undavalli arunkumar
-
కాలయాపన సరికాదు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. విచారణ 18 సార్లు వాయిదా సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది. జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది. -
వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని.. అందులో ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకున్నా.. పెన్డ్రైవ్లో ఇచ్చినా అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. అఫిడవిట్ను పరిశీలించి వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఇంటిపేర్లు, అడ్రస్లు లేకుండానే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ వర్చువల్గా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు.. ఇంటిపేర్లు ఉన్నా.. వారి అడ్రస్లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్లు చూపించారు.చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో.. ఇవ్వలేదో సరిగా వివరాల్లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకు పైగా కట్టారు. ఆయన అడ్రస్కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసును బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు. ‘చందాల వసూలు అంతా అక్రమమేనని ఆర్బీఐ తేల్చిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచురించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరారు. అనంతరం అరుణ్కుమార్ పేరు కాజ్లిస్ట్లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్ను పరిశీలించి సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది. -
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'
కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం.. – సుప్రీం కోర్టు సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాధన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్కు, ఈ తాజా క్వాష్ పిటిషన్కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్ క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. రూ.5 వేలు డిపాజిట్దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..? ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్తో కలిపి ఇంత మొత్తం అయింది. ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...! అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్ స్టేట్ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు. అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు... మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి... తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్బీఐ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే.. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్లో హెచ్యూఎఫ్ విషయంలో వచ్చిన తప్పును సవాల్ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి... ‘‘పిటిషన్ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్కుమార్ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్ పర్సన్గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆర్బీఐ, ఉండవల్లి అరుణ్కుమార్, రామోజీరావు, అన్క్లయిమ్ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేం... కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్కుమార్ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు.. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్ (స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. -
‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి అరుణ్కుమార్ పిల్
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిందించిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కిల్ డెపలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్ వేశారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూప్లోని ఇతర సంస్థలకు మళ్లించారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. -
మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన సవాల్కు తాను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మార్గదర్శి అక్రమాలపై పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మార్గదర్శి అక్రమాలను వెనకేసుకొస్తూ చర్చకు సవాల్ విసురుతున్నారని చెప్పారు. తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ చర్చ రామోజీరావు సమక్షంలో రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం చంద్రబాబు ద్వారా జీవీ రెడ్డి ప్రయత్నించాలని సూచించారు. తద్వారా దీనికి జాతీయ స్థాయిలో విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ చర్చలో రామోజీ పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫర్వాలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అవకాశం లేని పక్షంలో.. టీడీపీ ప్రధాన కార్యాలయంలోనైనా ఏర్పాటు చేయాలన్నారు. జనసేన కూడా మార్గదర్శికే అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 14న మార్గదర్శి అక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. -
అందరికీ నీతులు చెప్పే రామోజీ ఎప్పుడో ఈ పని చేయాలి?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ పోరాట యోధుడు. పట్టు వీడకుండా దేశంలోనే అతికొద్ది మంది అత్యంత శక్తివంతులలో ఒకరైన ఈనాడు అధినేత రామోజీరావుపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఎలాగైతే కొంతమేర సాదించగలిగారు. మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో గతంలో రామోజీ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. అది ఆర్బీఐ చట్టంలోని 45 ఎస్ ప్రకారం నేరం. అలా చేసినవారికి జైలు శిక్షతో పాటు, రెట్టింపు జరిమానా విధించాలని నిబందన చెబుతోంది. రామోజీరావు హెచ్యుఎఫ్ పేరుతోనో ,ప్రొప్రైటర్ షిప్ పేరుతోనే 2600 కోట్ల డిపాజిట్లు సెకరించారు. దీనిపై ఎప్పుడో 2007లో ఉండవల్లి కేసు వేశారు. ఇలా డిపాజిట్లు వసూలు చేసి ఇతర చోట్ల పెట్టుబడితే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఈ వ్యవహారాలపై విచారణ జరిపించింది. తత్ఫలితంగా రామోజీ 2600 కోట్లను చెల్లించేసినట్లు ప్రకటించారు. మంచిదే. అయితే అసలు నేరం చేశారా?లేదా అన్న సమస్య అలాగే ఉంది. ఎవరైనా దొంగతనం చేసి, ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తే నేరం కాకుండా పోతుందా?అలాగే రామోజీ చట్టాన్ని పాటించకుండా డిపాజిట్లు సేకరించారా?లేదా? ఆ డిపాజిట్లు ఎవరెవరినుంచి సేకరించారు? వారి వివరాలు ఏమిటో చెప్పాలన్నది ఉండవల్లి డిమాండ్. దీనిపై రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారట. డిపాజిటర్ల వివరాలు ఇస్తే వైఎస్ ప్రభుత్వం కక్ష కడుతుందని అప్పట్లో వాదించారట. ఇంతలో రాష్ట్ర విభజన జరిగింది. తదుపరి హైకోర్టు కూడా కూడా విభజన జరిగి ఏపీకి మారే ముందు రోజున ఎందువల్లో హైకోర్టులో రామోజీ డిపాజిట్ల సేకరణ కేసు కొట్టేశారట. దానిని కనీసం ఉండవల్లికి చెప్పలేదట. ఎలాగో కొంతకాలానికి ఆ సమాచారం అందుకున్న ఉండవల్లి మళ్లీ తన పోరాటం కొనసాగించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ దానిని అనుమతించడం రామోజీకి ఇబ్బందిగా మారింది. ఈ మధ్య లో రామోజీ కోర్టులో ఉండవల్లిపై పరువు నష్టం దావా వేశారట. ఆ దావా గురించి అయినా ఉండవల్లి ఈ కేసు సంగతి తేల్చవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అన్నిటిని కూలంకశంగా అధ్యయనం చేసే ఆయన తన పట్టు బిగించారు. డిల్లీలో తనకు తెలిసిన ఒక లాయర్ను వినియోగించడమే కాకుండా, అవసరమైతే తానే స్వయంగా హాజరు కావడం వంటివి చేస్తూ వస్తున్నారు. అలా పదహారేళ్ల క్రితం మొదలైన ఈ కేసు ఇప్పటికి ఒక దశకు చేరిందని అనుకోవాలి. ఇంతకాలం తనకు ఎదురు లేకుండా సాగుతున్న రామోజీకి సడన్ గా ఒక ఎదురు దెబ్బ తగిలినట్లయింది. తను సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్ దారుల వివరాలు, వాటిని వసూలు చేసిన తీరు మొదలైన వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి అందరికి నీతులు చెప్పే రామోజీ ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది. 2007లో డిపాజిట్ల వసూలుపై కేసు వచ్చినా, మరో రూపంలో మళ్లీ డిపాజిట్లు వసూలు చేస్తున్నారని ఇటీవల ఏపీ సీఐడీ అభియోగం మోపింది. అంతేకాదు. సుమారు 600 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి మార్గదర్శిని మార్గంగా ఎంచుకున్నారని సీఐడీ కనిపిట్టినట్లు వార్తలు వస్తున్నాయి.బహుశా ఈ నేపద్యంలోనే అది బయటపడరాదనే కావచ్చు.. మార్గదర్శి చిట్ ఫండ్ రికార్డులను ఇవ్వడానికి కూడా రామోజీ ఇష్టపడడం లేదు. పారదర్శకత గురించి సుద్దులు చెప్పే ఆయన తన వద్దకు వచ్చేసరికి అంతా రహస్యం అని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇందులో రహస్యం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు ఆయన డిపాజిట్ దారుల వివరాలు ఎలా ఇస్తారన్నది ఆసక్తికరమైన విషయంగా ఉంది. ఆ వివరాలు ఇవ్వకుండా రామోజీ ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారేమో చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టులో మాత్రం ఆ వివరాలు ఇస్తామని చెప్పారు. అలా చేస్తే మంచిదే. ఈ సందర్భంలో ఉండవల్లి ఒక మాట చెబుతున్నారు. రామోజీని జైలులో పెట్టాలని ,శిక్షలు వేయాలని కోరుకోవడం లేదని, కాని చట్టం రామోజీకి వర్తిస్తుందా?లేదా? ఆయన తప్పు చేశారా?లేదా? డిపాజిట్ దారుల నుంచి డబ్బు చెక్ల రూపంలో తీసుకున్నారా?లేక వేరే రూపాలలో తీసుకున్నారా?ఇలాంటి విషయాలు బయటకు రావాలన్నది తన కోరిక అని అన్నారు. ఇందులో తప్పు తేలితే రామోజీకి ఒక రూపాయి ఫైన్ వేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఇక ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తన వాదనపై అఫిడవిట్ వేయవలసి ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని రామోజీ మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఏపీలో మాత్రం ఆయన పప్పులు ఉడకడం లేదు. చిట్ ఫండ్ డబ్బు మొదలు, పరోక్షంగా రశీదుల రూపంలో డిపాజిట్ల సేకరణ తదితర అవకతవకలపై సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఉండవల్లి చేస్తున్న డిమాండ్ , ఆయన పోరాటంలో హేతుబద్దత కనిపిస్తుంది. ఆయన ఏదో ద్వేషంతో చేయడం లేదు. ఒక కాజ్ గురించి ,రాజ్యాంగం రామోజీకి వర్తిస్తాయా?లేదా? అన్నది తేల్చుకోవడం కోసం ఇంతకాలంగా పోరాడుతున్నారు. వచ్చే నెలల్లో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో కాని, ఇప్పటికైతే రామోజీపై ఉండవల్లి ఎంతో కొంత పైచేయి సాధించగలిగారని చెప్పాలి. .రామోజీరావు కూడా రాజ్యాంగానికి అతీతుడు కాడని కొంతవరకైనా ఉండవల్లి అరుణకుమార్ రుజువు చేయగలిగారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శికి సుప్రీంకోర్టు ప్రశ్న
