని చూపిస్తా.. అంటూ సదరు నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అతడి ఉద్దేశ్యమేంటో అర్థమైన థమన్.. కౌంటర్ ఇచ్చిపడేశాడు. 'దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్ చేసుకుంటూ ఉన్నానని చెప్పు బ్రో.. అప్పుడామె ఇలాంటి పనికి మాలిన మీమర్ను పెళ్లి చేసుకున్నానేంటా? అని చాలా గర్వపడుతుంది' అని రిప్లై ఇచ్చాడు. ఈ దెబ్బకు ఆ నెటిజన్ మారు మాట్లాడకుండా గమ్మునుండిపోయాడు. ఎప్పుడూ పక్కవాళ్ల మీద పడి ఏడ్చే ఇలాంటి వాళ్లకు బాగా బుద్ధి చెప్పావంటూ థమన్ను అతడి ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
డ్రగ్స్ అవసరం లేదు, అవి మాత్రమే చాలు: థమన్
ఈ ఏడాది సంగీత దర్శకుడు థమన్ మాంచి స్పీడు మీదున్నాడు. తను అందించే సంగీతం ఒకెత్తు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంటోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాకు థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ సినిమానే కాదు, మ్యూజిక్ కూడా జనాలకు బాగా కిక్కిచ్చింది. ఇది చూసి టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా తన వైల్డ్డాగ్ సినిమాకు థమన్ కావాలని కోరాడట. అలా నాగ్ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అందరినీ ఫిదా చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత 'వకీల్సాబ్'తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ సినిమాకు కూడా మంచి నేపథ్య సంగీతాన్ని అందించి అందరి చేత ప్రశంసలు అందించుకున్నాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ థమన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఇది కంపోజ్ చేసేటప్పుడు ఏమైనా తాగావా ఏంటి? నీ కెరీర్లో ఇప్పటివరకు చేసినవాటిలో ఇదే హైలైట్. అసలు మామూలుగా లేదు..' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన థమన్.. 'అలాంటిదేమీ లేదు, కాకపోతే పవన్ కల్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటంతో అలా అనిపిస్తుంది అంతే. మాకు డ్రగ్స్ అవసరం లేదు, కేవలం హగ్స్, థగ్స్ ఇస్తే చాలు.. రెచ్చిపోతాం..' అని రిప్లై ఇచ్చాడు. Not exactly ⚠️ but the truth is the MAN on the screen @PawanKalyan gaaru ⚡️❤️ it will automatically make us feel high we don’t need drugs jus hugs 🤗 and some thugs 😎 @Karthika28_ ⚡️ #VakeelSaabBGM ♥️ https://t.co/d7J5kLQKMG — thaman S (@MusicThaman) May 2, 2021 సూపర్ స్టార్ మహేశ్బాబు 'సర్కారు వారి పాట'కు కూడా అందరూ ఆశ్చర్చపోయే రీతిలో సంగీతాన్నివ్వాలని మరో నెటిజన్ కోరగా.. తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. మరోవైపు ఆయన సంగీతం అందించిన అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాట యూట్యూబ్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సాంగ్ 600 మిలియన్ల వ్యూస్ను దాటేసింది. Sure o sure ❤️👩@imManaswinidhfm 💫☀️ https://t.co/TBujiOhdsm — thaman S (@MusicThaman) May 2, 2021 చదవండి: ‘వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్ -
నా హృదయం ముక్కలైంది: థమన్ కంటతడి
"ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న" అంటారు. ఈ సామెతను నిజం చేశాడో వ్యక్తి. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో ఓ పండు ముసలావిడ తన ఆకలి ఎవరైనా తీర్చకపోతారా? అని రోడ్డు మీద ఆశగా నిరీక్షిస్తోంది. ఆమె ఆకలిని పసిగట్టిన ఓ వ్యక్తి ఆహారం పొట్లంతోపాటు ఓ వాటర్ బాటిల్ను తీసుకెళ్లి ఆమెకు అందించాడు. హమ్మయ్య.. ఈ పూటకు పస్తులుండక్కర్లేదు అని సంబరపడిపోయిందా పెద్దావిడ. దీనికి డబ్బులేమైనా తీసుకుంటారునుకుందో ఏమో కానీ చీర కొంగులో దాచుకున్న డబ్బును ఇవ్వబోగా అతడు సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అవ్వ కళ్లలో ఆనందం చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ దృశ్యం చూసి నా గుండె పగిలింది అని ఆవేదన చెందాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలన్న కొత్త ఆశయం తన మనసులో నాటుకుందని చెప్పాడు. త్వరలోనే దీన్ని నిజం చేస్తానని, ఇందుకుగానూ ఆ భగవంతుడు తనకు బలాన్ని ఇస్తాడని ఆశిస్తున్నానన్నాడు. 'కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. వీలైతే అవసరమైనవారికి ఆహారాన్ని అందించండి' అని కోరాడు. My heart jus broke into pieces A new dream started in me to build a old age home 🏡 will make it soon I wish god gives me the strength and support to make it ... I was typing this with tears rolling Don’t waste food Serve food for the needy 🥺 Let’s be HUMANS ✊♥️ https://t.co/gxHSF1ML2w — thaman S (@MusicThaman) April 25, 2021 చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ -
