Vaccines
-
టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి
న్యూఢిల్లీ: టీకాలతో కరోనాకు అడ్డుకట్టవేడంలో విజయం సాధించిన అనంతరం ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం ఎనిమిది కొత్త వ్యాక్సిన్లను పరీక్షించడానికి ఆమోదించింది.ఇందులో టీబీ నుండి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వరకూ టీకాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలను పొందవచ్చు. వచ్చేరెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తవుతాయని అంచనా. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు ఎనిమిది వేర్వేరు వ్యాక్సిన్లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్డిఎన్ఎ), ఇన్యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్లపై ఫేజ్- II ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ అనుమతి పొందింది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ వ్యాక్సిన్పై మూడవ దశ ట్రయల్ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టీబీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్పై కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్ను పరీక్షించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. ట్రయల్లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్సీఓ దశ- III ట్రయల్ను ప్రారంభించడానికి కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సీడీఎస్సీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఊపిరితిత్తులు,శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో స్థానం దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్కు జీఎస్కే కంపెనీకి అనుమతి లభించింది. -
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
పాట్నా: కొవిడ్ వ్యాక్సిన్పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని ఫొటోవ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్ యాదవ్ కుమార్త్ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నందు వల్లే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్ ఇస్తున్నారు. -
వ్యాక్సిన్ల సామర్థ్యం తెలిసేదెలా?!
‘‘ఎప్పటికప్పుడు కొత్త వ్యాక్సిన్ల సృష్టి జరుగుతూన్న సందర్భంగా సదరు వ్యాక్సిన్లు సరిగ్గా పని చేసేవా, లేదా అని తేల్చుకోవాలంటే – ముందు ఆ వ్యాక్సిన్లను రాజకీయ పాలకులపై ప్రయోగించి చూడాలి. ఎందుకంటే, తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఆ పాలకులు బతికి బట్టకడితే ఆ వ్యాక్సిన్ మంచిదని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఆ పాలకులు ఆ వ్యాక్సిన్ వల్ల స్వర్గస్థులయితే, దేశం సుఖంగా ఉన్నట్టు భావించాలి.’’ – ప్రసిద్ధ పోలిష్ తాత్వికులు మోనికా విర్నివా స్కా ఈ బండ ‘జోకు’ వినడానికి కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గత పదేళ్లకు పైగా ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యం కన్నా, వ్యాపార లాభాల కోసం పెక్కు ప్రయివేట్ కంపెనీలు వ్యాక్సిన్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వస్తున్నాయి. అవి సృష్టించే వ్యాక్సిన్లు ప్రముఖ శాస్త్రవేత్తల కొలమానాలకు అందకపోయినా, తిరస్కరిస్తున్నా మార్కెట్లోకి పాలక వర్గాల అండతో విడుదలవుతూండటం చూస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎండకట్టి అనుక్షణం, ఈ రోజు దాకా ప్రశ్నిస్తూ వస్తున్న ప్రసిద్ధ భారత కరోనా శాస్త్రవేత్త, పరిశోధకురాలు గగన్దీప్ కాంగ్! వైరస్ల స్థాయి ఎంత తీవ్రమైనదంటే – భవిష్యత్తులో సోకగల ప్రమాదాలను కూడా ముందుగానే ఊహించి రోగ నిర్ణయానికి అవసరమైన ప్రయివేట్ స్థాయి అవకాశాలను కూడా గణించి, ప్రయివేట్ కంపెనీలను షరతులతో అదుపులో ఉంచుతూ రంగంలోకిదించాలని ఆమె పదేపదే ముందస్తుగానే సూచిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా పాలకులు అను మతించిన ప్రయివేట్ కంపెనీలను అదుపాజ్ఞల మధ్య వాడుకోవలసి ఉంటుందన్నారు. ప్రపంచ క్లినీషియన్ శాస్త్రవేత్తలలో భారతదేశ ఉద్దండురాలుగా ఆమెను గుర్తిస్తూ లండన్ రాయల్ సొసైటీ ‘ఫెలోషిప్’ ఇచ్చి గౌరవించింది. రాయవెల్లూరు మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్ర పరిశోధనా కేంద్రంలో పిల్లల్లో ప్రబలుతున్న వైరల్ వ్యాధులపై ఎనలేని పరిశోధన చేశారు. అంతేకాదు, పిల్లలకు సంబంధించి పటిష్ఠమైన ఆరోగ్య జాగ్రత్తలను ప్రాథమిక దశ నుంచే తీసుకోవడం వల్ల ఉత్తరోత్తరా వాళ్లను ఆస్పత్రుల చుట్టూ తిప్పే అవసరం ఉండదనీ, ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే కనీసం వంద దేశాల్లో లక్షలాది చిన్నారులు దారుణ పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చిందనీ గగన్దీప్ కాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. మానవాభ్యున్నతి గణింపులో గత పదిహేనేళ్లలో భారత అభి వృద్ధి సూచీ 3 స్థానాలు దిగజారి పోయింది. ఈ గణింపులో చిన్నారుల మరణ శాతం కూడా పరిగణనలోకి తీసుకుంటారనేది మరువరాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచవలసిన పాలకులు ఎప్పటికప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్య, లౌకిక వాద సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారు. మత రాజకీయాలను పెంచి పోషిస్తూ ‘హిందూ జాతీయవాదాన్ని’ రేకెత్తించి నియంతృత్వ పాలనను స్థాపించడానికి కావల సిన వాతావరణాన్ని సృష్టించుకొంటున్నారు. దీన్ని ఊహించే భారత రాజ్యాంగ నిర్మాత ‘భారత రాజ్యాంగంలో ఆచరణకు పొందుపరచిన ప్రజాస్వామ్య సూత్రాలను ఇతరులు ప్రజాస్వామ్య విరుద్ధంగా మార్చేసే ప్రమాదం లేకపోలేదు, నియంతృత్వాన్ని ప్రవేశపెట్టే ప్రమాదమూ లేక పోలేదు’ అని హెచ్చరించారు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో హిందూ మత రాజకీయాల వల్ల అన్యమతస్థులకు స్థానముండదనీ, ప్రజాస్వామ్య లక్ష్యాలతో పొందుపరిచిన భారత సెక్యులర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ గాంధీజీ హంతకుడు గాడ్సే కాలం నాటి పరిస్థితులను ‘సెక్యులరిజం’ పేరు చాటున తాము కూడా పాలనలో కొనసాగించ దలచినట్లు ‘బీజేపీ – ఆరెస్సెస్’ నాయకుల ప్రస్తుత ధోరణులు కనిపిస్తున్నాయనీ ‘వర్జీనియా యూని వర్సిటీ’ భారతీయ ప్రొఫెసర్ నీతీ నాయర్ ‘గాయపడ్డ మనస్సులు’ (2021) గ్రంథంలో పేర్కొన్నారు. ప్రత్యేక ‘హిందూ రాష్ట్రం’ సెగ ఒక మతాన్ని కాదు – ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, బౌద్ధులు అందర్నీ చుట్టుముడుతుందనీ, అందుకని, మన భారత ప్రజలు ప్రత్యేక ‘హిందూ రాష్ట్ర ప్రతిపత్తి’కీ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అక్షర సత్యంగా పొందుపరిచిన ‘సమగ్ర భారతదేశ’ భావనకూ మధ్య వాస్త వాన్ని విధిగా ప్రేమించాలని ప్రొఫెసర్ నీతీ నాయర్ ఆ గ్రంథంలో పేర్కొ న్నారు. ఇటీవల ‘మహిళా రిజర్వేషన్ల’ సమస్యపై బీజేపీ పాలకులు నడిపిన తంతుపై సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ వేసిన పాకెట్ కార్టూన్ (23.9.2023) వీరి రాజకీయాలను పట్టిస్తుంది. ‘మీ మహిళా రిజర్వేషన్ల కోటా 2039లో వస్తుంది. అయితే దాన్ని పెద్దగా ఆలస్యమైనట్టు మీరు భావించకండి. 2024లోనే మీ కోటాను మీకు కాగితం మీద కల్పిస్తాం. కానీ ఈలోగా, అంటే 2024లోనే మీ ఓటును మాకు ముందస్తు క్రెడిట్గా వేయండి’ అని ప్రధాని ముక్తాయించడం అసలు ‘చరుపు’! కానీ, ఆ 2039 నాటికి ఎవరుంటారో, ఎవరు ఊడతారో మాత్రం తెలియకపోవడం అసలు ‘మర్మం’! అందుకే అన్నాడేమో వేమన: ‘‘కులము గలుగువారు, గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగు వారు,పసిడి గల్గు వాని బానిస కొడుకులు!’’ ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
పశువుల మందులకు వేగంగా ఎన్వోసీ.. ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు, నో–అబ్జెక్షన్ సర్టిఫికేషన్ (ఎన్వోసీ) జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నాంది పేరిట పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సోమవారం దీన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఔషధాలు, టీకాల దిగుమతి, తయారీ, మార్కెటింగ్ మొదలైన వాటి నియంత్రణ అనేది ఆరోగ్య శాఖలో భాగమైన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పరిధిలోకి వస్తుంది. అయితే, వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించి మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖతో సంప్రదింపుల తర్వాత అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్గా ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంది (ఎన్వోసీ అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టం) పోర్టల్ను ఆవిష్కరించినట్లు రూపాలా చెప్పారు. తాజా పరిణామంతో ఇకపై సీడీఎస్సీవో సుగమ్ పోర్టల్లో దాఖలు చేసిన దరఖాస్తును పశు సంవర్ధక, డెయిరీ విభాగానికి పంపిస్తారు. దరఖాస్తుదారు ఆన్లైన్లో అవసరమైన పత్రాలను దాఖలు చేయాలి. పశు సంవర్ధక శాఖలోని సాధికారిక కమిటీ అప్లికేషన్ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎన్వోసీని ఆన్లైన్లో జారీ చేస్తారు. -
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్లో కూడా ఎన్నో బూస్టర్ డోస్లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతంగా!
కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఇస్తున్నప్పుడు... దాని ప్రభావం నేపథ్యంలో ఇతర చికిత్సలు అంత ప్రభావవంతంగా ఉండవేమోనంటూ అప్పట్లో చాలామంది డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చాక చేసిన నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ అనే ఒక రకం గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చినట్లు డాక్టర్లు, పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ చికిత్స మరింత బాగా జరిగేందుకు ఈ వ్యాక్సిన్ డోసులు దోహదం చేసినట్లు గ్రహించారు. వాస్తవానికి నేసోఫ్యారింజియల్ క్యాన్సర్కు యాంటీ పీడీ–1 థెరపీ అనే చికిత్స అందిస్తుంటారు. ఇది పీడీ–1 రిసెప్టార్స్ అనే జీవాణువులను అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం ద్వారా మందు ఇమ్యూన్ కణాలకు స్వేచ్ఛనిస్తుంది. దాంతో ఆ ఇమ్యూన్ కణాలు స్వేచ్ఛగా క్యాన్సర్ గడ్డకు కారణమయ్యే అంశాలపై యుద్ధం చేస్తాయి. ఇలా యాంటీ పీడీ–1 చికిత్స పనిచేస్తుంది. మనకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు... అది మన దేహంలో ఇమ్యూన్ ప్రతిస్పందనలు వచ్చే మార్గాల్లోని (పాత్ వేస్లోని) సిగ్నల్స్ను మరింతగా ప్రేరేపిస్తుంది. అలాంటప్పుడు ఆ సిగ్నల్స్ చురుగ్గా పనిచేస్తున్న కారణంగా క్యాన్సర్ చికిత్సకు ఇచ్చే మందులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయోనని డాక్టర్లు తొలుత ఆందోళన చెందారు. ‘‘యాంటీ పీడీ–1 థెరపీకి ఈ వ్యాక్సిన్ అడ్డంకిగా మారవచ్చేమోనని తొలుత మేం భయపడ్డాం. ఎందుకంటే ఈ నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ ఏ భాగాన్నైతో ప్రభావితం చేస్తుందో... కరోనా (సార్స్–సీవోవీ–2) కూడా అక్కడే ప్రభావం చూపుతుంది’’ అంటూ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్కు చెందిన బయోఇన్ఫర్మాటిక్స్ సైంటిస్ట్ జియాన్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అయితే వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే... వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో యాంటీ పీడీ–1 ఔషధాలు మరింత సమర్థంగా పనిచేయడం మమ్మల్ని అబ్బురపరచింది’’ అంటూ అదే యూనివర్సిటీకి చెందిన ఇమ్యూనాలజిస్ట్ క్రిస్టియన్ కర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిశోధక బృందం... నేసోఫ్యారింజియల్ క్యాన్సర్తో అక్కడి 23 ఆసుపత్రుల్లోని 1,537 మంది బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 373 మంది బాధితులకు క్యాన్సర్ చికిత్సకు ముందు ‘సైనో–వ్యాక్’’ అనే కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో క్యాన్సర్ మందు చాలా సమర్థంగా పనిచేసింది. అంతేకాదు... వారిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. ‘‘ఇది ఎలా జరిగిందో ఇప్పటికైతే మాకు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. బహుశా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... వారికి అందించిన మందుల వల్ల బాధితుల్లోని ఇమ్యూన్ వ్యవస్థ మరింత ప్రేరేపితమై ఉండవచ్చు. దాంతో ఈ ఫలితాలు వచ్చి ఉండవచ్చు’’ అని చైనాలోని శాంగ్జీ యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన క్యాన్సర్ పరిశోధకుడు క్వీ మెయ్ అభిప్రాయపడుతున్నారు. యూఎస్, యూకేలలో నేసో ఫేరింజియల్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువ. అయితే చైనా వంటి ఆసియా దేశాలతో ఇది ఎక్కువ. ఇక తైవాన్లో దీనివల్ల మరణాలూ మరింత ఎక్కువ. ఇప్పటివరకు కేవలం ఒక రకం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన బాధితులపైనే ఈ పరిశోధన జరిగింది. ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరిగి, అసలు ఈ మెకానిజమ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘యానల్స్ ఆఫ్ ఆంకాలజీ’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
అమ్మో కుక్క...పీకేస్తుంది పిక్క
ఈ బాలుడు రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. గత నెల 28న స్కూల్కు వెళుతుండగా వీధి కుక్క కరిచింది. అదే సమయంలో పక్కనే మరో విద్యార్థుని సైతం గాయపరిచింది. మధ్యాహ్నం మరొకరిని, సాయంత్రం ట్యూషన్కు వెళుతున్న మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఒక్క రోజే ఐదుగురు విద్యార్థులు కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి ఒక్క రాయదుర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి. వెలుగు చూస్తున్నవి కొని...వెలుగులోకి రానివి మరెన్నో.... రాయదుర్గం: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలినడకన వెళుతున్న వారే కాదు.. పశువులు, మేకలు, గొర్రెలు, ద్విచక్ర వాహన చోదకులు సైతం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు. మూడు నెలల్లో 2,978 కేసులు కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన మూడు నెలల్లో 2,978 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం క్రితం రాయదుర్గంలోని దాసప్ప రోడ్డు, చికెన్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిక్కలు పీకేశాయి. ఇక ద్విచక్ర వాహనాల వెంట పడుతూ బెంబేలెత్తిస్తుండడంతో పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడుతో పాటు అనంతపురం నగర పాలక సంస్థలోనూ కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి నియంత్రణ, సంరక్షణ కోసం రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యర్థాలతో అనర్థాలు పట్టణ, గ్రామీణ, నగర ప్రాంతాల్లోని పలు చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వీటి కోసం పదుల సంఖ్యలో కుక్కలు గుమికూడి పోట్లాడుకుంటూ రోడ్డున వెళుతున్న వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కోడిమాంసాన్ని అధికంగా తినడంవల్ల తరచూ దుష్ప్రభావాలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలి వంటి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయని, సరిగా ఉడికించకపోతే ఈ బ్యాక్టీరియా మనిషిలో అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. పచ్చి మాంసం, వ్యర్థాలను తినడం వల్ల కుక్కల్లో పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిపై దాడికి తెగబడుతాయని అంటున్నారు. చర్యలు తీసుకుంటాం గతంలో రీజియన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రానికి వీధికుక్కలు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేవాళ్లం. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – దివాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం అందుబాటులో టీకా జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రిలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో కుక్క కాటుకు టీకా అందుబాటులో ఉంది. కుక్క కాటు బాధితులు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో టీకా వేయించుకోవచ్చు. శీతాకాలంలో కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరిచే కుక్కలు ఉంటే ముందస్తుగా వాటికి రేబిస్ టీకా వేయించాలి. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ, అనంతపురం (చదవండి: బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..) -
BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్టెక్’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లెమ్ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్ సాహిన్ చెప్పారు. తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్లో బాధితులపై వ్యాక్సిన్ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
కరోనా టీకాలపై వివాదం.. కోర్టుకెక్కిన మోడెర్నా..
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైజర్, బయోఎన్టెక్ ఏంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు. చదవండి: లండన్లో గోమాతకు పూజలు.. రిషి సునాక్పై నెటిజెన్ల ప్రశంసలు.. -
Telangana: బీఈ పెట్టుబడి రూ.1,800కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీయెత్తున పెంచేందుకు ఏకంగా రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది. రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ ప్రకటించింది. గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం తరువాత బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వివరాలు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం ప్రతి ఏడాదీ 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే.. బీఈ తాజా విస్తరణతో 1,400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు. కోవిడ్ నివారణ టీకా జెన్సెన్, ఎమ్మార్ పీసీవీ , టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు.. టెటనస్ టాక్సైడ్ యాంపూల్స్, జెనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. సుదీర్ఘ చరిత్ర గల బీఈ సంస్థ దాదాపు నాలుగు వ్యూహాత్మక బిజినెస్ యూనిట్లను కలిగి ఉందన్నారు. కోవిడ్ నేపథ్యంలో సకాలంలో స్పందించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మౌలిక వసతులు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే.. ప్రపంచ టీకా అవసరాల్లో మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే తీరుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఈ విస్తరణను సగర్వంగా.. సంతోషంగా ప్రకటిస్తున్నానని, దీనిద్వారా టీకా రంగంలో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం మీద ఏడాదికి 900 కోట్ల టీకాలు తయారవుతున్నాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీకాల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన క్లస్టర్ అని వివరించారు. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, స్పెషల్ ఎకనామిక్ జోన్, డ్రై, వెట్ లాబోరేటరీలు , ఇంక్యుబేషన్ సౌకర్యాలు ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులోని దాదాపు 200 పరిశ్రమల్లో 15 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు నోవార్టిస్, గ్లాక్సో స్మిత్క్లైన్, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డూపాంట్, లోంజా తదితర కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్లో వ్యాక్సిన్లతో... 42 లక్షల ప్రాణాలు నిలిచాయి
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు. 2 కోట్ల ప్రాణాలు పోయేవి కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది. 17 వేలకు పైగా కేసులు న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. -
జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం !
హెల్త్కేర్ రంగంలో దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ల తయారీపై వెనక్కి తగ్గింది. మార్కెట్లో వివిధ కంపెనీలు భారీ ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం దీనికి తోడు డిమాండ్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలపై పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటికే ఫైజర్, మోడెర్నా, సీరమ్, భారత్బయోటెక్, ఇండియా, రష్యా, ఇంగ్లండ్లకు చెందిన పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి తెచ్చాయి. అయితే కరోనా వేవ్లు ఒకదాని తర్వాత ఒకటిగా ముంచెత్తడంతో 2021 చివరి వరకు వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గలేదు. గతేడాది 2.38 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల అమ్మకాలు సాగించింది. ఇదే క్రమంలో ఈ ఏడాది 3.5 బిలియన్ డాలర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ అమ్మకాలు 457 మిలియన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో కూడా 75 శాతం అమ్మకాలు బయటి దేశాల్లోనే జరిగాయి. యూఎస్లో కేవలం 25 శాతం అమ్మకాలే నమోదు అయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కోవిడ్ ప్రభావ శీలత తగ్గిపోయిందా అనే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధంతో సప్లై చెయిన్లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా గతంలో ఉన్న స్థాయిలో కోవిడ్ భయాలు ఉండటం లేదు. పైగా అనేక కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నిర్దేశించుకున్న వ్యాక్సిన్ల అమ్మకాల లక్ష్యాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ సస్పెండ్ చేసింది. చదవండి: చైనాకు మరోసారి గట్టిషాకిచ్చిన కోవిడ్-19..! -
కాంబినేషన్ వ్యాక్సిన్లు అంటే...
గతంలో ఒక్కో రకం వైరస్కు నిర్దిష్టంగా ఒక్కో వ్యాక్సిన్ ఇచ్చేవారు. అటు తర్వాత ఒక్క వ్యాక్సిన్ డోస్లోనే అనేక రకాల వ్యాక్సిన్లను ఒకేసారి ఇవ్వడం సాధ్యమైంది. ఇలా ఒకే డోస్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనేలా రూపొందించిన వ్యాక్సిన్లనే కాంబినేషన్ వ్యాక్సిన్లు అంటారు. ఉదాహరణకు ‘ఎమ్ఎమ్ఆర్ ప్లస్ వారిసెల్లా’ అనే వ్యాక్సిన్ ద్వారా మీజిల్స్, మంప్స్, రుబెల్లా, వారిసెల్లా అనే సమస్యలకూ, ‘డీటీఏపీ ప్లస్ ఐపీవీ’ అనే వ్యాక్సిన్ వల్ల డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, పోలియో అనే సమస్యలకు ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారానే నివారణ లభిస్తుంది. ఇలాంటి రకరకాల కాంబినేషన్ వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల మాటిమాటికీ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అగత్యం తప్పుతుంది. ఒకే ఇంజెక్షన్ ద్వారా మూడు/ నాలుగు/ఐదు సమస్యలను నివారించవచ్చు. చిన్నారులు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి అంత సుముఖంగా ఉండరు. అందుకే కాంబినేషన్ వ్యాక్సిన్లతో మాటిమాటికీ హాస్పిటల్కు వెళ్లాల్సిరావడంతో పాటు కొన్ని వ్యాక్సిన్లను మిస్ అయ్యే అనర్థాల్లాంటివి చాలావరకు తప్పుతాయి. టీకా వేయించాల్సిన చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు తమ పీడియాట్రీషియన్ను కలిసి, ఏయే కాంబినేషన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో, తమ బిడ్డకు ఏవేవి అవసరమవుతాయో తెలుసుకుంటే, తక్కువ ఇంజెక్షన్లలోనే ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వడానికి వీలవుతుంది. చదవండి: (కిడ్నీలో రాళ్ల తొలగింపు ఇప్పుడు తేలికే!) -
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై నేటికి ఏడాది!!
కరోన మహమ్మారితో విలవిలలాడిపోయిన భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తైయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ "ప్రపంచంలో అత్యంత విజయవంతమైనది"గా పేర్కొన్నారు. గతేడాది ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన అభినందించారు. ఈ మేరకు మాండవ్వ మాట్లాడుతూ.." ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి నేటికి ఒక ఏడాది పూర్తైయింది. 'సబ్కే ప్రయాస్'తో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ప్రక్రియ నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియగా అభివర్ణించారు. అంతేకాదు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్కి సహాయ సహకారాలు అందించిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పైగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏవిధంగా ప్రారంభమైందో ఎలా విజయవింతమైందో వంటి విషయాలకు సంబంధించిన గ్రాఫికల్ చార్ట్లను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ జనవరి 16, 2021న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపు 156.76 కోట్లకు పైగా డోసులను అందించింది. గత 24 గంటల్లో సుమారు 66 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందిచారు. అంతేగాక భారత్లో గడిచిన 24 గంటల్లో 2,71,202 కొత్త కోవిడ్ -19 కేసులు, 314 మరణాలు సంభవించగా, 1,38,331 రికవరీలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. Have a look at the journey of #1YearOfVaccineDrive, that gives glimpses of the nation's collective fight against #COVID19 under the visionary and inspiring leadership of PM @NarendraModi Ji. pic.twitter.com/Hit9Ku8rzS — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022 (చదవండి: ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో భారత్లో కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట కోవిడ్ నిబంధనల అతిక్రమణ చేయవద్దని కోరింది. తక్షణమే టీకాలు తీసుకోవడం, కోవిడ్ సమయంలో పాటించాల్సిన పద్ధతులు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) పాటించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం చేయాలని సూచించింది. ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్ వేరియంట్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ తెలిపారు. ఏరకమైన వేరియంట్ సోకినా ఒకటే చికిత్స అందించాలన్నారు. ఇంతవరకు దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని, వీటిలో 183 కేసులను విశ్లేషించగా అందులో 121 కేసులు విదేశీ ప్రయాణికులవని తెలిపింది. 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ముగ్గురైతే బూస్టర్ డోసు తీసుకున్నారని వివరించింది. వీరిలో 70 శాతం మందిలో ఒమిక్రాన్ సోకినా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద కదలాడుతోంది. దేశీయంగా కేరళ, మిజోరాంలో జాతీయ సగటు కన్నా అధిక పాజిటివిటీ నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తం మీద 20 జిల్లాల్లో(కేరళలో 9, మిజోరాంలో 8)పాజిటివిటీ రేటు 5– 10 శాతం మధ్య ఉందని తెలిపింది. ఒమిక్రాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రైవేట్ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వీటితో ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. యూపీలో రాత్రి కర్ఫ్యూ ఈనెల 25 నుంచి ఉత్తరప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలాంటి కార్యక్రమాలకు 200కు మించి హాజరు కారాదని తెలిపారు. రోడ్లపై తిరిగేవారికి మాస్కు తప్పనిసరి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ముంబైలో రాత్రిపూట ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్డోర్ ఫంక్షన్లలో 100 మంది లేదా హాలు సామర్ధ్యంలో 50 శాతం కన్నా ఎక్కువమంది, అవుట్ డోర్ కార్యక్రమాల్లో 250 మంది లేదా సమావేశ ప్రాంత మొత్తం సామర్ధ్యంలో 25 శాతం కన్నా ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది. జార్ఖండ్లోని రాంచీలో జనం రద్దీ -
Omicron Variant: మళ్లీ ఆంక్షల చట్రంలోకి.. మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి
లండన్, జోహెన్నెస్బర్గ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్(బి.1.1.529) కేసులు పలు దేశాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇజ్రాయెల్లో కేసులు నిర్ధారణయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బ్రిటన్లో ముగ్గురికి, ఆస్ట్రేలియాలో ఇద్దరికి, జర్మనీలో ఇద్దరికి, ఇటలీ, ఇజ్రాయెల్, బెల్జియంలలో ఒక్కొక్కరికీ ఈ వేరియెంట్ సోకిందని పరీక్షల్లో తేలింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్కు వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైతే వారిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఖతర్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెల్టా కంటే శరవేగంగా ఈ వేరియెంట్ కేసులు వ్యాపిస్తూ ఉండడంతో భయాందోళనలకు లోనైన 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. ఇజ్రాయెల్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది. యూకేలో మళ్లీ మాస్కులు ఇంగ్లాండ్లో మంగళవారం నుంచి దుణాకాలు, వ్యాపారసముదాయాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మంగళవారం నుంచి మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయనున్నారు. యూకేకు వచ్చే విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావేద్ ఆదివారం వెల్లడించారు. మొరాకో సోమవారం నుంచి రెండువారాల పాటు తమ దేశంలోకి వచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రపంచానికి త్వరితంగా వెల్లడిస్తే శిక్షిస్తారా? ఒమిక్రాన్ వేరియెంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల్ని రానివ్వకపోవడం అత్యంత క్రూరమైన చర్యని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఎంతో ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి కొత్త వేరియెంట్ని కనుగొనడం తమకు శిక్షగా మారిందని అంటోంది. ‘‘సైన్స్ అద్భుతం చేస్తే ప్రశంసించాలి కానీ శిక్షించకూడదు’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘రిస్క్’ ఉన్న దేశాల నుంచి వస్తే... ఆర్టీ–పీసీఆర్ ఫలితాలొచ్చాకే ఇంటికి న్యూఢిల్లీ: ‘రిస్క్’ దేశాల నుంచి (ఒమిక్రాన్ జాడలు బయటపడుతున్న దేశాలు) లేదా వాటిమీదుగా వస్తున్న ప్రయాణికులు అందరూ భారత్లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాలు వచ్చేదాకా వారు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ట్రాన్సిట్లో ఉన్న వారు కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే... తదుపరి ప్రయాణం నిమిత్తం విమానాల్లోకి బోర్డింగ్ కావొచ్చని తెలిపింది. సురక్షిత జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తారని, అయితే 14 రోజుల పాటు వీరు స్వీయ ఆరోగ్యపరిరక్షణ చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఐదుశాతం మందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యోశాఖ వెల్లడించింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా ఈ నెల 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంటో, కాదో తేల్చుకోవడానికి అతని శాంపిల్స్ను జినోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ రక్షణను ఏమార్చొచ్చు: గులేరియా ‘‘ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కొమ్ములో 30 పైచిలుకు జన్యుపరమైన మార్పులున్నట్లు సమాచారం. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఒమిక్రాన్పై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయనేది (ఈ వేరియెంట్ నుంచి ఎంతమేరకు రక్షణ కల్పిస్తాయనేది) నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ పైనుండే కొమ్ముల ద్వారానే కరోనా ఆతిథ్య కణంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుందనే విషయం తెలిసిందే. ‘ఎక్కువమటుకు వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్ (వైరస్పై నుంచే కొమ్ములకు)లకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. అలాంటి స్పైక్ ప్రొటీన్లో పెద్దసంఖ్యలో జన్యుపరమైన మార్పులుంటే యాంటీబాడీలు వాటిని అంత సమర్థంగా అడ్డుకోలేకపోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనేది పరిశోధించి నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ముప్పు అన్ని దేశాలకు పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచడం, కరోనా పరీక్షలు ఎక్కువ చేయడం, కరోనా హాట్స్పాట్ల్లో నిరంతర పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయడం, ప్రజలందరూ కోవిడ్–19 నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దక్షిణాఫ్రికా, హాంగ్కాంగ్, బోస్ట్వానా నుంచి వచ్చే ప్రయాణికుల్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని, అందరికీ కరోనా పరీక్షలతో పాటు ఏ వేరియెంట్ సోకిందో తెలిసే వరకు క్వారంటైన్లో ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించానికి ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపాలన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. 5శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉండేలా రాష్ట్రాలన్నీ చర్యలు చేపట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్ అన్న విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కృషి చెయ్యాలన్నారు. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పని చేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. -
టీకా వద్దనేవారు తగ్గిపోతున్నారు!