ఒక చోట ప్రొప్రయిటర్ అన్నారు... మరొక చోట హెచ్యుఎఫ్ అన్నారు. అలా చెప్పటం చట్ట విరుద్ధం కదా? డిపాజిటర్లకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా?. లేకుంటే వాటి వివరాలు బహిర్గతం చేయొచ్చు కదా?.. కోర్టుకు అన్ని వివరాలూ అందజేయండి. – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా అని మార్గదర్శి ఫైనాన్షియర్స్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేని పక్షంలో ఆయా వివరాలు పూర్తిగా కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉందని, రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం వాయిదా కోరుతూ లెటర్ను సర్క్యులేట్ చేయగా.. దానిపై మార్గదర్శి అభ్యంతరం చెప్పింది. అభ్యంతరాలతో కూడిన లెటర్ను సోమవారం రాత్రే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సర్క్యులేట్ చేసింది. దీన్ని గుర్తుచేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. వాదనలు వినిపించారు. ఈ దశలో జస్టిస్ జేబీ పార్డీవాలా జోక్యం చేసుకుని.. ‘‘కొన్నిసార్లు వాదించినప్పుడు ప్రొప్రయిటరీ అంటున్నారు. మరికొన్ని వాదనల్లో హెచ్యుఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబం) అని పేర్కొంటున్నారు. ఇది సమస్యాత్మకం కదా? అని ప్రశ్నించారు. తదుపరి విచారణ జరిగేటప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. హెచ్యూఎఫ్– ప్రొప్రయిటర్ రెండూ ఎలా కుదురుతాయి? హెచ్యుఎఫ్ అంటే వ్యక్తుల సమూహం (అసోసియేషన్ ఆఫ్ ఇన్డివిడ్యుయల్స్) కదా? మరి ప్రొప్రయిటరీ షిప్ను కూడా ఇందులో ఇండివిడ్యుయల్ కెపాసిటీలో చూపుతున్నారా? ఇలా చేయటం చట్ట విరుద్ధం కదా? అని జస్టిస్ పార్డీవాలా ప్రశ్నించారు. గత విచారణలో డిపాజిటర్లందరికీ సొమ్ములు వెనక్కి ఇచ్చేశాం అన్నారు కదా? అని కూడా లూత్రానుద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పార్టీ ఇన్ పర్సన్ ఉండవల్లి అరుణ్కుమార్, న్యాయవాది అల్లంకి రమేశ్లు జోక్యం చేసుకుంటూ... డిపాజిటర్లకు సొమ్ములు తిరిగి ఇచ్చేశాం అన్నారు కానీ, వివరాలు ఎక్కడా వెల్లడించలేదని గుర్తుచేశారు. ఇటు ప్రభుత్వానికి కానీ అటు కోర్టుకు గానీ వివరాలు చెప్పలేదన్నారు. ఆయా వివరాలు అందజేయాల్సిందిగా కోరాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆడిటర్ స్టేట్మెంట్ ప్రకారం తాము వివరాలు ఇచ్చామని లూత్రా తెలిపారు. ఈ దశలో ఉండవల్లి జోక్యం చేసుకుంటూ వారిని వివరాలు అందజేయాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. దీంతో... వివరాలు వెల్లడించడంలో ఏమైనా సీక్రెట్ (రహస్య) దాగుందా? అని లూత్రాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇందులో రహస్యం ఏమీ లేదని లూత్రా చెప్పగా... అయితే, కోర్టులో ఫైల్ చేయాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. ఈ దశలో మార్గదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకొని హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎవౖరెనా వివరాలు కావాలని ముందుకొస్తే అందజేస్తామనిన్నారు. జస్టిస్ సూర్యకాంత్ కల్పించుకుని ‘‘డిపాజిట్లు తిరిగి ఎవరెవరికి ఇచ్చారు? ఎంతెంత ఇచ్చారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని లూత్రా, సింఘ్విలనుద్దేశించి అన్నారు. ‘‘2007 మార్చి చివరి నాటికి డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ.2541 కోట్లు. తిరిగి వెనక్కి ఇచ్చింది రూ.2596 కోట్లు.. తదనంతరం ఖాతాలో బ్యాలెన్స్ రూ.5.43 కోట్లు’’ అని ఆడిటర్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని లూత్రా కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణ సమయానికి ఎవరెవరికి ఎంతెంత చెల్లించారనే వివరాలు సమగ్రంగా కోర్టుకు అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. ఇదీ.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కథ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థకు జనం నుంచి డిపాజిట్లు సేకరించేందుకు అనుమతి లేదు. అయినా సరే... హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన సంస్థగా పేర్కొంటూ జనం నుంచి డిపాజిట్లు సేకరించి వారికి బాండ్లు జారీ చేశారు. ఆ బాండ్లపై హెచ్యూఎఫ్ కర్తగా రామోజీరావు సంతకం చేశారు. కానీ ఆ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాల్సి వచ్చినపుడు ఆ చెక్కులపై ప్రొప్రయిటర్ హోదాలో రామోజీరావు సంతకాలు చేశారు. ఇదంతా ఎందుకంటే 1934 నాటి రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్ 45(ఎస్) ప్రకారం... వ్యక్తులెవరూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకుండా నిషేధించారు. దీన్ని తప్పించుకోవటానికి అక్రమంగా హెచ్యూఎఫ్ ముసుగులో రామోజీ డిపాజిట్లు సేకరించినట్లు అప్పట్లో నాటి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటానికి దిగారు. అక్రమాలన్నీ నిజమేనని తేలటంతో... రామోజీరావు డిపాజిట్లు సేకరించటం నిలిపేశారు. కేసు విచారణలో ఉండగానే... మార్గదర్శి ఫైనాన్షియర్స్ను మూసేశారు. అయితే అక్రమంగా డిపాజిట్లు సేకరించటం నేరం కనక... ఆ నేరాన్ని నిర్ధారించడానికి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. డిపాజిటర్ల వివరాలు ఎందుకు దాస్తున్నారు?: ఉండవల్లి ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై మార్గదర్శిలో తగిన యంత్రాంగం లేదని కూడా ఉండవల్లి కోర్టుకు తెలిపారు. రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్పై పలు కేసులు ఉన్నాయని, గూగుల్లో చూస్తే అన్నీ తెలుస్తాయని పేర్కొన్నారు. ‘‘డిపాజిటర్ల వివరాలు ఎందుకు దాస్తున్నారు? బయటకు వెల్లడించొచ్చు కదా!, ఆయా వివరాలపై అఫిడవిట్ దాఖలు చేయొచ్చు కదా!’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. గత విచారణ సమయంలో డిపాజిటర్ల వివరాలు రిజర్వు బ్యాంకుకు (ఆర్బీఐ) చెప్పాలని సుప్రీంకోర్టు సూచించగా.. ఆయా వివరాలు ఆర్బీఐకు అందజేశామని ఇక సమస్య ఏముందని లూత్రా చెప్పగా.... ఆర్బీఐ కూడా ఈ కేసులో పార్టీగా ఉందన్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. దీంతో వివరాలు వెల్లడించడానికి తమకేమీ ఇబ్బంది లేదని లూత్రా పేర్కొన్నారు. ‘‘రిజాయిండర్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం’’ అని జస్టిస్ సూర్యకాంత్ ఆర్డర్ చదువుతుండగా.. డిపాజిటర్ల వివరాలు వెల్లడించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఆదేశించాలని ఉండవల్లి ఇంకోసారి అభ్యర్థించారు. ‘‘డిపాజిటర్లకు చెల్లింపు వివరాలు అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ను, రామోజీరావును ఆదేశిస్తున్నాం’’ అని జస్టిస్ సూర్యకాంత్ ఉత్తర్వులు చదువుతూ చెప్పారు. తదుపరి విచారణ జూలైలో చేపడతామని ధర్మాసనం పేర్కొంది. -
ఏప్రిల్ 11న రాష్ట్ర విభజన కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 11న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఉండవల్లి అరుణ్కుమార్ తన పిటిషన్లో అభ్యర్థనను మార్చారు. రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల వ్యవహారాలను త్వరగా తేల్చాలని, ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై గతేడాది నవంబరు 28న విచారణకు రాగా ఫిబ్రవరి 22న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల14న సుప్రీంకోర్టు ఓసర్క్యులర్ జారీ చేసింది. ఓసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని అందులో స్పష్టంచేసింది. దీంతో బుధవారంనాటి విచారణ జాబితా నుంచి ఈ కేసును రిజిస్ట్రీ తొలగించారు. దీంతో ఉండవల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్ మంగళవారం సాయంత్రం కోర్టు పనివేళల ముగింపు అనంతరం జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్ను కనీసం పది, పదిహేను రోజులు విచారించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో తన పదవీ విరమణ ఉందని జస్టిస్ జోసెఫ్ గుర్తుచేశారు. అన్ని రోజులు అవసరంలేదని రమేశ్ వివరించారు. దీంతో ఏప్రిల్ 11న విచారణ చేపడతామని, ఆ రోజు జాబితాలో చేర్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ ఆదేశాలు ఉంచింది. -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. వడ్డీతో సహా చెల్లిస్తాం: రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై టీపీసీసీ ఛీప్ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు ఎదుట రేవంత్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ ప్రత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారు. స్వాతంత్య్రం అనంతరం అప్పులతో పత్రిక మూతపడింది. దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్కు కాంగ్రెస్ ఊపిరిపోసి మళ్లీ ప్రారంభించింది. బీజేపీ దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళినా మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీలో మొదలైంది. అందుకే మూసేసిన కేసులో నోటీసులు ఇచ్చారు. ఇక, సాయంత్రం 5 గంటల వరకే విచారణ ముగించాల్సింది. కానీ, ఈడీ ఆఫీస్లో రాహుల్ గాంధీని 12గంటల పాటు కూర్చోబెట్టారు. ఇది ప్రధాని మోదీకి తగునా.. ఓ ఎంపీని, పార్టీ అధ్యక్షుడిని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాలి. తల్లి ఆసుపత్రిలో ఉండగా.. కొడుకును ఇలా విచారణ పేరుతో గంటల కొద్దీ కూర్చోపెట్టడం కరెక్టేనా. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంత బరితెగింపు మంచిది కాదు. భారత దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని దారపోయడానికి సిద్దమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. బీజేపీ నేతలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ఇంతా మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ నేతలు చెప్పినట్లు వింటే.. రేపు అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. 300సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. తక్షణమే కేసును ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ తీరు మారకుంటే.. ఈ నెల 23న ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసును తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారు. అనంతరం, ఉండవల్లి అరుణ్ కుమార్పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్తో ఉండవల్లి భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హనీట్రాప్లో ఉండవల్లి పడ్డారు. ఉండవల్లి.. సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేది. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో?. ఉండవల్లి.. కేసీఆర్ పంచన చేరి భజన చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లికి ఉన్న గౌరవం పోయింది. బీజేపీపై కేసీఆర్ పోరాడితే..కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడంలేదు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు. రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారు. రెండు పుస్తకాల్లో తెలంగాణ ఏర్పాటునే తప్పుబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ను విమర్శించారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలిసి పనిచేయమంటరా?. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్తో కలవద్దు. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే.. తెలంగాణ సమాజం ఊరుకోదు’’ అంటూ వ్యాఖ్యాలు చేశారు. ఇది కూడా చదవండి: బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసుల నోటీసులు -
ఏపీ విభజన కేసు విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమ కోహ్లిల ధర్మాసనం ముందు ఉండవల్లి అరుణ్కుమార్ న్యాయవాదులు ప్రశాంత్భూషణ్, రమేశ్ అల్లంకి ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2014లో ఏపీ విభజన పూర్తికాలేదని, విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్కుమార్, మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు తెలిపారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రతివాదులకు నోటీసులు జారీచేశారని, కానీ ఆ పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ జరగలేదని చెప్పారు. 2019లో ఉండవల్లి ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేసినా ఇప్పటివరకు జాబితాలోకి రాలేదని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తమ ప్రేయర్ను సవరిస్తూ పిటిషన్ వేశామన్నారు. 2014లో ఏపీ విభజన జరిగింది.. తప్పోఒప్పో ఏపీ విభజన జరిగిపోయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని కోరామన్నారు. అదే సమయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆర్థికంగా సాయం చేయాలని సవరణ పిటిషన్ వేసినట్లు వివరించారు. తక్షణమే విచారించాలని తాము కోరడం లేదని, ఏదో ఒకరోజు తేదీని నిర్ణయించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సవరణ పిటిషన్ విచారణకు తేదీ కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. -
ఆంధ్ర విలన్ అంటేనే కేసీఆర్ తనకు మంచిదని నమ్ముతున్నారు : ఉండవల్లి
-
సీఎం జగన్ వ్యక్తి కాదు.. వ్యవస్థ
