ticket booking
-
2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖ
రైల్వే టికెట్ల బుకింగ్లో అక్రమాలను అరికట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. టికెట్ బుకింగ్(Ticket Booking) సమయంలో అక్రమ సాఫ్ట్వేర్ల వినియోగాన్ని అరికట్టడానికి దక్షిణ రైల్వే 2,000 వ్యక్తిగత, ఐఆర్సీటీసీ(IRCTC) యూజర్ ఐడీలతోపాటు 119 ఏజెంట్ ఐడీలను బ్లాక్ చేసింది. ప్రయాణీకులందరికీ టిక్కెట్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనైతికంగా బుకింగ్స్ చేస్తున్న మోసగాళ్లు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.సమస్య ఏమిటంటే..పండగ సీజన్లు, అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో దళారులు, ఏజెంట్లు అక్రమ సాఫ్ట్వేర్ను ఉపయోగించి బల్క్గా టికెట్లు బుక్ చేస్తున్నట్లు దక్షిణ రైల్వేశాఖ గుర్తించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తరుచూ అరెస్టులు, టికెట్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉందని తెలిపింది. తత్కాల్ బుకింగ్స్ సమయంలో ఐఆర్సీటీసీ పోర్టల్పై ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో క్రాష్ అవుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావాలనే కొందరు మోసగాళ్లు అక్రమ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ట్రాఫిక్ను క్రియేట్ చేస్తూ తత్కాల్ పోర్టల్ సరిగా పనిచేయకుండా చేస్తున్నారు. దాంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండడంలేదు. దాంతో ఏజెంట్ల నుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైల్వేశాఖ తెలిపింది.రైల్వేశాఖ చర్యలుఈ సవాళ్లను పరిష్కరించడానికి దక్షిణ రైల్వే అనేక చర్యలను అమలు చేస్తోంది.119 ఏజెంట్ ఐడీలతో పాటు 2,003 వ్యక్తిగత, ఐఆర్సీటీసీ యూజర్ ఐడీలను బ్లాక్ చేశారు.బల్క్, తత్కాల్ టికెట్ బుకింగ్లకు ఉపయోగించే పది వేర్వేరు అక్రమ సాఫ్ట్వేర్ టూల్స్ను నిలిపేశారు.ఒకే ఐపీ అడ్రస్ నుంచి లేదా వీపీఎన్ల ద్వారా ఎక్కువ బుకింగ్లు చేసే వారిని, రియల్ టైమ్లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి, వాటిని బ్లాక్ చేయడానికి ఏఐ టెక్నాలజీని అమలు చేస్తున్నారు.యూజర్ ఐడీలపై రోజువారీ తనిఖీలు నిర్వహిస్తూ అవకతవకలకు పాల్పడిన వారిని డీయాక్టివేట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్గేట్’పై మస్క్ విమర్శలుప్రయాణికులపై ప్రభావం..రైల్వేశాఖ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయాణీకులకు మరిన్ని టికెట్లు అందుబాటులో ఉండేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు అనుకున్న ధరలకే టికెట్ లభ్యమవుతుందని, దళారులు, ఏజెంట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. దక్షిణ రైల్వే గత ఏడాది 391 కేసులు నమోదు చేయగా, 404 మంది దళారులను అరెస్టు చేయడంతో పాటు రూ.1.2 కోట్ల విలువైన 7,506 టికెట్లను స్వాధీనం చేసుకుంది. -
రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?సౌకర్యవంతమైన లెగ్స్పేస్ ఉంటుంది.దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి. -
పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్.. వైల్డ్ ఫైర్ మీనింగ్ చూపిస్తున్న ఐకాన్
-
ఎయిర్లైన్స్కు పండుగే!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్లకు ఇప్పటి నుంచే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఎయిర్లైన్స్ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్ సహ సీఈవో రజనీష్ కుమార్ తెలిపారు. → అక్టోబర్ 30–నవంబర్ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్ స్టాప్ ఫ్లయిట్ టికెట్ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ. → ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్ మార్గంలో ఫ్లయిట్ టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి. → ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి. → హైదరాబాద్–తిరువనంతపురం మార్గంలో టికెట్ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి. → కానీ, పండుగల సీజన్లోనే కొన్ని మార్గాల్లో టికెట్ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్ మార్గాల్లో టికెట్ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి. → ముంబై–అహ్మదాబాద్ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్పూర్ మధ్య టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.విమాన ప్రయాణికుల జోరు దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్ వాటా 4.7 శాతానికి పెరిగాయి. -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష!.. స్పందించిన రైల్వే శాఖ
ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే తప్పకుండా పర్సనల్ అకౌంట్స్ ద్వారా మాత్రమే బుక్ చేయాలని, బంధువులు లేదా ఫ్రెండ్స్ అకౌంట్స్ ద్వారా బుక్ చేస్తే వారికి జైలు శిక్ష పడటమే కాకూండా.. రూ. 10000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైనా మొదటిసారి 'రైల్వే' స్పందించింది.రైల్వే శాఖ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదని కొట్టిపారేసింది. ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే జరుగుతున్న ప్రచారమని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీలో పర్సనల్ ఐడీ నుంచి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఐఆర్సీటీసీలో ఒక యూజర్ ఐడీ ద్వారా నెలకు కేవలం 12 టికెట్లను పొందవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వ్యక్తులు ఒక నెలలో 24 టికెట్స్ బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ వివరించింది. పర్సనల్ ఐడీ ద్వారా బుక్ చేసిన టికెట్స్ ఇతరులకు విక్రయించడానికి కాదు.. ఒకవేలా అలా జరిగితే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపింది. The news in circulation on social media about restriction in booking of etickets due to different surname is false and misleading. pic.twitter.com/jLUHVm2vLr— Spokesperson Railways (@SpokespersonIR) June 25, 2024 -
వాట్సాప్లో మెట్రో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఈజీగా..!
వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని నాగపూర్కు విస్తరిస్తోంది. ప్రయాణికులకు మెట్రో టికెట్లను ఎక్కడి నుంచైనా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని ఇస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణేలోని మెట్రోలకు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది.వాట్సప్లో మెట్రో టికెట్ బుక్ చేసుకోండిలా..వాట్సప్లో మెట్రో టికెట్ బుకింగ్ సేవలు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు 8624888568 (నాగపూర్ మెట్రో), 8341146468 (హైదరాబాద్ మెట్రో) నంబర్కు 'Hi' అని పంపాలి లేదా ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఈ సులభమైన చాట్బాట్ టికెట్ బుకింగ్ను సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తుంది. అవసరమైన ప్రయాణ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ ఇంటర్ఫేస్ ద్వారా అందిస్తుంది.ఇందులో క్విక్ పర్చేజ్ ఆప్షన్ కూడా ఉంది. తరచుగా ప్రయాణం చేసేవారి కోసం దీన్ని రూపొందించారు. ఈ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే రూట్లను సేవ్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను ఎంచుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. -
ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!
విమాన ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చాలాసమయాల్లో విమానాలను రద్దుచేస్తుంటారు లేదా వాటిని ఏదో కారణాలతో మళ్లిస్తుంటారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్పటికే వారు తీసుకున్న టికెట్ ధర తిరిగి చెల్లించేందుకు కొన్నిసార్లు విమాన సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారికి ఆటోమేటిక్గా రీఫండ్ వచ్చేలా సదుపాయం కల్పిస్తున్నారు.కార్పొరేట్ల అనవసరపు రుసుముల నుంచి ప్యాసింజర్లను రక్షించేందుకే కొత్త నిబంధనలు తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం బుధవారం తెలిపింది. విమానయాన సంస్థ ప్రయాణికులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వెంటనే రీఫండ్ చేయాలని యూఎస్ రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త నిబంధనలు ఇలా..ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలి.దేశీయ విమానాలు 3 గంటలు, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకల్లో 6 గంటలు అంతరాయం ఉంటే రీఫండ్కు అర్హులు.మొదట కొనుగోలు చేసిన దాని కంటే తక్కువ తరగతికి డౌన్గ్రేడ్ చేయడం. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి పంపిస్తే రీఫండ్ పొందవచ్చు.ఏదైనా కారణాలవల్ల చేరుకునే లేదా బయలుదేరే విమానాశ్రయంలో మార్పులుంటే అర్హులు.దివ్యాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోతే రీఫండ్ పొందవచ్చు.దేశీయ విమానాలు విమానాశ్రయంలో దిగాక నిర్దేషించిన సమయంలోపు బ్యాగేజ్ డెలివరీ చేయకపోతే ప్రయాణికులు తనిఖీ చేసిన బ్యాగ్ ఫీజు వాపసు పొందవచ్చు. విమానంలో వైఫై లేదా ఎంటర్టైన్మెంట్ వంటి సేవల కోసం ఎవరైనా డబ్బు చెల్లించి వాటిని పొందకపోతే తిరిగి తమ డబ్బును రీఫండ్ కోరవచ్చు.ఇదీ చదవండి: ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్2020లో కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఎయిర్లైన్స్, టిక్కెట్ ఏజెంట్లు ప్రయాణికుల రీఫండ్లను తిరస్కరించారని పెద్దమొత్తంలో ఫిర్యాదులు అందాయి. రీఫండ్ ఆలస్యం అవుతుందని కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలా ఎయిర్లైన్స్ శాఖకు అందిన విమాన ప్రయాణ సర్వీస్ ఫిర్యాదుల్లో 87% రీఫండ్కు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. దాంతో స్పందించిన ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. -
నేడు జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 65,051 మంది స్వామివారిని దర్శించుకోగా 26,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.51 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల ► మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
మేడారం జాతరకు హెలికాప్టర్
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్ను నడుపుతోంది. ఈ సేవలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా... ఒక్కో ప్యాసింజర్ (అప్ అండ్ డౌన్)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతరలో ఏరియల్ వ్యూరైడ్ ఒక్కొక్కరికి రూ.4,800. బుకింగ్ ఇలా..: హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 74834 33752, 94003 99999 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆన్లైన్లో info@helitaxi. com ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి. -
ఐఆర్సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి తెలుసా?