న్యూఢిల్లీ: భారత జనాభాలో కోవిడ్ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది. దేశ జనాభాలో టీకాలపై సందేహాలున్న వారి సంఖ్య కేవలం 7 శాతానికి చేరిందని, టీకాలివ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ఠ స్థాయని సర్వే తెలిపింది. 301 జిల్లాల్లో 12,810 మందిని వ్యాక్సినేషన్పై ప్రశ్నించారు. వీరిలో 67 శాతం మగవారు కాగా 33 శాతం మంది మహిళలు. వీరిలో ఇప్పటివరకు టీకా తీసుకోనివారిని ప్రశ్నించగా 46 శాతం మంది కనీసం తొలిడోసైనా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం 27 శాతం మంది మాత్రం ఇంకా టీకాపై నమ్మకం కుదరడం లేదని, మరింత డేటా వచ్చాక టీకా తీసుకుంటామని చెప్పినట్లు సంస్థ అధిపతి సచిన్ తపారియా తెలిపారు. భారత్లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా వీరిలో 68 కోట్ల మంది కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకున్నవారున్నారు. సర్వే ఫలితాలను దేశజనాభాతో పోల్చిచూస్తే 7 శాతం మంది అంటే సుమారు 26 కోట్లమంది ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోలేదు. వీరిలో కొంతమంది త్వరలో టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ఆరంభమైనప్పుడు దేశ జనాభా(వయోజన)లో దాదాపు 60 శాతం మంది టీకాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్వేవ్ అనంతరం టీకాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా టీకాల పంపిణీ ఆరంభించడం కూడా ప్రజల్లో వ్యాక్సినేషన్కు ప్రాచుర్యం లభించేందుకు కారణమైంది. ఎందుకు వద్దంటే... టీకాలను వద్దనే సందేహరాయుళ్లు తమ వ్యతిరేకతకు పలు కారణాలు చెబుతున్నారు. కొత్తవేరియంట్ల నుంచి టీకా కల్పించే రక్షణపై సందేహాలను వెలుబుచ్చుతున్నారు. వీరి అనుమానాల్లో కొన్ని... ► సరైన పరీక్షలు పూర్తికాకముందే హడావుడిగా టీకాలకు అనుమతులిచ్చారు, కాబట్టి వాటితో లభించే రక్షణపై సందేహాలున్నాయి. ► టీకాలతో సైడ్ఎఫెక్టులుంటాయి, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు టీకాతో అనవసర సమస్యలు వస్తాయి. ► కొత్తగా వచ్చే వేరియంట్లను ప్రస్తుత టీకాలు ఎలాగూ రక్షించలేవు. అందువల్ల మరింత శక్తివంతమైన వ్యాక్సిన్లు వచ్చాక ఆలోచిద్దాం. ► మాకు బ్లడ్ క్లాటింగ్ సమస్యలున్నాయి అందుకే టీకాకు దూరంగా ఉంటున్నాము. ► మానవ పయ్రత్నం ఏమీ లేకుండా ఎలా వచ్చిందో అలాగే కోవిడ్ మాయం అవుతుంది, దానికోసం టీకాలు అవసరం లేదు. టీకాలపై మారుమూల ప్రాంతాల్లో వ్యాపించిన మూఢనమ్మకాలు, అభూత కల్పనలు కొందరిని టీకాకు దూరంగా ఉంచుతున్నాయి. వ్యాక్సినేషన్ తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారింది. జనాభాలో వీలైనంత ఎక్కువమందికి టీకాలు అందితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
కరోనాకు ముగింపు లేదా!?
‘కరోనా కార్చిచ్చులాంటిది.. అడవి మొత్తం తగలబడే వరకు కార్చిచ్చు ఆరదు, అలాగే మానవాళి మొత్తానికి ఒక్కసారైనా సోకే వరకు కరోనా ఆగదు’ అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు. మానవాళి మరికొన్ని సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇమ్యూనిటీ పెరగడం కన్నా టీకాలతో ఇమ్యూనిటీ పెంచడం మంచిదంటున్నారు. వ్యాక్సినేషన్తోనే దీన్ని అరికట్టడం సాధ్యమని మరోమారు గుర్తు చేస్తున్నారు. సంవత్సరన్నరకు పైగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనాకు నిజంగా ముగింపు ఉందా? ఉంటే ఎప్పుడు? ఎలా? అనేవి ప్రతిఒక్కరిలో తలెత్తే ప్రశ్నలు. కానీ ఇంతవరకు సైంటిస్టులు దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వచ్చే 3–6 నెలల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చన్న అంశంపై సైంటిస్టులు పరిశోధన జరిపారు. అయితే వచి్చన సమాధానాలు ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పారు. రాబోయే కాలంలో మరలా కరోనా ప్రబలవచ్చని, దీనివల్ల స్కూళ్లు మూతపడడం, టీకాలు తీసుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్ భయాలు పెరగడం, ఆస్పత్రులు కిటకిటలాడటం జరగవచ్చని హెచ్చరించారు. కరోనాకు నిజమైన ముగింపు వచ్చే లోపు ప్రపంచంలో ప్రతిఒక్కరూ దీని బారిన ఒక్కసారైనా పడటం లేదా టీకా తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు దురదృష్టవంతులకు రెండుమార్లు కరోనా సోకే ప్రమాదం కూడా ఉండొచ్చన్నారు. అందరికీ కరోనా సోకేవరకు వేవ్స్ రాకడ ఆగకపోవచ్చని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, తిరిగి తగ్గడం గమనించవచ్చని అమెరికా సైంటిస్టు మైకేల్ ఓస్టర్ హామ్ అభిప్రాయపడ్డారు. మ్యుటేషన్లతో ప్రమాదం వైరస్ల్లో వచ్చే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతాయన్నది తెలిసిందే! కరోనాలో మ్యుటేషన్ మెకానిజం ఇతర వైరస్లతో పోలిస్తే మెరుగ్గాఉంది. గత వేరియంట్లలో లోపాలను దిద్దుకొని కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇందువల్ల రాబోయే కాలంలో ఫ్లూలాగానే ఎప్పటికప్పుడు కరోనాకు టీకా (బూస్టర్ డోస్లు) టాప్అప్లు తీసుకోవాల్సిరావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కొన్ని మ్యుటేషన్ల అనంతరం ఫస్ట్జనరేషన్ వ్యాక్సిన్లను తట్టుకునే వేరియంట్ రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేకాకుండా కొత్త రకం ఫ్లూ వైరస్ మానవాళిపై దాడి చేసే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ శాస్త్రవేత్త కంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా 5,6 నెలల్లో మాత్రం కరోనా మాయం కాకపోవచ్చని సైంటిస్టుల ఉమ్మడి మాట. ప్రపంచ జనాభాలో 95 శాతం వరకు ఇమ్యూనిటీ(కరోనా సోకి తగ్గడం వల్ల లేదా టీకా వల్ల) వస్తేనే కోవిడ్ మాయం అవుతుందని చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి అత్యుత్తమ మార్గం వ్యాక్సినేషనేనని చెప్పారు. కరోనా ముగింపు ప్రపంచమంతా ఒకేదఫా జరగకపోవచ్చని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో(టీకా కార్యక్రమం పూర్తికావడం బట్టి) కరోనా మాయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏం జరగవచ్చు ఒకపక్క కోట్లాదిమందికి టీకా అందలేదు, మరోపక్క ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. ఈ రెండింటి సమ్మేళనంతో మరలా కేసులు పెరగవచ్చని మైకేల్ అంచనా వేశారు. టీకా కార్యక్రమాల వేగం పెరిగినా, వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నవారు(ఉదాహరణకు పసిపిల్లలు, టీకా అందని వారు, బ్రేక్థ్రూ ఇన్ఫెక్షన్ బారిన పడేవారు) ఎప్పుడూ ఉంటారన్నారు. రాబోయే కొన్ని నెలలు ప్రమాదమని, ముఖ్యంగా టీకా నిరోధక వేరియంట్ వస్తే మరింత ప్రమాదమని సైంటిస్టుల అంచనా. 130 ఏళ్ల క్రితం మనిíÙని ఐదుమార్లు వణికించిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ఉదంతాన్ని గమనిస్తే కరోనా భవిష్యత్పై ఒక అంచనా రావచ్చని భావిస్తున్నారు. వీటిలో ఒక దఫా సుమారు ఐదేళ్లు మానవాళిని పీడించింది. ఆ ఐదేళ్లలో 2–4 వేవ్స్ వచ్చాయి. దీనికన్నా కరోనా ప్రమాదకారని, కనుక థర్డ్వేవ్ తప్పదని లోనే సిమన్సన్ అనే సైంటిస్టు అభిప్రాయపడ్డారు. అధిక వ్యాక్సినేషన్లు, ఆధునిక సౌకర్యాలున్న అగ్రరాజ్యాల్లో సైతం మరలా కేసులు పెరుగుతున్న సంగతి గుర్తు చేశారు. టీకాల వల్ల మరణాలు తగ్గవచ్చని, కానీ కేసులు పెరగడం ఆగకపోవచ్చని చెప్పారు. ముఖ్యంగా టీకాలు పెద్దగా కనిపించని మెక్సికో, ఇరాన్ లాంటి దేశాల్లో డెల్టాతో డేంజర్ పెరగవచ్చని చెప్పారు. టైమ్ గడిచేకొద్దీ వైరస్లు బలహీనపడతాయన్న అపోహ వద్దన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
వృద్ధులకు కరోనా ముప్పు
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి నుంచి ముప్పు తప్పినట్లేనని ఇన్నాళ్లూ భావించాం. కానీ, తాజాగా అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) నిర్వహించిన అధ్యయనంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ వయసు మీద పడిన వారిలో కరోనా ముప్పు అధికంగా ఉంటున్నట్లు తేలింది. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు కరోనా సోకితే వ్యాక్సిన్ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. గత ఎనిమిది నెలల్లో రెండు డోసులు తీసుకున్నాక కూడా ఆస్పత్రి పాలైన వారు, లేదంటే ప్రాణాలు కోల్పోయిన వారు 12,908 వరకు ఉన్నారని తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారిలో 70 శాతానికి పైగా మంది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే. ఇక కరోనాతో మృతి చెందిన వారిలో 87 శాతం మందికి పైగా 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నావారే. సీడీసీ తాజాగా కరోనా కేసుల తీరు తెన్నుల్ని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. -
దేశంలో 45,083 కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్లో ఆదివారం 45,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,558కు పెరిగింది. యాక్టివ్ కేసులు పెరగడం ఇది వరుసగా అయిదో రోజు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.13 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 460 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,37,830కు చేరుకుంది. శనివారం 17,55,327 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 2.28గా నమోదైంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 63.09 కోట్ల డోసుల టీకాలు వేశారు. ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు కేరళలో 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 29,836 కరోనా కేసులు బయటపడ్డాయి. -
రొటీన్గా చెయ్యాలని అనుకోవడం లేదు..
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ ప్రజలందరూ కచ్చితంగా స్వచ్ఛ భారత్ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని అయినప్పటికీ అందరూ ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాని ఆదివారం 80వ ఎపిసోడ్లో మాట్లాడారు. స్వచ్ఛభారత్ అనగానే అందరికీ ఇండోర్ నగరమే మదిలోకి వస్తుందని, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంతో ఈ నగర ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. నీటి సంరక్షణలో కూడా అద్భుతాలు సాధించి దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఆవిర్భవించిందని అన్నారు. యువతరం మారుతోంది దేశంలో యువత ఏదో ఒకటి రొటీన్గా చెయ్యాలని అనుకోవడం లేదని, ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారని ప్రధాని అన్నారు. వారి ఆలోచన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందని, ఏదైనా సృజనాత్మకంగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి చాలా శక్తివంతమైనదిగా మారిందని, చిన్న నగరాల్లోని యువకులూ స్టార్టప్లను ప్రారంభిస్తున్నారని మోదీ అన్నారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో హాకీ టీమ్ సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ‘‘ఇవాళ మేజర్ ధ్యానచంద్ జయంతి. ఆయన స్మృత్యర్థం జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో గెలుచుకున్న ప్రతీ పతకం ఎంతో విలువైనది. హాకీలో పతకం కొట్టగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. మేజర్ ధ్యాన్చంద్జీ కూడా సంతోష పడే ఉంటారు’’అని వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, స్టార్టప్ల ఏర్పాటులో తలమునుకలై ఉన్నారని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, యావత్ ప్రపంచం వాటికే దాసోహం అంటోందని ప్రధాని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ‘‘సంస్కృతం చాలా సులభంగా.. ఎంతో తియ్యగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జాతీయ ఐక్యతను కాపాడుతుంది’’అని పేర్కొన్నారు. థాయ్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడానికి ఎందరో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. -
హైదరాబాద్ ఎన్ఐఏబీ ఇక సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా అప్గ్రేడ్ చేసి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం ఈమేరకు హైదరాబాద్లోని ఎన్ఐఏబీతో పాటు, పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ సంస్థను కూడా అప్గ్రేడ్ చేసి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా నోటిఫై చేసినట్లు శనివారం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్లను త్వరితగతిన పరీక్షించి ధ్రువీకరణ ఇచ్చి కోవిడ్ మహమ్మారి నివారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. ప్రతి నెలా 60 బ్యాచ్ల వ్యాక్సిన్లను పరీక్షించే సామర్థ్యం ఈ ల్యాబ్లకు ఉన్నట్టు తెలిపింది. -
బూస్టర్ డోసులు ఇప్పుడే వద్దు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నుంచి రక్షణ కోసమని రెండు డోసులకు అదనంగా ‘బూస్టర్ డోస్’ ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ క్లినికల్ సైంటిస్ట్, వైరాలజిస్ట్ డాక్టర్ గగన్దీప్ కాంగ్ స్పష్టం చేశారు. ముందుగా దేశంలో అత్యధికశాతం వయోజనులకు టీకాలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేసేందుకు కొంత సమయం పడుతుందని.. అప్పుటికి బూస్టర్లు అవసరమా, ఎప్పుడు వేసుకుంటే మంచిదనే డేటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికిప్పుడు బూస్టర్ డోసులకోసం వెర్రిగా వెళితే.. ఆశించిన ప్రయోజనాలు చేకూరడం సందేహమేనని చెప్పారు. వేర్వేరు వ్యాక్సిన్లను కలపడంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరికిగానీ స్పష్టత రాదని చెప్పారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (వీఎంసీ) గ్యాస్ట్రో ఇంటెస్టినల్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న గగన్దీప్ కాంగ్.. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్లకు సంబంధించి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వూ్యలో పలు కీలక వివరాలు వెల్లడించారు. ఆ ఇంటర్వూ్య వివరాలివీ.. వ్యాక్సిన్ల ప్రభావంపై స్పష్టత వచ్చాకే.. ఒకసారి టీకా వేసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు రక్షణ ఉంటుందనేది నా అంచనా. కోవిడ్ వైరస్ బయటపడి ఏడాదిన్నర మాత్రమే అయింది. భారత్లో వ్యాక్సిన్లు వేయడం మొదలై ఏడెనిమిది నెలలే అయింది. అందువల్ల బూస్టర్పై ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు. అందరూ రెండు డోసుల టీకా వేసుకున్నాక.. వ్యాక్సిన్ల ప్రభావంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. మరో ఏడాది జాగ్రత్త.. జనం ఒక ఏడాదిపాటు భారీగా గుమిగూడటం, పండుగలు, పబ్బాలు చేసుకోవడానికి ఎక్కువమంది కలవడం వంటివి చేయకపోవడం మంచిది. వ్యక్తులుగా, కుటుంబాలుగా, చిన్నచిన్న బృందాలుగా వేడుకలు చేసుకుంటేచాలు. అప్పటికల్లా వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయి, కరోనా నుంచి రక్షణ ఉంటుంది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి ఏమిటి? గగన్దీప్ కాంగ్: దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గిందనే చెప్పాలి. రెండో వేవ్ కనుమరుగవుతున్నట్టే. అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నా రోజువారీ కేసుల సంఖ్య 30–40వేలలోపే ఉండటం సానుకూల అంశమే. అయినా ప్రభుత్వం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓవైపు టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.. పరీక్షల సంఖ్యను పెంచాలి. నిజానికి వ్యాక్సినేషన్ వేగం పుంజుకుని, స్వల్పలక్షణాలతో కరోనా కేసులు వచ్చినా పెద్ద సమస్య కాబోదు. కానీ సీరియస్ కేసులు, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం వంటివి జరిగితే.. కోవిడ్ తీవ్రరూపం దాల్చినట్టు భావించాలి. ఇప్పటికే థర్డ్వేవ్ మొదలైందని అంటున్నారు.. నిజమేనా? నేనలా అనుకోవడం లేదు. స్థానిక పరిస్థితులు, పరిణామాలను బట్టి కొన్నిచోట్ల కేసులు పెరుగుతాయి. ఆయా చోట్ల మూడో, నాలుగో, ఐదో వేవ్లు వస్తాయి. ఒకవేళ కొత్త వేరియెంట్ పుడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఇప్పటిౖకైతే దేశంలో కొత్తగా ప్రమాదకర మ్యూటెంట్లు, వేరియెంట్లు వచ్చినట్టుగా ఎలాంటి ఆధారాల్లేవు. ఈ సానుకూల పరిస్థితిని ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయాలి. ‘మాలిక్యులర్ సర్వైలెన్స్’ ద్వారా కొత్త రోగకారక సూక్ష్మజీవులను గుర్తించి అరికట్టాలి. వైరస్ను సమర్థవంతంగా నియంత్రిస్తే.. కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు రావు. ఒకవేళ మూడోవేవ్ మొదలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ఎక్కడ, ఏ విధంగా ఉంది, తీవ్రత ఎలా ఉందన్న అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఏయే ప్రాంతాల్లో కేసుల తీరు ఎలా ఉందన్నది చూసి.. తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసి, కిందిస్థాయిలోనూ ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్యసేవలు అందేలా చూడాలి. వానాకాలం, చలికాలంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందా? ఈ రెండు కాలాల్లో వైరస్ వ్యాప్తికి, శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి వ్యాక్సినేషన్ వేగం మరింతగా పెంచి.. వీలైనంత త్వరగా, ఎక్కువ మందికి టీకాలు వేయాలి. మాస్కులు, భౌతిక దూరం, గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే ప్రాంతాల్లో ఉండడం, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్కు సమస్యలేంటి? ప్రధానంగా మనదేశ అవసరాలకు తగిన స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి కాకపోవడమే సమస్య. వ్యాక్సినేషన్ వరకు వేగంగానే జరుగుతోంది. ఇతర దేశాలతో పోల్చినా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నాం. కానీ ఉత్పత్తి ఇంకా పెంచాలి. వ్యాక్సిన్ నిల్వలు ఎక్కడా వృ«థా కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. పాఠశాలలు తెరవడం మంచిదేనా? ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడమే మంచిది. బడికి వెళ్లకపోవడంతో పిల్లలు ఎక్కువగా నష్టపోతారు. ఎలాంటి జాగ్రత్తలతో స్కూళ్లు తెరవాలనే దానిపై దృష్టి పెట్టాలి. స్కూళ్లలో టీచర్లు, సిబ్బందితోపాటు పిల్లలకు వ్యాక్సిన్లు వేయాలి. కరోనా జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తర గతుల వారీగా వివిధ షిఫ్టుల్లో పాఠాలు చెప్పాలి. -
Corona Virus: మరో వేవ్ రాకపోవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, వ్యాక్సిన్ తీసుకోవాలని పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు ఇచ్చే కోవాగ్జిన్ ట్రయల్ త్వరలోనే పూర్తవుతుందని, సెప్టెంబర్ నెలాఖరు కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కోవిడ్ –19 విషయంలో జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలపై ఇండియా సైన్స్ అనే సంస్థతో ప్రియా అబ్రహం వర్చువల్గా మాట్లాడారు. పిల్లలపై కోవాక్సిన్ ట్రయల్ ఏ దశలో నడుస్తోంది. పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం 2–18 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం కోవాగ్జిన్ రెండో దశ, మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులేటర్స్కు ఈ ఫలితాలు అందిస్తారు. కాబట్టి సెప్టెంబర్ నెలాఖరుకు లేదా ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ –19 వ్యాక్సిన్లను అందించ గలుగుతాం. ఇది కాకుండా, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ట్రయల్ కూడా జరుగుతోంది. ఇది పిల్లలకు సైతం ఉపయోగిం చవచ్చు. త్వరలో ఇది కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవైనా డెల్టా–ప్లస్ వేరియంట్పై ప్రభావవంతంగా ఉన్నాయా? డెల్టా వేరియంట్ కంటే డెల్టా–ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అనే విష యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా డెల్టా వేరియంట్ 130కి పైగా దేశాలలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మేము ఈ వేరియంట్ మీద అధ్యయనాలు చేశాం. మేము వ్యాక్సిన్లు వేసిన వ్యక్తుల శరీరాలలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను అధ్యయనం చేసిప్పుడు ఈ వేరియంట్కు వ్యతిరేకంగా యాంటీబాడీల సమర్థత కొంత తగ్గినట్లు కను గొన్నాం. అయినప్పటికీ వ్యాక్సిన్లు ఇప్పటికీ వేరి యంట్లను ఎదుర్కొనే విషయంలో రక్షణగా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ సామర్థ్యాన్ని చూపించవచ్చు. కానీ ఇలాంటి మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లు చాలా ముఖ్యమైనవి. వ్యాక్సిన్ తీసుకోని ఎవరైనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరడం, పరిస్థితి విషమంగా మారితే చనిపోయే అవకాశాలుం టాయి. కాబట్టి వేరియంట్ ఏౖదైనప్పటికీ ఇప్ప టివరకు డెల్టా వేరియంట్తో సహా అన్నింటి విషయంలో వ్యాక్సిన్ రక్షణగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సంకోచం ఉండరాదు. రాబోయే కాలంలో మనకు బూస్టర్ డోస్లు అవసరమా? ఈ విషయంపై ఏదైనా అధ్యయనం జరుగుతోందా? బూస్టర్ డోస్లపై అధ్యయనాలు విదేశాలలో జరుగుతున్నాయి. బూస్టర్ డోస్ల కోసం కనీసం ఏడు వేర్వేరు వ్యాక్సిన్లను ప్రయత్నిం చారు. కానీ ప్రస్తుతం మరిన్ని దేశాలు వ్యాక్సిన్లు వేసే వరకు డబ్ల్యూహెచ్ఓ బూస్టర్లపై అధ్యయనాలను నిలిపివేసింది. ధనికదేశాలు బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభిస్తే పేదదేశాలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భవిష్యత్తులో బూస్టర్ల కోసం సిఫార్సులు ఖచ్చితంగా వస్తాయి. వ్యాక్సిన్ల మిక్స్ అండ్ మ్యాచ్ వినియోగంపై అధ్యయనాలు జరుగుతున్నాయా? అది ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుంది? మన దేశంలో పొరపాటున 2 డోసుల్లో రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్పిన్లను కొందరికి ఇవ్వ డం జరిగింది. వీరిపై అధ్యయనం చేశాం. వేర్వే రు వ్యాక్సిన్లు తీసుకున్న రోగులు సురక్షితంగా ఉన్నారని మేము గుర్తించాం. వారిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. వారిలో యాంటీబాడీలు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా సురక్షితమే. మేము ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నాం. బర్డ్–ఫ్లూ లేదా జికా వైరస్ సోకిన వ్యక్తులు కోవిడ్–19 సంక్రమణకు గురవుతారా? బర్డ్ ఫ్లూ, జికా వైరస్లు కరోనా వైరస్తో ఏమాత్రం సంబంధం లేనివి. కానీ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్లకు ఉండే సారూప్యత కారణంగా వాటి వ్యాప్తిని మాస్క్లు, భౌతిక దూరం, చేతుల శుభ్రత, ఇంటి కోవిడ్ పోటోకాల్స్ పాటించడం ద్వారా నిరోధిం చవచ్చు. ఈ వైరస్లు అన్నీ శ్వాస మార్గము ద్వారానే సంక్రమిస్తాయి. అయితే జికా వైరస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. మరో వేవ్ రాకపోవచ్చా? అలా ఏమీ ఉండదు. కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతీ ఒక్కరు మాస్క్లు ధరించడం, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోమని ప్రోత్సహించాలి. అప్పుడు మరో వేవ్ వచ్చినా, అది అంత ప్రభావవంతంగా ఉండదు. -
వ్యాక్సిన్ పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్
న్యూఢిల్లీ: దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీ చేసేందుకు కేంద్రం మరో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ (సీడీఎల్) ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సీడీఎల్గా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సీడీఎల్గా మార్చగల సాంకేతిక ఉన్న ల్యాబొరేటరీని ఎంపిక చేయాలని గతేడాది నవంబర్లో కేబినెట్ సెక్రటరీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రెండు ల్యాబొరేటరీలను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) కేంద్రానికి సూచించింది. అందులో పుణేకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్సీసీఎస్), హైదరాబాద్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)లు ఉన్నాయి. ఇందులో ఎన్సీసీఎస్ను ఈ ఏడాది జూన్ 28న సీడీఎల్గా ప్రకటించగా, తాజాగా ఎన్ఐఏబీని కూడా సీడీఎల్గా ప్రకటించారు. వీటికి పీఎం కేర్స్ నుంచి నిధులు అందుతాయి. తయారైన ప్రతీ బ్యాచ్ వ్యాక్సిన్ను ఈ కేంద్రాల్లో పరీక్షించి, ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తగినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో వ్యాక్సిన్ బ్యాచ్లను విడుదల చేయడంలో ఆలస్యమవుతోంది. -
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
భారత్లో కోవిడ్ టీకా: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!
ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.... వూహాన్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం. తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు. అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత? 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం! అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. –నేషనల్ డెస్క్, సాక్షి -
కోవిడ్ టీకాలపై పేటెంట్లు రద్దు చేస్తే మేలు
సబ్బవరం (పెందుర్తి): ప్రపంచ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోవిడ్ టీకాలపై పేటెంట్ హక్కులను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి అభిప్రాయపడ్డారు. వర్సిటీ మేధో సంపత్తి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ నమూనా సమావేశాలు శనివారం ముగిసాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక మార్గం కాగా.. టీకా తీసుకోవడం మరో మార్గమన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత.. ప్రజలకు దాన్ని అందించే క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఆయా ఉత్పత్తి కంపెనీలు తమ పేటెంట్ హక్కులను సరళం చేసినప్పుడే అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. కోవిడ్–19 కారణంగా ఛిన్నాభిన్నమైన పేద దేశాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, దక్షిణాఫ్రికా సూచించిన తాత్కాలిక పేటెంట్ హక్కుల రద్దు ప్రతిపాదనకు అనేక దేశాలు మద్దతు పలికినప్పటికీ, ధనిక దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. అన్ని దేశాలు, ఆయా కంపెనీలు ప్రజా రక్షణ దృష్ట్యా కొంత కాలమైనా పేటెంట్ హక్కుల రద్దు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన జేఎస్ఎస్ లా కళాశాల, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్ అభినందించారు. -
ప్రధానోపాధ్యాయుడి కీచక బుద్ధి.. వ్యాక్సినేషన్ వేయడానికి వచ్చిన నర్స్పై..
బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్లు వేసుకునే విధంగా.. ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ సెంటర్ ఉద్యోగిని పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించి.. అశ్లీల సందేశాలను పంపించాడు. బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బెళగావిలోని దేగాం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగిని గత రెండు వారాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ లు వేస్తుంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ చావలాగి .. మహిళా ఉద్యోగి సెల్ఫోన్ నంబర్ను సంపాదించాడు. ఆ తర్వాత.. ప్రతిరోజు ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా.. అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపుతూ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించసాగాడు. దీంతో ఆమె అతనికి ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. అయినప్పటికి అతగాడు తన వక్రబుధ్ది మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె బంధువులు, స్నేహితులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి గడిచిన బుధవారం (ఆగస్టు4) ప్రధానోపాధ్యాయుడి ఛాంబర్కు చేరుకుని ఆ కీచకుడిని గదిలో బంధించారు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేశారు. అయితే, తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సస్పెండ్ చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కాగా, బాధితురాలు సురేష్ చావలాగిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రాణాలు పోయేలా ఉన్నాయ్, ఇదెక్కడి విడ్డూరం: రాహుల్
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండగా, వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి గడువు లేదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహమ్మారి రోజుకోరకంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమం పూర్తికి ప్రస్తుతానికి ఎలాంటి గడువు లేదంటూ శుక్రవారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన ట్విట్టర్లో శనివారం స్పందించారు. ‘ఒక వైపు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉండగా, ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ పూర్తికి గడువు లేదని ఒప్పుకుంది. ప్రభుత్వం చేతకాని తనానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు. -
రాష్ట్రానికి మరిన్ని టీకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని టీకాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇందుకు మార్గంసుగమం చేసింది. రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే కరోనా టీకాల్లో 75 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, 25 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేస్తుంది. అయితే ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల నిమిత్తం కేటాయించిన టీకా డోసులు మిగిలిపోతున్నాయి. ఈ విధంగా మిగిలిన టీకాలను, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆయా రాష్ట్రాల్లో మిగిలిపోతున్న ప్రైవేట్ టీకా డోసులు కొనుగోలు చేసే ఆలోచనలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉంది. టీకాల కోసం ఎదురుచూపులు తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 1.20 కోట్లకు పైగా టీకాలను సరఫరా చేసింది. జూలై నెలకు మరో 28 లక్షలు కేటాయించింది. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది అర్హు లు ఇంకా టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు దాదాపు రెండు లక్షల డోసులు వేస్తున్నా కొరత వేధిస్తూనే ఉంది. కొన్ని టీకా కేంద్రాల్లో డోసులు అసలే దొరకడం లేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేం ద్రం.. జనాభా, కరోనా కేసుల ప్రాతిపదికన ఇస్తుండటంతో డిమాండ్ మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపకరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నా రు. ఇతర రాష్ట్రాల నుంచి టీకాలు కొనడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలుపడుతుందని చెబుతున్నారు. నెలకు అదనంగా మరో ఐదారు లక్షల టీకాలకు వీలు పడుతుందని పేర్కొంటున్నారు. టీకాల షెడ్యూల్కు కసరత్తు రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. అయితే ఒక్కోరోజు కొన్ని కేంద్రాల్లో టీకాల కార్యక్రమా న్ని అకస్మికంగా నిలిపివేస్తున్నారు. టీకాల కొరత, కొన్నిసార్లు ఇతర కేంద్రాలకు ఎక్కువగా పంపడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలాం టి పరిస్థితిని నివారించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఏ నెలలో ఎన్ని టీకాలు రాష్ట్రాలకు పంపాలో ఇప్పటికే నిర్ణయించి షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ ప్రకారమే రాష్ట్రాలు కూడా ప్రణాళిక రచించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. జిల్లాలు మొదలు టీకా కేంద్రాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసి సరఫరా చేయాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల ఏ టీకా కేంద్రానికి, ఏ రోజు, ఎన్ని డోసులు సరఫరా అవుతాయో స్పష్టత ఉంటుంది. దీనివల్ల లబ్ధిదారులకు కూడా ఎలాంటి ఇబ్బందీ కలగదు. కేంద్రం ఆదేశాల మేరకు షెడ్యూల్ ఖరారుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 15 నుంచి దేశంలో మోడెర్నా టీకా ప్రపంచంలో పేరుపొందిన టీకాల్లో ఒకటైన మోడెర్నా ఈ నెల 15వ తేదీ నుంచి దేశంలో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. మోడెర్నా టీకాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోనూ అందుబాటులోకి తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తామని అధికారులు చెబుతున్నారు. -
పిల్లలకు టీకా వస్తే స్కూళ్లు తెరుచుకోవచ్చు
న్యూఢిల్లీ: చిన్నారులకు సైతం కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక గొప్ప ఘనత అవుతుందని, పాఠశాలలు మళ్లీ తెరవడానికి మార్గం సుగమమవుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. పిల్లల కోసం టీకా వస్తే వారికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవాగ్జిన్ను 2–18 ఏళ్లలోపు వారిపై పరీక్షించారని, రెండో, మూడో దశ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి రాగానే దేశంలో పిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకంటే ముందే ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే పిల్లలకు అదికూడా ఒక ఆప్షన్ అవుతుందన్నారు. జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్–డి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసిందని, భారత్లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం త్వరలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జైకోవ్–డి టీకాను పెద్దలతోపాటు 12–18 ఏళ్లలోపు పిల్లలు సైతం తీసుకోవచ్చని గులేరియా తెలిపారు. చిన్నారులకు కరోనా వైరస్ సోకినప్పటికీ చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటివారు కరోనా వాహకులుగా (క్యారియర్లు) మారుతున్నారని అన్నారు. దేశంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారు 13 కోట్ల నుంచి 14 కోట్ల మంది ఉంటారని, వీరందరికీ కరోనా టీకా ఇవ్వడానికి 25 కోట్ల నుంచి 26 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్!
►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రా ల్లోనూ కేసులు మొదలయ్యాయి. ►డెల్టా ప్లస్ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు. ►కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కరోనా వేరియంట్)’గా ప్రకటించింది. డెల్టా, దాని అనుబంధ వేరియంట్లతో ప్రమాదం ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల వెల్లడించింది. ►కరోనా ఏ వేరియంట్ వచ్చినా కూడా.. ‘కోవిడ్ జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్, లాక్డౌన్’ ఈ మూడు అంశాలే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటితోనే మూడో వేవ్ను నియంత్రించవచ్చని చెప్తున్నారు. ►మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గా, సాతారా, సాంగ్లీ, క్లోహపూర్, హింగోలి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తొందరపడి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించవద్దని సీఎం అధికారులకు సూచించారు. సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశలో లక్షల కేసులకు కారణమైన డెల్టా వైరస్ను అదుపు చేయగలిగామని అనుకుంటుండగానే.. డెల్టా ప్లస్ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకు తుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కోవిడ్ జాగ్రత్తతోనే రక్షణ అని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని రణ్దీప్ స్పష్టం చేశారు. మొదట ఇంగ్లండ్లో గుర్తింపు కరోనా వైరస్ రూపాంతరాల్లో డెల్టా ప్లస్ (ఏవై.1) సరికొత్తది. ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఈ కొత్త వేరియంట్ను తొలిసారి గుర్తించినట్టుగా ఈ నెల 11న ప్రకటించారు. భారత్లో రెండో వేవ్కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్లోని కొమ్ము (స్పైక్) ప్రొటీన్లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్ పుట్టింది. ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికా వేరియంట్లో గతంలోనే గుర్తించారు. అయితే బీటా రకం కంటే డెల్టా వేరియంట్కు వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువ. అలాంటిది ఈ సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవడంతో.. డెల్టా ప్లస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్పై మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ ఇటీవలే వెల్లడించారు. ఎక్కడెక్కడ కేసులు? డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటికే 11కుపైగా దేశాల్లో గుర్తించారు. మొదట గుర్తించిన బ్రిటన్తోపాటు అమెరికా, చైనా, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్ తదితర దేశాల్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. మన దేశంలోనూ 40కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించారు. ఇవి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్లో ఏప్రిల్ ఐదో తేదీన తీసిన ఓ శాంపిల్లోనే డెల్టా ప్లస్ ఆనవాళ్లు ఉన్నాయని, ఈ వేరియంట్ అప్పుడే మొదలైందని ఓ అంచనా. బ్రిటన్లో తొలి ఐదు కేసులను ఏప్రిల్ 26న సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. ప్రమాదం ఎంత? రెండో దశలో నమోదైన కేసుల్లో అత్యధికం డెల్టా రూపాంతరితానివే. డెల్టా ప్లస్ విషయంలోనూ కేసులు అంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. డెల్టా ప్లస్తో ప్రమాదం ఎంత? ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? అన్నదానిపై భారత వైద్య పరిశోధన సమాఖ్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు ఇప్పటికే అధ్యయనం ప్రారంభించాయి. ప్రమాదం ఉండకపోవచ్చు డెల్టా ప్లస్లోని కే417 జన్యుమార్పు ఒక్కదానితోనే ప్రమాదం పెరిగిపోదని, లక్షలకొద్దీ కేసులు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదని కొందరు వైరాలజిస్టులు అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తలు, నియమాలు ఎలా అమలు చేస్తున్నామన్నది కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ భవిష్యత్తులోనూ మరింతగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు సోకుతూనే ఉంటుందని అంటున్నారు. అందువల్ల నమూనాల సేకరణ, జన్యుక్రమ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా, విస్తృతంగా జరగాలని.. ఎక్కడికక్కడే కొత్త రూపాంతరితాలను గుర్తించి, కట్టడి చేయడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు పనిచేస్తాయా? మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్ బారిన పడటాన్ని బట్టి చూస్తే.. కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు కరోనా కేసులు తగ్గిపోయాయి కదా అంటూ మొదటి వేవ్ తర్వాతిలాగా ఇప్పుడూ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. ఏది ఏమైనాసరే అన్నట్టుగా కఠినంగా మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్ వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇదే సమయంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ చేపట్టాలి. అప్పుడే మూడో వేవ్ను ఎదుర్కోగలుతాం. -ఎయిమ్స్ ప్రధానాధికారి రణదీప్ గులేరియా ఆ కేసులు తక్కువగానే ఉన్నాయి డెల్టా ప్లస్తో దేశంలో మరోదఫా లక్షల సంఖ్యలో కేసులు వస్తాయన్న దానికి రుజువులేమీ లేవు. అలాగని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. మేం ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి సేకరించిన 3,500 నమూనాలను విశ్లేషించాం. ఏప్రిల్, మే నెలల నమూనాల్లో డెల్టా ప్లస్కు చెందినవి ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. -డాక్టర్ అనురాగ్ అగర్వాల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ -
టీకాలందు.. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేరయా!
కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ భారత్లో కోవిడ్ నిరోధానికి వాడుతున్న టీకాల పేర్లివి. ఒకట్రెండు నెలల్లో మరికొన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి! వీటిల్లో ఫైజర్, మోడెర్నా కంపెనీల టీకాలు వినూత్నమైనవి. మిగిలిన వాటికంటే భిన్నమైన పద్ధతిలో తయారైనవి! అంతేకాదు.. ఈ తరహా టీకాలు భవిష్యత్తులో హెచ్ఐవీ, కేన్సర్ల వంటి... ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు!!! కోవిడ్ నిరోధానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న టీకాలను స్థూలంగా రెండు భాగాలుగా విడదీయవచ్చు. దశాబ్దాలుగా పలు వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఉపయోగిస్తున్న సంప్రదాయ టీకాలు ఒక రకమైతే వినూత్నమైన ఆలోచనతో యాభై ఏళ్ల పరిశోధనల తరువాత తొలిసారి అందరికీ అందుబాటులోకి వచ్చిన మెసెంజర్ ఆర్ఎన్ఏ క్లుప్తంగా.. ఎంఆర్ఎన్ఏ టీకాలు ఇంకో రకం. ఆటలమ్మ అని మనం పిలుచుకునే స్మాల్పాక్స్ వ్యాధికి 1796లో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ తొలి టీకా తయారు చేశారు. అవులకు సోకే, పెద్దగా ప్రమాదం లేని వైరస్ను మానవుల్లోకి జొప్పిస్తే రోగనిరోధక వ్యవస్థ చైతన్యవంతమై స్మాల్ పాక్స్ కారక వేరియోలా వైరస్ను అడ్డుకుంటుందన్న జెన్నర్ సూత్రం విజయవంతంగా పనిచేసింది. ఆ తరువాత స్మాల్పాక్స్ తరహాలో పూర్తి వైరస్ను కాకుండా.. నిర్వీర్యమైన వైరస్తో కొన్ని రకాలు, ఇతర పద్ధతులు వాడకంలోకి వచ్చాయి. కోవిడ్కు ఉపయోగిస్తున్న కోవిషీల్డ్, స్పుత్నిక్– వీలను చింపాంజీల్లోని అడినో వైరస్ జన్యుక్రమంలోకి సార్స్ కోవ్–2 వైరస్ కొమ్మును చేర్చడం ద్వారా సిద్ధం చేశారు. కోవాగ్జిన్లో మాత్రం నిర్వీర్యం చేసిన వైరస్ను ఉపయోగించారు. వైరస్ లేదా వైరస్ విడిభాగాలను గుర్తించి వాటిపై దాడికి యాంటీబాడీలను తయారు చేయ డం సంప్రదాయ టీకాలు చేసే పని అన్నమాట! కణాల టీచర్ ఎంఆర్ఎన్ఏ.... ఎంఆర్ఎన్ఏ టీకాలు వ్యాధి నిరోధక ప్రొటీన్లు ఎలా ఉత్పత్తి చేసుకోవాలో శరీరానికి నేర్పుతాయి. కోవిడ్ విషయంలో ఈ టీకాలు వైరస్ జన్యుక్రమం చుట్టూ పరుచుకుని ఉండే కొమ్ములను కణాల ద్వారా తయారు చేస్తాయి. (పక్కఫొటోలో చూడండి) అమెరికన్ కంపెనీ ఫైజర్, మోడెర్నా, జర్మన్ కంపెనీలు బయోఎన్టెక్, క్యూర్వ్యాక్లు ఈ రకమైన టీకాలపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నాయి. డీఎన్ఏ పోగులోని కొన్ని భాగాలను జన్యువులంటామని.. వాటిల్లో దాగున్న సమాచారం ఆధారంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు తయారవుతాయని మనకు తెలుసు. ఎంఆర్ఎన్ఏ అంటే డీఎన్ఏలోని ఒక భాగమే. కోవిడ్ విషయాన్ని తీసుకుంటే.. వైరస్లోని కొమ్మును తయారు చేసేందుకు కావాల్సిన ఎంఆర్ఎన్ఏను టీకా ద్వారా అందిస్తారు. ఇది మన కణాల్లోకి చేరి వైరస్ కొమ్ము ప్రొటీన్లను తయారు చేసేలా సూచనలు చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ ప్రొటీన్తో కూడిన వైరస్ను చూస్తే చాలు.. వెంటనే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రారంభిస్తుందన్న మాట. 1970ల్లోనే పరిశోధనలు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఎలాంటి వ్యాధికైనా చికిత్స కల్పించవచ్చునని 1970ల్లో శాస్త్రవేత్తలు ఊహించారు. పరిశోధనలు చేశారు.ప్రయోగాల్లో భాగంగా ఎంఆర్ఎన్ఏను జంతువుల శరీరాల్లోకి జొప్పించినప్పుడు విపరీతమైన దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే.. హంగెరీ శాస్త్రవేత్త కాటలిన్ కారికో ఎంఆర్ఎన్ఏ భాగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించారు. కాటలిన్ కారికో పరిశోధనల ఆధారంగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డెరిక్ రోసీ... మోడెర్నా కంపెనీని స్థాపించి పరిశోధనలను కొనసాగించారు. ఇదే సమయంలో కాటలిన్ కారికో పరిశోధనలు కేన్సర్పై పరిశోధనలు చేస్తున్న ఉగుర్ సాహిన్, ఓజ్లెమ్ టురెసీ దంపతులను ఆకర్షించింది. బయోఎన్టెక్ కంపెనీ వ్యవస్థాపకులైన వీరు కారికో టెక్నాలజీతోపాటు ఆమెను కూడా తమ కంపెనీలోకి ఆహ్వానించి కేన్సర్పై పరిశోధనలు ముమ్మరం చేశారు. కేన్సర్ కణితుల నిర్మూలనకు ప్రస్తుతం కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సల వంటి మొరటు పద్ధతులను వాడుతున్నామని, ఈ క్రమంలో శరీరానికి తీవ్ర నష్టం కలుగజేస్తున్నామని ఉగుర్, ఓజ్లెమ్ల భావన, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఈ పరిస్థితిలో మార్పులు చేయవచ్చునని వారు విశ్వసిస్తున్నారు. కణితులపై నేరుగా దాడి చేయగల యాంటిజెన్ల ఉత్పత్తికి ఎంఆర్ఎన్ఏ ఉపయోగపడుతుందని వీరు చెబు తున్నారు. ఒకవైపు మోడెర్నా, ఇంకోవైపు బయో ఎన్టెక్ ఇప్పుడు రొమ్ము కేన్సర్తోపాటు ప్రొస్టేట్, చర్మ, కాలేయ, మెదడు, ఊపిరితిత్తుల కేన్సర్ల చికిత్సకు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలన్న అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇన్ఫ్లుయెంజా, జికా, రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు టీకాలు సి ద్ధం చేయడంలో కొంత ప్రగతి సాధించారు కూ డా. కోవిడ్ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి గుర్తింపు రావడంతో సమీప భవిష్యత్తులోనే ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరమవుతాయని, కే న్సర్తోపాటు అనేక ఇతర వ్యాధులకు చికిత్స కల్పించడం సాధ్యమవుతుందని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
గ్రామాల్లో వీధి కుక్కలన్నింటికీ టీకాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తిరుగాడే వీధి కుక్కలన్నింటికీ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాబీస్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ చేయించడంతో పాటు కుక్క కరిచినా ర్యాబీస్ సోకకుండా శునకాలకు టీకాలు వేస్తారు. వీధి కుక్కల టీకాలు వేసే ప్రక్రియలో పశు సంవర్థక శాఖ సిబ్బందితో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. మండలంలో ప్రతి రోజూ కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, 2020 పూర్తి ఏడాదితో పాటు 2021లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది కుక్క కాటుకు గురైనట్లు అంచనా. -
వ్యాక్సిన్ దిగుమతికి చర్యలు చేపట్టాలి: హరీష్రావు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్పై 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతికి చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు తెలిపారు. అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. రెండో దశలో కరోనా సృష్టించిన విలయం, థర్డ్ వేవ్ కూడా మరింత ఉధృతంగా రానుందన్న అంచనాల మధ్య కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు. కమిటీ లోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా తమ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. మే నెలలోలాక్ డౌన్ వల్ల రూ. 4100కోట్లు ఆదాయాన్ని కోల్పోయమని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ఆర్బీఎంను నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఎఫ్ఆర్బీఎం పెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు. -
కోవిడ్ టీకా డోస్లను అత్యధికంగా వృథా చేసిన రాష్ట్రం ఇదే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చూస్తే జార్ఖండ్ రాష్ట్రంలోనే అత్యధికంగా కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు వృథా అయినట్లు వెల్లడైంది. కోవిడ్ టీకా డోస్లను సమర్థవంతంగా వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది. టీకా డోస్ల సరఫరా, పంపిణీ సమయాల్లో కొన్ని డోస్లు ధ్వంసమవడం తదితరాల కారణాలతో వృథా అవుతాయి. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా అమలుచేయడంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మే నెలలో ఏకంగా 1.61 లక్షల డోస్లను ఆదా చేయగలిగింది. కేరళ సైతం టీకాల డోస్ల వృథాను అరికట్టడంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కేరళ కూడా 1.10 లక్షల కోవిడ్ టీకాలను ఆదా చేసింది. మరోవైపు, ఛత్తీస్గఢ్లో 15.79 శాతం టీకాలు, మధ్యప్రదేశ్లో 7.35 శాతం టీకాలు వృథా అయ్యాయి. పంజాబ్లో 7.08 శాతం, ఢిల్లీలో 3.95 శాతం, రాజస్తాన్లో 3.91 శాతం, ఉత్తరప్రదేశ్లో 3.78 శాతం, గుజరాత్లో 3.63 శాతం, మహారాష్ట్రలో 3.59 శాతం టీకాలు వృథా అయ్యాయి. మే నెలలో మొత్తంగా కేంద్రప్రభుత్వం 7.9 కోట్ల డోస్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. మేలో వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 2.1 కోట్ల డోస్లు అందుబాటులో ఉన్నాయి. చదవండి: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్! -
Multisystem Inflammatory Syndrome: ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: చిన్నారులకు కరోనా సమయంలో లేదా దీని నుంచి కోలుకున్నాక వచ్చే మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్స్ (మిస్–సీ) గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంద కరోనా కేసుల్లో ఐదారు మాత్రమే మిస్–సీ కేసులు ఉండొచ్చని అంటున్నారు. సకాలంలో చికిత్స అందిస్తే వారిని కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. చిన్నారుల్లో సహజసిద్ధంగా ఉండే కొన్ని లక్షణాలు మిస్–సీని సమర్థవంతంగా ఎదుర్కొంటాయని పేర్కొంటున్నారు. ఇవే చిన్నారులకు శ్రీరామరక్ష.. పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు మినహా మనం బూస్టర్గా అందించేది తక్కువ. అయితే కొన్ని సహజసిద్ధ లక్షణాల వల్ల వారికి కరోనా తక్కువగా వస్తున్నట్టు వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. అవి.. ► ఏసీఈ–2 అంటే.. టైప్2 రిసెప్టార్స్ (అవయవాల పెరుగుదలకు ఉపయోగపడే గ్రాహకాలు) పెద్దల్లో కంటే చిన్నారుల్లో తక్కువ. ఈ రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటే కరోనా వాటికి అతుక్కుపోయే ప్రమాదం ఎక్కువ. చిన్నారుల్లో ఇవి తక్కువ కాబట్టి కరోనా సోకే అవకాశం కూడా తక్కువే. ► పిల్లల్లో రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. పెద్దల్లో అయితే రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోవడం, పొగతాగడం వంటి వాటి వల్ల అవి దెబ్బతింటాయి. ఇలా రక్తనాళాలు దెబ్బతిన్న చోట వైరస్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. చిన్నారులకు అనేక రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంటారు. దీనివల్ల వారిలో క్రాస్ ఇమ్యూనిటీ వస్తుంది. దీనివల్ల వారిలో కరోనా వచ్చే ప్రమాదం తక్కువ. అదే పెద్దవాళ్లలో ఈ క్రాస్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి కరోనా రావడానికి ఆస్కారం ఎక్కువ. ► సాధారణంగా చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల శ్వాస ప్రక్రియ ఎప్పటికప్పుడు యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. కరోనా కూడా శ్వాస ప్రక్రియపైన ప్రభావం చూపుతుంది. అయితే.. చిన్నారుల్లో సహజసిద్ధంగా ఉన్న యాంటీబాడీస్ కరోనాను అంత సులభంగా సోకనివ్వవు. ► చిన్నారుల్లో ఏడాదిలోపు వారికి, 8 ఏళ్లపైన వారికి మిస్–సీ వచ్చే అవకాశం ఎక్కువ. పై లక్షణాలున్న చిన్నారులకు వెంటనే ఎకో కార్డియోగ్రామ్ తీసి తీవ్రతను గుర్తించవచ్చు. 90 కంటే ఆక్సిజన్ సాంద్రత తగ్గితే సివియర్గా గుర్తించాలి. చిన్నారుల్లో మిస్–సీ లక్షణాలు.. ► 3 రోజులకు మించి జ్వరం ► ఒంటిపై ఎక్కువగా దద్దుర్లు ► గుండె వేగంగా కొట్టుకోవడం ► విరేచనాలు, పొట్ట ఉబ్బరం వందలో ఐదారు కేసులే.. చిన్నారుల్లో వచ్చే మిస్–సీ కేసుల గురించి ఆందోళన అక్కర్లేదు. వందలో ఐదారు కేసుల్లోనే మిస్–సీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్లలో టైప్2 రిసెప్టార్స్ లేకపోవడం మంచి పరిణామం. ఇలా కొన్ని సహజసిద్ధంగా వచ్చిన లక్షణాల వల్ల పెద్దల్లో కంటే చిన్నారుల్లో మిస్–సీ కేసులు చాలా తక్కువ. –డా.కిరీటి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి -
టీకా టెక్నాలజీ బదిలీకి సిద్ధం
సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా): రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీకి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విదేశాల్లో కూడా టీకా ఉత్పత్తిని విస్తృతం చేస్తామన్నారు. వ్యాక్సిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమైన ఏకైక దేశం రష్యాయేనని చెప్పారు. అమెరికా, భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ ఎడిటర్లతో పుతిన్ శనివారం ఆన్లైన్లో సంభాషించారు. పీటీఐ, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ తదితర సంస్థల ఎడిటర్లతో మాట్లాడుతూ స్పుత్నిక్– వీ సమర్థతపై వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. 97.6 శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ పని చేస్తోందని స్పష్టం చేశారు. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ కంపెనీల మధ్య పోటీ, వాణిజ్యపరమైన కారణాల వల్ల స్పుత్నిక్– వీ రిజిస్ట్రేషన్లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే 66 దేశాల్లో స్పుత్నిక్– వీని విక్రయిస్తున్నామని, తమ వ్యాక్సిన్ మంచి మార్కెట్ ఉందన్నారు. స్పుత్నిక్– వీ వ్యాక్సిన్ తయారీకి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీసీజీఐ ప్రాథమిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే పుతిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హైదరాబాద్కి చెందిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతల్ని చేపట్టింది. మరోవైపు అమెరికా సహా కొన్ని దేశాలు కరోనా సంక్షోభానికి చైనాయే కారణమని నిందిస్తున్న అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ ఇప్పటికే ఈ విషయంపై చాలా ఎక్కువగా తాను మాట్లాడానని, కొత్తగా చెప్పడానికి ఏమీలేదన్నారు.సంక్షోభాన్ని ఎప్పుడూ రాజకీయం చేయకూడదని హితవు పలికారు. మోదీ, జిన్పింగ్ బాధ్యతాయుత నాయకులు భారత్, చైనా సరిహద్దు వివాదాల్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని పుతిన్ వ్యాఖ్యానించారు. మూడోదేశం ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎంతో బాధ్యత కలిగిన నాయకులని... సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం వారికుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం... భారత్, రష్యాల రక్షణ బంధంపై ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు భారత్తో కూడా తమకు బలీయమైన బంధం ఉందని అన్నారు. రష్యా, భారత్ మధ్య బంధం నమ్మకం అనే పునాది మీద ఏర్పడిందని, దానికొచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్లు క్వాడ్ పేరుతో ఒక బృందంగా ఏర్పడడం, భారత్ అందులో భాగస్వామ్యం కావడంపై రష్యా విదేశాంగ మంత్రి బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై పుతిన్ మాట్లాడుతూ ఏ దేశంతో సన్నిహితంగా మెలగాలి, ఎంతవరకు సంబంధాల్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకునే హక్కు ప్రతీ సార్వభౌమ దేశానికి ఉంటుందని, దానిని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు. -
‘ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదు’
సాక్షి,అమరావతి: వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని చెప్పారు. అయితే గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని వెల్లడించారు. కాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ సీఎం జగన్ లేఖలు తెలిపారు. చదవండి: ‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’ -
బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టు విడుదల
ఢాకా: దాదాపు వారం క్రితం అరెస్టయిన బంగ్లాదేశ్ సీనియర్ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లామ్ ఆదివారం విడుదలయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అనుమతి లేకుండా ఫోటోలు తీశారన్న ఆరోపణలపై వలసవాద కాలానికి చెందిన ఓ చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుపై బంగ్లాదేశ్లోని మీడియా సహా ఐక్యరాజ్యసమితి వరకూ పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని ఓ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 5వేల టాకాలను పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్పోర్టును సమర్పించాలని కోర్టు ఆమెను కోరింది. అనంతరం కాశీంపుర్ మహిళా సెంట్రల్ జైలు నుంచి ఆదివారం రోజినా విడుదలయ్యారు. జూలై 15వరకూ బెయిల్ కొనసాగనుంది. వ్యాక్సిన్లను కొనే వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆమె ఫొటోలు తీశారంటూ ఆరోగ్య శాఖ ఆమెపై కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇకపై కూడా జర్నలిస్టుగా మరింత బాధ్యతతో పని చేస్తానని చెప్పారు. (చదవండి: UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది) -
భుజంపైనే టీకాలు ఎందుకు?