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలు విచారకరమని, ముఖ్యమంత్రి కేసులకు భయపడే వ్యక్తి కాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాను ఒకప్పుడు ఆయన ఎదుర్కొన్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం. సీఎం జగన్ను ఉండవల్లి నువ్వు అని సంబోధించడం సరికాదు. ( 'చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు' ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. మీకు చెప్పే స్థాయి కాదు.. మీ పై ఉన్న గౌరవంతో మాత్రమే మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పాలన చేయాల్సి ఉంది. తెలంగాణ, ఢిల్లీలో ఉన్న పరిస్థితి వేరు. వారికి బీజేపీయే ప్రత్యర్థి. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంత వాసులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ త్వరితగతిన పూర్తి చేసి పోలవరం విషయంలో ముందుకు వెళ్తా’’ మన్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి? : శివరామ సుబ్రమణ్యం ‘‘సీఎం జగన్ ప్రభుత్వంపై, చేపడుతున్న కార్యక్రమాలపై అవాకులు, చవాకులు విసురుతున్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి?. ప్రజలను గందరగోళ పరచడానికి ప్రయత్నిస్తున్నారా?. వైఎస్సార్ హయాంలో కేంద్రం నిధులు రాకపోయినా కాలువ పనులు పూర్తి చేయలేదా?. టీడీపీ హయాంలో టెండర్లలో అవకతవకలు జరిగాయి కదా!. సీఎం జగన్ కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతున్నాం. సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి విజయం సాధించారు. ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తిని కేంద్రంతో లాలూచీపడున్నాడనడం సరికాదు. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంలా చూడమంటారా?. రాష్ట్రంలో మరో మూడు దశాబ్దాల వరకు బీజేపీకి మనుగడ ఉండదు. గతంలో అరుణ్ జైట్లీ, చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని చెప్పింది మీరు కాదా?. చంద్రబాబును కలిశాక మీరు ఏం మాట్లాడుకున్నారు.. మీ మాటల్లో మీకు క్లారిటీ ఉందా? ఎవరు మీతో మాట్లాడిస్తున్నారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
చంద్రబాబు పోలవరాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టాడు
-
ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం సరైందే
-
‘ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పేమీ లేదు’
సాక్షి, తూర్పుగోదావరి: ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు. ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని లోక్సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తాలని సీఎం జగన్కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి దానవైపేట ప్రకాష్ నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ‘కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్’ గా వ్యవహరిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. -
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
-
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచించిన ‘వైయస్సార్ ఛాయలో’ అనే పుస్తక ఆవిష్కరణ వేడుక అమీర్పేటలోని ఆదిత్యపార్క్లో జరిగింది. ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
అట్లాంటాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
జార్జియా: అట్లాంటాలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బిరియానీ పాట్ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి. సుమారు వందమందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ చిరకాల మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తన అనుభవాలను కొన్నింటిని అక్కడి ప్రవాసాంధ్రులతో పంచుకున్నారు. వంద రోజుల పాటు తాను రాజకీయాలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నందున, వాటి గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వారితో తన అనుబంధాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడతానంటూ ప్రసంగాన్ని ప్రారంభిచారు. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం ఒక పార్టీ అధినేతకు, కార్యకర్తకు ఉన్న సంబంధం మాత్రమేనని అయితే ఆయనకు నాలో కొన్ని అంశాలు నచ్చటం వలన తనను అభిమానించి ఎంపీని చేశారన్నారు. పార్టీలకతీతంగా అందరి హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ అని తెలిపారు. ఆయన మరణవార్తను విని తట్టుకోలేక గుండె ఆగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అలా ప్రాణాలు కోల్పోయిన ఒక కుటుంబం గురించి సవివరంగా చెప్పారు. ఆయన ప్రసంగం విన్నవారందరికీ ఒక్కమారు కన్ను చెమర్చిన మాట వాస్తవం. చివరగా అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఒకమాట చెప్పమని అడిగారు. దీనికి ఉండవల్లి స్పందిస్తూ జగన్ కేవలం మంచి పరిపాలన అందిస్తే సరిపోదు. తన తండ్రి ఇచ్చినటువంటి అద్భుతమైన పాలనను మరిపించగలిగేలా, గొప్పగా పాలన అందించాలి. అది అతని ముందున్న సవాలు. ప్రస్తుత ప్రభుత్వం వేసే అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. తన ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడనే భావిస్తున్నాను. ఎప్పుడూ ఏ సభలకు హాజరవ్వని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకసారి వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు విశాఖపట్నం సభకు రావడం, ఆ సభలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలుపరుస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి నేతల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ అభినందించడాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ అందరి మనసుల్లో ఉన్నారంటే అందుకు ఆయన చేసిన మంచి పనులే కారణమని కొనిడియారారు. విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమాలు మాతృదేశ అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అట్లాంటా వైఎస్ఆర్సీపీ విభాగాన్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం
-
‘అదే జరిగితే రాజమండ్రి మొత్తం కొట్టుకుపోతుంది ’
సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని.. ఇండియా-పాకిస్తాన్లా ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఒక దేశ ప్రధాని ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఐదేళ్ల తర్వాత రాజకీయ బెనిఫిట్స్ కోసమే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రకటనలు చేయ్యొద్దని కోరారు. మంగళవారం ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి ప్రస్తుత రాజకీయ అంశాలు, రాష్ట్ర పరిస్థితులతో పాటు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ఏపీలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని ఆరోపించారు. పోలవరం వద్ద భూమి కుంగిపోతుందని, ఇది మాములు విషయం కాదని, సరిగ్గా కట్టకపోతే రాజమండ్రి మునిగిపోతుందని హెచ్చరించారు. నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే. ఒక ప్రధాని అలా అనడం సరికాదు రాష్ట్ర విభజన మీద చర్చ పెట్టండని మొదటి నుంచి మాట్లాడుతున్నా.ఇండియా - పాకిస్తాన్ లాగా ఆంధ్రా - తెలంగాణాని మార్చారని మోడీ ఆరోపించారు.. ఏపీ-తెలంగాణ ప్రజలు ఇక్కడ స్నేహపూర్వకంగానే ఉన్నారు. ఒక దేశ ప్రధాని దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరైనది కాదు. ఇకనైనా..కొత్తగా ఎన్నికైయ్యే అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు విభజన జరిగిన తీరు మీద మరోసారి చర్చ జరిగేలా చూడండి. తద్వారా మనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు, ఆ సమస్య ఎలా తీరుతుంది అనేది తెలుస్తుంది. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం పోలవరం పూర్తైతే 80% భూమికి నీరు అందుతుంది. పోలవరం విషయంలో మీరు వెళ్తున్న దారి సరికాదని ముందు నుంచే చెబుతూ వచ్చాను.రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజలను తీసుకెళ్లారు. నేను స్వయంగా వస్తా అంటే ఎవరూ స్పందించలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తా. ఇరిగేషన్ మంత్రి జూన్లో నీళ్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. మీరు వచ్చే ఏడాది తర్వాత అయిన నీళ్లు ఎలా ఇస్తారో చెప్పండి. లెప్ట్ కెనాల్ పనులు అయ్యాయి, రైడ్ కెనాల్ పనులు పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రి కొట్డుకుపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడుచుకుపొతాయి. ఎన్నికలు అయిపోయాయి, ఎన్ని వేషాలు వేసిన ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎన్నికలు రావాలంటే ఐదేళ్లు పడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి. పోలవరం విషయం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని అక్కడి అధికారులే నాకు చెబుతున్నారు. కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది? ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేసారా? ముంపు ప్రజలకు 30 వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమే. పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబుకు లేదు. వీరి గొడవ ఏంటో అర్థం కావడంలేదు సీఎస్ వర్సెస్ సీఎం వీరి గొడవ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వైఎస్సార్ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టారు.ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్డు వెళ్లారు. కోర్టు మొట్డికాయలు వేస్తే ఎల్వీకి బాధ్యతలు ఇచ్చారు. అసలు చంద్రబాబుకు సుబ్రమణ్యంతో గొడవ ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు మీరు మోడీని లేదా జగన్ను, ఇతర నేతలను విమర్శించండి. సీఎస్ను ఎందుకు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయలని తపన పడ్డారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నారు. బాబు..కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీవీ ప్యాడ్ల స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నారు. అసలు ఓటేసి తర్వాత మీడియా ముందుకొచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా నా ఓటు నాకే పడిందో లేదో తెలియ తెలియదు అనడం సరైనది కాదు. చంద్రబాబు ఇరిటేషన్కి గురవుతున్నారు. కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి చంద్రబాబు. మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుంది. వచ్చే సారి అధికారంలోకి వస్తుంది. ఎందుకు రిజల్ట్ రాకుండా ఆవేశపడుతున్నారో అర్థం కావలేదు. యూపిఏ హయంలలోనే ఈవీఎంలు ప్రారంభమైయ్యాయి.గతంలో ఓడిపోయారు, లాస్ట్ టైం అవే ఈవిఎంలతో గెలిచారు.ఇప్పుడు వాటితోనే ఎన్నికలకు వెళ్తే ఎందుకు అంత ఇదవుతున్నారు? ప్రతి నియోజకవర్గంలో ఐదు స్లిప్పులు లెక్కిస్తారు. అందులో తేడా వస్తే అప్పుడు తప్పుపట్టాలి. ఏమీ లేకుండా వివాద వివాదం క్రియేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. -
ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం దిగజారుస్తోంది
-
విభజన తీరుపై చర్చకు 29న అఖిలపక్ష భేటీ
సాక్షి, విజయవాడ: లోక్సభ, అసెంబ్లీల గడువు ముగుస్తున్నా, అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన తీరును మాత్రం ఇప్పటికీ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ప్రశ్నించలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రానున్న ప్రభుత్వాలైనా చర్చించాలని కోరుతూ.. ఈ నెల 29న విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నిపార్టీల అధ్యక్షులకు లేఖలు పంపినట్టు ఉండవల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు చెప్పారు. -
15 శాతం నకిలీ ఓట్లు.. ఇంక ఆ పార్టీల ప్రచారమెందుకు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లుంటే.. అందులో 52 లక్షల 67 వేల 636 బోగస్ ఓట్లు ఉండడం దారుణమని విజయవాడ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో కేవలం 0.5శాతం ఓట్లతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందని, అలాంటిది ఇప్పుడు 15 శాతం నకిలీ ఓట్లు ఉంటే ఇక మిగిలిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాలెందుకు చేసుకోవాలని ఆయన మండిపడ్డారు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా.. దొంగ ఓట్లను పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం సరికాదని హితువు పలికారు. ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల దొంగ ఓట్లను రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ఓట్లు లేని వారు కూడా ఓటు వేస్తుండడం సిగ్గుచేటు. జనచైతన్య వేదిక సర్వే ద్వారా జిల్లాల వారీగా బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల అధికారికి పంపించడంతోపాటు కోర్టులో పిల్ వేశామని ఉండవల్లి అన్నారు. కంప్యూటర్లు లేని యుగంలో అంటే చనిపోయిన, ఇళ్ళు మారిన వారి సమాచారం సరిగా ఉండేది కాదని, కానీ కంప్యూటర్, ఆన్లైన్ యుగంలో కూడా ఇలా జరగడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సిధాంతాల్లేవ్.. విలువల్లేవ్!