‘వకీల్ సాబ్’ నుంచి మరో సాంగ్ విడుదల
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్సాబ్’. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కంటి పాప..కంటి పాప అనే పాట విడుదలయ్యింది.రామ జోగయ్యశాస్ర్తి రచించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడారు. సాంగ్ రిలీజ్ అయిన కాసేపట్లోనే వేలసంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించిన సమయం కాకుండా కొంచెం ఆలస్యంగా ఈ సాంగ్ను రిలీజ్ చేశారు. టెక్నికల్ కారణాల వల్ల సాంగ్ రిలీజ్ కొంచెం ఆలస్యమవుతుందని చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఇక బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్సాబ్గా రీమేక్గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి : (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) (ఆ టైంలో డిప్రెషన్కు లోనయ్యా : హీరోయిన్) -
‘కోలో కోలన్న కోలో..’ అంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’.. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా వచ్చిన పోస్టర్ల, ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ అనే మెలోడీ సాంగ్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల చేశారు చిత్ర బృందం. ‘కోలో కొలన్నకోలో’ అంటూ సాగే ఈ పాట కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతలను గుర్తు చేస్తుంది. తమన్ స్వరపరిచిన ఈ ఫ్యామిలీ సాంగ్కి సీతారామ శాస్త్రీ సాహిత్యం అందించగా,అర్మాన్ మాలిక్, హరిని ఇవటూరి ఆలపించారు. కాగా, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా చేశారు శివ నిర్వాణ. నాజర్, జగపతి బాబు, రావు రమేష్, వీకే నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
రానా,పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం
-
రానా మరో జర్నీ బిగిన్స్ : కిల్లర్ కాంబో
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, బల్లాలదేవ రానా దగ్గుబాటి తన ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పారు. పవర్స్టార్ పవన్ కల్యాణ్తో కలిసి మల్టీ స్టారర్ మూవీని అనౌన్స్ చేశారు. మరో జర్నీ ప్రారంభం అంటూ రానా ట్వీట్ చేశారు. పరిశ్రమలో చాలా మంది స్టార్స్తో పనిచేయడం చాలా సంతోషం. ఇపుడిక అవర్ ఓన్ పవర్.. పవన్ కళ్యాణ్తో అంటూ రానా తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను రానా ట్విటర్లో షేర్ చేశారు. (కేజీఎఫ్2 సర్ప్రైజ్ : యశ్ బర్త్డే గిఫ్ట్) దర్శకుడు త్రివిక్రమ్ కెమెరా ఆన్ చేసి ముహూర్తం షాట్ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి, 2021లో షురూ కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్పై, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ఎస్ సంగీతం అందిస్తున్నారు. తమన్ బీజీఎం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిల్లర్ కాంబో అంటూ అటు పవన్, ఇటు రానా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Another Journey begins!! What joy this is, been able work with so many stars across industries!! And now joining the coolest back home Our very own Power ⭐️ @PawanKalyan !! Can’t wait thank you @SitharaEnts!! https://t.co/rMgae4Bltj — Rana Daggubati (@RanaDaggubati) December 21, 2020 PAWAN KALYAN - RANA DAGGUBATI STARRER LAUNCHED... #PawanKalyan sounded the clap, #Trivikram switched on camera, S Radhakrishna [Haarika & Hassine Creations] handed over the script... Directed by Saagar K Chandra... Produced by Suryadevara Naga Vamsi... Shoot starts Jan 2021. pic.twitter.com/7qQdVIvIhP — taran adarsh (@taran_adarsh) December 21, 2020 -