ఇండియానాపొలిస్(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు ఎడమ భుజంపై, రెండో డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటారు. పోలియో, రోటా వైరస్ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటిద్వారా, మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూంటే.. కోవిడ్ టీకాలను ఇంట్రామస్క్యులర్ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకిస్తున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ తాలూకూ ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్ తాలూకూ అవశేషాలను అంటే యాంటిజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను.. వైరస్ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ యాంటిజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. కొన్ని రకాల కోవిడ్ టీకాల్లో యాంటిజెన్లు ప్రత్యక్షంగా లేకపోయినా వాటిని తయారు చేసే ప్రణాళిక ఉంటుంది. కండరాల్లోని రోగనిరోధక వ్యవస్థ కణాలు వీటికీ తేలికగానే స్పందిస్తాయి. టీకాను రోగ నిరోధక వ్యవస్థ కణాలు గుర్తించగానే యాంటిజెన్ల వివరాలను వినాళ గ్రంథులకు అందజేస్తాయి. ఈ వినాళ గ్రంథుల్లో మరిన్ని రోగ నిరోధక వ్యవస్థ కణాలు యాంటిజెన్లను గుర్తించి యాంటీబాడీలను తయారు చేసే ప్రక్రియ మొదలయ్యేలా చేస్తాయి. వినాళ గ్రంథులకు దగ్గరగా ఉండటం భుజంపై టీకా ఇవ్వడానికి ఇంకో కారణం. బాహు మూలాల్లో ఈ వినాళ గ్రంధులు ఉంటాయి. యాంటిజెన్లతోపాటు టీకాలో ఉండే ఇతర పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయి. స్థానికంగా కట్టడి... వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావొచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్ ఇస్తే... ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్ కండరాలకు ఉంటుంది. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకు ఇస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. -
అందరికి ఆరోగ్యం... పేటెంట్లే అవరోధం
ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్తో పాటు అనేక దేశాలు కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్ కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పేటెంట్ హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను దాదాపు వందకుపైగా దేశాలు సమర్థించాయి. తాజా అంచనా ప్రకారం విశ్వవ్యాప్తంగా 70 శాతం జనాభాకు దాదాపు 1100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి ఒక్కొక్కరికి రెండు డోసులు ఇవ్వడానికి ఇన్ని కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లు అవసరం. అంటే నెలకు 150 కోట్ల చొప్పన వ్యాక్సిన్ ఉత్పత్తి జరగాలి. కానీ అతి కొద్ది సంస్థలు మాత్రమే ఇప్పుడు కోవిడ్–19 టీకాలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లను భారీ స్థాయిలో తయారు చేసి సరఫరా చేయాలంటే కోవిడ్ వ్యాక్సిన్పై పేటెంట్ హక్కుల రక్షణను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ కీలకమైన అంశంపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా బలపర్చడం ప్రపంచ వాణిజ్య సంస్థ తదుపరి చర్చల్లో మూలమలుపు కానుంది. కోవిడ్–19 మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచ వాణిజ్య సంస్థలోని ట్రిప్స్ ఒడంబడికలోని కొన్ని నిబంధనలను రద్దుచేయాలంటూ 2020 అక్టోబర్ 2న భారత్, దక్షిణాఫ్రికా మొట్టమొదటగా ప్రతిపాదించాయి. మేధో సంపద హక్కుల వాణిజ్య సంబంధమైన అంశాలపై ఒడంబడిక (ట్రిప్స్) 1995 జనవరిలో ఉనికిలోకి వచ్చింది. ఇది ప్రధానంగా వ్యాపార రహస్యాలను అందరికీ తెలియపర్చడానికి వీలులేకుండా తమతమ ఉత్పత్తులపై కాపీరైట్, పేటెంట్లు తదితర మేధో సంపద హక్కులను పొందటానికి ఈ ఒçప్పందం వీలుకలిపిస్తుంది. కోవిడ్–19 సంబంధిత వ్యాక్సిన్లు, చికిత్స, ఔషధాలకు పోటెత్తుతున్న డిమాండ్ను తీర్చడానికి వీటి ఉత్పత్తిని భారీ స్థాయిలో వేగంగా చేయడం అనేది భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు కారణం. రోగులకు సరసమైన ధరలకు వైద్య ఉత్పత్తులను సకాలంలో అందించడానికి కంపెనీల మేధో హక్కులు అడ్డుగా ఉన్నాయని పలు నివేదికలు తెలుపుతున్నాయని భారత్, దక్షిణాప్రికా ప్రతిపాదన పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత రాయబారి బ్రిజేంద్ర నవనీత్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలను గమనిస్తే మేధో హక్కుల రద్దు ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 శాతం జనాభాకు దాదాపు 1100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ డానికి ఒక్కొక్కరికి రెండు డోసులు ఇవ్వడానికి ఇన్ని కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లు అవసరం. అంటే నెలకు 150 కోట్ల చొప్పన వ్యాక్సిన్ ఉత్పత్తి జరగాలి. వయోజనులకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలన్నా దానికి 500 కోట్ల డోసులు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు 50 కోట్ల డోసుల ఉత్పత్తి కూడా సాధ్యం కావడం లేదు అని ఆమె చెప్పిన అంశం గమనించదగినది. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్తో పాటు అనేక దేశాలు కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్ కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ మేధో హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను దాదాపు వందకుపైగా దేశాలు సమర్థించాయి. అయితే ఈ ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వ్యతిరేకించాయి. దీంతో భారత దక్షిణాఫ్రికాలు ఒక మంచి ప్రతిపాదన చేశాయి. దాని ప్రకారం పేటెంట్ హక్కుల రద్దు తాత్కాలికంగానే ఉంటుంది కానీ అది శాశ్వతం కాదు అని హామీ ఇస్తూ తమ ప్రతిపాదనలో మార్పులు చేయడానికి అంగీకరించాయి. అదే సమయంలో ట్రిప్స్ హక్కుల రద్దుకు సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్న అమెరికా పాలనా యంత్రాంగం మే 5న భారత్, దక్షిణాఫ్రికా దేశాలు చేసిన ప్రతిపాదనకు మద్దతు పలికింది. ఈ ప్రతిపాదనపై అమెరికా శాసన నిర్ణేతలు, అధికారులతో సమావేశంలో దక్షిణాఫ్రికా రాయబారులతోపాటు సమావేశమైన అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు జరిపిన చర్చల కారణంగా అమెరికా ఈ అంశంపై కాస్త చల్లబడింది. పైగా అమెరికా గనుక కోవిడ్ వ్యాక్సిన్ను మొదటగా రూపొందిస్తే దాని భారీ ఉత్పత్తికి అడ్డుపడుతూ పేటెంట్లను తాను అనుమతించబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఎన్నికల ప్రచార సమయంలోనే వాగ్దానం చేశారు. వ్యాక్సిన్ టెక్నాలజీ భాగస్వామ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటున్నప్పటికీ మందుల కంపెనీలకు చెందిన ట్రేడ్ యూనియన్లు పేటెంట్ హక్కుల రద్దును వ్యతిరేకించడం గమనార్హం. సాంకేతిక జ్ఞాన భాగస్వామ్యంతోటే జీవనదానం ఆరోగ్య సంరక్షణను, వ్యాధి చికిత్సలను, మందులను సరసమైన ధరలకు అందరికీ సకాలంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరమని గతానుభవాలు ఎన్నో చెబుతున్నప్పటికీ మేధో హక్కుల రక్షణ హక్కును రద్దు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకత పొడసూపుతుండటం గమనించాల్సిన విషయం. ఉదాహరణకు పెన్సిలిన్ వైద్యరంగంలో సాధించిన మూలమలుపును చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యాంటీబయొటిక్ ఔషధం ఉత్పత్తిని భారీ ఎత్తున సాగించాల్సిన అవసరం వచ్చిపడింది. నాటి అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ ఔషధ కంపెనీల మధ్య సహకారం కారణంగా పెన్సిలిన్ మందు ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచగలిగారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. పెన్సిలిన్ను మొట్టమొదటగా వేరుపర్చి, చికిత్సపరంగా దాని సమర్థతను నిరూపించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దేశీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ తన ఆవిష్కరణపై ఎలాంటి పేటెంట్ హక్కును కోరలేదు. తీసుకోలేదు కూడా. ఇటీవల కాలంలో హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఏఆర్వీ(యాంటీరెట్రోవైరల్) జెనెరిక్ ఔషధాన్ని సరసమైన ధరవద్ద భారీగా ఉత్పత్తి చేయడం కారణంగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు అది ఎంతగా ఉపయోగపడిందో మనందరం చూశాం. ట్రిప్స్, ప్రజారోగ్యంపై దోహా ప్రకటన వెలువడిన దశాబ్దం తర్వాత అంటే 2003–2005 మధ్యలో హెచ్ఐవీ ఎయిడ్స్ సంబంధిత ఔషధాల కోసం ప్రపంచంలోని 17 ఎగువ, మధ్య ఆదాయ దేశాలు 24 తప్పనిసరి లైసెన్సులను ఆహ్వానించాయి. భారత్లో అయితే ప్రముఖ ఫార్మా దిగ్గజం సిప్లా అసాధారణమైన ధరలున్న అనేక మందులను దేశీయంగా అతితక్కువ ధరల వద్దే తయారు చేయడం కోసం రివర్స్ ఇంజనీరింగ్ని సమర్థంగా నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. ఈ సంస్థ ఎయిడ్స్ నివారణ కోసం సరసమైన ధరవద్ద ఏఆర్వీ ఔషధాన్ని కూడా తయారు చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కోవిడ్–19 మహమ్మారిని అరికట్టాలంటే లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడటమొక్కటే ఇప్పుడు యావత్ ప్రపంచ కర్తవ్యంగా మారిందని చౌకగా అందుబాటులో ఉండే ప్రజారోగ్యం, ఔషధాల సమర్థకులు నొక్కి చెబుతున్నారు. కాబట్టి కరోనా సెకండ్ వేవ్ నివారణకు మనకు మరిన్న వ్యాక్సిన్లు ఇంకా వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కోవిడ్–19 ఇప్పుడొక విశ్వవ్యాప్త సమస్య. కాబట్టి దానికి మనం విశ్వవ్యాప్త పరిష్కారాన్నే కోరుకోవాలి. చాలా దేశాలు ఇందుకు పూనుకోకుంటే మనం ఇప్పటి దుస్థితి నుంచి, మహమ్మారి నుంచి బయటపడటం చాలా కష్టం. ఉదాహరణకు కరోనా కోరల్లో చిక్కుకున్న భారతదేశాన్ని వేరుపర్చి, భారతీయుల ప్రయాణాలను అడ్డుకుని, వాణిజ్య సంబంధాలను తెంచేసుకుని ముందుకు సాగటం ప్రపంచానికి మంచిది కాదు. అది అసాధ్యం కూడా అని స్వతంత్ర లాభార్జనా రహిత అంతర్జాతీయ పరిశోధనా సంస్థ టిడబ్లు్యఎన్ లీగల్ సలహాదారు కేఎమ్ గోపకుమార్ స్పష్టంగా చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నిరోధకతలో భాగంగా అనేక దేశాలు తమ సొంత సరఫరాలను వేగవంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న మందుల సరఫరాను షేర్ చేయడం, టెక్నాలజీని బదిలీ చేయడం అత్యవసరం. కొన్ని కంపెనీల సొంత ఆస్తిలా కోవిడ్–19 వ్యాక్సిన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగకూడదు. అది యావత్ ప్రపంచ ఆరోగ్యాన్నికి ఉమ్మడి వ్యాక్సిన్గా రూపొందాలి అని డాక్టర్ టొర్రీల్ వక్కాణించారు. భారీస్థాయి మందుల కంపెనీలలో ఉత్పత్తి, పరిశోధనకోసం భారీగా పెట్టుబడులు పెట్టిన ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్ మేధో హక్కులను పంచుకునేలా ఆ మందుల కంపెనీలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మహమ్మారి. యావత్ ప్రపంచం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవలసి ఉంది. వ్యాపార లాభాలకు, దురాశకు, జాతీయవాదానికి ఇప్పుడు ఏమాత్రం చోటు లేదని అందరూ గ్రహించాల్సి ఉంది. వ్యాసకర్త: గీతికా మంత్రి జర్నలిస్టు -
కరోనా టీకా సంస్థలకు బూస్ట్
న్యూఢిల్లీ: త్వరలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా కోవిడ్–19 టీకాలు వేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్ తదితర టీకాల తయారీ సంస్థలకు భవిష్యత్లో సరఫరా చేయబోయే వ్యాక్సిన్లకు సంబంధించి రూ. 4,500 కోట్లు అడ్వాన్స్గా చెల్లించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకునేందుకు తోడ్పడేలా బ్యాంక్ గ్యారంటీ అవసరం లేకుండా అడ్వాన్స్ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలను సడలించినట్లు వివరించాయి. దీనికి క్యాబినెట్ అనుమతి అవసరం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘క్రెడిట్ లైన్ రూపంలో ఈ నిధులు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని భావిస్తున్నాను. ఇందుకు ఆర్థిక మంత్రికి అధికారాలు ఉంటాయి. దీనికి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వం తలపెట్టిన టీకాల కొనుగోలు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్ల సరఫరాకు ఇది తోడ్పడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం ఎస్ఐఐకి రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్కు సుమారు రూ. 1,500 కోట్లు లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్ఐఐ సీఈవో అదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ‘దేశీయంగా టీకాల ఉత్పత్తి, పంపిణీకి తోడ్పడేలా విధానపరమైన మార్పులు చేయడంతో పాటు సత్వరం ఆర్థిక సహాయం చేయడంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పూనావాలా ట్వీట్ చేశారు. మరోవైపు, పన్నుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు సంబం ధించి ఫైనాన్స్ బిల్లు 2021కి చేసిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోవిడ్ వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం మినహాయింపు! విదేశాల నుంచి భారత్కు వచ్చే కోవిడ్–19 వ్యాక్సిన్లపై ప్రభుత్వం దిగుమతి సుంకం మినహాయించే అవకాశం ఉంది. విదేశీ వ్యాక్సిన్ల ధర తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దిగుమతయ్యే వ్యాక్సిన్లపై ప్రస్తుతం 10% కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం) ఉంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల ప్రారంభంలో రష్యాకు చెందిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ భారత్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. మరోవైపు అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా మోడెర్నా, జాన్సన్ సైతం ప్రభుత్వానికి విన్నవించాయి. దిగుమతి అయ్యే వ్యాక్సిన్లపై కస్టమ్స్ డ్యూటీతోపాటు 16.5% ఐ–జీఎస్టీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వసూలు చేస్తున్నారు. వ్యాక్సిన్లను భారత్కు సరఫరా చేసేందుకు అనుమతించాల్సిందిగా విదేశీ సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరిన వెంటనే కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో తమ వ్యాక్సిన్కు అనుమతి కోసం ఫైజర్ ప్రభుత్వాన్ని సంప్రదించిన సమయంలోనే సుంకం మినహాయింపు అంశంపై చర్చ మొదలైంది. ఐసీఏఐ, సీఏఏఎన్జెడ్ ఒప్పందానికి ఓకే.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆ్రస్టేలియా అండ్ న్యూజిలాండ్ (సీఏఏఎన్జెడ్) మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సభ్యుల అర్హతలకు సంబంధించి రెండు సంస్థలూ పరస్పరం గుర్తింపునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్కు రెమిటెన్సులు పెరిగేందుకు కూడా ఇది తోడ్పడగలదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఐసీఏఐ, సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించింది. తాల్చేర్ ఫెర్టిలైజర్ యూరియాకు సబ్సిడీ కోల్–గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా యూరియా ఉత్పత్తి చేసే తాల్చేర్ ఫెర్టిలైజర్స్ (టీఎఫ్ఎల్) కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన సబ్సిడీ విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గెయిల్, కోల్ ఇండియా, ఆర్సీఎఫ్, ఎఫ్సీఐఎల్ కలిసి జాయింట్ వెంచర్గా 2015లో దీన్ని ఏర్పాటు చేశాయి. ఒరిస్సాలో ఎఫ్సీఐఎల్కి చెందిన తాల్చేర్ ప్లాంట్ను పునరుద్ధరించే దిశగా టీఎఫ్ఎల్ 12.7 లక్షల టన్నుల వార్షిక సామర్ధ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. యూరియా ఉత్పత్తికి సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ఎల్ఎన్జీ దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. -
ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..
హ్యూస్టన్: అంతర్జాతీయ సంస్థలతో కలిసి భారత్ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లు (కోవిషీల్డ్, కొవాగ్జిన్) ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం నుంచి కాపాడాయని అమెరికా శాస్త్రవేత్త, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ అన్నారు. కరోనా కష్టకాలంలో భారత్ ప్రపంచానికి ఫార్మసీలా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. డీజీసీఏ అనుమతి కలిగిన ఆ రెండు వ్యాక్సిన్ల పనితీరు చాలా మెరుగ్గా ఉందని, వాటి పనితీరు అన్ని వయసుల వారిపై సమానంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకే ప్రపంచ దేశాలన్నీ భారత వ్యాక్సిన్ల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. వ్యాక్సిన్ల తయారీ విషయంలో భారత్ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని హెచ్చరించారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల తయారీలో భారత పాత్రను ప్రశంసించారు. వైరస్పై పోరాటంలో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చి భారత్ ప్రపంచానికి పెద్ద బహుమతే ఇచ్చిందని కొనియాడారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రంగానే ఉండగా.. భారత వ్యాక్సిన్లు ప్రపంచాన్ని రక్షించాయని పేర్కొన్నారు. కాగా, బీసీఎం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి భారత్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -
వ్యాక్సిన్లపై విజి'లెన్స్'
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్లు ఏమాత్రం పక్కదారి పట్టకుండా ఉండేందుకు, బ్లాక్ మార్కెట్లకు తరలకుండా ఉండటానికి గట్టి నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పటిష్టమైన విజిలెన్స్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అన్ని కోల్డ్ చైన్ పాయింట్లు, కేంద్రాలకు వ్యాక్సిన్లను రవాణా చేసే సమయంలో, అన్ని టీకా కేంద్రాల వద్ద వాటికి భద్రత కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేయ నుంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కలెక్టర్లపైనే పూర్తి భారం... వ్యాక్సినేషన్ ప్రక్రియ 16 నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్లతో కేసీఆర్ సోమ వారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ, భద్రత సహా అన్నింటిలోనూ కలెక్టర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో స్టేట్ స్టీరింగ్ కమిటీ (ఎస్ఎస్సీ) ఉంటుంది. దాని పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నేతృత్వంలో స్టేట్ టాస్్కఫోర్స్ (ఎస్టీఎఫ్), స్టేట్ కంట్రోల్ రూం (ఎస్సీఆర్) ఏర్పాటవుతాయి. రాష్ట్రస్థాయి కమిటీల పర్యవేక్షణలో కలెక్టర్లు పనిచేస్తారు. జిల్లాల్లో వ్యాక్సినేషన్ కోసం కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా టాస్్కఫోర్స్ (డీటీఎఫ్), జిల్లా కంట్రోల్ రూం (డీసీఆర్) ఏర్పాటవుతాయి. ఇక మండల స్థాయిలో తహసీల్దార్లు చైర్మన్లుగా టాస్్కఫోర్స్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటవుతాయి. టీకా కేంద్రాల ఏర్పాటు కీలకం... 16న నిర్దేశించిన 139 చోట్ల టీకా ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. 18నుంచి పూర్తిస్థాయిలో 1,200 ఆసుపత్రులు, 1,500 కేంద్రాల్లో వారానికి 4 రోజులు టీకాలు వేయాల్సి ఉంటుంది. రెండు వారాలపాటు 3.17 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో కలెక్టర్లు నిమగ్నం కావాల్సి ఉంది. మూడు గదులుండే కేంద్రాలను గుర్తించాలి. తక్షణమే ఆయా టీకా కేంద్రాలను గుర్తించాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. -
ఏ వ్యాక్సిన్కు ఎంత సమయం?
తొలినాళ్లలో టీకాలు కనిపెట్టేందుకు దశాబ్దాల కాలం పట్టేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగే కొద్దీ టీకాల ఉత్పత్తి సమయం తగ్గుతూ వచ్చింది. తాజాగా మానవాళిపై ప్రకృతి పంపిన కరోనా మహమ్మారికి రికార్డు స్థాయిలో ఏడాదిలోపే టీకా కనుగొన్నారు. చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న వ్యాక్సిన్లు, వాటిని కనిపెట్టేందుకు పట్టిన సమయం ఓసారి చూద్దాం.. స్మాల్పాక్స్ (మశూచి) క్రీ.పూ 3వ శతాబ్దం నుంచి మానవచరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్దినాటికి కాలనైజేషన్ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనివల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి ఈవ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 1967 తర్వాతే ఈ వ్యాక్సిన్ను విరివిగా ఇచ్చి 1980 నాటికి స్మాల్పాక్స్ ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటివరకు టీకాతో సమూలంగా నిర్మూలించిన వ్యాధి ఇదొక్కటే. టైఫాయిడ్: 1880లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. 1886లో టీకా కనుగొనే యత్నాలు ఆరంభమయ్యాయి. 1909లో రస్సెల్ అనే శాస్త్రవేత్త విజయవంతమైన వ్యాక్సిన్ కనుగొన్నారు. 1914 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఇన్ఫ్లూయెంజా: ఈ వ్యాధికి టీకా కనుగొనే ప్రయత్నం 1930 నుంచి జరిగింది. 1945లో విజయవంతమైన టీకా ఉత్పత్తి చేశారు. కానీ ఈ వ్యాధికారక వైరస్లో మార్పులు జరుగుతుండటంతో టీకాలో మార్పులు చేస్తున్నారు. పోలియో: ప్రాణాంతకం కాకపోయినా, మనిషిని జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు టీకాను 1935లో కోతులపై ప్రయోగించారు. కానీ తొలిసారి విజయవంతమైన టీకాను 1953లో జోనస్ సాక్, 1956లో ఆల్బర్ట్ సబిన్ తయారు చేశారు. 1990 అనంతరం పలు దేశాల్లో పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగింది. ఆంత్రాక్స్: ఈవ్యాధి గురించి క్రీ.పూ 700 నుంచి మనిషికి తెలుసు. 1700నుంచి దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. 1881లో తొలిసారి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయత్నం జరిగింది. పశువులకు వాడే విజయవంతమైన ఆంత్రాక్స్ టీకాను మాత్రం 1937లో మాక్స్ స్టెర్నె కనుగొన్నారు. 1970ల్లో ఆంత్రాక్స్ టీకా ఉత్పత్తి జరిగింది. ఎంఎంఆర్: మీజిల్స్, మంప్స్, రూబెల్లా అనేవి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. 1960 నాటికి వీటికి విడివిడిగా వ్యాక్సిన్లు వచ్చాయి. 1971లో మౌరిస్ హిల్లెమన్ ఈ వ్యాధులకు ఒకే వ్యాక్సిన్ను కనుగొన్నారు. చికెన్పాక్స్(ఆటలమ్మ): 19వ శతాబ్దం వరకు దీన్ని స్మాల్పాక్స్గానే భ్రమించేవారు. అనంతరం దీనిపై విడిగా పరిశోధనలు జరిగాయి. 1970లో జపాన్ సైంటిస్టులు విజయవంతమైన చికెన్పాక్స్ టీకా కనుగొన్నారు. ప్లేగు: మానవాళిని గజగజలాడించిన మొండి వ్యాధి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది. కానీ దీనికి సరైన వ్యాక్సిన్ ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల ఆధునిక యాంటీబయాటిక్స్తో దీన్ని నివారించవచ్చు. గతంలో దీనికి వ్యాక్సిన్ తయారు చేయాలన్న యత్నాలు సఫలం కాలేదు. 2018లో దాదాపు 17 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయిల్స్లో ఉన్నట్లు డబ్లు్యహెచ్ఓ తెలిపింది. యెల్లో ఫీవర్ 500 ఏళ్లుగా మనిషిని ఇబ్బందులు పెట్టిన ఈవ్యాధికి టీకా కనుగొనే యత్నాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి. 1918లలో రాక్ఫెల్లర్ సంస్థ సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొన్నారు. మాక్స్ ధీలర్ 1937లో తొలిసారి యెల్లోఫీవర్కు విజయవంతమైన టీకా తయారు చేశారు. 1951లో ఆయనకు నోబెల్ వచ్చింది. టీకా ఉత్పత్తికి నోబెల్ అందుకున్న తొలి శాస్త్రవేత్త ఆయనే. హెపటైటిస్ బీ ఇటీవల కాలంలో కనుగొన్న వైరస్ ఇది. 1965లో దీన్ని గుర్తించిన డా. బరూచ్ బ్లుంబర్గ్ నాలుగేళ్ల అనంతరం దీనికి వ్యాక్సిన్ను తయారు చేయగలిగారు. 1986లో హెపటైటిస్ బీకి సింథటిక్ టీకాను కనుగొన్నారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీని టీకాతో లివర్ క్యాన్సర్ను నివారించడం జరుగుతుంది కనుక ఈ టీకాను తొలి యాంటీ క్యాన్సర్ టీకాగా పేర్కొంటారు. -
కరోనా 2.O: వైరస్ కొత్త రూపం, అసలు కథేంటి?
సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. వైరస్ల్లో జన్యుమార్పులు సహజంగానే జరుగుతుంటాయి. కానీ నెమ్మదిగా జరగాల్సిన ఇలాంటి జన్యుమార్పులను వేగంగా పూర్తి చేసుకొని కరోనా రివైజ్డ్ వెర్షన్లాగా సిద్ధమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ రివైజ్డ్ కరోనా వివరాలు ఇవీ.. ఏమని పిలుస్తారు? వీయూఐ 20212/01. ఎలా ఏర్పడింది?: కోవిడ్ వైరస్లో 23 జన్యుమార్పులు జరిగి ఏర్పడింది. ఎక్కడ, ఎప్పుడు బయటపడింది? దక్షిణ లండన్లో, గత అక్టోబర్లో బయటపడింది. డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి. బ్రిటన్లో కేసులు పైపైకి బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన కడపటి వార్తలుఅందే సమయానికి 33,364 కేసులు నమోదయ్యాయి. ఎంత ప్రమాదకరం? గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వైరస్ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు. టీకాలు పనిచేస్తాయా? కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైరస్ టీకాకు లొంగని విధంగా పూర్తి జన్యుమార్పులు చెందేందుకు సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడు తయారవుతున్న ఆధునిక వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను అడ్డుకోగలవని చెబుతున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు. ఏం చర్యలు చేపట్టారు? ముందుగా బ్రిటన్కు పలు దేశాలు రాకపోకలను నియంత్రించాయి. బ్రిటన్లో కూడా నూతన వ్యాప్తి అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు వాక్సినేషన్ మొదలెట్టారు. భారత్లో పరిస్థితి.. ఇండియాలో ఇంకా అధికారికంగా ఈ కొత్త వేరియంట్ వైరస్ ఉనికి నిర్ధారించలేదు. అటు ఆరోగ్య శాఖ జనవరి నుంచి దేశ ప్రజలకు టీకాలు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్తగా బ్రిటన్కు విమాన రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అనవసర పుకార్లు నమ్మవద్దని, కరోనా నివారణకు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోకిన వారికే మళ్లీ? దక్షిణ లండన్లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్లోనూ ఈ కొత్త వైరస్ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని సోమవారం ‘సాక్షి’తో చెప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త వైరస్ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వైరస్లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు. (చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం) -
వ్యాక్సిన్ల వార్తలే కీలకం..!
ముంబై: కోవిడ్ –19 వ్యాక్సిన్లపై ఆశలు, అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజీ వార్తలే ఈ వారంలో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, రెండో దశ కరోనా కేసుల నమోదు పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. కొన్ని వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ ప్రకటనతో పాటు వారంతపు రోజున ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య పాలసీ విధానం మార్కెట్ను మెప్పించడంతో మార్కెట్ వరుసగా ఐదోవారమూ లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లన్నీ వ్యాక్సి న్ల వైపే దృష్టి సారించాయి. ఇప్పటికే ఫైజర్–బయోఎన్టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. అమెరికా సైతం ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి ఎఫ్డీఏ అనుమతి కోరింది. తాజాగా దేశీయ ఫార్మా సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు పరీక్షల్లో సత్ఫలితాలను ఇస్తుండడంతో మార్కెట్లో మరింత ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఓకు సిద్ధమైన ఐఆర్ఎఫ్సీ ప్రభుత్వ రంగానికి చెందిన తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రాథమిక మార్కెట్లో నిధుల సమీకరణకు సిద్ధమైంది. భారత రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) కంపెనీ రూ.4600 కోట్ల ఐపీఓ ఇష్యూ డిసెంబర్ మూడోవారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఓ ఆఫర్ ద్వారా ఐఆర్ఎఫ్సీ 178.21 కోట్ల ఈక్విటీ షేర్లను, అలాగే 118.80 కోట్ల తాజా ఈక్విటీలను ఆఫర్ చేయనుంది. మార్కెట్ పరిస్థితులు సవ్యంగా ఉంటే ఈ డిసెంబర్ మూడో వారంలో ఇష్యూ ప్రక్రియను చేపడతామని లేదంటే జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఐపీఓ ఉండొచ్చని కంపెనీ చైర్మన్ అమితాబ్ బెనర్జీ తెలిపారు. రిటైల్, పారిశ్రామిక గణాంకాలు కీలకమే ఈ శుక్రవారం(11న) నవంబర్ నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు, అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజున డిసెంబర్ 4తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ విడుదల చేయనుంది. ద్రవ్యపాలసీ విధాన ప్రకటన సందర్భంగా జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్బీఐ అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెల్లువలా విదేశీ పెట్టుబడులు ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా రు. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఎఫ్ఐఐలు రూ.17 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొన్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వచ్చే ఏడాది(2021) జనవరి వరకు ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో డీఐఐ(దేశీ ఫండ్స్) లాభాల స్వీకరణతో నికర అమ్మకందారులుగా మారారు. ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా ఉందని విశ్లేషకులంటున్నారు. 9 నెలల గరిష్టానికి క్రూడాయిల్ ధర భారత్ లాంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల క్రూడాయిల్ కదలికలూ ఈ వారం కీలకంగా మారాయి. కోవిడ్ మృతుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ఆర్థిక పురోగతి ఆశలతో గత శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధర 9 నెలల గరిష్ట స్థాయి 49.25 డాలర్లను అందుకుంది. క్రూడాయిల్ కదలికలు కేవలం స్టాక్ మార్కెట్పై మాత్రమే కాకుండా రూపాయి ట్రేడింగ్పైనా ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ పరిణామాలు సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ మంగళవారం (డిసెంబర్ 4న) యూరోజోన్తో పాటు జపాన్ దేశపు క్యూ3 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్నాయి. చైనా బుధవారం(డిసెంబర్ 5న) నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. గురువారం(డిసెంబర్ 6న) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్లపై తన విధానాన్ని ఇదేరోజున అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడి చేయనుంది. -
వైరస్ ముప్పు సమసిపోలేదు..
న్యూయార్క్: కరోనా వైరస్ ముప్పు ఇంకా సమసిపోలేదని, వైరస్ నివారణకు తయారవుతున్న వ్యాక్సిన్లు మాజిక్ బుల్లెట్లు కావని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సమాఖ్య) హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్తో మహమ్మారి అంతం దగ్గరపడిందని శుక్రవారం వ్యాఖ్యానించిన సమాఖ్య, అంతమాత్రాన కరోనా పూర్తిగా మాయం అవుతుందని భావించట్లేదని తెలిపింది. వ్యాక్సిన్ రాగానే అందరికీ అందుబాటులోకి రాదని, అందువల్ల అప్రమత్తత తప్పదని తెలిపింది. టీకాలు పనిచేయడం ప్రారంభించి క్రమంగా అందరిలో ఇమ్యూనిటీ పెరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం దాదాపు 51 టీకాలు మనుషులపై ప్రయోగదశలో ఉన్నాయని, వీటిలో 13 అంతిమ దశలో ఉన్నాయని పేర్కొంది. వాక్సిన్ పంపిణీ, నిల్వ ప్రయాసతో కూడిన అంశాలని గుర్తు చేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు దగ్గరపడుతుండడంతో మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. క్రిస్మస్ సమయంలో కేసులు మరోమారు పెరగవచ్చని అంచనా వేస్తోంది. అందువల్ల గుంపులుగా పండుగ జరుపుకోవద్దని సూచించింది. -
వ్యాక్సిన్లు ఓకే- కోట్ల డోసేజీలు ఈజీ కాదు!