-
చల్లవారిగూడెంలో మాజీ ఎంపీ ఉండవల్లి పర్యటన
-
చంద్రబాబు ఏది చెబితే కోడెల అదే చేస్తారు : ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఉన్నత స్థానంలోకి వెళ్లినపుడు నాయకులు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని, ఆంధ్ర ప్రదేశ్లో అలా జరగడంలేదన్నారు. వ్యవస్థలపై ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విధానాలు కాకుండా, సొంత ఎజెండాలను ముందుకు తీసుకువెళుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తి అయ్యిందని చెబుతూనే మే నెలలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. పోలవరం పనులు ఎప్పుడెప్పుడు ఎలా జరిగాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సీపాల్టీల్లో 8 శాతం వడ్డీకి కమర్షియల్ బ్యాంకుల నుంచి 12,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు జీవో విడుదల చేశారని, అయితే ఆఖరి 4 నెలల్లో ఎందుకు అప్పులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందని మండిపడ్డారు. పోలవరానికి ప్రభుత్వం తరుపున బాధ్యత కలిగిన వ్యక్తిని పంపించాలన్నారు. తాను చేసిన ఆరోపణలు తప్పయితే తప్పుని ఒప్పుకుంటానన్నారు. -
సుప్రీం ముందుకు మార్గదర్శి కేసు
సాక్షి, న్యూఢిల్లీ : మార్గదర్శి చిట్ఫండ్స్ డిపాజిట్ల సేకరణ కేసు వ్యవహారం మరోసారి సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోందని గతంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మార్గదర్శి యాజమాన్యం స్టే తెచ్చుకుంది. దిగువ కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకున్న మార్గదర్శి విచారణ జరగకుండా వ్యవహరించింది. అయితే ముఖ్యమైన కేసులు ఏమైనా ఆరు నెలలకు మించి స్టే ఉండకూడదన్న సర్వోన్నత న్యాయస్ధాన తీర్పుకు అనుగుణంగా మరోసారి ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. మరోసారి స్టే పొడిగించాలన్న సంస్థ అభ్యర్థనను సుప్రీం కోర్టు నిరాకరించడంతో మార్గదర్శికి చుక్కెదురైంది. కాగా ఇదే వ్యవహారంపై అభిప్రాయం కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్కుమార్కు సుప్రీం నోటీసులు పంపింది. -
నా వాదన తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి బాండ్లు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఇళ్ల నిర్మాణాలు, రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు తదితర అంశాలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరోసారి సవాల్ విసిరారు. తన వాదన తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెబుతానని పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే.. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వండి... - అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల అప్పుకు 10.36 శాతం వడ్డీ ఎలా ఇస్తారు? ఆరు నెలల ముందు 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోకూడదని మీరే జీవో నంబర్ 68 జారీ చేశారు. మరి 10.36 శాతం వడ్డీకి ఎలా రుణం తీసుకుంటారు. అమరావతి బాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అధిక వడ్డీకి బాండ్లు జారీ చేసే కన్నా బ్యాంక్ ఇచ్చే వడ్డీకి పావలా అధికంగా ఇచ్చినా రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తారు కదా. అధిక వడ్డీకి అప్పులు చేయడమే కాకుండా బీఎస్ఈలో గంట కొట్టేందుకు రూ.1.8 కోట్లు ఖర్చు చేస్తారా? - పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారని గతంలోనే చెప్పా. ఇప్పుడు అదే విషయంపై గొడవ జరుగుతోంది. పనులు లేకుండానే, ఎం బుక్స్లో రాయకుండానే బిల్లులు చేసుకున్నారు. - పట్టిసీమ ప్రాజెక్టులో 22% అదనపు చెల్లింపులు ఎలా చేస్తారు? వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి హయాంలో అదనపు చెల్లింపులు 5 శాతం కన్నా ఎక్కువ చేయలేదు. ఎత్తిపోతల పథకాల్లో చెల్లింపులపై చర్చించేందుకు సిద్ధమా? - పేదలకు అపార్ట్మెంట్లలో నిర్మించి ఇచ్చే ఇళ్ల చదరపు గజం ధర రూ.2,939ని మంత్రి నారాయణ చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరేమో చదరపు గజానికి రూ.1,500తో హై క్లాస్లో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మరి పేదలకు ఇచ్చే ప్లాట్లకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తున్నారో చెప్పండి. - విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి. - మీరు ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై చర్చిద్దాం రండి. వైఎస్ ఎక్కడ అవినీతి చేశారో చూపించండి. అప్పు కోసం ప్రత్యేక విమానాల్లో వెళతారా? అప్పు కోసం ఆడీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో వెళతారా? అలా వెళితే ఎవరైనా అప్పిస్తారా? సీఆర్డీఏను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థగా కాదు, కంపెనీగా పేరు మార్చుకోండి. కుటుంబరావు చెప్పినట్లు మార్గదర్శిలో తప్పులేకపోతే డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చారు? కోర్టులో ఉన్న మార్గదర్శి కేసును మళ్లీ కదిలిస్తా. 30 ఏళ్లలో హెరిటేజ్ విలువ ఎప్పుడెప్పుడు పెరిగిందో నేను చెబుతా. ఆయా సమయాల్లో ఏఏ ప్రభుత్వ డెయిరీలు మూత పడ్డాయో కూడా చూపిస్తా. చర్చకు రావాలి’ అని కుటుంబరావుకు ఉండవల్లి సవాల్ విసిరారు. సమావేశంలో అశోక్కుమార్ జైన్, చెరుకూరి రామారావు, అల్లుబాబి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ ఎప్పుడూ అవినీతి చేయలేదు
-
ఒకే ఒక్కడు
-
‘హోదా’ క్రెడిట్ జగన్కు వస్తుందనే సీఎం ఫీట్లు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ పోరాటం చేస్తున్నారు. ఆయన బాటలోనే ఇతర ప్రతిపక్షాలన్నీ వచ్చాయి. హోదా ఒక సెంటిమెంట్గా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్ జగన్కు ఆ క్రెడిట్ వస్తుందనే సీఎం చంద్రబాబు చివరి ఏడాది ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ ఫీట్లు చేస్తున్నారు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. విభజన సమయంలో లోక్సభలో జరిగిన ప్రహసనంపై వచ్చే శీతాకాల సమావేశంలో నోటీసులు ఇవ్వాలని, విభజనపై తాను సుప్రీంలో వేసిన పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఆయన రాసిన లేఖను శుక్రవారం విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు. ఎన్నికలకు ఏడాది ఉందనగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది తానేనంటూ 11 చానళ్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామంటున్నారు. బీజేపీ అప్పడు కూడా కేంద్రంలో అధికారంలోనో, లేక ప్రతిపక్షంలోనో ఉంటుంది. మీపై కక్షతో ఇప్పుడు అడ్డుకుంటే రేపు కూడా అడ్డుకోదా?’ అని ప్రశ్నించారు. ఫోజులు కొడుతుంటే ఎలా ఇస్తారు..? ‘‘రాష్ట్రం వెలిగిపోతోంది. 2029 ముందే ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతుంది. గుజరాత్ కన్నా మనం ముందుకు పోతాం కాబట్టే అణిచివేస్తున్నారు. జీడీపీలో దేశం కన్నా మనమే టాప్ అంటూ ఫోజులు కొడుతుంటే.. అంతా బాగున్నవారికి హోదా ఎందుకు అని ఎవరైనా అనుకుంటారు. దేబిరించాల్సిన సమయంలో కాలుమీద కాలేసుకుని ఫోజులు కొడితే ఎలా?’’ అని ఉండవల్లి సీఎంని ప్రశ్నించారు. విభజనకు సంబంధించి లోక్సభ శీతాకాల సమావేశాల్లో నోటీసులిస్తే.. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మీరంటే మీరే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తి పోసుకుంటాయని, ఇలా అయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశం మొత్తం తెలుస్తుందన్నారు. -
ఉద్దేశ్యపూర్వకంగానే స్పీకర్ సభను వాయిదా వేస్తున్నారు
-
‘పోలవరంపై నేను చెప్పినట్టే జరిగింది’
సాక్షి, రాజమండ్రి: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రోజుకో మాట అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే పోలవరం పనులు అప్పగించామని గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం అబద్దాలు చెబుతున్నారని.. పనులు అప్పగించాలని అడగలేదని అంటున్నారని మండిపడ్డారు. పోలవరంపై మొదటి నుంచీ చంద్రబాబు లాలుచీనే అన్నారు. జాతీయ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. తక్కువ ధరకే నవయుగకు పనులు అప్పగించామన్న చంద్రబాబు.. ఇపుడు గడ్కరీనే ఆ పనులు ఇచ్చారని చెప్పడమేంటన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను చెప్పినట్టే జరిగిందని తెలిపారు. 2016 వరకు అసలు పనులే చేపట్టలేదని పేర్కొన్నారు. శ్వేత పత్రం అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదు.. ప్రజులను చంద్రబాబు ఎంతకాలం మభ్యపెడతారన్నారు. వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారని, పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. -
ఆవిశ్వాసానికి మేం మద్దతిస్తాం...