IRCTC E-Ticket & I-Ticket: ఆధునిక కాలంలో ట్రైన్ జర్నీ సర్వ సాధారణమయిపోయింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే రైలు రిజర్వేషన్ చేసుకుంటారు. ఇలా ముందుగానే రిజర్వ్ చేసుకోవాలనుకునే వారు రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవి ఈ-టికెట్ & ఐ-టికెట్. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ-టికెట్ (E-Ticket) ఐఆర్సీటీసీ అందించే ఎలక్ట్రానిక్ టికెట్నే 'ఈ-టికెట్' అంటారు. ఈ టికెట్ ద్వారా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. టికెట్స్ అందుబాటులో ఉంటే ప్రయాణం చేసే ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడినుంచైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రింటెడ్ రూపంలో లభించదు. ఈ టికెట్తో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సీట్ నెంబర్, బెర్త్ వంటి వాటిని మీరే సెలక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఐ-టికెట్ (I-Ticket) ఐ-టికెట్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ప్రింటెడ్ రూపంలో ఉంటుంది. ఈ టికెట్ మీరు నేరుగా ఏదైనా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. దీనికి ప్రత్యేక చార్జీలు ఉంటాయి. దీన్ని ప్రయాణానికి మూడు రోజులు ముందుగా అయినా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డెలివరీ కావడానికి కనీసం 48 గంటలు పడుతుంది. దీనిని క్యాన్సిల్ చేసుకోవాలనుంటే కూడా మీరు రైల్వే స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. -
ఆదిపురుష్ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు
దేశవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానున్న ఆదిపురుష్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రామ్ చరణ్, కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్, గాయని అనన్య బిర్లా 10,000 టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) ఇప్పుడు తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక జంట కూడా ఆ క్లబ్లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది పిల్లలకు వారు ఆదిపురుష్ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నారు. 'ఎలాంటి హద్దులు లేకుండా అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. దీనిని మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావించాలి. ఆదిపురుష్.. ద్వారా ఇతహాస మహాగాధ రామాయణం గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉన్న 2500 పిల్లలకు చూపించాలని నిర్ణయించుకున్నాం. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి' అని మంచు మనోజ్, భూమా మౌనిక అన్నారు. (ఇదీ చదవండి: కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?) -
తెలుగులోనూ రైల్వే టికెట్ బుకింగ్
సాక్షి, విశాఖపట్నం: జనరల్ టికెట్ కోసం ఆదరాబాదరాగా రైల్వేస్టేషన్కు చేరుకుని.. చాంతాడంత పొడవు ఉండే క్యూలైన్లలో నిలబడి.. ఈలోపు తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుందేమోనని ఆదుర్దా పడేవారే ఎక్కువ. ఇలా ఇబ్బందులు పడే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను తీసుకొచ్చి న సంగతి తెలిసిందే. యూటీఎస్ విధానంలో యాప్, వెబ్సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇంగ్లిష్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రాంతీయ భాషలకు కూడా రైల్వే శాఖ విస్తరించింది. దీంతో తెలుగు సహా వివిధ ప్రాంతీయ భాషల్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సాధారణ (జనరల్) రైలు టికెట్లను దిగువ శ్రేణి ప్రయాణికులు ఎక్కువగా తీసుకుంటారని.. వీరి కోసం ప్రాంతీయ భాషల్లో యాప్ని తీసుకొస్తే వినియోగం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి శ్రమ లేకుండా యాప్ నుంచే.. యూటీఎస్ యాప్ ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా మొబైల్ ఫోన్ నుంచే జనరల్ టికెట్ పొందొచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇంగ్లిష్ మాత్రమే అందుబాటులో ఉండటంతో గ్రామీణులు, పెద్దగా చదువుకోనివారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సులభంగా యాప్ వినియోగించేలా ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇంగ్లిష్తోపాటు తెలుగు, హిందీ, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, తమిళ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా జనరల్ టికెట్తో పాటు ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే సీజన్ టికెట్ బుకింగ్, రెన్యువల్ సైతం చేసుకోవచ్చు. యూటీఎస్ యాప్లో ప్రాంతీయ భాషల అప్డేట్ వెర్షన్ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. హార్డ్ కాపీ, పేపర్లెస్ టికెట్.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. యూటీఎస్ యాప్ ఎన్ని భాషల్లో: తెలుగు, ఇంగ్లిష్, కన్నడం, మలయాళం, హిందీ, తమిళం, ఒడియా, మరాఠీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రైల్వేస్టేషన్లు: 9,120 డౌన్లోడ్ చేసుకున్నవారు: 10 మిలియన్లకు పైగా యాప్ ద్వారా రోజుకు బుక్ అవుతున్న టికెట్లు: 2.34 లక్షలు రోజూ వినియోగిస్తున్న ప్రయాణికులు: 14.21 లక్షల మంది స్టేషన్కు 5 కి.మీ. పరిధిలో.. మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా యూటీఎస్ యాప్ పనిచేస్తోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్లో ఉండాలి. రైల్వేస్టేషన్ ఆవరణకు 30 మీటర్ల నుంచి 5 కి.మీ. పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ ద్వారా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజన్ టికెట్లను తీసుకోవచ్చు. ఎక్స్ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, సూపర్ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టికెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. – అనూప్కుమార్ సత్పతి, డీఆర్ఎం, వాల్తేరు -
ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ‘డైనమిక్ ప్రైసింగ్’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటీ పోటీని తట్టుకునేలా, సంస్థను లాభాలబాట పట్టించేలా ఆర్టీసీ కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అనువైన విధానాల కోసం వెతుకుతోంది. అందులో భాగంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ‘డైనమిక్ ప్రైసింగ్’విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. గురువారం ఇక్కడి బస్భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్విసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్ను త్వరలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్విస్లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సర్విస్ ప్రారంభమయ్యే గంటముందు వరకు ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్నరోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని గుర్తుచేశారు. సంస్థ అధికారిక వెబ్సైట్ www. tsrtconline. in లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు గోవర్దన్, సజ్జనార్ తెలిపారు. డైనమిక్ ప్రైసింగ్ అంటే... ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణచార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్డ్ డేటా అనాలసిస్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మార్కెట్లోని డిమాండ్ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయి. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్లతో పోల్చి టికెట్ ధరను వెల్లడిస్తాయి. ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు. ఈ విధానంవల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణచార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది. -
గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
మీ రైల్వే స్టేషన్లో గమనిస్తే ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్ కౌంటర్ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్ కలెక్టర్కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవ.. కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్ఫారమ్ టిక్కెట్ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చింది. యూటీఎస్ యాప్ ఇన్స్టలేషన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. సబర్బన్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు తమ పరిధిలోని రైల్వే స్టేషన్కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ. యూటీఎస్ మొబైల్ యాప్లను ఉపయోగించే వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్లో ఉండాలి. ►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ATVMలో ప్రయాణికులు పేపర్లెస్ టిక్కెట్లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి. ►అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ యాప్తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ►ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. ►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్ లెస్ టికెట్తో ప్రయాణించడానికి అనుమతి లేదు. ►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్ టిక్కెట్ను బుక్ చేయలేరు. ►ఎక్స్ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: ఫోన్పే,గూగుల్పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్! -
వామ్మో.. విడుదలకు ముందే అవతార్-2 రికార్డుల మోత!
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల వరల్డ్ వైడ్ బిజినెస్ సాధించిందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇండియాలో ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్లలో 15,000పైగా ప్రీమియం ఫార్మెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ‘అవతార్-2 ’ విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కూడా ఇలాంటి స్పందన రావడం సంతోషంగా ఉందని పీవీఆర్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందాని అన్నారు. 'జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ పై ప్రతిసారీ ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు అలాంటి మరో దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్ లపై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్ అమ్మకాల గురించి నేను చెబుతున్న మాట. ఇతర అన్ని ఫార్మాట్ లలో టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ఓపెనవ్వడంతో ఇంకా భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము' అని అన్నారు. ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా ..‘అవతార్కి సీక్వెల్ తరతరాలుగా ప్రజలు చూసే ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. మా ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము 3D - 2D ఫార్మాట్ ల బుకింగ్లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ‘అవతార్ 13 సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు ఈ చిత్రానికి భారీ స్పందనను చూసి మేం మంత్రముగ్దులయ్యాం. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ .. ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తోంది. భారతదేశంలోని ప్రేక్షకులు ఎల్లవేళలా లార్జర్-దన్-లైఫ్ ఎంటర్ టైనర్ లపై గొప్ప ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఒక్క రోజులోనే మేము భారతదేశం అంతటా టికెట్ల అమ్మకాల్లో పార్ట్ 2కి అద్భుతమైన స్పందనను పొందాం. ప్రపంచంలోనే అత్యుత్తమ 3డి టెక్నాలజీ అయిన సినెపోలిస్ రియల్ డి 3డిలో సినిమాను చూడండి’అని అన్నారు. -