న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఇటీవల రెండు వ్యాక్సిన్లు చివరి దశలో విజయవంతమైనట్లు కంపెనీలు ప్రకటించాయి. అమెరికన్ దిగ్గజాలు ఫైజర్, మోడర్నా.. తమ వ్యాక్సిన్లు 90 శాతంపైగా సురక్షితమంటూ పేర్కొన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్లపై దృష్టిసారించాయి. ఇప్పటికే నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల వ్యాక్సిన్లు సైతం చివరి దశ పరీక్షలలో ఉన్నాయి. కాగా.. అమెరికన్ దిగ్గజాల వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో విజయవంతమై నియంత్రణ సంస్థల అనుమతులు పొందవలసి ఉంది. ఒకవేళ యూఎస్ఎఫ్డీఏ తదితరాలు వ్యాక్సిన్లకు వెంటనే గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ వీటి తయారీ, పంపిణీ పలు సవాళ్లతో కూడుకుని ఉన్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్) వచ్చే ఏడాదిలోనే ఫెడరల్ నియంత్రణ సంస్థల నుంచి ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లకు త్వరితగతిన అనుమతులు పొందినప్పటికీ వీటిని భారీ స్థాయిలో తయారు చేయడం కష్టమేనని ఫార్మా రంగ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది లేదా జనవరికల్లా గరిష్టంగా 5 కోట్ల డోసేజీలను మాత్రమే రూపొందించే వీలున్నట్లు అంచనా వేశారు. ఫైజర్, మోడర్నా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్లు తొలుత అమెరికన్లకు మాత్రమే అందనున్నాయి. ఫెడరల్ ప్రభుత్వం బిలియన్లకొద్దీ డాలర్లను వ్యాక్సిన్ల అభివృద్ధికి అందించడంతో తొలుత ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉంటుంది. యూఎస్ ప్రభుత్వం ఈ ఏడాది 30 కోట్ల డోసేజీలను లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: (వ్యాక్సిన్ దెబ్బకు పసిడి- వెండి డీలా) సాంకేతికత కారణంగా కోవిడ్-19కు చెక్ పెట్టగల వ్యాక్సిన్ల తయారీలో ఫైజర్, మోడర్నా కొత్త టెక్నాలజీలను వినియోగించాయి. ఇలాంటి టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్లను ఇంతక్రితం భారీ స్థాయిలో వినియోగించేందుకు నియంత్రణ సంస్థలు అనుమతులు ఇచ్చింది లేదని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే.. ఫార్మా దిగ్గజాలు మిలియన్లకొద్దీ డోసేజీలను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇందుకు వీలుగా ముడి(రా) వ్యాక్సిన్, ఇతర ముడిపదార్ధాలు(ఇన్గ్రెడియంట్స్) తగినంతగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇదేవిధంగా వీటన్నిటినీ క్రోడీకరించి అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్ల బ్యాచ్లను తయారు చేయవలసి ఉంటుంది. అన్నిటినీ ఒకే స్థాయి ప్రమాణాలతో రూపొందించవలసి ఉంటుంది. బయోలాజికల్ ప్రొడక్టుకు సంబంధించిన తయారీని పెంచడంలో పలు సవాళ్లు ఎదురుకావచ్చని ఆరోగ్య పరిరక్షణ శాఖకు చెందిన స్టాఫ్ డిప్యూటీ చీఫ్ పాల్ మ్యాంగో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 30 కోట్ల డోసేజీల తయారీ అత్యంత క్లిష్టతతోకూడిన వ్యవహారమని అభిప్రాయపడ్డారు. 5 కోట్ల డోసేజీలే.. ఫైజర్ తొలుత ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తాజాగా వీటిలో సగం పరిమాణంలోనే అందించగలమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రపంచ దేశాలకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల కారణంగా గతంలోలేని విధంగా ముందుగానే ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు పూర్తికాకుండానే తయారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. వ్యాక్సిన్ విజయవంతమైతే వెనువెంటనే భారీ స్థాయిలో డోసేజీలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 10 కోట్ల డోసేజీలను అందించేందుకు వీలుగా మోడర్నా 2 బిలియన్ డాలర్లను ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందుకుంది. అయితే జనవరికల్లా 2 కోట్ల డోసేజీలను అందించే వీలున్నట్లు అంచనా. ఇక ఫైజర్ అయితే 10 కోట్ల డోసేజీలను 1.95 బిలియన్ డాలర్లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని భావిస్తున్నట్లు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లా ఇటీవల తెలియజేశారు. ఇతర కంపెనీలు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా జనవరికల్లా మిలియన్లకొద్దీ వ్యాక్సిన్లను అందించేందుకు సన్నాహాలు చేసినప్పటికీ క్లినికల్ పరీక్షలను ఆరు వారాలపాటు నిలిపివేయడంతో ఈ ఏడాది చివరికల్లా అనుమతులు లభించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జనవరిలో ఈ వ్యాక్సిన్లకు గ్రీన్సిగ్నల్ లభించవచ్చని భావిస్తున్నారు. ఇక రెండు డోసేజీలలో వ్యాక్సిన్లను రూపొందిస్తున్న నోవావాక్స్ వచ్చే ఏడాదిలో 2 బిలియన్లకుపైగా డోసేజీలను అందించాలని చూస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఫెడరల్ ప్రభుత్వం నుంచి నోవావాక్స్ 1.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ సైతం మార్చికల్లా 10 కోట్ల డోసేజీలను సిద్ధం చేసే వ్యూహాల్లో ఉంది. 2021 చివరికల్లా 1 బిలియన్ డోసేజీలను సరఫరా చేయాలని భావిస్తోంది. -
ప్రజల్లో తగ్గుతోన్న కరోనా ‘యాంటీ బాడీస్’
ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన వారు ప్రాణాలతో బయట పడాలంటే వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే ‘యాంటీ బాడీస్ (రోగ నిరోధక శక్తి)’ శరీరంలో పెంచుకోవడం ఒక్కటే మార్గమని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు మొదటి నుంచి చెబుతున్న విషయం తెల్సిందే. ఎందుకంటే కరోనా చికిత్సకు సరైన మందు ఇంతవరకు లేకపోవడమే. రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో సహజ సిద్ధంగా అంటే ఆరోగ్యకరమై ఆహారంతోపాటు శారీరక వ్యాయామం చేయడం మరో మార్గమని కూడా వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. కొందరిలో సహజ సిద్ధంగానే రోగ నిరోధక శక్తి ఉంటుంది. (డిసెంబర్లో కరోనా వ్యాక్సిన్) అయితే ఈ రోగ నిరోధక శక్తి బ్రిటీష్ ప్రజల్లో క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లం అవడం ఆందోళనకరమైన విషయం. కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి కూడా ప్రజల్లో అదే శాతంలో లేదా అంతకన్నా ఎక్కువ మందిలో పెరగుతూ రావాలి. కానీ అందుకు విరుద్ధంగా తగ్గడం బ్రిటీష్ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉంది. కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీ బాడీస్కు సంబంధించి గత జూన్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో బ్రిటన్ జనాభాలో ఆరు శాతం జనాభాలో యాంటీ బాడీస్ ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్ నెల నాటికి యాంటీ బాడీస్ కలిగిన వారి సంఖ్య 4.4 శాతానికి పడిపోయిందని తేలింది. దేశంలోని మొత్తం జనాభాకుగాను దేశ నలుమూలల నుంచి 3,65,000 మంది శాంపిళ్లను సేకరించడం ద్వారా ‘రియాక్ట్ 2’ పేరిట పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. (సెకండ్ వేవ్ మొదలైంది.. మళ్లీ లాక్డౌన్) ప్రజల్లో యాంటీ బాడీస్ తగ్గిపోవడం అంటే వారిలో కరోనా వైరస్ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోవడం కనుక ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందడం సహజమే. కొన్ని సందర్భాంలో ప్రజల్లో యాంటీ బాడీస్ పడి పోవడం కూడా సాధారణమేనని, మెమోరీ సెల్స్గా పిలిచే బీ సెల్స్ పడి పోకూడదని, తాము జరిపిన పరిశోధనల్లో బీ సెల్స్ పడిపోయాయా లేదా అన్న అంశాన్ని పరిశోధించలేదని, ఈ కారణంగా యాండీ బాడీస్ పడి పోవడం పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. వ్యాక్సిన్ల వల్ల కూడా యాండీ బాడీస్ పెరగుతాయని వారు చెప్పారు. (భారత్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అప్పుడే!) -
5 వ్యాక్సిన్లు : 100 కోట్ల డోసులు
సాక్షి, ముంబై: కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు కరోనా వైరస్ ఒక వాక్సిన్లకు సంబంధించి ఒక్కోదానికి ఒక బిలియన్ మోతాదులను తయారు చేస్తున్నట్టు సీరం సీఈఓ అదార్ పూనావల్లా తెలిపారు. అలాగే 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్ లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. (కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు) 2021-22 ముగిసేలోపు ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవోవాక్స్, కోవివాక్స్, కోవి-వాక్, ఎస్ఐఐ కోవాక్స్ అనే ఐదు వేర్వేరు కరోనావైరస్ వ్యాక్సిన్లకు సంబంధించి వందకోట్ల మోతాదులను సిద్ధం చేయనున్నామని పూనావల్లా చెప్పారు. 'కోవిషీల్డ్' కరోనావైరస్ వ్యాక్సిన్తో ప్రారంభించి, సీరం 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్ను విడుదల చేయాలని భావిస్తోంది. 20-30 మిలియన్ మోతాదులను ఇప్పటికే తయారు చేస్తున్నామనీ దీన్ని నెలకు 70-80 మిలియన్లకు పెంచనున్నామని పూనావల్లా తెలిపారు. టీకా షెల్ఫ్ జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పూణేలోని ఎస్ఐఐ ప్రక్కనే కొత్త ఉత్పాదక కేంద్రం సిల్స్ రాబోతోందని, ఇది పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని అదార్ పూనావాలా తెలిపారు. అప్పటి వరకు సిల్స్ అవుట్ సోర్స్ చేస్తుందన్నారు. ఈ రెండూ పూర్తయిన తరువాత డిమాండ్, అవసరాన్ని బట్టి 2 నుంచి 3 బిలియన్ మోతాదుల వరుకు తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటామని కూడా పూనావల్లా వెల్లడించారు. బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంయక్తంగారూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,600 మందిలో క్లినికల్ ట్రయల్ 3వ దశలో ఉంది. దీని తయారీకి సంబంధించి ఇప్పటికే సీరం ఒప్పంద భాగస్వామ్యం చేసుకుంది. రెండవ వ్యాక్సిన్ బయోటెక్ సంస్థ నోవోవాక్స్ కు చెందిన 'కోవోవాక్స్'. దీని ఫేజ్-1 క్లినికల్ ట్రయల్ మే 2020 లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ 2020 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. నోవోవాక్స్ 2021 లో ఒక బిలియన్ మోతాదులను ఉత్పత్తికి సీరం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. -
కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్డేట్
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కోవిడ్-19 కట్టడికి గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ను నిలువరించేందుకు వ్యాక్సిన్ల తయారీకి నడుం బిగించాయి. ఈ బాటలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలలో ఎంతో ముందంజ వేశాయి. అంతర్జాతీయ స్థాయిలో తొట్టతొలిగా రష్యా తయారీ వ్యాక్సిన్ అధికారికంగా రిజిస్టర్కాగా.. యూఎస్, బ్రిటన్ దేశాల ఫార్మా దిగ్గజాలతోపాటు.. దేశీయంగానూ కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ పరీక్షలకు చేరాయి. దేశీయంగా భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా తదితరాలు రేసులో ఉన్నాయి. దీంతో కొత్త ఏడాది అంటే 2021 ప్రారంభంలో కోవిడ్-19 చికిత్సకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోవిడ్-19 బారినపడుతున్న వారి సంఖ్య లక్షల్లో నమోదవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్ల పురోగతి వివరాలు ఎలా ఉన్నాయంటే... మోడర్నా ఇంక్ జెనెటిక్ మెటీరియల్(ఎంఆర్ఎన్ఏ) ఆధారంగా యూఎస్ కంపెనీ మోడర్నా ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా మానక కణాల్లో యాంటీజెన్ను ప్రేరేపిస్తుంది. తద్వారా ఇమ్యూనిటీ(రోగ నిరోధక శక్తి)ని పెంచేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాక్సిన్పై జులై 17 నుంచి 30,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను మోడార్నా ప్రారంభించింది. ఫైజర్- బయోఎన్టెక్ జర్మన్ కంపెనీ బయోఎన్టెక్తో చేతులు కలపడం ద్వారా ఫైజర్ ఇంక్.. ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. జులై 27 నుంచీ రెండు, మూడో దశల క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. యూఎస్తోపాటు బ్రెజిల్, జర్మనీ తదితర దేశాలలో వీటిని చేపట్టింది. ఒక్క యూఎస్లోనే 43,000 మందిపై ప్రయోగాలు చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ చింపాంజీ ఎడినోవైరస్ ఆధారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్- స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను రూపొందించింది. మే నెలలో రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో 17,000 మందిపై పరీక్షించింది. మూడో దశలో భాగంగా యూఎస్లో 30,000 మందిపై పరీక్షిస్తోంది. దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ 1,700 మందిపై ప్రయోగాలు చేపట్టింది. యూఎస్లో తాత్కాలికంగా పరీక్షలను నిలిపివేసినప్పటికీ ఇతర దేశాలలో కొనసాస్తున్నట్లు తెలుస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ ఎడెనోవైరస్ వెక్టర్(ఏడీ26) ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఇదే ప్లాట్ఫామ్పై కంపెనీ ఇంతక్రితం ఎబోలా, జికా, ఆర్ఎస్వీ తదితరాలకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఇది సింగిల్ డోసేజీలో రూపొందింది. ఈ వ్యాక్సిన్పై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. వివిధ దేశాలలో 60,000 మందిపై పరీక్షించే ప్రణాళికల్లో ఉంది. నోవావాక్స్ దశాబ్దాలుగా రీకాంబినెంట్ నానోపార్టికల్ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. 1.5 బిలియన్ డాలర్లను ఇందుకు వెచ్చించినప్పటికీ ప్రయత్నాలు పెద్దగా సఫలంకాలేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్-19కు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మంచి ఫలితాలనివ్వగలదని కంపెనీ భావిస్తోంది. ప్రొటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్గా పిలిచే ఈ ఔషధంపై కంపెనీ ఆశావహంగా ఉంది. యూకే ప్రభుత్వ సహకారంతో ఈ నెల 24 నుంచీ యూకేలో 10,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఏడాదికి 2 బిలియన్ డోసేజీల తయారీకి దేశ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్పుత్నిక్-వి తొలి రెండు దశల పరీక్షలు అత్యంత విజయవంతమైనట్లు ప్రకటించిన రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి తొలిసారి అధికారిక రిజిస్ట్రేషన్ పొందింది. అయితే మరో 40,000 మందిపై రష్యాలో మూడో దశ క్లినికల్ పరీక్షలను ఈ నెల నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా తయారీతోపాటు, మూడో దశ క్లినికల్ పరీక్షలకు వీలుగా డాక్టర్ రెడ్డీస్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్ బయోటెక్ దేశీయంగా ఐసీఎంఆర్తో భాగస్వామ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన స్ట్రెయిన్ ఆధారంగా ఇనేక్టివేటెడ్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ కోవాగ్జిన్ వ్యాక్సిన్ను కోతులపై ప్రయోగించగా మంచి ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. జులై నుంచీ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టింది. అక్టోబర్లో మూడో దశ పరీక్షలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. దేశ, విదేశాలలో 25,000- 30,000 మందిపై ప్రయోగించే ప్రణాళికలున్నట్లు తెలుస్తోంది. జైడస్ క్యాడిలా ప్లాస్మిడ్ డీఎన్ఏగా పిలిచే వ్యాక్సిన్ను జెనెటిక్ మెటీరియల్ ఆధారంగా రూపొందించినట్లు జైడస్ క్యాడిలా పేర్కొంది. వ్యాక్సిన్పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను జులైలో చేపట్టింది. మరో 15,000-20,000 మందిపై మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. సనోఫీ- జీఎస్కే జీఎస్కేతో భాగస్వామ్యంలో దేశీయంగా తయారీ, పంపిణీ సామర్థ్యాలు కలిగిన సనోఫీ వ్యాక్సిన్ను రూపొందించింది. ప్రొటీన్ సబ్యూనిట్ ఆధారిత ఈ వ్యాక్సిన్పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ఈ నెల 3న ప్రారంభించింది. ఫలితాల ఆధారంగా ఈ ఏడాది చివరికల్లా మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. క్యాన్సినో బయోలాజిక్స్ హ్యూమన్ ఎడినోవైరస్(ఏడీ5) ఆధారంగా చైనా కంపెనీ క్యాన్సినో బయోలాజిక్స్ వ్యాక్సిన్ను రూపొందించింది. ఇందుకు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మిలటరీ మెడికల్ సైన్స్ అకాడమీ సహకారాన్ని తీసుకుంది. ప్రత్యేక అవసరాలరీత్యా చైనీస్ మిలటరీ ఈ వ్యాక్సిన్ను జూన్ 25న అనుమతించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్లో 40,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఇందుకు రష్యా, పాకిస్తాన్, సౌదీ అరేబియా నుంచి అనుమతి పొందింది. -
టీకా.. కేక!
సాక్షి, అమరావతి: ఏపీలో ఇమ్యునైజేషన్ (టీకాల) కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించడంలో చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కార్యక్రమం ఏపీలో జరుగుతోందని రెండ్రోజుల కిందట విడుదలైన నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో 97 శాతం మంది చిన్నారులకు తల్లిదండ్రులు ఏదో ఒక వ్యాధి నిరోధక టీకా వేయిస్తున్నారు. మొత్తం 8 రకాల టీకాలు (బీసీజీ, ఓపీవీ, పెంటావాలెంట్ 5, మీజిల్స్) వేయించుకుంటున్న వారు 73.6 శాతం ఉన్నట్టు తేలింది. జాతీయ స్థాయిలో టీకాలు వేయించుకుంటున్న వారి సగటు కేవలం 59.2 శాతమే. ఆసక్తికర విషయమేంటంటే రాష్ట్రంలో 99 శాతం మంది తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు ప్రభుత్వాస్పత్రులకే వెళుతున్నట్టు వెల్లడైంది. ఏపీలో బాగా జరుగుతోంది – జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 74.2 మంది టీకాల కోసం సబ్ సెంటర్లకు వెళుతున్నారు. – దేశంలో పట్టణ ప్రాంతాల్లో చూస్తే 45 శాతం మందే సబ్ సెంటర్, అంగన్వాడీలకు వెళుతున్నారు. – జాతీయ స్థాయిలో 9.1 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో టీకాలకు వెళుతుండగా, 2.6 శాతం మంది ఎన్జీవోలను ఆశ్రయిస్తున్నారు. – అత్యల్పంగా నాగాలాండ్ రాష్ట్రంలో కేవలం 12.8 శాతం మందే టీకాలు వేయించుకుంటున్నారు. – ఏపీలో టీకాలు వేయించుకుంటున్న వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ. -
వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం మరోసారి దూకుడు చూపాయి. వ్యాక్సిన్ల అందుబాటు కారణంగా డిసెంబర్కల్లా కోవిడ్-19కు చెక్పెట్టగలమంటూ వెలువడిన అంచనాలు సెంటిమెంటుకు జోష్నివ్వగా.. మరో సహాయక ప్యాకేజీపై స్పీకర్ నాన్సీ పెలోసీతో ఆర్థిక మంత్రి స్టీవెన్ ముచిన్ చర్చలు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఇప్పటివరకూ ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బ్లూచిప్స్ దన్ను ప్రధానంగా దిగ్గజ కంపెనీలు బలపడటంతో మార్కెట్లు జోరందుకున్నాయి. కోక కోలా, జనరల్ మోటార్స్, హెచ్పీ 4 శాతం, ఇంటెల్ కార్ప్, ఫేస్బుక్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో ఏడీపీ 3 శాతం, ఫోర్డ్ మోటార్, బోయింగ్ 1.75 శాతం, అమెజాన్ 1 శాతం చొప్పున ఎగశాయి. బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ను సలహాదారుగా నియమించుకోవడంతో డ్రాఫ్ట్కింగ్స్ 8 శాతం దూసుకెళ్లింది. కంపెనీలో అతిపెద్ద ఇన్వెస్టర్ ఒకరు షేర్లను విక్రయించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6 శాతం పతనమైంది. ఇక బుధవారం భారీగా ఎగసిన జూమ్ వీడియో 7.5 శాతం దిగజారగా.. యాపిల్ ఇంక్ 2 శాతం క్షీణించింది. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ చివరి దశలో!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఏజెడ్డీ 1222 చివరి దశ క్లినికల్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్ సహకారంతో రెండు డోసేజీలు ఇవ్వడం ద్వారా 30,000 మందిపై వ్యాక్సిన్ను పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా నవంబర్కల్లా వ్యాక్సిన్ను ప్రజలకు అందించాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. ఆస్ట్రాజెనెకాతోపాటు.. బయోఎన్టెక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల డేటాను అక్టోబర్కల్లా విశ్లేషించే వీలున్నట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ తాజాగా పేర్కొంది. ఇప్పటికే ప్రయోగాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో చివరి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటికి జతగా జపాన్, రష్యాలోనూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఎస్లో నిర్వహించిన మూడో దశ పరీక్షల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందిపై తుది దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
9 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ కొనుగోలు
లండన్: కరోనా విలయం నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ను భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్ల 9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వ్యాపార మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కోవిడ్-19 నివారణ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో మూడు రకాల వ్యాక్సిన్లను ఆర్డర్ చేశామని, దీంతో మొత్తం 230 మిలియన్ మోతాదులను అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశామని వెల్లడించింది. (మౌత్ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం) జర్మనీకి చెందినబయోఎన్టెక్, అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ ఆధ్వర్యంలో రానున్న వ్యాక్సిన్ 30 మిలియన్ మోతాదులు, 60 మిలియన్ మోతాదుల వాల్నేవా వ్యాక్సిన్ కొనుగోలుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఈ వ్యాక్సిన్ ఫరీక్షల్లో విజయవంతమైతే మరో 40 మిలియన్ల మోతాదులను కూడా పొందేలా ఈ డీల్ ఖాయం చేసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ ఔషధ, వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో ఈ కొత్త భాగస్వామ్యంద్వారా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే వ్యాక్సిన్ను భద్రపరచడానికి తమకు ఉత్తమమైన అవకాశాన్ని లభించిందని వ్యాపార మంత్రి అలోక్ శర్మ అన్నారు. ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతున్న వ్యాక్సిన్ వంద మిలియన్ మోతాదులను కొనుగోలుఒప్పందాన్న గతంలో ప్రకటించడం గమనార్హం. కాగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. 150కి పైగా వ్యాక్సిన్లు పరీక్షల దశలో ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ స్టేజ్-1 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూలై 20, సోమవారం) వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలను లాన్సెంట్ మెడికల్ జర్నల్లో ప్రచురితం కానున్నాయని భావిస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ను ప్రయోగించిన వాలంటీర్ల నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు యూఎస్ బయోటెక్ సంస్థ మోడెర్నా కూడా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసింది. జూలై 27 న హ్యూమన్ ట్రయల్స్ చివరి దశను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ ట్రయల్స్లో 30వేల మంది అమెరికన్లు పాల్గొంటారు. అలాగే మోడెర్నా టీకా సురక్షితమని అమెరికా పరిశోధకులు ఇప్పటికే నివేదించారు. ప్రారంభ దశ అధ్యయనంలో మొత్తం 45 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లలో ఇది విజయవంతమైన ఫలితాలనిచ్చినట్టు తెలిపారు. -
కరోనా అంతానికిది ఆరంభం
న్యూఢిల్లీ: భారత్లో తయారవనున్న రెండు కరోనా టీకాలు ‘కొవాక్సిన్’, ‘జైకొవ్– డీ’లకు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు అనుమతించడంతో కరోనా అంతం ప్రారంభమైనట్లయిందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కరోనా టీకాలు ప్రయోగదశలో ఉన్నాయని, అందులో 11 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని పేర్కొంది. భారత్లో కరోనా టీకాను రూపొందించేందుకు ఆరు సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపింది. వాటిలో కొవాక్సిన్, జైకొవ్–డీలకు మాత్రం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. ప్రముఖ ఆస్ట్రాజెనెకా(బ్రిటన్), మోడెర్నా(అమెరికా) ఫార్మా కంపెనీలతోనూ భారత కంపెనీలు ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయితే, అవి రూపొందించిన టీకాలు సురక్షితం, సమర్ధవంతమని రుజువు కావాల్సి ఉందని వివరించింది. కరోనా వైరస్కు టీకా ఆగస్ట్ 15 నాటికి సిద్ధమవుతుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ను సిద్ధం చేయడం సాధ్యం కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ‘కొవాక్సిన్’ను రూపొందించే పనిలో ఉంది. అలాగే, ‘జైకొవ్–డీ’ని రూపొందించేందుకు జైడస్ క్యాడిలా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటికి ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రయోగాలకు అనుమతి లభించింది. కొవాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ ముగిసేందుకే కనీసం 28 రోజులు పడుతుంది. ఆ తరువాత ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ ఎలా సిద్ధమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా
లండన్: కరోనా వైరస్పై పోరులో లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన ముందడుగు వేసింది. వైరస్ను నివారించే టీకాను పదివేల మందిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఈ టీకా కరోనా శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుందా? లేదా? అన్నది పరిశీలించనుంది. గత నెలలో వెయ్యిమందిపై జరిగిన ప్రయోగాలు టీకా సురక్షితమైందని స్పష్టం చేయగా.. దాని సమర్థతను పరీక్షించేందుకు బ్రిటన్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వృద్ధులతో కలిపి 10,260 మందికి టీకా వేయనున్నామని శుక్రవారం ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు చైనా, అమెరికా, యూరప్లలో 12 వరకూ టీకాలు వేర్వేరు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇంత వేగంగా ఓ వ్యాక్సీన్ను తయారు చేయడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఈ టీకాలు అన్ని ప్రయోగ దశలు దాటుకుని సురక్షితంగా, సమర్థంగా వైరస్ను అడ్డుకుంటాయా అన్నది ఇప్పటికీ అస్పష్టమే. ప్రయోగాత్మక టీకాల్లో అధికం రోగ నిరోధక శక్తిని చైతన్యవంతం చేసి వైరస్ను గుర్తించి మట్టుబెట్టేలా చేసేవే. ఆక్స్ఫర్డ్ టీకానే తీసుకుంటే ఇది నిరపాయకరమైన వైరస్తో తయారవుతోంది. చింపాంజీలకు జలుబు తెప్పించే వైరస్. ఇందులో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇది వ్యాప్తి చెందదు. -
వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్లు
లుసానే: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే అంతర్జాతీయ హాకీ టోర్నీలు జరుగుతాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్పష్టం చేసింది. ఈమేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం ‘ఐదు దశల ప్రక్రియ’ను అనుసరించబోతున్నామని ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ‘ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం. తొలుత సామాజిక దూరం పాటిస్తూ శిక్షణను ప్రారంభిస్తాం. మరో దశలో రీజియన్ల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. తదుపరి పొరుగు దేశాల్లో జరిగే టోర్నీల్లో తలపడతాం. ఆ తర్వాత ఖండాంతర పోటీలు... ఇలా చివరి దశలో వ్యాక్సిన్ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం. అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఎఫ్ఐహెచ్ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని ఎఫ్ఐహెచ్ తెలిపింది. -
సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్లు!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు ఫలించి, కరోనా వైరస్కు టీకా అందుబాటులోకి వస్తే.. ఈ సెప్టెంబర్ నాటికి 3 కోట్ల డోసుల వ్యాక్సీన్ను సిద్ధం చేయాలని బ్రిటన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో, ఇంపీరియల్ కాలేజ్లో ఈ టీకాకు సంబంధించిన పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రి అలోక్ శర్మ తెలిపారు. ఆక్స్ఫర్డ్లో హ్యూమన్ ట్రయల్స్ స్థాయికి పరిశోధనలు చేరుకున్నాయన్నారు. అయితే, పూర్తి స్థాయిలో విజయవంతమయ్యే టీకాను రూపొందించడం సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీకా రూపకల్పనకు కృషి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, పరిశోధకులతో కూడిన టాస్క్ఫోర్స్ను ఇప్పటికే ఏర్పాటుచేశామన్నారు. వం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది. -
జిత్తులమారి కరోనా..