ఛాలెంజ్ పూర్తిచేసిన కీరవాణి
-
ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ సంక్రాంతికి విడులైన ‘అల వైకుంఠపురంలో’ భారీ విజయం సాధించింది. ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ పాటలు వ్యూయర్షిప్ పరంగా పలు రికార్డులు నమోదు చేశాయి. తమన్ అద్భుతమైన సంగీతం, బన్ని, పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో పాటలు అలరిస్తాయి. ఇక ‘అల వైకుంఠపురంలో’ పాటలకు ఫ్యాన్స్ వేసే సెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా, బుట్టబొమ్మ పాటకు రణస్థలానికి చెందిన కొంతమంది చిన్నారులు వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బుట్టబొమ్మ పాటకు మా రణస్థలం పిల్లలు డాన్స్. ఈ పాటకు ఇప్పట్లో క్రేజ్ తగ్గేలా లేదు. ఎప్పుడూ గుర్తుండే పాట. అద్భుతమైన సంగీతం అందించిన తమన్కు థాంక్స్’ అని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. ‘డాన్స్ బాగా చేశారు. బుట్టబొమ్మ ఒక సెన్సేషన్’ అంటూ తమన్ రీట్వీట్ చేశాడు. ఈపాటను రామజోగయ్య శాస్త్రి రాయగా..అర్మన్ మాలిక్ ఆలపించాడు. దీంతోపాటు సామజవరగమన పాటను ఇద్దరు చిన్నారులు పాడిన తీరుకు తమన్ ఫిదా అయ్యారు. ఆ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయింది. ఇలాంటి క్యూటెస్ట్ పిల్లల్ని చూడలేదని తమన్ శుక్రవారం చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. Wow ♥️ #sensationalbuttabomma 👏🏾🎶🎵 https://t.co/xzxRw9XkTE — thaman S (@MusicThaman) March 14, 2020 The cutest I have seen for #Samajavaragamana #sensationalsamajavaragamana on the social media Let’s shower some love on them ♥️ hoowwwwwwww cute ❤️🎶🎵#AlaVaikunthapuramuloo #avpl 🎈 pic.twitter.com/VJGKPDTQZM — thaman S (@MusicThaman) March 13, 2020 -
మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేసవి తర్వాత ప్రారంభం కానుందట. అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పట్నుంచి ఎన్నో వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథ ఇదేనంటూ, హీరోయిన్ ఈవిడేనంటూ అనేక గాసిప్స్ వచ్చాయి. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేదానిపై అటు మహేశ్ ప్యాన్స్తో పాటు టాలీవుడ్ ఆభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వారికి ఊహకందిన పేర్లను సూచిస్తూ మహేశ్ సినిమాకు సంగీత దర్శకుడు ఇతడేనంటూ పేర్కొంటున్నారు. ఈ జాబితాలో ఎక్కువగా వినిపించిన పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. తిరిగి మునపటి ఫామ్లోకి వచ్చిన మణిశర్మ మహేశ్ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారని తొలుత వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. దీంతో డైరెక్టర్ వంశీ మణిశర్మ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ‘అల.. వైకుంఠపురుములో’ మ్యూజిక్ ఆల్బమ్తో మ్యాజిక్ చేసిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరును కూడా చిత్ర బృందం పరిశీలిస్తోందని మరో టాక్. మహేశ్-తమన్ కలయికలో వచ్చిన దూకుడు, బిజినెస్మన్ సినిమాల్లోని పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. దీంతో ఈ సినిమాకు తమనే సంగీత దర్శకుడు అంటూ ఊహాగానాలు మరింతగా పెరిగాయి. తాజాగా మరో సంగీత దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అజ్ఞాతవాసి, గ్యాంగ్లీడర్ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన అనిరుద్ రవిచంద్రన్ మహేశ్-వంశీ చిత్రానికి సంగీతం అందిచనున్నాడని టాలీవుడ్లో వినిపిస్తోంది. అంతేకాకుండా మహేశ్, వంశీలకు మంచి స్నేహితుడైన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర బృందం ఎవరిని ఫైనల్ చేస్తుందో వేచి చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్తో పాటు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి మహేశ్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. చదవండి: నాది చాలా బోరింగ్ లైఫ్! ‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్’ -