అవతార్-2 టికెట్స్.. ధర వింటే సినిమా కనపడుద్ది..!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 16న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీస్థాయిలో అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుక్సింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఇంగ్లీష్తో పాటు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీని చూడాలనుకుంటున్న సినీ ప్రేక్షకులకు విడుదలకు ముందే షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్, యాప్లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ స్క్రీన్లపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: కళ్లు చెదిరే విజువల్ వండర్స్తో అవతార్-2 కొత్త ట్రైలర్) ఆ స్క్రీన్ల టికెట్ ధరలు చూసి షాక్కు గురవుతున్నారు. ఓ ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ బెంగళూరులోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ కలిగిన థియేటర్లో టికెట్ ధర ఏకంగా రూ.1,450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ.1200 (4డీఎక్స్ 3డీ), దేశ రాజధాని దిల్లీలో రూ.1000గా ఉంది. ముంబయిలో రూ.970, కోల్కతా రూ.770, అహ్మదాబాద్ రూ.750, ఇండోర్ రూ.700 ఉండగా, హైదరాబాద్లో ఒక్కో టికెట్ ధర రూ.350 (4డీఎక్స్ 3డీ ఫార్మాట్), విశాఖ రూ.210 (3డీ ఫార్మాట్) ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా వీటికి పన్నులు, ఇంటర్నెట్ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. త్వరలోనే సాధారణ థియేటర్స్లోనూ టికెట్ ధరలు అందుబాటులో ఉంచనున్నారు. అవతార్-2 లో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు నటించారు. -
UTS App: రైలు ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. . రైలు బయలుదేరే సమయం దాకా క్యూలు తరగవు.. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్’ యాప్. గతంలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణమంటే కచ్చితంగా స్టేషన్కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఆ కోచ్లలో కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్ ద్వారా.. అన్ రిజర్వ్డ్ కోచ్లలో టికెట్ బుక్ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సబర్బన్ స్టేషన్లకు సంబంధించి గతంలో స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల గరిష్ట పరిధిలో యాప్ ద్వారా టికెట్ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఇప్పుడు 10 కిలోమీటర్లకు పెంచారు. అలాగే.. నాన్ సబర్బన్ స్టేషన్ల గరిష్ట పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు విస్తరించారు. స్టేషన్కు 15 మీటర్ల దూరం నుంచి ఈ పరిధి లెక్కలోకి వస్తుంది. ఈ వెసులుబాటు లేక గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్లు. అన్ రిజర్వ్డ్ బోగీలో సీట్ల రిజర్వేషన్ ఉండదు. కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నది తెలిసే ఉంటుంది. అలా ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ వివరాలు సంబంధిత ఫోన్కు మెసేజ్ రూపంలో అందుతాయి. రైళ్లలో టీటీఈలకు ఆ వివరాలు చూపితే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వివిధ రకాల వాలెట్లు.. ఆర్–వాలెట్, పేటీఎం,మోబిక్విక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపొచ్చు. ఇదీ చదవండి: ఛలాన్లు కట్టకుంటే ‘మోత’ మోగుద్ది -
కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రీఫండ్ కోసం ఇక రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ రీఫండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్లైన్ ద్వారా రీఫండ్ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్ టికెట్లకు సైతం విస్తరించారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్ కార్యాలయాల్లోనే రీఫండ్కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్ టికెట్లకు సైతం ఆన్లైన్ రీఫండ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది. అరగంట ముందు చాలు... ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ బుక్ చేసుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తమ ప్రయాణం నిర్ధారణ కాని పక్షంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. డబ్బులు ఆటోమేటిక్గా వారి ఖాతాలో చేరిపోతాయి. కానీ కౌంటర్ టికెట్లకు ఆ అవకాశం లేదు. తాజా మార్పుతో కౌంటర్లో టికెట్లు తీసుకున్న వాళ్లూ ఆన్లైన్ రీఫండ్ చేసుకోవచ్చు. రైలు సమయానికి అరగంట ముందు కూడా రద్దు చేసుకోవచ్చు. కానీ టికెట్ డబ్బులు తీసుకొనేందుకు మాత్రం రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లవలసి ఉంటుంది. ‘ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట. రిజర్వేషన్ నిర్ధారణ అవుతుందని రైలు బయలుదేరే వరకూ ఎదురు చూసేవాళ్లు చివరి నిమిషంలో కౌంటర్లకు వెళ్లి టికెట్ రద్దు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికిది చక్కటి అవకాశం’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 శాతం కౌంటర్ టికెట్లు ► ప్రతి ట్రైన్లో 30 శాతం వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇవ్వొచ్చు.18 నుంచి 24 బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల సంఖ్య మేరకు 300 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇస్తారు. కానీ చాలా సందర్భాల్లో 400 వరకూ వెయిటింగ్ లిస్టు జాబితా పెరిగిపోతుంది. ► 70 శాతం మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 30 శాతం మంది మాత్రమే కౌంటర్ల వద్దకు వెళ్తున్నారు. చదవండి: నేతన్నల బీమాకు వీడిన చిక్కు -
‘చిన్నారుల టికెట్ల బుకింగ్లో మార్పుల్లేవ్’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: చిన్నారులకు రైల్వే టికెట్ల బుకింగ్కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ రైల్వే శాఖ 2020 మార్చి 6న ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే, వారికి ప్రత్యేకంగా బెర్త్ గానీ, సీటు గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. బెర్త్ లేదా సీటు అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేసింది. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్ -
‘21 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి’.. ఉద్యోగులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: రైతులకు ఎరువులు భారీ స్థాయిలో రాయితీలకు ఇస్తుండటంతో ప్రభుత్వంపై పడిన సబ్సిడీ భారం, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు తదితరాల పథకాల ఆర్థికభారం నుంచి కాస్తంత ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ నిమిత్తం చేసే విమాన, రైలు ప్రయాణాల్లో ఖర్చులు తగ్గించుకోవాలంది. ఆ సూచనలు.. ► అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. ► అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు. ► వేర్వేరు టైమ్–స్లాట్లుంటేనే, తప్పనిసరి అయితేనే రెండు టికెట్లు బుక్ చేయాలి. లేదంటే ఒక ప్రయాణానికి ఒక్కటే తీసుకోవాలి. ► విమాన టికెట్లను 72 గంటల్లోపు బుక్చేసినా, 24 గంటల్లోపు క్యాన్సిల్ చేసినా అందుకు కారణం తెలుపుతూ సంబంధిత విభాగానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ► తక్కువ క్లాస్ టికెట్తోనే ప్రయాణించండి. నాన్–స్టాప్ ఫ్లైట్ అయితే మరీ మంచిది. చదవండి👇 ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే.. -
ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్నే కొనేశారు!
Jr NTR Fans Buy Entire Theatre For RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ల మానియే కనిపిస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్, మార్చి 25న ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల బుకింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈమూవీ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్ అటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకా ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు వారాలపైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ మూవీ టికెట్స్ ఓ రేంజ్లో సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అమెరికాలో చోటుచేసుకోవడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట. చదవండి: జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్సెల్టౌన్లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో తారక్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
ఫ్యాన్స్ ముసుగులో యథేచ్చగా బ్లాక్ మార్కెట్!!
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు. మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్లైన్లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –రమణానాయక్, తహసీల్దార్ ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్ థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్మార్కెట్ను అరికట్టాలి. –షేక్ ఫారూక్, ప్రేక్షకుడు జేబుకు చిల్లు ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్కార్న్, కూల్డ్రింక్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది. –షేక్గౌస్, ప్రేక్షకుడు చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్పై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. పేటీఎం యాప్తో విమాన టికెట్ల బుకింగ్పై 15 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సాయుధ దళాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు, సీనియర్ సీటిజన్లకు అందుబాటులో ఉండనుంది. వీటిపై వర్తిస్తాయి..! పేటీఎం అందిస్తోన్న ఆఫర్స్ ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ఎసియా సర్వీసులపై తగ్గింపు ధరలు వర్తిస్తాయి. కాలేజ్ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్ట్రా బ్యాగేజ్ను తీసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చును. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.... “ ట్రావెల్ టికెటింగ్ మాకు చాలా ముఖ్యమైన సెగ్మెంట్. ట్రావెలింగ్ విషయంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను రిజర్వ్ చేయడానికి సులభతరమైన అనుభూతిని వారికి అందిస్తున్నామని అన్నారు. పేటీఎం ప్రముఖ మేజర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కస్టమర్లు ఫ్లైట్ టికెట్లను, ఇంటర్సిటీ బస్సులను, రైల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి పేటీఎం వీలు కల్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణాలపై ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పేటీఎం ప్రారంభించింది. చదవండి: Paytm: 50 కోట్ల మంది టార్గెట్ -
RED RAIL: టిక్కెట్ల బుకింగ్ ఇప్పుడు ఇంకా ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్బస్ తాజాగా రెడ్రైల్పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్బస్ యాప్లోనూ బుకింగ్కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. -
వారం రోజుల పాటు.. ఈ టైంలో రైల్వే రిజర్వేషన్లు బంద్! కారణమిదే
Indian Railway Big Update: ప్రయాణం చేయాలనుకునే వారికి ముఖ్య సూచన చేసింది రైల్వేశాఖ. మెయింటెన్స్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొంది. టికెట్ బుకింగ్తో పాటు పీఎన్ఆర్ ఎంక్వైరీ, టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయి. స్పెషల్ 2020 మార్చిల లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. ప్యాసింజర్ , లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రక్రియ నడిచింది. రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పనిలో ఉంది రైల్వేశాఖ. సాఫ్ట్వేర్ అప్డేట్ టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్ స్టేటస్, ట్రైన్ రియల్టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు. The activity will be performed starting from the intervening night of 14 and 15-November to the night of 20 and 21-November starting at 23:30 hrs and ending at 0530 hrs. During this period, no PRS Services will be available. Read: https://t.co/8MPZw1cGXx — PIB India (@PIB_India) November 14, 2021 చదవండి: రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. ఇక నో ‘ కొవిడ్ స్పెషల్’ రైళ్లు, టికెట్ ధరలు సైతం తగ్గింపు! -