కరోనా భరతం పట్టేందుకు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కృషి జరుగుతోంది. అయితే ఈ నావల్ కరోనా వైరస్ ఎప్పటి కప్పుడు తన రూపాన్ని మార్చు కుంటూ.. పరివర్తనం చెందుతూ శాస్త్రవేత్త లకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్–19 మానవులపై ఎలా దాడి చేస్తుంది.. ఇది తన రూపాన్ని మార్చు కోవడం వల్ల వ్యాక్సిన్ తయారీపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది తెలుసుకుందామా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ బేసిక్స్ ఫస్ట్.. వైరస్ అంటే.. సూక్ష్మమైన ఈ పరాన్నజీవి ఆతిథేయి (హోస్ట్) శరీరంలోనే వృద్ధి చెందుతుంది. యాంటీబాడీస్.. ఆతిథేయి శరీరంలోని ‘వై’ఆకారంలోని ప్రోటీన్లు.. వెలుపలి నుంచి వచ్చే పరాన్న జీవులను అడ్డుకోవడం లేదా శరీరం నుంచి తొలగిస్తాయి. ఆతిథేయిపై వైరస్ ఎలా దాడి చేస్తుంది? 1.సార్స్ సీవోవీ– 2కు చెందిన స్పైక్(కొమ్ము) ప్రోటీన్ మానవ కణాల ఉపరితలాన్ని అంటుకుంటుంది. 2.వైరస్ జన్యు పదార్థం ఆర్ఎన్ఏతో తయారవుతుంది. 3.వైరస్ తన జన్యు పదార్థాన్ని మానవ కణంలోకి విడు దల చేస్తుంది. ఆ తర్వాత మానవ కణంలోని ప్రోటీన్లను ఉపయోగించుకుని ఆర్ఎన్ఏ రెట్టింపు (రెప్లికేట్) అవుతుంది. 4.ఇలా తయారైన ఆర్ఎన్ఏ ఒక దగ్గర చేరి కొత్త వైరస్ కాపీలు ఏర్పడతాయి. 5.కొత్త కాపీలు ఏర్పడిన తర్వాత మానవుడి కణం నుంచి బయటకు వస్తాయి. 6.నశించిన మానవుడి కణం ఊపిరితిత్తుల్లో అలాగే ఉండిపోతుంది. యాంటీబాడీలు ఎలా కాపాడతాయి? 1. కణాలకు అంటుకోకుండా అడ్డుకోవడం.. 2.కణంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం.. 3. ఆర్ఎన్ఏ విడుదల కాకుండా చూడటం.. వీటిల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. సాధారణ ప్రతిరూపకల్పన.. (రెప్లికేషన్) ►వైరస్ ఓ కణంలోకి ప్రవేశించి.. అందులోని వ్యవస్థను హైజాక్ చేస్తుంది. దాన్ని వాడుకుని వైరస్ తన కాపీలను తయారు చేసుకుంటుంది. మ్యుటేషన్.. ►సాధారణంగా కాపీలు తయారయ్యే టప్పుడు చిన్న మార్పులు కూడా మ్యుటే షన్కు దారి తీస్తుంది. ఇది ఎక్కువగా జన్యు పదార్థంలో జరుగుతుంది. ఇలా పరివర్తనం చెందిన వైరస్తో లాభాలు ఉన్నాయి. ఈ వైరస్ లను అడ్డుకునేందుకు ఆతిథేయి శరీరంలో ఎలాంటి యాంటీబాడీలు ఉండవు. దీంతో అవి యథేచ్ఛగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాక్సిన్లు.. ►వ్యాక్సిన్లు మన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తయ్యేలా ప్రేరేపిస్తాయి. ఈ యాంటీబాడీలు వైరస్పై ప్రత్యేక స్థానాల్లో (యాంటీజెన్స్) అంటుకుని వాటిని నిర్వీర్యం చేస్తాయి. వ్యాక్సిన్పై రూపాంతరం చెందిన వైరస్ల ప్రభావం.. సంతతి–ఏ: ఆతిథేయి కణానికి సోకుతుంది. ఆతిథేయి రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్పై ఉన్న ప్రోటీన్లను బట్టి గుర్తిస్తుంది. సంతతి–బి: (రూపాంతరం చెందిన వైరస్) సంతతి–ఏ పై పనిచేసే యాంటీ బాడీలు సంతతి–బి ని గుర్తించడంలో విఫలం అవుతాయి. దీంతో వ్యాక్సిన్ వ్యర్థం అవుతుంది. ►ఈ సంతతి–బి వేరే వ్యక్తికి సోకితే.. దాన్ని నిర్వీర్యం చేసేందుకు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టాల్సి ఉంటుంది. ►కొత్త కొత్త రకాలు, రూపాంతరాలు చెందుతూ ఉంటే.. వాటిని అడ్డుకునేందుకు కొత్త కొత్త వ్యాక్సిన్ల అవసరం పెరుగుతూ ఉంటుంది. సార్స్ సీవోవీ–2 ►ఇది పూర్తిగా కొత్త రకం కరోనా వైరస్ సంతతి. దీన్ని అడ్డుకునేందుకు మానవులకు ఎలాంటి నిరోధక శక్తి లేదు. ఏం జరుగుతోంది ►దీంతో ఈ వైరస్పై పనిచేసేలా వ్యాక్సిన్లు తయారుచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అంతేకాదు ఈ వైరస్ ఎలా రూపాంతరం (మ్యుటేషన్) చెందుతోందో గమనిస్తున్నారు. ఒకవేళ రూపాంతరాలు వైరస్– ►యాంటీబాడీ చర్యలకు ఆటంకం కలిగించకపోతే.. వ్యాక్సిన్ చాలా మందిపై సమర్థంగా పనిచేస్తుంది. ఇలా జరిగే చాన్సుంది.. ►ఒక్కో సంతతి ఒక్కోలా ప్రవర్తిస్తుంటే.. ఒకే వ్యాక్సిన్ పనిచేయదు. అలాంటప్పుడు వ్యాక్సిన్లను అప్డేట్ చేస్తూ ఉండాలి. ►వ్యాక్సిన్కు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు వ్యాక్సిన్లను మళ్లీ మళ్లీ అప్డేట్ చేస్తూ ఉండాలి. -
టీకా వికటించి చిన్నారి మృతి
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోగల శివలాల్ తండాలో శనివారం టీకా వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. తండాలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. అరుణ, హన్మాన్ సింగ్ దంపతుల తమ చిన్న కూతురు చిన్నారి (3 నెలలు)కి పోలియో రాకుండా చుక్కలు వేసి, టీకాలు ఇచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే చిన్నారి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. వైద్య సిబ్బంది వచ్చేలోపే చిన్నారి మృతి చెందింది. డీఎంహెచ్వో సుదర్శనం విచారణ చేపట్టారు. ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి, చిన్నారికి ఇచి్చన టీకాలు, చుక్కల మందును సీజ్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
విరుగుడు లేకుంటే ప్రాణం పోతుంది..!
ప్రాణం పోసే మందులే... శరీరానికి నప్పకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొత్తరోగాలకు కారణమవుతాయి. వ్యాక్సిన్లు వేసే ముందు వాటికి విరుగుడు మందును సైతం సిద్ధంగా ఉంచాలన్న విషయాన్ని చాలామంది వైద్యులు పట్టించుకోవడం లేదు. గిరిజన ప్రాంతాల్లో విరుగుడు మందు లేక ప్రాణాలు పోయే ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మందుల వినియోగం, వికటించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. భువనేశ్వర్ : ప్రాణాలు పోయాల్సిన మందులు.. ప్రాణాలు తీస్తున్నాయి. కత్తికి రెండువైపులా పదునన్నట్లుగా మారాయి. ఏ మందు ఎప్పుడు ఎవరిపై స్పందిస్తుందో కచ్చితమైన నిర్ధారణ ఇంకా వైద్య శాస్త్రం చేయలేదంటున్నారు వైద్యులు. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు ఉంది రోగుల పరిస్థితి. మనిషి అన్నాక ఏదో ఒక రోగం రాక తప్పదు. రోగం వచ్చిన తరువాత వైద్యుని ఆశ్రయించి మందులు తీసుకుని వాడడం పరిపాటి. అయితే, ఇక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. రోగం తగ్గడానికి వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే అవి కొత్త రోగాలకు కారణమవుతూ ప్రాణాలను తోడేస్తున్నాయి. మందులు రియాక్షన్ ఇవ్వడంతో వింతరోగాల బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. మెడికల్ రియాక్షన్ వల్ల కలిగే రోగాలను ముందుగానే గుర్తించకపోతే మరణమే శరణ్యం. అందుకే వీటి లక్షణాలను ముందుగానే గుర్తించడం ప్రధానమంటున్నారు వైద్య నిపుణులు. వెంటనే వాడుతున్న డ్రగ్ను నిలిపివేయాలని సూచిస్తున్నారు. అయితే, ఏ డ్రగ్ రియాక్షన్ ఇస్తుందో తెలియని వైద్య ప్రపంచంలో సామాన్యులకే కాదు వైద్యులకు సహితం అవగాహన ఉందా ప్రశ్న తలెత్తుతుంది. ఇది నూటికి నూరు శాతం నిజమనే తేలుతుంది. పోతున్న ప్రాణాలు కూడా వైద్యుల స్థాయిలో నిర్లక్ష్యం వల్లే పోతున్నాయి. అందుకే వైద్యులకు డ్రగ్ రియాక్షన్పై సంపూర్ణ అవగాహన ఉండాలంటున్నారు ప్రొఫెసర్లు. దీని ద్వారా రియక్షన్ వల్ల కలిగే అనర్థాలను కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. డ్రగ్ రియాక్షన్ కేసులపై జరుగుతున్న మరణాలపైన వైద్య రంగం మరింత పరిశోధన చేయాలి. పెన్సిలిన్ లాంటి మందులను ఒక వ్యక్తికి సరిపోతాయో లేదో అని పరిశీలించే వీలు ఎలా ఉందో అలా అన్ని డ్రగ్సుకు పరిశీలించాలి. ఆ వైపుగా వైద్య రంగం ప్రయాణం సాగాలి. మందు వికటిస్తే ఏం చేయాలి రోగికి మాత్రలు, వ్యాక్సిలు ఇచ్చిన సమయంలో నూటికి 95 శాతం డ్రగ్ రియాక్షన్ వచ్చినప్పుడు మొదటగా ప్రథమ చికిత్స చేయడానికి ముందే వాడుతున్న మందుల వినియోగాన్ని నిలిపివేయాలి. మందుల వాడడం వల్ల శరీరంలో మార్పులు వస్తున్న సంగతిని గుర్తించాలి. ఏవైతే మందులు వినియోగించిన సమయంలో డ్రగ్ రియాక్షన్ జరుగుతుందో దీనికి విరుగుడుగా ఉపయోగించే మందులను కూడా అందుబాటులో పెట్టుకోవాలి. విరుగుడు మందును ఇచ్చిన వెంటనే నిపుణులైన వైద్యుల వద్దకు త్వరగా తీసుకుపోవాలి. నిబంధనలకు చెల్లుచీటీ... రోగికి అవసరమైన మందులును వైద్యులు రోగి శరీరంలోకి పంపించే సమయంలో రోగి లక్షణాల్లో మార్పులు సంతరించుకుంటే డ్రగ్ రియాక్షన్ అయినట్లు గుర్తిస్తారు. పెన్సిలిన్ ఇంజక్షన్ కొంతమందికి పడదు. అలాగే, న్యూరోబిన్ ఇంజక్షన్ కొంతమందికి నప్పదు. ఇలా అనేక మందులు వారి శరీర తత్వాలను బట్టి నప్పవు. అయితే, నిపుణులైన వైద్యులు, ఆర్ఎంపీ వైద్యులు, మెడికల్ షాపుల యజమానులు ఆయా మందులను రోగికి ఇచ్చే ముందు అవి వారికి నప్పుతాయో లేదో పరిశీలించాలి. కొందరు వైద్యులు ఎటువంటి పరీక్షలు చేయకుండా రోగి శరీరంలోకి మందులను ఎక్కించేస్తుండడం సమస్యలను తెస్తోంది. మందు వికటిస్తే డెకాడ్రాన్, ఎట్రోఫిన్, ఎడ్రనలిన్, డెరి ఫిల్లిన్, ఎవిల్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి. వీటిని వినియోగించడం వల్ల రోగి ప్రాణాపాయ స్థితి నుంచి గట్టేక్కే వీలుంటుంది. డ్రగ్ రియాక్షన్ లక్షణాలు ఇలా... రోగికి మందులు నప్పనప్పుడు రియాక్షన్ తప్పక కనిపిస్తుంది. అలాంటి సమయంలో రోగికి అతిగా ఆవేశం రావడం, శరీరం చెమటలు పట్టడం, మూర్చ వచ్చి కాళ్లు, చేతులు కొట్టుకోవడం, చర్మంపై దురదలు పెట్టడం, శరీరంపై కడతలు రావడం, శరీరం ఎర్రగా కందిపోయినట్లు కావడం, వాంతులు కావడం, స్పృహ తప్పి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ... గిరిజన ప్రాంతాల రోగులు ఎక్కువగా డ్రగ్ రియాక్షన్కు గురౌతుంటారు. గిరిజనులు, కొండశిఖర మారు మూల గ్రామాల ప్రజలు ఎక్కువగా సంచి వైద్యులను ఆశ్రయిస్తుంటారు. వీరు ఒక జబ్బుకు ఇవ్వాల్సిన మందు స్థానంలో వేరే మందును ఇవ్వడం, కాలం చెల్లిన మందులు ఇస్తారు. దీంతో డ్రగ్ రియాక్షన్ అవుతుంది. వెంటనే విరుగుడు మందులు సంచి వైద్యుల వద్ద ఉండకపోవడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఆ రోగి ఆస్పత్రికి చేరేవరకు బ్రతికి ఉంటాడో లేక ప్రాణాలు విడుస్తాడో తెలియని పరిస్థితి. ఇటువంటి ఎన్నో కేసులు గిరిజన ప్రాంతాల్లో బయటపడకుండా మరుగున పడిన సంఘటనలు ఉన్నాయి. మందులు అందుబాటులో ఉండాలి రోగి శరీర తత్వాన్ని బట్టి కొన్ని మందులు నప్పవు. రోగాన్ని నయం చేయడానికి అవసరమైన మందులను రోగి శరీరంలోకి పంపిస్తున్న సమయంలో ఒక్కోసారి వికటిస్తాయి. ఇలాంటి సమయంలో విరుగడు మందులు అందుబాటులో ఉంటే రోగికి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. లేదంటే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సంచి వైద్యులు, మెడికల్ షాపుల యజమానులు, గ్రామీణ ప్రాంత వైద్యుల వద్ద యాంటీ డ్రగ్ రియాక్షన్ మందులు అందుబాటులో ఉంచాలి. – డాక్టర్ జి.నాగభూషణరావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి -
‘కలుషిత పోలియో’ కాల్చివేత!
సాక్షి, హైదరాబాద్: కలుషిత పోలియో చుక్కలను కాల్చివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు లక్షల మంది చిన్నారులకు వీటిని వేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని చిన్నారుల రోగనిరోధకశక్తి అధికంగా ఉన్నందున వాటివల్ల ప్రమాదం ఏమీ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇంకా మిగిలిన వాటి లో కలుషితమైనట్లు భావిస్తున్న 10 లక్షల డోసుల పోలియో చుక్కలను జిల్లాల నుంచి ఆగమేఘాల మీద హైదరాబాద్కు తెప్పించారు. వాటిని ధ్వంసం చేసే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ పోలియో చుక్కల బాటిళ్లను కాల్చివేస్తామని వైద్యాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బ్యాచ్ నంబర్–బీ10048 కేంద్రం ప్రకటించిన బ్యాచ్ నంబర్–బీ10048 గల కలుషిత వ్యాక్సిన్లు రాష్ట్రంలోనూ అనేకమంది చిన్నారులకు వేసినట్లు అధికారులు నిర్ధారించారు. వీటిని ఎంతమందికి వేశారో సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు అంటున్నారు. కలుషిత పోలియో చుక్కలను తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని చిన్నారులకు వేయించారని కేంద్రం నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్ బయోమెడ్ సంస్థ కలుషితమైన ఈ వ్యాక్సిన్లను తయారు చేసింది. మూడు బ్యాచ్ల్లో కలుషితమైన 1.5 లక్షల యూనిట్ల వ్యాక్సిన్లను 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వేశారు. 3 లక్షల డోసుల పోలియో మందు రాక... 10 లక్షల డోసుల పోలియో చుక్కలను వెనక్కి తేవడంతో రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో వాటి కొరత ఏర్పడింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ప్రమాదంలేని 3 లక్షల డోసుల పోలియో మందును రాష్ట్రానికి కేంద్రం పంపిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.వాటిని రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేశామని పేర్కొన్నాయి. -
పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్ లేదు
సాక్షి, అమరావతి: అప్పుడే పుట్టిన శిశువులను జబ్బుల నుంచి రక్షించే వ్యాక్సిన్లు (సూదిమందు) ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేక పేద తల్లులు తల్లడిల్లుతున్నారు. ఇన్ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా నవజాత శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోయినా ప్రభుత్వం చలించకపోవడం గమనార్హం. ఏటా రాష్ట్రంలో 8 లక్షల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రభుత్వాస్పత్రుల్లో దాదాపు 3.80 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు సగటున 32,000 మంది శిశువులు జన్మిస్తున్నారు. అయితే, నవజాత శిశువులకు విధిగా ఇవ్వాల్సిన రొటావాక్, హెపటైటిస్–బి వ్యాక్సిన్లు జూన్ 25వ తేదీ నుంచి ఆరోగ్య ఉపకేంద్రాల్లో గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గానీ అందుబాటులో లేవు. అధికారులను అడిగితే స్టాక్ లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో తమ బిడ్డలకు వ్యాక్సిన్లు వేయించేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న నిరుపేద తల్లులు మరో దిక్కులేక వెనక్కి తీసుకెళ్తున్నారు. అతి కొద్దిమంది మాత్రమే డబ్బు ఖర్చు చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నట్లు తేలింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకునే స్తోమత లేక చాలామంది చిన్నారులు వ్యాక్సిన్లకు దూరమవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, రెండు మాసాలుగా చిన్నారులకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు లేకపోయినా పట్టించుకునేవారే లేరని పీహెచ్సీ వైద్యులు చెబుతున్నారు. ఓవైపు మాతా శిశుమరణాలను తగ్గించాలని చెబుతూనే, మరోవైపు కనీసం టీకాలు కూడా లేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. వ్యాక్సిన్ల కొరతపై అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా... వారు స్పందించలేదు. రోటావాక్ - బిడ్డ పుట్టగానే ఆరు వారాల్లోగా ఓ సారి, 10 వారాల వయసులో రెండోసారి, 14 వారాల్లోగా మరోసారి ఈ వ్యాక్సిన్ వేయాలి. - చిన్నారుల్లో వచ్చే నీళ్ల విరోచనాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. హెపటైటిస్–బి - బిడ్డ పుట్టిన 24 గంటల్లోగా ఈ వ్యాక్సిన్ వేయాలి. - ప్రమాదకరమైన హెపటైటిస్ (కామెర్లు) వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. - ఇది వేయకపోతే చిన్నారులు కామెర్లకు గురై మృత్యువాత పడే ప్రమాదం ఉంది. -
ఏడు రోజులు..ఏడు టీకాలు
అశ్వాపురం: మిషన్ ఇంద్రధనుస్సు అనే కార్యక్రమం ద్వారా చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ అంతా సిద్ధం చేసింది. ఈరోజు (సోమవారం) నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు టీకాలు వేస్తారు. అలాగే గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామస్వరాజ్ అభియాన్లో భాగంగా ఈ ఇంద్ర ధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీహెచ్సీలు, సబ్సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించి చిన్నారులు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. అవి వేయించుకోని వారికి, మధ్యలో ఆపివేసిన వారికి టీకాలు వేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మిషన్ ఇంద్రధనుస్సులో ఏడు వ్యాధులకు ఏడు రోజుల పాటు ఏడు రకాల టీకాలు వేయనున్నారు. జిల్లాలో నేటి నుంచి వారం రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ డాక్టర్ దయానందస్వామి నేతృత్వంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 23 పీహెచ్సీల పరిధిలో వ్యాక్సిన్లు సిద్ధం చేశారు. మిషన్ ఇంద్రధనుస్సు విజయవంతానికి జిల్లా స్థాయిలో శనివారమే టాస్క్ఫోర్స్ సమావేశం కూడా నిర్వహించారు. 1,498 మంది చిన్నారులు, 404 మంది గర్భిణులు.. మిషన్ ఇంద్రధనుస్సులో చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేసేందుకు జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్సీల పరిధిలో 205 గ్రామపంచాయతీల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని వారిని, టీకాలు వేయించుకుంటూ మధ్యలో ఆపివేసిన చిన్నారులు 1,498 మంది ఉన్నట్లు నిర్ధారించారు. 404 మంది గర్భిణులకు టీకాలు వేయాల్సి ఉంటుందని తేల్చారు. మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. జిల్లాలో వలస గిరిజనులు అధికంగా ఉన్న మారుమూల గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ఇటుకబట్టీల వద్దకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వెళ్లి చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేస్తారు. వివిధ కారణాలతో ఈ విడతలో టీకాలు వేయించుకొని వారికి మరో రెండు విడతల్లో ఆగస్టు 16, సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం నిర్వహించనున్నారు. వేసే టీకాలు ఇవే.. గర్భిణులకు ధనుర్వాతం వ్యాధి రాకుండా టీటీ. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు పోలియో, కామెర్లు, తట్టు, రుబెల్లా, మెదడువాపు, క్షయ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు బీసీజీ టీకాలు వేస్తారు. హెపటైటీస్–బీ, పోలియో, పెంటావాలెంట్, జేఈ, విటమిన్–ఏ టీకాలను వారం రోజుల పాటు వేస్తారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 26 వరకు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని పీహెచ్సీల పరి«ధిలో వ్యాక్సిన్లు ఉంచాం. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రోగ్రాం పర్యవేక్షణకు ఒక్కో రూట్కు ప్రోగ్రాం ఆఫీసర్ను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర స్థాయి కన్సల్టెంట్లు ప్రోగ్రాంను పరిశీలిస్తారు. లోతట్టు పల్లెలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు తెలిపాం. మొబైల్ వాహనం వినియోగంలోకి రానుంది. – డాక్టర్ నరేష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి -
ద్విచక్ర వాహనాల ద్వారా టీకాలు
- ఇంటింటికీ వెళ్లి పిల్లలకు సేవలు.. - దేశంలోనే తొలిసారిగా ప్రారంభం - ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ‘టీకా బండి’అనే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం కింద పూర్తిగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు వారి ఇళ్లకే వెళ్లి అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పది ద్విచక్ర వాహనాలను శనివారం మంత్రి ఏఎన్ఎంలకు అందించారు. ఎంత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించినా ఇంకా 28 శాతం పిల్లలకు టీకాలు అందడం లేదని మంత్రి చెప్పారు. అసలు టీకాలే తీసుకోని వారు 7 శాతం మంది ఉన్నారని చెప్పారు. అర్బన్ స్లమ్ ఏరియాలు, తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న చోట్ల పిల్లలను గుర్తించి టీకాలు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం 68 శాతం ఉన్న టీకాల శాతాన్ని 80 శాతానికి పెంచాలనే లక్ష్యం తో టీకా ద్విచక్ర వాహనాల రూపకల్పన చేసినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబా ద్కు 5, మేడ్చల్కు 3, సంగారెడ్డి జిల్లాకు రెండు చొప్పున వాహనాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. సోమ, మంగళ, గురువారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో టీకాలు వేస్తారని వెల్లడించారు. కాగా, మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం రెండో విడతలో భాగంగా ఈ నెల 7 నుంచి 18 వరకు 13 జిల్లాల్లో టీకాలు అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమణి పాల్గొన్నారు. -
నేటి నుంచి బ్రూసెలోసిస్ వ్యాధి నిరోధక టీకాలు
అనంతపురం అగ్రికల్చర్: గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్రూసెలోసిస్ వ్యాధి టీకాలు ఉచితంగా వేసే కార్యక్రమం చేపట్టినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్, పశువ్యాధి నిర్ధారణ కేం ద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా 6 నుంచి 8 నెలల వయస్సున పెయ్యదూడలకు టీకాలు వేయించుకోవాలని సూచించా రు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో 4,500 పెయ్యదూడలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
నిండా నిర్లక్ష్యం
♦ లక్ష్యసాధనలో విఫలమవుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు ♦ 21 పీహెచ్సీల్లో టీకామందు పంపిణీ 80 శాతంలోపే.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో రోగాల బారిన పడుతున్న చిన్నారులు ♦ పీహెచ్సీల్లో అధ్వానంగా వ్యాక్సినేషన్ పుట్టిన పిల్లలకు ఏడాదిలోపు ఇవ్వాల్సిన టీకామందు పంపిణీ ప్రక్రియ నిర్లక్ష్యానికి గురవుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లిప్త వైఖరితో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. జన్మించిన శిశువుకు ఏడాదిలోపు దాదాపు ఏడు రకాల వ్యాక్సిన్లు ఇస్తారు. వారాలు, నెలలను పరిగణనలోకి తీసుకుని ఏడాదిలోపు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. ప్రతి పీహెచ్సీ పరిధిలో తప్పనిసరిగా వందశాతం లక్ష్యాన్ని సాధించాల్సి ఉండ గా.. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ గాడితప్పింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవికాకుండా 8 క్లస్టర్ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి, మరో రెండు ప్రాంతీయ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. క్లస్టర్ ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రులు ఇన్, ఔట్పేషంట్ విభాగాల్లో సేవలు అందిస్తుండగా.. పీహెచ్సీల్లోని సిబ్బంది మాత్రం క్షేత్రస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తూ సేవలందించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియంతా పీహెచ్సీల ఆధ్వర్యంలోనే సాగుతుంది. ముఖ్యంగా చిన్నారులకు పంపిణీ చేసే మీజిల్స్, డీపీటీ, బీసీజీ, హెపటైటిస్ బీ తదితర వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యత పీహెసీ వైద్యులదే. అయితే జిల్లాలో చాలాచోట్ల వ్యాక్సినేషన్ లక్ష్యాలు నిర్లక్ష్యం బారినపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. 21 ఆరోగ్య కేంద్రాల్లో.. జిల్లాలో 21 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వెనుకబడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గవదబిల్లలు, పొంగువ్యాధి రాకుండా వేసే మీజిల్స్ వ్యాక్సిన్ పంపిణీలో మంచాల, దండుమైలారం, నవాబ్పేట , పూడూరు, కీసర, సిద్దలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. అదేవిధంగా డిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం రాకుండా వేసే డీపీటీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెసీలు అధ్వానంగా ఉన్నాయి. క్షయవ్యాధి బారిన పడకుండా వేసే బీసీజీ వ్యాక్సిన్ పంపిణీలో షాబాద్, సిద్దలూరు, కీసర, పూడూరు, చేన్గొముల్, బంట్వారం పీహెచ్సీలు వెనుకబడి ఉన్నాయి. కాలేయ సంబంధ రోగాలు రాకుండా ఉండేందుకు వేసే హెపటైటిస్ బీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెచ్సీలు అంతంతమాత్రం గానే పనిచేస్తున్నాయి. దీంతో ఆయా పీహెచ్సీల వైద్యులకు జిల్లా యం త్రాంగం నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఏడు రకాల వ్యాక్సిన్లు చిన్నారికి అందిస్తారు. జిల్లా సగటు పురోగతి బాగున్నప్పటికీ.. గ్రామీణ మండలాల్లో మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది. -
చేతులెత్తేశారు..
గందరగోళంగా పోలియో వ్యాక్సినేషన్ గుర్తించింది 2.5 లక్షలు.. వేసింది 3.16 లక్షలు వ్యాక్సిన్ కొరతతో మన్సూరాబాద్ కేంద్రానికి తాళం ఆస్పత్రి ముందు తల్లిదండ్రుల ఆందోళన సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన పోలియో టీకాల కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ఆఖరి బిడ్డ వరకు వ్యాక్సిన్ వేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ లేక చేతులెత్తేసింది. బస్తీల్లోని పిల్లలను అంచనా వేయడంలోను, వ్యాక్సిన్ సరఫరాలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. టీకాల కోసం ప్రతిరోజు పలు ఆరోగ్య కేంద్రాల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ఆదివారం టీకాలు వేసేందుకు చివరి రోజుగా ప్రకటించడంతో వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుని పిల్లలకు టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు భారీగా తరలి వచ్చారు. వ్యాక్సిన్ కొరత వల్ల కొన్నిచోట్ల పోలీసుల సహకారంతో పిల్లలకు టీకాలు వేస్తే, మరి కొన్ని చోట్ల పోలియో కేంద్రాలకు తాళాలు వేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం గుర్తించిన హైరి స్కు ప్రాంతాలతో పాటు దానికి ఆనుకుని ఉన్న బస్తీల్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎంత మంది వ్యాక్సిన్ వేయిం చుకునే అవకాశం ఉంది? ఎంత సరఫరా చేయాలి? వ ంటి అంశాలను అధికారులు అంచనా వేయలేక పోయారు. ఇదిలా ఉం టే, హైరిస్కు జోన్లలో 2.5 లక్షల మంది పిల్లలను గుర్తించామని, వీరందరికీ టీకా లు వేశామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని పిల్లలు టీకాలు వేయించుకోక పోయినా నష్టమేమీ లేదని స్పష్టం చేయడం గమనార్హం. అంచనాలో ఘోర విఫలం.. అంబర్పేట నాలాలో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న హైదరాబాద్ జిల్లాలోని 69 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంబర్పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్పేట్, కోఠి, లాలాపేట్, డబీర్పుర, జంగంమెట్, పానిపుర, సీతాఫల్మండి, సూరజ్భానులో ప్రభుత్వం 750 పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 12 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్నగర్, బాలాపూర్లో 136 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కంటోన్మెంట్ సహా ఈ 24 హైరిస్కు ప్రాంతాల్లో ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 2.50 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. కేవలం ైెహ రిస్కు జోన్ల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు భారీగా పోటెత్తడంతో తొలి రెండు రోజుల్లోనే వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో మరో లక్ష డోసులు అదనంగా తెప్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిల్లలను అంచనా వేయడంలోనే కాదు.. చివరకు వాక్సిన్ తె ప్పించడంలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. మన్సూరాబాద్ కేంద్రానికి తాళాలు వ్యాక్సిన్ కోసం పిల్లలతో మన్సూరాబాద్లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తల్లి దండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ లేకపోవడంతో స్థానికులు ఎక్కడ తమపై దాడి చేస్తారోనని భయపడిన సిబ్బంది కేంద్రానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మన్సూరాబాద్ పట్టణ ఆరోగ్య కేం ద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేశామని, ఇక్కడి వీకర్ సెక్షన్కాలనీ కమ్యూనిటీహాల్లో శనివారం రోజంతా కేంద్రం కొనసాగిం దని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం పోలియో ఇంజక్షన్ వేయాలనే ఆదేశం తమకు లేదని, అందుకే తాము టీకాలు వేయడం లేదని సిబ్బంది తెలి పారు. అంబర్పేట్లోని ప్రాధమిక ఆరో గ్య కేంద్రానికి స్థానిక పిల్లలతో పాటు ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పోటెత్తడంతో వారిని నియంత్రించడం కష్టమై పోలీ సుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. -
కేన్సర్ చికిత్సకు వ్యాక్సిన్లు!