‘సామజవరగమన’ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాటను ఏ ముహూర్తాన తమన్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడో తెలియదు గాని దశాబ్దపు మేటి పాటగా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది ఈ పాట. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ హిట్ సాంగ్ అన్ని వేడుకల్లో, కచేరీల్లో మారుమోగుతోంది. అంతేకాకుండా ‘సామజవరగమన’ తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో గుడ్ న్యూస్ను చిత్ర బృందం ప్రకటించింది. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్ను రేపు(ఆదివారం) సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఈ లిరికల్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ రేపు విడుదలయ్యే వీడియో సాంగ్ దృశ్య రూపంలోనూ వారిని కనువిందు చేయనుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ(చినబాబు)లు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా చదవండి: సామజవరగమన పాట అలా పుట్టింది.. సామజవరగమన.. ఇది నీకు తగునా! ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
కష్టాన్నంతా మరచిపోయాం – తమన్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో నభా నటేశ్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్లు కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి .. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి.. రమ్ పమ్ బమ్’ అనే పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. బప్పి లహరి, రవితేజ ఈ పాటను పాడారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. చిత్రదర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో రవితేజగారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం తమన్ సూపర్హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ‘రమ్ పమ్ బమ్’ సాంగ్కు మంచి స్పందన లభిస్తోంది. ‘డిస్కోరాజా’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఆల్రెడీ విడుదలైన ‘ఢిల్లీవాలా...’, ‘నువ్వు నాతో...’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ‘రమ్ పమ్ బమ్’ పాటను చాలెంజింగ్గా తీసుకుని చేశాం. ఇప్పుడు ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న తీరు మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘రవితేజగారితో నేను కొంత గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ఇది. మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవి్వస్తాయి. డైరెక్టర్ ఆనంద్గారు ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తీశారు. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది’’ అన్నారు సునీల్. ‘‘రవితేజగారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ ‘రమ్ పమ్ బమ్’ పాటలో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి’’ అన్నారు హీరోయిన్ నభా నటేష్. -
సెన్సార్ పూర్తి.. ఇక సంక్రాంతికి సంబరాలే
సాక్షి, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బృందం... యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. ‘సెన్సార్ పూర్తయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ సంక్రాంతికి భారీ సంబరాలతో మేం సిద్ధమవుతున్నాం. పండుగ సరదాల కోసం మేం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా థియేటర్లకు ఆహ్వానిస్తున్నాం. డోన్ట్ మిస్’ అంటూ గీతా ఆర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. అయితే, వినూత్నంగా రిలీజ్ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్లోనూ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ వెల్లడించలేదు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ లేదు. జస్ట్ సంక్రాంతి రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు. దీంతో విడుదల తేదీపై కొంత సందిగ్ధం నెలకొందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు సంబంధించి కర్టెన్ రైజర్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో పోతన భాగవతంలో రచించిన ‘అల వైకుంఠపురములో..’ పాటను గాయనీమణులు ఆలపించారు. చదవండి: అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’ -
‘డిస్కోరాజా’ టీజర్ వచ్చేసింది!