వాయిదా పద్దతుల్లో విమాన టికెట్లు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్జెట్ కొత్తగా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్ల చార్జీలను సులభ వాయిదాల్లో (ఈఎంఐ) కట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం మూడు, ఆరు లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఎటువంటి అదనపు భారం (వడ్డీ భారం) లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ స్కీమును ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ పాన్ నంబరు, ఆధార్ నంబరు వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్–టైమ్ పాస్వర్డ్తో ధృవీకరించాల్సి ఉంటుంది. ఏకీకృత చెల్లింపు విధానానికి సంబంధించిన యూపీఐ ఐడీ ద్వారా మొదటి వాయిదా చెల్లించాలి. అదే యూపీఐ ఐడీ నుంచి తదుపరి ఈఎంఐలు డిడక్ట్ అవుతాయి. ఈఎంఐ స్కీమును ఉపయోగించుకోవడానికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను సమర్పించనక్కర్లేదు. -
Sakshi Effect: ఆ ఏజెంట్లపై ఆర్టీసీ వేటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్కు కొమ్ముకాస్తున్న అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్లపై వేటు పడింది. దాదాపు 400 ఏజెంట్లను ఆర్టీసీ తొలగించింది. ఈ ఏజెంట్లు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీట్లు బుక్ చేయాల్సి ఉండగా, సంస్థ ఆదాయానికి గండి కొడుతూ, అధిక కమీషన్ ఆశ చూపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సీట్లు బుక్ చేస్తున్నట్టు తాజాగా ఆర్టీసీ విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. అక్టోబర్ 20న ‘ఆర్టీసీలో సీట్లు లేవు.. ప్రైవేటులో వెళ్లండి’శీర్షికతో‘సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు వస్తుంటే, వాటిల్లో సీట్లు ఖాళీగా లేవని చెబుతూ ఏజెంట్లు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సీట్లు బుక్ చేస్తున్న తీరును ఆ కథనం ఎండగట్టింది. ఈ విషయం కొంతకాలం క్రితం ఆర్టీసీ అధికారులు పరిశీలనలో కూడా వెలుగు చూసింది. కానీ అప్పట్లో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సాక్షిలో ఏజెంట్ల మోసంపై కథనం రావడంతో, వెంటనే స్పందించిన ఎండీ సజ్జనార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విజిలెన్స్ సిబ్బంది విచారణ జరిపి టికెట్ బుకింగ్ ఏజెంట్ల పనితీరుపై నివేదిక సమర్పించారు. విచారణలో దాదాపు 400 మంది ఏజెంట్లు ఆర్టీసీకి ఏమాత్రం అనుకూలంగా పనిచేయటం లేదని తేలింది. వీరంతా ప్రైవేటు బస్సుల సీట్లనే బుక్ చేస్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే వారందరి ఒప్పందాలను రద్దు చేయాలని ఎండీ ఆదేశించడంతో ఏజెన్సీలను తొలగించారు. కమీషన్తో సంబంధం లేకుండా.. ఆర్టీసీ కౌంటర్లు, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ కాకుండా అబీబస్ లాంటి సంస్థలతో ఆర్టీసీ టికెట్లు రిజర్వ్ చేయిస్తోంది. దీంతోపాటు దాదాపు 650 ఆథరైజ్డ్ ఏజెంట్లకు కూడా టికెట్ల బుకింగ్కు అనుమతించింది. ఇందుకోసం కొంత సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటుంది. బుక్ అయిన ప్రతి టికెట్పై దాదాపు 8 శాతం కమీషన్ ఇస్తోంది. అయితే, ఆర్టీసీకి గండికొట్టేందుకు ప్రైవేటు ట్రావెల్స్ 20 శాతం వరకు కమీషన్ ఆశ చూపుతున్నాయి. దీంతో ఏజెంట్లు ట్రావెల్స్ సీట్లనే రిజర్వ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా, కమీషన్తో సంబంధం లేకుండా ఉచితంగా సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఎవరికైనా ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. టికెట్ బుక్ చేసినందుకు రూ.20 నుంచి రూ.30 వరకు నిర్ధారిత మొత్తాన్ని ఏజెంట్లు.. ప్రయాణికుల నుంచి వసూలు చేసుకుంటే సరిపోతుందని, అప్పుడు వారిపై నిఘా పెట్టాల్సిన పనికూడా ఉండదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సీట్లు మిగిలిపోతున్న తరుణంలో ఏజెంట్లు ఈ పద్ధతిలో ఎన్ని సీట్లు బుక్ చేసినా సంస్థకు ఉపయోగమే కదా అని కొందరు నిపుణులు ఆర్టీసీకి సూచిస్తున్నారు. -
ఆర్టీసీలో సీట్లు లేవు.. ప్రైవేటులో వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్న ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు తుదకు ఆర్టీసీ టికెట్లను కూడా టార్గెట్ చేశారు. ప్రయాణికులు వచ్చి ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకునే వేళ, వారు ప్రైవేటు బస్సులే ఎక్కేలా కొత్త ఎత్తుగడ వేశారు. దీన్ని గుర్తిం చటంలో ఆర్టీసీ విఫలమై భారీగా టికెట్ ఆదా యాన్ని కోల్పోతోంది. ఫలితంగా ప్రైవేటు బస్సుల్లో నిండుగా ప్రయాణికులు ఉంటుండగా, ఆర్టీసీ బస్సులు మాత్రం కొంతమేర ఖాళీ సీట్లతో ప్రయాణించాల్సి వస్తోంది. ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్లకు అధిక కమీషన్ ఆశ చూపి ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు అడ్డగోలు వ్యవహారానికి తెర దీశారు. తాజా దసరా ప్రయాణాల్లో ఈ రూపంలో ఆర్టీసీ భారీగా నష్టపోయింది. ఇదీ సంగతి.. ఆర్టీసీకి టికెట్ల ద్వారా ఎక్కువ ఆదాయం దూర ప్రాంత సర్వీసులతోనే సమకూరుతుంది. ఇందు కోసం సీట్లను ముందస్తు రిజర్వేషన్ ద్వారా భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రయాణికులు సొం తంగా ఆన్లైన్ సీట్లను రిజర్వ్ చేసుకునేలా వెబ్సైట్లో ఆప్షన్ ఇస్తోంది. కానీ ఈ రూపంలో పూర్తిగా సీట్లు బుక్ కావు. ఇందుకోసం అబీ బస్, రెడ్ బస్ లాంటి వాటితో ఒప్పందం చేసుకుని వాటి ద్వారా సీట్లు బుక్ అయ్యేలా చేస్తుంది. దీంతో పాటు కొం దరు రిజర్వేషన్ ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఏజెంట్లను ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెం ట్లుగా పిలుచుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఏజెన్సీలు ఆర్టీసీకి అధికారిక టికెట్ బుకింగ్ సంస్థలుగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఈ ఏజెన్సీలు ఆర్టీసీ బస్సుల్లో సీట్లను మాత్రమే రిజర్వ్ చేయాలి. ఇందుకు ప్రతి టికెట్పై దాదాపు 8% వరకు కమీషన్ను ఆ ఏజెన్సీలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. వీటి ద్వారా దాదాపు 30% వరకు సీట్లు రిజర్వ్ అయ్యేవి. దీన్ని గుర్తించిన ప్రైవేట్ ట్రావెల్స్ ప్రధాన ఏజెంట్లతో అవగాహన కుదుర్చుకుంటున్నాయి. ఆ ప్రయాణికులకు తమ బస్సుల్లో సీట్లు బుక్ చేస్తే ప్రతి టికెట్పై 20% కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేవని అబద్ధం చెప్పి వాటి బదులు ప్రైవేటు బస్సుల్లో ఉన్నాయంటూ ఆ టికెట్లను అంటగడుతున్నారు. దసరా రద్దీ ఎక్కువగా ఉన్నా, దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు మిగిలే కనిపించాయి. -
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త!
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. ఐఆర్సీటీసీ తన వెబ్ సైట్, యాప్ లో ఆన్లైన్లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఐఆర్సీటీసీ చెల్లింపు గేట్ వే ఐఆర్సీటీసీ-ఐపే ద్వారా టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణీకులు రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్సీటీసీ-ఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది. ఐఆర్సీటీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పెరుగుతున్న రైల్వే ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఐఆర్సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసిందని, దీని వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణీకులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరణ చేసినట్లు తెలిపారు. చదవండి: ఆధార్ కార్డులో చిరునామాని ఆన్లైన్లో సవరించండి ఇలా! -
ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు
సాక్షి, అమరావతి: ప్రయివేటు ట్రావెల్స్ పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ‘ఎర్లీ బర్డ్’ ఆఫర్ను తీసుకొచ్చింది. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. దీని ప్రకారం అన్ని ఏసీ బస్సు చార్జీల్లో 10 శాతం రాయితీ వర్తిస్తుండగా, నాన్ ఏసీ సర్వీసుల్లో(సూపర్ డీలక్స్, అల్ట్రా) పది శాతం సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే 48 గంటల ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్న వారికే ఈ రాయితీలు వర్తిస్తాయి. నాన్ ఏసీ దూరప్రాంత సర్వీసులైన సూపర్ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్లో 39 సీట్లకు గాను నలుగురికి, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 49 సీట్లకు గాను ఐదుగురికి మాత్రమే రాయితీకి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో రోడ్డెక్కనున్న ఏసీ సర్వీసులు సంస్థలో మొత్తం ఏసీ సర్వీసులు 348 వరకూ ఉండగా, ప్రస్తుతం 270 సర్వీసులనే ఆర్టీసీ నడుపుతోంది. వీటిలో డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి, గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర సర్వీసులున్నాయి. మిగిలిన సర్వీసులనూ ఆర్టీసీ పునరుద్ధరించనుంది. కరోనా కారణంగా ఏసీ సర్వీసులకు ఆదరణ తగ్గింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వాటికి ఆదరణ పెంచేందుకే ఆర్టీసీ ఈ ఆఫర్ ప్రకటించింది. ఆక్యుపెన్సీ 70 శాతానికి పైగా చేరేలా ప్రణాళికలు ఆర్టీసీలో 3,078 నాన్ ఏసీ దూర ప్రాంత సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ఒక్కో బస్సులో పది శాతం సీట్లకే 10 శాతం రాయితీ వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ శాతం 70కి పైగా చేరేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ప్రయివేట్ ట్రావెల్స్కు దీటుగా ప్రయాణికులకు సేవలందించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించినట్టు ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందు టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్ జితేంద్రనాథ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ రాయితీ సౌకర్యం విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. మాట్లాడుతున్న జితేంద్రనాథ్రెడ్డి రాయితీ పొందేందుకు 48 గంటల ముందు రిజర్వు చేసుకోవాలని తెలిపారు. తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుందని తెలిపారు. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, అమరావతి బస్సులో 49 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, ఇంద్ర బస్సులో 40 సీట్లు ఉంటే నలుగురు, సూపర్ లగ్జరీలో 35 సీట్లకుగాను నలుగురికి, అల్ట్రా డీలక్స్లో 39 సీట్లకుగాను నలుగురు, ఎక్స్ప్రెస్ బస్సులో 49 సీట్లు ఉంటే ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశం మార్చి 31వ తేది వరకు అమలులో ఉంటుందని ఆయన వివరించారు. చదవండి: తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు -
అమెజాన్లో రైలు టికెట్లు : క్యాష్ బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అమెజాన్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకోసం అమెజాన్ బుకింగ్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, ఈ బుకింగ్ ఫీచర్ అమెజాన్ మొబైల్ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ త్వరలో ఐఓఎస్ ప్లాట్ఫామ్లో కూడా లభ్యం కానుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తమ మొదటి టికెట్ బుకింగ్లో 10 శాతం క్యాష్బ్యాక్ (రూ .100 వరకు) పొందుతారని అమెజాన్ తెలిపింది. ప్రైమ్ సభ్యులు తమ మొదటి బుకింగ్ కోసం 12 శాతం క్యాష్బ్యాక్ (రూ. 120 వరకు) పొందవచ్చు. పరిమిత కాలానికి సర్వీస్, పేమెంట్ గేట్వే లావాదేవీ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అయితే అమెజాన్ పే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది విమానం, బస్సు టికెట్ల బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన తాము తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని అమెజాన్ పే డైరెక్టర్ వికాస్ బన్సాల్ వెల్లడించారు. అమెజాన్ పే ట్యాబ్కు వెళ్లి, ఆపై రైళ్లు / కేటగిరీని ఎంచుకుని టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇతర ట్రావెల్ బుకింగ్ పోర్టల్ మాదిరిగానే, కస్టమర్లు తమకు కావలసిన గమ్యస్థానాలు, ప్రయాణ తేదీలను ఎంచుకోవచ్చు. అమెజాన్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతిని ఎంచుకోవచ్చు. అలాగే టికెట్ బుక్ అయిన తరువాత పీఎన్ఆర్ నెంబరు, సీటు తదితర వివరాలను కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలి అమెజాన్ యాప్ లోకి వెళ్లి ఆఫర్స్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఐఆర్సీటీసీ ఆప్షన్ ను ఎంచుకుని బుక్ నౌ క్లిక్ చేయాలి. అనంతరం ప్రయాణం, రైలు, ప్యాసింజర్ వివరాలను నమోదు చేసి టికెట్ బుక్ చేసుకొని అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేయాలి. వెంటనే క్యాష్ బ్యాక్ మీ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది. టికెట్ క్యాన్సిలేషన్ పై తక్షణమే నగదు వాపసు సదుపాయం అందించడం విశేషం. -