-
ఎంపీల అసమర్థతవల్లే ప్రత్యేక హోదా రాలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని సాధించడంలో ఎంపీలు విఫలమయ్యారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయడంలో వాళ్లెందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు. తమ నిజనిర్ధారణ కమిటీ నివేదికను నాలుగైదు రోజుల్లో బయటపెడతామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని అయోమయంలోకి నెట్టిన నేపథ్యంలో స్పష్టత కోసం చేసిన ప్రయత్నమే ఈ సమావేశమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన రెండు రోజుల సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్సీ) సమావేశం శనివారం ముగిసింది. అనంతరం మీడియాను ఉద్దేశించి పవన్ కల్యాణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మాట్లాడారు. -
‘చేయని నేరానికి ఏపీ ప్రజలకు శిక్ష’
సాక్షి, అమరావతి: చేయని నేరానికి ఏపీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని శుక్రవారం హైదరాబాద్లో జరిగిన జనసేన నిజనిర్ధారణ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. ఈ భేటీకి లోక్సత్తా నేత జేపీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, గౌతమ్, న్యాయవాది ప్రమోద్రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎంపీ కొణతాల, తోట చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. భేటీలో హోదా తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్ అధికారిగా పనిచేసిన టి.చంద్రశేఖర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. -
15లోపు నిధుల లెక్కలు చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, వాటిని ఏ మేరకు ఖర్చు పెట్టారనే దానిపై లెక్కలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు. నిధుల వివరాలతో ఈ నెల 15లోగా శ్వేతపత్రం విడుదల చేయాలని గడువు విధించారు. లేకపోతే భవిష్యత్ కార్యాచ రణ గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో పవన్కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ వాళ్లు చెబుతున్న వాటిపై తాను గందరగో ళంలో ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా హామీ నెరవేరలేదనే అసంతృప్తి తనకూ ఉందన్నారు. ఉండవల్లి, జేపీ వంటి మేధావులతో ఏర్పడే నిజనిర్ధారణ కమిటీ వాటిపై అధ్యయనం చేసి అబద్ధాల లెక్క తేలుస్తుందని చెప్పారు. -
సాయంత్రం పవన్ ఫోన్ చేశారు: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ అధికార టీడీపీని, కేంద్రంలోని బీజేపీ పల్లెత్తు మాట కూడా అనని పవన్.. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే గతంలో బీజేపీకి, టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పిన పవన్.. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్కు ఫోన్ చేసి మాట్లాడారు. తాను ఏర్పాటు చేస్తున్న జేఏసీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. దీనిపై ఉండవల్లి అరుణ్కుమార్ మీడియాతో స్పందిస్తూ.. 'సాయంత్రం పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఈ నెల 11న హైదరాబాద్లో భేటీ అవ్వబోతున్నాం' అని తెలిపారు. 'నేను మేధావిని కాదు. నాకు ఎలాంటి ఆశయాలు లేవని పవన్కు చెప్పాను. ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి పనిచేయాలని ఆయన నన్ను కోరారు' అని తెలిపారు. తనకు ఎలాంటి పరిచయం లేని పవన్ తన పేరును ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జేఏసీ ఏర్పాటు, విధివిధానాలు పవన్ భేటీ తర్వాత తేలుతాయని చెప్పారు. -
ఉండవల్లి అప్పుడు ఏం చేశారు: సోము వీర్రాజు
సాక్షి, రాజమండ్రి: పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది బీజేపీయేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది కూడా బీజేపీయేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కు ఆంధ్రా అభివృద్ధి గుర్తుకు రాలేదా.. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడదీసినపుడు అప్పటి ఎంపీ ఉండవల్లి ఏం చేశారు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్ళినపుడు ఉండవల్లి ఏమీ చేయలేకపోయారు ఎందుకు అని ప్రశ్నించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం విశాఖ రైల్వే జోన్ కోసం బీజేపీ యత్నిస్తుందని సోము అన్నారు. ‘ఉపాధి’ పథకం కొందరు అవినీతిపరులకు ఉపాధిగా మారిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని అని, ముందస్తు ఎన్నికలపై మోడీదే తుది నిర్ణయం అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్ట లేకపోతోందని వీర్రాజు విమర్శించారు. -
సవాల్కు నై
-
పోలవరం.. టీడీపీ చర్చకు సిద్ధమా: ఉండవల్లి
-
చంద్రబాబు.. పోలవరంపై నిజం చెప్పు!
సాక్షి, రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తప్పుబట్టారు. పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు తప్పుడు నివేదికలు ఇచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు చెప్పాలని ఉండవల్లి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంలో అతి పెద్ద కుట్ర దాగుందని ప్రజలు భావిస్తారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని ఆయన అన్నారు. నా మాట తప్పని నిరూపించండి.. చాలెంజ్ చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ సర్కారు ఇచ్చిన నివేదికపై చర్చకు టీడీపీ సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయాన్ని విభజన చట్టం సైతం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. మిగతా ప్రాజెక్టులకు, పోలవరానికి సంబంధం లేదని, అందుకే పోలవరం అథారిటీని కూడా ఏర్పాటుచేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత అథారిటీదేనని ఆయన అన్నారు. అథారిటీకి తెలియకుండా టెండర్లు ఎలా పిలిచారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉండవల్లి ప్రశ్నించారు. -
రన్వేపై నిర్బంధమా?: ఉండవల్లి
రాజమహేంద్రవరం: దేశంలో ఇప్పటి వరకు రాస్తారోకో, రైల్రోకోలే తెలుసునని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని ఫ్లైట్ రోకో చూశామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కాంక్షిస్తూ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని విమానాశ్రయం రన్వే మీద నిర్బంధించడాన్ని ఆయన తప్పుపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాదిని కూడా విమానాశ్రయం లాంజ్ వద్దకు తీసుకొచ్చిన తర్వాతే అరెస్టు చేస్తారని, కానీ మూడు గంటలపాటు రన్వే మీద నుంచి జగన్ను బయటకు రానీయకుండా అటు నుంచి అటే హైదరాబాద్ పంపడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో పౌర హక్కులున్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. -
ఆ రహస్యం ఏంటో చెప్పాలి: ఉండవల్లి
-
ఆ రహస్యం ఏంటో చెప్పాలి: ఉండవల్లి
రాజమండ్రి : తాను రాజీ పడకపోతే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చేవి కావంటున్న చంద్రబాబు నాయుడు మాటల వెనుక రహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏంటనేది కూడా ఇప్పటివరకూ స్పష్టం కాలేదన్నారు. ప్యాకేజీ గురించి ముందే తెలిసుంటే డ్రామలెందుకని ఉండవల్లి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటునే పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులెందుకని ప్రశ్నించారు. చదవండి: (పోలవరం కోసమే ప్యాకేజీకి ఓకే) పట్టిసీమ పేరుతో రూ.1600 కోట్లను చంద్రబాబు గోదావరిలో కలిపేశారని ఉండవల్లి విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తొమ్మిదిసార్లు ప్రభుత్వానికి తాను లేఖ రాశానని, ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు. పోలవరం కుడి కాల్వలో ఇచ్చిన పరిహారం, పురుషోత్తపట్నం ప్రాజెక్టులో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈ పేరుతో మరో రూ.1600 కోట్లను సముద్రంలో కలుపుతున్నారన్నారు. -
బాబు ‘బ్రీఫ్డ్ మీ’ అందరు విన్నారు: ఉండవల్లి
-
అనుబంధ చార్జిషీట్ అంటూ ఏసీబీ సేఫ్గేమ్
- ఓటుకు కోట్లు కేసులో ఉండవల్లి అరుణ్కుమార్ వాదన - ఈ కేసు కోసం చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామంటూ తెలంగాణ ఏసీబీ సేఫ్గేమ్ ఆడుతోందని న్యాయవాది ఉండవల్లి అరుణ్కుమార్ వివరించారు. ఈ కేసులో విసృ్తత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని, బాధ్యతాయుతమైన పౌరుడిగా వాస్తవాలను కోర్టు ముందుంచేందుకే ఈ కేసులో తన వాదనలను వినాలని హైకోర్టును కోరానని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తన వాదనలు వినాలంటూ ఉండవల్లి అరుణకుమార్ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి బుధవారం ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హతపై ఉండవల్లి వాదనలు కూడా విన్నారు. చంద్రబాబు గురించి ఏసీబీ తన చార్జిషీట్లో పలుమార్లు పేర్కొందని, అరుునప్పటికీ ఆయనను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని ఉండవల్లి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని బట్టి ఏసీబీ దర్యాప్తు ఏ కోణంలో సాగుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజా ప్రతినిధుల కేసుల్లో విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని లా కమిషన్ సిఫారసు చేసిందని, కానీ ఏసీబీ సంవత్సరాల తరబడి ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని కానీ, స్టీఫెన్సన్తో జరిగిన సంభాషణల్లోని స్వరం తనది కాదని కానీ చంద్రబాబు ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల విభజన ఇంతవరకు జరగలేదని, చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారని వివరించారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టుకు స్వతఃసిద్ధ అధికారాలున్నాయని, వాటిని ఉపయోగించి తప్పును సరిచేసేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చునన్నారు. తరువాత ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి గతవారం నాటి తన వాదనలను మరోసారి పునరుద్ఘాటించారు. కోర్టు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా తిరుగు సమాధానం కోసం తదుపరి విచారణ గురువారానికి వారుుదా పడింది. -
బాబు ‘బ్రీఫ్డ్ మీ’ అందరు విన్నారు: ఉండవల్లి
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. కోర్టుకు ఉన్న విస్తృతమైన అధికారాలతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి కేసును విచారించాలని ఉండవల్లి కోరారు. తప్పుచేసిన ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్న ఆయన.. రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. ‘బ్రీఫ్డ్ మీ’ అని చంద్రబాబు అన్న మాటలు అందరూ విన్నారని అన్నారు. ఈ కేసులో మరికాసేపట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తారు. ఈ కేసుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోందని ఉండవల్లి అన్నారు. -
సామాన్యులకే ఇబ్బందులు..