లండన్: కేన్సర్ను నయం చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. మానవుని సొంత వ్యాధినిరోధక శక్తితో కేన్సర్ కణాలను నాశనం చేసే విధానాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కేన్సర్ కణితిలోని ప్రత్యేకమైన కణాలను శరీరం గుర్తించేలా చేసి వాటిని నాశనం చేసే విధానాన్ని వారు కనుగొన్నారు. పరివర్తన చెందిన కణాలను లక్ష్యంగా చేసుకునేందుకు రెండు రకాల విధానాలున్నాయని పేర్కొన్నారు. అందులో ఒకటి కేన్సర్ సోకిన వ్యక్తికి చెందిన వ్యాక్సిన్లను అభివృద్ధిపరిచి కణితి కణాలను గుర్తించడం. రెండోది వ్యాధి నిరోధక కణాలను బయటకు తీసి ల్యాబ్లో వాటి సంఖ్యను పెంచి, తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా కేన్సర్ కణాలను టార్గెట్గా చేసుకోవడం. -
ప్రభుత్వాస్పత్రికి వస్తే ప్రాణాలే పోయాయి
వైద్యశాలలో నిండుకున్న వ్యాక్సిన్లు పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల ఆందోళన రేపల్లె ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని రకాల మందులు సిద్ధంగా ఉన్నాయని గ్రామసభల్లో పాలకులు ప్రచారం చేస్తే నిజమేననుకున్నాం. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని బతికించుకుందామని తీసుకొచ్చాం. తీరా వచ్చాక వైద్యులు సకాలంలో స్పందించలేదు. మందుల్లేవని చావుకబురు చల్లగా చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కేవి.’ అంటూ మృతుడి బంధువులు బోరున విలపించారు. మృతదే హంతో రాస్తారోకో చే శారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రేపల్లె పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. రేపల్లె మండలంలోని గుడ్డికాయలంక గ్రామానికి చెందిన చిట్టిమోతు ప్రసాద్(50) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం వేకువజామున గ్రామ సమీపంలోని ఓ పొలంలో గడ్డి మోపులు కట్టేందుకు వెళ్లారు. గడ్డిలో ఉన్న పాము ప్రసాద్ భుజంపై కాటు వేసింది. కాలువేసింది రక్తపింజరిగా గుర్తించిన ప్రసాద్ వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషమంగా ఉన్న ప్రసాద్కు చికత్స చేసే విషయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని, పాము కాటుకు విరుగుడు మందులు కూడా అందుబాటులో లేకపోవటంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. మందులు అందుబాటులో ఉంటే ప్రసాద్ ప్రాణాలు పోయేవికావంటూ ఆసుపత్రి ఆవరణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గతంలో జరిగిన గ్రామసభల్లో ప్రభుత్వ వైద్యులు, పాలకులు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులు, మందులు ఉన్నాయని ప్రచారం చేస్తేనే ఇక్కడికి తీసుకువచ్చామని విలపించారు. ఇలాగైతే ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బేబీ ఖుష్... మనమూ!
చిన్నప్పుడు మీకు దిష్టితాడు కట్టారా? కట్టే ఉంటారులెండి. టెటనస్ మొదలుకొని చికెన్పాక్స్ వరకూ అన్ని టీకాలూ వేయించారా?... ఏమో సరిగ్గా గుర్తు లేదంటున్నారా? అక్షరాస్యులతోపాటు చదువులేని వాళ్లలోనూ చాలామందిది ఇదే పరిస్థితి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు జరిగిన ప్రయత్నమే ‘ఖుషీ బేబీ’ దిష్టితాడు. సంప్రదాయానికి హైటెక్ సెన్సర్లతో కూడిన పెండెంట్ను జతచేర్చి సిద్ధం చేశారు దీన్ని. స్మార్ట్ఫోన్లలో ఉండే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్, మొబైల్ హెల్త్ అప్లికేషన్, క్లౌడ్ కంప్యూటింగ్లతో పనిచేసే ఈ పరికరం చిన్నారుల వైద్య రికార్డులన్నింటినీ భద్రపరచే ఓ లాకర్! మొబైల్ఫోన్లోని అప్లికేషన్తో పెండెంట్ను స్కాన్ చేస్తే చాలు. అప్పటివరకూ ఆ పిల్లోడికి వేసిన టీకాలు ఏమేమిటి? ఇతర టీకాలు వేయాల్సిన సమయం అన్ని కనిపిస్తాయన్నమాట. అంతేకాదు... ఈ పెండెంట్ టీకా వేయాల్సిన సమయాన్ని రికార్డ్ చేసిన సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుపుతుంది కూడా. ప్రస్తుతం ఖుషీబేబీ ప్రాజెక్టు రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్రాంతంలో సేవామందిర్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది. దీంతోపాటు ఉత్తర భారతదేశంలోని దాదాపు 96 ప్రాంతాల్లోనూ ఖుషీబేబీ పెండెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాక్పీస్, సోపు ఒక్కటైతే...? ఆహారం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటే అతిసారంతోపాటు అనేక వ్యాధులు సోకకుండా అరికట్టవచ్చు. అదే ఈ అలవాటు ఓ ఆటలా మారిపోతే? అచ్చంగా ఈ ఐడియాతో సిద్ధమైందే... సోపెన్! చాక్పీస్లాంటి సోప్ అన్నమాట! ఈ సోపెన్తో పిల్లల చేతులపై చిన్నచిన్న బొమ్మలు గీసి కడుక్కోమన్నారనుకోండి. వాళ్లు ఎంచక్కా బొమ్మల గుర్తులు అన్నీ చెరిగిపోయేంతవరకూ చేతులను శుభ్రంగా కడుక్కుంటారన్నమాట. మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో శారీరక పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇది మేలైన మార్గమని అంటున్నారు దీన్ని డిజైన్ చేసిన యువ బృందం. ముగ్గురు భారతీయ యువతులు, ఒక కొరియన్ యువకుడు కలిసి దీన్ని అమెరికాలో తయారు చేశారు. -
చౌక వ్యాక్సిన్ పేరుతో టోకరా
-
వ్యాధి నిరోధక శక్తి... టీకాలు
శరీరంలో ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థ అసంక్రామ్యత వ్యవస్థ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థ (Immune System). ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అసంక్రామ్యత వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారానే మనిషి టీ కాలను అభివృద్ధి చేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం అనేక రోగ నిర్ధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి రెండు రకాలు. అవి స్వాభావిక, స్వీకృత వ్యాధి నిరోధక శక్తులు. పుట్టుకతోనే లభించేది స్వాభావిక వ్యాధి నిరోధక శక్తి. శరీరంలోకి ఏ వ్యాధి కారకం ప్రవేశించక ముందే.. ఈ వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. వ్యాధి కారకం ప్రవేశించడం ద్వారా అభివృద్ధి చెందింది కాదు. చర్మం, శ్లేష్మస్తరం, బాహ్య అవరోధాలుగా వ్యవహరిస్తూ స్వాభావిక వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. వీటికి అదనంగా బ్యాక్టీరియా నాశినిగా పనిచేసే కంటిలోని లైసోజైం అనే ఎంజైమ్, జఠరరసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు కూడా స్వాభావిక వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. కాబట్టి అందరిలోనూ స్వాభావిక వ్యాధి నిరోధక శక్తి ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆర్జించే వ్యాధి నిరోధక శక్తి స్వీకృత/ఆర్జిత వ్యాధి నిరోధక శక్తి. ఒక వ్యక్తి నివసించే ప్రాంతం లేదా పీల్చేగాలి, తాగేనీరు, ఆహారపు అలవాట్లపై ఈ రకమైన వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. మనిషిలో వ్యాధి నిరోధక వ్యవస్థ: మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థలో తెల్లరక్తణాలు, లింఫాయిడ్ ఉంటాయి. తెల్ల రక్తకణాలు శరీర రక్షక భటులు వంటివి. వీటిలో ఇసినోఫిల్స్ అలర్జీ చర్యల్లో పాల్గొనగా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు చాలా కీలకమైనవి. ఇవి రెండు రకాలు టి-లింఫోసైట్స్, బి-లింఫోసైట్స్. వ్యాధి నిరోధక వ్యవస్థలోని అవయవాలు రెండు రకాలు. అవి ఎముక మజ్జ, థైమస్ - అనేవి ప్రాథమిక అవయవాలు. ఎముక మజ్జలో లింఫోసైట్స్ ఏర్పడతాయి. బి-లింఫోసైట్స్ మాత్రం ఎముక మజ్జలో, టి-లింఫోసైట్స్ థైమస్ నుంచి విడుదలయ్యే థైమోసిన్ హార్మోను ప్రేరణతో పరిపక్వత చెందుతాయి. టి, బి లింఫోసైట్స్ ద్వారా లభించే వ్యాధి నిరోధక శక్తిని నిర్దిష్ట వ్యాధి నిరోధక శక్తి అంటారు. వ్యాధి కారకం ఉపరితలం పైనున్న ప్రతిజనకం ఆధారంగా దాన్ని గుర్తిస్తారు. టి- లింఫోసైట్స్ అందించే వ్యాధి నిరోధక శక్తిని సెల్యులాడ్/సెల్మీడియేటెడ్ వ్యాధి నిరోధక శక్తి అంటారు. వ్యాధి కారకాన్ని గుర్తించి టి-లింఫోసైట్స్ భక్షక కణాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా భక్షక కణాలు వ్యాధి కారకాన్ని భక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో టి-లింఫోసైట్స్ నేరుగా వ్యాధి కారకాన్ని నాశనం చేస్తాయి. ముఖ్యంగా సీడీ 8 కణాలు ఈ విధంగా వ్యవహరిస్తాయి. కొన్ని టీ4 లింఫోసైట్స్ వ్యాధి కారకాన్ని గుర్తించిన వెంటనే బి-లింఫోసైట్స్ను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రేరణకు గురైన బి-లింఫోసైట్స్ వ్యాధి కారకానికి వ్యతిరేకంగా ప్రత్యేక ప్రతిదేహకాలు లేదా ప్రతి రక్షకాల(ఊఖీఐ ఆైఈఐఉ)ను విడుదల చేస్తాయి. ఈ ప్రతిదేహకాలు వ్యాధి కారకం ఉపరితలంపై ప్రతిజనకాన్ని బట్టి వ్యాధి కారకాన్ని గుర్తించి నాశనం చేస్తాయి. కొన్ని బి-కణాలు వ్యాధి కారకాన్ని గుర్తుపెట్టుకునే ఇమ్యూనలాజికల్ మెమొరీ అనే గుణాన్ని ప్రదర్శిస్తాయి. మళ్లీ ఎప్పుడైనా అదే వ్యాధి కారకం శరీరంలోకి ప్రవేశిస్తే ఈసారి అధిక మొత్తంలో వేగంగా ప్రతిదేహకాలు విడుదలై, వ్యాధి కారకాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఈ రకంగా ప్రతిదేహకాల ద్వారా బి-లింఫోసైట్స్ అందించే వ్యాధి నిరోధక శక్తి హ్యూమొరల్ వ్యాధి నిరోధక శక్తి. టీకా: టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు ఒకటి సంప్రదాయక, రెండోది ఆధునిక టీకాలు. సంప్రదాయక టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఈ టీకాలను అందించటం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధి కారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాలను రెండు/మూడుసార్లు వేయిస్తే శరీరంలో వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది. ఉదా: ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ై్కగ), డీపీటీ వ్యాక్సిన్ . సంప్రదాయ టీకాల్లో కొన్ని లోపాలను అధిగమించేందుకు ఆధునిక టీకాలతో శుద్ధమైన ప్రతిజనకం లేదా వ్యాధి కారకానికి చెందిన ఉపరితల భాగం ఉంటాయి. ఇవి సంప్రదాయ టీకాల కంటే సురక్షితమైనవి ఉదా: హెపటైటిస్ ఎ టీకా. స్థిరమైన ప్రతిజనకం లేని కారణంగా హెచ్ఐవీ లాంటి వాటికి విరుద్ధంగా ఎలాంటి టీకాలు అందుబాటులోకి రాలేదు. భారత్లో టీకా కార్యక్రమం: 1975లో ప్రపంచవ్యాప్తంగా మశూచిని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో టీకా విస్తరణ క్రమాన్ని ప్రారంభించింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా ఈ కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. 1990 నాటికల్లా దేశంలో ఉన్న చిన్నారులందరికీ టీకాలు అందించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. 1985లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 1990 నాటికల్లా 85 శాతం చిన్నారులకు టీకాలు అందించాలని, టీకాల ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాల్లో.. టీకా కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్లో టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న టీకాలు, కనీసమైనవి, కచ్చితమైనవి. గర్భిణీలకు రెండు డోసుల టీ-టీ (టెటనస్ టాక్సాయిడ్) టీకాలు ఇస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల నివారణగా నవ శిశువులకు ఈ టీకాలు అందిస్తున్నారు. క్షయ బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్ (బీసీజీ) పోలియో ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవీ) డిఫ్తీరియా పర్టుసిన్ డీపీటీ టీకా టెటనస్ మీజిల్స్ మీజిల్స్ టీకా హెపటైటిస్-బి హెప్-బి టీకా వీటికి అదనంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జపనీస్ ఎన్సిఫలై టీస్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో నీమోకోకల్ కాంజిగేట్ టీకా, హ్యూమన్ పాపిల్లోమ టీకా, రోటా టీకా, హెచ్ఐబీ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అందిస్తున్న టీకాలకు అదనంగా కొన్ని కచ్చిత టీకాలను పిల్లలకు అందించాల్సిందిగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) సూచిస్తుంది. మంప్స్ మీజిల్స్ ఎంఎంఆర్ టీకా రుబెల్లా పోలియో ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ టైఫాయిడ్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ హీమోఫిలస్ ఇన్ఫ్లూయంజా టైప్బి హెచ్ఐబి టీకా సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమ టీకా వీటికి అదనంగా కూడా కొన్ని ఐచ్ఛిక టీకాలను ఐఏపీ సూచిస్తుంది. 1. హెపటైటిస్-ఎ హెప్అ టీకా 2. అమ్మవారు వారిసెల్ల టీకా ప్రతిజనకం: వ్యాధి కారకం ఉపరితలంపై ఉంటూ శ రీర నిరోధక శక్తిని ప్రేరేపించే అన్య పదార్థమే. ప్రతజనకం. రసాయనకంగా ఇది ఏదైనా కావచ్చు. దీనికి విరుద్ధంగా శరీరంలోని బి-లింఫోసైట్స్ అనే తెల్ల రక్తకణాలు ప్రతిదేహకాలు అను జీవక్షిపణులను విడుదల చేస్తాయి. వ్యాక్సినేషన్పై అవగాహన త ల్లిదండ్రులు విధిగా డాక్టర్లను సంప్రదించి పిల్లలకు వేయించాల్సిన కచ్చిత, ఐచ్చిక టీకాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వం అందించే టీకాలు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచిస్తున్న కచ్చిత, ఐచ్చిక టీకాల ఆవశ్యకతపై తల్లిదండ్రులకు డాక్టర్లు అవగాహన కల్పించాలి. టీకా కార్డులో సూచించిన విధంగా ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి. టీకా వేసిన వైద్య వాలంటీర్ కార్డులో గుర్తుపెట్టి మళ్లీ ఎప్పుడు టీకా వేయించాలన్నది తల్లిదండ్రులకు తెలియజేయాలి. జ్వరం, దగ్గు, జలుబులు ఉన్నప్పుడు టీకాలు వేయించరాదు. తగ్గిన తర్వాత వేయించాలి. ఏ కారణం చేతైనా టీకాలు వేయించడంలో అవాంతరం ఏర్పడితే, మళ్లీ వైద్యుణ్ని సంప్రదించి కొత్త షెడ్యూల్ను ఖరారు చేసుకోవాలి. కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సిన టీకాలు ఉంటాయి. సాధారణంగా ఒకే రోజు ఎన్ని టీకాలైనా పిల్లలకు ఇవ్వొచ్చు. అయితే మళ్లీ 4 వారాల వరకు టీకాలు ఇవ్వకూడదు. పల్స్ పోలియో కార్యక్రమం, రేబిస్ టీకాలకు ఈ షరతు వర్తించదు. టీకా వేయించిన తర్వాత అర గంట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దే వేచి ఉండాలి. ఎలాంటి ప్రతీకార చర్య కన్పించినా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. అన్ని టీకాలు ప్రతీకార చర్యలకు కారణం కావు. అందరి పిల్లల్లో ప్రతీకార చర్యలు ఒకేవిధ ంగా ఉండవు. ప్రతీకార చర్య కనిపించినంత మాత్రానే టీకా పనిచేసినట్టు కాదు. ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించినప్పుడు స్వల్ప జ్వరం ఉంటుంది. పారాసిటమాల్ ఇవ్వాలి. ఆస్ప్రిన్ ఇవ్వకూడదు. కోడి గుడ్లకు అలర్జీ ప్రదర్శించే వారు ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోకూడదు. కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన పెంటావలెంట్, టెట్రావలెంట్ల కాంబినేషన్ వ్యాక్సిన్లపై అవగాహన పెంపొందించుకోవాలి. కాంబినేషన్ వ్యాక్సిన్ నాలుగు అంతకంటే ఎక్కువ వ్యాధి కారకాలకు నిరోధక మందులు ఉన్న టీకాలను కాంబినేషన్ టీకాలు (వ్యాక్సిన్) అంటారు. భారత్లో ప్రస్తుతం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన రెండు రకాల టీకాలు బాగా వినియోగంలో ఉన్నాయి. ఒకటి టెట్రావలెంట్ టీకా (నాలుగు వ్యాధులకు ఒకే నివారణ మందు). రెండోది పెంటావలెంట్ టీకా(ఐదు వ్యాధులకు ఒకే నివారణ టీకా). తొలిసారిగా ఇలాంటి టీకాలను కేంద్రం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నారు. 2014, నవంబర్లో పెంటావలెంట్ టీకాను మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో దీని వినియోగాన్ని విస్తరిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు తొలి దశలో 12 రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొస్తున్నారు. 2015లో రెండో దశలో ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నారు. అంతర్జాతీయ సంస్థ ‘గావి’ సహకారంతో పెంటావెలెంట్ టీకా వినియోగాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 2000లో ఏర్పాటైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థ 2015 నాటికి 500 మిలియన్ పిల్లలకు టీకాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు 70 లక్షల పిల్లలను ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షించింది. పల్స్ పోలియో కార్యక్రమం పోలియోను నిర్మూలించే లక్ష్యంతో 1995లో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐదేళ్లలోపు పిల్లలకు జాతీయ, రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పోలియో చుక్కలు వేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో 1.5 లక్షల మంది సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో 24 లక్షల మంది వైద్య వాలంటీర్లు పాల్గొన్నారు. 2011 నుంచి 2014 వరకు దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవడంతో 2014, మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. 1995లో పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిననాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 131 పోలియో కార్యక్రమాలు నిర్వహించి 12.1 బిలియన్ పోలియో టీకాలను పిల్లలకు అందించారు. 2011, జనవరి 13న పశ్చిమ బెంగాల్లోని హౌరా ప్రాంతంలో చివరిసారిగా ఒక అమ్మాయికి పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు ఎలాంటి పోలియో కేసు నమోదు కాకపోవటంతో భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. తొలి సారిగా 1985లో ప్రపంచ వ్యాధి నిరోధక శక్తి కార్యక్రమంలో మొదటి సారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ భారత్లో ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో 1995లో జాతీయ స్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా జాతీయస్థాయిలో రెండు, రాష్ట్రస్థాయిలో అనేక సార్లు 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. -
కుక్కకాటు వ్యాక్సిన్లు ఫుల్
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో యాంటీరేబిస్ వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు తెలిపారు. ప్రతిరోజూ ఓపీగదిలో బాధితులకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నామని, ప్రజలు వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందనవసరం లేదన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)తోపాటు జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలకు ప్రతి రోజూ కుక్కకాటు బాధితులు వైద్యం కోసం వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్ లేదని బాధితులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేయటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీని వాస్ అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో జీజీహెచ్ సూపరింటెండెంట్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. ఇదిలావుంటే, జిల్లాలో ప్రస్తుతం కుక్కలు కరిచి గాయపడుతున్న సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను జీజీహెచ్ మెడికల్ స్టోర్స్ ఇన్చార్జి డాక్టర్ నల్లూరి విజయ్శ్రీ సాక్షికి తెలిపారు. కుక్క కరిచిన వెంటనే గాయాలపై చల్లటినీటిని ధారగా పోస్తూ సాధ్యమైనంత మేరకు ఎక్కువ సార్లు సబ్బుతో కడగాలి. గాయంపై టించర్ అయోడిన్ వేయాలి. ఇలా చేయడం వల్ల రేబిస్ వైరస్ శరీరం లోపలకు ప్రవేశించకుండా నివారించవచ్చు. గాయానికి కుట్టు వేయడం, ఆయింట్మెంట్ పూయడం వంటివి చేయకూడదు. కుక్క కరిచిన వెంటనే సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రదించి రేబిస్వ్యాధి నిరోధక టీకాలు నెలలో నాలుగుసార్లు క్రమం తప్పకుండా వేయించుకోవడం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పిల్లలను కుక్కల దగ్గరకు వెళ్లనీయకుండా దూరంగా ఉండేలా చూడాలి. ఇంట్లో పెంపుడు కుక్కులకు తప్పని సరిగా టీకాలు వేయించాలి. -
మలిసందెలో మళ్లీ టీకాలు..
పాపాయి పుట్టిన అనేక వ్యాధుల నుంచి రక్షణ కోసం నిర్ణీత వ్యవధిలో అనేక వ్యాక్సిన్లు ఇస్తుంటారు. జీవితంలోని బాధ్యతలు ముగిసి... వార్థక్యంలోకి ప్రవేశించాక దాన్ని కూడా మరో బాల్యం అంటారు అనుభవజ్ఞులు. ఎందుకంటే... పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎలా తగ్గుతుందో... పెద్దవాళ్ల వయసు మరింత పైబడుతున్న కొద్దీ వాళ్లలోనూ రోగ నిరోధక శక్తి తగ్గుతుంటుంది. అందుకే పుట్టిన పాపాయి లాగే వృద్ధాప్యంలో అడుగిడుతున్న వారికీ టీకాల అవసరం ఉంటుంది. కానీ... ఉన్న ఆరోగ్యం ఎలాగూ బాగుంది... దీని కోసం మళ్లీ ఈ వయసులో టీకాలెందుకు అన్నది చాలామంది వృద్ధుల ఆలోచనాసరళి. ఆర్థికకోణం నుంచి చూసినా వృద్ధాప్యంలో సమయానికి తీసుకోవాల్సిన టీకాలు వేయించుకోవడం లాభదాయకం. ఆ విషయంపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. ఇప్పుడు మనదేశవాసుల సగటు ఆయుఃప్రమాణం (లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్) 68.89 ఏళ్లు. అంటే దాదాపు 70 ఏళ్లు అనుకోవచ్చు. గత పదేళ్ల వ్యవధిలో ప్రజల ఆయుఃప్రమాణం ఐదు సంవత్సరాలు పెరిగింది. ఇలా ప్రజల ఆయుప్రమాణం పెరగడం అన్నది ఒక మంచి సూచికగా భావించినా... వృద్ధాప్యంలో వచ్చే న్యుమోనియా జబ్బుతో ఏటా మన దేశంలో రెండున్నర లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. న్యుమోనియా వ్యాధికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లలో ఏవైనా కారణం కావచ్చు. సాధారణంగా యువకుల్లో, మధ్యవయస్కుల్లో అంత ప్రమాదకరం కాకుండా ఉండే న్యుమోనియా వృద్ధుల్లో చాలా ప్రమాదకరంగా పరిణమించడమే కాదు... ఒక్కోసారి ప్రాణాలనూ హరించవచ్చు. టీకాలు ఎలా లాభదాయకం...? ముందుగా చెప్పుకున్నట్లు న్యుమోనియా సమస్యను సాధారణ యాంటీబయాటిక్స్తో అధిగమించవచ్చు. కానీ వృద్ధుల్లో న్యుమోనియా వస్తే అది ప్రాణాపాయం కావచ్చు. లేదా ఒకవేళ వెంటిలేటర్పై పెట్టి బతికి బయటపడ్డా ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడు కావడం ఖాయం. కానీ న్యుమోనియాను నివారించే న్యూమోకోకల్ వ్యాక్సిన్ను తీసుకుంటే అది ప్రాణాలనూ రక్షిస్తుంది. ఒకవేళ ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తే వేలలో అయ్యే వ్యయాన్ని ఒకటి రెండు వందలకే పరిమితం చేస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా వృద్ధాప్యంలో టీకాలు లాభదాయకమే. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంటుంది. అందుకే జలుబు వైరస్కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఏళ్లు పైబడిన వారు ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. పైగా దీని ధర కూడా చాలా తక్కువ. (రూ. 60 నుంచి రూ.100 లోపే ఉంటుంది). దురదృష్టవశాత్తూ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా రెండోదశ సమస్యలు ఏర్పడి ఒకసారి హాస్పిటల్లో చేరితే అయ్యే ఖర్చుతో పోలిస్తే పైన పేర్కొన్న ఖర్చు చాలా చాలా తక్కువ. హెపటైటిస్ వ్యాక్సిన్లు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్-ఏ అనే వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. హెపటైటిస్-బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. హెపటైటిస్-బి వ్యాక్సిన్ : హెపటైటిస్-బి వైరస్ వల్ల కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇదీ వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వృద్ధుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువ కాబట్టి అరవై ఏళ్లు దాటిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ మనం సాధారణ పరిభాషలో ‘చికెన్పాక్స్’ అంటూ మనం పిలుచుకునే వ్యాధిని కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్ఐవీ వంటి వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేసే వ్యాధులు ఉన్నవారికీ, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ చికిత్స (కీమోథెరపీ) తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదు. న్యుమోనియా వ్యాక్సిన్స్... న్యుమోనియా వ్యాధి ప్రధానంగా న్యుమోకాకల్ బ్యాక్టీరియాతో వస్తుంది. ఇదొక్కటే గాక మరో 23 రకాల ఇన్ఫెక్షన్లు సైతం న్యుమోనియాకు దారితీస్తాయి. సాధారణంగా ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరే రోగుల్లో 11 శాతం నుంచి 20 శాతం మందికి న్యూమోనియా ప్రాణాపాయం కలిగిస్తుంది. అందుకే అలాంటి ప్రమాదం రాకుండా 65 ఏళ్లు దాటిన వారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది న్యుమోవ్యాక్ 23, రెండోది ప్రివెనార్ 13. న్యుమోవ్యాక్ 23: న్యుమోనియా అనే ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే కండిషన్కు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ప్రధాన కారణం. దీంతోపాటు మరో 22 ఇతర అంశాలూ న్యుమోనియాకు కారణమవుతాయి. మొత్తం కలిపి ఈ వ్యాక్సిన్ 23 రకాల న్యుమోనియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే దీన్ని న్యూమోవ్యాక్ 23 అంటారు. అంతేకాదు... ఇది మెదడువాపు (మెనింజైటిస్) నుంచి, రక్తంలో ఉండే ఇతర బ్యాక్టీరియాల దుష్ర్పభావం నుంచి, కాలేయ సమస్యలు, ఆల్కహాల్ తాగే అలవాటు వల్ల వచ్చే దుష్ర్పభావాలు, డయాబెటిస్ సమస్యలు, స్ప్లీన్ సమస్యలు, సికిల్ సెల్ అనీమియా వంటి ఇతర రిస్క్లు ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన వ్యాక్సిన్. దీన్ని భుజంపైన గానీ లేదా తొడపైనగాని ఉండే చర్మం కింద ఉండే కండరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారైనప్పటికీ ఒకవేళ రిస్క్ ఎక్కువగా ఉంటే మరో డోస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్ప్లీన్ సర్జరీ లేదా క్యాన్సర్కు కీమోథెరపీ లేదా రోగనిరోధక శక్తిని ఒకింత తగ్గించే ఇతర మందులు వాడాల్సిన సమయంలో ఆ ప్రక్రియ జరగడానికి కనీసం రెండు వారాల ముందే ఈ వ్యాక్సిన్ను తీసుకోవాల్సి ఉంటుంది. అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇదిఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత మరోసారి తీసుకోవాలని ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది. ప్రివెనార్ 13: ఇది పదమూడు రకాల స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాల నుంచి సేకరించిన యాంటీబాడీలతో రూపొందించిన వ్యాక్సిన్. ఇది వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. దీన్ని సాధారణంగా 50 ఏళ్ల పైబడినప్పటి నుంచి ఇవ్వవచ్చు. ఇది స్ట్రెపోకాకల్ బ్యాక్టీరియా కారణంగా న్యూమోనియాతో పాటు మెదడువాపు (మెనింజైటిస్), రక్తం విషపూరితం కావడం (బ్లడ్పాయిజనింగ్), మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లు (మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ / ఓటైటిస్ మీడియా) వంటి అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. కానీ న్యూమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెనింజైటిస్, రక్తం విషపూరితం కావడం (సెప్టిసీమియా), మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లు (మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ / ఓటైటిస్ మీడియా) వంటి వాటినుంచి రక్షించలేదు. అందుకే వృద్ధులకు ఈ రెండు రకాల వ్యాక్సిన్లనూ ఇవ్వాలి. అయితే ఈ వ్యాక్సిన్లు తీసుకునే క్రమంలో రెండింటి మధ్య కనీసం ఒక ఏడాదైనా కాలవ్యవధి ఉండాలి. పైన పేర్కొన్న వ్యాక్సిన్లను వృద్ధాప్యంలో ఎలాంటి జబ్బూ లేకపోయినా తీసుకోవాలి. ఒకవేళ ఆ వృద్ధాప్య దశలో ఉన్నవారికి డయాబెటిస్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి జబ్బులతో పాటు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఏడాది గ్యాప్తో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకోవడం తప్పనిసరి. హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. అరవై ఏళ్లు పైబడిన వారు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. ఎందుకంటే ఇది పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. నిజానికి షింగిల్స్, చికెన్పాక్స్... ఈ రెండూ ఒకే వైరస్ ద్వారా వస్తాయి. చికెన్పాక్స్ వైరస్ పూర్తిగా నిరోధితం కాకుండా నరాల చివరల్లో నిద్రాణంగా ఉండిపోయి ఆ తర్వాత ఎప్పుడో క్రియాశీలం అయి, తీవ్రమైన బాధ కలిగిస్తుంది. ఆ దశనే షింగిల్స్ అంటారు. అందుకే దీని మోతాదు సాధారణ చికెన్పాక్స్ డోస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే రోగనిరోధక శక్తి సాధారణంగా ఐదేళ్లకు పైబడి ఉంటుంది. ఒకవేళ గతంలో వారికి చికెన్పాక్స్ వచ్చినా రాకున్నా, చికెన్పాక్స్కు వ్యాక్సిన తీసుకుని ఉన్నవారు సైతం హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే. అయితే లుకేమియా, లింఫోమా వంటి వ్యాధులతో కీమోథెరపీ, రేడియో థెరపీ వంటివి తీసుకునేవారు, కార్టికోస్టెరాయిడ్స్ ఉపయోగించేవారు దీన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునే వారు ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందర కనీసం 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు ఆ మందులను వాడకపోవడమే మంచిది. సైడ్ఎఫెక్ట్స్: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ఆ ప్రాంతంలో నొప్పి, వాపు, దురద రావచ్చు. కొందరిలో చాలా అరుదుగా ఒళ్లంతా దద్దుర్ల వంటివి (జోస్టెరిఫార్మ్ ర్యాష్) కనిపించవచ్చు. ఇవి మినహా ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్ ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్ను 60 దాటిన వారికి బూస్టర్డోస్ ఇవ్వాలి. దాంతో అది వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మరికొన్ని వ్యాక్సిన్లు పైన పేర్కొన్న వాటితో పాటు జపనిస్ ఎన్కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకు ముందస్తు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. రాబోయే వ్యాక్సిన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా... చాలా తక్కువ వ్యవధిలో (సుమారు ఏడాది కాలంలోనే) మరికొన్ని వ్యాక్సిన్లూ మనకు అందుబాటులోకి రానున్నాయి. అవి... డెంగ్యూ, చికెన్గున్యా, ఎబోలా వైరస్లకు వ్యాక్సిన్లు. ఉపసంహారం వృద్ధాప్యంలో వ్యాక్సిన్ల అవసరాన్ని గుర్తించి, సమయానుకూలంగా వాటిని తీసుకునే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరే వృద్ధుల శాతం 200 శాతం నుంచి 300 శాతం తగ్గింది. ఇదే అవగాహన మనలోనూ పెరిగితే... వృద్ధాప్యం ప్రమాదరహితంగా, ఆసుపత్రులకు దూరంగా, హాయిగా సాగే అవకాశం ఉంది. ఇక మనదేశంలోనూ ఈ అంశంపై అవగాహన ఉన్న డాక్టర్లు, ఆరోగ్యరంగంలో పనిచేసే ఇతర నిపుణులూ వీటిని ఇప్పటికే తీసుకుంటున్నారు. -
హెచ్ఐవీ చాపకింది నీరులా... రక్షణ పొందడమిలా!