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకొని గడువులోగా టికెట్ రద్దు చేసుకోలేని వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారికి మరోమారు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. టికెట్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న వారికి సైతం అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్కు సంబంధించి ఓ నిర్ణీత కాల పరిమితి వరకు టికెట్ క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది తమ టికెట్లను నిర్ణీత కాలపరిమితి లోపు రద్దు చేసుకోలేకపోయారు. దీంతో వారికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నిబంధనల్ని సవరించింది. దీని ప్రకారం ఈనెల 29 లోపు ప్రయాణికులు వారి టికెట్లను రద్దు చేసుకోవచ్చంటూ తెలిపింది. దగ్గర్లోని బస్టాండు లేదా ఎటీబీ కౌంటర్లో టికెట్ చూపించి క్యాన్సిల్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. -
రైల్వే కౌంటర్లలో టికెట్ల బుకింగ్పై స్పష్టత
న్యూఢిల్లీ : త్వరలోనే మరిన్ని రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నేడు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన పీయూష్ గోయల్ పలు అంశాలు వెల్లడించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆఫ్లైన్ టికెట్ బుకింగ్కు సంబంధించి నిబంధనలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కొన్ని రాష్ట్రాలు తమకు సహకరించడం లేదని తెలిపారు. దాదాపు 40 లక్షల మంది వలసకూలీలు పశ్చిమ బెంగాల్కు చేరుకోవాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 27 ప్రత్యేక రైళ్లు మాత్రమే ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టాయని చెప్పారు. కాగా, జూన్ 1 నుంచి 200 రైళ్లు అందుబాటులోకి రానున్నట్టు బుధవారం ప్రకటన చేసిన రైల్వే శాఖ.. నేటి నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించింది. అయితే ఈ బుకింగ్కు విశేషమైన స్పందన వచ్చింది. కేవలం గంటల వ్యవధిలోనే లక్షల టికెట్లు అమ్ముడయిపోయాయి.(చదవండి : నేటి నుంచే రైల్వే బుకింగ్స్) -
నేటి నుంచే రైల్వే బుకింగ్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది. ముందస్తు టికెట్ బుకింగ్లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్లివే.. హైదరాబాద్–ముంబై: సీఎస్టీ హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్–హౌరా: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ హైదరాబాద్– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ – దానాపూర్: దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్– గుంటూరు: గోల్కొండ ఎక్స్ప్రెస్ నిజామాబాద్– తిరుపతి: రాయలసీమ ఎక్స్ప్రెస్ హైదరాబాద్– విశాఖపట్నం: గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్– నిజాముద్దీన్: దురంతో ఎక్స్ప్రెస్ వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు.. విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్ప్రెస్ హౌరా–యశ్వంతపూర్: దురంతో ఎక్స్ప్రెస్ ఎర్నాకులం– నిజాముద్దీన్: దురంతో ఎక్స్ప్రెస్ దానాపూర్–కేఎస్ఆర్ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి: రైల్వే స్టేషన్లలో కేటరింగ్ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. -
వాళ్లకి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి
సాక్షి, న్యూ ఢిల్లీ: రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చంటూ రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమ బెర్తులను ఖరారు చేసుకునేందుకు ఎదురుచూసిన ప్రజల ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతకూ ఐఆర్సీటీసీ వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ప్రజలు గందరగోళానికి లోనయ్యారు. దీనిపై స్పందించిన అధికారులు.. మొత్తం 30 సర్వీసులను నడుపుతుండగా ఇందులో 15 ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని వివరణ ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి కొన్ని రూట్లలో రైళ్లు నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూర్, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్కు రైళ్లు నడుపనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రైళ్లలో క్యాటరింగ్ భోజనం ఉండదని స్పష్టం చేసింది. ఏసీ రైలు అయినా బెడ్ షీట్లు, టవల్ ఇవ్వరని పేర్కొంది. (రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిక! ) ఏడు రోజుల ముందు మాత్రమే IRCTCలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రైళ్లలో ఆర్ఏసీ ప్రయాణాలు, వెయిటింగ్ లిస్ట్ ఉండదని తెలిపింది. కేవలం కన్ఫార్మ్డ్ టికెట్ ఉన్నవాళ్లకే స్టేషన్లోకి అనుమతిస్తామని పేర్కొంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ సౌకర్యం ఉండదని చెప్పింది. అప్పటికప్పుడు టికెట్ కొనుక్కునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సల్ చేసుకుంటే తిరిగి ఇవ్వాల్సిన సొమ్ములో 50% కోత విధిస్తామంది. ముందు బుక్ చేసుకున్నవారికి వాటర్ బాటిళ్లు ఇస్తామని తెలిపింది. ప్రయాణ సమయానికి గంటన్నర ముందే స్టేషన్కు చేరుకోవాలని ప్రయాణికులను కోరింది. (రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్) -
విమాన టికెట్ల బుకింగ్లను ఆపేయండి: డీజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 3 వరకు లౌక్డౌన్ అమల్లో ఉండగా, ఆ తర్వాతి తేదీలకు ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ బుకింగ్లను కొనసాగిస్తుండడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ‘‘ఎయిర్లైన్స్ సంస్థలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తగిన సమయం, ముందస్తు నోటీసు ఇవ్వడం జరుగుతుంది’’ అంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లను నిలిపివేసింది. మే 4వ తేదీ నుంచి ప్రయాణాలకు ఎయిర్ఇండియాతోపాటు, ప్రైవేటు ఎయిర్లైన్స్ బుకింగ్లు తీసుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు దూరంగా ఉండాలని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ సూచించడం గమనార్హం. -
విడతలుగా విమాన సర్వీసులు?
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత దశలవారీగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత 21 రోజుల కరోనా లాక్డౌన్ ముగియనుంది. ఆ తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 14వ తేదీ తర్వాత దశల వారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఏప్రిల్ 14 తర్వాత ప్రయాణాలకు విమానయాన సంస్థలు టికెట్లు చేసుకోవచ్చు’అని ఓ అధికారి తెలిపారు. లాక్డౌన్ను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తే మాత్రం ఆ మేరకు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఎయిరిండియా మినహా ఇప్పటికే ప్రముఖ విమానయాన సంస్థలు 14వ తేదీ నుంచి జరిగే దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్స్ మొదలుపెట్టగా ఎయిరిండియా మాత్రం ఈ నెల 30 తర్వాత ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్ ప్రారంభించింది. దెబ్బతిన్న విమానయాన రంగం లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఎయిర్ డెక్కన్ సంస్థ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి ఉద్యోగులంతా ఇళ్లలోనే ఉండాలని కోరింది. 14 తర్వాత రైళ్లు ! దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రయాణికులు కనీస ముందు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటూ విడతల వారీగా సర్వీసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఆరోగ్య సేత్ యాప్ వాడుతూ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని భావిస్తోంది. తద్వారా కోవిడ్ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆశిస్తోంది. -
విమాన టికెట్లు క్రెడిట్ షెల్లోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 15 నుంచి పరిస్థితులను బట్టి దశల వారీగా విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిందే ఆలస్యం.. అన్ని దేశీయ విమానయాన కంపెనీలు టికెట్ల బుకింగ్స్ను ప్రారంభించేశాయి. కానీ, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం లాక్డౌన్ను పొడిగిస్తామని కేంద్రం ప్రకటించింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలా? వద్దా? దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీస్లను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 3 వారాల లాక్డౌన్ తర్వాత విమాన సేవల పునరుద్ధ్దరణ నిర్ణయం ఎయిర్లైన్స్ కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. ఎవరైతే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య టికెట్లను బుకింగ్ చేశారో ఆయా ప్యాసింజర్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్స్ను, కొన్ని కంపెనీలైతే ట్రావెల్ ఓచర్లను అందిస్తున్నాయి. ఆయా పీఎన్ఆర్ స్టేటస్ రద్దు కాకుండా కస్టమర్లు ఇతరత్రా తేదీల్లో వినియోగించుకునే వీలుంటుందని స్పైస్జెట్కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం స్సైస్జెట్లో రోజుకు 600 విమానాలు తిరుగుతుంటాయి. ఇందులో 10 శాతం వాటా అంతర్జాతీయ విమానాలుంటాయి. నెలకు 50 వేల టికెట్లు బుకింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. 15 నుంచి క్రెడిట్ షెల్లోకి.. ఇండిగో, స్పైస్జెట్ వంటి అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు ఆయా వెబ్సైట్లలో టికెట్ల బుకింగ్ సమయంలో క్రెడిట్ షెల్ ఆప్షన్ను ఇస్తున్నాయి. ఇదేంటంటే.. ఒకవేళ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కాని పక్షంలో కేంద్రం లాక్డౌన్ను కంటిన్యూ చేస్తే.. మీరు బుకింగ్ చేసిన టికెట్ల తాలుకు నగదు మీ ఖాతాలో జమ కాదు. అది క్రెడిట్ షెల్ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు అదే పాసింజర్ ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా వినియోగించుకునే వీలుంటుందన్నమాట. ఒకవేళ కస్టమరే టికెట్లను రద్దు చేసుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం రద్దు చార్జీలను భరించాల్సిందే. ఫిబ్రవరిలో 1.23 కోట్ల దేశీయ ప్రయాణికులు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో దేశీయ విమానాల్లో 1.27 కోట్ల మంది, ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణించారు. గతేడాది జనవరిలో 1.25 కోట్లు.. ఫిబ్రవరిలో 1.13 కోట్లుగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో నెలవారీ ట్రాఫిక్ వృద్ధి రేటు 8.98 శాతంగా ఉంది. రద్దీ తాత్కాలికమే.. ఈ నెల 15 నుంచి ఒకవేళ దేశీయ విమానయాన సేవలు పునఃప్రారంభమైతే మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే వివిధ నగరాల్లో చిక్కుకున్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇది విమానయాన సంస్థలకు మూలధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సామూహిక లే ఆఫ్లు కొంత వరకు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుందని.. వైరస్ భయాల కారణంగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా వరకు ఎయిర్లైన్స్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాలను తగ్గించిన విషయం తెలిసిందే. -
లైన్ అక్కర్లేదు..ఆన్లైన్ చాలు!