- నల్లధనం ఉన్నవారెవరూ బ్యాంకులకు వెళ్లట్లేదు - పెద్ద నోట్ల రద్దుపై మాజీ ఎంపీ ఉండవల్లి సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ప్రధాని మోదీ ఎటువంటి ముందస్తు చర్యలు తీసు కోకుండా అనాలోచిత నిర్ణయంతో సంక్షో భాన్ని సృష్టించారని విమర్శించారు. మంగళ వారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లధనం ఉన్నవారెవరూ బ్యాంకులకు వెళ్ల ట్లేదనే విషయం తన పరిశీలనలో తేలిందని చెప్పారు. విదేశాలనుంచి నల్లధనం తీసు కొచ్చి ప్రతిఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు చొప్పున వేస్తానని మోదీ ఎన్నికల సంద ర్భంగా హామీ ఇచ్చారని, ఇప్పటికి రెండు న్నరేళ్లు గడిచినా ఆ దిశగా తీసుకున్న చర్య లేమీ కన్పించటం లేదని విమర్శించారు. దేశంలో 86 శాతం నగదు పెద్దనోట్లు(500, 1,000) ద్వారానే చెలామణి అవుతోందన్నారు. బ్లాక్మనీని అరికట్టేందుకే పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారని, కానీ రూ.2 వేల నోట్లతో బ్లాక్మనీ ఇంకా బాగా పెరుగుతుందన్నా రు. జాతీయ బ్యాంకులవారు ఎవరికి ఎంత డబ్బు ఇస్తు న్నారో.. ఎంత రద్దు చేస్తున్నారో చెప్పట్లేదన్నారు. ఆర్బీఐవారు 58 మందికి రూ.85 వేల కోట్ల బకారుులు రద్దు చేసినట్లు సుప్రీం కోర్టు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సీల్డ్ కవర్లో వివరాలు అందజేశారని, వారి పేర్లు ఎందుకు బయటపెట్టరని ప్రశ్నించారు. అక్టోబర్ 21న మైసూర్లో రూ.2వేల నోట్లు ప్రింటవుతున్నట్లు, రూ.500, రూ.1,000 నోట్లు రద్దు అవుతున్నట్లు ఓ ఆంగ్ల బిజినెస్ పత్రికలో ముందే వార్త రావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ దీంతో నోట్ల రద్దు వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ న్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల 6.38 లక్షల గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది ఏర్పడింద న్నారు. నోట్ల డిపాజిట్ గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘50 రోజుల్లో ఏం చేస్తారో చెప్పాలి’
హైదరాబాద్: అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ముందుస్తు చర్యలు తీసుకోకుండా సంక్షోభాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నల్లధనం ఉన్నవారెవరు బ్యాంకులకు వెళ్లడం లేదని అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 86 శాతం నగదు పెద్ద నోట్ల ద్వారానే చెలామణి అవుతోందని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన రూ. 2000 నోట్లతో నల్లధనం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుపై కొన్ని పత్రికల్లో ముందే వార్తలు రావడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. నల్లధనం.. బంగారం రూపంలోకి మారుతోందని అన్నారు. 50 రోజుల్లో ప్రధాని మోదీ ఏం చేస్తారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
రెండున్నరేళ్లలో ఏం చేశారు?
- బహిరంగచర్చకు సిద్ధమా? - బాబుకు ఉండవల్లి డిమాండ్ - కేసీఆర్, బాబు ఒక్కమాటపై ఉన్నంతకాలం ‘ఓటుకు కోట్లు’ కేసు సాగు..తూనే ఉంటుంది సాక్షి, విశాఖపట్నం: రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు.. విభజన చట్టంలోని హామీలు ఎన్ని అమలు చేశారన్న దానిపై బహిరంగచర్చకు రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. తనకే పార్టీతోనూ సంబంధం లేదని, తన వాదనలు తప్పయితే బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటానన్నారు. పట్టిసీమ, పోలవరం, అమరావతిపై చర్చకు రమ్మని అడిగాను.. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. విశాఖ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి మాట్లాడారు. ఏపీలో రాష్ర్టప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై కోర్టులో కేసు వేసిన సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ను ఉన్మాదితో పోల్చడం అన్యాయమన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని నాడు చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదాకు మించి ప్యాకేజీ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఉండవల్లి ప్రశ్నించారు. హోదా సంజీవని కాదని బాబు చెప్పినప్పుడే టీడీపీ, బీజేపీలు కలిసే నాటకమాడాయని అర్థమైందన్నారు. కోర్టుకెళ్దామంటే.. ‘కోర్టులో బాబుకు వ్యతిరేకంగా ఏమీ రాద ండి. అక్కడంతా బాబుకు అనుకూలంగానే వస్తాయని’ తెలంగాణ ఏజీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి లాగుతున్నాయన్నారు. వైఎస్ ఆలోచనే వేరు ‘‘పోలవరం విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే వేరు. దాన్నికడితే 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. తుని, కొండపల్లి తదితర ప్రాంతాల్లో 100 టీఎంసీలు పంప్ చేసి నిల్వచేసేందుకు రిజర్వాయర్లను కూడా వైఎస్ గుర్తించారు. అందుకే ఎలాంటి అనుమతుల్లేకుండా కాలువలు తవ్వేశారు. పొరుగు రాష్ట్రాలనుంచి సమస్యలున్నాయని గుర్తించి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఒప్పించారు. అలాంటి ప్రాజెక్టును పూర్తిచేసే ఆలోచన బాబుకు లేదు. అందువల్లే పట్టిసీమ కట్టారు.. పురుషోత్తపట్నం కడుతున్నారు. 2018లో పోలవరం పూర్తయితే ఇక పురుషోత్తపట్నం ఎందుకు?’’ అని ఉండవల్లి ప్రశ్నించారు. కాగా, ‘ఓటుకు కోట్లు’ కేసులో కేసీఆర్, చంద్రబాబు ఒక్కమాటపై ఉన్నంతకాలం ఎన్నాళ్లయినా సాగు..తూనే ఉంటుందని అన్నారు. అయితే రేవంత్రెడ్డి తప్పించుకునే అవకాశంలేదని, లేటెస్ట్ టెక్నాలజీతో డూప్లికేట్ రేవంత్ను తయారుచేసి పంపిస్తేతప్ప బయటపడే వీల్లేదన్నారు. 2018 బడ్జెట్ తర్వాత టీడీపీ దాదాపు ఖాళీ అయిపోతుందన్నారు. జగన్పై విమర్శల్లో పసలేదు ‘‘జగన్పై నమోదైన చార్జిషీట్ల విలువ రూ.1,365 కోట్లే.. అదీ అంతా చట్టబద్ధమే. కానీ టీడీపీవాళ్లు మాటిమాటికీ లక్ష కోట్లు తిన్నావంటూ ఆయన్ను విమర్శించడంలో పసలేదు’’ అని ఉండవల్లి అన్నారు. ‘‘ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారిలో ఎవరైనా వైఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిపొందారా అన్న లెక్కలుకూడా తీసి.. ఇక్కడ లబ్ధిపొందారు కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టారని చార్జిషీటులో చెప్పుకొచ్చారు. అయితే జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి, వైఎస్ హయాంలో లబ్ధిపొందడానికి సంబంధం లేదు. పైగా వాళ్లు పెట్టిన సొమ్ములన్నీ వైట్మనీయే. అయినా వీటిని కోర్టులు తేలుస్తాయి’’ అని ఆయన అన్నారు. -
అక్షరమైన విభజన చరిత్ర
పరిచయం సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండేళ్లు దాటిపోయింది. విభజనకు పూర్వం, తరువాత హైదరాబా దులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో వున్న కొన్ని భయ సందేహాలు సద్దుమణిగాయి. ఏవో రాజకీయపరమైన చిటపటలు మినహాయిస్తే మొత్తం మీద అటూ, ఇటూ జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో విభజన కథ పేరుతో అలనాటి విషయాలను తవ్వి తీస్తూ ఒక పుస్తకం రాయడం ఎందుకనే ప్రశ్న తలెత్తడం సహజం. గ్రంథ రచయిత ఉండవల్లి అరుణ్ కుమార్. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వివాహానికి హైదరాబాదు నుంచి కొందరు పాత్రికేయులం రైల్లో పులివెందుల వెడుతున్నప్పుడు ఆయనతో నాకు తొలి పరిచయం. కాంగ్రెస్ అగ్రనాయకుల ఇంగ్లిష్, హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదం చేసే అవకాశాన్ని వైఎస్ఆర్ కల్పించినది మొదలుగా ఇక ఆయనకు అడ్డులేకుండా పోయింది. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం లేని ఉండవల్లి రెండుసార్లు ఎంపీ కాగలిగారు. ‘మాట మార్చను, మడమ తిప్పను’ అంటుండే వైఎస్సార్ ఆప్తవర్గంలోని మనిషి కావడం వల్లనేమో ఆయనకూ తాను మాట మార్చను అనే ఓ నమ్మకం. విభజన బిల్లు పాసవ్వదు అనేది ఆయన నమ్మకం. బిల్లు ఆమోదం పొందినా కూడా ఆయనది అదే మాట, కాకపొతే అది ‘బిల్లు పాసవ్వలేదు’ గా మారింది. బిల్లు పాసు కాకుండానే తెలంగాణ ఏర్పడిందా! అదెలా సాధ్యం? అది చెప్పడానికే ఈ రచన. ‘‘బిల్లు పాసవలేదు అని చెప్పడం అంటే తెలం గాణను వ్యతిరేకించడం కాదు. ఆనాడు చట్ట సభలో చోటుచేసుకున్న పొరబాట్లను ఎత్తి చూపి అటువంటివి పునరావృతం కాకుండా వుండేందుకు మాత్రమే ఈ గ్రంథరచన అని అంటారాయన. డైరీలో రాసుకున్న విశే షాల ఆధారంగా ఆయన ఈ పుస్తకం రాశారు. కొన్ని తేదీల వారీగా వున్నాయి. మరి కొన్ని తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని సన్నివేశా లను, సంభాషణలను ఆయా వ్యక్తుల స్వభావాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాశారు. అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే. ముఖ్యంగా విభజన బిల్లు ఓటింగు విషయంలో స్పీకర్ చాంబర్లో జరిగిన సమావేశం. స్పీకర్, జైపాల్రెడ్డి నడుమ జరిగిన సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణ. ఒక్క ముక్కలో చెప్పాలంటే చక్కని స్క్రీన్ ప్లే. అది చదివితే, ఒక స్థాయికి చేరిన తరువాత రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో అనే అనుమానం కలుగుతుంది. సభలో ఏం జరగాల్సింది జైపాల్ రెడ్డి ఎటువంటి శషభిషలు లేకుండా సూటిగా స్పీకర్తోనే చెప్పేసినట్టు ఉండవల్లి రాశారు. సభ మొదలు కాగానే టీవీ ప్రసారాలు నిలిచిపోతాయనీ, వాటిని బాగుచేసేలోగా బిల్లు పాసయిపోతుందనీ ఆయన చెప్పారు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిస్తే బిల్లు ఆమోదం పొందడం చిటికెలో పని అని నచ్చచెప్పారు. జైపాల్ రెడ్డి స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టీ. కాంగ్రెస్ ఎంపీలతో కూడా ఇదే తీరులో మాట్లాడారు. స్పీకర్ చాంబర్లో జరిగింది మరిచి పొండి. ఆ మాటలు నేను అనలేదు, మీరు వినలేదు. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణ ఎప్ప టికీ రాదని వారితో అన్నారు. ఏతావాతా ఉండవల్లి ఈ పుస్తకం ద్వారా చెప్ప దలచింది ఒక్కటే. రాష్ట్ర విభజన జరిగిన తీరు నియ మానుసారంగా లేదని. ఏదిఏమైనా, ఈ పుస్తకంలోని విషయాలతో ఏకీభవించినా లేకపోరుునా, తెలుగు ప్రజల జీవితాలతో ముడిపడిన ఒక చారిత్రక సందర్భానికి సంబంధించిన అనేక అంశాలకు అక్షర రూపం కల్పించడం శ్లాఘనీయం. భండారు శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు 98491 30595 -