హెచ్ఐవీ వైరస్ రక్తం నుంచి వేరుచేస్తే చాలా త్వరగా చనిపోతుంది. నేరుగా హాని చేయదు. కానీ చాపకింది నీరులా ఎంతో హాని చేస్తుంది. అది మన రోగ నిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తుంది. దాంతో అంతకు మునుపు మనం హాని చేయగలదని భావించని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే పెనుముప్పుగా తయారవుతాయి. మనకు సోకి కూడా ఏమీ చేయకుండా వాటంతట అవే తగ్గిపోయే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లూ, ఇతర సూక్ష్మజీవుల వల్ల సంక్రమించే జబ్బులూ ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అంతకుమునుపు అస్సలు హాని చేయకుండా, హెచ్ఐవీ కారణంగా రోగనిరోధకశక్తి దెబ్బతినడం వల్ల ఇవి ముప్పుగా పరిణమిస్తాయి కాబట్టి వీటిని హెచ్ఐవీకి సంబంధించిన అవకాశవాద ఇన్ఫెక్షన్స్గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో వీటినే ‘ఆపర్చ్యయనిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హెచ్ఐవీ’గా అభివర్ణిస్తారు. డిసెంబరు 1న ఎయిడ్స్ డే సందర్భంగా... హెచ్ఐవీని ఆసరా చేసుకుని విజృంభించే ఈ తరహా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొంది, సాధారణ జీవితం గడపడం ఎలాగో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. హెచ్ఐవీ రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు సోకేదెప్పుడు...? మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా హెచ్ఐవీ సోకినవారు కూడా మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అయితే హెచ్ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బ తీస్తూపోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కణాల కౌంట్) ప్రతి మైక్రోలీటర్కూ 200 కంటే తగ్గితే (200 సెల్స్/మైక్రోఎల్) అప్పుడు ఆ రోగికి ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సంక్రమిస్తాయి. అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చూడవచ్చు. అందుకే అనేక వ్యాధుల్లాగే ఎయిడ్స్ పూర్తిగా తగ్గకపోయినా... ఈ రోజుల్లో ఎయిడ్స్ కూడా డయాబెటిస్ వంటి ఇతర వ్యాధుల్లాగే వైద్యంతో అదుపులో ఉండే వ్యాధి (మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్). సాటి వ్యక్తులంతా అపోహాలు తొలగించుకొని వీళ్ల పట్ల వివక్ష చూపకపోతే చాలు... ఈ రోగులు సైతం పూర్తి జీవితకాలం సాధారణంగానే బతకగలరు. ఎంతెంత కౌంట్కు... ఏయే తరహా జబ్బులకు చికిత్స... హెచ్ఐవీ సోకిన వారు ఎవరైనా వారి ‘టీ’సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉంటే వారి రోగనిరోధకశక్తి మామూలుగానే ఉంటుంది. అయితే అంతకంటే తగ్గితే మాత్రం ఏమేరకు కౌంట్ తగ్గిందో దాన్ని బట్టి సంక్రమించగల వ్యాధులకు తగిన నివారణచర్యలు / నివారణ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. అది... * టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉంటే న్యూమోసిస్టిక్ నిమోనియా వ్యాధిని నివారించే చర్యలు తీసుకోవాలి. టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తగ్గి... ఆ తర్వాత చేయించిన రక్తపరీక్షలో టాక్సోప్లాస్మా అనే ఏకకణజీవి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్కు పాజిటివ్ అని తేలితే, ఆ సాంక్రమికవ్యాధి పెచ్చుమీరకుండా ఉండేందుకు చికిత్స తీసుకోవాలి. * టీ సెల్ కౌంట్ 50 /మైక్రోలీటర్ కంటే తగ్గితే మైకోబ్యాక్టీరియా ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ) అనే తరహా బ్యాక్టీరియల్ ఇన్షెక్షన్లను నివారించేందుకు అవసరమైన మందులు తీసుకోవాలి. వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇక్కడ పేర్కొన్న చాలా వ్యాక్సిన్ల వల్ల కొద్దిపాటి మంట/నొప్పి ఉంటుంది. అది కేవలం ఒక్క రోజులో తగ్గుతుంది. ఆపర్చ్యునిస్టిక్ ఇన్ఫెక్షన్లు... ప్రొఫిలాక్టిక్ చికిత్సలు హెచ్ఐవీ రోగిలో ‘టీ’ సెల్స్ తగ్గి, రకరకాల ఇన్ఫెక్షన్లు సోకేందుకు అవకాశం ఉందని నిర్దిష్టంగా తెలిసినప్పుడు, అవి రాకుండానే ముందుగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే వ్యాధి రాకుండా తీసుకునే చికిత్సను ‘ప్రొఫిలాక్సిస్’ చికిత్స అంటారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు తగ్గిన కౌంటును అనుసరించి, ఆయా దశల్లో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొఫిలాక్టిక్ చికిత్సలు తీసుకుంటే వారు సైతం నార్మల్గా ఉంటారు. ఈలోపు రోగనిరోధక శక్తి పెరిగే మందులూ వాడుతుంటారు కాబట్టి ఈ యాంటీబయాటిక్ తరహా ప్రొఫిలాక్టిక్ మందులను సీడీ4 సెల్ కౌంట్ మెరుగుపడే వరకూ వాడవచ్చు. హెచ్ఐవీ రోగులకు... వ్యాక్సిన్లు ఉపయోగపడతాయా? ప్రస్తుతం మార్కెట్లో రకరకాల వ్యాధులను నివారించే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంది. ఇవి మామూలు వ్యక్తులకు ఎలాగూ ఉపయోగపడతాయి. అయితే హెచ్ఐవీ రోగులకూ ఇవి అదే తరహాలో ఉపయోగపడతాయా అనే సంశయం చాలా మందికి ఉంటుంది. సాధారణ ప్రజల్లో వ్యాధిని నివారించే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో... హెచ్ఐవీ రోగులకూ ఆయా వ్యాక్సిన్లు అదే తరహాలో ఉపయోగపడతాయి. నిజానికి మామూలు వ్యక్తుల కంటే హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ఇవి మరింత ఉపయోగకరం. అయితే హెచ్ఐవీ ఉన్నవారికి కొన్ని రకాల వ్యాక్సిన్లే సురక్షితం. అంటే ఉదాహరణకు వ్యాక్సిన్ల తయారీ రెండు రకాలుగా జరుగుతుంది. సాధారణంగా ఒక తరహా వ్యాక్సిన్ తయారీలో చనిపోయిన వైరస్ను ఉపయోగిస్తారు. ఈ తరహా వ్యాక్సిన్ను ‘ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. ఇక మరికొన్ని రకాల వ్యాక్సిన్లలో జీవించి ఉన్న వైరసే అయినప్పటికీ బాగా బలహీనపరచినదాన్ని, నిష్క్రియతో ఉండేదాన్ని ఉపయోగిస్తారు. ఈ తరహాగా రూపొందించిన వైరస్ను ‘లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. సాధారణంగా ఎయిడ్స్ రోగులకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ల కంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఉపయోగించడం మేలు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు హెచ్ఐవీ ఉన్న రోగులకు చికెన్పాక్స్ను నివారించేందుకు లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్నూ ఉపయోగించవచ్చు. హెచ్ఐవీ రోగులు ప్రయాణం చేయదలిస్తే...? హెచ్ఐవీ రోగులు ఒకవేళ ప్రయాణం చేయదలిస్తే, వారు ఏ ప్రాంతానికి వెళ్లదలిచారో తమ డాక్టర్తో సంప్రదించాలి. అక్కడి స్థానిక పరిస్థితులు, అక్కడి స్థానిక వ్యాధులకు అనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలు, నివారణ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొన్ని రకాల ట్రావెల్ వ్యాక్సిన్లు హెచ్ఐవీ రోగులకు సురక్షితమే అయినా మరికొన్ని సురక్షితం కావు. అందుకే ప్రయాణానికి ముందు డాక్టర్ను సంప్రదించడం అవసరం. పరిస్థితులను బట్టి అదనంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ : మెనింగోకోకస్ అనే సూక్ష్మక్రిమి మెదడు చుట్టూ ఉండే పొరల వాపు వచ్చేలా చేసి, మెనింజైటిస్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. హెచ్ఐవీ ఉన్నవారిలో... కాలేజీలలోని డార్మెటరీలలో నివసించేవారు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు వెళ్లాల్సిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. మెనింజైటిస్ విస్తృతంగా ఉన్న ప్రాంతానికి వెళ్లేవారు, లేదా అకస్మాత్తుగా ఈ వ్యాధి విజృంభించినప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కలుషితమైన నీటి వల్ల ఈ వైరస్ సోకుతుంది. మాదకద్రవ్యాలను రక్తనాళం (ఐవీ) ద్వారా లోపలికి తీసుకునే వారు, ఇంతకుమునుపే కాలేయ వ్యాధులు ఉన్నవారు, రక్తస్రావం విపరీతంగా జరిగే హీమోఫీలియా వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు, ప్రపంచ పర్యటనలకు వెళ్లేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. లైవ్ వ్యాక్సిన్లలో ఏవి తీసుకోవాలి? హెచ్ఐవీ రోగులు కొన్ని లైవ్ వ్యాక్సిన్లను సైతం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని వారు తమ టీసెల్ (సీడీ4) కౌంట్ 200 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అవి.. వారిసెల్లా వ్యాక్సిన్ : రెండు మోతాదుల్లో తీసుకోవాల్సి ఈ వ్యాక్సిన్ చికెన్పాక్స్నుంచి రక్షణ ఇస్తుంది. జోస్టర్ వ్యాక్సిన్ : ఒక మోతాదులో తీసుకోవాల్సిన ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ఇది చికెన్పాక్స్కు సంబంధించిన వ్యాధి. ఇందులో చర్మంపై తీవ్రమైన నొప్పితో కూడిన కదుముల వంటి ర్యాష్ కనిపిస్తుంది. గర్భధారణను కోరుకుంటే...? హెచ్ఐవీ ఉన్న మహిళలు గర్భాన్ని ధరించాలని కోరుకుంటే తప్పనిసరిగా తమ డాక్టర్ను సంప్రదించాలి. గర్భధారణకు ముందుగా విధిగా తీసుకోవాల్సిన కొన్ని రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఏయే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, ఎంతెంత వ్యవధి తర్వాత? హెచ్ఐవీ రోగులు వాడాల్సిన వ్యాక్సిన్లు... ఫ్లూ వ్యాక్సిన్ : జ్వరం, చలి, కండరాల నొప్పులు, దగ్గు, బొంగురుగొంతు లక్షణాలతో ఫ్లూ బయటపడుతుంది. దీన్ని ‘ఫ్లూ షాట్’ లేదా ‘ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్’ అంటారు. దీన్ని ప్రతి ఏడాదీ ఒక డోసు తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్: న్యూమోకోకస్ అనేది ఊపిరితిత్తులు, చెవులు, రక్తం లేదా మెదడు చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీసే సూక్ష్మక్రిమి. దీన్ని నివారించే వ్యాక్సిన్ను న్యూమోనియా వ్యాక్సిన్ అని కూడా అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హెచ్ఐవీ ఉన్నవారు ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని 19 నుంచి 64 ఏళ్ల మధ్యన వాడుతుండాలి. ఇక వారికి 65 ఏళ్లు నిండాక కూడా ఈ రెండింట్లో ఒకదాన్ని వాడాలి. అయితే గత ఐదేళ్లలో వాడని రకాన్నే ఈసారి వాడాలి. డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాక్సిన్ : డిఫ్తీరియా రోగులకు గొంతు వెనక నల్లటి పొర ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో అవాంతరాలు సృష్టిస్తుంది. టెటనస్ వ్యాధి కండరాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. పెర్టుసిస్ను కోరింత దగ్గు అని కూడా అంటారు. దీని వల్ల రోగులకు తీవ్రమైన దగ్గు వస్తుంది. ఈ మూడు జబ్బులనూ నివారించే ఒకే వ్యాక్సిన్ను హెచ్ఐవీ రోగులు ఒకే మోతాదు (ఒక షాట్గా) తీసుకోవాలి. ఇలా ఈ మూడు వ్యాక్సిన్లు కలిపిన ఒకే షాట్ను ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సిన్ : ఈ వైరస్ మర్మావయవాల వద్ద పులిపిరుల వంటి వాటికీ, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. హెచ్ఐవీ ఉన్నవారు ఈ వ్యాక్సిన్ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్: హెపటైటిస్-బి వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాక్సిన్ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి. వచ్చేందుకు అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లు... చికిత్సలు న్యూమోసిస్టిస్ న్యూమోసిస్టిస్ కేరినై న్యుమోనియా (పీసీపీ) అనే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకే అవకావం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో అత్యధికుల్లో మరణానికి దారితీసే న్యూమోనియా రకాల్లో ఇదొకటి. యాంటీబయాటిక్స్తో చికిత్స ద్వారా ఈ పీసీపీని నివారించవచ్చు. నోటిలో థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి, టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉన్నవారికి ఈ వ్యాధి చికిత్స అవసరం. అయితే ఒకవేళ హెచ్ఐవీ ఉన్నందున యాంటీ రిట్రోవైరల్ మందులు (ఏఆర్వీ) వాడుతూ... వాళ్ల టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే ఎక్కువ ఉంటే వారు ఆరు నెలల పాటు పీసీపీకి చికిత్స తీసుకొని ఆ తర్వాత దాన్ని ఆపేయవచ్చు. కానీ టీసెల్ కౌంట్ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం జీవితాంతం ‘పీసీపీ’కీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. టోక్సోప్లాస్మా పెద్దగా బాహ్యలక్షణాలేవీ కనిపించకుండా సంక్రమించే వ్యాధుల్లో టోక్సోప్లాస్మోసిస్ ఒకటి. అయితే టోక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్కు కారణమైన ఏకకణజీవి... కొందరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగేలా చేసి, మృత్యువుకు సైతం దారితీయవచ్చు. ఒక వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయితే, అతడి రక్తంలో టోక్సోప్లాస్మా పరాన్నజీవి అప్పటికే ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడం కోసం వెంటనే రక్తపరీక్ష నిర్వహించాలి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిలో టీసెల్స్ కౌంట్ 100/మైక్రోలీటర్ ఉంటే టోక్సోప్లాస్మా నివారణ చికిత్స ప్రారంభించాలి. అయితే న్యుమోసిస్టిక్ కేరినై న్యూమోనియా (పీసీపీ) చికిత్స కోసం వాడే కొన్ని మందులు టోక్సోప్లాస్మానూ నివారిస్తాయి. ఒకవేళ రక్తపరీక్షలో ఆ రోగికి అంతకుమునుపు టోక్సోప్లాస్మా లేదని తెలిస్తే అతడు ఆ వ్యాధికి ఎక్స్పోజ్ కాకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా అతడు పచ్చి మాంసం లేదా ఉడికీ ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. పిల్లి విసర్జనకు, మట్టికి దూరంగా ఉండాలి. దీంతో పాటు టోక్సోప్లాస్మా నివారణకు మరికొన్ని చర్యలు/జాగ్రత్తలు చేపట్టాలి. అవి... * వేటమాంసం, బీఫ్ అండ్ పోర్క్ రంగు పింక్ కలర్లో ఉందంటే అది ఉడకనట్టు లెక్క. అలాంటి మాంసాన్ని ఎయిడ్స్ రోగి తినకూడదు. * పిల్లి విసర్జనను శుభ్రపరచదలచుకుంటే చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. * తోట పని చేసిన తర్వాత చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. * పచ్చిగా తినే పండ్లు, కూరగాయలను చాలా శుభ్రంగా కడిగాకే తినాలి. * మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ-మ్యాక్) * హెచ్ఐవీ రోగుల్లో టీ సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్స్ కంటే తక్కువ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లలో ఇదొకటి. మ్యాక్కు గురైన రోగుల్లో అత్యధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని వాతావరణాల్లోనూ మ్యాక్ కనిపిస్తుంది. కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన దీన్ని నివారించలేము. అయితే ‘టీ’సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్ కంటే తక్కువగా ఉన్నవారిలో కొన్ని రకాల ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఆ తర్వాత టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్కు చేరగానే ఈ చికిత్సను ఆపేయవచ్చు. ఈ చికిత్స కనీసం మూడు నెలలు కొనసాగాల్సి ఉంటుంది. క్యాండిడా (ఈస్ట్) క్యాండిడా అనే ఈ ఇన్ఫెక్షన్ హెచ్ఐవీ ఉన్న రోగుల్లో సాధారణంగా నోరు, యోని ప్రాంతాల్లో రావచ్చు. ఈస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మంలోని ముడుత పడే ప్రాంతాల్లో పెరగవచ్చు. మలద్వారం చుట్టూ కూడా రావచ్చు. అయితే తరచూ పునరావృతమవుతుంటే తప్ప దీనికి నివారణ చికిత్సలు చేయరు. ఇదొక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా పక్షులు ఎక్కువగా ఉండే చోట్ల నేలలో ఇది పెరుగుతుంది. దీని వల్ల క్రిప్టోకాక్సోసిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే మెదడు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇది టీసెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న వారిలో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఎయిడ్స్ రోగుల్లో కనిపించే అత్యధిక ఇన్ఫెక్షన్లలో దీనికి నాలుగో స్థానం. అయితే యాంటీ రిట్రోవైరల్ మందుల ఉపయోగం తర్వాత ఇది కనిపించే ఫ్రీక్వెన్సీ కొంత తగ్గినప్పటికీ, ఎయిడ్స్ మందులు వాడని వారిలో ఇప్పటికీ ఇది ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మందులు వాడినప్పటికీ దీని నివారణ విషయంలో పెద్ద తేడా ఏమీ లేనందువల్ల సాధారణంగా దీనికి ఎలాంటి మందులనూ సిఫార్సు చేయరు. సైటోమెగాలోవైరస్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ సైటోమెగాలో వైరస్ (సీఎమ్వీ) సోకిన కొద్దిమందిలో తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఎయిడ్స్ రోగుల్లో ఈ వైరస్ ఉంటే అది వారి కళ్లు, జీర్ణవ్యవస్థ, మెదడు, వెన్నుపూస వంటి భాగాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. కంటిలో రెటీనాను దెబ్బతీసే ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ వల్ల రోగికి కనిపించే దృశ్యం అస్పష్టంగా మారి క్రమంగా చూపుపోవడం జరగవచ్చు. హెచ్ఐవీకి గురికాకమునుపే ఈ సీఎమ్వీకి గురైన కేసులు చాలా ఎక్కువే ఉంటాయి. ఇలా గతంలోనే సీఎమ్వీకి గురైన వారికి హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణ అయితే వారి టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తగ్గితే... కంటికి సంబంధించిన లక్షణాలు కనింపించినా, కనిపించకపోయినా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. అయితే సీఎమ్వీ నివారణకు మందులు వాడినా పెద్ద ఫలితాలేమీ కనిపించకపోవడంతో దీని నివారణకు సాధారణంగా మందులూ సూచించరు. కాకపోతే... సీఎమ్వీ రెటినైటిస్ తొలిదశలోనే ఉన్నప్పుడు (అంటే చూపు అస్పష్టంగా మారడం, కంటి ముందు నల్లమచ్చలు కనిపించడం, మిరుమిట్లు గొలుపుతున్నట్లు, తేలుతున్నట్లు మెరుపులు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు) తప్పనిసరిగా డాక్టర్ను కలిసి తక్షణం చికిత్స తీసుకోవాలి. తొలిదశలో చికిత్స తీసుకుంటే దాని ప్రభావం, ఫలితం తప్పక కనిపిస్తాయి. క్రిప్టోస్పోరీడియోసిస్ ఇది కలుషితమైన నీటిని తాగేవారిలో, అలాంటి నీటిలో ఈదే వారిలో కనిపించే పరాన్నజీవి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలం నుంచి ఇది నీటిలోకి చేరి... ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ క్రిమి కలిగించే ఇన్ఫెక్షన్ను ‘క్రిప్టోస్పోరీడియోసిస్’ అంటారు. హెచ్ఐవీ ఉన్న రోగులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది వారికి నీళ్లవిరోచనాలను కలిగిస్తుంది. మామూలు వారికీ ఇది సోకే అవకాశం ఉన్నప్పటికీ... టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న హెచ్ఐవీ రోగులకు ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పునరావృతమవుతూ ఉంటుంది. దీని రిస్క్ నుంచి తప్పించుకోడానికి రోగులు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా డయాపర్స్ను మార్చాక, తోటపనిలో భాగంగా మట్టిని ముట్టుకున్న తర్వాత, పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటికే ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. ఒక్కోసారి మున్సిపల్ నీటిపంపిణీ వ్యవస్థలోని నీరు కలుషితం కావడం వల్ల ఇది ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో నీటిని కాచి, వడపోసి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిప్టోస్పోరీడియోసిస్కు నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదు. అయితే మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ-మ్యాక్)కు ఇచ్చే చికిత్సే క్రిప్టోస్పోరీడియోసిస్కూ ఉపయోగపడుతుంది. నిర్వహణ: యాసీన్ -
వ్యాధుల పాలిట కవచం... టీకా
పెట్టని గోడ, తొడగని కవచం... వీటిని ఎప్పటికీ చూడలేం. మామూలుగానైతే ఇలాంటి మాటలు చమత్కారాల కోసమే. ఆపద నుంచి రక్షించే వాటిని ఉద్దేశించి ఈ మాటలు అంటాం. కానీ చమత్కారం కాస్తా సాకారం అయ్యేది... టీకాల విషయంలోనే. పుట్టిన నాటి నుంచి ఇవ్వాల్సినన్ని సార్లు, ఇవ్వాల్సిన వేళల్లో (అలాగే కొన్ని ఒకసారి) ఇప్పిస్తే దాదాపు జీవితాంతం అనుక్షణం కాపాడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా ఉంటూ ఏయే జబ్బులకోసం వేయించామో ఆయా జబ్బులనుంచి రక్షిస్తుంటాయవి. నేడు వ్యాక్సినేషన్ డే సందర్భంగా వ్యాక్సిన్ల గురించి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ఏ మాత్రం ప్రమాదకరం కాని రీతిలో ఉండే ఒక జీవసంబంధమైన అంశాన్ని తీసుకుని టీకాను తయారు చేస్తారు. ఒక రోగ కారక సూక్ష్మజీవిని పూర్తిగా బలహీనంగా చేసిగాని, లేదా హాని చేయని మృత సూక్ష్మజీవినిగాని లేదా సూక్ష్మజీవిలోని జన్యుపరమైన అంశాలను ప్రమాదరహితంగా మార్చిగాని శరీరంలోకి పంపిగాని టీకా రూపంలో ఇస్తారు. దాంతో మన శరీరంలోని రోగనిరోధక శక్తి వాటితో పోరాడటం ప్రారంభించే క్రమంలో కొన్ని యాంటీబాడీస్ను తయారు చేసుకుంటుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మళ్లీ ఆ రోగ కారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని శరీరం (ఇమ్యూనలాజికల్ మెమరీ) గుర్తించి, దాంతో పోరాడి, దాని కారణంగా వచ్చే జబ్బును నివారిస్తుంది. ఇలా టీకా మనకు రక్షణ కల్పిస్తుందన్నమాట. పుట్టిన నాటి నుంచి ఏయే వేళల ఇవ్వాల్సిన టీకాలు ఆయా వేళల ఇప్పించడం ద్వారా పోలియో, డిఫ్తీరియా, మంప్స్, ధనుర్వాతం (టెటనస్), పొంగు వంటి అనేక జబ్బులను రాకుండా నివారించుకోవచ్చు. మన దేశంలో సైంటిఫిక్ కమిటీల సిఫార్సుల మేరకు నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్తో పాటు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏయే టీకాలు, ఏయే సమయాల్లో వేయాలో సిఫార్సు చేస్తారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ తాజాగా (2012లో) సూచించిన వ్యాక్సిన్లు.... వ్యాక్సిన్ వేశాక కనిపించే కొన్ని ప్రభావాలకు కారణాలు : వ్యాధితో పోలిస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చే దుష్ర్పభావాలు చాలా అరుదు లేదా చాలా తక్కువ. అయితే అరుదుగా వ్యాక్సిన్ ఇచ్చాక కొన్నిసార్లు కొన్ని దుష్ర్పభావాలు కనిపించవచ్చు. దానికి అనేక కారణాలుంటాయి. అనేక వ్యాక్సిన్లను కలిపి ఇచ్చే కాంబినేషన్లలో ఏది ఎంత మోతాదులో కలవాలో అది జరగకపోవడం; వ్యాక్సిన్ తయారీ సమయంలోనే తప్పు దొర్లడం; వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ప్రదేశాలు శరీరంలో నిర్దిష్టంగా ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో కాకుండా వేరే ప్రదేశాల్లో ఇవ్వడం; స్టెరిలైజేషన్ పద్ధతులను అనుసరించకపోవడం; వ్యాక్సిన్ను సరిగా నిల్వ చేయకపోవడం... ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్ విఫలం కావచ్చు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో తప్పులు దొర్లకుండా ఉండాలంటేపైన పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటినీ నిరోధించాలి. అంతేగాని ఏవైనా పొరబాట్ల వల్ల జరిగిన పరిణామాలను వ్యాక్సిన్కు ఆపాదించకూడదు. వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో నమ్మకం తొలగించే ఎలాంటి చర్యలకూ పాల్పడకూడదు. ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలి: వ్యాక్సిన్లలో అనేక కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫలానావి మంచివనీ, కొన్ని కావని కొందరు అంటుంటారు. దాంతో సాధారణ ప్రజల్లో ఏవి మంచివి, ఏవి కావనే విషయంలో అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం ఉన్న ఏ వ్యాక్సిన్ను అయినా నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇక కొందరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే కొన్ని వ్యాక్సిన్లపై సందేహం ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే వ్యాక్సిన్లు కూడా చాలా నాణ్యమైనవే. అయితే కొన్ని నిర్దిష్టమైన (ఆప్షనల్/స్పెషల్) వ్యాక్సిన్లను ప్రభుత్వం ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అవి కూడా క్రమక్రమంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిర్వహణ: యాసీన్ భవిష్యత్తులో రాబోయే కొత్త వ్యాక్సిన్లలో కొన్ని... ఆర్ఎస్వీ వైరస్ హెచ్ఐవీ వైరస్ ఈ-కొలై కలరా డెంగ్యూ మలేరియా చికెన్గున్యా హెపటైటిస్ సి, హెపటైటిస్-ఈ స్ట్రెప్టోకోకస్, స్టెఫాలోకాకల్ వంటి కొన్ని సూక్ష్మజీవులకు సంబంధించిన వ్యాక్సిన్లు ఇప్పటికే వేర్వేరు ప్రయోగ దశల్లో ఉన్నాయి. త్వరలోనే అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది హైరిస్క్ పిల్లలకు ఇవ్వాల్సిన కొన్ని వ్యాక్సిన్లు: ఇన్ఫ్లుయెంజా, మెనింగోకోకల్, జాపనీస్ ఎన్కెఫలైటిస్, కలరా, రేబీస్, ఎల్లో ఫీవర్, పీపీఎస్వీ. డాక్టర్ రమేశ్బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్