సీతంపేట: ఓ వైపు ప్లాట్ఫారంపై రైలు ఉంటుంది. ఇటు చాంతాడంత క్యూ ఉంటుంది. నిత్యం రైళ్లలో ప్రయాణించే వారికి లైన్లో నించుని టికెట్ తీసుకోవడం ప్రహసనమే. దీంతో పాటు ప్లాట్ఫాం తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. చిన్నపాటి దూరానికి రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. రద్దీగా ఉండే స్టేషన్లలో అప్పటికప్పుడు వీరికి టికె ట్ తీసుకోవడం కష్టమైన పనే. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా స్టేషన్కు 15 మీటర్ల నుంచి ఐదు కిలోమీట ర్ల లోపు దూరంలో ఉండి సాధారణ టికెట్, ప్లాట్ఫాం టికెట్ కొనుగోలు చేసేందుకు యూటీఎస్ యాప్ను రూపొందించింది. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం, సాధారణ టికెట్ కొనుగోలు చేయాలంటే రైలు సమయాన్ని బట్టి యుద్ధం చేయాల్సిందే. టికెట్ కొనే సమయానికి రైలు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వేశాఖ ఈ యాప్ను సిద్ధం చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆన్లైన్ టి కెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్ర మే పరిమితం. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని ఇకపై జనరల్ టికెట్కూ విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ను అందుబాటులో ఉంచారు. ఈ–టికెట్ వినియోగం ద్వారా పేపరు రహిత రైలు టికెట్ విధానం అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్ఫాం సీజన్ టికెట్లు పొందే వెసులు బాటు రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ ద్వారా టికెట్ పొందే విధానంలో కొన్ని నిబందనలు/షరతులను మా త్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది. అన్ని రైళ్లకూ జనరల్ టికెట్ ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ తదితర రై ళ్లలో క్షణాల్లో జనరల్ టిక్కెట్లు బుక్ చేసు కోవచ్చు. ఒక వేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్ఫోన్ లేకుంటే బుకింగ్ ఐడీ నంబర్, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద టికెట్ పొందే అవకాశం ఉంది. ప్రత్యేకతలు రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం లేకుండా ఇంటి నుంచి బయల్దేరి రైల్వేస్టేషన్కు చేరే లోపే స్మార్ట్ ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిదిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్, ప్లాట్ఫారం, జనరల్ టిక్కెట్లు పొందవచ్చు. ఒకేసారి నాలుగు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. షో టికెట్ ఆప్షన్ ద్వారా టీసీకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు. యాప్ డౌన్లోడింగ్ ఇలా.. 4 ఈ యాప్ను ఉచితంగా ఆండ్రాయిడ్ విండోస్, ఐఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. 4 మొబైల్ నంబర్, ఓ పాస్వర్డ్ను వ్యక్తిగత వివరాలతో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులకు సంబంధించిన ఏదో ఒక నంబర్ను ఈ యాప్లో నమోదు చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. నిబంధనలు.. ఏ ప్రయాణ టిక్కెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటల ముందుగా బుక్ చేసుకోవాలి. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్ర యాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా టికెట్ బుక్ చేద్దామంటే ఈ యాప్ పనిచేయదు. అలాగే టికెట్ బుక్ చేసిన సమయానికి మూడు గంటలు దాటితే టికెట్ పనిచేయదన్నమాట. ఏ రైల్వే స్టేషన్కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. దూరాన్ని జీపీఎస్ ద్వారా లెక్కిస్తుంది. ఏ ఫ్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీ టర్ల లోపు దూరంలో ఉన్న ప్రయాణికులు మాత్రమే అర్హులు. ఏ పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చూపించి పొందవచ్చును. ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది. -
రిలీజ్కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని
ఇష్టమైన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అభిమానులు దాన్ని ఓ పండగలా జరుపుకుంటారు. హీరో కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తారు. థియేటర్ల ముందు క్యూ కడుతారు. పనులన్నీ పక్కన పెట్టి ఫస్ట్డే ఫస్ట్ షోకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మనం చెప్పుకునే వీరాభిమాని అంతకుమించిన పని చేసి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలిచాడు. విజయ్ అనే వ్యక్తి చుల్బుల్ పాండే(సల్మాన్ ఖాన్)కు డైహార్డ్ ఫ్యాన్. తాజాగా సల్మాన్ నటించిన ‘దబాంగ్ 3’ శుక్రవారం విడుదల కానుండటంతో విజయ్ ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ తన ఒక్కడికో, కుటుంబానికో లేదా ఫ్రెండ్స్కో సరిపడా టికెట్లు కొనలేదు. ఏకంగా 150 టికెట్లు కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాదాపు ఓ మినీ థియేటర్నే బుక్ చేశాడనుకోండి. జమ్ము అనే ఫ్యాన్స్ క్లబ్ కూడా దబాంగ్ 3 కోసం ముందస్తుగా 100 టికెట్లు కొనుగోలు చేసింది. గతంలో సల్మాన్ నటించిన రేస్ 3 చిత్రం అంతంతమాత్రంగానే ఉందని విమర్శకులు పెదవి విరిచారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా రూ.300 కోట్ల మైలురాయిని చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే అతని అభిమాన ఘనం బలమేంటో అర్థమవుతోంది. ఇక ‘దబాంగ్ 3’ ట్రైలర్ 50మిలియన్ల వ్యూస్తో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాతో ఈ యేడు మంచి ముగింపును పలకడానికి సల్మాన్ రెడీ అయిపోయాడన్నమాట. -
పీపుల్స్ ఫ్రెండ్లీ..
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా పలు చర్యలు చేపట్టింది.రెండు రోజులుగా లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి 60 జన సాధారణ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో అన్ని జనరల్ బోగీలే ఉంటాయి. టిక్కెట్ కూడాఅప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్లిపోవచ్చు. జనసాధారణ రైళ్లే కాకుండా ఎక్స్ప్రెస్, మెయిల్ సర్వీసుల్లోనూ జనరల్ బోగీల్లో టిక్కెట్ బుకింగ్ల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన అన్రిజర్వ్డ్ టిక్కెట్ సిస్టమ్ (యూటీఎస్) మొబైల్ అప్లికేషన్, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్స్ (ఏటీవీఎంలు), కోటీవీఎంలు (క్యాష్ టిక్కెట్ వెండింగ్ మిషన్లు) సంక్రాంతి రద్దీ వేళ ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. టిక్కెట్ల కోసం గంటల తరబడి లైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొని బయలుదేరుతున్నారు.మరోవైపు స్పెషల్ రైళ్లు, సువిధ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే జనసాధారణ రైళ్లలో చార్జీలు కూడా తక్కువగా ఉండడంతో నగరవాసుల సంక్రాంతి ప్రయాణం ఈజీగా మారింది. పెరిగిన యూటీఎస్ బుకింగ్లు... అన్రిజర్వ్డ్ టిక్కెట్ సిస్టమ్ యాప్ను గత సంవత్సరం ప్రవేశపెట్టారు. మొదట్లో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లలో సాధారణ టిక్కెట్ బుకింగ్ల కోసం అందుబాటులోకి తెచ్చిన యూటీఎస్ను అన్ని రైళ్లలోని జనరల్ బోగీలకు విస్తరించారు. ట్రైన్ బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా ఈ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తమ ఇంటి నుంచి రైల్వేస్టేషన్కు బయలుదేరే సమయంలోనే టిక్కెట్ బుక్ చేసుకొని, ఆన్లైన్ ద్వారా చార్జీలు చెల్లించవచ్చు. ఎలాంటి కాలయాపన లేకుండా నేరుగా రైలెక్కవచ్చు. ఈ సదుపాయం సాధారణ ప్రయాణికులకు ఇప్పుడు ఎంతో ఉపయోగంగా మారింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో రైళ్లు, లక్షల్లో ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. అన్ని రైళ్లలోనూ చాలావరకు బుకింగ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం జనరల్ బోగీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో యూటీఎస్ యాప్కు అనూహ్యంగా ఆదరణ పెరిగింది. ప్రతి రోజు సుమారు 2500 టిక్కెట్లు ఈ యాప్ ద్వారా బుక్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒక టిక్కెట్పైన కనీసం ఐదుగురు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి రోజు 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులు ప్రస్తుతం యూటీఎస్ యాప్ను వినియోగించుకొని బయలుదేరుతున్నారు. ఇప్పటికే 1.5 లక్షల మంది వినియోగదారులు యూటీఎస్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. ఏటీవీఎంలకు డిమాండ్... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం 20 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ ఏటీవీఎంల నుంచి కూడా జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒకటి, పదో నెంబర్ ప్లాట్ఫామ్ల వద్ద కోటీవీఎంలు ఉన్నాయి. నగదు చెల్లించి బుక్ చేసుకొనే వారికి ఇవి ప్రయోజనం. వీటిని వినియోగించుకొనేందుకు సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ‘జనరల్ క్యూలలో టిక్కెట్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ఏటీవీఎంలు, కోటీవీంలను వినియోగించుకోవచ్చునని’ అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా వీటి వినియోగం గణనీయంగా పెరిగిందని సికింద్రాబాద్ స్టేషన్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పోటెత్తిన రద్దీ.... సంక్రాంతికి సొంత ఊళ్లకు తరలి వెళ్తున్న ప్రయాణికులతో శుక్రవారం బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 3500 రెగ్యులర్ బస్సులతో పాటు శుక్రవారం మరో 1000 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీబస్స్టేషన్లతో పాటు, కూకట్పల్లి, మియాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, సాగర్రింగురోడ్, తదితర ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో పోటెత్తాయి.రైల్వేస్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. గత రెండు రోజులుగా సుమారు 10 లక్షల మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు.సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ 5252 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.వివిధ ప్రాంతాలకు ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 200 రైళ్లతో పాటు మరో 150 రైళ్లను (60 జనసాధారణ రైళ్లు) దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది.బస్సులు, రైళ్లలోనే కాకుండా సొంత వాహనాల్లోనై భారీ ఎత్తున బయలుదేరారు. విమాన ప్రయాణాలకు సైతం డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న 1000 ప్రైవేట్ బస్సుల్లోనూ ప్రయాణికులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు పోటీ పడి మరీ చార్జీలను ఒకటి,రెండు రెట్లు పెంచేశారు. ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ సైతం 50 శాతం అదనపు చార్జీలను విధించిన సంగతి తెలిసిందే. -
ఆ రెండు గంటలు ఐఆర్సీటీసీ పనిచేయదు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్ ఐఆర్సీటీసీ కార్యకలాపాలు రెండు గంటలపాటు స్థంభించనున్నాయి. రోజువారీ సైట్ నిర్వహణలో భాగంగా రెండు గంటలపాటు టికెట్ బుకింగ్స్ నిలిచిపోనున్నాయని భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది. నవంబరు10, 2018 రోజున 00.20 గంటల నుంచి 01.30 గంటల వరకు రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం, ఎంక్వయిరీ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఐఆర్సీటీసీ (irctc.co.in) సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవనీ, రెండు గంటల సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, కీలక సర్వీసులు సైతం నిలిచిపోనున్నట్టు పేర్కొంది. దీన్ని రైల్వే వినియోగదారులకు గుర్తించాలని కోరింది. రైల్వే టికెట్ బుకింగ్, టికెట్ రద్దు చేసుకునే సౌకర్యం వెబ్సైట్ నిర్వహణ కారణంగా నవంబరు 10వ తేదీ 00:20 నుంచి 01:30 గంటలు వరకు అందుబాటులో ఉండదు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో రిజర్వేషన్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ బుకింగ్, ఎంక్వైరీ సర్వీసులు (టెలిఫోన్ నెంబర్ 139) కూడా పనిచేయవని ఐఆర్సీటీసీ తెలిపింది. సాధారణంగా ప్రతిరోజు వెబ్సైట్ నిర్వహణ పనులు 23:30 గంటల నుంచి 00:30 గంటల మధ్యలో జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు. -
ఐఆర్సీటీసీ కొత్త విధానంలో రైల్వే ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ఆన్లైన్ వినియోగదారులు ఇక కొత్త చెల్లింపుల విధానంలో తమ టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ఐఆర్సీటీసీ–ఐ పే’ విధానంలో టికెట్ల బుకింగ్, రద్దు చేసుకునే అవకాశాన్ని అన్ని బ్యాంకు కార్డుల ద్వారా కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఆగస్టు 18 నుంచి www.irctc.co.in ద్వారా ఐఆర్సీటీసీ–ఐ పే విధానం అమల్లోకి రానుందని ఐఆర్సీటీసీ అధికారి ఒకరు వెల్లడించారు. టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం రద్దు చేసుకుంటే డబ్బు వాపసు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదన్నారు. 25 సెకన్లలోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి కొత్త నిబంధనలు విధించారు. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే నెలకు ఒక గుర్తింపు కార్డుపై 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. 120 రోజులు ముందుగా టికెట్లను పొందే విధానంలో మార్పులు లేవు. టికెట్లను బుక్ చేసుకు నే గడువును కుదించారు. కేవలం 25 సెకన్ల వ్యవధిలోనే రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు ఇచ్చే విధానంలో నిబంధనలు మార్చారు. నిర్ణీత వేళలకు రైలు రాకున్నా.. 3 గంటలకు పైగా ప్రయాణీకుడు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో రద్దు చేసుకోవాలనుకుంటే.. ప్రయాణికుడికి మొత్తం చార్జీ సొమ్ము వాపసు వస్తుంది. -
‘భీమ్’తో బుక్ చెయ్... రిఫండ్ కొట్టెయ్
న్యూఢిల్లీ: ప్రజలు భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ప్రోత్సహించడానికి రైల్వే శాఖ నెలవారీ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించింది. ఇందులో విజేతలుగా నిలిచే ఐదుగురికి మొత్తం ప్రయాణ చార్జీలను తిరిగి చెల్లిస్తారు. భీమ్ యాప్ లేదా ఠీఠీఠీ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn వెబ్సైట్లో యూపీఐ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ ఈ పథకాన్ని గత నెలలో ప్రవేశపెట్టింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలో కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా అంతకు ముందు నెలకు సంబంధించిన ఐదుగురు విజేతలను ప్రకటిస్తారు. ప్రయాణికుడు తాను ప్రయాణించిన నెలలోనే ఈ పథకం కింద లక్కీ డ్రాకు అర్హుడు. -
బాహుబలి2 ఆన్లైన్ టికెట్ల మోసం
-
ఆన్ లైన్ టికెట్ బుకింగ్కూ ఆధార్
త్వరలో అమలు చేయనున్న రైల్వే శాఖ ► నగదు రహితమే లక్ష్యంగా నూతన ప్రణాళిక ► ప్రయాణ సర్వీసులన్నీ పొందేందుకు మొబైల్ అప్లికేషన్ న్యూఢిల్లీ: రైల్వే ఆన్ లైన్ టికెట్ల కొనుగోలులో అక్రమాలను నిరోధించడానికి ఆధార్ నంబర్ను తప్పనిసరి చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఐఆర్సీటీసీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆధార్ను తప్పనిసరి చేయనుంది. దీనివల్ల బల్క్ టికెట్ల బుకింగ్లను అరికట్టడంతోపాటు మరొకరి పేరుతో టికెట్ బుకింగ్ చేయడాన్ని కూడా అడ్డుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్లలో రాయితీ పొందేందుకు ఏప్రిల్ 1 నుంచి ఆధార్ తప్పక సమర్పించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఆదేశిం చింది. దీన్ని మూడు నెలల పాటు ప్రయోగా త్మకంగా అమలు చేయనుంది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వేశాఖ 2017–18 కొత్త బిజినెస్ ప్లాన్ ను గురువారం ప్రవేశపెట్టారు. ఇందులో ఆధార్ తప్పనిసరి చేయడంతోపాటు నగదు రహిత టికెట్ల కొనుగోలు లక్ష్యంగా అడుగులు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు వేల పీవోఎస్ మెషీన్లను, వెయ్యి ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మేలో టికెటింగ్ యాప్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టికెటింగ్ యాప్ను కూడా రైల్వేశాఖ మేలో ఆవిష్కరించనుంది. అంతేకాదు ఐఆర్సీటీసీలో నమోదుకు ఆధార్ను తప్పనిసరి చేసేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను రూపొందించనున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పర్వత ప్రాంతాలకు చేరుకునేలా కొత్త టూరిస్టు రైళ్లను ఆవిష్కరించనున్నట్లు తాజా ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో ప్రయాణికులకు వసతి సదుపాయాలు, కేటరింగ్ సర్వీస్ మెరుగుపరచడం ద్వారా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేలా చేయాలని నిర్ణయించారు. ఒకే యాప్.. సేవలెన్నో.. రైల్వేశాఖ త్వరలో సమగ్ర మొబైల్ యాప్ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకూ టికెట్ల కొనుగోలు, ట్యాక్సీల బుకింగ్, ఈ కేటరింగ్ తదితర సర్వీసులకు వేర్వేరు యాప్లు ఉన్నాయి. అయితే కొత్త యాప్ ద్వారా ఈ సర్వీసులన్నీ పొందవచ్చని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్, సీజన్ టికెట్లతో పాటు ప్లాట్ఫామ్ టికెట్లనూ కొనుగోలు చేయవచ్చు. -
టికెట్ బుకింగ్ అని వచ్చి కేటుగాళ్ల మాయ
దుండిగల్: ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేయాలని వచ్చిన ఇద్దరు దుండగులు యువతి దృష్టి మళ్లించి రూ. 50 వేలు ఎత్తుకెళ్లారు. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం... గండిమైసమ్మ చౌరస్తాలో పుష్ఫక్ కమ్యూనికేషన్స్ పేరుతో ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ ఉంది. శుక్రవారం సాయంత్రం 4.30కి ఇక్కడికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకొనేందుకు వచ్చామని కంప్యూటర్ ఆపరేటర్ విజయలక్షి్మకి చెప్పారు. అనంతరం తమ వద్ద వంద నోట్లు ఉన్నాయని, వాటికి బదులు 500 నోట్లు కావాలని కోరారు. వారు 10 వంద రూపాయల నోట్లు ఇవ్వగా, విజయలక్ష్మి వారికి రెండు 500 నోట్లు ఇచ్చింది. అయితే, ఆ రెండు నోట్లు బాగాలేవని, వేరేవి ఇవ్వమని వారు పట్టబట్టారు. దీంతో తన వద్ద ఉన్న నోట్లన్నీ ఇలాగే ఉన్నాయని చెప్పి విజయలక్ష్మి క్యాష్ పెట్టెలో ఉన్న నోట్లను చూపించింది. అదే సమయంలో మరొకడు తమకు త్వరగా టికెట్లు బుక్ చేయాలని హడావుడి చేశాడు. చివరకు రైలు టికెట్లు బుక్ చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో విజయలక్ష్మి అనుమానం వచ్చి క్యాష్ పెట్టెలో ఉన్న నగదును చూసుకోగా...రూ.50 వేల బండిల్ కనిపించలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్ఐ రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. అందులో నమోదైన అనుమానితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. -
కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో విజిలెన్స్ దాడులు
టికెట్ బుకింగ్ క్లర్క్ వద్ద లభించిన అదనపు డబ్బు కాజీపేట రూరల్ : కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ కార్యాలయంలో ఆదివారం విజిలెన్స్ దాడులు జరిగాయి. సికింద్రాబాద్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కౌంట ర్లో తనిఖీ చేయగా, బుకింగ్ క్లర్క్ జేబులో టికెట్ల డబ్బులు కాకుండా అదనంగా కొంత దొరికాయి. దీనిపై అధికారులు ప్రశ్నించగా వినాయకుడి నవరాత్రి ఉత్సవాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించేందుకు తన సొంత డబ్బులు తీసుకొచ్చానని చెప్పాడు. దీంతో అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయడంతో పాటు అదనపు డబ్బును రైల్వే ఖాతాలో జమ చేశారు. దీనిపై విచారణ పూర్తయ్యాక కేసు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో జరిగిన విజిలెన్స్ దాడులతో రైల్వే అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి. కాజీపేట జంక్షన్ కేంద్రంగా కొన్ని విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు దాడులు చేపడుతున్నారని సమాచారం. -
తత్కాల్ మాయాజాలం