'నారాయణకు రూ. 474 కోట్లు ఎక్కడివి'
-
నారాయణకు రూ. 474 కోట్లు ఎక్కడివి: ఉండవల్లి
రాష్ట్ర మంత్రి నారాయణ ఆస్తుల చిట్టాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ బయట పెట్టారు. తనకు సొంతంగా రూ. 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణ ప్రకటించారని, ఆ డబ్బు ఎలా సంపాదించారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. దొంగ సొమ్ము దాచుకోడానికి సింగపూర్ మంచి ప్రాంతమని, ప్రపంచంలో స్విట్జర్లాండ్ అందుకు మొదటి స్థానంలో ఉండగా సింగపూర్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. అందుకే చంద్రబాబు పదే పదే సింగపూర్ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అవతలివాళ్ల వైపు ఒకవేలు చూపిస్తే, మనవైపు నాలుగువేళ్లు చూపిస్తాయన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. తాను ప్రకటించిన రూ. 474 కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో నారాయణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ముందుగా అకౌంటు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి కుడి, ఎడమ చేతులు మీరేనని అంతా అంటారని, ఆ లెక్కన అమరావతి స్కాంకు కూడా సూత్రధారి నారాయణే అవుతారని ఉండవల్లి ఆరోపించారు. పది పదిహేను రోజుల్లోగా నారాయణ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టప్రకారం ఏదైనా విషయం తెలిసి అధికారులకు చెప్పకపోవడం కూడా శిక్షార్హమే అవుతుందన్నారు. పారదర్శకంగా ఉన్నట్లు చెబుతూ ఉంటారని, పార పట్టుకుని తిరగడమే పారదర్శకతా అని ప్రశ్నించారు. ఇక మఖ్యమంత్రి కూడా పదే పదే తాను నిప్పు అంటారని, మీరెంత నిప్పో రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే అంతా చూశారని ఎద్దేవా చేశారు. పోనీ అది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ ఎవరికో ఆ వేషం వేసి పంపారని చెబుతారేమో చెప్పాలన్నారు. ఈ రెండేళ్లలో పుష్కరాలు తప్ప ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మనం ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే 'నారాయణ' అంటూ ప్రారంభిస్తాం కాబట్టి, ఈ ఆస్తుల వివరాలు వెల్లడించడం కూడా నారాయణే మొదలుపెట్టాలని అన్నారు. ఇది ఆయనకు అశుభం కాకుండా చూసుకోవాలన్నారు. తప్పుడు మనుషులు నడిపే స్కూళ్లకు ఎవరూ పిల్లలను పంపరని, అందువల్ల ఆయన తన క్రెడిబులిటీని నిరూపించుకోవాలని చెప్పారు. ఏ వ్యాపారం చేసి ఇంత మొత్తం సంపాదించారో చెప్పాలన్నారు. తాను డాక్యుమెంట్ల ఆధారంగానే అన్నీ చెప్పానని.. మీ వ్యాపారాలేంటో, వాటికి ఆధారాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు వేల కోట్ల నిధులు ఉండొచ్చు గానీ, ఆ సొసైటీలను నడిపేవారికి వేలకోట్లు ఉండటానికి వీలుండదని అన్నారు. వీళ్లంతా సొసైటీ డబ్బులను సొంత డబ్బులా వాడేసుకుంటున్నారని తెలిపారు. సొసైట చట్ట ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు నడపాలని తెలిపారు. ఇక ఏపీ రాజధాని నిర్మాణం గురించి కూడా ఉండవల్లి తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏ నివేదిక ఆధారంగా అమరావతిలో రాజధాని కడుతున్నారని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో చెప్పగలరా అని అడిగారు. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన శివరామకృష్ణన్తో పాటు చాలామంది నిపుణులు ఆ కమిటీలో ఉన్నారన్నారు. కానీ దాన్ని కాదని చంద్రబాబు మాత్రం రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడం కోసం నారాయణ, జీఎంఆర్, బీవీ రాజు, గల్లా జయదేవ్, సుజనా చౌదరిలతో ఓ కమిటీ వేశారని అన్నారు. వీళ్లంతా కోట్ల కోట్ల రూపాయలున్న పెద్ద వ్యాపారవేత్తలని, అమరావతితో వ్యాపారం చేద్దామనే శివరామకృష్ణన్ కమిటీ కాదని ఈ కమిటీ వేశారని మండిపడ్డారు. చనిపోయేముందు శివరామకృష్ణన్ ఓ లేఖ రాశారని, అది ప్రముఖ జాతీయ పత్రికల్లో వచ్చిందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు చేస్తున్న పనివల్ల కొత్తగా ఏర్పడే రాష్ట్రం నాశనం అయిపోయే ప్రమాదం ఉందని అందులో చెప్పారన్నారు. రాజధాని ఎక్కడ కట్టాలో స్పష్టంగా చెప్పకపోయినా.. ఎక్కడ కట్టకూడదో మాత్రం చెప్పారని గుర్తుచేశారు. కృష్ణా-గుంటూరు మధ్య అమరావతి వద్ద కట్టొద్దని స్పష్టంగా చెప్పినా, అక్కడే కడుతున్నారని, అదేంటని అడిగినందుకు తాను ఊసరవెల్లి అయిపోయానంటున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు. -
ముద్రగడ దీక్షను కావాలనే జటిలం చేస్తున్నారు!
రాజమహేంద్రవరం క్రైం: ముద్రగడ పద్మనాభం దీక్షను ప్రభుత్వం కావాలనే జటిలం చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'కాపు రిజర్వేషన్పై ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్టు ఆగస్టు నెలాఖరికి వస్తుంది. రెండు నెలల ముందుగానే కాపు నాయకులను అరెస్టు చేయాలని పాలక పార్టీ పోలీసులపై ఎందుకు ఒత్తిడి తెచ్చింది' అని నిలదీశారు. ప్రభుత్వం జిల్లావ్య్యాప్తంగా వేలమంది పోలీసులను మోహరించిందని, రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డును 7 రేస్ కోర్సు రోడ్డుగా మార్చేసిందని ఎద్దేవా చేశారు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్లో ఐరన్ ఫెన్సింగ్ (ఇనుప ముళ్ల కంచె) వేసినట్టు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ వేశారని పేర్కొన్నారు. చంద్రబాబు తలచుకుంటే ఈ సమస్యను గంటలో పరిష్కరించగలరు.. కావాలనే జటిలం చేస్తున్నారని అన్నారు. ముద్రగడ ఇంట్లో దీక్ష చేస్తుంటే తలుపులు పగులగొట్టి, ఆయనను, ఆయన భార్యను ఈడ్చుకురావడం, కుమారుడిని దారుణంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో పేద ప్రజలు హాస్పిటల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ సమస్యను వెంటనే చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు. -
పుష్కరష్కర తొక్కిసలాట దుర్ఘటన దోషి చంద్రబాబే
ఏకసభ్య కమిషన్ వద్ద మాజీ ఎంపీ ఉండవల్లి అఫిడవిట్ దాఖలు రాజమహేంద్రవరం క్రైం: గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గతేడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో తొక్కిసలాట దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు ఆయన శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. పుష్కర ఘాట్లో సీఎం గంటల తరబడి ఉండడంతో భక్తుల రద్దీ పెరిగిపోయిందని, తరువాత ఒక్కసారిగా భక్తులను ఘాట్లోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డారని, 52 మంది గాయపడ్డారన్నారు. తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి తనకు సమయం ఇవ్వాలని కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర ఏర్పాట్లు, భక్తుల రద్దీని నియంత్రించడంలో అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రముఖులు స్నానాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సీఎం పుష్కర ఘాట్లో స్నానం చేశారని, ప్రజలకు సౌకర్యాలు, రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఆయన రక్షణలో ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉండవల్లి వివరించారు. -
'బతికున్నవాళ్లను కూడా శవాలనుకుని వదిలేశారు'
-
బతికున్నవాళ్లను కూడా శవాలనుకుని వదిలేశారు
గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగిన తర్వాత.. బతికున్న వాళ్లను కూడా శవాలనుకుని వదిలేశారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. సాధారణంగా ఎక్కడైనా ఐదారు నిమిషాల్లోనే తొక్కిసలాట కంట్రోల్ అవుతుందని, ఇక్కడ మాత్రం గంటన్నర పాటు జరిగిందని ఆయన అన్నారు. శవాలు అనుకుని కింద పడేసిన వాళ్లలో ఒక ముసలావిడకు మంచినీళ్లు పట్టిస్తే.. ఆమె బతికిందని ఉండవల్లి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... కనీస అవసరాలు వదిలిపెట్టి.. లగ్జరీలకు ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడకు పుణ్యం వస్తుందని వచ్చారు.. వాళ్లు సినిమా టికెట్ల కోసం వెళ్లినవాళ్లు కారు ఒక్కసారి లాఠీ చూపిస్తే చాలు.. వెంటనే ఆగుతారు పోలీసులు చేతులు ఎత్తేయడం వల్లే ఇలా అయ్యింది. వీఐపీ వెళ్లిపోయాడని అంతా వదిలేయడం వల్లే ప్రమాదం జరిగింది చుట్టాలింటికి వచ్చాం, మా వాళ్లు చచ్చిపోయారని ఒకావిడ చెబుతుంటే చాలా బాధ అనిపించింది. ఏ జబ్బూ లేదు.. రాజమండ్రి పుష్కరాల్లో తొక్కేసి చంపేశారన్నారు ఇలా జరిగినందుకు రాజమండ్రి వాసులుగా చాలా బాధపడుతున్నాం ఎన్నో పుష్కరాలు చూశాం.. ఎప్పుడూ ఇన్ని చావులు చూడలేదు దీనికి ఎవరు బాధ్యులో ఆ భగవంతుడికే తెలియాలి చనిపోయినవాళ్ల వారసులు మాత్రం తరతరాల పాటు గోదావరి వద్ద తొక్కి చంపేశారని చెప్పుకొంటారు. పుష్కరాల రేవు దగ్గర ఫస్ట్ ఎయిడ్ అన్నారు గానీ.. అక్కడేమీ లేవు. ప్లాస్టిక్ నిషేధించాం అనడంతో.. ఎవరూ కనీసం నీళ్లు కూడా తెచ్చుకోలేదు లేకపోతే.. ప్రతివాళ్లూ ఒక వాటర్ బాటిల్ తెచ్చుకునేవాళ్లు. ఆ నీళ్లు తాగించినా బతికేవాళ్లేమో! -
బాబూ...తప్పును సరిదిద్దుకో: ఉండవల్లి
సాక్షి, విజయవాడ బ్యూరో, తాడికొండ: ‘‘రాజధాని ప్రాంతంలో ప్రజల ఆమోదం లేకుండా భూ సమీకరణ లక్ష్యం పూర్తి కాదు. ఈ విషయంలో చంద్రబాబు సర్కారుకు భంగపాటు తప్పదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్న విషయాన్ని పక్కనబెట్టి వరల్డ్క్లాస్ రాజధానంటూ రైతుల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఇప్పటికైనా బాబు తన పంథాను వీడి చేసిన తప్పును సరిదిద్దుకుంటే మంచిది’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సూచించారు. ఆయన గురువారం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాయపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం విజయవాడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ ప్రాంతం రాజధానికి పనికిరాదన్నా.. వినిపించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని రైతుల్ని వేధించడం భావ్యం కాదన్నారు. 23న పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నందున.. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలతో రాజధాని భూముల విషయంపై మాట్లాడతామని ఆయన చెప్పారు. అవసరమైతే రైతులతో కలసి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముందని తెలిపారు. కాగా తుళ్లూరు మండలం రాయపూడిలో మాజీ ఎంపీపీ హరీంద్రనాథ్ చౌదరి స్వగృహంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. వాస్తు పేరుతో సీఎం చంద్రబాబు అమాయక రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అసలు దేశానికే వాస్తు లేదన్నారు. -