‘medicine is changing The very nature of Nature.. మనమీ ప్రాజెక్టు చేయకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. వీడైతే నో రికార్డ్స్, నో రిపోర్ట్స్, నో రిలేటివ్స్, జీరో రిస్క్..’ అంటూ వెరీ స్టైలిష్గా మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా ‘డిస్కో రాజా’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమాలో రవితేజ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఆధారంగా దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్లో రివీల్ అయిన రవితేజ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ రేకెత్తిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్. వెరీ స్టైలిష్గా రవితేజను డిఫరెంట్గా ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్కు సుప్రీం హీరో సర్ప్రైజ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి మెగా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సాయ్ ధరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బెస్ట్ ఫ్రెండ్ తమన్కు పాపులర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ‘పెర్ల్ మాలెట్స్టేషన్’ ను గిఫ్ట్ గా అందించాడు. తమన్ స్వయంగా దీని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ''నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ లవ్లీ పెర్ల్ మాలెట్ వర్క్స్టేషన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి. ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు లవ్లీ గిఫ్ట్ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో వరుస హిట్లతో దూసుకుపోతున్న తమన్ మెగా హీరో అందించిన ఊహించని కానుకతో తెగ హ్యాపీగా ఫీలవుతున్నాడు. -
‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’
-
తప్పులో కాలేసిన తమన్!
సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి తమన్ చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్ను దూషిస్తూ పెట్టిన ఓ ట్వీట్ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది. తాజాగా మరోసారి తప్పులో కాలేశాడు తమన్. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తమన్ తన సోషల్ మీడియా పేజ్లో చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఫేస్బుక్లో లీడ్ పెయిర్ అంటూ సమంత, అక్కినేని నాగార్జునల పేర్లు రాయటంపై సెటైర్లు పడుతున్నాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్గానూ సక్సెస్ అయ్యింది. -
ఆజన్మాంతం రుణపడి ఉంటా
‘‘ఒక సంఘటన వల్ల విషాదఛాయలు కమ్మిన మా ఇంట్లోకి వెలుతురు రేఖను, ఓ నవ్వు రేఖను తీసుకొచ్చిన నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, చిత్ర బృందానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. చాలా రోజుల తర్వాత మా అమ్మగారి ముఖంలో నవ్వు చూశా. ఈ ‘అరవిందసమేత...’ విజయాన్ని మా నాన్నగారికి (హరికృష్ణ) ఎందుకో గిఫ్ట్గా ఇవ్వాలని ఉంది సామీ (త్రివిక్రమ్ని ఉద్దేశిస్తూ) అని అడిగాను. మా నాన్నగారికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్గా ఇచ్చేలా దోహదం చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్మీట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నా గుండె లోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని త్రివిక్రమ్గారితో చేయాలనుకున్నా. ఆ తరుణం మూడు రోజుల క్రితం ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంతో రానే వచ్చింది. ఈ చిత్రం విజయం నా ఖాతాలో వేశారు త్రివిక్రమ్గారు. కానీ, ఇది ఆయన కలంలోని సిరా నుంచి వచ్చిన విజయం. దర్శకునిగానే కాదు.. ఓ గురువుగా కూడా త్రివిక్రమ్ ఈ సినిమాను ముందుండి నడిపించారు. నిర్మాత పాత్రను వంద శాతం నిర్వహించారు చినబాబుగారు. సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా.. ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా ‘అర వింద సమేత వీరరాఘవ’. వీటన్నింటినీ దాటుకుని ఒక వెల్లువలాంటి విజయాన్ని ఇచ్చి, పండగను మా ఇళ్లలోకి తీసుకొచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లో వంద కోట్లు దాటించడానికి సారధి ఎన్టీఆరే. వాళ్ల తాతగారి పేరు నిలబెట్టడం కాదు.. దాన్ని మ్యాచ్ చేయగల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆయన లైఫ్లో అంత విషాదం జరిగినా... మేము ఎక్కడ నలిగిపోతామేమోనని ఆయన నలిగిపోయాడు. ఈ సినిమా విజయం కచ్చితంగా ఎన్టీఆర్ ఖాతాలోకే వెళుతుంది. చినబాబుగారు ఖర్చుకు వెనకాడరు. నా మొదటి విమర్శకుడు ఆయనే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సునీల్, నవీన్చంద్ర, శత్రు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రచయితలు రామజోగయ్యశాస్త్రి, పెంచలదాస్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాకు భారీ ఆఫర్
అజ్ఞాతవాసి లాంటి ఘోర పరాజయం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు భారీ ఆఫర్ దక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాకు క్రేజ్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ విడుదలకు ముందే యూఎస్ హక్కులను ఓ సంస్థ భారీ మొత్తంలో కొనుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొత్త లుక్లో కనపడబోతోన్న ఈ చిత్ర యూఎస్ హక్కులు దాదాపు పన్నెండు కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) కానుకగా ఈ సినిమా టైటిల్, ఎన్టీఆర్ లుక్ను రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. -
మోహన్బాబు వ్యాఖ్యలపై స్పందించిన తమన్
సాక్షి, హైదరాబాద్ : విలక్షణ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పందించారు. మోహన్బాబు లాంటి సీనియర్ నటులు తనను విమర్శించినా అవి తనకు ఆశీర్వాదంలాగే తీసుకుంటానని తమన్ వ్యాఖ్యానించారు. గాయత్రి సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా "తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను కానీ పని చేయడం చాలా కష్టం అతనితో. టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు" అంటూ మోహన్బాబు, తమన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన జరిగిన చాలా రోజులు తర్వాత తమన్ స్పందించారు. పాటలు ఇవ్వడం ఎందుకు ఆలస్యమైందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గాయత్రికి మంచి మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నారని, అందుకే కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా అది తనకి ఆశీర్వాదం లాంటిదేనని వ్యాఖ్యానించారు. -
సెట్స్ మీదకు ‘అమర్ అక్బర్ ఆంటోని’
కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్తో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కొత్త సినిమాను ప్రారంభించాడు. మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాను ఈ రోజు (గురువారం) పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. గతంలో శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత మందిస్తుండగా కామెడీ స్టార్ సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
‘మేగా.. కాదు మే..ఘ’
‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్.. త్వరలో ఛల్ మోహన్ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రౌడీఫెలో ఫేం కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ తో ఆకట్టుకున్న ‘ఛల్ మోహన్ రంగ’ యూనిట్ తాజాగా తొలిపాటను రిలీజ్ చేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా పాటగా రూపొందిన ‘గ..ఘ..మేఘ’ పాటను రిలీజ్ చేశారు. రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యమందించారు. తమన్ సంగీత మందిస్తున్న సినిమాలో లై ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. -
‘ఛల్ మోహన్ రంగ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ సిల్వర్ జూబ్లీ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ఛల్ మోహన్ రంగ. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు. తాజాగా తొలి పాట రిలీజ్ డేట్ను ప్రకటించారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నారు. ఇష్క్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన ఇష్క్ సినిమా రిలీజ్ డేట్ రోజునే ఛల్ మోహన్ రంగ తొలి పాట రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు నితిన్. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘ఇంటిలిజెంట్’ మూవీ రివ్యూ
తారాగణం : సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, బ్రహ్మానందం తదితరులు జానర్ : యాక్షన్, కామెడీ నిర్మాత : సి. కళ్యాణ్ సంగీతం : ఎస్. తమన్ దర్శకుడు : వి.వి. వినాయక్ మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా ఎదిగాడు సాయి ధరమ్ తేజ్. గత కొంతకాలంగా సరైన హిట్లేక సతమతమవుతున్న తరుణంలో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమా ఇంటిలిజెంట్. మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీతో హిట్ కొట్టిన వినాయక్, ఫుల్ ఎనర్జీ ఉన్న సాయిధరమ్ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం... కథ నందకిషోర్ (నాజర్) ఓ సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని. తనకు వచ్చిన లాభాలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది పేద పిల్లలను, అనాథలను చేర దీసి ఆదరిస్తూ ఉంటాడు. ప్రతిభ ఉన్న చిన్నారులను చదివిస్తుంటాడు. అలా తేజ (సాయిధరమ్ తేజ్)ను చదివిస్తాడు. ఆ కృతజ్ఞతతో నాజర్ వద్దే పనిచేస్తూ ఉంటాడు. తన సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల మిగతా ఏ కంపెనీలు మనుగడను సాధించలేకపోతాయి. అలా ఓ కంపెనీ యజమానులు మాఫియా డాన్ విక్కీభాయ్ (రాహుల్ దేవ్)ను ఆశ్రయిస్తారు. విక్కీభాయ్ తమ్ముడు దేవ్గిల్ రంగంలోకి దిగి నాజర్ను బెదిరిస్తాడు. కానీ నాజర్ వాటికి తలొంచడు. ఇదంతా తేజ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ మరునాడే నాజర్ ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ తేజ ఇదంతా నమ్మడు. దేవ్గిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేజ ఏం చేస్తాడు? అసలు నాజర్ది ఆత్మహత్యనా? హత్యనా? అసలు ఏం జరిగింది? తేజ ధర్మభాయ్గా ఎందుకు మారాడు? ధర్మభాయ్ ఏం చేశాడన్నదే మిగతా కథ. నటీనటులు సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్తో మెగా అభిమానులను అలరించాడు. లావణ్య త్రిపాఠి తన అందంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది. బ్రహ్మానందం కనిపించే రెండు మూడు సీన్లలో నవ్వులు పండించాడు. నాజర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే తమకు అలవాటైన పోలీస్ పాత్రలో మెప్పించారు. సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ కామెడీని బాగానే పండించారు. విశ్లేషణ భారీ యాక్షన్ సీన్స్ , కామెడీతో తనదైన శైలిలోనే వినాయక్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేదు. ఆకుల శివ అందించిన మాటలు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. సాంగ్స్ లొకేషన్స్ బాగున్నాయి. చమక్ చమక్.. సాంగ్ తీసిన విధానం ఆకట్టుకుంది. వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది. తమన్ సంగీతానికి మార్కులు పడ్డాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్. ఎస్వీ విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంతో మెప్పించాడు. ఆయన కెమెరా పనితనం స్క్రీన్ను అందంగా కనపడేలా చేసింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కొరియోగ్రఫీలో కొత్తదనం కనిపించింది. ప్లస్ పాయింట్స్ పాటలు, ఫైట్స్ కామెడీ చమక్ చమక్ సాంగ్ మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం ముగింపు: ‘ఇంటిలిజెంట్’ అభిమానులు ఆశించినంత ఇంటిలిజెంట్గా లేదు. - బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
‘తొలిప్రేమ’తో ‘ఇంటిలిజెంట్’గా..!
ఫిబ్రవరి రెండో వారంలో వెండితెరపై ఆసక్తికరమైన పోటి నెలకొంది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వస్తున్నారు. తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ఈ నెల 9, 10 తేదిల్లో రిలీజ్ కానున్నాయి. 9వ తారీఖున మోహన్బాబు లీడ్ రోల్లో నటిస్తున్న గాయత్రి సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒకరే. తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి చిత్రాలకు యువ సంగీత దర్శకుడు తమన్ సంగీత మందిస్తున్నారు. గాయత్రి సినిమా పనులు ఇప్పటికే పూర్తి కాగా తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉన్నాయి. రెండు సినిమాలకు ఒకేసారి పని చేస్తున్న తమన్, ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘తొలిప్రేమతో ఇంటిలిజెంట్గా పని జరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. తొలి ప్రేమతో క్లాస్, ఇంటిలిజెంట్ తో మాస్ ఆడియన్స్ ని ఒకేసారి అలరిస్తున్నాడు ఈ యువ కళాకారుడు. #tholiprema tho #intelligent ga pannijaruguthondhiiiii ♥️💯 🎹🎧 pic.twitter.com/iOnto9qHs1 — thaman S (@MusicThaman) 31 January 2018 -
సంక్రాంతికి విక్రమ్ ‘స్కెచ్’
తమిళ సినిమా: నటుడు సియాన్ విక్రమ్ సంక్రాంతికి బరిలో దిగడానికి ‘స్కెచ్’ వేస్తున్నారు. ఇరుముగన్ చిత్ర విజయంతో నూతనోత్సాహంతో ఉన్న నటుడు విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్. మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళం నటుడు హరీశ్, శ్రీమాన్, మధుమిత, విశ్వాంత్, వినోద్, వేల్ రామమూర్తి, సారిక తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. వీరితో పాటు నటి ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను వీ.క్రియేషన్స్ సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్చందర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్.థమన్ సంగీతం, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఐ వంటి చిత్రాలతో ప్రయోగాలు చేసిన విక్రమ్ ఈ స్కెచ్ చిత్రంతో మళ్లీ పక్కా మాస్ ట్రెండ్కు తిరిగారు. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. భారీ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అంటూ కమర్షియల్ ఫార్ములాతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర టీచర్ను మంగళవారం విడుదల చేశారు. -
అనుష్క ‘భాగమతి’ టీజర్
బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ భాగమతి టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పాత కాలం బంగ్లాలోకి అనుష్క ప్రవేశించటం తరువాత తన చేతికి తానే సుత్తితో మేకు కొట్టుకోవటం లాంటి షాట్స్ తో టీజర్ ను కట్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫి మది విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల -
అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల
-
భారత్-పాక్ మ్యాచ్: మ్యూజిక్ డైరెక్టర్ అసంతృప్తి
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దాయాది జట్లు భారత్-పాకిస్తాన్ ల మధ్య ఆసక్తికర పోరుకు వర్షం అంతరాయం కలిగించింది. మరో బంతి పూర్తయితే 10 ఓవర్లు అవుతాయనగా వర్షం కారణంగా మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచేపోయే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. దీనిపై సగటు అభిమానుల తరహాలోనే సెలబ్రిటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ లో వాతావరణ పరిస్థితులు తెలిసి కూడా ఐసీసీ నిర్వాహకులు ఇక్కడ చాంపియన్స్ ట్రోఫీని ఎలా ప్లాన్ చేశారని టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశాడు. ఈ నెలలో ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించవని ముందుగానే తెలిసినా ఎందుకు ఇలా ట్రోఫీ నిర్వహిస్తున్నారంటూ, ఓ ఫొటోను కూడా పోస్టు చేశాడు. త్వరగా వర్షం ఆగిపోయి మ్యాచ్ జరగాలని థమన్ ఆకాంక్షించాడు. ఈ ట్రోఫీలో వర్షం కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ రద్దయిన విషయం తెలసిందే. ప్రస్తుతం వర్షం ఆగి మ్యాచ్ జరుగుతున్నా.. మళ్లీ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలుండటంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. భారత్-పాక్ పోరు అంటే ఈ రెండు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే. How did they planned this #ChampionsTrophy17 having ⛈⛈⛈⛈ overcast climate all this month -
నవ్విస్తూ... థ్రిల్కు గురి చేస్తూ...
సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా శ్రీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ఢమాల్ డుమీల్’ చిత్రం తెలుగులోకి ‘ధనాధన్’ పేరుతో విడుదల కానుంది. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని అనువదించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం కూర్చారు. ‘‘ఈ చిత్రం తమిళంలో విజయవంతమై, వైభవ్కు మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో కూడా విజయం సాధించి నిర్మాతలకు లాభాలు రావాలి. వైభవ్ తమిళంలో బిజీగా ఉన్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు’’ అని కోదండ రామిరెడ్డి ఈ చిత్రం ఆడియో వేడుకలో పేర్కొన్నారు. ‘‘ఇది మంచి కామెడీ థ్రిల్లర్. ఈ నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని శివ వై.ప్రసాద్ అన్నారు.