రాజశేఖర్ ఆదివారం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలి. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో శనివారం తత్కాల్ కోటా కింద టికెట్ కోసం ప్రయత్నించాడు. గోదావరి ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీలో 22 బెర్తులు ఉన్నట్టు నిర్ధారణైంది. వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసే సమయానికి బెర్తుల సంఖ్య 4కు పడిపోయింది. వేగంగా ఆన్లైన్లో టికెట్ చార్జీలు చెల్లించాడు. అయినా అతడికి బెర్తు లభించలేదు. వెయిటింగ్ లిస్టు 17గా నమోదైంది. వారం రోజుల క్రితం బెంగళూర్ నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ప్రసాద్ అనే మరో ప్రయాణికుడు బెంగళూర్ ఎక్స్ప్రెస్లో థర్డ్ఏసీలో టికెట్ కోసం డబ్బు చెల్లించగా రాజశేఖర్ మాదిరిగానే ఇతనికీ వెయింటిగ్ లిస్ట్ వచ్చింది. దిక్కుతోచని పరిస్థితుల్లో యశ్వంతాపూర్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ క్లాస్లో ప్రయత్నించగా బెర్త్ దొరికింది. తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకునే అవకాశం లేదు. ఒకసారి టికెట్ బుకింగ్ చేసుకుంటే చార్ట్ సిద్ధమయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ట్రైన్ బయలుదేరేందుకు 2 గంటల ముందు బెర్తు నిర్ధారణ అయితే పయనించాలి. లేదంటే చెల్లించిన చార్జీలపై ఆశలు వదులుకొని మరో ప్రయత్నం చేయాలి. ప్రసాద్ అలాగే థర్డ్ ఏసీ కోసం చెల్లించిన రూ.1000 పైన ఆశలు వదులుకొని మరో ట్రైన్లో స్లీపర్ క్లాసులో హైదరాబాద్ చేరుకున్నాడు. ఇది ఒక్క రాజశేఖర్,ప్రసాద్లకు ఎదురైన సమస్య కాదు. తత్కాల్ కోటాలో చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య. రెండు విధాలుగా నష్టం.... గతంలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తాము నిరీక్షించేందుకు నిరాకరించదలిస్తే వెంటనే రద్దు చేసుకునే సదుపాయం ఉండేది. దాంతో వారు మరో ప్రత్యమ్నాయం వెదుక్కొనేవాళ్లు. ఇప్పుడు అలా లేదు. తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టులో నమోదు చేసుకుంటే తిరిగి రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. చార్ట్ సిద్ధమయ్యే వరకు ఆగాల్సిందే. అప్పటికి నిర్ధారణ అయితే వెళ్లాలి. చార్ట్ ప్రిపేరైన తరువాత కూడా వెయిటింగ్ జాబితాలోనే ఉంటే మాత్రం ప్రయాణికుడి ఖాతాలోకి టికెట్ డబ్బులు తిరిగి జమ అవుతాయి. అయితే వెయిటింగ్ జాబితాలో ఉండి రద్దు చేసుకోకుండా మరో రైల్లోనో, బస్సులోనో వెళితే మాత్రం ప్రయాణికులు రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు బెర్తులు కన్ఫర్మ్లో ఉండి టికెట్ మాత్రం వెయిటింగ్లో లభించడం అంతుబట్టకుండా ఉంది. జూదంలా తత్కాల్... ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు అందుబాటులోకి వచ్చే తత్కాల్ సదుపాయం ప్రయాణికుల పాలిట జూదంలా మారింది. ఒక్కో ట్రైన్లో 20 నుంచి 40 శాతం వరకు తత్కాల్ కోటా కింద బెర్తులు కేటాయిస్తారు. సాధారణ బుకింగ్లో టికెట్ లభించని ప్రయాణికులు, అప్పటికప్పుడు బయలుదేరాలనుకొనే లక్షలాది మంది తత్కాల్ను ఆశ్రయిస్తారు. ఐఆర్సీటీసీలో తత్కాల్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు బుక్ అయిపోతాయి. ఎంతో డిమాండ్ ఉన్న తత్కాల్ కోటా ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తోంది. సాధారణంగా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ‘కన్ఫర్మ్’ అని లేదా ‘వెయిటింగ్’ అనే ఆప్షన్స్ ఆన్లైన్లో కనిపించాలి. కానీ ‘కన్ఫర్మ్’(నిర్ధారిత) బెర్తులుగానే ఆన్లైన్లో కనిపిస్తుంది. తీరా టికెట్ డబ్బులు చెల్లించిన తర్వాత ప్రయాణికుడికి ‘వెయిటింగ్ టికెట్’ డెలివరీ అవుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. నిర్ధారిత బెర్తులు బుక్ చేసుకుంటే వెయిటింగ్లో నమోదు కావడమేమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలా ఒకసారి వెయిటింగ్లో నమోదైన తరువాత రైలు బయల్దేరడానికి 2 గంటల ముందు వరకు ఎలాంటి పరిస్థితి తెలియదు. -
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం వల్ల 45 మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఉదయం వరకు ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు.. ఆదిత్య ట్రావెల్స్లో బెంగళూరు వెళ్లేందుకు 45 మంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, అర్ధరాత్రి నుంచి మెహిదిపట్నంలోని ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 52 వద్ద ప్రయాణికులు ట్రావెల్స్ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. రాత్రి నుంచి రోడ్డుపైనే ఉండాల్సి రావడంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. -
రూ.300 టికెట్ల కరెంట్ బుకింగ్ రద్దు లేదు
సాక్షి, తిరుమల: తిరుమలలో రూ.300 టికెట్ల కరెంట్ బుకింగ్ను ఇప్పట్లోనే రద్దుచేసే యోచన లేదని జేఈవో కే ఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్ విధానంలో రూ.300 టికెట్లు పొందిన భక్తులు దర్శనానికి వెళ్లే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కరెంట్ బుకింగ్లో టికెట్లు అమ్మబోమన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆన్లైన్, ఈ-దర్శన్ రూ.300 టికెట్ల పనితీరు సజావుగా సాగుతోందన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత మాత్రమే కొత్త విధానం అమలులో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని జేఈవో చెప్పారు. శ్రీనివాసరాజు వెల్లడించిన మరికొన్ని అంశాలివీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పర్యాటక సంస్థలకు రూ.300 టికెట్లు ఇచ్చే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బేడి ఆంజనేయ స్వామికి కూడా హారతి సమర్పించే పురాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. తిరుపతి పరకామణిలో మొత్తం 40 టన్నుల విదేశీ నాణేల్లో అమెరికా, మలేసియాకు చెందిన నాణేలను వేరు చేశారు. వీటిని ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధుల ద్వారా విక్రయించనున్నారు. తిరుమలలో సరిపడా నీటి నిల్వలు ఉన్నందున బ్రహ్మోత్సవాల్లో ఇబ్బంది ఉండదని జేఈవో తెలిపారు. కాగా, టీటీడీపై జేఈవో శ్రీనివాసరాజు ఏపీ శాసనసభ స్పీకర్కు నేడు నివేదిక అందించనున్నారు. -
శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన
టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ పోస్టాఫీసుల ద్వారా దర్శన టికెట్ల బుకింగ్ వృద్ధులకు స్వామి కనిపించేలా బైనాక్యులర్ సదుపాయం మూడు క్యూల విధానం వందశాతం సక్సెస్ సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులు తిరుమలలోని క్యూల వద్ద, కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా తగిన సమయం ప్రకారం వచ్చి స్వామిని దర్శించుకునేలా టైం స్లాట్ విధానం అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నకు, అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత రూ.300 టికెట్ల దర్శనంలో కొత్త విధానం అమలు చేస్తామని, తర్వాత దశలో కాలినడక, సర్వదర్శనం, ఇతర దర్శనాలకు అమలు చేస్తామని చెప్పారు. టైం స్లాట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, ఇంటర్నెట్, ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే విధానంపై యోచన చేస్తున్నామని ఈవో వెల్లడించారు. దేశంలోని పోస్టాఫీసుల సేవలను వినియోగించుకోవడం వల్ల దర్శన టికెట్ల కోసం ప్రత్యేకంగా టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్లను నిర్వహించాల్సిన అవసరం ఉండదని ఈవో గుర్తు చేశారు. భక్తులకు సంతృప్తికంగా దర్శనం కల్పించేందుకు ఆలయంలో కొత్తగా అమలు చేస్తున్న మూడు క్యూల విధానం వందశాతం సక్సెస్ అయ్యిందని ఈవో ఆనందం వ్యక్తం చేశారు. ఇక మహాలఘు దర్శనమే : ఈవో స్పష్టీకరణ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో మహాలఘు దర్శనం(70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకునే అవకాశం) అమలు చేయాల్సి ఉంటుందని ఈవో గిరిధర్ గోపాల్ భక్తులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గతంలో అప్పటి పరిస్థితులు, రద్దీకి అనుగుణంగా కులశేఖరపడి, లఘుదర్శనం అమలు చేసినా ప్రస్తుతం అది సాధ్యం కాదన్నారు. దగ్గరగా వెళ్లి తోపులాటలో దర్శించుకోవటం కన్నా... కాస్త దూరమైనా ప్రశాంతంగా ఎలాంటి తోపులాటలు లేకుండా కనీసం రెండు సెకన్ల సమయం స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించామని ఈవో గుర్తు చేశారు. ఇక మహాలఘు దర్శనమే అమలు చేస్తామని, ఈ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. వృద్ధులకు బైనాక్యులర్స్ మహాలఘుదర్శనంలో సుమారు 70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకోవాల్సి ఉండటంతో వృద్ధులకు బైనాక్యులర్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈవో అన్నారు. దూరం కావడం వల్ల స్వామిని దర్శించుకోలేకపోతున్నామన్న ఓ భక్తుడి విన్నపంతో ఈవో పైవిధంగా బదులిచ్చారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు విడత ల్లో అమలు చేసే వృద్ధుల దర్శనంలో ఒకటి రెండు సెకన్లు ఆలస్యమైనా ఆలయంలో ప్రత్యేకంగా బైనాక్యులర్ అద్దాలు ఇస్తామని చెప్పారు. -
టికెట్తో పాటే మెనూ
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రవేశపెట్టిన ‘డిన్నర్ ఆన్ బోర్డ్’ను మరిన్ని బస్సులకు విస్తరించనున్నారు. అలాగే రైల్వే తరహాలో టికెట్ బుకింగ్తో పాటే తమకు కావలసిన ఆహార పదార్థాలను కూడా బుక్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. గత నెలలో ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడంతో మరింత సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టికెట్ బుకింగ్ సమయంలోనే మెనూ కూడా బుక్ చేసుకొనేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వరరావు ‘సాక్షి’తో చెప్పారు. దీంతో భోజనం కోసం మరోసారి ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. రైల్వేలో బుకింగ్ సమయంలోనే ప్రయాణికులు వెజ్/నాన్వెజ్ అనే కాలమ్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. అయితే, ఆర్టీసీ ప్రయాణికులు తమకు ఇష్టమైన బిర్యానీ, పెరుగన్నం, రోటీ, స్వీట్లు, తదితర ఆహార పదార్థాలలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకొనేలా మెనూలోని పదార్థాలన్నింటినీ విడివిడిగా రాసి ఉంచుతారు. కాగా ఈ పథకాన్ని మరిన్ని బస్సులకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.