రాజధాని పొలాలు పరిశీలించిన ఉండవల్లి
ఈ ప్రకృతి అందాలు ఇక కనుమరుగేనా.. అంటూ నిట్టూర్పు తాడేపల్లి రూరల్: రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలైన పెనుమాక, ఉండవల్లిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ బుధవారం పర్యటించారు. అక్కడి పొలాలను పరిశీలించారు. ఉండవల్లి గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సంద ర్శించారు. పర్యటనలో భాగంగా ఇటీవల ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో పంట పొలాల్లో పంట సామాగ్రి దహనమైన ప్రాంతాలను పరిశీలించారు. రైతులు ఎంతమేర నష్టపోయారనే విషయాన్ని వాకబు చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామరైతులు అరుణ్కుమార్ను కలుసుకొని, తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. పంట పొలాలను ఇవ్వబోమన్న తమను పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న వైనాన్ని ఆయనకు వివరించారు. అయితే ఆయన మాత్రం వాటిపై ఏ మాత్రం స్పందించలే దు. పచ్చటి పొలాలు పూదోటలను చూసి, భవిష్యత్తులో ఈ ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేనా...? అని మధన పడుతూ తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్తో ఫొటోలు తీరుుంచుకున్నారు. తాను వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చానని ఈ క్రమంలో రైతుల ఆవేదన విని పంట పొలాల పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్నేహితులు ఉన్నారు. -
వీడియో రికార్డులను బయటపెట్టాలి: ఉండవల్లి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో గురువారంనాటి పరిణామాలు దురదృష్టకరమేనని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎంపీలనే మార్షల్స్గా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని ఆరోపించారు. సభనుంచి సస్పెన్షన్కు గురైన ఉండవల్లి,... రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావుతో కలిసి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో ఎంపీలను గాయపరిచినట్టు చెబుతున్నారని, అసలు నిరంకుశంగా విభజన బిల్లు తెచ్చి, కేంద్రమే రాజ్యాంగాన్ని గాయపరిచిందని అన్నారు. ‘టీడీపీ ఎంపీ మోదుగులను కాపాడేందుకే లగడపాటి పెప్పర్స్ప్రే వాడారు. తనపై దాడిచేస్తున్న వారిని అడ్డుకునేందుకే లగడపాటి స్ప్రే వాడారు. నేను చాలా దగ్గరినుంచి చూశాను. సభలోని 12 కెమెరాల రికార్డులను బయటపెడితే ఎవరిపై ఎవరు దాడిచేశారో తెలుస్తుంది. పూర్తిస్థాయి విచారణకోసం వీడియోలను బహిర్గతపరచాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశాం’ అన్నారు. విభజనపై ఇరుప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలను కూర్చోపెట్టి మాట్లాడే ప్రయత్నమే చేయలేదని ఉండవల్లి అన్నారు. విభజన బిల్లు పాస్ అవుతుందో, లేదో ఎవరికీ తెలియదని, బీజేపీ కి స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం ముక్కలయితే ఆంధ్రా కన్నా తెలంగాణే ఎక్కువ నష్టపోతుందన్నారు. ఏపీ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సమగ్రమైన చర్చ జరగాలన్నారు. చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో సమైక్యవాదం వివిపించాలన్నారు. ఈ ఇరవై రోజులు ఎంతో కీలకమని అన్నారు. అప్పటివరకు పార్టీల సంగతి మర్చిపోయి సమైక్యవాదం పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మామూలుగా మనం తిట్టుకుందామంటూ ఆయన చమత్కరించారు. బిల్లుపై సమగ్రమైన చర్చ జరిగితే తెలంగాణ ప్రజలు కూడా తమతో కలిసొస్తారని ఉండవల్లి దీమా వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ అందరిది: ఉండవల్లి
హైదరాబాద్: ఏ రాజకీయ నాయకత్వం లేకుండా, హింసాత్మక ఘటనలు జరగకుండా సమైక్యాంధ్ర ఉద్యమం జరగడం గర్వించదగ్గ విషయమని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించడం సరైన నిర్ణయమని సమర్థిం చారు. మాదాపూర్ దసపల్లా హోటల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. వివాదం అంతా రాజధాని చుట్టూనే ఉందని, అందుకే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్నారు. హైదరాబాద్ రెండు ప్రాంతాలకు చెందుతుందన్నారు. సమస్య తీవ్రత తెలపడంతో ఉద్యోగులు సఫలమయ్యారని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు తనకు అడ్డుకున్నారని అన్నారు. కలిసి వుండడం వల్ల ఎక్కువ లబ్ది పొందింది తెలంగాణే అని చెప్పారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలన్నారు. బుధవారం రాష్ట్రపతిని కలవనున్నామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం చాలా కాలంగా మైనార్టీలో కొనసాగుతుందని, ఇప్పుడు తాము రాజీనామా చేసినా ఒరిగేదేం ఉండబోదన్నారు. -
రాజీనామాలపై ఊగిసలాట!
* నేడు ఐదుగురు ఎంపీలం స్పీకర్ను కలిసి ‘ఆమోదం’ కోరతాం: అనంత * సీఎంతో భేటీ అనంతరం రాజీనామాలపై కొందరు ఎంపీల డైలమా! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశాలు కనిపించకపోవటంతో పార్లమెంట్ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని తనతో సహా సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు ఉండవల్లి అరుణ్కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఎ.సాయిప్రతాప్లు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలసి.. గతంలో తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరతామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేందుకు తన వంతు కషిచేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర నాయకులు తొందరపడవద్దని సలహా ఇస్తున్నప్పటికీ ఎవరి ఒత్తిడికి లొంగరాదనే తాము ఐదుగురం నిర్ణయించుకున్నామని అనంత పేర్కొన్నారు. అయితే.. సోమవారం ఢిల్లీలోనే ఉన్న సీఎం పలువురు ఎంపీలతో మాట్లాడటం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ భేటీలో పాల్గొనటం, రాజీనామాలు వద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఈ ఐదుగురు ఎంపీల్లోనూ కొందరు డైలమాలో పడ్డట్లు చెప్తున్నారు. ఎంపీలతో సీఎం, బొత్స మంగళవారం మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. -
'రాజ్యాంగపరమైన అనుమానాలుంటే రాష్ట్రపతిని కలుస్తుంటాం'
ఢిల్లీ: రాజ్యాంగపరమైన అనుమానాలుంటే రాష్ట్రపతిని కలుస్తాంటామని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీడబ్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్ర పరిస్థితులను ప్రణబ్ ముఖర్జీకి వివరించామన్నారు. రాజ్యాంగపరంగా ఎమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా రాష్ట్రపతిని కలవడం తెలిసిందే కదా అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెతున ఎగసి పడుతున్న తరుణంలో సీమాంధ్ర నేతల్లో గుబులు రాజుకుంది. యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో పరిస్థితుల్లో అకస్మికంగా మార్పు వచ్చింది. దీంతో నేతలకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. ఒకప్రక్క సమైక్యాంధ్రకు అనుకూలమంటూనే.. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పలువురు కాంగ్రెస్ పెద్దలు అధిష్టానాన్ని కలుస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర పోలీసుల్లో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్లో సాయుధ బలగాల తిరుగుబాటును ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
ఉండవల్లి జ్ఞానం.. సోనియాకు వ్యతిరేకం
ఢిల్లీ: రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన జ్ఞానాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని ఎంపీ పొ్న్నం ప్రభాకర్ విమర్శించారు. ఇందిరాగాంధీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పే ఉండవల్లి, టీడీపీ ఎంపీలు ఇందిరా మాస్క్ ను ధరించినపుడు ఎందుకు మాట్లాడ లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరగదంటూ ప్రకటించిన ఉండవల్లి వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు.ఆయన తనకున్న జ్ఞానాన్ని సోనియాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారన్నారు. సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి ఉండవల్లి లోక్సభలో ప్రస్తావించినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆయనను అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో ముల్కీ నిబంధనల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రసంగానికి వారు అడ్డుతగిలారు. సీమాంధ్ర ఉద్యమం దేశంలోనే పెద్దదని ఉండవల్లి అన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విడదీయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండటంతో టి కాంగ్ ఎంపీలను కూర్చోవాలని స్పీకర్ మీరాకుమార్ కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, తెలంగాణ ఎంపీలు మాత్రం ఉండవల్లి వైఖరిపై మండిపడుతున్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే.. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని టీ.ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఉండవల్లి, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు
రాజమండ్రి: జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యతిరేకంగా సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో సమైక్య వాదులు గందర గోళ సృష్టించారు. సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను పెట్టాలని ఆందోళన కారులు నిరసనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. జై సమైక్యాంధ్రా నినాదంతో ఆ ప్రాంతమంతా హోరుత్తెంది. ఈ సదస్సులో సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రా కోరుతూ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఐదు రోజులుగా చేస్తున్న సమైక్యాంధ్ర హోరు ఉధృతమైంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి.